news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Nov 03,2017 రెడ్‌మి నుంచి వై1 స్మార్ట్‌ఫోన్లు న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ షియోమి భారత మార్కెట్లోకి రెడ్‌మి వై1, రెడ్‌మి వై1 లైట్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ల ప్రారంభ ధర రూ.6,999గా నిర్ణయించింది. ఈ రెండు ఫోన్లు అమెజాన్‌ ఇండియా, ఎంఐ.కామ్‌ వెబ్‌సైట్లలో ఈ నెల 8 నుంచి లభిస్తాయని ఆ కంపెనీ పేర్కొంది. వై1ను ఎల్‌ఈడి ఫ్లాష్‌తో పాటు 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాతో అభివృద్ధి చేసింది. త్వరలో రెడ్‌మి నోట్‌ 4, ఎంఐ మిక్స్‌ 2, ఎంఐ మ్యాక్స్‌2 ఫోన్లకు అప్‌డేట్‌ అందిస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. 5.5 అంగుళాల డిస్‌ప్లేతో రెండు ఫోన్ల బ్యాటరీ సామర్థ్యం కూడా 3080 ఎంఏహెచ్‌గా ఉంది. రెడ్‌మి వై1 మొబైల్‌ 3జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.8,999గా నిర్ణయించింది. 4జీబీ, 64జీబీ వేరియంట్‌ ధర రూ.10,999గా ఉంది. 2జీబీ ర్యామ్‌, 16జీబీ అంతర్గత స్టోరేజీతో వస్తున్న వై1 లైట్‌ మొబైల్‌ ధర రూ.6,999గా నిర్ణయించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sumalatha 102 Views bse , NSE , stock market stock market ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.40గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 70 పాయింట్లు నష్టపోయి 37,257 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 10,988 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.54 వద్ద కొనసాగుతోంది. తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/
1entertainment
Highlights 'శివ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ.. మొదటి చిత్రంతోనే మంచి  నటీనటులు : నాగార్జున, 'బేబీ' కావ్య, మైరా సరీన్, అన్వర్ ఖాన్, ఫిరోజ్ అబ్బాసీ, షాయాజీ షిండే, అజయ్ తదితరులు  ఛాయాగ్రహణం : భరత్ వ్యాస్, రాహుల్ పెనుమత్స  సంగీతం : రవిశంకర్  దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ నిర్మాతలు : రామ్ గోపాల్ వర్మ, సుధీర్ చంద్ర   'శివ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ.. మొదటి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో కొత్త తరహా సినిమాలు రావడం మొదలయ్యాయి. కొంతకాలం పాటు తన సినిమాలతో సంచలనం సృష్టించిన వర్మ ఇప్పుడు సోషల్ మీడియాలో తరచూ ఏవోక కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనతో హీరోలు సినిమాలు చేయడం కూడా తగ్గించేశారు. అటువంటిది వర్మను నమ్మి ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన 'ఆఫీసర్' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం! కథ:  నారాయణ్ పసారి(అన్వర్ ఖాన్) ముంబైలో పెద్ద పోలీస్ ఆఫీసర్. అండర్ వరల్డ్ ను అంతం చేసి డిపార్ట్మెంట్ లో గొప్ప పేరు తెచ్చుకుంటాడు. కానీ అతడిలో మరో కోణం కూడా ఉంటుంది. డబ్బు కోసం అక్రమాలు చేస్తుంటాడు. ఓ కేసుకి సంబంధించి అతడిపై ఆరోపణలు వస్తాయి. వాటిపై విచారణ చేపట్టాలని ముంబై కోర్టు హైదరాబాద్ కు చెందిన శివాజీరావు(నాగార్జున)ని స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తుంది. పసారిపై ఉన్న ఆరోపణలు నిజమేనని తన ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకుంటాడు శివాజీరావు. దీంతో అతడిని అరెస్ట్ చేస్తాడు. కానీ పసారి తన పలుకుబడితో సాక్షిని చంపిస్తాడు. కోర్టు ఆధారాలు లేకపోవడంతో పసారిని నిర్దోషిగా విడుదల చేస్తుంది. అలా బయటకు వచ్చిన పసారి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గా చార్జ్ తీసుకుంటాడు. కావాలనే ఓ అండర్ వరల్డ్ టీమ్ ను సిద్ధం చేసి అక్రమాలు చేస్తుంటాడు. ఆ నేరం శివాజీరావుపై వేయాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్లుగానే తెలివిగా అతడిని ఇరికిస్తాడు. మరి ఈ సమస్యల నుండి శివాజీరావు ఎలా బయటపడ్డాడు..? తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని ఎలా నిరూపించుకుంటాడు..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే! కళాకారుల పనితీరు:  ఈ సినిమాకు ప్లస్ ఏదైనా ఉందంటే అది నాగార్జున అనే చెప్పాలి. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేశాడు. సినిమా మొత్తాన్ని తనే నడిపించాడు. నటన పరంగా ఎలాంటి వంక పెట్టలేం. పసారి అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అన్వర్ ఖాన్ నటన చికాకు కలిగిస్తుంది. బలమైన విలన్ ను పెట్టాల్సిన స్థానంలో వర్మ అతడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో అర్ధం కాదు. తెలుగువారికి పరిచయమున్న నటుడు ఆ రోల్ పోషించి ఉంటే బాగుండేది. సినిమాకు ప్రధానమైన విలన్ క్యారెక్టర్ పండకపోవడంతో విసుగొస్తుంది. ఇక నాగార్జున కూతురి పాత్రలో నటించిన బేబీ కావ్య కాస్త అతి చేసింది. మైరా సరీన్ కు అసలు యాక్టింగే రాదని క్లియర్ గా తెలుస్తుంది. ఓ పాటలో తన క్లీవేజ్ షోతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. అజయ్ పోలీస్ ఆఫీసర్ గా మెప్పిస్తాడు. ఇక తెలుగు ఆడియన్స్ కు పరిచయమున్న ముఖాలు తెరపై ఎక్కడా కనిపించవు.  సాంకేతికవర్గం పనితీరు:  వర్మ సినిమాలంటే క్వాలిటీకి అద్దం పట్టేవి. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఉండేవి. అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు, పేరున్న తారాగణంతో తనదైన శైలిలో సినిమాలు తీసి భారతీయ సినిమాపై చెరిగిపోని ముద్ర వేసిన వర్మ ఇప్పుడు సాంకేతిక విలువలకి అంతగా విలువ ఇవ్వకపోవడం విడ్డూరమనిపిస్తుంది. నేను మారిపోయాను. క్వాలిటీ సినిమాలే తీస్తానంటూ వర్మ చెప్తుండొచ్చు, దానికోసం నిజంగానే తపిస్తుండవచ్చు, కానీ ఆయన సినిమాల్లో మునుపు కనిపించిన గొప్ప లక్షణాలు, వాటిని చరిత్రలో నిలిపిన ఉత్తమ సాంకేతిక విలువలు మాత్రం ఇప్పుడు కానరావడం లేదు. సినిమాలో పాటలు, కెమెరా వర్క్, ఎడిటింగ్ ఏ ఒక్క డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఆకట్టుకోదు. పైగా వర్మ కెమెరా యాంగిల్స్ విసిగిస్తాయి. విశ్లేషణ:  లఘు చిత్రం చేయాల్సిన కథతో వర్మ సినిమా తీసేశాడు. ఈ సినిమాను చెప్పాలంటే గట్టిగా అరగంటలో తీసి చూపించొచ్చు. అటువంటి కథను రెండు గంటల పాటు సాగదీసి సాగదీసి ప్రేక్షకులను విసిగించాడు వర్మ. సినిమాలో ఈ సీన్ బాగుందని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేకపోవడం బాధాకరం. వర్మ ఏ సినిమా కోసం కూడా ఇంత టైమ్ తీసుకోలేదు. దీంతో ఆఫీసర్ సినిమాను బాగా చెక్కుతున్నాడేమో అని అందరూ అనుకున్నారు. ప్రచార చిత్రాలు విడుదలైనప్పుడే ఈ సినిమా ఎలా ఉండబోతుందో హింట్స్ ఇచ్చేశాడు. అవి చూసి ఇక థియేటర్ కు వెళ్తే మాత్రం అది మన పొరపాటే. వర్మ చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్నా.. దాన్ని ఆవిష్కరించిన తీరు కథనం నడిపించిన విధానం ఏమాత్రం ఆకట్టుకోదు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ ఫైట్ ను కావాలనే డ్రాగ్ చేశాడనిపిస్తుంది. తన టేకింగ్ తో వర్మ మరోసారి ఆడియన్స్ ను విసిగిస్తాడు. అతడిపై అంత నమ్మకం పెట్టుకొని సినిమా చేసిన నాగార్జునకి నిరాశే మిగిలింది.  రేటింగ్: 1.5/5
0business
ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ నటి! Highlights తమిళంలో పలు టీవీ సీరియళ్లు, సినిమాలలో నటించిన నటి ప్రియాంక తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  తమిళంలో పలు టీవీ సీరియళ్లు, సినిమాలలో నటించిన నటి ప్రియాంక తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజు(బుధవారం) ఉదయం ఇంటి పనిమనిషి వెళ్లి చూడగా ప్రియాంక విగతజీవిగా కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆమె బాడీను పోస్ట్ మార్టం కోసం తరలించారు. కొంతకాలంగా భర్తకు ఊరంగా ఉంటోన్న ప్రియాంక డిప్రెషన్ లో ఈ పని చేసి ఉంటుందా అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఈ ఆత్మహత్యకు దారి తీసి ఉంటాయని భావిస్తున్నారు. పోస్ట్ మార్టం తరువాత పూర్తి వివరాలు తెలిపే అవకాశం ఉంది.  Last Updated 18, Jul 2018, 11:37 AM IST
0business
jayasudha reaction about nitin kapoor's sudden death నితిన్ కపూర్‌ సూసైడ్ పై జయసుధ స్పందన ప్రముఖ సినీనటి జయసుధ తన భర్త నితిన్ కపూర్ మరణంపై సోషల్ మీడియాలో స్పందించారు. TNN | Updated: Mar 17, 2017, 03:38PM IST ప్రముఖ సినీనటి జయసుధ తన భర్త మరణంపై సోషల్ మీడియాలో స్పందించారు. ఇటీవల జయసుధ భర్త నితిన్ కపూర్ సూసైడ్ చేసుకుని మరణించడంతో మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అప్పటినుండి మీడియాకు దూరంగా ఉన్న జయసుధ తన భర్త మరణంపై స్పందించలేదు. తాజాగా.. తన ఫేస్ బుక్ ఖాతాలో తమ వివాహబంధం గురించి తెలియజేస్తూ.. నితిన్‌తో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు. అంతేకాదు ఈరోజు (మార్చి17) మా పెళ్లి రోజు.. 32 ఏళ్లు చాలా అన్యోన్యంగా ఉన్నాం కాని ఈ రోజు నితిన్ తనతో ఉండకుండా దేవతలతో ఉన్నారంటూ.. ఆయన కోరుకున్న శాంతి ఇప్పటికి దొరికిందని, ఆయన ఎక్కడ ఉన్నా తనను తన కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటారనే నమ్మకం ఉందని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నానని తెలియజేశారు జయసుధ.
0business
Jul 02,2017 జీఎస్టీతో కోతలే..కోతలు నవతెలంగాణ, వాణిజ్య విభాగం: జీఎస్టీ పన్ను విధానం అమలులోకి వచ్చిన నేపథ్యంలో పలు సంస్థలు తగ్గిన పన్ను భారం మేరకు ప్రతిఫలాన్ని వినియోగదారులకు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. దిగివచ్చిన మారుతీ కార్లు ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీకొన్ని కార్ల ధరలు తగ్గించింది. కొన్ని కార్లపై 3 శాతం ధరలు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు సియాజ్‌, ఎర్టిగా లాంటి స్మార్ట్‌ హైబ్రిట్‌ మోడల్‌ కార్ల ధరలను అమాంతం పెంచేసింది. సియాజ్‌, ఎర్టిగా డీజిల్‌ కార్లపై లక్ష రూపాయల వరకు ధర పెంచుతున్నట్లు తెలిపింది. కొత్త ధరలు ఒక్కటో తేది నుంచే అమల్లోకి తెచ్చినట్లు వెల్లడించింది. ధర తగ్గించిన జేల్‌ఆర్‌.. టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ బ్రాండ్‌ కంపెనీ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) తన మొత్తం వాహనాల శ్రేణీలో సగటున 7 శాతం మేర ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జిఎస్‌టి కింద వచ్చిన పన్ను ప్రయోజనాలను విని యోగ దారులకు అందిస్తున్నామని ఆ కంపెనీ పేర్కొంది. తక్షణమే ఈ రేట్ల తగ్గింపు అమల్లోకి వస్తుందని కూడా కంపెనీ పేర్కొంది. ఈ కంపెనీ పోర్టుపోలియోలో కింది స్థాయి మోడల్‌ ఎక్స్‌ఇ కార్‌ ప్రారంభ ధర రూ.34.64 లక్షలుగా, పై స్థాయి కార్‌ ఎక్స్‌జె ధర రూ.97.39 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై 2% తగ్గుదల జిఎస్‌టి అమలుతో ద్విచక్ర వాహన ధరలు 2 శాతం దిగిరానున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలోని 350సిసి లోపు వాహనాలపై 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. జిఎస్‌టిలో దీన్ని 28 శాతానికి తగ్గించారు. 350 సిసి పైబడిన ద్విచక్ర వాహనాలపై లగ్జరీ పన్నతో కలుపుకుని 31 శాతం పన్ను రేటును నిర్ణయించారు. యాపిల్‌ ఉత్పత్తులు చౌక.. యాపిల్‌ సంస్థ తన ఉత్పత్తుల ధరలను ఇండియాలో గణనీయంగా తగ్గించింది. ఆపిల్‌ ఐఫోన్‌, ఐప్యాడ్‌, ఆపిల్‌ వాచ్‌ లపై గరిష్ట రిటైల్‌ ధరల్లో తగ్గింపును ప్రకటించింది. దాదాపు7.5 శాతం ధరలను తగ్గించి భారతీయులకు జీఎస్టీ గిఫ్ట్‌ అందించింది. కొన్ని మినహాయింపులతో మాక్‌ ల్కెన్‌ కంప్యూటర్లను తగ్గింపు ధరల్లో వినియో గదారులకు అందుబాటులోకి తెచ్చింది.
1entertainment
coins ఒకటిన్నరేళ్ల గరిష్టస్థాయికి రూపాయి ముంబై: డాలరులతో రూపాయి మారకం విలువలు భారీగా పెరిగాయనే చెప్పాలి. ఒకటిన్న రేళ్ల గరిష్టస్థాయికి పెరిగాయి. 2015 అక్టోబరు నుంచి డాలరుతో రూపాయి మారకం విలువలు కొంతమేర సానుకూలంగా పెరుగుతున్నట్లు అంచ నా. సోమవారం కూడా ఏడాదిన్నర గరిష్టస్థాయికి రూపాయి చేరింది. అంతేకాకుండా ఇతర ఆసియా కరెన్సీల్లో కూడా పెరుగుదలను నమోదుచేసింది. అమెరికా అధ్యక్షుడు డనాల్ట్‌ట్రంప్‌ హెల్త్‌కేర్‌రంగం లోని సంస్కరణల బిల్లును ఆమోదింపచేసుకోవ డంలో విఫలం కావడం, ఆమెరికా ఆర్థిక ఉద్దీపనల పై ఆందోళనలు వెల్లువెత్తడమే ఇందుకు కీలకంగా మారిందని చెప్పాలి. భారతీయ రిజర్వుబ్యాంకు రూపాయి లాభాలను సానుకూలం చేసుకునే దిశగా కృషిచేస్తోంది. వీటికితోడు డెట్‌, ఈక్విటీ రంగాల్లోనే ఈనెలలో 6.1బిలియన్‌డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. స్థానిక యూనిట్లలో ఉన్న లాభాలు పటిష్టమైన డాలర్‌ రాకను చూపి స్తోంది. బాండ్‌మార్కెట్లపరంగా మరింత పటి ష్టం అయ్యాయి. బెంచ్‌మార్క్‌పదేళ్లబాండ్ల రాబ డులు 12బేసిస్‌ పాయింట్లు తగ్గి 6.71శాతానికి చేరాయి. ఫిబ్రవరి 8వ తేదీనాటి కనిష్టస్థాయిని నమోదుచేసినట్లు సెంట్రల్‌బ్యాంకు విశ్లేషిస్తోంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న సానుకూల స్థాయి నుంచి తన ద్రవ్యవిధాన సమీక్ష తీరును తటస్థ స్థాయికి తెచ్చింది. సాఫ్ట్‌వేర్‌ సేవల ఎగుమతి కంపె నీలు, ఔషధ తయారీ కంపెనీల షేర్లు మాత్రం పతనం అయ్యాయి. రూపాయి పటిష్టం కావడమే ఇందుకుకీలకం. ఎన్‌ఎస్‌ఇ సూచి 0.75శాతం దిగజారి 9039 పాయింట్లకుచేరింది. బెంచ్‌మార్క్‌ బిఎస్‌ఇ సూచీ 0.69శాతం క్షీణించి 29,218.19 పాయింట్లకు చేరింది. ట్రంప్‌ తన సొంత రిపబ్లికన్‌ పార్టీ నుంచే హెల్త్‌కేర్‌ సంస్కరణల బిల్లుకు ప్రతి కూలత చవిచూసారు. దీన్నిబట్టి ట్రంప్‌ తన ఎన్ని కల అజెండా హామీల అమలుపై పలు సందేహా లను కూడా వ్యక్తంచేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ ధోరణులు, దేశీయ స్థితిగతులు మార్కెట్ల లకు కీలకం అయ్యాయిని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అధిపతి వినోద్‌ నాయర్‌ అన్నారు. రూపాయి 65.0575వద్ద ట్రేడింగ్‌జరిగింది. మరిం త పటిష్టంఅయి 65.01 రూపాయలుగా నడిచిం ది. 2015 అక్టోబరునాటి గరిష్టస్థాయిని నమోదు చేసింది. టెక్‌మహీంద్ర 2.2శాతం, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ 1.9శాతం క్షీణించాయి. ఔషధ సంస్థ లు కూడా పతనం అయ్యాయి లూపిన్‌, అరబిందో ఫార్మా రెండుశాతం, 1.8శాతం క్షీణించాయి. ఇత రత్రా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2.42శాతం క్షీణించిం ది. సెబి కంపెనీ స్వల్పకాలిక ట్రేడింగ్‌ పొజిషన్లలో మోసం చేసిందన్న నిర్ణయాన్ని ప్రకటించడమే ఇందుకు కీలకం. తన వాటాను విక్రయాల సంద ర్భంగా పదేళ్లక్రితం ఒక యూనిట్‌లో అవకతవక లకు పాల్పడిందని అంచనా. అయితే రిలయన్స్‌ మాత్రం ఈ ఆరోపణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తాము అప్పీలుకువెళతామని ప్రకటించింది. అలాగే కోల్‌ ఇండియాసంస్థ కూడా 2.5శాతం దిగజారిం ది. రెండోసారి కోల్‌ ఇండియా ప్రకటించిన డివి డెండ్‌ ఇన్వెస్టర్లను నిరాశపరచడమే ఇందుకుకీలకం.
1entertainment
Hyderabad, First Published 15, Mar 2019, 11:06 AM IST Highlights సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వివాదాలను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వివాదాలను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కొందరు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ వర్మ మాత్రం అనుకున్న సమయానికి సినిమా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో కీలకంగా చెప్పుకునే వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ కి సంబంధించి ఆరు నిమిషాల నిడివి గల వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. అందులో ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతితో కలిసి వైశ్రాయ్ హోటల్ వద్దకు చైతన్య రథం మీద తన అనుచరులను వెంటేసుకొని వస్తారు. అయితే ముఖ్యమంత్రి అయినా.. ప్రైవేట్ వ్యక్తులకు ఇందులో అనుమతి లేదని సెక్యురిటీ చెప్పడంతో మొదలవుతుంది. బయట నుండి మైకులో ఎన్టీఆర్  బిగ్గరగా తన వాళ్లను అభ్యర్ధించడం చంద్రబాబుని పోలిన పాత్ర లోపల ఎవరితోనో చెవిలో ఏదో చెప్పడం.. వెంటనే ఎన్టీఆర్ మీద చెప్పుల వర్షం కురవడం ఇదంతా క్లియర్ గా చూపించారు. ఎన్టీఆర్ అక్కడికక్కడే కుప్పకూలి బాధ పడుతుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో 'దగా దగా' అనే పాట మొదలవుతుంది. అయితే ఇప్పుడు వీడియోను ఆన్ లైన్ లో నుండే తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వీడియోను డిలీట్ చేశారు.  Last Updated 15, Mar 2019, 11:06 AM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV Venkatesh: ‘బిగ్ బాస్ 3’ హోస్ట్‌గా వెంకీ.. జూలై నుంచి షో ప్రారంభం! ‘బిగ్ బాస్ 3’ హోస్ట్‌ను నిర్వహకులు కన్ఫార్మ్ చేసేశారని అంటున్నారు. ఫైనల్‌గా విక్టరీ వెంకటేష్‌నే ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. Samayam Telugu | Updated: May 7, 2019, 10:55AM IST హిందీలో బాగా పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో తెలుగులోనూ విపరీతంగా ప్రేక్షకాదరణ పొందింది. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో తెలుగు టీవీ చరిత్రలోనే ఈ షో అత్యధిక టీఆర్‌పీని సొంతం చేసుకుంది. ఇక రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. రెండో సీజన్‌లో మరింత డోస్ పెంచి ఎక్కువ ఎపిసోడ్‌లతో ‘బిగ్ బాస్’ లవర్స్‌కి మంచి వినోదాన్ని పంచారు. ప్రస్తుతం వీరంతా మూడో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బిగ్ బాస్’ సీజన్ 3కి మళ్లీ ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా పెట్టే ప్రయత్నం చేశారు నిర్వాహకులు. అయితే దానికి ఎన్టీఆర్ అంగీకరించలేదు. నాని కూడా విముఖత చూపారు. దీంతో అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో దగ్గుబాటి వెంకటేష్ పేరు కూడా వినిపించింది. మొత్తానికి ‘బిగ్ బాస్’ నిర్వహకులు హోస్ట్‌ను కన్ఫార్మ్ చేసేశారని అంటున్నారు. ఫైనల్‌గా విక్టరీ వెంకటేష్‌నే ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకానొక దశలో నాగార్జున పేరు ఖరారైందనే వార్తలు వచ్చాయి. ఆయన గతంలో స్టార్ మా ఛానెల్‌లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను హోస్ట్ చేశారు. ఈ షోను ఆయన విజయవంతంగా నిర్వహించడంతో పాటు ప్రశంసలు అందుకున్నారు. దీంతో ‘బిగ్ బాస్ 3’కి ఆయన్నే తీసుకుంటే మంచిదని స్టార్ మా భావించిందట. దీనికి తోడు స్టార్ మాతో నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. కాబట్టి చాలా మంది నాగార్జున ఫైనల్ అనుకున్నారు. కానీ, చివరాఖరికి విక్టరీ వెంకటేష్‌కే ఈ షోను అప్పగించారని టాక్. జూలై 21 నుంచి షో కూడా ప్రారంభమైపోతుందని అంటున్నారు.
0business
dsp block rock డిఎస్‌పి బ్లాక్‌రాక్‌లో ఉన్నతస్థాయి ప్రక్షాళన ముంబయి, మే 29: డిఎస్‌పి బ్లాక్‌రాక్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ మేనేజర్స్‌ సంస్థకు అధ్యక్షునిగా కల్పేన్‌ పరేఖ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ పనిచేసిన ఎస్‌.నాగనాధ్‌ సంస్థనుంచి వైదొలు గుతుండటంతో మార్పులు అనివార్యం అయ్యా యి. అనూప్‌ మహేశ్వరిని ఈక్విటీ సిఐఒగా నియమించారు. ఇక పంకజ్‌ శర్మను స్థిరమైన రాబడి గ్రూప్‌నకు సిఐఒగా నియమించారు. కంపెనీ ముఖ్య పరిపాలన అధికారి రామమూర్తి రాజగోపాల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా బాధ్య తలు స్వీకరించారు. అదితి కొఠారి దేశాయి సేల్స్‌హెడ్‌గా కొనసాగుతారు. కల్పేన్‌కు ఈ రంగంలో 19 ఏళ్లపాటు అపారమైన అనుభవం ఉండటంతో ఆయన్నే అధ్యక్షునిగా నియమించేం దుకు కంపెనీ నిర్ణయించింది. ఐడిఎఫ్‌సి మ్యూచువల్‌ఫండ్‌కు సైతం గతంలో ఎండిగా పనిచేసారు. బిర్లా సన్‌లైఫ్‌ అసెట్‌మేనేజ్‌మెంట్‌ కంపెనీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ అసెట్‌మేనేజ్‌ మెంట్‌ కంపెనీలతో పాటు ఎల్‌అండ్‌టి ఫైనాన్స్‌ లకు కూడా పనిచేసారు. డిఎస్‌పిగ్రూప్‌తో బ్లాక్‌రాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ జాయింట్‌ వెంచర్‌గా ఉన్న కంపెనీగా డిఎస్‌పి బ్లాక్‌రాక్‌ పనిచేస్తోంది. 150 ఏళ్లకుపైబడిన ట్రాక్‌ రికార్డుతో ఉన్న డిఎస్‌పి గ్రూప్‌ జాయింట్‌ వెంచర్‌లో బ్లాక్‌రాక్‌ ఇంక్‌ 40శాతం వాటాతో ఉంది. డిఎస్‌పి 60శాతం వాటాతో జెవి నిర్వహిస్తోంది. ప్రస్తుతం 5.4 లక్షల కోట్ల డాలర్ల విలువైన నిర్వహణ ఆస్తులున్నట్లు కంపెనీ సమాచారం.
1entertainment
internet vaartha 132 Views హైదరాబాద్‌ : దేశంలో అగ్రగామి సస్య రక్షణ మందుల కంపెనీ ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా కొత్త కలుపునివారిణి మందు గ్రీన్‌లేబుల్‌ను మార్కెట్‌లోనికి ప్రవేశపెట్టింది. దేశంలో మొదటి సారి అధునాతన సాంకేతికతను వినియోగించి రూపొందించిన ఈ కలుపునివారిణి అందుబాటు ధరల్లోనే అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బిస్‌ పైరిబక్‌ సోడియం పదిశాతం ఎస్‌సి ముడి వనరులతో గ్రీన్‌లేబుల్‌కలుపు నివారణిఅనేది బ్రాడ్‌స్పెక్ట్రమ్‌ సిస్ట మిక్‌ హెర్బిసైడ్‌ గా ఉంది. సంస్థ ఎండి రాజేష్‌ అగ ర్వాల్‌ మాట్లాడు తూ భారత్‌ వ్యవ సాయరంగంలో వరిపంట పెద్ద వాటాతో ఉంటుందన్నారు. కలుపుసమస్య భారీస్థాయిలో ఉత్పనం అవుతోందని పెంటపెరుగుదలను దిగుబడిని కూడా దెబ్బతీసే కలుపునివారణకు తమ సంస్థ విడుదల చేసిన గ్రీన్‌లేబుల్‌ ఎంతో ప్రయో జనకారి అవుతుందన్నారు. ఇప్పటివరకూ జపాన్‌ నుంచి మాత్రమే దిగుమతిచేసుకున్న ఈ మందులను ఇకపై సంస్థ ఉత్పత్తి చేస్తోందని, ఎపి, తెలంగాణ మార్కెట్లలో ముందుకు తీసుకెళుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది మరో 3-4 ఉత్పత్తులు విడుదల చేస్తామని సంస్థ మార్కెటింగ్‌ జిఎం వికెగార్గ్‌ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా పంజాబ్‌ ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లో ప్రధానంగా వరి పండుతోందని, దేశంలో పూర్తిస్థాయిలో వరి రైతుల సామర్ధ్యాలకు అనుగుణంగా ఈ కలుపు నివారణను ఉత్పత్తి చేయగలమని అన్నారు.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV శ్రీమంతుడు మూవీ చూడనున్న సచిన్ ? శ్రీమంతుడు సినిమా సక్సెస్ టాక్ చాలామంది సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ సెలబ్రిటీలని ఇంప్రెస్ చేస్తోంది. | Updated: Aug 28, 2015, 04:03PM IST మహేష్ బాబు లేటెస్ట్ సినిమా శ్రీమంతుడు సక్సెస్ టాక్ చాలామంది సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు , స్పోర్ట్స్ సెలబ్రిటీలని ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా చూడాలని అనుకుంటున్న వారిలో మాజీ క్రికెటర్ , రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. 28వ తేదీ ఫస్ట్ షో నుంచి మరో రెండు సన్నివేశాల్ని అదనంగా కలుపుతున్నట్లు చెప్పిన దర్శకుడు, నిర్మాతలే ఈ విషయాన్ని కూడా స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిక అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్ టెండుల్కర్... సమాజానికి తిరిగి ఏదైనా మేలు చేయాలనే కాన్సెప్ట్‌తో వచ్చిన శ్రీమంతుడు మూవీ గురించి విన్నారట. అందుకే ఆయన ఈ సినిమాని చూసే అవకాశాలున్నాయని ఇండియా గ్లిడ్జ్ ఓ కథనంలో పేర్కొంది. ఇప్పటికే సినిమాపై మంచి పాజిటిక్ టాక్ రావడంతో తాజాగా కలుపుతున్న మరో రెండు సీన్లతో సినిమా మరింత గొప్పగా వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాతలు.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV జై ప్ర‌కాష్ అసోసియేట్స్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ‌ కోర్టు తీర్పులో ఇంకా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రీఫండ్ కోరే ఇంటి కొనుగోలుదారుల‌పై త‌మ‌వైన డిమాండ్ల‌ను డెవ‌ల‌ప‌ర్లు ఉంచ‌లేర‌ని తెలిపింది. గృహ కొనుగోలుదార్ల ప్ర‌యోజ‌నాలు ప‌రిర‌క్షించేందుకు గాను వారి త‌ర‌పున స‌మావేశాల్లో ఎవ‌రు పాల్గొంటార‌న్న అంశాన్ని సైతం అత్యున్న‌త న్యాయ‌స్థానం నిర్ణ‌యించింది. TNN | Updated: Mar 22, 2018, 03:06PM IST * మే 10 లోపు 200 కోట్లు చెల్లించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశం తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న రియల్టీ సంస్థ జైప్రకాష్‌ అసోసియేట్స్‌ను రెండు విడతల్లో మొత్తం రూ.200 కోట్లు డిపాజిట్‌ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఏప్రిల్‌ 6లోపు రూ.100 కోట్లు, మే 10లోపు మరో రూ.100 కోట్లను జమ చేయాలని కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ నిర్వహించింది. రిఫండ్‌ (తాము చెల్లించిన డబ్బుల్ని వెనక్కి తీసుకోవడం) ఎంచుకున్న కస్టమర్లకు ఈఎంఐ బకాయి ఉంటే నోటీసులు పంపొద్దని ఆదేశించింది. ప్రాజెక్టుల వారీగా రీఫండ్‌ ఎంచుకున్న వారి వివరాలను సమర్పించాలని కోరింది. <p> రూ.200 కోట్ల డ‌బ్బు డిపాజిట్ చేయాల‌ని జై ప్ర‌కాష్ అసోసియేట్స్‌కు సుప్రీం ఆదేశం<br></p> ప్రస్తుతానికి డబ్బులు తిరిగి చెల్లించేదాపైనే తమ ఆందోళన అని, కొనుగోలుదారులకు ఫ్లాట్ల అంద‌జేసే అంశంపై తర్వాత దృష్టి సారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. 31,000 మంది గృహ కొనుగోలుదారుల్లో కేవలం 8 శాతం మంది రీఫండ్ ఆప్ష‌న్ ఎంచుకున్నట్టు, మిగిలిన వారు ఫ్లాట్ల కోసం ఎదురు చూస్తున్నట్టు జై ప్రకాష్‌ అసోసియేట్స్‌ కోర్టుకు తెలియజేసింది. 13,500 ఫ్లాట్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను అందుకున్నట్టు తెలిపింది. గృహ కొనుగోలుదారుల ప్రయోజనాల రీత్యా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ సంస్థ జనవరిలో రూ.125 కోట్లను జమ చేసిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పులో ఇంకా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రీఫండ్ కోరే ఇంటి కొనుగోలుదారుల‌పై త‌మ‌వైన డిమాండ్ల‌ను డెవ‌ల‌ప‌ర్లు ఉంచ‌లేర‌ని తెలిపింది. గృహ కొనుగోలుదార్ల ప్ర‌యోజ‌నాలు ప‌రిర‌క్షించేందుకు గాను వారి త‌ర‌పున స‌మావేశాల్లో ఎవ‌రు పాల్గొంటార‌న్న అంశాన్ని సైతం అత్యున్న‌త న్యాయ‌స్థానం నిర్ణ‌యించింది.
1entertainment
Jan 20,2019 ఓబీసీకి పూర్వవైభవం తీసుకువద్దాం: ఈడీ నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌'కు (ఓబీసీ) పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు గాను సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని ఆ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ ఆస్లే ఎస్‌ పిలుపునిచ్చారు. శనివారం ఆయన హైదరాబాద్‌, విజయవాడకు చెందిన సర్కిల్‌ ఉద్యోగ సభ్యులతో టౌన్‌హాల్‌ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన రెండు నగరాల్లోని బ్యాంకు ప్రగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌ సర్కిల్‌ హెడ్‌ అరుణ్‌ కుమార్‌ అగర్వాల్‌ స్వాగతోపన్యాసంతో ప్రారంభమైంది. అనతరం ఈడీ మాట్లాడుతూ సిబ్బంది ఒక జట్టుగా రాణించి వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం ద్వారా ఓబీసీని వీలైనంత త్వరగా పీసీఏ నిబంధనల నుంచి బయటపడేసేలా కృషి చేయాలని కోరారు. దృఢ సంకల్పంతో జట్టుగా రాణిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని ఆయన అన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఉద్యోగులు కృషి చేయాలని బాలక్రిష్ణ సూచించారు. ఈ సందర్భంగా మెరుగ్గా రాణించిన శాఖల మేనేజర్లను ఈడీ సత్కరించారు. మేటి పనితీరుతో రాణించిన వారికి ప్రశంసా పత్రాలను అందించి సన్మానించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌, విజయవాడకు సర్కిల్‌ కార్యాలయానికి చెందిన అధికారులు ఉద్యోగులతో పాటు జంటనగరాలలోని ఓబీసి బ్యాంక్‌నకు చెందిన శాఖత ఉద్యోగులు, శాఖల సభ్యులు పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి శాంసంగ్‌ నుంచి వినూత్న రిఫ్రిజిరేటర్లు Thu 12 May 05:49:11.278823 2016 హైదరాబాద్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ శాంసంగ్‌్‌ భారత మార్కెట్లోకి '5ఇన్‌1 స్మార్ట్‌ డిజిటల్‌ ఇన్వెర్టర్‌ రిఫ్రిజిరేటర్‌'లను విడుదల చేసింది. ఇవి ఇంధన సామర్థ అందుకే శాఖలు తెరవడం లేదు! Thu 12 May 05:49:16.783489 2016 లండన్‌: భారత్‌ క్రెడిట్‌ రేటింగ్‌ దిగజారిన నేపథ్యంలో విదేశీ బ్యాంకులు భారత్‌లో శాఖలను తెరిచేందుకు వెనకడుగు వేస్తున్నట్టుగా 'భారతీయ రిజర్వు బ్యాంక్‌' (ఆర్‌బీఐ) గవర్నర్‌ రఘ మార్కెట్లకు 'మారిషస్‌' భయాలు Thu 12 May 05:49:22.155427 2016 ముంబయి: వరుసగా రెండు రోజులు లాభాల్లో సాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లను బుధవారం మారిషస్‌ భయాలు వెంటాడాయి. మారిషస్‌ మీదుగా వచ్చే పెట్టుబడులపై 2017 ఏప్రిల్‌ నుంచి 'మూలధన లాభ ప వాహ్‌.. వరుణ్‌! Wed 11 May 05:11:23.193507 2016 ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియాకు (ఎంఎస్‌ఐఎల్‌) దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్లలోకి 'అత్యుత్తమ పనితీరు కనబరిచిన' డీలర్‌ అవార్డు 'వరుణ్‌ మోటార్స్‌'కు లభించింది. బ్రిటన్‌ టాటా స్టీల్‌పై జిందాల్‌ 'ఆసక్తి'! Wed 11 May 05:11:51.577747 2016 ముంబయి: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థగా ఎదగాలని యోచిస్తున్న సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సంస్థ 'టాటా స్టీల్‌' బ్రిటన్‌ వ్యాపారాన్ని నష్టాల్లోంచి.. లాభాల్లోకి Wed 11 May 05:11:58.002404 2016 ముంబయి : ప్రపంచ మార్కెట్ల ర్యాలీకి తోడు చమురు ధరలు పుంజుకోవడంతో భారత మార్కెట్లకు వరుసగా రెండో రోజూ మద్దతు లభించింది. మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు మధ్య కొత్తగా 16 అవుట్‌లెట్లు Wed 11 May 05:12:05.883873 2016 వరుణ్‌ గ్రూపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.60 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లుగా వరుణ్‌ గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వరుణ్‌ దేవ్‌ ప్రకటించారు. ఇదే సమయంలో కొత్తగా 16 అవుట వేడికి తగ్గట్టు వేగాన్ని మార్చుకొనే ఫ్యాన్‌ Wed 11 May 05:12:13.498647 2016 చెన్నై: ప్రముఖ ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల సంస్థ క్రాంప్టన్‌ మంగళవారం సరికొత్త స్మార్ట్‌ సీలింగ్‌ ఫ్యాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 'ఎవాన్సర్‌ ఈ-సెన్స్‌' పేరుతో దీనిని మా ఎమిరేట్స్‌కు రికార్డు లాభాలు Wed 11 May 05:12:21.253743 2016 న్యూఢిల్లీ: ప్రపంచ విమానయాన రంగంలో తన సత్తాను చాటుతూ ఎమిరేట్స్‌ గ్రూపు 2015-16 ఆర్థిక సంవత్సరానికి రికార్డు లాభాలను ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా మందగమనం ప్రతికూల పరిస్ శుభారంభం చేసిన ఉజ్జీవన్‌ Wed 11 May 03:07:53.3445 2016 ముంబయి: వరుసగా రెండో రోజూ దలాల్‌ స్ట్రీట్‌లో మెరుగైన ఐపీఓ లిస్టింగ్‌ నమోదు అయింది. మంగళవారం లిస్టింగ్‌కు వచ్చిన 'ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌' 10.4 శాతం ప్రీమియంతో స అనుకూల పరిణామాలతో.. పరుగులు పెట్టిన మార్కెట్లు Tue 10 May 04:53:36.117836 2016 ముంబయి: వరుసగా గత రెండు వారాలు నుంచి నష్టాల్లో నమోదవుతూ వస్తున్న భారత మార్కెట్లకు సోమవారం పెద్ద ఉపశమనం లభించింది. దేశీయా, అంతర్జాతీయ పరిణామాల మద్దతుతో మార్కెట్లు పరుగులు మురిపించిన అక్షయ తృతీయ Tue 10 May 04:53:44.970499 2016 ముంబయి: శుభప్రదమైన అక్షయ తృతీయ బులియన్‌ మార్కెట్లలో ఆనందాన్ని నింపింది. బంగారం ధరలు ఆకాశాలన్నంటుతుండడం, కరువు తదితర ప్రతికూల పరిస్థితులు వెంటాడినప్పటికీ ఆక్షయ తృతీయ (సోమవ బ్యాంకులకు 'అలోక్‌' భయాలు! Tue 10 May 04:53:57.405776 2016 ముంబయి: గౌతం అదానీ (రూ.72,000 కోట్లు), కింగ్‌ఫిషర్‌ సంస్థల (రూ.9,400 కోట్ల) రుణ భారాలతో ఇప్పటికే సతమతమవుతున్న బ్యాంకులకు తాజాగా ముంబయి కేంద్రంగా పని అదరగొట్టిన థైరోకేర్‌ Tue 10 May 04:54:20.580815 2016 ముంబయి: డయోగ్నాస్టిక్స్‌ సేవల సంస్థ థైరోకేర్‌ టెక్నాలజీస్‌ సోమవారం మార్కెట్లో లిస్టయింది. తొలి రోజే ఈ స్టాక్‌ మదుపరులకు మంచి లాభాలను పంచింది. ఈ స్టాక్‌ ఎన్‌ఎస్‌ఈలో ఇష్యూ హెచ్‌యూఎల్‌ లాభాలు రూ.1,090 కోట్లు Tue 10 May 04:54:06.900811 2016 న్యూఢిల్లీ : ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ 'హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌' (హెచ్‌యూఎల్‌) మార్చి 2016తో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 7.02 శాతం వృద్ధితో రూ.1,089 కోట్ ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గృహ సదుపాయం Tue 10 May 04:54:13.623258 2016 న్యూఢిల్లీ: భవిష్య నిధి (పీఎఫ్‌) ఖాతాదారులైన వేతన జీవులకు తక్కువ ధరలకు గృహ వసతి కల్పించే యోచనలో ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌కు తెలిపింది. ఇందులో ఈ వారమైనా కలిసొచ్చేనా..! Mon 09 May 03:59:39.154239 2016 ముంబయి: వరుసగా గత రెండు వారాల నుంచి నష్టాల్లో నిలుస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారంతో ప్రారంభమయ్యే వారంలో లాభాలలో పయనించే అవకాశాలున్నట్లుగా మార్కెట్‌ వర్గాలు చెబు మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు Mon 09 May 03:59:45.246018 2016 న్యూఢిల్లీ: కింగ్‌ ఫిషర్‌ అధినేత విజరు మాల్యా చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. తాజాగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ 'సెక్యూరిటీస్‌ ఎక్స్చేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా' (సెబీ) మందగమనంతో మంచే జరిగింది: వై.వి.రెడ్డి Mon 09 May 03:59:51.985681 2016 హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితుల వల్ల నికరంగా భారత్‌కు మేలే జరిగినట్టు 'భారతీయ రిజర్వు బ్యాంక్‌' (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌, 14వ ఆర్థిక సంఘం ఛ మరోమారు సత్తా చాటిన సింగరేణి Mon 09 May 04:00:04.890777 2016 హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి సంస్థ 'సింగరేణి కాలరీస్‌ కంపెనీ' (ఎస్‌సీసీఎల్‌) గత ఏప్రిల్‌లో మెరుగైన పనితీరును నమోదు చేసింది. గత నెలలో ఎస్‌సీసీఎల్‌ మొత్తంగా 4. వేగంగా బీఎస్‌ఈ ఐపీఓ పనులు Mon 09 May 04:00:14.020684 2016 ముంబయి: ఆసియాలోని ప్రధాన స్టాక్‌ మార్కెట్లలో ఒకటైన 'బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ' (బీఎస్‌ఈ) ప్రాథమిక మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు వేగంగా పావులు కదుపుతోంది. పబ్లిక్‌ ఇష్యూ 36,000 కిలోల పసిడి అమ్మకాలు Sun 08 May 02:18:20.830514 2016 హిందూ సంప్రదాయం ప్రకారం అక్షయ తృతీయ శుభప్రదమైన రోజు. ఈ రోజున లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా భావించే పసిడిని కొనుగోలు చేస్తే ఆ ఏడాది అపారమైన సంపద కలుగుతుందన్న సెంటిమెంట్‌ ఉంద విస్తరణ పథంలో ఎంటీఆర్‌ Sun 08 May 02:11:25.698388 2016 బెంగళూరు : ప్రముఖ అహారోత్పత్తుల సంస్థ ఎంటీఆర్‌ ఫుడ్స్‌ మార్కెట్లో మరింత విస్తరించడానికి నాలుగేళ్ల నూతన ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా నూతన లోగో, ఆకట్టుకునే 10వేల సైట్లను ఆధునీకరిస్తాం : టెలినార్‌ Sun 08 May 02:09:51.488936 2016 న్యూఢిల్లీ : ప్రముఖ చౌక ధరల మొబైల్‌ సేవల సంస్థ టెలినార్‌ తన ఆరు సర్కిళ్లలోని 10,000 సైట్లను ఆధునీకరించనున్నట్లు ప్రకటించింది. ప్రతి రోజు 50 చొప్పున సైట్లను ఆధునీకరిస్తున్ సంపన్నులకే సకల అవకాశాలు..! Sun 08 May 02:08:52.363171 2016 నోయిడా: సమాజంలో అంతకంతకు పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై 'భారతీయ రిజర్వు బ్యాంక్‌' (ఆర్‌బీఐ) గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నిరాశపర్చిన ఆంధ్రా బ్యాంకు Sun 08 May 02:08:01.068369 2016 హైదరాబాద్‌: ఆంధ్రా బ్యాంకు ఫలితాలకు మరోమారు మొండి బాకీలు గండి కొట్టాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో బ్యాంకు నికర లాభాలు 72 శాతం పతనమై రూ.52 తగ్గనున్న ఐటీ నియామకాలు.. Sat 07 May 03:36:40.625375 2016 న్యూఢిల్లీ: 'ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ' (ఐటీ) రంగంలో ఉద్యోగుల వలసల తగ్గడం కారణంగా ఈ ఏడాది ఐటీలో స్థూల నియామకాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు మెరుగైన ప్రోత్సా మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌లో అక్షయ తృతీయ ముందస్తు బుకింగ్‌లు Sat 07 May 03:36:46.566181 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'అక్షయ తృతీయ' పర్వదినాన వినియోగదారులకు మెరుగైన ఆభరణాలను, సరసమైన ధరలకు అందించేందుకు గాను 'మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌' సంస్థ 'ముందస్తు బుకిం స్మార్ట్‌ సొల్యూషన్స్‌లోకి హావెల్స్‌ Sat 07 May 03:36:53.600388 2016 హైదరాబాద్‌ : ప్రముఖ ఎలక్ట్రికల్‌ ఉత్పత్తుల కంపెనీ హావెల్స్‌ ఆటోమేషన్‌, స్మార్ట్‌ సొల్యూషన్స్‌ వ్యాపార విభాగంలోకి ప్రవేశించింది. ఇళ్ళు, కార్యాలయాలు, హోటళ్లకు తన ప్రీమియం బ సహారా అధినేతకు ఊరట Sat 07 May 03:36:59.44462 2016 న్యూఢిల్లీ: సహారా గ్రూపు సంస్థల అధినేత సుబ్రతరారుకి కోర్టు కొంత ఊరట కల్పించింది. ఆయనకు నెల రోజుల పెరోల్‌ను మంజూరు చేసింది. రారు తల్లి మరణించడంతో ఆమె ప్రతి పోస్టాఫీసులోనూ ఏటీఎం Sat 07 May 03:37:06.09781 2016 న్యూఢిల్లీ: దేశంలోని ప్రతీ పౌరుడు రానున్న రెండేండ్లలో బ్యాంకు ఖాతా కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా తెలిపారు. దీనికి తోడు జెబ్రోనిక్స్‌ నుంచి సరికొత్త హెడ్‌ఫోన్‌ Sat 07 May 03:37:12.45423 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ ఐటీ ఉత్పత్తుల తయారీ సంస్థ జెబ్రానిక్స్‌ 'హిప్‌లైఫ్‌' పేరుతో సరికొత్త హెడ్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. బ్లూటూత్‌తో కూడిన అధునాతన నష్టాల్లో ముగిసిన మార్కెట్లు Sat 07 May 02:16:07.251373 2016 ముంబయి: అమెరికా ఉపాధి రేటు గణాంకాలపై నెలకొన్న అనుమానాల నేపథó్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో నష్టాలలో ముగిశాయి. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌ భవిష్యత్తులో రూ.1.22 కోట్లకు చేరిన ఐటీ రిఫండ్స్‌ Sat 07 May 02:15:13.741696 2016 న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఆదాయపు పన్ను శాఖ రికార్డు స్థాయిలో దాదాపు 2.10 కోట్ల మేర పన్ను చెల్లింపులను తిరిగి వెనక్కి ఇచ్చేసింది. వీటి విలువ దాదాపు రూ.1. అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో ఆర్థిక నేరం Fri 06 May 04:41:16.688226 2016 న్యూయార్క్‌: అమెరికాలోని స్టాక్‌ మార్కెట్‌లో ఆర్ధిక నేరానికి పాల్పడిన భారత సంతతికి చెందిన స్టాక్‌ బ్రోకర్‌ ప్రణవ్‌ పటేల్‌ (35)ను ఫెడరల్‌ బ్యూరో అధికారులు అరెస్ట్‌ చేసి త ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లకు భారీ జరిమానా Fri 06 May 04:41:23.340206 2016 న్యూఢిల్లీ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లకు సింగపూర్‌ కోర్టు భారీ జరిమాన విధించింది. జపనీస్‌ ఫార్మా సంస్థ డ్కెచీ సానక్యోకు తప్పుడు సమాచారం ఇచ్ లాభాల్లోనూ 'హీరో' Fri 06 May 04:41:29.723491 2016 న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్‌ క్రితం ఆర్ధిక సంవత్సరం జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఆకర్షణీయ ఆర్ధిక ఫలి సెన్సెక్స్‌ 160 పాయింట్ల ర్యాలీ Fri 06 May 04:41:37.537779 2016 ముంబయి : వరుసగా పడిపోయిన మార్కెట్ల నేపధ్యంలో స్టాక్‌ ధరలు దిగి రావడంతో గురువారం మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. అంతర్జాతీయంగా చైనా సేవల రంగం సూచీ స్వల్పంగా విస్తరిం మార్కెట్లోకి హోండా ఎస్‌యూవీ 'బిఆర్‌-వీ' Fri 06 May 04:41:45.491789 2016 న్యూఢిల్లీ : భారత వాహన మార్కెట్లోకి కొత్త వాహనాలు పొటెత్తుతుండడంతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న జపాన్‌కు చెందిన హోండా సంస్థ మార్కెట్లోకి సరికొత్త వాహనాన్ని తీసుకువచ్చి 1100 స్టోర్లకు విస్తరించనున్న మెడ్‌ఫ్లస్‌ Fri 06 May 04:41:53.086462 2016 హైదరాబాద్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల రిటైల్‌ సంస్థ మెడ్‌ఫ్లస్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్లలో భారీగా విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం ఫ్రాంచైజీ రూపంలో యాప్‌తో ఇక ఐటీ రిటర్న్‌ ఫైలింగ్‌ Fri 06 May 02:28:40.833843 2016 బెంగళూరు : ఇకపై ఆదాయపు పన్నుల రిటర్న్స్‌ ఇ-ఫైలింగ్‌ను సులభంగా యాప్‌ ద్వారా చేసుకోవడానికి వీలుగా యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం క్లియర్‌ టాక్స్‌ ప్రత్యేక యాప్‌ను రూ భారత్‌లో ఆర్థిక అసమానతలు ఎక్కువే Thu 05 May 05:57:18.814526 2016 సింగపూర్‌: ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌లో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) విశ్లేషించింది. భారత్‌ త్వరితగతిన అభివృద్ధి కొనసాగిన భయాలు Thu 05 May 05:57:25.897552 2016 ముంబయి : ప్రపంచ వృద్ధి రేటులో భయాలు, కార్పొరేట్‌ కంపెనీల ఆర్ధిక ఫలితాల్లో నిరుత్సాహం దేశీయ స్టాక్‌ మార్కెట్లను వరుసగా మూడో రోజూ నష్టాలకు గురి చేశాయి. చైనా, బ్రిటన్‌ దేశాల 50 కోట్లకు స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు: మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ Thu 05 May 05:57:32.026262 2016 న్యూఢిల్లీ : ఈ ఏడాది ముగింపు నాటికి భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు 50 కోట్ల మందికి చేరనున్నారని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ అంచనా వేశారు. దీంతో ఈ లిండ్‌ నుంచి కొత్త ఆక్సిజన్‌ సిలిండర్లు Thu 05 May 05:57:39.276258 2016 హైదరాబాద్‌ : పారిశ్రామిక వాయువులను విక్రయించే లిండ్‌ వైద్య అవసరాలను తీర్చడానికి కొత్త ఆక్సిజన్‌ సిలిండర్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6 కిలోల లోపు ఉండే తేలికపాటి ఎస్‌బీఐ 'ఎం-వీసా'తో మొబైల్‌ లావాదేవీలు Thu 05 May 05:57:48.608248 2016 హైదరాబాద్‌ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మొబైల్‌ ఆధారిత చెల్లింపుల పరిష్కారం కోసం ఎం-వీసాను ఆవిష్కరించింది. ఈ సేవలద్వారా వరంగల్‌కు విస్తరించిన అమూల్‌ Thu 05 May 05:57:56.710166 2016 హైదరాబాద్‌ : పాలు, పాల ఉత్పత్తులనందించే అమూల్‌ తమ పాల అమ్మకాలను వరంగల్‌కు విస్తరించింది. హైదరాబాద్‌లోని హయత్‌ నగర్‌ వద్ద రెండు పాల ప్రాసెసింగ్‌ మరియు ప్యాకెజింగ్‌ ప్లాంట్ జేెఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి జేఎస్‌పీఎల్‌ యూనిట్‌ Thu 05 May 01:47:34.124068 2016 న్యూఢిల్లీ: రాయపూర్‌లోని జేఎస్‌పీఎల్‌కు చెందిన 1,000 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను రూ.6,500 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ అధిపతి సజ్జన్‌ జిందాల్‌ తెలిపారు. లేచి 'పడ్డ' మార్కెట్లు Wed 04 May 04:38:25.040568 2016 ముంబయి : ప్రపంచ వృద్ధి రేటు పడిపోనుందన్న అంచనాలకు తోడు చైనా ఫ్యాక్టరీ ఉత్పత్తిలో స్తబ్దత దేశీయ స్టాక్‌ మార్కెట్లను ఆందోళనకు గురి చేశాయి. ఈ నేపధ్యంలోనే మంగళవారం బీఎస్‌ఈ స జాన్సన్‌ ఉత్పత్తుల్లో కాన్సర్‌ కారకాలు Wed 04 May 04:38:33.862925 2016 న్యూయార్క్‌ : ప్రముఖ బహుళ జాతి సంస్థ జన్సన్‌ అండ్‌ జన్సన్‌ (జెఅండ్‌జె) పౌడర్‌ ఉత్పత్తుల్లో కాన్సర్‌కు దోహదం చేసే కారకాలున్నాయని తేలింది. ఈ సంస్థ టాల్కమ్‌ పౌడర్‌, షవర్
1entertainment
ఐపిఎల్ అంపైర్ తల పగిలినంత పనయింది ( వీడియో ) Highlights అసలేం జరిగిందంటే.. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ ఆఖరి బంతిని ధావన్ బౌండరీ బాదాడు. ఆరు ఓవర్లు ముగిసిన తరువాత ఫీల్డ్ అంపైర్ సీకే నందన్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్‌లో భాగంగా బ్రేక్ ఇస్తున్నట్లు తన చేతిని ఎత్తి చూపిస్తూ ఇరు జట్ల ఆటగాళ్లకు చెప్పాడు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుండగా ఇదే సమయంలో అకస్మాత్తుగా ముంబయి ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా వచ్చి నందన్ తలకు తాకింది. ముంబయి ఆటగాళ్లు కృనాల్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్ అంపైర్ దగ్గరకు వెళ్లి పరామర్శించారు. గాయం పెద్దది కాకపోవడంతో కొద్దిసేపు ఇబ్బంది పడిన నందన్.. తరువాత యాథావిధిగా మ్యాచ్‌లో అంపైరింగ్ చేశాడు.   WATCH OUT UMP! On-field umpire C.K.Nandan had to bear the brunt of a ball thrown accidentally at him. Looked comical on camera but that would have hurt. Get the ice pack lads!
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV తన జీవితంలో #MeTooపై లతా మంగేష్కర్ ఏమన్నారంటే.. ‘నా గురించి ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. నాకు మాత్రం సంతోషంగా లేదు. నా అనుమతి లేకుండా పుస్తకాలు రాసేస్తున్నారని’ లతా ఆవేదన వ్యక్తం చేశారు. Samayam Telugu | Updated: Oct 16, 2018, 04:53PM IST తన జీవితంలో #MeTooపై లతా మంగేష్కర్ ఏమన్నారంటే.. దేశంలో ప్రకంపనలు రేపుతోన్న #MeToo ఉద్యమంపై లెజెండరీ సింగర్, ‘భారతరత్న’ లతా మంగేష్కర్ స్పందించారు. ప్రతి మహిళ తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకూడదని, పవిత్రంగా ఉండాలని భావిస్తుందన్నారు. అయితే తనకు ఎలాంటి లైంగిక వేధింపులు అనుభవాలు ఎదురుకాలేదని తెలిపారు. తనచుట్టూ ఉండేవారు ఎంతో గౌరవంగా మెలిగేవారని చెప్పారు. మీటూ ఉద్యమంలో భాగంగా పోరాటం చేస్తున్న బాధిత మహిళలకు అందరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. లతా మంగేష్కర్ జీవితం ఆధారంగా ఆమె సోదరి మీనా ఖాదికర్ జీవితచరిత్రను రాసి, ఇటీవల పుస్తకాన్ని విడుదల చేశారు. సోదరి(మీనా) కంటే బయటివాళ్లకు నాకంటే ఎక్కువగా ఏం తెలుస్తుందన్నారు లతా. మీనా కూతురు రచనా అంటే తనకెంతో ఇష్టమన్నారు. తన జీవితచరిత్రను ఇంగ్లీష్‌లో రచన తీసుకొస్తుందన్నారు. తన శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు సాధ్యమైనంత మందికి పుస్తకం చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రచయిత, దర్శకనిర్మాత నక్షాబ్ జార్చ్‌తో వివాదాన్ని బయోగ్రఫీలో మీ సోదరి మీన ప్రస్తావించారని మీడియా అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు. యుక్త వయసులో ఉన్నప్పుడు తనకు టెంపర్ చాలా ఎక్కువగా ఉండేదని, తన వద్దకు రావాలంటే మగవారు భయపడేవారన్నారు. రచయిత నక్షాబ్ జార్చ్‌వి మాత్రం తనపై ఎన్నో ప్రచారం చేసేవాడని, మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందని అవాస్తవాలు ప్రచారం చేశాడని చెప్పారు. వాటిలో ఇసుమంతైన వాస్తవం లేదని, ధైర్యంగా ఎదిరించినట్లు వెల్లడించారు. మీటూ ఉద్యమానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వాళ్లకు శిక్షపడాలన్నారు. Read also: MeToo సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి ‘నా గురించి ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. నాకు మాత్రం సంతోషంగా లేదు. నా అనుమతి లేకుండా పుస్తకాలు రాసేస్తున్నారు. వారికి నచ్చినట్లుగా విషయాలు వర్ణిస్తున్నారు. మాకు కుటుంబాలు ఉంటాయి. వారికి లేనిపోని విషయాలతో ఇబ్బంది కలుగుతుందని గ్రహిస్తే మంచిది. అందుకే కొందరు తమ జీవితాలపై పుస్తకాలు వద్దన్నారు. కుందల్ లాల్ సైగల్, దిలీప్ కుమార్, మా నాన్న పండిత్ దీననాథ్ మంగేష్కర్ జీవితచరిత్రలు పుస్తకంగా రావాలని కోరుకుంటున్నానంటూ’ లతా మంగేష్కర్ ఎన్నో కొత్త విషయాలను వివరించారు. Read In English: Lata Mangeshkar on #MeToo movement: Nobody could mess around with me and get away with it   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
RAVI SHASTRI రవిశాస్త్రి కొత్తడిమాండ్‌ ముంబయి: భారత క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ఎంపికైన అనంతరం మిగతా సహాయకులుగా సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన వారిని కాదని, తనకు నచ్చిన వారిని తీసుకుంటానని హెచ్‌ కోచ్‌ రవిశాస్త్రి చెప్పాండు. తాజాగా మరో కొత్త కోరికను బయిటపెట్టాడు. టీమిండియా విదేశీ పర్యటనలకు బయిలుదేరే సమయంలో జట్టుకు కన్సల్టెంట్‌గా సచిన్‌ టెండూల్కర్‌ కావాలనే డిమాండును తెరపైకి తీసుకువచ్చాడు. సచిన్‌ టెండూల్కర్‌, వివిఎస్‌ లక్ష్మణ్‌, సౌరవ్‌ గంగూలీలతో కూడిన సెలక్షన్‌ కమిటీ బ్యాటింగ్‌ కోచ్‌గా ద్రావిడ్‌ను, బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్‌ను ఎంపిక చేసింది. వారిని కాదన్న రవిశాస్త్రి బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌ను పట్టుబట్టి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన తనకు కన్సల్టెన్సీ సేవలందించేందుకు సచిన్‌ను కోరడం గమనార్హం. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా లాంటి టాప్‌ జట్లతో టెస్టు సిరీస్‌లు జరిగే సమయంలో టీమిండియా బ్యాటింగ్‌ సలహాదారుగా సచిన్‌ చేస్తే బాగుంటుందని బోర్డు వద్ద రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడట. ఇప్పటికే ఇలాంటి పర్యటనల కోసం బ్యాటింగ్‌, బౌలింగ్‌ సలహాదారులుగా రాహుల్‌ ద్రావిడ్‌,జహీర్‌ ఖాన్‌ణి బిసిసిఐ నియమించిన సంగతి తెలిసిందే. జట్టు ప్రదర్శనకి ప్రధాన కోచ్‌ బాధ్యత వహించనున్న నేపథ్యంలో సలహాదారులుగా కూడా అతని కనుసన్నల్లోనే పనిచేయనున్నారు. అయితే ఇప్పటికే అండర్‌-19, భారత్‌-ఏ జట్టుకి కోచ్‌గా పనిచేస్తున్న రాహుల్‌ ద్రావిడ్‌ ఎక్కువ సమయం భారత జట్టుకి పనిచేయలేనందున ఆ సలహాదారు బాధ్యతలు సచిన్‌కే అప్పగించాలని రవిశాస్త్రి గట్టిగా డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే, రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసిన క్రికెట్‌ సలహా కమిటీలో సచిన్‌, గంగూలీ, వివిఎస్‌ లక్ష్మణ్‌ సభ్యులు. దీంతో సచిన్‌ని ఇప్పుడు బ్యాటింగ్‌ సలహాదారునిగా నియమిస్తే విరుద్ధ ప్రయోజనాల కింద సమస్య ఏర్పడుతుందని బిసిసిఐ భావిస్తు న్నట్లు తెలుస్తోంది. జూలై 26 నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్‌ కోసం భారత్‌ జట్టు పయనం కానుంది. జట్టుతో పాటు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, అసిస్టెంట్‌ కోచ్‌ సంజ§్‌ు బంగర్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌; ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ మాత్రమే వెళ్లనున్నట్లు బిసిసిఐ ప్రతినిధి తెలిపారు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఆర్‌బిఐ చ‌ర్య‌: బిట్ కాయిన్ పరేషాన్! భారత రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బిఐ) క్రిప్టో కరెన్సీ ల లావాదేవీలపై బ్యాంకులను కట్టడి చేయడంతో ఇన్వెస్టర్ల లో ఆందోళన నెలకొంది. 2018 ఆర్థిక సంవత్సరంలో చేసిన రిటర్నులపై ఎం త పన్ను కట్టాలని నిపుణులను అడుగు తున్నారు. TNN & Agencies | Updated: Apr 8, 2018, 11:56AM IST భారత రిజర్వ్‌ బ్యాంకు భారత రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బిఐ) క్రిప్టో కరెన్సీ ల లావాదేవీలపై బ్యాంకులను కట్టడి చేయడంతో ఇన్వెస్టర్ల లో ఆందోళన నెలకొంది. 2018 ఆర్థిక సంవత్సరంలో చేసిన రిటర్నులపై ఎం త పన్ను కట్టాలని నిపుణులను అడుగు తున్నారు. జులై మాసాంతంలోగా పన్ను చెల్లించవచ్చా అని ఆరా తీస్తున్నా రు. వారి ఆందోళ నకు అర్థం ఉంది. క్రిప్టో కరెన్సీలను వెంటనే విక్రయించి తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదురూపే ణా వాటిని బదిలీ చేయని పక్షంలో అవి తమదగ్గరే ఉండిపోతున్నాయని ఇన్వె స్టర్లు కలత చెందుతున్నారు. అంతేకాక ఐటీ అధికారులు, ఇతర ప్రభు త్వ ఏజె న్సీలు తమపై ఎక్కడ దాడులు చేస్తారో అని భీతిల్లుతున్నారని నిపుణులు అంటున్నారు. బిట్ కాయిన్ పరేషాన్ పన్ను 20 శాతమా.. 30 శాతమా? ఇదే విషయమై అశోక్‌ మహేశ్వరి అండ్‌ అసోసియేట్స్‌ ఎల్‌ఎల్‌పి పార్టనర్‌ అమిత్‌ మహేశ్వరి మాట్లాడుతూ ఆదాయ పన్ను శాఖ బిట్‌కాయిన్స్‌, ఇతర క్రిఎ్టో కరెన్సీల ట్రేడింగ్‌ను కాపిటల్‌ గెయిన్లు లేదా స్పెక్యులేటివ్‌ ఇన్‌కమ్‌గా పరిగణించవచ్చని అన్నారు. స్పెక్యులేటివ్‌ బిజినెస్‌ ఆదాయానికి దాదాపు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని ఆయన చెప్పారు. క్రిఎ్టో కరెన్సీలను కనీసం 36 మాసాలు కలిగి ఉన్న పక్షంలో 20 శాతం దీర్ఘకాలిక మూలధన రాబడులపై పన్ను విధిస్తారని ఆదాయ పన్ను నిపుణులు అంటున్నారు. ఇతర కేసుల్లో 30 శాతం స్వల్ప కాలిక మూలధన రాబడులపై పన్ను వర్తిస్తుంది. క్రిఎ్టో కరెన్సీలను చట్టవిరుద్ధమైనవిగా భావించడం లేదు కనుక 20 శాతం పన్ను చెల్లిస్తే చాలని ఇతర సలహాదారులు పెట్టుబ‌డిదార్లకు సూచిస్తున్నారు. పెట్టుబడులు చట్టబద్ధమైనవేనా? ఇదే విషయమై గ్రాంట్‌ థామ్‌టోన్‌ అడ్వయిజరీ డైరెక్టర్‌ రియాజ్‌ థింగ్‌నా మాట్లాడుతూ ఆర్‌బిఐ చేసిన ప్రకటన బిట్‌కాయిన్లు లేదా ఏదేనీ ఇతర క్రిఎ్టో కరెన్సీలో పెట్టుబడులను మరింత దుర్లభం చేయలేదని అన్నారు. అలాంటి పెట్టుబడులను ఇప్పటికీ చట్టవిరుద్ధమైనవిగా భావిస్తారని తాను అనుకోవడం లేదని తెలిపారు. గత రెండు రోజుల్లో ఇన్వెస్ట ర్లలో అత్యధికులు వారి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న పక్షంలో రిటర్నులపై 20 శాతం సాధారణ మూలధన రాబడుల పన్ను విధిసా ్తరు. అలా కాకుండా వాటిని దీర్ఘకాలంగా ఉంచిన పక్షంలో 30 శాతం విధిస్తారని అన్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
1entertainment
Hyderabad, First Published 7, Aug 2019, 6:51 PM IST Highlights మాజీ కేంద్ర మంత్రి, చిన్నమ్మగా పిలుచుకునే సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండె పోటుతో హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. సుష్మా మరణంతో ఆమె అభిమానులు, బిజెపి కార్యకర్తలు శోకంలో మునిగిపోయారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖకు భాద్యతలు వహించిన మహిళా సుష్మా స్వరాజే. సోషల్ మీడియాలో సుష్మా చాలా యాక్టివ్.    మాజీ కేంద్ర మంత్రి, చిన్నమ్మగా పిలుచుకునే సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండె పోటుతో హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. సుష్మా మరణంతో ఆమె అభిమానులు, బిజెపి కార్యకర్తలు శోకంలో మునిగిపోయారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖకు భాద్యతలు వహించిన మహిళ సుష్మా స్వరాజే. సోషల్ మీడియాలో సుష్మా చాలా యాక్టివ్.  నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సోషల్ మీడియాని ఆమె ఉపయోగించుకునేవారు. విదేశాల్లో ఉండే భారతీయములకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి చర్యలు చేపట్టేవారు. తాజాగా ప్రముఖ టివి నటుడు నరన్వీర్ బోరా సుష్మా స్వరాజ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశాడు. ఆమె చేసిన సాయాన్ని గుర్తుచేసుకున్నాడు.  ఈ ఏడాది జనవరిలో కరన్వీర్ రష్యా పర్యటనకు వెళ్ళాడు. ఆ సమయంలో కరన్వీర్ పాస్ పోర్టు కాస్త డ్యామేజ్ అయింది. దీనితో కరన్వీర్ ని రష్యా అధికారులు ఎయిర్ పోర్ట్ లోనే ఆపేశారు. దీనితో కరన్వీర్ ట్విటర్ లో సుష్మా స్వరాజ్ ని సాయం చేయాలని కోరాడు. ఆమె వెంటనే స్పందించిన రష్యాలోని ఇండియన్ ఎంబసీ ద్వారా తాత్కాలిక  పాస్ పోర్ట్ అతడికి అందేలా చేశారు. దీనితో కరన్వీర్ సోషల్ మీడియా ద్వారా సుష్మాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సమయంలో సుష్మా స్వరాజ్ సరదాగా ఓ మాట అన్నారు. మీరు అంగారకుడిపై చుక్కుకున్నా అక్కడికి ఇండియన్ ఎంబసీ చేరుకుంటుంది అని సుష్మా సరదాగా వ్యాఖ్యానించారు.   కరన్వీర్ తాజాగా ట్విటర్ లో స్పందిస్తూ సుష్మా స్వరాజ్ మరణ వార్త విని షాకయ్యానని తెలిపాడు. ఆమె దేశం కోసం అంకితభావంతో పనిచేశారు. భారతీయులు ఏ దేశంలో ఉన్నా పరాయి అధీనంలో ఉన్న భావనని కలిగించకుండా విదేశాంగ శాఖకు భాద్యతలు నిర్వహించారని కరన్వీర్ సుష్మాపై స్వరాజ్ పై ప్రశంసలు కురిపించారు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అహ్మదాబాద్‌లో సిద్ధమవుతోన్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఈ స్టేడియాన్ని 63 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చు సుమారు రూ.700 కోట్లు. మెల్‌బోర్న్ స్టేడియం కన్నా పెద్దగా దీన్ని నిర్మిస్తున్నారు. Samayam Telugu | Updated: Jan 7, 2019, 02:16PM IST అహ్మదాబాద్‌లో సిద్ధమవుతోన్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం హైలైట్స్ లక్ష మంది కూర్చునే సామర్థ్యంతో సిద్ధమవుతోన్న మొతేరా క్రికెట్ స్టేడియం స్టేడియంను డిజైన్ చేసిన ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ పాపులస్, ఎల్ అండ్ టీకి నిర్మాణ బాధ్యతలు 2018లో శంకుస్థాన, ప్రస్తుతం శరవేగంగా నిర్మాణ పనులు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సిద్ధమవుతోంది. లక్ష మంది కూర్చొనే సామర్థ్యంతో అహ్మదాబాద్‌లోని మొతేరాలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ స్టేడియం ఫొటోలను గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నత్వాని ఆదివారం ట్వీట్ చేశారు. ఇది గుజరాత్ క్రికెట్ బోర్డు డ్రీమ్ ప్రాజెక్ట్ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ స్టేడియం పూర్తయితే, దేశానికే తలమానికంగా నిలుస్తుందని చెప్పారు. కాగా, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్దది. మొతేరాలోని స్టేడియం నిర్మాణం పూర్తయితే మెల్‌బోర్న్ పేరిట ఉన్న రికార్డ్ చెరిగిపోనుంది. World's Largest Cricket Stadium, larger than #Melbourne, is under construction at #Motera in #Ahmedabad,#Gujarat. O… https://t.co/1g3ZIW7ssX &mdash; Parimal Nathwani (@mpparimal) 1546752854000 మొతేరా క్రికెట్ స్టేడియం విశేషాలు.. ✦ స్టేడియం నిర్మాణానికి 2018 జనవరిలో శంకుస్థాపన జరిగింది. ✦ ఈ ప్రాజెక్ట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచన. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియం నిర్మాణం పూర్తవుతోంది. ✦ ఈ స్టేడియాన్ని ప్రముఖ ఆర్చిటెక్చర్ సంస్థ పాపులస్ డిజైన్ చేసింది. నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థ చేజిక్కించుకుంది. ✦ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా ఉన్న మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంను కూడా పాపులస్ సంస్థే డిజైన్ చేసింది. ✦ మొత్తం 63 ఎకరాల స్థలంలో నిర్మిస్తోన్న ఈ స్టేడియంలో ఒకేసారి 1.10 లక్షల మంది కూర్చోవచ్చు. మెల్‌బోర్న్ స్టేడియం కెపాసిటీ 90వేలు. ✦ స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చు సుమారు రూ.700 కోట్లు. ✦ స్టేడియంలో మొత్తం నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు ఉంటాయి. 50 గదులతో క్లబ్ హౌస్ ఉంటుంది. 76 కార్పోరేట్ బాక్సులు, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. ✦ దీనిలో ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఉంటుంది. ✦ స్టేడియంలో మూడువేల కార్లు, పదివేల మోటార్ సైకిళ్లు పార్కింగ్ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. ✦ పాత మొతేరా స్టేడియంలో కేవలం 54వేల మంది కూర్చునే సామర్థ్యం మాత్రమే ఉండేది. పున:నిర్మాణంలో భాగంగా దీన్ని 2016లో కూల్చేశారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
INDIANS భారత్‌లో కంపెనీల వృద్ధికి ఢోకాలేదు దావోస్‌, జనవరి 17: ప్రపంచీకరణ ప్రభా వాల నేపథ్యంలో మారుతున్న ధోరణులను అనుసరించి 71శాతం మంది భారత్‌ కార్పొరేట్‌ సిఇఒలు తమతమ కంపెనీల వృద్ధికి ఢోకాలేదని అభిప్రాయపడ్డారు. వచ్చే 12నెలల్లో భారీ వృద్ధిని సాధించగలమని అంతర్జాతీయ సగటు 38శాతం ఉంటే 29శాతం సిఇఒలు వచ్చే 12నెలల్లో ప్రపంచ సగటుకంటే వృద్ధిని సాధించగలమని వ్యక్తంచేస్తున్నారు. ఆర్థికవృద్ధి వచ్చే 12నెలల్లో మరింత పెరగాల్సి ఉందన్నారు. మొత్తం 42శాతం భారత సిఇఒలు అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ మరింతగా మెరుగుపడు తుందన్న భావన వ్యక్తంచేసారు. ప్రైస్‌ వాటర్‌కూపర్స్‌ అంచనావేసిన వార్షికసర్వేలో 79 దేశాలనుంచి 1379 మంది సిఇఒలను సర్వేచేసింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేదిక వార్షిక సదస్సులో వీటి వివరాలను విడుదల చేసింది. భారత్‌సిఇఒల్లో 67శాతం మంది వచ్చే 12నెలల్లో మానవ వనరుల్లో 9శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసారు. ప్రపంచసగటు 16శాతంగాఉంది. అయితే యాం త్రీ కరణ విధానాలతో ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. తమతమకంపెనీల ఆర్థికవృద్ధి పరంగా రానున్న 12నెలల్లో భారత్‌ సిఇఒలు అమెరికా పరంగా 55శాతం, చైనా 30శాతం, బ్రిటన్‌ 22శాతం, జర్మనీ 16శాతం ముంబై, న్యూయార్క్‌ లండన్‌ వంటి నగరాలు తమతమ సంస్థల వృద్ధికి కీలకం అవుతాయని అంచనావేసారు. వీటికితోడు ప్రభుత్వసంస్కరణల అజెండా కూడా తోడవుతుందని భారత్‌ విజయగాధ మొత్తం సంస్క రణల అమలుతోనే ఉందని ప్రైస్‌వాటర్‌కూపర్‌్‌స ఛైర్మన్‌ శ్యామల్‌ ముఖర్జీ వివరించారు. ప్రపంచీకరణ కుబేరులు, పేదలమధ్య వ్యత్యాసాలను తొలగించలేకపోయిందని, అతిస్వల్పంగా మాత్రమే అసమానతలు తగ్గించిందని అభి ప్రాయపడ్డారు. ఆర్థిక అనిశ్చితిపరంగా 82శాతం, చట్టాల విపరీత అమలు కార్యాచరణద్వారా 80శాతం, ప్రతిభా నిపుణుల లభ్యత 77శాతం వంటివి ప్రపంచవ్యాప్తంగా కంపెనీలకు కీలకసవాళ్లుగా నిలిచాయనే చెప్పాలి. అంతర్జా తీయ వృద్ధికి ఈ ఐదుఅంశాలే కీలకంగా పనిచేస్తున్నాయని అంచనా. ఆర్థిక వృద్ధిపై అనిశ్చితి 82శాతం, విపరీత చట్టాల అమలు 80శాతం, నిపుణులు లేక 77శాతం, భౌగోళిక అనిశ్చితి పరిస్థితులు 74శాతం, సాంకేతికపరంగా మార్పులు 70శాతం ప్రభావితం చేస్తున్నట్లు తేలింది. భారత్‌ సిఇఒల్లో ఎక్కువమంది అమెరికావైపు 43శాతం,చైనా వైపు 33శాతం, జర్మనీ 17శాతం, బ్రిటన్‌ 15శాతం, జపాన్‌ 8శాతం, భారత్‌ ఏడుశాతం, బ్రెజిల్‌ ఏడు, మెక్సికో ఆరు, ఫ్రాన్స్‌ ఐదుశాతం, ఆస్ట్రేలియా ఐదుశాతం వృద్ధికి ఆస్కారం ఉన్న దేశాలుగా అంచనా వేస్తున్నట్లు తేలింది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV దటీజ్ సచిన్.. విరాట్ కోహ్లికి మాస్టర్ ప్రామిస్! టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఓ ప్రామిస్ చేశాడు. పరుగుల వరద పారిస్తూ.. సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్న కోహ్లి మాస్టర్ మాటిచ్చాడు. Samayam Telugu | Updated: Apr 25, 2018, 12:57PM IST దటీజ్ సచిన్.. విరాట్ కోహ్లికి మాస్టర్ ప్రామిస్! టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఓ ప్రామిస్ చేశాడు. పరుగుల వరద పారిస్తూ.. సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్న కోహ్లి ఇప్పటికే వన్డేల్లో 35 సెంచరీలు పూర్తి చేశాడు. కోహ్లి ఇదే దూకుడు కనబరిస్తే.. సచిన్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల రికార్డ్‌ను బ్రేక్ చేయడం ఖాయం. ఈ విషయంలో ఎవరికీ అనుమానాల్లేవు. చర్చంతా అతడు ఎంత కాలంలోగా ఈ రికార్డ్‌ను అధిగమిస్తాడనే. కోహ్లి గనుక తన 49 సెంచరీల రికార్డ్‌ను బ్రేక్ చేస్తే అతడితో కలిసి షాంపేన్ పంచుకుంటానని సచిన్ చెప్పాడు. విరాట్ నా రికార్డ్‌ను అధిగమిస్తే.. తనకు షాంపెన్ బాటిళ్లు పంపడం కాదు.. నేనే తన దగ్గరకెళ్లి షాంపెన్ బాటిల్ పంచుకుంటానని మాస్టర్ బ్లాస్టర్ చెప్పుకొచ్చాడు. 2017 ఆరంభం నుంచి ఇప్పటి వరకు కోహ్లి వన్డేల్లో 9 శతకాలు బాదాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ (30), సనత్ జయసూర్య (28) శతకాల రికార్డును ఈ ఏడాది కాలంలోనే బ్రేక్ చేశాడు. కాగా కోహ్లి వన్డేల్లో 62 సెంచరీలు సాధిస్తాడని వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశాడు. ‘రియల్ మాస్టర్ బ్లాస్టర్’ అంటూ కోహ్లి సచిన్‌కి బర్త్ డే విషెస్ చెప్పాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఇరానీ కప్‌లో భారీ స్కోర్.. 28 ఏళ్ల రికార్డ్ బ్రేక్..! నాగ్‌పూర్ వేదికగా తాజాగా జరుగుతున్న ఇరానీ కప్‌లో 28 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యింది. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో జరుగుతున్న TNN | Updated: Mar 17, 2018, 11:29AM IST ఇరానీ కప్‌లో భారీ స్కోర్.. 28 ఏళ్ల రికార్డ్ బ్రేక్..! నాగ్&zwnj;పూర్ వేదికగా తాజాగా జరుగుతున్న ఇరానీ కప్&zwnj;లో 28 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యింది. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో జరుగుతున్న మ్యాచ్&zwnj;లో విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్&zwnj;లో 800 పరుగుల రికార్డు స్కోరుతో గట్టి సవాల్ విసిరింది. వసీమ్ జాఫర్ (286: 431 బంతుల్లో 34x4, 1x6) భారీ డబుల్ సెంచరీతో చెలరేగగా.. అపూర్వ్ వాంఖడే (157: 221 బంతుల్లో 16x4, 6x6), గణేశ్ సతీశ్ ( 120: 280 బంతుల్లో 10x4, 2x6) శతకాలు బాదడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 226.3 ఓవర్లలో 800/7 వద్ద మొదటి ఇన్నింగ్స్&zwnj;ని శనివారం డిక్లేర్ చేసింది.
2sports
Jan 22,2019 భారత రోడ్లపైకి 'ఆ'రు కోట్ల కారు! న్యూఢిల్లీ: లంబోర్గిని అవెంటెడార్‌ ఎస్‌వీజే భారత్‌ మార్కెట్లో విడుదలైంది. తొలి కారును కర్ణాటకలో బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. సంస్థ ఈ కారును 2018లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ రకమైన కార్లను కేవలం 600 మాత్రమే విక్రయించనున్నారు. ఈ కారు మొత్తం ఎస్‌, ఎస్‌వీ వెర్షన్లలో లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.6 కోట్లు వరకు ఉంటుంది. అవెంటెడార్‌ ఎస్‌వీజేలో 6.5లీటర్‌ వీ12 ఇంజిన్‌ను అమర్చారు. ఇది 720 ఎన్‌ఎం టార్క్‌, 770 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఈ కారు కేవలం 2.8 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది. ఇక 0-200 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. ఇది గంటకు 349 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
- పలు వస్తుసేవల జీఎస్టీల్లో మార్పులు - 28 శాతం శ్లాబ్‌కు భారీగా సవరణలు - 178 వస్తువులకు 18 శాతమే జీఎస్టీ.. - మార్బుల్స్‌, గ్రానైట్‌ పరిశ్రమకూ ఊరట - హోటల్‌ భోజనంపై ఇక 5 శాతమే పన్ను - 'రిటర్స్న్‌' జరిమానాల్లోనూ భారీ కుదింపు - మరింత హేతుబద్దీకరిస్తాం: అరుణ్‌ జైట్లీ - ప్రజల అసంతృప్తిని చల్లార్చేందుకేనా..! గౌహతి: దేశంలో కొత్తగా అమలులోకి తెచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పట్ల విమర్శలు పెరుగుతున్న వేళ సర్కారు ఒక్కొక్క అడుగు దిగివస్తోంది. తాజాగా శుక్రవారం గౌహతిలో జరిగిన 23 మండలి సమావేశంలో చాలా వస్తువుల పన్ను శ్లాబ్‌లను మార్చుతూ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు తీసుకుంది. 178 వస్తువులను 28 శాతం నుంచి 18శాతం శ్లాబ్‌లోకి చేర్చుతూ నిర్ణయం తీసుకుందని జైట్లీ తెలిపారు. దీంతో ఈ విభాగంలోని వస్తు సేవల సంఖ్య 50కి తగ్గిపోయింది. మరో 13 వస్తువులను 18 శాతం శ్లాబు నుంచి 12 శాతం శ్లాబులోకి మార్చినట్టుగా ఆర్థిక మంత్రి తెలిపారు. మరో ఆరు వస్తువులను 18 శాతం శ్లాబు నుంచి 5 శాతం శ్లాబులోకి తెచ్చామని ఆయన వివరించారు. ఎనిమిది వస్తువులను 12 శాతం శ్లాబు నుంచి 5 శాతం శ్లాబులోకి.. ఆరు వస్తువులను 5 శాతం నుంచి 0శాతం (పన్ను పరిధిలోకి రాని) శ్లాబ్‌లోకి మార్చామని ఆయన ఇక్కడ వెల్లడించారు. జీఎస్టీ పన్నుల విధానాన్ని హేతుబద్దీకరించే చర్యల్లో భాగంగా తాము ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఆయన వివరించారు. హోటల్‌, రెస్టారెంట్‌ భోజనంపై కనికరం.. రెస్టారెంట్‌లు, హోటళ్లకు వెళ్లి భోజనం చేసే వినియో గదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. దేశ వ్యాప్తంగా అన్ని హోటల్స్‌ విక్రయాలపై (స్టార్‌ హోటల్స్‌ తప్ప) జీఎస్టీని 5 శాతంగా నిర్ణయించింది. మండలి సమావేశం అనంతరం జైట్లీ మాట్లాడుతూ హోటల్‌ భోజనాలపై వినియోగదారులకు జీఎస్‌టీ భారాన్ని భారీగా తగ్గించాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఈ విభాగం 18 శాతం పన్ను పరిధిలో ఉందని.. దీనిని 5 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కౌన్సిల్‌లో విస్తృతంగా చర్చించాకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. టర్నోవర్‌ స్థాయి, ఏసీ, నాన్‌-ఏసీతో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై జీఎస్‌టీ రేటు 5 శాతంగానే ఉంటుందని వివరించారు. అలాగే గది అద్దె రూ.7,500లకు పైగా వసూలు చేస్తున్న స్టార్‌ హోటల్స్‌ వారు మాత్రం 18 శాతం జీఎస్టీ (ఇన్‌పుట్‌ క్రెడిట్‌ కలుపుకొని) చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇన్‌పుట్‌ క్రెడిట్‌ లబ్దిని హోటల్‌ యాజమాన్యం వినియోగదారులకు బదలాయించడం లేదని జైట్లీ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ల రంగానికి ఇన్‌పుట్‌ క్రెడిట్‌ను ఎత్తి వేస్తున్నట్టుగా తెలిపారు. ఈ కొత్త రేట్లు ఈ నెల 15నుంచి అమల్లోకి రానున్నాయని ప్రకటించారు. పన్నులేమీ లేకుండా ఉన్నవారు ఆలస్యంగా రిటర్న్స్‌ దాఖలు చేస్తే ప్రస్తుతం రూ.200లుగా (రోజుకు) ఉన్న జరిమానాను రూ.20 (రోజుకు)కు తగ్గిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆలస్యంగా రిటర్న్స్‌ దాఖలు చేసిన వారికి గతంలో రూ.200ల (రోజుకు) జరిమానా విధిస్తుండగా.. దాన్ని రూ.50లకు (రోజుకు) కుదించాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. పన్ను తగ్గనున్న వస్తువులివే.. * ఫ్యాన్లు *  ల్యాంపులు * కాఫీ పౌడర్‌ * షాంపోలు * కుక్కర్లు * స్టౌవ్‌లు * నిల్వ వాటర్‌ హీటర్లు*  బ్యాటరీలుొ డిటర్జెంట్‌లు * వాషింగ్‌ పౌడర్‌ * రేజర్లు * బ్లేడ్లు * చాకొలెట్లు * మార్బుల్స్‌* గ్రానైట్‌ * దంత సంరక్షణ ఉత్పత్తులు * పాలీష్‌లుొ క్రీములుొ శానిటరీ వే* తోలు దుస్తులుొ విగ్గులు * కస్టర్డ్‌ పౌడర్‌ * ఆఫ్టర్‌ షేవ్‌లుొ గాగుల్స్‌* చేతి వాచీలుొ పరుపులు * వైర్లు, కేబుళ్లు* ఫర్నీచర్‌ * సూట్‌ కేస్‌లు * హెయిర్‌ క్రీమ్‌లు *హెయిర్‌ డైలుొ మేకప్‌ సామాగ్రిొ రబ్బరు ట్యూబ్‌లు * మైక్రోస్కోప్‌ తదితరాలు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Suresh 129 Views harpreet singh ఒక ట్వీట్‌తో క్రికెటర్‌ కెరీర్‌ బలి భోపాల్‌: ఒకే ఒక్క తప్పుడు ట్వీట్‌ ఆ యువ క్రికెటర్‌ కెరీర్‌ను బ్రేక్‌ వేసింది.సరైన సమాచారం తెలియకుండానే ఆ క్రికెటర్‌ను నేరస్థుడిగా చూపిస్తూ ఒక నెటిజన్‌ చేసిన ట్విట్‌ క్షణాల వ్యవధిలో అది వైరల్‌గా మారిపోయింది.విషయం ఐపిఎల్‌ ఫ్రాంఛైజీలకు కూడా చేరడంతో ఐపిఎల్‌లో అతన్ని కొనేవారు కరువయ్యారు.మధ్యప్రదేశ్‌ క్రికెటర్‌ హర్‌ ప్రీత్‌ సింగ్‌ ఆవేదన ఇది.క్రికెటర్‌గా కెరీర్‌లో మంచి ఫామ్లఓ ఉన్న హర్‌ ప్రీత్‌సింగ్‌ రంజీ ట్రోఫిలో 8 మ్యాచ్‌లు ఆడి 537 పరుగులు చేశాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నుంచి అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.అయితే హర్మీత్‌ సింగ్‌ అనే ఒక యువ క్రికెటర్‌ ఇటీల ముంబైలోఇ అంధేరి రైల్వే స్టేషన్‌లో ప్లామ్‌ ఫాం మీదకు తన కారును తీసుకెళ్లి ఆపాడు.దీంతో అదివివాదమైంది. అయితే ఈ తప్పు చేసింది.హర్మీత్‌సింగ్‌.అయితే హర్‌ప్రీత్‌సింగ్‌ అని పేర్కొంటూ ఒక వ్యక్తి తప్పుడు ట్వీట్‌ చేశాడు.ఆ తరువాత చాలా సైట్లు కూడా ఇదే నిజమనుకుని పాలో అయ్యాయి. విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సరిగ్గా ఐపిఎల్‌ యాక్షన్‌ సమయంలో హరిప్రీత్‌సింగ్‌కు ఇబ్బంది కలిగింది.నిజానికి హర్‌ప్రీత్‌ సింగ్‌ను కొనుగోలు చేయాలని పలు ప్రాంచైజీలు భావించినప్పటిఇక అతనేదో నేరంలో ఇరుకున్నాడని తెలియడంతో ఆ ఆలోచన మానుకున్నామని ఒక ప్రాంచైజీ అధికారి పేర్కొన్నాడు.అసలు నేరస్థుడైన హర్మీత్‌సింగ్‌ అండర్‌ -19 జట్టుతో పాటు రాజస్థాన్‌ రాయల్స్‌ తరుపున కూడా ఐపిఎల్‌లో ఆడాడు.ఇద్దరి పేర్లు దగ్గరగా ఉండటంతో చాలా మంది హర్మీత్‌ ను హర్‌ప్రీత్‌ అనుకుని పొరబడ్డారు.నెటిజన్‌ తప్పుడు ట్వీట్‌వల్ల హర్‌ప్రీత్‌ సింగ్‌ రైల్వే స్టేషన్‌లో అలా చేసుంటాడని భావించారు. మొత్తం మీద ఆ ఎఫెక్ట్‌ హర్‌ ప్రీత్‌ సింగ్‌ క్రికెట్‌ కెరీర్‌ మీద పడింది.పేరుతో పాటు కెరీర్‌ కూడా పోయిందని హర్‌ ప్రీత్‌ ఆవదేన చెందుతున్నాడు.ప్రతి ఒక్కరు పోన్‌ చేసి అలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తున్నారని వాపోతున్నాడు. ఐపి ఎల్‌లో ప్లేస్‌ దక్కనందుకు బాధపడట్లేదని ఆఖరికి గూగుల్‌ లో తన గురించి వెతికినా రైల్వే కేసులో అరెస్టయినట్లు వస్తుందని హర్‌ప్రీత్‌ పేర్కొన్నాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV బిగ్‌బాస్‌లో ఈరోజు ఎలిమినేషన్ లీక్..! బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్‌‌ అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మూడు వారాలు గడిచిపోగా.. నాలుగో వారం ఈరోజుతో ముగియనుంది. Samayam Telugu | Updated: Jul 8, 2018, 01:03PM IST బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్‌‌ అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మూడు వారాలు గడిచిపోగా.. నాలుగో వారం ఈరోజుతో ముగియనుంది. దీంతో.. ఈరోజు బిగ్‌బాస్ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యే నాలుగో కంటెస్టెంట్‌ ఎవరు..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ.. ఆ కంటెస్టెంట్‌ ఎవరో తెలిసిపోయింది. ఈ వారం నామినేషన్‌కి బాబు గోగినేని, నందిని రాయ్, దీప్తి, గణేశ్, గీతా మాధురి, శ్యామల, కౌశల్ వచ్చారు. వీరిలో శనివారం రాత్రి గణేశ్, గీతా మాధురి ప్రొటెక్ట్‌ జోన్‌లోకి వెళ్లినట్లు షో హోస్ట్‌ నాని ప్రకటించాడు. దీంతో.. మిగిలిన ఐదుగురిలో ఒకరు ఈరోజు రాత్రి బిగ్‌‌బాస్ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ కానున్నారు. దీంతో.. ఆ ఒక్కరు ఎవరు..? అని అభిమానులు చర్చించుకుంటున్న నేపథ్యంలో.. నేనేనంటూ యాంకర్ శ్యామల ప్రకటించేసుకుంది. ‘నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. మళ్లీ ఇంటికి చేరుకున్నాను. నిషాన్ (కొడుకు)‌తో ఆడుకుంటున్నాను’ అని శ్యామల సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే.. ఆదివారం ఎలిమినేషన్‌కి సంబంధించిన ఎపిసోడ్‌ని ఒక్కరోజు ముందుగానే సిద్ధం చేసుకుంటారనే విషయాన్ని ఆమె మర్చిపోయినట్లుంది. దీంతో.. తప్పిదాన్ని గుర్తించిన వెంటనే పోస్ట్‌ని తొలగించినా.. అప్పటికే అది వైరల్‌గా మారిపోయింది. బహుశా.. ఎపిసోడ్‌ అప్పటికే టెలికాస్ట్ అయ్యిందేమోననుకుని ఈ యాంకర్ అలా పోస్ట్ చేసుంటుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
0business
Hyderabad, First Published 12, Aug 2018, 7:48 PM IST Highlights తాజాగా ఆది పినిశెట్టి 'RX100' తమిళ రీమేక్ లో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఔరా సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.  ఈ మధ్యకాలంలో విడుదలై ఘాన విజయం సాధించిన చిన్న చిత్రాల్లో 'RX100' ఒకటి. ఈ సినిమాతో పరిచమైన హీరో కార్తికేయకి, దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లకు మంచి పేరు లభించింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ రీమేక్ లో ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించనున్నారనే విషయంలో ఆది పినిశెట్టి పేరు వినిపిస్తోంది. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన ఆది ప్రస్తుతం 'యు టర్న్' సినిమాలో నటిస్తున్నాడు. అలానే సోలో హీరోగా నటించిన 'నీవెవరో' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఆది పినిశెట్టి 'RX100' తమిళ రీమేక్ లో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఔరా సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.  Last Updated 9, Sep 2018, 2:00 PM IST
0business
Oct 16,2017 త్వరలో రెండో దశ జియో ఫోన్‌ బుకింగ్స్‌! న్యూఢిల్లీ: త్వరలో రెండో దశ జియో ఫ్రీ ఫోన్‌ బుకింగ్స్‌ను ఆ సంస్థ ప్రారంభినుందని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 24న మొదటి దశ జియో ఫ్రీ ఫోన్‌ బుకింగ్స్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు ఆరు మిలియన్ల మంది జియో ఫోన్‌ను బుక్‌ చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించిన డెలివరీ సైతం దాదాపు పూర్తి అయినట్టు తెలుస్తోంది. దీంతో రెండో విడత బుకింగ్స్‌ను నిర్వహించాలని జియో భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనను త్వరలో విడుదల చేస్తామని జియో ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే రెండో దశ జియో ఫోన్‌ బుక్సింగ్స్‌ను దీపావళి తర్వాత ప్రారంభించవచ్చని, అది అక్టోబర్‌ చివరి నాటికి లేదా నవంబర్‌ మొదటి వారం ఉండొచ్చని జియో వర్గాలు పేర్కొన్నాయి. గత జులై 21న రిలయన్స్‌ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫోన్‌ పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఫోన్‌ ఉచితం అయినప్పటికీ రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి ఉండగా, మూడేండ్ల తర్వాత ఆ డబ్బును వినియోగదారులకు వాపసు ఇస్తామని జియో ప్రకటించిన విషయం తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
mitchell starc picks his second hat-trick of the match చెలరేగిన స్టార్క్.. ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ హ్యాట్రిక్‌లతో చెలరేగాడు. ఒకే మ్యాచ్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించి ఇంగ్లండ్ జట్టుకు హెచ్చరికలు పంపాడు. TNN | Updated: Nov 7, 2017, 05:59PM IST యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ హ్యాట్రిక్&zwnj;లతో చెలరేగాడు. ఒకే మ్యాచ్&zwnj;లో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించి ఇంగ్లండ్ జట్టుకు హెచ్చరికలు పంపాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన షెపిల్డ్ షీల్డ్&zwnj;లో వెస్టర్న్ ఆస్ట్రేలియాపై స్టార్క్ అరుదైన ఈ ఫీట్ సాధించాడు. సోమవారం తొలి హ్యాట్రిక్ సాధించిన స్టార్క్.. మంగళవారం మరో హ్యాట్రిక్ తీశాడు. తద్వారా ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్&zwnj;గా రికార్డ్ క్రియేట్ చేశాడు. రెండు ఇన్నింగ్స్&zwnj;ల్లోనూ స్టార్క్ చివరి మూడు వికెట్లను కుప్పకూల్చడం విశేషం. స్టార్క్ అద్భుత బౌలింగ్ కారణంగా న్యూ సౌత్ వేల్స్ జట్టు 171 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, స్టార్క్ బౌలింగ్&zwnj;ను ఎదుర్కొనే ప్రమాదం తప్పడంతో 11వ నంబర్ బ్యాట్స్&zwnj;మెన్ సిమన్ మాకిన్ రెండుసార్లు నాటౌట్&zwnj;గా నిలిచాడు.
2sports
ఆర్కే నగర్ ఉపఎన్నికల బరిలో విశాల్ అట Highlights జయలలిత మరణం అనంతరం రసవత్తరంగా మారిన తమిళ రాజకీయాలు జయ ప్రాతినిథ్యం వహించిన ఆర్కే నగర్ ఉపఎన్నికకు రంగం సిద్ధం గతంలో అవినీతి ఆరోపణలో రద్దైన ఉప ఎన్నిక ఈసారి బరిలో హీరో విశాల్ నిలుస్తాడని టాక్ జయలలిత మరణం అనంతరం ఇటీవల సంచలనాలకు నిలయంగా మారిన తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన వార్త వస్తోంది. జయలలిత మరణంతో జరుగుతున్న ఆర్కే నగర్ ఉపఎన్నిక బరిలో తమిళ స్టార్ హీరో విశాల్ దిగనున్నాడనే మాట వినిపిస్తోంది. ఇది వరకూ ఒకసారి నామినేషన్ల పర్వం పూర్తి చేసుకుని పోలింగ్ కు సన్నద్ధం అవుతున్న దశలో ఆర్కే నగర్ బై పోల్ రద్దయింది.   గతంలోనే ఆర్కేనగర్ ఉప ఎన్నిక జరగాల్సి వున్నా ధన ప్రవాహం నేపథ్యంలో ఈసీ ఉప ఎన్నికను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ బై పోల్ కు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈసారి జరిగే ఎన్నికల బరిలో నిలుస్తాడంటూ తమిళ స్టార్ హీరో విశాల్ పేరు వినిపిస్తోంది. విశాల్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడని.. రాజకీయ పార్టీని కూడా స్థాపించనున్నాడని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. విశాల్ సోమవారం నామినేషన్ వేయనున్నాడని కూడా అంటున్నారు. ఆర్కేనగర్ బై పోల్ అత్యంత ఆసక్తిదాయకంగా మారుతుంది.   అయితే విశాల్ నుంచి మాత్రం అందుకు సంబంధించి అధికారిక ధ్రువీకరణ ఏదీ లేదు. పోటీ చేయబోతున్నట్టుగా విశాల్ ఎక్కడా చెప్పలేదు. దీంతో ఇది ఒట్టి పుకారు మాత్రమేనేమో అనుకోవాల్సి వస్తోంది. ఇది వరకూ ఆర్కే నగర్ బై పోల్ బరిలో కమల్ హాసన్ ఉండబోతున్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే పోటీ చేయబోతున్నట్టుగా కమల్ ఎక్కడా ప్రకటించలేదు. Last Updated 25, Mar 2018, 11:56 PM IST
0business
Suresh 198 Views సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఫెదరర్‌ మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో ప్రపంచ నెం:3 రోజర్‌ ఫెదరర్‌ సెమీస్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం ఇక్కడి రాడ్‌: లేవర్‌ ఏరినా కోర్టులో జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఫెదరర్‌ 6వ సీడ్‌ , జెకోస్లేవేకియాకు చెందిన బెర్డిచ్‌తో తలపడ్డాడు. తొలిసెట్‌లో టైబ్రేకర్‌ వరకు సాగింది. 7-6,తో ఫెదరర్‌ విజయం సాదించాడు. తర్వాత రెండు సెట్లఓ 6-2, 6-4 తేడాతో ప్రత్యర్తిపై విజయం సాధించాడు. మ్యాచ్‌ కేవలం ఒక గంట 36నిముషాల్లో ముగిసింది.
2sports
SHARP11 షార్ప్‌ నుంచి వాయుశుద్ధి యంత్రాలు హైదరాబాద్‌: షార్ప్‌ కంపెనీ కొత్తగా వాయుశుద్ధి పరికరాలను విడుదలచేసింది. షార్ప్‌ ప్లాస్మా కస్టర్‌ ఎయిర్‌ప్యూరిఫయర్లపరంగా వీటి ని గదుల్లోను, లాబీల్లోను, సమావేశపు మందిరా ల్లో కూడా ఏర్పాటుచేసుకుంటే మొత్తం వాయు సంరక్షణ చేపడుతుందని షార్ప్‌ కంపెనీ ప్రచా రంచేస్తోంది. వాయుకాలుష్యం కారణంగా దేశం లో ఆస్తమా వ్యాధు లు పెరుగుతున్నా యని, షార్ప్‌ కంపె నీ ఉత్పత్తులు ఆస్త మాకు సంబంధించి మూల కణాలను తొలగించేందుకు దోహదం చేస్తుంద ని కంపెనీ ప్రకటిం చింది. హోటళ్లు, రెస్టారెంట్లు,ఎయిర్‌ పోర్టులు, కార్యాల యాలు, ఆసుపత్రులు, క్లినిక్‌లు, స్పాకేంద్రాల వంటివాటిలో వీటిని అమర్చుకునే వీలుంది. ప్రపంచవ్యాప్తంగా ఐదుకోట్ల మంది కస్టమర్లు ఉన్నారని వీటిధరలు రూ.20వేలనుంచి రూ.33 వేలవరకూ ఉన్నాయి. రిటైల్‌ ఔట్‌లెట్లు అన్నిం టిలోనూ ఇవి లభిస్తాయని షార్ప్‌ప్రచారం చేస్తోంది.
1entertainment
Alestor cook నేడు రాజ్‌కోట్‌కు అలెస్టర్‌ కుక్‌ సేన ముంబై:టీమిండియాతో జరిగనున్న అయిదు టెస్టుల్లో భాగంగా ఈనెల 9న తొలి టెస్టు రాజ్‌కోట్‌ లో ప్రారంభం కానుంది.కాగా ఈ క్రమంలో ఇం గ్లండ్‌ జట్టు నేడు రాజ్‌కోట్‌కు చేరుకోనుంది. బం గ్లాదేశ్‌ నుంచి ముంబై చేరుకున్న ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ అలెస్టర్‌ కుక్‌ సేన ప్రాక్టీస్‌ సెషన్‌లో బిజిగా ఉంది.కాగా అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత్‌ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌ జట్టు టెస్టు సిరీస్‌ కోసం తన సన్నాహకాలను ప్రారంభించింది.నెట్‌ ప్రాక్టీస్‌లో ఇంగ్లండ్‌ జట్టు పాల్గొంటుంది.కాగా ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడి యంలో ఏకధాటిగా నాలుగు గంటలపాటు ఇం గ్లండ్‌ జట్టుకు చెందిన 16 మంది ఆటగాళ్లు నెట్స్‌ లో చమటోడ్చారు.వాస్తవానికి శనివారం ఇంగ్లండ్‌ జట్టు అధికారికంగా ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాల్సి ఉంది.అయినప్పటికి అంతకు ముందే ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనడం విశేషం.బంగ్లాదేశ్‌తో మిర్పూర్‌ లో జరిగిన ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లభించింది.కాగా ఇంగ్లండ్‌ ఆటగాళ్లంతా నెట్స్‌లో సందడి చేశారు.ఇంగ్లండ్‌ జట్టుకు చెందిన 16 మంది ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయను న్నారు. ఇక అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు ఆదివారం రాజ్‌కోట్‌కు బయలు దురుతుందని జట్టు వర్గాలు వెల్లడించాయి. భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో స్పిన్‌ను సమర్థ వంతంగా ఎదుర్కొనేందుకు 12 మంది స్థానిక స్పిన్‌ బౌలర్లతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేశారు.ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌ వీరి బౌలింగ్‌లో స్లాగ్‌,స్వీప్‌,స్ట్రెయిట్‌ డ్రైవ్‌లపై ఎక్కు వగా దృష్టి సారించాడు.ఇక భుజం నొప్పితో బాధ పడుతున్న ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ఇప్పటికే బంగ్లాదేశ్‌ పర్యటను మిస్‌ అయిన సంగతి తెలసిందే.తాజాగా భారత్‌తో జరుగునున్న తొలి టెస్టుకు కూడా అందుబాటలో ఉండటం లేదని ఈసిబి ప్రకటించింది.కాగానవంబర్‌ 9న రాజ్‌ కోట్‌ లో ప్రారంభం కానున్న తొలిటెస్టుకు ముందు కుక్‌ సేనఅక్కడ రెండురోజులపాటుప్రాక్టీస్‌ చేయనుంది. తొలి సారి డిఆర్‌ఎస్‌ అమలు భారత్‌,ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో తొలిసారి ప్రయో గాత్మకంగా డిఆర్‌ఎస్‌ను అలు చేయనున్నట్లు బిసిసిఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా భారత్‌ పర్యటకు వచ్చిన ఇంగ్లండ్‌ జట్టుకు బిసిసిఐ చెతెలెత్తేసింది.భారత్‌లో పర్యటన ముగిసే వరకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు ఖర్చులు భరించలేమని మీ ఖర్యులు మీరే చూసుకోవాలని లేఖ రాసింది.కాగా భారత్‌లో సిరీస్‌ యాధావిధిగా జరుగుతుందని ఈసిబి పేర్కొంది. భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ప్రమాదమేమీ లేదని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు స్పష్టం చేసింది.ఇంగ్లండ్‌ ఆటగాళ్ల పర్యటన ఖర్చులను భరించు కోవాల్సిందింగా బిసిసిఐ కార్యాదర్శి అజ§్‌ుషిర్కే రాసిన లేఖపై ఈసిబి స్పందించింది. మేం ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నాం, ఇప్పుడు మా ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదు. సిరీస్‌ కోసమే ఎదురు చూస్తున్నాం అని ఈసిబి వివరించింది.
2sports
Suresh 154 Views ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జిఎంఆర్‌ గ్రూప్‌  కొత్త చెక్‌ఇన్‌ న్యూఢిల్లీ: జిఎంఆర్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో నిర్వహిసుతన్న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త చెక్‌ఇన్‌ విధానం ప్రవేశపెట్టింది. అప్పటికపుడు ప్రయాణీకులకు చెక్‌చేసేందుకు వీలుగా కౌంటర్‌ వద్దనే పోర్టబుల్‌ చెక్‌ఇన్‌ సాయంతోతనిఖీలు నిర్వహిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్‌ ఇండియా కార్యాచరణకు అనుగుణంగా జిఎంఆర్‌గ్రూపు ఈ కొత్తవిధానాన్ని ప్రవేశ పెట్టింది. విమానాశ్రయం సిఇఒ ఐ.ప్రభాకరరావు మాట్లాడుతూ, కొత్త చెక్‌ఇన్‌ విధానం ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.దేశంలో ఒక్క ఢిల్లీ విమానాశ్రయంలో మాత్రమే అ విధానం అమలు అవుతోందన్నారు.అత్యంత రద్దీ సమయాల్లో అప్పటికపుడు చెక్‌ఇన్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కాగా శీతాకాలం, వర్షాకాలాల్లో కూడ ఈ చెక్‌ఇన్స్‌ నిర్వహణ వెసులుబాటు నిస్తాయన్నారు.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Ind vs Aus 2nd ODI: తొమ్మిదేళ్ల తర్వాత ధోనీ గోల్డెన్ డక్.. మళ్లీ ఆసీస్‌పైనే చివరిసారిగా 2010లో వైజాగ్‌లో ఆసీస్‌తో జరిగిన వన్డేలో గోల్డెన్ డక్ అయిన ధోనీ.. 9ఏళ్ల తర్వాత అదే జట్టుపై తొలి బంతికే వెనుదిరగడం గమనార్హం. Samayam Telugu | Updated: Mar 6, 2019, 10:23AM IST Ind vs Aus 2nd ODI: తొమ్మిదేళ్ల తర్వాత ధోనీ గోల్డెన్ డక్.. మళ్లీ ఆసీస్‌పైనే హైలైట్స్ నాగ్‌పూర్ వన్డేలో ధోని నిరాశపరిచాడు. 9ఏళ్ల తర్వాత తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరగాడు. అయితే 300, 400, 500 వన్డే విజయాలు సాధించిన జట్టులో సభ్యుడిగా మాత్రం రికార్డు నెలకొల్పాడు. భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీది ఓ ప్రత్యేక స్థానం. కెరీర్‌ తొలినాళ్లలో పొడవాటి జుట్టుతో యూత్ ఐకాన్‌‌గా మారిన ధోనీ.. మైదానంలో హెలికాప్టర్ షాట్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తించేవాడు. టీమిండియా బెస్ట్ ఫినిషర్లలో ఒకడైన ధోనీ ఇప్పటికీ జట్టుకు వెన్నుముకగానే ఉన్నాడు. ఆటలో జోరు తగ్గినప్పటికీ తన వ్యూహాలతో జట్టును గెలిపిస్తూ అభిమానులతో జేజేలు కొట్టించుకుంటున్నాడు. ఆ మధ్యలో ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనీ ఆసీస్ పర్యటనలతో వరుస హాఫ్ సెంచరీలతో మళ్లీ ట్రాక్ ఎక్కాడు. న్యూజిలాండ్ పర్యటనలోనూ సత్తా చాటాడు. స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న 5వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనూ అర్థ శతకంతో జట్టును గెలిపించాడు.
2sports
bandla ganesh emotional speech at katamarayudu prerelease event హేయ్ బండ్ల గణేశా.. మళ్లీ ఏసేశావ్‌ గా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ భక్తుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే మొదటగుర్తుకు వచ్చే పేరు బండ్ల గణేష్. ఆయన మైక్ అందుకున్నడంటే తనలోని కవి తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాడు. TNN | Updated: Mar 18, 2017, 10:51PM IST పవర్ స్టార్ పవన్ కళ్యాణ్&zwnj; భక్తుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే మొదటగుర్తుకు వచ్చే పేరు బండ్ల గణేష్. ఆయన మైక్ అందుకున్నడంటే తనలోని కవి తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాడు. తాజాగా కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్&zwnj;లో మరోసారి తన ప్రతి&lsquo;భజనను&rsquo;బయట పెట్టాడు బండ్ల గణేష్. బండ్ల గణేష్&zwnj;కు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయనను దేవుడిగా కొలుస్తుంటానని పలు సందర్భాలలో బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) జరిగిన కాటమరాయుడు ప్రీరిలీజ్ ఈవెంట్&zwnj;లో బండ్ల గణేష్ స్పీచ్ హైలైట్&zwnj;గా నిలిచింది. Visit Site Recommended byColombia అభిమానులు ఆనందంతో పవన్ గురించి మాట్లాడమని బండ్ల గణేష్&zwnj;ను కోరగా.. ''ఏమని చెప్పమంటారు.. &lsquo;స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరతానని బాలగంగాధర్ తిలక్ అన్నారు.. అలాంటి ఆయనని చెప్పమంటారా..? కులం యొక్క పునాధులపై ఒక జాతిని నిర్మించలేమని అన్నారు భారతరత్న అంబేడ్కర్ అలాంటి ఆయన అని చెప్పమంటారా..? భారతదేశానికి హిందూ, ముస్లింలు రెండు కళ్ళని అన్నాడు సల్ సయ్యద్ ఖాన్ అలాంటి ఆయనని చెప్పమంటారా..? &lsquo;అవసరమైతే చిరిగిన చొక్కా తోడుక్కోండి కానీ మంచి పుస్తకం కొనుక్కోండి అన్నాడు కందుకూరి వీరేశలింగం అటువంటి ఆయనని చెప్పమంటారా..? ఆర్య సమాజం నా తల్లి, వైధిక ధర్మం నా తల్లి అన్నాడు లాలా లజపతిరాయ్ అలాంటి ఆయనని చెప్పమంటారా..? బ్రిటీషర్ల కింద బ్రతకడం కంటే ఓ వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్, అలం బెంగాల్ విభిజన దినం బ్రిటీష్ సామ్రాజ్యం పతన దినం అన్నాడు మహాత్మగాంధీ అలాంటి ఆయనని చెప్పమంటారా? నాకు రక్తానివ్వండి మీకు స్వాతంత్రం తెచ్చిస్తా.. అన్నాడు సుబాష్ చంద్రబోస్అ లాంటి ఆయనని చెప్పమంటారా? భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని చెప్పాలా? మనకు చెప్పడాలు లేవు.. ఆయన చెప్పింది చేయడమే.. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్ మై గాడ్ ఈజ్ పవన్ కల్యాణ్'' అంటూ మాటల తూటాలను పేల్చుతూ తన స్పీచ్&zwnj;ను ముగించారు బండ్ల గణేష్.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Shikhar Dhawanకి మద్దతుగా నిలిచిన నెహ్రా..! 2019లో 9 వన్డేలాడిన శిఖర్ ధావన్ వరుసగా 0, 32, 23, 75*, 66, 28, 13, 6, 0 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నా.. రెండు డకౌట్లు కూడా ఉండటంతో.. ప్రపంచకప్ ముంగిట ఈ ఓపెనర్‌పై ఒత్తిడి పెరిగిపోతోంది. Samayam Telugu | Updated: Mar 4, 2019, 04:51PM IST Shikhar Dhawanకి మద్దతుగా నిలిచిన నెహ్రా..! హైలైట్స్ భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం మధ్యాహ్నం రెండో వన్డే తొలి వన్డేలో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన శిఖర్ ధావన్ చివరిగా ఆడిన తొమ్మిది వన్డేల్లో రెండు అర్ధశతకాలే చేసిన ఓపెనర్ ఇటీవల ఫామ్ అందుకున్న కేఎల్ రాహుల్.. ఓపెనర్‌గా మళ్లీ పోటీలోకి ఆస్ట్రేలియాతో గత శనివారం జరిగిన తొలి వన్డేలో పేలవంగా డకౌటైన భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌కి మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా మద్దతుగా నిలిచాడు. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఎదుర్కొన్న తొలి బంతికే శిఖర్ ధావన్ ఫీల్డర్ మాక్స్‌వెల్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌కి ఓపెనర్‌గా అవకాశమివ్వాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో కేఎల్ రాహుల్ 50, 47 పరుగులతో సత్తాచాటిన విషయం తెలిసిందే. అయితే.. ధావన్‌ కూడా మళ్లీ ఫామ్ అందుకుంటాడని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో రెండో వన్డే నాగ్‌పూర్ వేదికగా మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది.
2sports
internet vaartha 150 Views న్యూఢిల్లీ : ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్ర అండ్‌ మహీంద్ర మేనెల వియ్రాల్లో 11శాతంపెరిగి నట్లు ప్రకటించింది. మేనెలలో 40,656 యూనిట్లు విక్రయించింది. వాణిజ్య  వాహనాలు 15శాతం పెరిగి 13,109వరకూ విక్రయించింది. అంతకుముందు ఏడాది కేవలం 11,407 మాత్రమే విక్రయించింది. దేశీయ మార్కెట్లలో పదిశాతం పెరిగాయి. 36,613 యూనిట్లు విక్రయించింది. అంతకుముందు ఏడాది భారత్‌ మార్కెట్‌లో కేవలం 33,369 యూనిట్లు మాత్రమే విక్రయించింది. ఎగుమతులపరంగాచూస్తే 21శాతం పెరిగి 4043 యూనిట్లు విక్రయించింది. గత ఏడాది మేనెలలో 3337 యూనిట్లు మాత్రమే విక్రయించింది. ప్యాసింజర్‌ విక్రయాల్లో స్కార్పియో, ఎక్స్‌యువి500, గ్జైలో, బొలేరో, వేరిటో వంటి వహణాలు 8శాతం వృద్ధిని సాధించి 19,635 యూనిట్లకు పెరిగాయి. వాణిజ్యవాహనాలపరంగా 15శాతం పెరిగి 13,109కి చేరాయి. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రవీణ్‌షా మాట్లాడుతూ డీజిల్‌ వాహనాల నిషేధంపై మాట్లాడుతూ చట్టపరంగా కొంత ప్రమేయంతో ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV చిరు 150వ సినిమాకి ఛాన్స్ కొట్టేసిన డీఎస్పీ పవన్ కళ్యాణ్ సినిమా పాటలంటేనే కంపోజిషన్‌కి ఆయనకి సంబంధం లేకపోయినా అదో రకమైన కొత్త జోష్.. ఏదో ప్రత్యేకత ఆ ట్యూన్స్‌లో కనిపిస్తాయి. | Updated: Mar 21, 2016, 02:38AM IST పవన్ కళ్యాణ్ సినిమా పాటలంటేనే కంపోజిషన్‌కి ఆయనకి సంబంధం లేకపోయినా అదో రకమైన కొత్త జోష్.. ఏదో ప్రత్యేకత ఆ ట్యూన్స్‌లో కనిపిస్తాయి. అటువంటిది ఆ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తే ఇంకా ఆ సినిమా ఆడియోపై వుండే ఎక్స్‌పెక్టేషన్సే వేరు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జల్సా, గబ్బర్‌సింగ్ , అత్తారింటికిదారేది చిత్రాలు ఆ పాటల్లోని రుచేంటో చూపించాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ ఇద్దరి కాంబినేషన్‌లో విడుదలకి రెడీ అయిన ఆడియో సర్ధార్ గబ్బర్‌సింగ్ . ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడిన డీఎస్పీ.. పవన్‌, చిరంజీవిలతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఒక పక్కేమో... గబ్బర్‌సింగ్.... మరో పక్కన శంకర్ దాదా ఎంబీబీఎస్ .. నిజంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ ఇద్దరితో కలిసి పనిచేయడం నా అదృష్టం. వారి సినిమాలకి వర్క్ చేసే అవకాశం రావడమే చాలా సంతోషంగా భావిస్తాను అని ఆనందం వ్యక్తంచేసిన దేవీశ్రీ ప్రసాద్.. ఇదే ఆడియో ఫంక్షన్ సాక్షిగా చిరు 150వ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తానని చిరంజీవి కోరిక మేరకు హామీ ఇచ్చాడు. నిజంగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ డీఎస్పీకి కచ్చితంగా మర్చిపోలేని ఓ తీయని అనుభూతిని మిగిల్చినట్టే.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV GoAir దీపావళి బంపరాఫర్.. రూ.1,200కే విమాన టికెట్.. ఆఫర్ ఒక్క రోజే! దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఊరికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మీకోసం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.1200తోనే విమానం ఎక్కేయవచ్చు. ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. Samayam Telugu | Updated: Oct 17, 2019, 09:16AM IST GoAir దీపావళి బంపరాఫర్.. రూ.1,200కే విమాన టికెట్.. ఆఫర్ ఒక్క రోజే! హైలైట్స్ కేవలం రూ.1,200కే విమాన ప్రయాణం గోఎయిర్ దీపావళి ఆఫర్ కేవలం 24 గంటలు మాత్రమే డిస్కౌంట్ అందుబాటులో విమానయాన కంపెనీలు ప్రయాణికలను ఆకర్షించేందుకు వివిధ రకాల డిస్కౌట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా గోఎయిర్ కూడా అదిరిపోయే ఆఫర్ కస్టమర్ల ముందు ఉంచింది. ప్రి-దీపావళి సూపర్ సేవర్ డీల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ సేల్ కేవలం 24 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గోఎయిర్ ప్రి-దీపావళి సేల్‌లో భాగంగా విమాన టికెట్లను రూ.1296 ప్రారంభ ధరతో బుక్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ ఆఫర్ దేశీ, విదేశీ ప్రయాణానికి వర్తిస్తుంది. ఈ సేల్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా విమానంలో ప్రయాణించాలని భావిస్తే ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకోండి. Also Read: ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో రూ.20 లక్షల ప్రయోజనం.. పూర్తి వివరాలు! డిస్కౌంట్ ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు అక్టోబర్ 20 నుంచి 23 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. దీపావళి పండుగకు ఊర్లకు వెళ్లాలని భావించే వారికి ఇది మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే టికెట్లకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. Also Read: భారీగా పడిపోయిన వెండి.. రూ.1,100కు పైగా పతనం.. షాకిచ్చిన బంగారం ధర! కాగా విస్తారా ఎయిర్‌లైన్ కూడా వారం రోజుల కిందల డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. 48 గంటల ప్రత్యేక సేల్ ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కంపెనీ రూ.1,199 ప్రారంభ ధరతో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు ఈ కంపెనీ మార్గంలోనే గోఎయిర్ కూడా నడుస్తోంది. Also Read: ఎస్‌బీఐ ఖాతాదారులకు నవంబర్ 1 షాక్.. కొత్త నిర్ణయం అమలులోకి!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV నిషేధం విధించినా రబాడానే నెంబర్ వన్ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధానికి గురైన రబాడ.. టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. TNN | Updated: Mar 13, 2018, 06:38PM IST దక్షిణాఫ్రికా యువ కెరటం కగిసో రబాడకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్&zwnj;స్మిత్&zwnj;ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి రెండు టెస్టు మ్యాచ్&zwnj;ల నిషేధానికి గురైన రబాడ.. టెస్టు ర్యాంకింగ్స్&zwnj;లో అగ్రస్థానానికి ఎగబాకాడు. 902 పాయింట్లతో టెస్టుల్లోనే టాప్ బౌలర్&zwnj;గా అవతరించాడు. భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక రవీంద్ర జడేజా తన మూడో స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రెండో స్థానానికి పడిపోయాడు. ఈ మేరకు ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్&zwnj;ను మంగళవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అద్భుత బౌలింగ్&zwnj;తో రబాడ దక్షిణాఫ్రికాకు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 11 వికెట్లు తీసిన రబాడ &lsquo;ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్&rsquo; గెలుచుకోవడమే కాకుండా నంబర్ వన్ బౌలర్&zwnj;గా నిలిచాడు. కాగా, 900 పాయింట్లను దాటిన 23వ బౌలర్&zwnj;గా రబాడ రికార్డు కెక్కాడు. దక్షిణాఫ్రికా నుంచి నాలుగో బౌలర్. గతంలో దక్షిణాఫ్రికా నుంచి ఫిలాండర్ (2013లో 912 పాయింట్లు), షాన్ పొలాక్ (1999లో 909 పాయింట్లు), డేల్ స్టెయిన్ (2014లో 909 పాయింట్లు) ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, అశ్విన్ రెండు స్థానాలు ఎగబాకాడు. జోష్ హాజల్&zwnj;వుడ్ (4 నుంచి 5కు), మిచెల్ స్టార్క్ (5 నుంచి 9కు) వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి అశ్విన్ చేరుకున్నాడు. ఇక బ్యాట్స్&zwnj;మెన్ విషయానికి వస్తే, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానం పదిలంగా ఉంది. అలాగే ఛటేశ్వర్ పుజారా తన ఆరో స్థానాన్ని కాపాడుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన ర్యాంకును బాగా మెరుగుపరుచుకున్నాడు. ఐదు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు. హషీం ఆమ్లా ఒక స్థానం ఎగబాకి తొమ్మిదో స్థానానికి వెళ్లాడు. ఇంగ్లండ్ బ్యాట్స్&zwnj;మన్ జోరూట్ మూడో స్థానంలో ఉండగా.. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) నాలుగు, డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) ఐదో స్థానంలో ఉన్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు బ్యాంకింగ్‌ రంగం ర్యాలీ ముంబై : ఆర్థికసర్వే నివేదిక పార్లమెంటులో ప్రవేశపెట్టడంతో మార్కెట్ల లో స్మార్ట్‌ ర్యాలీ కనిపించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఎక్కువ లాభాల్లో నడిచాయి. ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన వనరులు చేకూర్చేందుకు ఆర్థిక మంత్రిజైట్లీ ప్రణాళికలు స్పష్టం కావడంతో బ్యాంకింగ్‌ ర్యాలీ కనిపించింది. ద్రవ్యోల్బణంలో స్థిరత్వం, ఆర్థిక సమన్వ యం సంతులనందిశగా ఆర్థికసర్వే బాటలు వేసిందని నిపుణులు అంచనా. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 185 పాయింట్లు పెరిగి 23,161 పాయింట్లవద్ద స్థిర పడితే నిఫ్టీ 50 56 పాయింట్లు పెరిగి 7027 పాయింట్లవద్ద స్థిరపడింది. స్మాల్‌క్యాప్‌ సూచీ 0.4శాతం దిగువన ముగిసింది. మిడ్‌క్యాప్‌ సూచీ మాత్రం 0.3శాతం పెరిగింది. మార్కెట్లపరంగా చూస్తే 1423 కంపెనీలు క్షీణిస్తే 1040 కంపెనీలు లాభాల్లో ముగిసాయి. వచ్చేరెండేళ్లలో ఎనిమిది శాతం వృద్ధిని సాధిస్తామని ఎకనమిక్‌ సర్వే ప్రకటిం చింది. ఆర్థికలోటు వచ్చేఏడాది జిడిపిలో 3.5శాతం గా ఉంటుందన్నది అంచనా వేసింది. ఏడోవేతన సంఘం సిఫారసులు అమలు చేసినా రుతుపవనా లు సకాలంలో వస్తే రాబడులు పెరుగుతాయని ధీమా ప్రకటించింది. అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలో సంక్షోభం కొంత ఎగుమతులపై ప్రభావం చూపు తుంది. బ్యాంకింగ్‌రంగషేర్లు ర్యాలీ తీసాయి. నిఫ్టీ బ్యాంక్‌ 1.7శాతం పెరిగింది. ఇంట్రాడేలో మరింత పెరిగింది. యాక్సిస్‌బ్యాంకు, ఎస్‌బిఐ, ఫెడరల్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్రబ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌బ్యాంకు, యస్‌బ్యాంకు, ఐసి ఐసిఐబ్యాంకులు 1నుంచి 3.5శాతం పెరిగాయి. హౌసింగ్‌ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు కూడా పెరిగాయి. దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఎల్‌ఐసి హౌసింగ్‌ఫైనాన్స్‌, హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌కార్ప్‌ వంటివి 1-8శాతం పెరి గాయి. కోల్‌ ఇండియా 3.5శాతం పెరి గింది. ఎల్‌అండ్‌టి 2శాతం పెరిగింది. ఇంజనీరింగ్‌ నిర్మాణ రంగాల్లో 2.5లక్షల కోట్లు మాత్రమే రావ డంవల్ల కొంత రాక ఏర్పడింది. హిందూస్థాన్‌ కన్‌స్ట్రక్షన్‌, సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రా రెండుశాతం చొప్పున పెరిగాయి. యుబి గ్రూప్‌ ఛైర్మన్‌ విజ§్‌ుమాల్యా వైదొలగడంతో కంపెనీ షేర్లు పెరిగాయి. డియోజియో కంపెనీ యాజమాన్యంలోకి యుబిగ్రూప్‌ వెళ్లింది. యుబి హోల్డింగ్స్‌ 20శాతం పెరిగింది. మంగళూరు కెమి కల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ 8శాతంపెరిగింది. యుబి ఒకటిశాతం, యుఎస్‌ఎల్‌ 2శాతంపెరిగాయి. మారుతి సుజుకి 0.5శాతం దిగజారింది. ఆటోరంగపరంగా బజాజ్‌ ఆటో, హీరోమోటోకార్ప్‌, ఐషర్‌మోటార్స్‌, అశోక్‌లేలాండ్‌ వంటివి 0.5నుంచి 4శాతం క్షీణించా యి. ఆసియా మార్కెట్లు కొంత గరిష్టస్తాయిలోనే పెరి గాయి. జి20 సదస్సుపరంగా కొంత ఊతం ఇచ్చింది. జి20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు షాంఘైలో సమావేశం అయ్యారు. ప్రపంచ ఆర్థికవృద్ధి నష్టాలపై సమగ్ర చర్చలు జరుపుతున్నారు. జపాన్‌ 0.3శాతం ర్యాలీ తీస్తే హాంగ్‌సెంగ్‌, షాంఘై కాంపో జిట్‌ 2.5శాతం ఒకటిశాతం చొప్పున పెరిగాయి. యూరోపియన్‌ మార్కెట్లలోర్యాలీ కనిపించింది. ఎఫ్‌టి ఎస్‌ఇ100, జర్మనీ డాక్స్‌, ఫ్రాన్స్‌ సిఎసి40 వంటి ఎక్ఛేంజిలు 1నుంచి 2.5శాతం చొప్పున పెరిగాయి.
1entertainment
MOBILE మొబైల్‌ దిగుమతులు భారత్‌లో తక్కువే! న్యూఢిల్లీ, జూలై 24: భారత్‌కు ఇతరదేశాల నుంచి దిగుమతి అవుతున్న మొబైల్స్‌ శాతం తక్కువేనని సాక్షాత్తూ ప్రభుత్వం చెపుతోంది. గత ఏడాది భారత్‌కు కేవలం 3.7 బిలియన్‌ డాలర్లు విలువైన ఫోన్లు దిగుమతి అయ్యాయని భారతీయ కరెన్సీల్లో వీటి విలువ 24,364 కోట్లుగా ఉందని ఐటిశాఖ పార్లమెంటుకు నివేదించింది. ఇక దేశీయంగా మొబైల్‌ఫోన్లు గత ఏడాది 90వేల కోట్లు ఉత్పత్తి అయ్యాయని అంచనావేసింది. టెలికాం మార్కెట్లపరంగా ప్రపంచదేశాల్లో భారత్‌ కీలకస్థానంలో ఉంది. మొబైల్‌ హ్యాండ్‌సెట్లను గడచిన కొన్నేళ్లుగా భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. 2014-15లో మొబైల్‌ఫోన్లు18,900 కోట్ల విలువైన ఫోన్ల ను ఉత్పత్తి చేసింది. 2015-16 ఆర్థికసంవత్సరంలో రూ.54వేల కోట్లు విలువైన ఫోన్లు ఉత్పత్తిచేస్తే తదనంతరం గత ఏడాది రూ.90 వేల కోట్లవిలువైన ఫోన్లు ఉత్పత్తిచేసినట్లు టెలికాంమంత్రి మనోజ్‌సిన్హా వెల్లడించారు.దేశీయంగా 185శాతం ఉత్పత్తిలోవృద్ధి ఉందని అంతకు ముందు సంవత్సరాలతోపోలిస్తే 67శాతం వృద్ధి ఉన్నదని ఆయన వెల్లడించారు. 2014-15లో దిగుమతులపరంగా 210 మిలియన్‌ల హ్యాండ్‌ సెట్లు దిగుమతి అయ్యాయి. 7948 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2015-16లో 6059 మిలియన్‌ యూనిట్లకు పెరిగినట్లు ఆయన వెల్లడించారు. గతఏడాదిచూస్తే 76మిలియన్‌ యూనిట్లకు తగ్గిపోయాయని 3788 మిలియన్‌ డాలర్ల విలువైనవి మాత్రమే దిగుమతి అయినట్లు వివరించారు. కొన్ని విదేశీ యూనిట్లు తమతమ ఉత్ప త్తి కేంద్రాలను భారత్‌లోనే ఏర్పాటుచేస్తునఆనయని కొన్ని కంపెనీలు ఉత్పత్తికి సబ్‌కాంట్రాక్టులు ఇస్తున్నాయని ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిసేవల కంపెనీలకు వీటిని అప్పగిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇటువంటి కర్మాగారాలు ఆంధ్ర ప్రదేశ్‌, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నట్లు వివరించారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విభిన్నతరహా ఎక్సైజ్‌సుంకాన్ని ప్రతిపాదించిందన్నారు. దశలవారీ ఉత్పత్తి విధానం కింద దేశంలో మొబైల్‌ హ్యాండ్‌సెట్లు, అసెంబ్లీయూనిట్లకు బేసిక్‌ కస్టమ్స్‌సుంకం పదిశాతం మాత్రమే ఉంటుంది.
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రెనో క్విడ్ ఏఎంటీ వర్షన్ విడుదల ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆటో దిగ్గజం రెనో తన బుల్లి కారు క్విడ్‌లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(ఏఎంటీ) వర్షన్‌ను భారత్‌లో విడుదలచేసింది. TNN | Updated: Nov 12, 2016, 02:26PM IST ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆటో దిగ్గజం రెనో తన బుల్లి కారు క్విడ్&zwnj;లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్&zwnj;మిషన్(ఏఎంటీ) వర్షన్&zwnj;ను భారత్&zwnj;లో విడుదలచేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 4.25 లక్షలు (ఢిల్లీ ఎక్స్&zwnj;షోరూం). ప్రస్తుతం మార్కెట్&zwnj;లో ఉన్న క్విడ్ 1 లీటర్ మాన్యువల్ ట్రాన్స్&zwnj;మిషన్ వర్షన్ కంటే ఈ కారు ధర రూ. 30వేలు అధికం. భారత్&zwnj;లో మంచి పాపులారిటీని సంపాందించిన ఈ క్విడ్ అమ్మకాలు ఇప్పటికే లక్ష దాటినట్లు రెనో వెల్లడించింది. కాంపాక్ట్ హాచ్&zwnj;బ్యాక్ సెగ్మెంట్&zwnj;లో ఏఎంటీ టెక్నాలజీని పాపులర్ కావడంతో వినియోగదారులు కూడా దానివైపే చూస్తున్నారని, ఇప్పుడు ఏఎంటీతో క్విడ్&zwnj;ను లాంచ్ చేయడం ఆనందంగా ఉందని రెనో ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సాహ్నే వెల్లడించారు.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఎస్‌బీఐ రూ.లక్ష కోట్ల రుణ మాఫీ..! కేవలం ఎస్‌బీఐ మాత్రమే కాదు.. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రుణాలను మాఫీ చేశాయి. దేశంలోని మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు బీజేపీ గత నాలుగేళ్ల పాలనలో ఏకంగా రూ.3.16 లక్షల కోట్లను మాఫీ చేశాయి. Samayam Telugu | Updated: May 19, 2019, 01:08PM IST హైలైట్స్ గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారీ స్థాయిలో రుణాలు మాఫీ చేసిన బ్యాంక్ దీంతో దిగొచ్చిన బ్యాంక్ మొండి బకాయిలు బీజేపీ నాలుగేళ్ల కాలంలో రూ.3 లక్షల కోట్లకు పైగా రుణాలు మాఫీ ప్రభుత్వ రంగ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా రూ.లక్ష కోట్లకుపైగా రుణాలను మాఫీ చేసింది. ఎవరికీ చెసిందనే విషయం మాత్రం తెలీదు. బడా కార్పొరేట్లకు చెందిన రుణాలే ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సెప్టెంబర్ క్వార్టర్ చివరి నాటికి రూ.2.02 లక్షల కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ గతేడాది లోక్‌సభలో తెలియజేశారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ వీటిల్లో రూ.61,663 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు తెలుస్తోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ రూ.40,809 కోట్లను మాఫీ చేసింది. అంటే బ్యాంక్ గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా రూ.1.02 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. కేవలం ఎస్‌బీఐ మాత్రమే కాదు.. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రుణాలను మాఫీ చేశాయి. దేశంలోని మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు బీజేపీ గత నాలుగేళ్ల పాలనలో ఏకంగా రూ.3.16 లక్షల కోట్లను మాఫీ చేశాయి. ఆర్‌బీఐ నిబంధనల మేరకు రుణాలను టెక్నికల్‌గా మాఫీ చేశామని, అయితే రుణం తీసుకున్నవారు వారి లోన్లను తిగిరి కట్టాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి అరున్ జైట్లీ గతంలోనే తెలిపారు.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV సుశీల్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతు భారత రెజ్లర్ సుశీల్ కుమార్ రియో ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న కల... కలగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. TNN | Updated: Jun 6, 2016, 04:17PM IST ప్రముఖ భారత రెజ్లర్ సుశీల్ కుమార్ రియో ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న కల... కలగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. భారత్ తరుపున రియో ఒలింపిక్స్ లో పోటీపడే అవకాశాన్ని ముంబైకి చెందిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ దక్కించుకున్నాడు. సుశీల్ తనకి, నర్సింగ్ యాదవ్ కి ట్రయల్ మ్యాచ్ నిర్వహించాలని, గెలిచినవారిని ఒలింపిక్స్ కు పంపించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై హైకోర్టు నేడు తీర్పు ఇచ్చింది. ఒలింపిక్స్ దగ్గర్లోనే ఉండడంతో... ఈ సమయంలో ట్రయల్ నిర్వహించడం కుదరదని తేల్చింది. ట్రయల్ మ్యాచ్ సమయంలో క్రీడాకారులకు గాయాలైతే... ఆ ప్రభావం ఒలింపిక్స్ లోని మ్యాచుపై పడుతుందని అభిప్రాయపడింది. దీంతో సుశీల్ ఒలింపిక్ష్ లో పాల్గొనే అవకాశం దాదాపు లేనట్టే.
2sports
McDonald Business Director Gerald Dais ఎపి మార్కెట్‌లో మెక్‌డొనాల్డ్‌ విస్తరణ హైదరాబాద్‌, సెప్టెంబరు 30: ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌ లో తమకు మంచి మార్కెట్‌ వాటాఉందని, ఇందు కోసమే ఎపిలో తమ రెస్టారెంట్లను విస్తరిస్తున్నట్లు మెక్‌డొనాల్డ్స్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ గెరాల్డ్‌ డయాస్‌ వెల్ల డించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మార్కెట్‌ తమకు ఎంతో కీలకమని అందువల్లనే మొట్టమొదటి రెస్టారెంట్‌ను విజయవాడలో ప్రారంభించామన్నారు. అంతేకాకుండా దక్షిణాది లో మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్లను మరింతగా విస్త రిస్తున్నట్లు వివరించారు. మొత్తం పదిరాష్ట్రా ల్లోని నగరాల్లో 242 రెస్టారెంట్లు ఏర్పాటుచేసి 185 మంది మిలియన్ల కస్టమర్లకు సేవలందిస్తు న్నట్లు ప్రకటించింది. ఏడువేలమందికిపైగా ప్రత్యక్షఉపాధిని కల్పిస్తున్నామన్నారు. నిరం తరంసేవలతో మెక్‌డెలి వరీ, డిజర్ట్‌కియోస్క్‌లతో సహా వివిధ ఫార్మాట్లలో కార్యకలాపాలున్నాయి. మెనూల్లో బర్గర్స్‌, ఎంగర్‌ఫుడ్స్‌, రాప్స్‌,హాట్‌ శీత లపానీయాలతో పాటు విస్తృతశ్రేణిలోని డెజర్ట్స్‌ ఉన్నాయన్నారు. దేశంలోని రిటైల్‌ కంపెనీల్లో నంబర్‌వన్‌ యాజమాన్య సంస్థగా హెచ్‌ఆర్‌పిఎల్‌ నిలిచిందని గెరాల్డ్‌ డయాస్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మెక్‌డొనాల్డ్‌ ప్రారంభంతో దక్షిణాది మార్కెట్‌లో తమ ఉనికిని మరింత పటిష్టం చేసుకోగలమని మెక్‌డొనాల్డ్‌ డైరెక్టర్‌ వెల్లడించారు.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV షమీ భార్య గురించి షాకింగ్ నిజాలు టీమిండియా బౌలర్ షమీ ఎపిసోడ్‌ సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్‌లా కొనసాగుతోంది.భార్య ఆరోపణల్ని షమీ కొట్టిపారేయడం... హసిన్ జహన్ మాత్రం భర్తను టార్గెట్ చేయడం ఇలా స్టోరీ నడుస్తూనే ఉంది. అయితే ఈ వ్యవహారంలో షమీ భార్య మొదటి భర్త మౌనం వీడాడు. జహన్ గురించి సైఫుద్దీన్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. TNN | Updated: Mar 14, 2018, 05:34PM IST టీమిండియా బౌలర్ షమీ ఎపిసోడ్&zwnj; సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్&zwnj;లా కొనసాగుతోంది.భార్య ఆరోపణల్ని షమీ కొట్టిపారేయడం... హసిన్ జహన్ మాత్రం భర్తను టార్గెట్ చేయడం ఇలా స్టోరీ నడుస్తూనే ఉంది. అయితే ఈ వ్యవహారంలో షమీ భార్య మొదటి భర్త మౌనం వీడాడు. జహన్ గురించి సైఫుద్దీన్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 2010లో తనకు జహన్ విడాకులు ఇచ్చిందని... ఇద్దరు ఆడపిల్లల్ని ఆమెతోనే పంపాలని కోర్టు ఆదేశించిందట. అయితే షమీతో వివాహం తర్వాత ఆమె ఇద్దర్ని సైఫుద్దీన్ దగ్గరకే పంపిందట. అప్పటి నుంచి వారిద్దరు ఇక్కడే పెరిగారు. ఇద్దరు పిల్లల్లో పెద్దమ్మాయి ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. మరో పాప ఆరో తరగతి. అయితే ఇద్దరు పిల్లలు షమీ దగ్గర ఉన్నప్పుడు పప్పా అని పిలిచేవారట. అయితే పెద్ద కూతురు స్కూల్&zwnj;కు వెళ్లే సమయంలో షమీ జహన్ సంబంధంపై ఆమెను అందరూ ప్రశ్నిస్తున్నారట. షమీ నిజంగా తప్పు చేశాడా అని అడిగారట. దానికి ఆమె వాళ్లు అపోహలు పోయి... కలుస్తారని చెప్పిందట. అంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు... షమీ ఆ ఇద్దరు అమ్మాయిలపై ఎలాంటి ప్రేమ చూపించాడో... Read This Story In Bengali   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బంగారం ధగధగ - ఒకే రోజు రూ.990 ప్రియం న్యూఢిల్లీ : అమెరికా విధానాలకు తోడు హరికేన్‌ ఇర్మా ప్రభావంతో ప్రపంచ మార్కెట్లో బంగారం ధర భగ్గుమంటుంది. ఈ ప్రభావం శుక్రవారం భారత బులియన్‌ మార్కెట్‌పై కూడా పడింది. ప్రస్తుత ఏడాదిలో ఎప్పుడూ లేని విధంగా శుక్రవారం ఒకే రోజు ఏకంగా రూ.990 పెరిగి రూ.31,350కి ఎగిసింది. ప్రపంచ మార్కెట్లోనూ బంగారం ధర ఏడాది గరిష్టానికి చేరింది. కాగా న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.990 పెరిగి వరుసగా రూ.31,350, రూ.31,200గా నమోదయ్యింది. నవంబర్‌ 2016న బంగారం ధర ఈ స్థాయిలో పలికింది. కాగా కిలో వెండిపై రూ.100 పెరిగి రూ.42,000కు చేరింది. 100 వెండి నాణేల ధర యథాతథంగా రూ.74,000గా నమోదయ్యింది. ప్రధాన కారణాలు.. పసిడి ధర అమాంతం పెరగడానికి ప్రధానంగా ట్రంపు నిర్ణయాలు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్లో డాలర్‌ విలువ పడిపోవడంతో మదుపర్లు బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు అమెరికా, దక్షిణ కొరియా మద్దతుతో ఉత్తర కొరియాను కవ్వించడంతో ముందు జాగ్రత్తగా ఉత్తర కొరియా చేస్తున్న ఆయుధ ప్రయోగాలు ప్రపంచ మార్కెట్లో అనిశ్చిత్తిని పెంచుతున్నాయి. దీనికి తోడు అమెరికాలో ఉపాధి రేటు అంచనాల కంటే దిగువన నమోదు కావడం బంగారానికి డిమాండ్‌ కల్పిస్తోంది. సహజంగా సంక్షోభ పరిస్థితుల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు సురక్షితమైనదిగా పరిగణించే పసిడిపై పెట్టుబడులు పెడతారు. అంతర్జాతీయ కమోడిటీ ఎక్సేంజీలో గడిచిన రెండు నెలల్లో పసిడి ఔన్స్‌ (31.1 గ్రా) ధర దాదాపు 150 డాలర్లు పెరిగింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ఎన్నికల ఫలితాలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఫతేమైదాన్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం, హెచ్‌సిఏకు గతంలో ఎన్నికలు నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే ఈ ఎన్నికలను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం మాజీ ప్రధాని కార్యదర్శి జాన్‌ మనోజ్‌ హై కోర్టును ఆశ్రయించడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి హై కోర్టులో ఇరువురి వాదోపాదాలు విన్న హై కోర్టు ఎట్టకేలకు హెచ్‌ఏసికు నిర్వహించిన ఎన్నికల ఫలితాలను విడుదల చేయాలని గురువారం నాడు హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఎన్నికల అధికారులు ఈ ఫలితాలు విడుదల చేసేందుకు సనసిద్ధం అవుతున్నట్లు తెలిసింది. నేడో రేపో ఈ ఫలితాలు విడుదల కానున్నావి. అధ్యక్ష పదవికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు, మాజీ ఎంపి పార్లమెంట్‌ సభ్యుడు జి.వివేక్‌, జయసింహ్మ పోటీపడిన విషయం మనందరికి తెలిసిందే వీరిలో ఎవరు గెలుస్తారో ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనున్నది. వీరితో పాటు ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, సభ్యులకు సబందించిన ఫలితాలు కూడా వెలువడనున్నావి. ప్రధాన కార్యదర్శి పోటీకి ఇప్పటికే శేషు నారాయణ ఏక గ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో హైదరాబాద్‌ క్రికెట్‌సంఘంలో కొందరు వ్యక్తులు ప్రస్తుతం పాలకమండలి పదవి ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని రంగారెడ్డిజిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అందుకు అనుగుణంగానే రంగారెడ్డి జిల్లా కోర్టు తక్షణమే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని అదేశించింది. అందుకు అనుగుణంగానే రంగారెడ్డి కోర్టు సీనియర్‌ న్యాయవాదిని ఎన్నికల అధికారిగా నియమించడం జరిగింది. ఈ ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, రంగారెడ్డి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు డిస్‌మిస్‌ చేయాలని అప్పటి పాలకమండలి సభ్యులు కొందరు హై కోర్టును ఆశ్రయించడం జరిగింది. వాదనలు విన్న హై కోర్టు అప్పటి పాలకమండలిలోని ఒక వ్యక్తి వేసిన ఫిటిషన్‌ను గురువారం నాడు కొట్టి వేసి రంగారెడ్డి జిల్లాకోర్టు ఇచ్చి ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Shikhar Dhawanని హెచ్చరించిన గవాస్కర్ టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఓపెనర్ శిఖర్ ధావన్ పేలవ ఫామ్‌ టీమిండియాలో కంగారు పెంచుతోంది. ఎడమచేతి వాటం ఓపెనర్ కావడంతో.. ప్రస్తుతానికి ఎవరూ ప్రత్యామ్నాయం కూడా కనిపించడం లేదు. కానీ..? Samayam Telugu | Updated: Nov 5, 2019, 02:45PM IST Shikhar Dhawan భారత జట్టు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌పై వేటు కత్తి వేలాడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గత ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 42 బంతులాడిన ధావన్ 41 పరుగులు చేసి పేలవంగా రనౌటయ్యాడు. ఓపెనర్‌గా వచ్చిన ధావన్ 15 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. కేవలం మూడు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే బాదగలిగాడు. దీంతో.. టీమ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచినా.. అతని ఇన్నింగ్స్‌కి విలువ లేకుండా పోయింది. మిగిలిన రెండు టీ20ల్లోనూ ధావన్ ఇదే తరహాలో ఆడితే..? జట్టులో స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పరోక్షంగా హెచ్చరించాడు. Read More: కెప్టెన్సీ తప్పిదాన్ని ఒప్పుకున్న రోహిత్ శర్మ భారత టెస్టు జట్టులో ఇప్పటికే స్థానం కోల్పోయిన శిఖర్ ధావన్ .. వరల్డ్ కప్ తర్వాత వన్డే, టీ20ల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడం లేదు. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో బంతిని మిడిల్ చేసేందుకు తొలి పవర్ ప్లేలో ఆపసోపాలు పడిన ఈ సీనియర్ ఓపెనర్.. 10వ ఓవర్ తర్వాత బ్యాట్ ఝళిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి మరీ షాట్స్ ఆడాడు. కానీ.. కీలక సమయంలో రిషబ్ పంత్‌తో సమన్వయ లోపం కారణంగా ధావన్ రనౌటయ్యాడు. మొత్తంగా.. అతని 41 పరుగుల నెమ్మది ఇన్నింగ్స్‌ విమర్శలపాలైంది. Read More: Delhi T20లో బంగ్లాదేశ్ క్రికెటర్లకి వాంతులు ‘బంగ్లాదేశ్‌తో మిగిలిన ఉన్న రెండు టీ20ల్లోనూ ఒకవేళ శిఖర్ ధావన్ ఫెయిలైతే..? జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు మొదలవుతాయి. టీ20ల్లో బంతులతో సమానంగా ఓ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం టీమ్‌కి ఏమాత్రం లాభించదు. ఈ విషయంలో అతను కచ్చితంగా పునరాలోచించుకోవాలి. లయ అందుకోవడానికి సమయం పడుతుంది.. నిజమే.. కానీ.. సిరీస్‌లో అతను తన సత్తా నిరూపించుకోక తప్పదు’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. Read More: పేరుకేమో పవర్ హిట్టర్.. షాట్ మాత్రం..? ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. టీమ్‌లోని ఆటగాళ్లకి రెండు మూడు అవకాశాలు మించి ఇవ్వలేమని ఇటీవల కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ఒకవేళ ధావన్.. ఈ బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఫెయిలైతే.. అతని స్థానంలో మళ్లీ కేఎల్ రాహుల్ లేదా మరొకరు ఓపెనర్‌గా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV లవ్, ఎమోషన్, సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యకావ్యం పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై, శ్రీమంతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో ప్రొడక్షన్ నెం.3గా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం దృశ్యకావ్యం. TNN | Updated: Jan 23, 2016, 03:53PM IST లవ్, ఎమోషన్, సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యకావ్యం పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై, శ్రీమంతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో ప్రొడక్షన్ నెం.3గా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం దృశ్యకావ్యం. ఈ చిత్రం సరికొత్త కథాంశంతో, ఆద్యంతం ఉత్కంఠ భరితంగా లవ్, ఎమోషన్, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ఈ చిత్రం ద్వారా బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... దృశ్యకావ్యం చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత అటు బిజినెస్ పరంగాను... ఇటు ఇండస్ట్రీ వర్గాల ద్వారా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. దర్శకుడు రామకృష్ణారెడ్డి ఓ మంచి పాయింట్ తో లవ్, ఎమోషన్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని జోడించి రూపొందించారు. కథ, కథనం కొత్తగా ఉంటాయి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కొత్త దర్శకుడైనా... అనుభవమున్న దర్శకుల చిత్రాల్లో కనిపించే స్క్రీన్ ప్లే ఈ చిత్రంలో చూపించాడు. ప్రాణం కమలాకర్ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి మెలొడీ పాటలు అందించడంలో ఆయనకు ప్ర్తత్యేక గుర్తింపు ఉంది. దృశ్యకావ్యం కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధతో మంచి పాటలందించారు. ఆడియోకు అద్భుతమైన స్పందన తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం. పాటలు ఈ చిత్రానికి ప్రాధాన ఎస్సెట్. హీరో కార్తిక్ , హీరోయిన్ కాశ్మీరా మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఎంటర్ టైన్ మెంట్ కు స్కోప్ ఉన్న చిత్రం కాబట్టి అన్ని వర్గాల్ని తప్పకుండా అలరిస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అని అన్నారు. కార్తిక్, కాశ్మీరా కులకర్ణి (నూతన పరిచయం), డా.ఆలి , పృథ్వీ రాజ్, జీవ, సత్యం రాజేష్, శాని, మధునందన్, బేబి హాసిని, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, రచ్చ రవి, రాకేష్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో అలరించనున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
SHOOTING- Winners షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో షఫీఖ్‌, సుభాష్‌లకు స్వర్ణాలు హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో రాష్ట్రానికి చెం దిన షూటర్లు వికార్‌ అహ్మద్‌ పఫీఖ్‌, సుభాష్‌ చింతలపాటి సత్తా చాటారు. గచ్చిబౌలీలోని శాట్స్‌ షూటింగ్‌ రేంజ్‌లో జరిగిన పోటీల్లో స్కీట్‌ పురుషుల విభాగంలో పఫీఖ్‌ 69పాయింట్లు స్కోర్‌చేసి అగ్రస్థానాన్ని దక్కించుకు న్నాడు. గుస్తీనోరియా (68పాయింట్లు),సుభాష్‌ చింతలపాటి (63పాయింట్లు) వరుసగా రజత, కాంస్యపతకాలను సొంతం చేసుకున్నారు. స్కీట్‌ జూనియర్‌ పురుషుల విభాగంలో సుభాష్‌(63పాయింట్లు),మునెక్‌ బత్తుల (53పాయిం ట్లు),విరాజ్‌ (40పాయింట్లు), వరుసగా తొలి 3స్థానాల్లో నిలిచారు. జూనియర మహిళల విభాగంలో ఎన్‌.సోనాలిరాజ్‌ 50పాయింట్లు స్కోర్‌ చేసి పసిడి పతకం కైవసం చేసుకుంది.ఆంధ్రప్రదేశ్‌లో రైఫిల్‌ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్‌ (56పా యిం ట్లు),చక్రవర్తి (47పాయింట్లు),మౌక్తిక కిరణ్‌రెడ్డి (46పాయింట్లు) సాధించారు.
2sports
శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ First Published 11, Sep 2017, 1:11 AM IST శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్ Recent Stories
0business
Hyderabad, First Published 20, Aug 2019, 4:16 PM IST Highlights ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్. అయితే ఇప్పటివరకు సినిమాకి హీరోయిన్ ఫైనల్ కాలేదు. పనులు కూడా అనుకున్నట్లు జరగడం లేదు. ఇప్పటికే సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తికావాల్సివుంది. కానీ ఏది అనుకున్నట్లు జరగడం లేదు. అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేశారు. చాలా మంది హీరోల వారసులతో పోల్చుకుంటే అఖిల్ చూడడానికి అందంగా ఉండడంతో పాటు డాన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగా చేయగలడు. కానీ హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నాడు.  ఇప్పటివరకు హీరోగా అతడు చేసిన మూడు సినిమాలు సరైన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు సినిమాకి హీరోయిన్ ఫైనల్ కాలేదు. పనులు కూడా అనుకున్నట్లు జరగడం లేదు. ఇప్పటికే సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తికావాల్సివుంది. కానీ ఏది అనుకున్నట్లు జరగడం లేదు. దీంతో నాగార్జునకి టెన్షన్ మొదలైంది. ఇటీవల అతడు నటించిన 'మన్మథుడు 2' సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అదొక బాధలో ఉంటే మరోపక్క చిన్న కొడుకుని హీరోగా సెటిల్ చేయలేకపోతున్నాననేది మరో బాధ. ఈ ఆలోచనలతో నాగార్జున బెంగ పెట్టుకున్నాడని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అఖిల్ మాత్రం బొమ్మరిల్లు బాస్కర్ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. కనీసం ఈసారైనా అఖిల్ కి అదృష్టం కలిసొచ్చి సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!
0business
హీరోయిన్లకు కెరీర్ లో ఒక్కసారైనా ఇలాంటి సినిమాలు పడాలి! First Published 15, Sep 2019, 12:21 PM IST హీరోయిన్లుగా రాణించాలని చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి వస్తారు. కానీ వారిలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యేది కొందరే. కమర్షియల్ చిత్రాలతో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మెప్పిస్తే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలా టాలీవుడ్ హీరోయిన్లు అద్భుతమైన నటనతో అవార్డులు గెలుచుకున్న హీరోయిన్లు, వారు నటించిన చిత్రాలు ఇవే! విజయశాంతి: లేడి సూపర్ స్టార్ విజయశాంతి 1990లో విడుదలైన కర్తవ్యం చిత్రంతో దేశం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది. ఆ చిత్రానికి గాను విజయశాంతికి ఉత్తమనటిగా జాతీయ అవార్డు లభించింది. ఇక ఒసేయ్ రాములమ్మా, ప్రతి ఘటన లాంటి చిత్రాలకు ఉత్తమనటిగా నంది అవార్డు సొంతం చేసుకుంది. సౌందర్య : దివంగత నటి సౌందర్య తన కెరీర్ లో పవిత్రబంధం, అమ్మోరు, అంతఃపురం చిత్రాలకు ఉత్తమ నటిగా నంది అవార్డు గెలుచుకుంది. రమ్యకృష్ణ : రమ్యకృష్ణ సూపర్ స్టార్ రజినీకాంత్ కు పోటాపోటీగా నటించిన చిత్రం నరసింహా. ఈ చిత్రానికి గాను రమ్య కృష్ణ తమిళనాడులో అనేక అవార్డులు సొంతం చేసుకుంది. కంటే కూతుర్నే కను చిత్రానికి గాను తెలుగులో నంది అవార్డు గెలుచుకుంది. బాహుబలి చిత్రంలో శివగామి పాత్రకు పలు ఫిలిం ఫేర్ అవార్డులు లభించాయి. శ్రీదేవి : ఆలిండియా లేడి సూపర్ స్టార్, దివంగత నటి శ్రీదేవి వెంకటేష్ సరసన నటించిన క్షణ క్షణం చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డు సొంతం చేసుకుంది. తమిళం, హిందీ చిత్రాల్లో కూడా శ్రీదేవికి పలు అవార్డులు దక్కాయి. ఆమని : సీనియర్ హీరోయిన్ ఆమని మిస్టర్ పెళ్ళాం, శుభ సంకల్పం చిత్రాలకు ఉత్తమ నటిగా నంది అవార్డు సొంతం చేసుకుంది. ఇక ఆల్ టైం సూపర్ హిట్ శుభలగ్నం చిత్రానికి ఆమెకు ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. రోజా : సర్పయాగం, స్వర్ణక్క చిత్రాలకు రోజా నంది అవార్డు గెలుచుకుంది. మీనా: నటి మీనా తన కెరీర్ ఆరంభంలోనే సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో నటిగా అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ చిత్రంలో మీనా ఏఎన్నార్ కు మానవరాలిగా నటించింది. ఈ చిత్రానికి గాను మీనాకు ఉత్తమనటిగా నంది అవార్డు లభించింది. రాజేశ్వరి కళ్యాణం అనే మరో చిత్రానికి కూడా మీనా నంది అవార్డు గెలుచుకుంది. అనుష్క: అరుంధతి చిత్రానికి గాను అనుష్క నంది స్పెషల్ జ్యూరి అవార్డుని సొంతం చేసుకుంది. బాహుబలి, రుద్రమదేవి లాంటి చిత్రాలకు అనుష్కని అనేక ఫిలిం ఫేర్ అవార్డులు వరించాయి. సమంత : సమంత తన కెరీర్ లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తన తెలుగు డెబ్యూ మూవీ ఏ మాయ చేసావే చిత్రంతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకుంది. ఇంకా మనం, అత్తారింటికి దారేది, అ..ఆ, రంగస్థలం చిత్రాలకు అనేక ఫిలిం ఫేర్ అవార్డులు లభించాయి. నయనతార : నయనతార శ్రీరామ రాజ్యం చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది అవార్డు సొంతం చేసుకుంది. కీర్తి సురేష్ : లేటెస్ట్ సెన్సేషన్ కీర్తి సురేష్ మహానటి చిత్రంతో ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు లభించింది. ప్రియమణి : ప్రియమణి 2006లో జాతీయ ఉత్తమ నటిగా పరుత్తివీరన్ అనే తమిళ చిత్రానికి అవార్డు సొంతం చేసుకుంది. Recent Stories
0business
Mar 24,2015 త్వరలోనే ఎస్‌6 తయారీ భారత్‌లో                    న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ విక్రయ సంస్థ సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి గెలాక్సీ6, గెలాక్సీ 6ఎడ్జ్‌ మోడళ్లను విడుదల చేసింది. 5.1 అంగుళాల పరిమాణం కలిగిన ఎస్‌6 ప్రారంభ ధర రూ.49,900గా నిర్ణయించింది. 16 మెగాఫిక్సల్‌ కెమెరా, ముందువైపు 5మెగా ఫిక్సల్‌ కెమెరా, 3జిబి ర్యామ్‌, అక్టాకోర్‌ ప్రాసెసర్‌తో దీన్ని అందిస్తోంది. ఎస్‌6 ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలోనే తొలి డ్యూయల్‌ వంపు స్క్రీన్‌తో రూపొందించింది. దీని ప్రారంభ ధర రూ.58,990గా నిర్ణయించింది. వంపు స్క్రీన్‌ మొబైళ్లకు మంచి డిమాండ్‌ ఉందని సామ్‌సంగ్‌ ఇండియా మొబైల్‌ అండ్‌ ఐటి బిజినెస్‌ మెడ్‌ ఆసిమ్‌ వార్సి పేర్కొన్నారు. ఈ రెండు మోడళ్లు తమ కంపెనీకే అత్యంత విలువైనవని పేర్కొన్నారు. ఎస్‌6 భారత్‌లో తయారు కానుందని తెలిపారు. అయితే ఎప్పటి నుంచి ఇక్కడ తయారు చేసే కాలపరిమితిని వెల్లడించలేదు. ఎస్‌6 స్మార్ట్‌ఫోన్‌ 2550 ఎంఎహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. ఎస్‌6ఎడ్జ్‌ను 2600ఎంఎహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో అందిస్తుంది. ఈ రెండు ఉత్పత్తులు ఆండ్రాయిడ్‌ 5.0 లొల్లిపొప్‌ ఒఎస్‌తో అభివృద్ధి చేశామన్నారు. ఈ మొబైళ్లు 32జిబి, 64జిబి, 124 జిబి అంతర్గత సామర్థ్యంతో లభిస్తాయన్నారు. స్టోరేజీ సామర్థ్యం బట్టి ఎస్‌6 ధరలు రూ.49,990, 55,990, రూ.60,999గా నిర్ణయించామని చెప్పారు. ఎస్‌6ఎడ్జ్‌ ధరలు 32జిబి రూ.58,900, 64జిబి రూ.64,900, 128 జిబి రూ.70,900గా ప్రకటించారు. 4జికి మద్దతు చేసే ఈ మొబైళ్ళ ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించామన్నారు. ఏప్రిల్‌ 10 నుంచి అన్ని రిటైల్‌ స్టోర్లలో లభిస్తాయన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 9, Feb 2019, 12:46 PM IST Highlights నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమా కథ కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం.  నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమా కథ కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. ప్రముఖ ఇండియన్ క్రికెటర్ రామన్ లంబా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇండియా తరఫున మ్యాచ్ లో పాల్గొన్న సమయంలో బాల్ వచ్చి అతడి ముఖంపై తగలడంతో టెంపొరల్ బోన్ దెబ్బ తిని కోమాలోకి వెళ్లిపోయాడు. అలా మూడు రోజులుకోమాలో ఉన్న తరువాత అతడు చనిపోయాడు. ఈ సంఘటనను సినిమా కథలో క్లైమాక్స్ గా చూపించబోతున్నారు. అంటే కథ ప్రకారం సినిమాలో హీరో చనిపోతాడన్నమాట. ఈ సినిమాలో నాని మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. అతడి చిన్నతనం నుండి కథ మొదలవుతుందని సమాచారం. యంగ్ రంజీ ప్లేయర్ గా, ఒక తండ్రిగా నాని కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సమ్మర్ లో సినిమాను విడుదల చేయనున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా కనిపించనుంది.   Last Updated 9, Feb 2019, 12:46 PM IST
0business
Hyderabad, First Published 2, Oct 2018, 10:38 AM IST Highlights ఇక పూర్తి స్థాయి కెప్టెన్‌కు సిద్ధమా? అన్న ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా రెడీ అన్నాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా అన్నట్లు మాట్లాడాడు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై వ్యతిరేకత మొదలౌతోందా..? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఆసియా టోర్నీకి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతి ఇవ్వడంతో తాత్కలికంగా రోహిత్‌ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. తన కూల్‌ కెప్టెన్సీతో ఒక్క మ్యాచ్‌ ఓడకుండా జట్టుకు విజయానందించాడు.  క్లిష్ట సమయాల్లో తను తీసుకునే నిర్ణయాలు మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్సీని గుర్తు చేశాయి. ఈ విషయాన్ని తను కూడా అంగీకరించాడు. తన కెప్టెన్సీపై ధోని ప్రభావం ఎక్కువగా ఉందని, అతని లోని లక్షణాలు తనలో కూడా ఉన్నాయని చెప్పాడు. ఇక పూర్తి స్థాయి కెప్టెన్‌కు సిద్ధమా? అన్న ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా రెడీ అన్నాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా అన్నట్లు మాట్లాడాడు. దీంతో రోహిత్‌ శర్మకు  లిమిటెడ్‌ ఓవర్‌ క్రికెట్‌ పగ్గాలు ఇవ్వాలని అతని అభిమానులు, క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ సారథిగా రోహిత్‌ మూడుసార్లు టైటిల్‌ అందించాడని, కోహ్లి మాత్రం ఒక్క టైటిల్‌ కూడా అందించలేకపోయాడని గుర్తు చేస్తున్నారు . రోహిత్‌ యువజట్టుతోనే నిదహాస్‌ ట్రోఫీ, ఆసియాకప్‌ గెలిపించాడని చెబుతున్నారు. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్‌ అని, కానీ కెప్టెన్‌ మాత్రం కాదంటున్నారు.  అతనికి ఫైనల్‌ ఫీవర్‌ కూడా ఉందని, అతని దూకుడు.. కోపం కెప్టెన్స్‌పై ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. జట్టు ఎంపికలో, ఫీల్డింగ్‌ మార్పుల్లో కోహ్లి విఫలమవుతున్నాడని, ఏ సమయంలో ఎవరితో బౌలింగ్‌ చేయించే విషయంలో కూడా కోహ్లి ఇబ్బంది పడుతున్నారని రోహిత్‌ ఫ్యాన్స్‌ విశ్లేషిస్తున్నారు. దీన్ని విరాట్‌ ఫ్యాన్స్‌ సైతం కొట్టి పారేస్తున్నారు. కోహ్లి కెప్టెన్సీలో భారత్‌ సాధించిన విజయాలే అతని కెప్టెన్సీకి నిదర్శనమని కౌంటర్‌ ఇస్తున్నారు. Last Updated 2, Oct 2018, 10:38 AM IST
2sports
వెస్టిండీస్‌ 196/3 (19.4 ఓవర్లు) సైమన్సన్‌ 83 పరుగులతో నాటౌట్‌ ముంబై : వరల్డ్‌ టి20లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ మొదట టీమిండియాను బ్యాటింగ్‌ చేయాల్సిందిగా కోరింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 19.4 ఓవర్లలో 3 వికెట్ల 196 పరుగులు చేసింది. దీంతో టీమిండియాపై వెస్టిండీస్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.వరల్డ్‌ టి20 ఫైనల్‌కు చేరుకున్న వెస్టిండీస్‌ ఇంగ్లండ్‌ను ఢొకొననుంది. కాగా కోహ్లీ మరోసారి మెరుపులు మెరిపించాడు. కోహ్లీ 47 బంతులు ఆడి 11 బౌండరీలు,1 సిక్సర్‌తో 89 పరుగులు చేశాడు.కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లీకి అదృష్టం కలిసి వచ్చింది. టీమిండియా స్కోరు ఒక వికెట్‌ నష్టానికి 68 పరుగులు వద్ద ఉండగా కోహ్లీ రెండు సార్లు రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.అది కూడా ఒకే బంతికి కావడం ఇక్కడ గమనార్హం. ఇన్నింగ్స్‌ తొమ్మిదవ ఓవర్‌లో భాగంగా బ్రావో వేసిన మూడవ బంతి నోబాల్‌ అయింది కాగా అప్పటికే క్రీజు వదిలి బయట ఉన్న  కోహ్లీని రనౌట్‌ చేద్దామని రామ్‌డిన్‌ ప్రయత్నించినా సఫలం కాలేదు.అదే బంతికి బౌలర్‌ ఎండ్‌లో ఉన్నఏస్‌ పరుగెత్తుకొచ్చి మరోసారి రనౌట్‌ చేయాలని యత్నించినా అది వికెట్లకు దూరంగా వెళ్లింది.దీంతో కోహ్లీకి వరుసగా రెండు లైఫ్‌లు లభించాయి. దీంతో టీమిండియా భారీ స్కోర్‌ చేయగలిగింది. ఓపెనర్‌ రోహిత్‌శర్మ 31 బంతులు ఆడి 3 బౌండరీలు,3 సిక్సర్లతో 43 పరుగులు చేసి ధాటిగా ఆడగా,అజింక్యా రహానె 35 బంతులు ఆడి 2 బౌండరీలతో 40 పరుగులతో సమయోచిత బౌలింగ్‌ చేశాడు. అయితే జట్టు స్కోరు 62 పరుగుల వద్ద రోహిత్‌శర్మను బద్రీ ఎల్‌బిడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు.కాగా ఈ సమయంలో రహానేకు జత కలిసిన కోహ్లీ ఆదిలో ఆచితూచి బ్యాటింగ్‌ చేసినా తరూవత తనదైన మార్క్‌ ఆటతో రెచ్చిపోయాడు. అతనికి ధోనీ 15 పరుగులతో అండగా నిలిచాడు.వెస్టిండీస్‌ బౌలర్లలో రస్సెల్‌కు 1 వికెట్‌,బద్రిలకు 1 వికెట్‌ లభించింది. ఫలించిన టీమిండియా వ్యూహం వెస్టిండీస్‌తో టి20 ప్రపంచ కఫ్‌ సెమీస్‌లో టీమిండియా వ్యూహం ఫలించింది. కాగా ఈ టోర్నీలో సరిగా ఆడలేకపోతున్న శిఖర్‌ ధవన్‌ను పక్కనబెట్టి అతని స్థానంలో అజింక్యా రహానెను తుది జట్టులోకి తీసుకోవడం సత్పలితాన్నిచ్చింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్‌శర్మ,రహానె శుభారంభాన్నందించారు. కాగా రోహిత్‌ 43 పరుగులు చేయగా,రహానె 40 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌ 196 పరుగులు టీమిండియా తరువాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 19.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.కాగా ఓపెనర్‌ చార్లెస్‌ 36 బంతులు ఆడి 7 బౌండరీలు,2 సిక్సర్లతో 52 పరుగులు చేసి కోహ్లీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ గేల్‌ 6 బంతులు ఆడి 1 బౌండరీతో 5 పరుగులు చేసి బూమ్రా బౌలింగ్‌లో ఔట్‌ కాగా సామ్యూల్స్‌ 7 బంతులు ఆడి 5 సిక్సర్లతో 82 పరుగులతో,రసెల్‌ 20 బంతులతో 3 బౌండరీలు,4 సిక్సర్లతో 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ​ 350 లక్ష్యాన్ని భారత్ ఛేదించగలదు: పుజారా దక్షిణాఫ్రికాతో కేప్‌ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు 350 పరుగుల లక్ష్యాన్నైనా ఛేదించగలదని మిడిలార్డర్‌ TNN | Updated: Jan 7, 2018, 08:12PM IST దక్షిణాఫ్రికాతో కేప్&zwnj; టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు 350 పరుగుల లక్ష్యాన్నైనా ఛేదించగలదని మిడిలార్డర్&zwnj; బ్యాట్స్&zwnj;మెన్ చతేశ్వర్ పుజారా ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్&zwnj;మెన్ తొలి ఇన్నింగ్స్&zwnj;లో విఫలమైనా.. పిచ్&zwnj; క్రమంగా మారుతున్న నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్&zwnj;లో రాణిస్తారని పుజారా వివరించాడు. మ్యాచ్&zwnj;లో మూడో రోజైన ఆదివారం ఒక బంతి కూడా పడకుండానే వర్షం కారణంగా ఆట రద్దయింది. ప్రస్తుతం 142 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా.. రెండో ఇన్నింగ్స్&zwnj;ని 65/2తో శనివారం ముగించిన విషయం తెలిసిందే. సోమవారం ఆట జరిగితే కనీసం 300పైచిలుకు లక్ష్యాన్ని భారత్&zwnj;కి నిర్దేశించాలని సఫారీలు భావిస్తున్నారు. &lsquo;నిజాయితీగా చెప్పాలంటే భారీ లక్ష్యాన్ని భారత్ ఛేదించలేదు. కానీ.. వికెట్ క్రమంగా మారుతున్న నేపథ్యంలో 350 పరుగుల లక్ష్యాన్ని అయితే సులువుగా ఛేదించగలదు. తొలి ఇన్నింగ్స్&zwnj;లో ఆశించిన మేర భారత బ్యాట్స్&zwnj;మెన్ ఆకట్టుకోలేకపోయారు. కానీ.. రెండో ఇన్నింగ్స్&zwnj;లో తప్పకుండా రాణిస్తారు. మ్యాచ్ ఆరంభం నుంచి బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నా.. బ్యాట్స్&zwnj;మెన్&zwnj; విఫలమయ్యారు. టాప్ ఆర్డర్ గాడిన పడితే.. కచ్చితంగా సఫారీలకి గట్టి పోటీనివ్వగలం&rsquo; అని పుజారా వివరించాడు.
2sports
Visit Site Recommended byColombia ఆ తరవాత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నేహా.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టింది. ఏడాదిన్నర క్రితం నుంచే మళ్లీ దేశీ క్రికెట్&zwnj;లో ఆడటం మొదలుపెట్టింది. ఇప్పుడు 31 ఏళ్ల వయసులో భారత &lsquo;ఎ&rsquo; జట్టుకు ఎంపికైంది. వచ్చే నెలలో బంగ్లాదేశ్&zwnj;తో జరగనున్న వన్డే సిరీస్&zwnj;లో భారత్-ఎ తరఫున బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్&zwnj; కర్ణాటకలోని ఆలూర్, హుబ్లి, బెల్గామ్&zwnj;లలో జరగనున్నాయి. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహిస్తున్న ఉమెన్స్ క్యాంప్&zwnj;లో పాల్గొంటున్న నేహాను టైమ్స్ గ్రూప్&zwnj;&zwnj;నకు చెందిన &lsquo;విజయ కర్ణాటక&rsquo; పలికరించింది. ఆమెతో కాసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా నేహా మాట్లాడుతూ.. తనకు మళ్లీ టీమ్ ఇండియా తరఫున ఆడాలనుందని వెల్లడించింది. &lsquo;ప్రతి మహిళ జీవితంలో అమ్మతనం చాలా ముఖ్యం. తల్లయిన తరవాత మా శరీరాకృతి, లైఫ్&zwnj;స్టైల్, ప్రాధాన్యతలు అన్నీ మారిపోతాయి. మా జీవితమే మారిపోతుంది. కానీ నా మనసు క్రికెట్ గురించే ఆలోచించేది. ఈ విషయంలో నా కుటుంబం నాకు అండగా నిలిచింది. అందుకే మళ్లీ క్రికెట్ ఆడగలుగుతున్నాను. నా భర్త (రీతు రాజ్), వదిన బాబును చూసుకుంటుంటే నేను ప్రాక్టీస్&zwnj;కు వెళ్తున్నాను. వాళ్లంతగా ప్రోత్సహించడం వల్లే నేనిప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాను&rsquo; అని నేహా చెప్పింది. &lsquo;మా బాబు పుట్టిన ఆరు నెలల తర్వాత బరువు తగ్గడం కోసం జాగింగ్ మొదలుపెట్టాను. కానీ ఎక్కవగా ఫిజికల్ ఎక్సర్&zwnj;సైజులు చెయ్యొద్దని డాక్టర్ నన్ను హెచ్చరించారు. కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. 7 నుంచి 8 నెలలు బాగా కష్టపడ్డాను. బరువు తగ్గాను. ఇప్పుడు మళ్లీ ఫీల్డ్&zwnj;లోకి అడుగుపెట్టాను. 2015-16 సమయంలో డీడీసీఏ సెలక్షన్ ట్రైల్స్&zwnj;లో పాల్గొన్నాను. ఢిల్లీ టీంలోకి నాకు అవకాశం వచ్చింది. ఇది క్రికెట్&zwnj;లో నాకు పునర్జన్మగా భావిస్తున్నాను. ఇప్పుడు బంగ్లాదేశ్&zwnj;తో ఆడేందుకు భారత మహిళల &lsquo;ఎ&rsquo; జట్టుకు ఎంపికయ్యాను. ఇప్పుడు మళ్లీ టీమ్ ఇండియాకు ఎంపికవ్వడమే నా లక్ష్యం&rsquo; అని తన మనసులోని మాటలను చెప్పింది నేహా తన్వార్.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
internet vaartha 187 Views దిగజారిన స్టాక్‌ మార్కెట్లు ముంబై : ప్రపంచ మార్కెట్లలో జోరుగా సాగిన అమ్మకాల ఒత్తిడి దలాల్‌స్ట్రీట్‌పై ఎక్కువ ప్రభావం చూపించింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజి నిప్టీ 102 పాయింట్లు దిగజారింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 24,287 పాయింట్లవద్ద ముగి సింది. 329పాయింట్లు క్షీణించగా నిఫ్టీ 50 7387 పాయింట్లవద్ద స్థిరపడింది. వారంలో మొదటిరోజు ఎక్కువ యూరోపియన్‌ మార్కెట్లలో అమ్మకాలు, అమెరికా మిశ్రమ గణాంకాలు అంతర్జాతీయ వృద్ధి పై అనిశ్చితిని పెంచాయి. ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టేంత వరకూ వివిధ దేశాల్లో నెలకొంటు న్న పరిస్థితులు స్థానిక మార్కెట్లను ప్రభావితంచేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబరు నెల స్థూల  జాతీయోత్పత్తి గణాం కాలు, రిటైల్‌ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టిసారించడం కూడా ఒక కారణమే. ఇన్వెస్టర్లు దేశంలో మిగిలి ఉన్న కార్పొ రేట్‌ కంపెనీల మూడోత్రైమాసిక ఫలితాల వెల్లడిపట్ల కూడా ఎక్కువ ఆసక్తిచూపించ డంతో పెట్టుబడులు, ట్రేడింగ్‌లలో అప్ర మత్త్తత ఎక్కువయింది. ఇక ఉక్కు ఎగుమ తులకు కనీస దిగుమతి ధరను ప్రకటించింది. చైనా దక్షిణకొరియా వంటి దేశాల దిగుమతు లను కట్టడిచేసి దేశీయ ఉక్కు ఎగుమతులను ప్రోత్సహించేందుకు ధరలు పెంచింది. యూరోపి యన్‌ మార్కెట్లపరంగా అమ్మకాల ఒత్తిడిపెరిగింది. ఫెడ్‌రిజర్వువైఖరిపై అనిశ్చితి నెలకొంది జర్మనీ డాక్స్‌, ఫ్రాన్స్‌ సిఎసి, లండన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ వంటివి రెండుశాతం చొప్పున క్షీణించాయి. ఇక ఆసియా మార్కెట్లపరంగాచూస్తే సింగపూర్‌, హాంకాంగ్‌ మెయిన్‌ల్యాండ్‌చైనా బెంచ్‌మార్క్‌ సూచీలు లూనార్‌ కొత్త సంవత్సరం కావడంతో సెలవు ప్రకటించాయి. జపాన్‌ నిక్కీ 0.6శాతం దిగువన ట్రేడింగ్‌ జరి పింది. ఇక దేశీయ మార్కెట్లలో ఐటిషేర్లు ఎక్కువ దిగజారాయి. నాస్‌డాక్‌పరంగా మరింత కనిపించింది. టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి సూచీలు 2-3శాతం దిగజా రాయి. ప్రొమియస్‌ఫార్మ రెడ్డిల్యాబ్స్‌ అనుబంధ సంస్థకు అమెరికా ఎఫ్‌డిఎ సోరియాసిస్‌ ఔషధం తయారీకి అనుమతినిచింది. టాటా మోటార్స్‌ కర్ణాటకలోని ధార్వాడ్‌ యూనిట్‌కు లాకౌట్‌ ప్రకటించింది. కార్మికుల సమ్మెతో ఉత్పత్తి దెబ్బతిన్నది. స్టాక్‌ నాలుగుశాతం దిగజారింది. ముడిచమురు ధరలపరంగా ఆసియాలో కొంత ఎక్కువ ప్రభావం చూపించాయి. సౌదీఅరేబియా, వెనిజులా మంత్రులు చమురుసరఫరాపై చర్చలు కొనసాగిస్తారని మార్కెట్‌ స్థిరీకరణకు సంప్రదిం పులు జరుపుతారన్న వార్తలతో కొంత క్షీణించాయి. ఒఎన్‌జిసి, రిలయన్స్‌ 1-2శాతం క్షీణిం చాయి. ఉక్కురంగంలో దిగుమతిధరల పెంపుకారణంగా కొంత లాభం కనిపిం చింది. చైనా, దక్షిణకొరియా ఉక్కు దిగు మతులపై కట్టడికి ధరలు పెంచడంతో స్థానిక మార్కెట్లలో జె ఎస్‌డబ్ల్యు స్టీల్‌, టాటాస్టీల్‌ వంటి వి 0.1నుంచి 1శాతం క్షీణించాయి జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌ దిగువన ముగిసాయి. బ్యాంకింగ్‌పరంగా యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంకులు 0.1 నుంచి 3శాతం చొప్పున క్షీణించాయి. హెచ్‌డి ఎఫ్‌సి జంట సంస్థలు రెండు శాతం చొప్పున దిగజారాయి. టాటాపవర్‌ ఒకటిశాతం దిగజారింది. నికర లాభాలు 88శాతం దిగజారి 24కోట్లకు నమోదు చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ నాలుగుశాతం పెరి గాయి. నికరలాభం 467 కోట్లకు చేరడమే ఇందుకు కీలకం. ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌, హైజీన్‌ హెల్త్‌కేర్‌ షేర్లు ఏడుశాతం పెరిగాయి. కంపెనీ 62శాతం నికరలాభాలు పెరిగినట్లు ప్రకటించింది. 148కోట్లుగా ప్రకటించడం కొంత కలిసొచ్చింది.
1entertainment
when nehra swore at ms dhoni for dropping a catch క్యాచ్ వదిలేశాడని నెహ్రా ధోనీని తిట్టిన వేళ.. క్యాచ్‌ల విషయంలో ఏ మాత్రం పొరబాటు చేసినా నెహ్రా ఉపేక్షించడు. ధోనీ అయినా మరెవరైనా అతడి ముందు కిమ్మనకుండా ఉండాల్సిందే. TNN | Updated: Nov 2, 2017, 01:51PM IST ఢిల్లీలోని ఫిరోజ్ షా స్టేడియంలో న్యూజిలాండ్&zwnj;తో టీ20 మ్యాచ్ ఆశిష్ నెహ్రా కెరీర్లో చివరి మ్యాచ్. సొంత గడ్డ మీద ఈ లెఫ్టార్మ్ పేసర్ సుదీర్ఘ ఆటకు వీడ్కోలు పలికాడు. కెరీర్లో అనేక పర్యాయాలు తీవ్ర గాయాలు వేధించినా నెహ్రా మాత్రం తిరిగి జట్టులోకి వచ్చి సత్తా చాటాడు. చక్కటి ఫిట్&zwnj;నెస్&zwnj;తో నెహ్రా కోహ్లికి పోటీనిస్తున్నాడని సెహ్వాగ్ ఇటీవల కామెంట్ చేశాడు. రోజూ 8 గంటలపాటు ప్రాక్టీస్ కోసం కష్టపడే నెహ్రాకు ఆట పట్ల కమిట్&zwnj;&zwnj;మెంట్ ఎక్కువ. ఏ మాత్రం పొరబాటు జరిగినా తట్టుకోలేడు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించడు. ఓ సారి క్యాచ్ వదిలేశారనే కారణంతో ధోనీని తిట్టేశాడు. ఈ ఘటన పాకిస్థాన్&zwnj;తో జరిగిన మ్యాచ్&zwnj;లో చోటు చేసుకుంది. నెహ్రా విసిరిన బంతి ఆఫ్రిదీ బ్యాటింగ్&zwnj;కు తగిలి కీపింగ్ చేస్తున్న ధోనీ, ఫస్ట్ స్లిప్&zwnj;లో ఉన్న ద్రవిడ్ మధ్య నుంచి దూసుకెళ్లింది. అప్పుడప్పుడే క్రికెట్లో సత్తా చాటుతున్న ధోనీ రెప్పపాటులో వెళ్లిన బంతిని అందుకోవడానికి ప్రయత్నించినా కుదర్లేదు. ఆఫ్రిదీ లాంటి హిట్టర్ క్యాచ్ వదిలేశాడనే కోపంతో నెహ్రా ధోనీని గట్టిగానే తిట్టాడు.
2sports
ఫ్లిప్‌కార్ట్ కు బిన్నీ అనుహ్య రాజీనామా! అలసత్వం, అమర్యాదక ప్రవర్తనే కారణమట.. - ఆరోపణలను పూర్తిగా ఖండించిన బన్సాల్‌.. - కొత్త సీఈవోగా సీఈవోగా కళ్యాణ్‌ కృష్ణమూర్తి ముంబయి: ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈవో బిన్నీబన్సల్‌ (37) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. విధి నిర్వహణలో అలసత్వం, తోటి సిబ్బందితో అమర్యా దకర ప్రవర్తన తదితర ఆరోపణలు వెల్లువెత్తడంతో బిన్నీ రాజీనామా చేసినట్టు సమాచారం. కంపెనీ ప్రధాన వాటాదారుగా ఉన్న వాల్‌మార్ట్‌ ఈ అంశంపై స్పందిస్తూ... రాజీనామా నిజమేనని.. అయితే తనపై వచ్చిన ఆరోపణలను బిన్నీ ఖండించారని తెలిపింది. దీనిపై పూర్తి విచారణ చేపడుతున్నట్టు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. బిన్నీ బన్సల్‌ వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదంటూ ఈ మధ్య కాలంలో ఆరోపణలతో వెల్లువెత్తాయి. కానీ ఈ ఆరోపణలను బిన్సీ బన్సాల్‌ తోసిపుచ్చారు. అయితే ఈ ఆరోపణలపై ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ సంయుక్తంగా స్వతంత్ర విచారణ చేపట్టాయి. బన్సల్‌ ఆరోపణలను తిరస్కరించినప్పటికీ తాము విచారణ చాలా జాగ్రత్తగా, నిశితంగా చేశామని వాల్‌మార్ట్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అదే సమయంలో బిన్నీపై చెలరేగిన ఆరోపణలపై సాక్ష్యం కనుగొన లేకపోయి నప్పటికీ, తీర్పులో ఇతర లోపాలను, ముఖ్యంగా బిన్నీ సమాధానంలో పారదర్శకత లేని కారణంగా బిన్నీ రాజీనామాను ఆమోదించామని తెలిపింది వాల్‌మా ర్ట్‌ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు సీఈవోగా కళ్యాణ్‌ కృష్ణమూర్తి కొనసాగుతారని ప్రకటించింది. వ్యవస్థాపకులిద్దరూ అవుట్‌.. అమెజాన్‌ మాజీ ఉద్యోగులైన సచిన్‌ బన్సాల్‌, బిన్నీ బన్సాల్‌ 2011లో ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రపంచ వ్యాపార దిగ్గజంవాల్‌మార్ట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో 77శాతం వాటాను కొనుగోలు చేయడంతో సచిన్‌ బన్సల్‌ తన పూర్తి వాటాను అమ్ముకొని వెళ్లిపోగా.. బిన్నీ బన్సల్‌ మాత్రం సీఈవోగా ఉన్నారు. ఈ-కామర్స్‌ మార్కె ట్‌లో మెగాడీల్‌గా పేరొందిన ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలల వ్యవధిలోనే తాజా పరిణామం చోటు చేసుకోవడం విశేషం. దీంతో ఫౌండర్లు ఇద్దరూ కంపెనీని వీడినట్టయింది. ఫ్లిప్‌కా ర్ట్‌లో ప్రత్యేక ప్లాట్‌ ఫాంలుగా ఉన్న మింత్రా, జబాంగ్‌ ను త్వరలోనే విలీనం చేయనున్నారు. బోర్డు సభ్యుడిగా కొనసాగుతా.. తన రాజీనామా విషయమై బిన్నీ బన్సల్‌ ప్రకటన విడుదల చేస్తూ కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అలాగే తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానని వెల్లడించారు. ఇది తనకు, తనర కుటుంబానికి పరీక్ష సమయమని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. సీఈవోగా రాజీనామా చేసినా ఫ్లిప్‌కార్ట్‌లో వాటాదారుడిగా, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ సభ్యుడిగా కొనసాగుతానని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV 11 ఏళ్ల‌లో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లోకి 2.6ల‌క్ష‌ల కోట్లు ప్ర‌భుత్వ రంగ బ్యాంకులంటే ఎక్కువ మూల‌ధ‌నం ప్ర‌భుత్వానిది అయి ఉండాలి. ఇందుకోసం ఏటా కేంద్ర ప్ర‌భుత్వం వాటికి నిర్ణీత మొత్తంలో మూల‌ధ‌నాన్ని స‌మ‌కూరుస్తుంది. దేశ ఆర్థిక రంగానికి బ్యాంకులు ఎంతో కీల‌కం క‌నుక ప్ర‌భుత్వం బ్యాంకుల్లోకి పంపే డ‌బ్బు విష‌యంలో కాస్త ఉదారంగానే ఉంటుంది TNN & Agencies | Updated: Feb 19, 2018, 04:08PM IST ప్ర&zwnj;భుత్వ రంగ బ్యాంకులంటే ఎక్కువ మూల&zwnj;ధ&zwnj;నం ప్ర&zwnj;భుత్వానిది అయి ఉండాలి. ఇందుకోసం ఏటా కేంద్ర ప్ర&zwnj;భుత్వం వాటికి నిర్ణీత మొత్తంలో మూల&zwnj;ధ&zwnj;నాన్ని స&zwnj;మ&zwnj;కూరుస్తుంది. దేశ ఆర్థిక రంగానికి బ్యాంకులు ఎంతో కీల&zwnj;కం క&zwnj;నుక ప్ర&zwnj;భుత్వం బ్యాంకుల్లోకి పంపే డ&zwnj;బ్బు విష&zwnj;యంలో కాస్త ఉదారంగానే ఉంటుది. ప్ర&zwnj;తి సంవ&zwnj;త్స&zwnj;రం ఆర్థిక మంత్రులు బ&zwnj;డ్జెట్ ప్ర&zwnj;వేశ&zwnj;పెట్టేట&zwnj;ప్పుడు సంక్షేమ ప&zwnj;థ&zwnj;కాల&zwnj;కు త&zwnj;గుమొత్తంలో డ&zwnj;బ్బు ఉండేలా చూసుకుంటారు. అదే స&zwnj;మ&zwnj;యంలో వ&zwnj;చ్చిన ప&zwnj;న్ను వ&zwnj;సూళ్ల&zwnj;ను బ&zwnj;ట్టి ఎంత ఖ&zwnj;ర్చు చేయాలి, లోటు పెర&zwnj;గ&zwnj;కుండా ఉండేందుకు ఏ విధ&zwnj;మైన చ&zwnj;ర్య&zwnj;లు తీసుకోవాల&zwnj;నే వాటి గురించి దృష్టి పెడ&zwnj;తారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఆర్థిక మంత్రులు ఎదుర్కొంటున్న మ&zwnj;రో అతిపెద్ద స&zwnj;వాలు పెట్టుబ&zwnj;డుల ఉప&zwnj;సంహ&zwnj;ర&zwnj;ణ&zwnj;, ప్రభుత్వ రంగ బ్యాంకుల&zwnj;కు అవ&zwnj;స&zwnj;ర&zwnj;మైన మూల&zwnj;ధ&zwnj;నాన్ని బ&zwnj;డ్జెట్ ద్వారా స&zwnj;మ&zwnj;కూర్చ&zwnj;డం. కార్పొరేట్లు వేల కోట్లు తీసుకుని ఎగ&zwnj;వేస్తున్న ప్ర&zwnj;స్తుత త&zwnj;రుణంలో నిరర్ధ&zwnj;క ఆస్తులు ఇబ్బ&zwnj;డిముబ్బ&zwnj;డిగా పెరుగుతున్నాయి. దీంతో ప్ర&zwnj;తి ఏటా త&zwnj;ప్ప&zwnj;నిస&zwnj;రిగా ప్ర&zwnj;భుత్వ బ&zwnj;డ్జెట్ నుంచి ఎంతో కొంత మూల&zwnj;ధ&zwnj;న సాయం కోసం బ్యాంకులు ఎదురుచూడ&zwnj;క త&zwnj;ప్ప&zwnj;ని ప&zwnj;రిస్థితి నెల&zwnj;కొంది. ఇలా గ&zwnj;త 11 ఏళ్ల&zwnj;లో ముగ్గురు ఆర్థిక మంత్రులు బ్యాంకుల్లోకి చొప్పించిన డ&zwnj;బ్బు విలువ రూ.2.6 ల&zwnj;క్ష&zwnj;ల కోట్లు. ఈ సొమ్ము 2జీ కుంభ&zwnj;కోణంలో ప్ర&zwnj;భుత్వానికి న&zwnj;ష్టం క&zwnj;లిగింద&zwnj;ని అంచ&zwnj;నా వేసిన సొమ్ము కంటే ఎక్కువ&zwnj;గా ఉంది. అంతే కాకుండా ప్ర&zwnj;స్తుత సంవ&zwnj;త్స&zwnj;రంలో కేంద్ర ప్ర&zwnj;భుత్వం గ్రామీణ అభివృద్దికి చేసిన కేటాయింపుల కంటే రెండు రెట్లుగా ఉంది. రోడ్లు వేసేందుకు ర&zwnj;హ&zwnj;దారుల మంత్రిత్వ శాఖ కేటాయించిన డ&zwnj;బ్బు కంటే మూడున్న&zwnj;ర రెట్లు ఎక్కువ&zwnj;. ప్ర&zwnj;స్తుత ఆర్థిక సంవ&zwnj;త్స&zwnj;రం, వ&zwnj;చ్చే ఆర్థిక సంవ&zwnj;త్స&zwnj;రంలోనే మూల&zwnj;ధ&zwnj;నం కోసం ప్ర&zwnj;భుత్వం రూ.1.45 ల&zwnj;క్ష&zwnj;ల కోట్ల&zwnj;ను చొప్పించాల&zwnj;ని నిశ్చ&zwnj;యించింది. ఇలా 2010-11 నుంచి 2016-17 మ&zwnj;ధ్య బ్యాంకులు ప్ర&zwnj;భుత్వం నుంచి మూల&zwnj;ధ&zwnj;న అవ&zwnj;స&zwnj;రం కోసం తీసుకున్న డ&zwnj;బ్బు రూ. 1.15 ల&zwnj;క్ష&zwnj;ల కోట్లు. ఇదే స&zwnj;మ&zwnj;యంలో బ్యాంకులు ఆర్జించిన లాభాలు రూ. 1.8ల&zwnj;క్ష&zwnj;ల కోట్లుగా ఉన్నాయి. 2014-15 వ&zwnj;ర&zwnj;కూ లాభాల&zwnj;ను ఆర్జించిన ప్ర&zwnj;భుత్వ రంగ&zwnj;బ్యాంకులు యూపీఏ హ&zwnj;యాంలోని మొండి బ&zwnj;కాయిల పుణ్యాన ఇప్పుడు ఏటా న&zwnj;ష్టాల&zwnj;ను చ&zwnj;విచూస్తున్నాయి. 2015-16లో ప్ర&zwnj;భుత్వ రంగ బ్యాంకులు మూట&zwnj;గ&zwnj;ట్టుకున్న నిక&zwnj;ర న&zwnj;ష్టాలు రూ.21,395 కోట్లు. 2016-17లో సైతం భారీగా నిక&zwnj;ర న&zwnj;ష్టాలు కొన&zwnj;సాగాయి. ఐడీబీఐ బ్యాంకుతో స&zwnj;హా 9 ప్ర&zwnj;భుత్వ రంగ బ్యాంకులు న&zwnj;ష్టాల&zwnj;ను ప్ర&zwnj;క&zwnj;టించాయి. రాజ్య&zwnj;స&zwnj;భ&zwnj;లో ఒక ప్ర&zwnj;శ్న&zwnj;కు స&zwnj;మాధానంగా ఆర్థిక శాఖ స&zwnj;హాయ మంత్రి అప్ప&zwnj;ట్లో ప్ర&zwnj;క&zwnj;టించిన బ్యాంకుల స్థితిగతుల వివ&zwnj;రాలు ఈ విధంగా ఉన్నాయి. 2016-17 ఆర్థిక సంవ&zwnj;త్స&zwnj;రంలో ఐడీబీఐ బ్యాంకు నిక&zwnj;రంగా రూ.5158 న&zwnj;ష్టాల&zwnj;ను మూట&zwnj;గ&zwnj;ట్టుకుంది. దాని త&zwnj;ర్వాత ఇండియ&zwnj;న్ ఓవ&zwnj;ర్సీస్ బ్యాంకు రూ.3417 కోట్ల న&zwnj;ష్టాల&zwnj;ను ప్ర&zwnj;క&zwnj;టించింది. ఇంకా అల&zwnj;హాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మ&zwnj;హారాష్ట్ర, సెంట్ర&zwnj;ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, ఓరియంట&zwnj;ల్ బ్యాంక్, యూకో బ్యాంకు నష్టాల విష&zwnj;యంలో తదుప&zwnj;రి స్థానాల్లో ఉన్నాయి. అయితే సంతోష&zwnj;క&zwnj;ర విష&zwnj;యం ఏమిటంటే ప్ర&zwnj;పంచ&zwnj;వ్యాప్తంగా ఐసీఐసీఐ, ఎస్బీఐ అతిపెద్ద బ్యాంకులుగా విఫ&zwnj;లం అవ్వడానికి ఎటువంటి అవ&zwnj;కాశం లేని రెండింటిగా అంత&zwnj;ర్జాతీయంగా గుర్తింపు పొంద&zwnj;డం. అయితే ఎస్బీఐ విష&zwnj;యానికి వ&zwnj;స్తే ఆర్బీఐ బ్యాంకింగ్ కోడ్ ప్ర&zwnj;వేశపెట్టి నిరర్ధ&zwnj;క ఆస్తుల&zwnj;కు సంబంధించి కేటాయింపులు త&zwnj;ప్ప&zwnj;నిసరిగా చేయాలంటూ చెప్పిన ద&zwnj;గ్గ&zwnj;ర నుంచి లాభాల&zwnj;ను త&zwnj;క్కువ&zwnj;గా ప్ర&zwnj;క&zwnj;టించడం, గ&zwnj;త త్రైమాసికం నుంచి నిక&zwnj;ర నష్టాల&zwnj;ను న&zwnj;మోదు చేస్తుండ&zwnj;టం ప్ర&zwnj;భుత్వ రంగ బ్యాంకుల దుస్థితికి అద్దం ప&zwnj;డుతోది. 2017లో ఐడీబీఐ బ్యాంకు వ&zwnj;ద్ద ఉన్న వ&zwnj;సూలు కానీ రుణాలు రూ.44,753 కోట్లుగా ఉన్నాయి. బ్యాంకు స్థిర&zwnj;త్వాన్ని పెంచేందుకు ఆర్బీఐ కొత్త ఫ్రేమ్ వ&zwnj;ర్క్ ప్ర&zwnj;క&zwnj;టించ&zwnj;డంతో అస&zwnj;లు వాస్త&zwnj;వాలు ఈ విధంగా వెలుగుచూశాయి. డిసెంబ&zwnj;ర్ 31తో ముగిసిన త్రైమాసికానికి దేశంలో అతిపెద్ద ప్ర&zwnj;భుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ ప్ర&zwnj;క&zwnj;టించిన న&zwnj;ష్టం విలువ రూ.2420 కోట్లు. ఇలా ప్ర&zwnj;తి త్రైమాసికంలోనూ న&zwnj;ష్టాల విలువ పెరుగుతూ పోతే బ్యాంకుల&zwnj;కు సంక్ర&zwnj;మించే న&zwnj;ష్టాల&zwnj;ను పూడ్చేదెవ&zwnj;ర&zwnj;న్న&zwnj;ది మిలియ&zwnj;న్ డాల&zwnj;ర్ల ప్ర&zwnj;శ్న&zwnj;గా మిగిలిపోనుంది.
1entertainment
పవన్ ఫ్యాన్స్ పై మరోసారి రేణుదేశాయి సీరియస్ Highlights ఇటీవలే తను రాసిన ఓ కవితను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణు దేశాయి రేణు దేశాయి షేర్ చేసిన కవితపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ మీ పని మీరు చూసుకోండంటూ పవన్ ఫ్యాన్స్ ను హెచ్చరించిన రేణు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్ పై మరోసారి సీరియస్ అయ్యారు. ఇటీవలే రేణు స్వయంగా రాసిన ఓ కవితను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ కవిత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసేలా వుందంటూ పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే దీనిపై రేణు కూడా గట్టిగా స్పందించింది.   సోషల్ మీడియాలో పెట్టిన కవిత పవన్ ను ఎలా టార్గెట్ చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పని మీరు చూసుకోవాలని… తన సోషల్ మీడియాలోకి ఎంటరై, ఎదో ఒకటి పోస్ట్ చేస్తూ, తనను కామెంట్ చేయవద్దని అన్నారు. ఈ ట్వీట్ ను కూడా మీరు రాద్ధాంతం చేస్తారనే విషయం తనకు తెలుసని చెప్పారు. మీ వల్లే పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీలకు టార్గెట్ అవుతున్నారని ట్వీట్ చేశారు.   సగం నాలెడ్జ్ తో మీరు ట్వీట్లు చేస్తారని… మీరు ఏదో చెబితే, మీడియా దాన్ని పూర్తిగా హైలైట్ చేస్తోందని విమర్శించారు. దయచేసిన తమరి పని తమరు చేసుకోవాలని… పవన్ గురించి ఎలాంటి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోరారు. గ‌తంతో కూడా ప‌వ‌న్ అభిమానులు రేణూపై విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో అవి పెద్ద దుమారాన్నే లేపాయి. తాజాగా మ‌రోసారి రేణూను టార్గెట్ చేశారు ప‌వ‌న్ అభిమానులు. అంతే రీతిలో ఘాటుగా రిప్లై ఇచ్చింది రేణు దేశాయ్.
0business
బాహుబలి2 లేటెస్ట్ ట్రైలర్ చూశారా..వెయ్యి కోట్ల ట్రైలర్ Highlights వెయ్యి కోట్లు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి బాహుబలి చిత్రానికి ప్రపవంచవ్యాప్తంగా విశేష స్పందన ఆకట్టుకుంటున్న భారత దేశ నం.1 బ్లాక్ బస్టర్ చిత్రం కొత్త ట్రైలర్ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి రూ.1000 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి భారతీయ సినిమాలకు సరికొత్త మైలురాయిగా నిలిచి చరిత్ర సృష్టించిన చిత్రం. ఎస్‌.ఎస్‌. రాజమౌళి వెండితెరపై సృష్టించిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి దికన్ క్లూజన్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఏప్రిల్‌ 28న విడుదలైన ఈ చిత్రం పదిరోజుల్లోనే వెయ్యికోట్లు రాబట్టింది. అమెరికాలో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగానూ రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌.. నెం.1 బ్లాక్‌బస్టర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ పేరుతో 30 సెకన్ల ఓ వీడియోను విడుదల చేసింది.   ‘ఒక ప్రాణం.. అంటూ సాగే పాటతో ఈ వీడియో ప్రారంభం కాగా, మధ్య.. మధ్యలో ‘నీకెప్పుడైనా మీ అమ్మను చంపాలనిపించిందా?’ అంటూ బిజ్జలదేవుడి ప్రశ్న.. ‘దేవసేన ఒంటిపై చేయి పడితే బాహుబలి కత్తిపై చేయి పడినట్లే’ అంటూ అమరేంద్ర బాహుబలి డైలాగ్‌, ‘మన నెత్తురే ఓ మహాసేన’ అంటూ మహేంద్ర బాహుబలిగా ఉద్వేగంతో చెప్పే డైలాగ్‌లతో ఈ వీడియో సాగింది.   ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్‌, సత్యరాజ్‌లు కీలక పాత్రల్లో నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్రాలు కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టి తెలుగోడి సత్తా చాటాయి. అమెరికాలో కూడా టాప్ పొజిషన్ లో నిలిచిన చిత్రంగా బాహుబలి చరిత్ర సృష్టించింది. Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV నోకియాతో ఎయిర్‌టెల్ ‘వీవోఎల్టీఈ’ ఒప్పందం వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ (VoLTE) కాలింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి ఎయిర్‌టెల్ చర్యలు ప్రారంభించింది. TNN | Updated: Nov 2, 2016, 03:30PM IST వాయిస్ ఓవర్ ఎల్&zwnj;టీఈ ( VoLTE ) కాలింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి ఎయిర్&zwnj;టెల్ చర్యలు ప్రారంభించింది. ఈ వీవోఎల్టీఈని టెక్నాలజీని తీసుకురావడానికి ఫిన్&zwnj;లాండ్ దిగ్గజ కంపెనీ నోకియాతో భారతీ ఎయిర్&zwnj;టెల్ ఒప్పందం చేసుకుంది. ఈ టెక్నాలజీ కోసం నోకియాకు ఎయిర్&zwnj;టెల్ 60 మిలియన్ డాలర్లు (రూ. 402 కోట్లు) చెల్లిస్తోంది. ఎయిర్&zwnj;టెల్ వీవోఎల్టీఈ సదుపాయం ఈ ఏడాదే అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ ప్రకటించింది. వీవోఎల్టీఈ టెక్నాలజీని ఎయిర్&zwnj;టెల్ కొన్ని ప్రాంతాల్లో విజయవంతంగా పరీక్షించింది. దీని కోసం నోకియాతో చిన్న ఒప్పందాన్ని కూడా అప్పట్లో కుదుర్చుకుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీని దేశవ్యాప్తంగా తీసుకురావాలని నోకియాతో పూర్తిస్థాయి ఒప్పందం చేసుకుంది. వీవోఎల్టీఈ ద్వారా ఆపరేటర్ వాయిస్, డాటా సర్వీస్&zwnj;లను ఒకేసారి అందజేయడానికి వీలుంటుంది. ఎల్టీఈ డాటాను ఉపయోగించుకుని ఒక యాప్ సహాయంతో వాయిస్ కాల్స్ చేయడం వీలవుతుంది. ప్రస్తుతం రిలయన్స్ జియో కూడా అదే చేస్తోంది. జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకోడానికి ఇప్పుడు ఎయిర్&zwnj;టెల్ వీవోఎల్టీఈ టెక్నాలజీలోకి అడుగుపెడుతోంది. అయితే ఇది ఎయిర్&zwnj;టెల్&zwnj;కే కలుసొచ్చేలా ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఇంటర్ కనెక్షన్ సమస్యతో బాధపడుతున్న జియోకు ఎయిర్&zwnj;టెల్ వీవోఎల్టీఈ ప్రారంభమైతే కాల్ ఫెయిల్యూర్ సమస్య మరింత అధికమవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఎయిర్&zwnj;టెల్ తరవాత భారత్&zwnj;లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న టెలికాం ఆపరేటర్లు ఐడియా, వొడాఫోన్ కూడా త్వరలో వీవోఎల్టీఈ రేస్&zwnj;లో పాల్గోనున్నట్లు తెలుస్తోంది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రోహిత్, ధావన్, కోహ్లీనే మా ఫస్ట్ టార్గెట్: బౌల్ట్ తొలి 10 ఓవర్లలోపే రోహిత్ శ్మర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీని ఔట్ చేయగలిగితే..? ఆటోమేటిక్‌గా మిడిలార్డర్‌పైనే కాదు మొత్తం ఆ టీమ్‌పైనే ఒత్తిడి పెరుగుతుంది. -ట్రెంట్ బౌల్ట్ | Updated: Jan 25, 2019, 06:49PM IST రోహిత్, ధావన్, కోహ్లీనే మా ఫస్ట్ టార్గెట్: బౌల్ట్ భారత్‌తో శనివారం ఉదయం 7.30 గంటల నుంచి ప్రారంభంకానున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌ పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతోందని ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వెల్లడించాడు. నేపియర్ వేదికగా గత బుధవారం ముగిసిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్ జట్టు.. ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కనీసం రెండో వన్డేలోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది. భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ని త్వరగా ఔట్ చేస్తే..? మిడిలార్డర్‌ ఒత్తిడిలోకి వెళ్తుందని బౌల్ట్ చెప్పుకొచ్చాడు.
2sports
Bathukamma Song: మంగ్లీ బత... ​ కోసి ఎర్రకారం పూసి పటాస్&zwnj;తో కాలిస్తే ఎంత సమ్మగా, ఎంత హాయిగా ఉంటుందో తెలుసా ఇదిగో ఒక్కసారి ' ధర్మయోగి ' సినిమాలోని ఈ వీడియో చూడండి... ధనుష్, త్రిష, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలుగా ఆర్.ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం 'కొడి'. కొడి అంటే జెండా అని అర్థం. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. తెలుగులో 'ధర్మయోగి' పేరుతో విడుదల కాబోతున్న ఈ సినిమాలో ధనుష్ డ్యుఎల్ రోల్ పోషిస్తున్నాడు. అందులో ఒకటి మాస్ లీడర్ పాత్ర. ఈ రోల్&zwnj;కి సపోర్ట్&zwnj;గా హీరోయిన్ త్రిష కూడా లీడర్ పాత్రలో కనిపించబోతుంది. ధనుష్ మరో పాత్రకు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ ఇచ్చిన మ్యూజిక్ మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాలోని 'ఎర్రకారం కుర్రవాడా..' అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. ఇప్పటికే మాస్ ఇమేజ్ కలిగి ఉన్న ధనుష్ తొలిసారిగా ఈ సినిమాలో గడ్డంతో రఫ్ లుక్&zwnj;లో కనిపిస్తుండటం మాస్&zwnj;కి మరింత ఘాటెక్కించేలా సినిమా ఉండబోతోందని అర్థమవుతోంది. ఫస్ట్&zwnj;లుక్ పోస్టర్&zwnj;, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. దీపావళి కానుకగా 'ధర్మయోగి' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
0business
Hyderabad, First Published 7, May 2019, 5:46 PM IST Highlights   ఇండియాలో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ హోమ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అంటిళ్ల అని పిలవబడే ఆ హోమ్ వరల్డ్ లోనే అత్యధిక ఖరీదైన ఇళ్లల్లో రెండవది. ఇండియాలో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ హోమ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అంటిళ్ల అని పిలవబడే ఆ హోమ్ వరల్డ్ లోనే అత్యధిక ఖరీదైన ఇళ్లల్లో రెండవది. అయితే ఈ హోమ్ లో ఇప్పుడు రీ డిజైనింగ్ పనులు జరుగుతున్నాయి.  అందుకోసం నీతా అంబానీ స్పెషల్ గా షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ ని పిలిపించింది. గౌరీ ఇంటీరియర్ డిజైనర్ అని చాలా తక్కువ మందికి తెలుసు. చాలా మంది సెలబ్రేటిస్ హోమ్స్ కి ఆమె సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఇక అంబానీ ఫ్యామిలీతో షారుక్ ఫ్యామిలీకి గత కొన్నేళ్ల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది.  ఇక ఇప్పుడు అంబానీ అంటిళ్లలో కొన్ని ఫ్లోర్స్ కి గౌరీ ఖాన్ డిజైన్స్ సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గౌరీ ఖాన్ కి ముంబైలో ఇంటీరియర్ వర్క్స్ కి సంబందించిన హై ఫై స్టోర్ కూడా ఉంది.  Last Updated 7, May 2019, 5:48 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV హార్దిక్ ఎవరితోనూ మాట్లాడటం లేదు..!: హిమాన్షు గత మూడేళ్లుగా క్రికెట్‌ కారణంగా హార్దిక్ పాండ్యాకి ఇంటి దగ్గర పండుగ జరుపుకునే అవకాశం దక్కలేదు. తాజాగా ఆ ఛాన్స్ లభించినా.. సంబరాలు చేసుకునే మూడ్‌లో అతను లేడు - హార్దిక్ తండ్రి హిమాన్షు పాండ్య Samayam Telugu | Updated: Jan 16, 2019, 01:28PM IST హార్దిక్ ఎవరితోనూ మాట్లాడటం లేదు..!: హిమాన్షు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కి గురైన భారత యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య .. కనీసం ఇంటి నుంచి వెలుపలకి కూడా రావడం లేదని అతని తండ్రి హిమాన్షు పాండ్య వెల్లడించాడు. ఇటీవల కేఎల్ రాహుల్‌తో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి హాజరైన హార్దిక్ పాండ్య.. అమ్మాయిలతో డేటింగ్, పార్టీల్లో వారిని చూసే విధానంపై అభ్యంతరకంగా మాట్లాడాడు. దీంతో.. క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీసీసీఐ .. వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఆ సమయంలో.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి సిద్ధమవుతున్న ఇద్దరు క్రికెటర్లు.. తమపై వేటు పడటంతో వెంటనే భారత్‌కి వచ్చేశారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన హార్దిక్ పాండ్య.. ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడటం లేదని.. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడని అతని తండ్రి చెప్పుకొచ్చాడు. ‘భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లను హార్దిక్ పాండ్య వీక్షిస్తున్నాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అతను కనీసం ఇంటి వెలుపలకి కూడా వెళ్లలేదు. ఎవరితోనూ ఫోన్లలో మాట్లాడటం లేదు. గుజరాత్‌లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నా.. అతను తనకెంతో ఇష్టమైన గాలిపటాలని ఎగురవేసేందుకు కూడా ఇష్టపడలేదు. గత మూడేళ్లుగా క్రికెట్‌ కారణంగా అతనికి ఇంటి దగ్గర పండుగ జరుపుకునే అవకాశం దక్కలేదు. తాజాగా ఆ ఛాన్స్ లభించినా.. సంబరాలు చేసుకునే మూడ్‌లో అతను లేడు’ అని హిమాన్షు వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV త్రివిక్రమ్, నితిన్ లాంచ్ చేసిన ఫస్ట్‌లుక్!! శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ జంటగా ఏ.వి.ఎస్. రాజు సమర్పణలో, శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రం ఫస్ట్ | Updated: Feb 15, 2016, 05:15PM IST శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ జంటగా ఏ.వి.ఎస్. రాజు సమర్పణలో, శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, ప్రముఖ హీరో నితిన్ లాంచ్ చేశారు. వీడియో పోస్టర్ చాల కొత్తగా, ఆహ్లాదకరంగా ఉందని త్రివిక్రమ్ అభినందించారు. “జయమ్ము నిశ్చయమ్మురా” టీమ్‌కు నితిన్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. త్రివిక్రమ్ గారి లాంటి గ్రేట్ డైరెక్టర్ “జయమ్ము నిశ్చయమ్మురా” వీడియో పోస్టర్‌పై ప్రశంసలు కురిపించటం చాల స్పూర్తినిస్తోందని దర్శక నిర్మాత శివరాజ్ కనుమూరి అన్నారు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV భారత్‌పైనే ఇప్పుడు ఒత్తిడి: లంక కెప్టెన్ విశాఖపట్నంలో ఆదివారం జరగనున్న సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో భారత్‌ జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని శ్రీలంక కెప్టెన్ TNN | Updated: Dec 16, 2017, 06:25PM IST భారత్‌పైనే ఇప్పుడు ఒత్తిడి: లంక కెప్టెన్ విశాఖపట్నంలో ఆదివారం జరగనున్న సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో భారత్&zwnj; జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని శ్రీలంక కెప్టెన్ తిసార పెరీరా అభిప్రాయపడ్డాడు. ధర్మశాల వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన భారత్.. గత బుధవారం మొహాలి వేదికగా జరిగిన రెండో వన్డేలో 392 పరుగుల భారీ స్కోరు చేసి లంకేయుల్ని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. దీంతో మూడో వన్డేలో ఏ జట్టు పైచేయి సాధిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్టు విజయావకాశాలపై శనివారం మీడియాతో తిసార పెరీరా మాట్లాడాడు. &lsquo;మొహాలి, ధర్మశాలతో పోలిస్తే విశాఖపట్నం వాతావరణం చాలా భిన్నం. ఇంకా చెప్పాలంటే శ్రీలంకని పోలి ఉంటుంది. తుది వన్డే కోసం మేము చాలా కష్టపడ్డాం. ధర్మశాల వన్డే తరహాలో మరోసారి భారత్&zwnj;పై మెరుగైన ప్రదర్శన చేయాలనే ధీమాతో ఉన్నాం. ఇప్పటికే రెండు ప్రాక్టీస్ సెషన్స్ ముగిశాయి. విజేత నిర్ణయాత్మక వన్డే అయినప్పటికీ మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఇది మరో మ్యాచ్&zwnj;లానే భావిస్తున్నాం. కానీ.. భారత్ జట్టు ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటి. కాబట్టి.. వారిపై మాత్రం తప్పకుండా ఒత్తిడి ఉంటుంది&rsquo; అని తిసార పెరీరా వివరించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Jan 08,2017 అరబిందో చేతికి పోర్చుగీసు కంపెనీ! హైదరాబాద్‌: ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ అరబిందో ఫార్మా పోర్చుగల్‌ కేంద్రంగా పని చేస్తున్న జెనరీస్‌ ఫార్మస్యూటికా ఎస్‌ఏ కంపెనీని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కొనుగోలు విలువ 135 మిలియన్‌ యూరోలు (సుమారు రూ. 969 కోట్లు)గా ఉంటుందని అంచనా. జెనరీస్‌ ఫార్మస్యూటికా కంపెనీ ఇప్పటికే నెదర్లాండ్స్‌కు చెందిన ఏజిల్‌ ఫార్మా బీబీ సంస్థ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. జెనరీస్‌ పోర్చుగల్‌లో ఫార్మా ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఈ కొనుగోలు ప్రక్రియతో అరబిందో ఫార్మాకు పోర్చుగల్‌లో టాప్‌ జనరిక్‌ బ్రాండ్‌గా విస్తరించడానికి దోహదం చేయనుందని ఎస్‌వీపీ యూరోపియన్‌ ఆపరేషన్స్‌ వి.మురళీధరన్‌ పేర్కొన్నారు. ఈ డీల్‌తో ఐరోపాలో సంస్థ పరపతి మరింత పెరగనుంది. పోర్చుగల్‌ కంపెనీ ప్రతి ఏడాదికి 120 కోట్ల మందు బిల్లల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం 271 జనరిక్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Jun 17,2015 వచ్చే ఏడాది రూపే క్రెడిట్‌ కార్డులు తిరుపూర్‌: భారత్‌కు చెందిన కార్డు చెల్లింపుల సంస్థ రూపే 'క్రెడిట్‌ కార్డు'లు వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చెల్లింపు అనుమతులు పొందిన సంస్థ కార్డులను అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రూపే క్రెడిట్‌ కార్డులు వీసా, మాస్టర్‌ కార్డులకు మంచి పోటీని ఇస్తాయని ఎన్‌సీపీఐ ఛైర్మన్‌ ఎం.బాలచంద్రన్‌ తెలిపారు. భారత్‌లోని బ్యాంకుల ద్వారా ఇప్పటికే డెబిట్‌ కార్డులు జారీ చేస్తున్న తమ సంస్థ ఈ రంగంలో కార్డుల వ్యాప్తి, లావాదేవీలు విస్తృతంగా పెరిగేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రతి నెల రూపే కార్డుల ద్వారా నగదు రహిత చెల్లింపులు 1-2 శాతం మేర పెరుగుతున్నట్లు వివరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మొదటి అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవంలో పాల్గొన్న ఆయన 2020 నాటికి ప్రతి భారతీయుడ్ని చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 16 కోట్ల మందికి రూపే కార్డులను సంస్థ జారీ చేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Tayota Fortuner show rooms opened రెండుషోరూంలలో టయోటా ఫార్చూనర్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌, నవంబరు 12: జపాన్‌కు చెందిన టయో టా ఆధునీకరించిన ఫార్చ్యూనర్‌ను దేశీయ విపణి లోనికి విడుదలచేసింది. ఎస్‌యువి విభాగంలో ఉన్న ఈ వాహనం రెండువెర్షన్లలో లభిస్తుంది. డీజిల్‌ 2.8 లీటర్లు, పెట్రోలు 2.7 లీటర్ల ఇంజన్లను అమర్చారు. వీటిధరలు ఎక్స్‌షోరూంఢిల్లీ ధరలూ 25.92 లక్షలు, రూ.31.12 లక్షలుగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. ఏడాదికికనీసం 16వేలకుపైగా ఫార్చూనర్‌ వాహనాలు విక్రయిస్తున్నామని పెట్రోలురకం తెచ్చినందుకు ఈ సంఖ్యమరింత పెరుగుతుందని భావిస్తున్నామని హర్షా టయోటా సిఒఒ సంజీవ్‌ కొరిటాల వివరించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్‌ కమినర్‌ మహేష్‌ మురళీ భగవత్‌, టిన్యూస్‌ ఎండి జె.సంతోష్‌కుమార్‌, హర్షాటయోటా సీనియర్‌జనరల్‌మేనేజర్‌ వైబి స్వామి ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఫార్చూనర్‌ వాహనాన్ని రెండుషోరూంలలో ప్రారంభిం చారు. రాధాకృష్ణ టయోటాషోరూంలోహోంమంత్రి నాయినినరసింహారెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మా రావులు లాంఛనంగా ఫార్చూనర్‌ వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాధాగ్రూప్‌ ఉపాధ్య క్షుడు అనిల్‌కుమార్‌ జక్కన్న, జనరల్‌మేనేజర్‌ షబీర్‌షేక్‌, సేల్స్‌హెడ్‌ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
1entertainment
Hyd Internet 65 Views stock market stock market ముంబయి: స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశాల నేపథ్యంలో ఆరంభ ట్రేడింగ్‌లో భారీగా కొనుగోళ్లు చేపట్టిన ఇన్వెస్ట‌ర్లు మ‌ధ్యాహ్నానికి వెనక్కి తగ్గారు. ఒకానొక దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. అయితే ఫార్మా, చమురు రంగ సంస్థల షేర్లు డీలా పడిపోవడంతో సూచీ నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 70 పాయింట్ల వరకు నష్టపోయింది. చివరకు మళ్లీ కోలుకుని 32 పాయింట్ల స్వల్ప లాభంతో 33,251 వద్ద మ‌గియ‌గా, అటు నిఫ్టీ కూడా అత్యల్పంగా 6 పాయింట్లు లాభపడి 10,309 వద్ద ముగిసింది.
1entertainment
Chinna Swamy Stadium, Bangalore వర్షంతో టాస్‌ వాయిదా బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా ఇవాళ చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది.. చినుకులు పడి మైదానం తేమగా మారటంతో 7.30 గంటలకు టాస్‌ వేయాల్సి ఉండగా వాయిదా వేశారు.. దీంతో మైదానంలో కవర్స్‌ కప్పి టాస్‌ను కొద్ది సమయం పాటు వాయిదా వేశారు.
2sports
Hyderabad, First Published 17, May 2019, 10:11 AM IST Highlights యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తదుపరి చిత్రం రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమైంది. పూజా హెగ్డే హీరోయిన్.  ప్రభాస్ ఇకపై తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసేలా లేడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఇండియా వ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది. దీనితో ప్రభాస్ తో సినిమాలు చేయాలనుకునే దర్శకులు భారీ స్థాయిలో ఉండే కథల్నే సిద్ధం చేస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.  హైదరాబాద్ నగర శివారులో ఈ చిత్రం కోసం భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఈ సెట్ కోసం నిర్మాతలు దాదాపు 30 కోట్ల రూపాయలు వెచ్చిస్తునట్లు సమాచారం. కేవలం ఒక్క సెట్ కోసమే ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారంటే అందులో ఏదో ఒక విశేషం ఉండాలి. 1960 కాలం నాటి పరిస్థితుల్లో యూరప్ లో ఎక్కువభాగం ఈ చిత్రం ఉంటుంది. ముందుగా ఫారెన్ లొకేషన్స్ లో షూటింగ్ చేద్దామని భావించారు. ఫారెన్ లోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ భారీ ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల హైదరాబాద్ లోనే అవసరమైన సెట్ నిర్మించుకుని అందులో షూటింగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.  విదేశాల్లో ఉన్నట్లు ఫీలింగ్ కలిగే అద్భుతమైన ఈ సెట్ పై ఆర్ట్ డైరెక్టర్స్, ఇతర సిబ్బంది వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం సాహో షూటింగ్ చివరి దశలో ఉంది. సాహో షూటింగ్ పూర్తి కాగానే రాధాకృష్ణ దర్శకత్వంలోని చిత్ర షూటింగ్ ఏకధాటిగా జరగనుంది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది.  Last Updated 17, May 2019, 10:11 AM IST
0business
Hyderabad, First Published 11, Jul 2019, 4:35 PM IST Highlights ప్రముఖ క్రికెటర్ ధోనీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.  ప్రముఖ క్రికెటర్ ధోనీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నిన్న జరిగినే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో ఇండియా ఓడిపోయిన కారణంగా ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇది ఇలా ఉండగా.. ప్రముఖ  గాయని లతా మంగేష్కర్ తన తరఫున ధోనీని రిక్వెస్ట్ చేస్తున్నారు.ధోనీ రిటైర్మెంట్ వార్తలు విన్న ఆమె అలాంటి ఆలోచన రానివ్వదంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ''నమస్కారం ధోనీ గారు.. మీరు రిటైర్ అవ్వాలనుకుంటున్నట్లు విన్నాను.. దయచేసి ఆ పని మాత్రం చేయొచ్చు.. దేశానికి మీ అవసరం ఎంతో ఉంది. రిటైర్మెంట్ అనే ఆలోచన రానివ్వద్దని రిక్వెస్ట్ చేస్తున్నా'' అంటూ రాసుకొచ్చారు. ఆమె ట్వీట్ కి అభిమానుల నుండి ఎంతో సపోర్ట్ లభిస్తోంది.   Namaskar M S Dhoni ji.Aaj kal main sun rahi hun ke Aap retire hona chahte hain.Kripaya aap aisa mat sochiye.Desh ko aap ke khel ki zaroorat hai aur ye meri bhi request hai ki Retirement ka vichar bhi aap mann mein mat laayiye. @msdhoni — Lata Mangeshkar (@mangeshkarlata) July 11, 2019 Last Updated 11, Jul 2019, 4:35 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఇటీవల స్టెరాయిడ్స్ తీసుకున్నాను: యాంకర్ రష్మీ దాదాపు ఐదేళ్ల పాటు రుమటాయిడ్ నుంచి ఉపశమనం పొందడానికి ఎంతో నొప్పి కలిగించే ఇంజెక్షన్లు తీసుకున్నానంటూ యాంకర్ రష్మీ తెలిపారు. Samayam Telugu | Updated: Oct 25, 2018, 08:39PM IST ఇటీవల స్టెరాయిడ్స్ తీసుకున్నాను: యాంకర్ రష్మీ అనారోగ్య సమస్యల వల్ల తాను స్టెరాయిడ్స్ తీసుకున్నానని ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆటో ఇమ్యూన్‌ సమస్యలతో సతమతమైనట్లు చెప్పారు. శిరీష అనే నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు ఫ్రెండ్లీగా స్పందించిన రష్మీ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘రూమటాయిడ్‌ వ్యాధికి చికిత్స ఉందో లేదో నాకు తెలియదు లేదు. అయితే నా భర్త 4 నెలల నుంచి రూమటాయిడ్‌తో బాధ పడుతున్నారు. ఒకవేళ దీనికి చికిత్స ఉంటే ఎక్కడికి వెళ్లి చికిత్స తీసుకోవాలో చెప్పండి. మీరు గతంలో చికిత్స తీసుకున్నారు కదా. నాకు తగిన సూచనలివ్వండంటూ’ యాంకర్ రష్మీని కోరుతూ శిరీష్ ట్వీట్ చేశారు. There is no cure Only change in lifestyle make huge difference Try alternate medicines Go the herbal and Ayurved… https://t.co/SBhv0syQbv &mdash; rashmi gautam (@rashmigautam27) 1540460586000 అనూహ్యంగా రష్మీ శిరీషకు తగిన సూచనలు చేస్తూ రీట్వీట్ చేశారు. ‘రూమటాయిడ్‌కి చికిత్స అంటూ ఉండదు. మన జీవినశైలిలో మార్పులతో సమస్యను అధిగమించవచ్చు. ఆయుర్వేద మందులు వాడండి. కొంతకాలం కిందట ఆటో ఇమ్యూన్ సమస్య తలెత్తగా స్టెరాయిడ్స్ తీసుకున్నాను. 12 ఏళ్ల వయసు నుంచి దాదాపు ఐదేళ్ల పాటు రుమటాయిడ్ నుంచి ఉపశమనం పొందడానికి ఎంతో నొప్పి కలిగించే ఇంజెక్షన్లు తీసుకున్నాను. I was put on steroids very recently for one of my auto immune issues and I did take those painful injections at a v… https://t.co/dZgoa7dhjb &mdash; rashmi gautam (@rashmigautam27) 1540461063000 అమ్మ చెప్పిన కొన్ని చిట్కాల వల్ల సమస్యను అధిగమించాను. నొప్పిని అనుభవించడం జీవితంలో భాగమే. అయితే శారీరక శ్రమతో వాటిని జయించాలి. తాజా ఆహారాన్ని తీసుకుంటూ, మంచి వాతావరణంలో ఉంటే మనల్ని ఏ విషయం దిగజార్చలేదంటూ’ రష్మీ వరుస ట్వీట్లు చేశారు. ‘మీ సమస్యను మళ్లీ గుర్తుచేసి మిమ్మల్ని అడిగి బాధ పెడుతున్నారు. మీరు ఇలాంటి విషయాలకు స్పందించకపోవడమే మంచిది. మీరు దృడంగా ఉండాలి. ఇలాంటి విషయాలకూ దూరంగా ఉండాలని కోరుతున్నానంటూ’ గిరిదర్ అనే నెటిజన్ రష్మీకి సూచించారు. ఈ ట్వీట్‌కూ రష్మీ స్పందించారు. Sharing a screen shot #autoimmune So pls do not shy away if u are young and your bones hurt and if people say UM… https://t.co/CIotNyyHU4 &mdash; rashmi gautam (@rashmigautam27) 1540462114000 ‘ఇది మంచి పరిణామమే. రోజురోజుకు ఈ సమస్య పెరిగిపోతుంది. ఇతరులకు అవగాహన కల్పించడం మంచిదే. ఆరోగ్య బీమా తీసుకున్నా కూడా ఆటో ఇమ్యూన్ చికిత్సకయ్యే ఖర్చును భరించలేమన్న విషయం తెలుసా’ అని గిరిదర్ ట్వీట్‌కు రష్మీ రీట్వీట్ చేశారు. రష్మీ స్పందించడంతో మరికొందరు తమకు తెలిసిన విషయాన్ని శిరీషకు తెలిపారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
- ఆరు వారాల గరిష్ఠానికి సూచీలు - నేడు మార్కెట్లుకు సెలవు ముంబయి : వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీలో తగ్గుదల, పారిశ్రామికోత్పత్తి సూచీ పుంజుకోనుందన్న అంచనాలకు తోడు రిలయన్స్‌ ఇండిస్టీస్‌, ఎల్‌అండ్‌టి లాంటి షేర్లు రాణించడంతో సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆరు వారాల గరిష్ట స్థాయి నమోదయ్యాయి. ఈ నేపధ్యంలోనే బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 165.06 పాయింట్లు లేదా 0.57 శాతం రాణించి 29,044.44 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 53.65 పాయింట్లు లేదా 0.61 శాతం పెరిగి 8,834 వద్ద నమోదయ్యింది. గత మార్చి3న మార్కెట్లు ఈ స్థాయిలో నమో దయ్యాయి. మంగళవారం అం బేడ్కర్‌ జయంతి కావడంతో భారత స్టాక్‌ మార్కెట్లకు సెలవు. దీంతో మదుపర్లు కూడా కొంత ముందస్తు కొనుగోళ్లకు మొగ్గు చూపారని బ్రోకర్లు పేర్కొన్నారు. నిఫ్టీలో ఐడియా సెల్యూలర్‌, భారతీ ఎయిర్‌టెల్‌, భెల్‌, సన్‌ఫార్మా స్యూటికల్‌, కెయిర్న్‌ షేర్లు అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎసిసి, టాటా మోటార్స్‌, గెయిల్‌, సెసా స్టెరిలైట్‌ షేర్లు అధిక నష్టాలు చవి చూశాయి. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌ సూచీ 0.3 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.8 శాతం చొప్పున పెరిగాయి. బిఎస్‌ఇలో కన్సూమర్‌ డ్యూరె బుల్స్‌, కాపిటల్‌ గూడ్స్‌, వైద్య సూచీలు రాణించాయి. కెజి-డి6లో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ కొత్త గ్యాస్‌ క్షేత్రాలను కొనుగొందన్న వార్తల నేపథ్యంలో ఆ కంపెనీ షేరు వరుసగా ఐదో రోజూ పెరిగింది. రిల్‌ షేర్‌ 2 శాతం, ఎల్‌అండ్‌టి 2.2 శాతం, భెల్‌ 3.4 శాతం, హెచ్‌డిఎఫ్‌సి 1 శాతం చొప్పున రాణిం చాయి. మొత్తంగా మదుపర్ల మద్దతుతో బిఎస్‌ఇలో 1,670 స్టాక్స్‌ లాభాల్లో ముగియగా, మరోవైపు 1,040 స్టాక్స్‌ నష్టాలను చవి చూశాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
DENA BANK దిల్లీ: పొదుపు ఖాతా డిపాజిట్లపై ప్రభుత్వ రంగానికి చెందిన మరో బ్యాంకు వడ్డీరేటు తగ్గించింది. రూ.25లక్ష లోపు నగదు ఉన్న ఖాతాలపై దేనా బ్యాంకు 0.5 శాతం వడ్డీ తగ్గించి 3.50 శాతానికి పరిమితం చేసింది. రూ.25 లక్షల కన్నా ఎక్కువ నగదు ఉన్న ఖాతాలపై ప్రస్తుతం 4శాతం వడ్డీ ఇవ్వనుంది. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఈ తరహా వడ్డీ కోతలను మొదటగా మొదలుపెట్టింది. కోటి రూపాయల కన్నా తక్కువ ఉన్న పొదుపు ఖాతాలకు వడ్డీ 0.5 శాతం తగ్గించింది. ఎస్బీఐ అనుసరించిన విధానంలో హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌, కర్ణాటక బ్యాంక్‌లతో పాటు పది బ్యాంకులు వడ్డీరేటు తగ్గించాయి.
1entertainment
ఆటోమొబైల్‌ రంగానికి జిఎస్‌టి బూస్ట్‌! జూలైనెలలో ఊపందుకున్న అమ్మకాలు ముంబయి, ఆగస్టు 2: ఆటోమొబైల్‌ కంపెనీలు తమతమ విక్ర యాల గణాంకాలను విడుదలచేసాయి. అన్ని కంపెనీలు కూడా జిఎస్‌టికి ముందే తమతమ వద్ద ఉన్న స్టాక్‌ నిల్వలు కరిగించు కోవడంతో అంతగా విక్రయాల మాంద్యం లేదనే చెప్పాలి. జూలై నెలలో ఇంచుమించుగా అన్ని కంపెనీలు కూడా విక్రయాల్లో వృద్ధి ని సాధించాయనే చెప్పాలి. టాటామోటార్స్‌ విక్రయాల్లో దేశీయ మార్కెట్‌లో 15శాతం వృద్ధినిసాధించినట్లు వెల్లడించింది. బిఎస్‌4 ఉత్పత్తిని పెంచడమే ఇందుకుకీలకం. జిఎస్‌టి ప్రయోజనాలు వినియోగదారులకు అందించడంలో విక్రయాల్లో వృద్ధిని నమోదు చేసాయి. మధ్యస్థాయి, భారీ వాణిజ్యవాహనాల విభాగంలో కూడా మెరుగుపడ్డాయి. కొత్త మోడళ్లు విడుదల కూడా ఇందుకు కారణం. 49 టన్నులు, 37 టన్నుల విభాగంలో కూడా మంచి మార్కెట్‌ సాధించింది. చిన్నవాణిజ్యవాహనాల్లో ఎక్సెల్‌ సిరీస్‌, పికప్‌వ్యాన్‌ టాటాయోధలు మంచివృద్ధిని సాధించినట్లు ప్యాసిం జర్‌ యూనిట్‌ అధినేత మాయాంక్‌పారీక్‌ వెల్లడించారు. మొత్తం విక్రయాలు ఎగుమతులతో సహా 46,216 విక్రయాలు జరిగాయి. గత ఏడాది 43,160 వాహనాలకంటే ఏడుశాతం పెరిగింది. టాటా వాణిజ్య,ప్యాసింజర్‌ వాహనాలు విక్రయాలు 42,775 వరకూ విక్రయించారు. గత ఏడాది జులైతోపోలిస్తే 13శాతం పెరిగాయి. దేశీయమార్కెట్లలో 27,842 వాహనాలు విక్రయించా మని పారీక్‌ వెల్లడించారు. 15శాతంపెరిగాయి. ట్రక్కుల విభా గంలో కూడా 3354 విక్రయించామని 28శాతం వృద్ధి ఉందన్నా రు. టాటామోటార్‌ ప్యాసింజర్‌ క్యారీస్‌ 4472 యూనిట్లకు తగ్గాయి. 15శాతం క్షీణించి 5233 యూనిట్లకు చేరాయి. ఎగు మతులపరంగా చూస్తే 3441గా ఉన్నాయి. 36శాతం తగ్గాయి. శ్రీలంక, నేపాల్‌ దేశాల్లో తగ్గడమే ఇందుకు కీలకం. 19,473 యూనిట్లు టయోటా అమ్మకాలు టయోటా కిర్లోస్కర్‌మోటార్స్‌ జూలై నెలలో 19,473 వాహ నాలను విక్రయించింది. జిఎస్‌టి కొంతమేర కస్టమర్లనుంచి డిమాండ్‌ను పెంచింది. ఇన్నోవా, ఫార్చ్యూనర్‌ వాహనాలు కొత్త రికార్డును నమోదుచేసాయి. దేశీయ మార్కెట్లలో 17,750 యూనిట్లను నమోదుచేసి 43శాతం వృద్ధిని నమోదుచేసింది. కంపెనీ ఎటియోస్‌ సిరీస్‌లో 1723 వాహనాలను విక్రయించింది. టయోటాకిర్లోస్కర్‌ మోటార్‌ 12,404 యూనిట్లను దేశీయ మార్కెట్లలో విక్ర యించి ఎగుమతులపరంగా 1344 యూనిట్లు జరిగినట్లు వెల్లడిం చింది. ఇన్నోవా క్రిస్టా ఆల్‌న్యూ ఫార్య్చూనర్‌ వాహనాలు అమ్మకాల్లో మద్దతునిచ్చినట్లు కంపెనీ వివరించింది. సుజుకి టూవీలర్స్‌62% వృద్ధి సుజుకిమోటార్‌సైకిల్స్‌ జూలై విక్రయాల్లో 62శాతం వృద్ధిని నమోదుచేసింది. మొత్తం 40,038 యూనిట్ల ను విక్రయించింది. గత ఏడాది ఇదేకాలంలో 24,703యూనిట్లను విక్రయించిన కంపెనీ ఈ ఏడాది 62శాతం వృద్ధిని సాధించింది. సుజుకి టూవీలర్స్‌ మొత్తంగా గత ఏడాది చూస్తే 78శాతం అమ్మకాలు పెరిగాయి. ఏటికేడాది చొప్పున సుజుకి టూవీలర్లు మంచి వృద్ధిని సాధించాయి. ఏప్రిల్‌ జూలైలో కూడా 40.6 శాతం వృద్ధిని నమోదుచేసింది. మొత్తం ఐదు లక్షల యూనిట్లను విక్రయించేలక్ష్యంతో డీలర్‌ షిప్‌ నెట్‌వర్క్‌ను పెంచింది. సుజుకినుంచి వస్తు న్న అత్యుత్తమనాణ్యతకగలిగినఉత్పత్తులే అమ్మ కాల వృద్ధికి కీలకం అవుతున్నట్లు వివరించారు. అశోక్‌లేలాండ్‌ అమ్మకాలు 40,479 అశోక్‌లేలాండ్‌ విక్రయాలుమొత్తంగా జూలై నెలలో 11,981 విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే 14శాతం వృద్ధి నమోదుచేసింది. తొలి త్రైమాసికంలో గత ఏడాదితో పోలిస్తే 40,479 యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. 22శాతం వృద్ధిని నమోదుచేసింది. భారీ మధ్యతరహా వాహనాలు 9026 విక్రయిస్తే తేలికపాటి వాహనాలు 2955 విక్రయించింది. మొత్తం జూలైలో 11,981 విక్రయిస్తే తొలి త్రైమాసికంలో భారీ మధ్యతరహా వాహనాలు 28,906 యూనిట్లు, తేలికపాటి వాహనాలు 11,573 మొత్తం 40,479 యూనిట్లు విక్రయించినట్లు వెల్లడించింది. ఫోర్డ్‌ ఇండియా 26,075 యూనిట్ల విక్రయం దేశీయమార్కెట్‌లో ఎక్కువ వృద్ధినిఆశిస్తున్న ఫోర్డ్‌ ఇండియా జూలైనెలలో 26,075 వాహనాలు విక్రయించింది. దేశీయంగా 8418 యూనిట్లు విక్రయిస్తే ఎగుమతులు 17,657 యూనిట్లకు పెరిగాయి. ఎగ్జిక్యూటివ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా విన§్‌ురైనాను నియమించింది. సేల్స్‌ఉపాధ్యక్షుడుగా లక్ష్మీరామ్‌కుమార్‌ను నియ మించింది. గత ఏడాది జూలైలో 10,666 యూనిట్లతో పోలిస్తే భారీ వృద్ధిని సాధించిందనే చెప్పాలి. జిఎస్‌టి ప్రయోజనాల న్నింటినీ కస్టమర్లకే కేటాయించడంలో అమ్మకాల్లో భారీ వృద్ధిని సాధించినట్లు ఫోర్డ్‌ ఇండియా మోటార్స్‌ వెల్లడించింది. హుండై దేశీయ విక్రయాల్లో 4.4% వృద్ధి హుండైమోటార్స్‌ విక్రయాల్లో 4.4శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయంగా 43,007 యూనిట్లను విక్రయించింది. హుండై నెలవారీగాచూస్తే 14.5శాతం వృద్ధిని సాధించిందని, వార్షిక పద్థతిలో చూస్తే 4.4శాతం వృద్ధితో ఉందని డైరెక్టర్‌ రాకేష్‌ శ్రీవాస్తవ వివరించారు. గ్రాండ్‌ ఐ10, ఐ20, క్రెటా వంటి మొత్తం విక్రయాలు 1.25 మిలియన్‌ యూనిట్లకు చేరా యని ఇదొకమంచి పరిణామంగా పేర్కొన్నారు. జిఎస్‌టి అమలు వల్ల ధరలను తగ్గించడం, రుతుపవనాలు సానుకూలం కావడంతో గ్రామీణ మార్కెట్లు సైతం పెరిగినట్లు వివరించారు. హుండై మోటార్స్‌ దేశీయంగా గతఏడాది జూలైలో 41,201 యూనిట్లు విక్రయిస్తే ఈసారి43,007 విక్రయించిందని రాకేష్‌ వెల్లడించారు. అమ్మకాల్లో ‘హీరో ఇక టూవీలర్స్‌ కంపెనీల్లో హీరోమోటోకార్ప్‌ జులైలో 6,23,269 యూనిట్లను విక్రయించింది. 17శాతం వృద్ధిని నమోదుచేసింది. వరుసగామూడోనెలలో కూడా ఆరులక్షల యూనిట్లను అధిగమించింది. టూ వీలర్‌ ఉత్పత్తిలో 16 సంవత్సరాలుగా అద్వితీయ ప్రగతితో ఉన్నట్లు కంపెనీ వివరించింది. అంతకు ముందు ఏడాదికంటే 17.1శాతం వృద్ధిని సాధించి నట్లు వివరించింది. గతఏడాది 5,32,113 యూనిట్ల ను విక్రయించింది. మేనెలలో కూడా హీరో 6,33,884 యూనిట్లు విక్రయించింది. ఇదే తీరు రానున్ననెలల్లో సాధించగలమని హీరో వెల్లడించింది. అమ్మకాల్లో టివిఎస్‌ జూమ్‌! ఇక టివిఎస్‌ మోటార్స్‌ జూలై విక్రయాలు 9.34 శాతం పెరిగి 2.71 లక్షల యూనిట్లను విక్ర యించింది. కంపెనీ అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 2,48,002 యూనిట్లు విక్రయిం చింది. మొత్తంగాటూవీలర్లు 2,63,336 యూనిట్లు గా ఉన్నాయి. గత ఏడాది ఇదేనెలలో 2,40,042 యూనిట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. దేశీయంగా విక్రయాలు 2,19,396 యూనిట్లుగా ఉన్నాయి. మోటార్‌సైకిల్స్‌పరంగా 1,09,429 యూనిట్లు విక్రయించింది. 15.1శాతం వృద్ధితో ఉన్నట్లు వెల్లడించింది. స్కూటర్ల పరంగాచూస్తే 35.8శాతం పెరిగి 92,378 యూనిట్లు విక్రయించింది. త్రిచక్రవాహనాలు కూడా 7835 యూనిట్లు విక్రయించింది. మొత్తం ఎగుమతులు 50,957 యూనిట్లు జరిగాయని అంచనా వేసింది. టూవీలర్‌ ఎగుమతులు 31.4శాతం పెరిగినట్లు కంపెనీ ప్రకటించింది.
1entertainment
ఆటోమేషన్‌తో కొలువులు ఆగమాగం! -  భారత్‌లో 69% ఉద్యోగాలపై ప్రభావం - అస్థిరంకానున్న సంప్రదాయక ఆర్థిక వ్యవస్థలు - పరిణామాలను విశ్లేషిస్తున్నాం: ప్రపంచ బ్యాంకు వాషింగ్టన్‌: 'ఉద్యోగాల యాంత్రీకరణ' (ఆటోమేషన్‌) కారణంగా భారత్‌లో భారీ ఎత్తున కొలువుల్లో కొత పడనుందని ప్రపంచ బ్యాంకు అధినేత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో తీవ్రతరమవుత్నున పేదరికంపై వాషింగ్టన్‌లోని 'కిమ్‌ బ్రూకింగ్స్‌' ఇన్‌స్టిట్యూట్‌లో మంగళవారం జరిగిన చర్చ కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ కిమ్‌ మాట్లాడుతూ ఆటోమేషన్‌ అనర్థాలపై పలు వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఆటోమేషన్‌ కారణంగా ప్రస్తుతం ఉన్న కొలువుల్లో దాదాపు 69 శాతం ఉద్యోగాలకు ముప్పు వాటల్లే ప్రమాదం ఉందని బ్యాంక్‌ విశ్లేషించింది. చైనాలో ఏకంగా 77 శాతం ఉద్యోగాలు ఆటోమేషన్‌ ప్రభావంతో ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించారు. ఆటోమేషన్‌ టెక్నలాజీ అభివృద్ధి చెందుతున్న దేశాల సంప్రదాయ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే అవకాశం ఉందని ఆయన హెచ్చరించింది. వ్యవసాయోత్పాదకత పెరగాలి.. ఆటోమేషన్‌ ప్రక్రియ ఎంత కాలంలో వేగం పుంజుకొని ఆయా దేశాల్లో కొలువులకు ఎసరు పెట్టనుందో అన్న అంశాన్ని లెక్కించి చెప్పలేమని ఆయన అన్నారు. పూర్తిస్థాయి పారిశ్రామీకీకరణ అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచడం ద్వారా సంప్రదాయ ఆర్థికవ్యవస్థ వద్ధికి మార్గం సుగమవుతుందనీ అన్నారు. యాంత్రీకరణ, టెక్నాలజీ కారణంగా సంప్రదాయ పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతిం దని.. మాన్యువల్‌ ఉద్యోగాలు నష్టపోతున్నామనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధోరణి కేవలం అభివృద్ధి చెందిన దేశాలకు అమెరికాకు పరిమితం కాదనీ, ప్రపంచ దేశాల్లో ప్రతిచోటా ప్రజలు దీనికి ప్రభావితమవుతున్నారని కిమ్‌ తెలిపారు. జీ20 అదినేతల ఆందోళన.. దీనిపై చైనాలో జరిగిన జీ20 సమావేశంలో ప్రపంచ నేతలందరూ ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అభివృద్ధిని ప్రోత్సహించడానికి గాను పెట్టుబడులు పెట్టడం, ఆర్థిక సాయాన్ని అందించడం వంటి చర్యలను ప్రపంచ బ్యాంకు కొనసాగిస్తుందని ఆయన అన్నారు. ఉమ్మడి వాణిజ్యం ద్వారా ఆర్థిక వ్యవస్థ వద్దికోసం ప్రపంచ దేశాల సమిష్టి కషితో కొంత పురోగతి సాధించినప్పటికీ తీవ్ర ప్రతికూలతను ఎదుర్కోక తప్పడం లేదన్నారు. డిమాండ్‌ తగ్గి సరుకుల ధరల్లో క్షీణత .. ప్రపంచ వాణిజ్యంలో మందగింపు పెద్ద సవాళ్లుగా ఉన్నాయన్నారు. మందగమనం చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు పరిశోధన పత్రం విశ్లేషణ ప్రకారం ఆటోమేషన్‌ వల్ల భారత్‌లో 69 శాతం ఉద్యోగాలకు ఇబ్బందులు తలెత్తనున్నాయని. అదే విధంగా చైనాలో 77 శాతం, ఇతియోఫియాలో ఏకంగా 85 శాతం మంది ఉద్యోగాలు తిప్పలు పడనున్నారని అంచనా వేసింది. ఒక వేళ ఇదే జరిగితే ఆయా దేశాలు చాలా ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందన్నారు. కాగా ఈ దేశాలకు ఏ తరహా ఆర్థిక వృద్ధి అవసరమో అర్థం చేసుకోవాల్సి, విశ్లేషించాల్సి ఉందని కిమ్‌ పేర్కొన్నారు. ఈ రంగాల్లోని కొలువులకే ప్రమాదం ఎక్కువ.. ఇప్పటికే బ్యాంకింగ్‌ రంగంలో రోబో మిషన్లు వచ్చేస్తున్నాయి. దేశంలో ప్రయివేటు రంగ విత్త సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు తొలుత అందుబాటులోకి తెచ్చిన ఈ యంత్రాలను మిగితా బ్యాంకర్లు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరికరాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో భారీగా ఉపాధి పడిపోనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆటోమేషన్‌ వల్ల బ్యాంకింగ్‌తో పాటు ప్రధానంగా టెక్స్‌టైల్‌ రంగం, పోస్టల్‌ సర్వీసెస్‌, కమ్యూనికేషన్స్‌ పరికరాల తయారీ, పత్రికలు, ఎలక్ట్రానిక్స్‌ రంగం, గాజు సీసాల తయారీ, కాగితం ఉత్పత్తి, ఆటోమోబైల్‌ రంగాలపై తీవ్ర ప్రభావం ఉండనుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Vaani Pushpa 178 Views hardik pandya , Operation , succeeded HARDIK లండన్‌: గత కొంతకాలంగా వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యాకు సర్జరీ పూర్తయ్యింది. తన వెన్నునొప్పి గాయానికి సంబంధించి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తైనట్లు హార్థిక్‌ పేర్కొన్నాడు. గత కొంతకాలంగా వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న హార్థిక్‌…ఇటీవల సర్జరీ నిమిత్తం లండన్‌ వెళ్లాడు. దాంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు నుంచి హార్థిక్‌కు విశ్రాంతి ఇచ్చారు. సఫారీలతో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న హార్థిక్‌ను వెన్నునొప్పి గాయంతో సతమతమయ్యాడు. బెంగళూరు, మొహాలీలో జరిగిన టీ20 మ్యాచ్‌లో పాల్గొన్న హార్థిక్‌…అటు తర్వాత లండన్‌కు వెళ్లాడు. తన సర్జరీ విజయవంతంగా పూర్తైన విషయాన్ని హార్థిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పేర్కొన్నాడు. నా సర్జరీ సక్సెస్‌ అయ్యింది. నేను తేరుకోవాలని ఆశించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. నేను తిరిగి జట్టుతో కలుస్తా. కానీ సమయం తెలియదు. అప్పటివరకూ నన్ను మిస్‌ అవుతారంటూ హార్థిక్‌ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో పూర్తి స్థాయిలో ఎటువంటి గాయాల బారిన పడకుండా ఆడిన హార్థిక్‌…దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. దాంతో సర్జరీ అవసరమని వైద్యులు సూచించడంతో లండన్‌ వెళ్లాడు. గతేడాది ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తుదిపోరులో హార్థిక్‌ను తొలిసారి వెన్నునొప్పి గాయం వేధించింది. ఆ తర్వాత తేరుకున్నప్పటికీ తరచూ ఈ గాయం వేధించడంతో కొన్ని సిరీస్‌లు మిస్‌ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లకు గాయం వేధించిన కారణంగానే హార్థిక్‌ దూరం కాగా, వెస్టిండీస్‌ పర్యటనలో కూడా పాల్గొనలేదు. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/
2sports
తాజావార్తలు భారీగా కుంగిన అడాగ్‌ షేర్లు ముంబయి: అనిల్‌ అంబానీ నేతృత్వంలోని అడాగ్‌ గ్రూప్‌ కంపెనీల షేర్లు నేటి మార్కెట్లో భారీగా కుంగాయి. ఎరిక్సన్‌కు చెల్లింపుల కేసుకు సంబంధించి అనిల్‌ అంబానీ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం కోర్టు పేర్కొని ఆయనకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. దీంతో రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్లు ఒక దశలో 8.38, రిలయన్స్‌ ఇన్ఫ్రా 6.38, ఆర్‌కామ్‌ 5.98శాతం వరకు కుంగాయి. ఇక రిలయన్స్ నేవల్‌ ఇంజినీరింగ్‌ 4.23, రిలయన్స్‌ పవర్‌ 1.84 శాతం చొప్పున షేర్లు పడిపోయాయి. ‘‘మూడు రిలయన్స్‌ కంపెనీలకు సొమ్ములు చెల్లించే ఉద్దేశం లేదు. ఈ మొత్తం వారి ధిక్కారానికి జరిమానా’’ అని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానంతో ఈ విధంగా వ్యవహరించినందుకు రిలయన్స్‌ క్షమాపణలు ఏమాత్రం అంగీకరించబోమని పేర్కొన్నారు. ఎరిక్సన్‌కు నాలుగు వారాల్లోపు రూ.453 కోట్లు చెల్లించాలని, లేకపోతే మూడు నెలలు జైలు శిక్ష తప్పదని తీర్పులో పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ వినీత్‌ సహరన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. దీంతోపాటు అనిల్‌ అంబానీ, రిలయన్స్‌ టెలికాం ఛైర్మన్‌ సతీష్‌ సేథ్‌‌, రిలయన్స్‌ ఇన్ఫ్రాటెల్‌ ఛైర్‌పర్సన్‌ ఛాయా విరానీలు తలా కోటి రూపాయలు అపరాధ రుసుం చెల్లించాలని పేర్కొంది. నెలలోపు ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయకపోతే నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. Tags :
1entertainment
ANDHRA BANK WGIGILENCE AWARENESS ఆంధ్రాబ్యాంకులో విజిలెన్స్‌ వారోత్సవాలు హైదరాబాద్‌, నవంబరు 1: ప్రభుత్వ రంగంలోని ఆంధ్రబ్యాంకు కేంద్ర కార్యాలయంలో విజిలెన్స్‌ వారోత్సవా లు జరిగాయి. బ్యాంకు ఎండి సిఇఒ సురేష్‌ ఎన్‌ పటేల్‌ ఈ సందర్భంగా సిబ్బంది అధికారులచేత అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్న ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను అనుసరిం చి రాష్ట్రీయ ఏక్‌తాదివస్‌ ప్రతిజ్ఞను బ్యాంకు ఎండి చేయించారు. వారం పొడవునా జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రాబ్యాంకు గ్రామసభలు ప్రతి శాఖపరిధిలోను నిర్వహిస్తుందని దేశవ్యాప్తంగా వ్యాస రచ న, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ సందేశాలను సభలో చదివి వినిపించారు.
1entertainment
Visit Site Recommended byColombia ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి మహేంద్రసింగ్ ధోనీకి భారత సెలక్టర్లు విశ్రాంతినివ్వనున్నారని వార్త వెలువడగానే.. రిషబ్ పంత్&zwnj;కి అతని స్థానంలో చోటివ్వాలని చాలా మంది సూచించారు. ఇటీవల దేశవాళీ టోర్నీల్లో ఈ యువ క్రికెటర్ మెరుగ్గా రాణించడంతో.. సెలక్టర్లు కూడా అతనికే ఓటేశారు. కానీ.. దాదాపు ఏడాది తర్వాత దొరికిన అరుదైన అవకాశాన్ని రిషబ్ పంత్ చేజార్చుకున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్&zwnj;లో 23 బంతుల్లో 23 పరుగులు చేసిన పంత్.. కీలక సమయంలో వికెట్ చేజార్చుకుని నిరాశపరిచాడు. అనంతరం బంగ్లాదేశ్&zwnj;తో జరిగిన మ్యాచ్&zwnj;లో పేలవ ఫుట్&zwnj;వర్క్&zwnj;తో బంతిని వికెట్లపైకి ఆడుకుని 7 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో తొలి రెండు మ్యాచ్&zwnj;ల్లోనూ రిజర్వ్ బెంచ్&zwnj;కే పరిమితమైన కేఎల్&zwnj; రాహుల్&zwnj;కి మార్గం సుగుమమైంది. సోమవారం రాత్రి మ్యాచ్&zwnj;లో రాహుల్ 18 పరుగులకే హిట్ వికెట్ రూపంలో ఔటైనప్పటికీ.. అతనికి మరో అవకాశం దక్కనుంది. ఒకవేళ అతనిపై వేటుపడితే.. దీపక్ హుడా ఆ ఛాన్స్ దక్కొచ్చు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
bse మార్కెట్లకు ఒఎన్‌జిసి, ఐసిఐసిఐ మద్దతు ముంబై, అక్టోబరు 24: అంతర్జాతీయ మార్కెట్‌ధోరణుల తీరుతెన్నులు దేశీయ మార్కెట్లపై ఎక్కువ చూపించాయి. వారం ప్రారంభంలో సెన్సెక్స్‌ 102 పాయింట్లు గరిష్టంగా ముగిసింది. ఒఎన్‌జిసి ఐదుశాతం పెరిగి మార్కెట్లకు మద్దతునిచ్చింది. ఐసిఐసిఐబ్యాంకు కూడా గరిష్టంగా పెరిగి సెన్సెక్స్‌లో బ్యాంక్‌ సూచీకి అండగా నిలిచింది. యూరోపియన్‌ మార్కెట్లధోరణులు కీలకంగా నిలిచాయి. సెన్సెక్స్‌ 102పాయింట్లు ఎగువన28,179 పాయింట్ల వద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి 16 పాయింట్ల ఎగువన 8709 పాయింట్లవద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ 0.1శాతం, స్మాల్‌క్యాప్‌సూచి 0.5శాతం ముగిసింది. మార్కెట్లపరం గా 1681 కంపెనీలు లాభాల్లో ముగిస్తే 1171 కంపె నీలు స్వల్పనష్టాలు చవిచూసాయి. అంతర్జాతీయ మార్కెట్లపరంగా ఆసియా మార్కెట్లు సోమవారం గరిష్టంగాపెరిగాయి. చైనా హాంకాంగ్‌ వంటి ప్రాం తాల్లో మరింత బలపడ్డాయి. షాంఘై కాంపోజిట్‌ 1.2శాతం, హ్యాంగ్‌షెంగ్‌ 1శాతం పెరిగాయి. నిక్కీ 0.3శాతంపెరిగింది. సింగపూర్‌స్ట్రెయిట్‌టైమ్స్‌ 0.9శాతం పెరిగింది. యూరోపిన్‌ కంపెనీలషేన్లు ఉత్పత్తిరంగ సూచి గణాంకాలు ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు ప్రకటించడంతో అందుకు అనుగుణంగా నడిచాయి. జర్మనీడాక్స్‌ 0.8శాతం, ఫ్రాన్స్‌ సిఎసి 0.7శాతం, లండన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ 0.2శాతం పెరిగాయి. యాక్సిస్‌బ్యాంకు, అదాని ఎంటర్‌ప్రైజెస్‌, భారతి ఇన్‌ఫ్రా టెల్‌, జిఎస్‌ఎఫ్‌సి, ఐడియా సెల్యులర్‌, ఇండియా బుల్స్‌, రియల్‌ఎస్టేట్‌, కెపిఆర్‌మిల్‌, నవీన్‌ ఫ్లోరైన్‌ ఇంటర్నేషనల్‌, ర్యాలీస్‌ ఇండియా, రిలయన్స్‌ కేపిటల్‌ వంటివి రెండోత్రైమాసిక పలితాలు ప్రకటించ నున్నందున షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. ఇక హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు వాటాదారులకు స్థిరమైన రేటింగ్స్‌ ఇచ్చాయి. గృహరుణాలకు డిమాండ్‌పెరిగిం ది. ఐపిఒలుపరంగా పిఎన్‌బి హౌసింగ్‌ఫైనాన్స్‌ ఇన్వెస్టర్లకు దీర్ఘకాలిక ప్రయో జానాలిచ్చే ఐపిఒ జారీచేస్తోంది. కంపెనీ 3వేల కోట్లు ఐపిఒద్వారా సమీక రిస్తోంది. ఇష్యూధర 750నుంచి 775లుగా ప్రకటించింది. ప్రభుత్వ రంగంలోని ఒఎన్‌జిసి అన్నింటికంటే గరిష్టంగాపెరిగింది. కంపె నీ ఐదుశాతం పెరిగింది. ఐసిఐసిఐబ్యాంకుపరంగా 2శాతం లాభాల్లో నడిచింది. రష్యారాస్‌నెఫ్టనుంచి సొమ్ములు రావ డంతో ఎస్సార్‌గ్రూప్‌కు ఇచ్చిన రుణం మొత్తం వసూల వుతుందన్న ధీమావ్యక్తం అయింది. టెలికాం రంగషేర్లు కొంత ఒత్తిడికిలోనయ్యాయి. ట్రా§్‌ుమూడు సంస్థలపై 3050కోట్ల జరిమానా విధించడమే ఇందుకు కీలకం. భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాసెల్యులర్‌ సంస్థలపై జరిమానా విధించింది. ఆర్‌జియో కాల్‌ వైఫల్యాలకు ఈమూడుసంస్థలే కారణమని ప్రకటిం చింది. భారతిఎయిర్‌టెల్‌ ఒకటిశాతం క్షీణిస్తే ఐడియా సెల్యులర్‌ 2.6శాతం దిగజారింది. మార్కెట్లలో విప్రో ఎక్కువ నష్టపోయింది. మూడుశాతంగా ఉంది. ఐటి మేజర్‌ సంస్థ మూడోత్రైమాసికానికి రాబడులు కూడా తగ్గుతాయని అంచనావేసింది. లక్ష్మీమెషిన్‌వర్క్స్‌ ఐదు శాతం ఎగువన పెరిగింది.మైండ్‌ట్రీ ఐదుశాతం దిగువన ముగిసింది. విగార్డ్‌ ఇండస్ట్రీస్‌ ఐదుశాతం పెరిగింది. నికరలాభం 39 కోట్లు రాబట్టి పనితీరు మెరుగుపరుచుకుంది. టాటా టెలిసర్వీ సెస్‌ 20శాతం ఎగువన 7.50వద్ద ముగిసింది. టాటా టెలిసర్వీసెస్‌ డాట్‌ నుంచి ఎయిర్‌వేవ్స్‌కొననుగోలుకు 2300కోట్లు ధరావతుచేసినట్లు వెల్లడిం చింది. మొత్తంమీద అంతర్జాతీయ మార్కెట్‌ధోరణులు మార్కెట్లకుకీలకమయ్యాయి.
1entertainment
srinath 316 Views bhaichung bhutia , mary kom , national sports award 2019 Mary Kom, Bhaichung Bhutia న్యూఢిల్లీ: ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కార విజేతలను ఎంపిక చేయడానికి కొత్త నిబంధన పాటించనున్నారు. ఈసారి అథ్లెట్లు మరియు కోచ్‌ల అవార్డులను 12 మంది సభ్యుల ప్యానెల్ నిర్ణయిస్తుంది. కొత్తగా ఏర్పడిన సెలక్షన్ కమిటీలో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ ఎంసి మేరీ కోమ్, భారత మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ భైచుంగ్ భూటియా, ప్రపంచ ఛాంపియన్ కాంస్య పతక విజేత అంజు బాబీ జార్జ్ వంటి వారు ఉన్నారు. సాధారణంగా ఆచారం ప్రకారం, భారత హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్టు 29 న అవార్డులు ఇవ్వబడతాయి. ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. 12 మంది సభ్యుల కమిటీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) ముకుండకం శర్మ అధ్యక్షత వహిస్తారు. ఈ కమిటీలో ఇద్దరు మీడియా వ్యక్తులు టైమ్స్ గ్రూప్ (డిజిటల్) చీఫ్ ఎడిటర్ రాజేష్ కల్రా, ప్రఖ్యాత స్పోర్ట్స్ వ్యాఖ్యాత చారు శర్మ ఉన్నారు. For more updates on Sports news in Telugu please visit
2sports
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV దుమ్మురేపిన మార్కెట్.. కీలక స్థాయికి పైన ముగింపు..! Rupee | దేశీ స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. ఈ రోజు కూడా బెంచ్‌మార్క్ సూచీలు ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 40 వేల మార్క్ పైన క్లోజయ్యింది. మరోవైపు క్రూడ్ ధరలు తగ్గాయి. Samayam Telugu | Updated: Oct 30, 2019, 04:55PM IST దుమ్మురేపిన మార్కెట్.. కీలక స్థాయికి పైన ముగింపు..! హైలైట్స్ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా ర్యాలీ 50 పాయింట్లకు పైన పెరిగిన నిఫ్టీ ప్రభుత్వ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల జోరు దేశీ స్టాక్ మార్కెట్ మళ్లీ ర్యాలీ చేసింది. బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్, ఐటీ, ఎప్ఎంసీజీ రంగ షేర్లు పరుగులు పెట్టడం మార్కెట్‌కు కలిసొచ్చింది. సెన్సెక్స్ 40,000 పాయింట్ల పైన క్లోజయ్యింది. జూన్ 4 నుంచి చూస్తే సెన్సెక్స్‌ ఈ స్థాయిలో క్లోజ్ కావడం ఇదే తొలిసారి. నిఫ్టీ కూడా 11,800 పాయింట్ల మార్క్‌ పైనే ముగిసింది. జూలై 5 నుంచి చూస్తే సూచీ ఈ స్థాయిలో క్లోజ్ కావడం ఇదే ప్రథమం. బుధవారం చివరకు సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంతో 40,052 పాయింట్ల వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 11,844 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 346 పాయింట్ల మేర పెరిగింది. నిఫ్టీ కూడా 97 పాయింట్లు పైకి కదిలింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు పరుగులు పెట్టాయి. Stock Market Highlights.. ✺ నిఫ్టీ 50లో గెయిల్, గ్రాసిమ్, ఎస్‌బీఐ, టీసీఎస్, ఐటీసీ షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. గెయిల్ 6 శాతానికి పైగా పెరిగింది. Also Read: ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. నవంబర్ 1 నుంచి ఆ నిర్ణయం అమలులోకి! ✺ అదేసమయంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్, యస్ బ్యాంక్, సిప్లా, మారుతీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్ 5 శాతానికి పైగా పడిపోయింది. ✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 4 శాతం పెరిగింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో సూచీలు నష్టాల్లో క్లోజయ్యాయి. Also Read: మోదీ సంచలన నిర్ణయం? బంగారం ఎక్కువుంటే భారీ జరిమానా! ✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.63 శాతం తగ్గుదలతో 61.20 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.23 శాతం క్షీణతతో 55.41 డాలర్లకు తగ్గింది. ✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. 6 పైసలు క్షీణతతో 70.91 వద్ద కదలాడుతోంది.
1entertainment
Hyderabad, First Published 21, Apr 2019, 5:13 PM IST Highlights ఎనభైల్లో, తొంబైల్లో అప్పటి కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్ గా మారిన అందం విజయశాంతి. ఫైర్ బ్రాండ్ గా వెలిగిన విజయశాంతి సినీ  ప్రపంచం నుంచి రిటైర్ అయ్యి చాలా కాలం అయ్యింది. ఎనభైల్లో, తొంబైల్లో అప్పటి కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్ గా మారిన అందం విజయశాంతి. ఫైర్ బ్రాండ్ గా వెలిగిన విజయశాంతి సినీ  ప్రపంచం నుంచి రిటైర్ అయ్యి చాలా కాలం అయ్యింది. అయితే రాజకీయాల్లో బిజిగా ఉంటూ ఇప్పటికీ వార్తలకెక్కుతోంది. అయితే అప్పటి నుంచీ ఆమె రీ ఎంట్రీ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరికీ ఆమె డేట్స్ ఇవ్వలేదు. కానీ తాజాగా ఆమె మహేష్ బాబు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆశ్చర్చపరిచింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవటానికి ఆమె ను ఒప్పించటానికి దర్శక,నిర్మాతలు చాలా ప్రయాసపడ్డారట. ఆ మధ్యన చిరంజీవి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందనుకున్నారు. కానీ అది గాసిప్పే అని తేలిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అనీల్ రావిపూడి ఆమె చుట్టూ తిరిగి, ఒకటికి నాలుగుసార్లు ఆమె పాత్ర నేరేషన్ ఇచ్చి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. సినిమాలో ఆమెదే కీ రోల్ కావటం , భారీ బడ్జెట్ చిత్రం కావటం, మహేష్ బాబు హీరో కావటం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆమె ఓకే చేసిందిట. విజయ శాంతి, మహేష్ ఇద్దరూ పోస్టర్స్ పై కనపడితే ఆ క్రేజ్ వేరుగా ఉంటుందని అంటున్నారు. హీరోయిన్ కు తల్లిగా ఆమె పాత్ర ఉంటుందని  ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అప్పట్లో వాణిశ్రీ చేసే పొగరుబోతు అత్త టైప్ పాత్ర అని మరికొందరు అంటున్నారు. అయితే ఇంకా ఈ రోజుల్లో అత్తా-అల్లుళ్ల సవాల్ సినిమాలు నడుస్తాయా..ఎంత కామెడీ అయితే మాత్రం. ఆ మాత్రం మహేష్ కు తెలియదా అంటున్నారు. అయితే ఎఫ్ 2 లో పాత క్షేమంగా వెళ్లి లాభంగా రండి పాయింటును, పెళ్లాం ఊరిళెతే పాయింటు ని కలిపి చెప్పి ఒప్పించలేదా..అలాగే మహేష్ తో కూడా చేస్తాడంటున్నారు. ఈ మ్యాటర్ లో ఎంత నిజముందో కానీ విజయ శాంతి మాత్రం సినిమాకు సైన్ చేయటం మాత్రం నిజం.   Last Updated 21, Apr 2019, 5:13 PM IST
0business