news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Suresh 102 Views
బకాయిల రికవరీకి బ్యాంకులు ఇ-వేలం!
ముంబై, ఆగస్టు 26: ప్రభుత్వరంగంలోని భారతీయ స్టేట్బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకులు బకా యిల రికవరీలకు ఎక్కువగా స్థిరాస్తులు వేలం ప్రకటించాయి. ఎస్బిఐ అయితే ఇందుకోసం మెగా ఇ-వేలం నిర్వహిస్తోంది. మొత్తం 1107 స్థిరాస్తులను ఆన్లైన్లో సెప్టెంబరు ఏడవ తేదీ వేలంలో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొత్తంగాచూస్తే ఆస్తులు బేస్ధర రూపంలోనే రూ.2500 కోట్లు ధరలు పలుకుతున్నాయి.
గురువారం పెదపెద్ద ప్రకటనలతో ఎస్బిఐ వెలుగులోనికి వచ్చింది. ఆఫీసు లు, సాపులు, నివాసాలు, ఫ్యాక్టరీలు, ప్లాట్లు మొత్తం వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. కొనుగోలు దారులను ఆకర్షిఇంచేందుకు గృహరుణాలను అందుబాటుధరల్లో బిడ్డర్లకు అందిస్తామని ప్రకటించింది. ఎస్బిఐ బిడ్డర్లు మూడు వెబ్సైట్ల ద్వారా వేలంలో పాల్గొనేందుకు అవకాశం కలుగుతోంది. ఒక వ్యూహం ప్రకారం బకాయిల రికవరీకి ఎస్బిఐ కొంత ముందు చూపుతో వ్యవహరిస్తోంది. గత ఏడాది నుంచి ఇవేలం మరింత ముమ్మరంచేసింది. దీనితో త్రైమాసికం వారీగా మంచి స్పందన వస్తుండ టంతో రికవరీ తీరు కూడా మెరుగుపడింది. ఈ వేలం ప్రక్రియ పారదర్శకంగా కనిపిస్తుండటంతో ఎక్కువ మంది నివాసగృహాలు కొనుగోలుకు ఆసక్తిచూపిస్తు న్నారు. పారిశ్రామిక యూనిట్లపరంగాచూస్తే ఆర్థికవృద్ధి ఆధారంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇక వాణిజ్యపరమైన ఆస్తుల వేలంలో కొంత సాధ్యాసాధ్యాల ఆధారంగా కొనుగోళ్లు ఉంటున్నట్లు ఎస్బిఐ ఎగ్జిక్యూటివ్ ఒకరు వివరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా 786 చదరపు మీటర్ల వాణిజ్య స్థిరాస్తిని ఎంఐడిసి అంధేరి ప్రాంతంలో విక్రయిస్తోంది. రిజర్వుధర 9.6 కోట్లుగా నిర్ణయించింది. శాంతాక్రజ్లో 829 చదరపు అడుగుల స్థిరాస్తిని 173 కోట్లకు విక్రయిస్తోంది. సెప్టెంబరు 8వ తేదీ వేలం జరుగుతుంది. ఈ బ్యాంకు కూడా వేలం ప్రక్రియను ప్రముఖంగా ప్రచురించింది.
| 1entertainment
|
- చైనాలో భారీగా అపరంజి విక్రయాలు
- ప్రపంచ మార్కెట్లోనూ క్షీణత
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అపరంజి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా భారత్లో కనకం ధరలు రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచనుందన్న సంకేతాలు, చైనా ఫ్యూచర్ మార్కెట్లో మదుపర్లు పెద్ద మొత్తంలో పసిడి విక్రయాలకు మొగ్గు చూపడంతో పాటు దేశీయ బులియన్ మార్కెట్లో వర్తకులు, రిటైలర్ల అమ్మకాల్లో స్తబ్దత కొనసాగుతుండడం అపరంజి ధరలు మరింత దిగివచ్చేలా చేశాయి. మరోవైపు డాలర్కు డిమాండ్ పెరగడంతో బంగారంపై పెట్టుబడుల్లో బలహీనత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.300 తగ్గి వరుసగా రూ.25,700, రూ.25,550గా నమోదయ్యింది. ఇదే క్రమంలో కిలో వెండిపై రూ.150 క్షీణించి రూ34,200గా పలికింది. 100 వెండి నాణేల ధరలు రూ.1000 తగ్గి రూ.49,000గా నమోదయ్యింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.182 దిగివచ్చి రూ.26,107గా, 22 క్యారెట్ల స్వచ్ఛత బంగారం ధర రూ.24,410 వద్ద నమోదయ్యింది. కిలో వెండిపై ఏకంగా రూ.1090 క్షీణించి రూ.33,610గా పలికింది.
ఒకే రోజు 4% పతనం..
ఈ ఏడాది ముగింపు నాటికి అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక వడ్డీ రేట్ల పెంచనుందని ఆ సంస్థ ఛైర్పర్సన్ జన్నత్ యెల్లెన్ గత వారం ప్రకటించడంతో డాలర్కు డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం కంటే డాలర్కు డిమాండ్ పెరిగింది. చైనా పసిడి విక్రయాలకు మొగ్గు చూపుతుందన్న ఊహాగానాలు బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా దోహదం చేస్తున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఒక్క ఔన్స్ బంగారం ధర 1,088.05 డాలర్లకు దిగివచ్చింది. ఒకే రోజు 4 శాతం ధర పడిపోవడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. 2010 మార్చిలో ఈ స్థాయిలో బంగారం క్షీణించింది. ప్లాటినమ్ ధరలోనూ 5 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ఒక్క ఔన్స్ ప్లాటినమ్ ధర 942.49 డాలర్లుగా చోటు చేసుకుంది. ఫిబ్రవరి 2009న ఈ స్థాయిలో నమోదయ్యింది.
చైనా షాంగై గోల్డ్ ఎక్సేంజీలో కేవలం రెండు నిమిషాల్లోనే 5 మెట్రిక్ టన్నుల బంగారాన్ని మదుపర్లు విక్రయానికి పెట్టారని ఓ నివేదికలో వెల్లడయ్యింది. సోమవారం ఉదయమే చైనా మార్కెట్లో బంగారం ధరల్లో 4 శాతం (50 డాలర్లు తగ్గి) ఒక్క ఔన్స్ ధర 1,086 డాలర్ల వద్ద నమోదయ్యింది. ఇదే క్రమంలో ప్లాటినమ్, వెండి ఇతర లోహాల ధరలూ పడిపోయాయి. సాధారణంగా ఈ మార్కెట్లో ప్రతి రోజు సగటున 25 టన్నుల బంగారం లావాదేవీలు జరుగుతాయి. తాజాగా భారీ స్థాయిలో విక్రయం చోటు చేసుకోవడం గత ఆరేళ్లలో ఇదే తొలిసారి. షాంగై మార్కెట్లో పడిపోయిన బంగారం ధర ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. భారత్లో 2012 అక్టోబర్ 5న నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో బంగారం ధర ఇదే తరహాలో పడిపోయింది. ఓ దశలో 15 శాతం దిగజారి 15 నిమిషాల పాటు ట్రేడింగ్ అయ్యింది. ఈ సమయంలో 10 గ్రాముల బంగారంపై రూ.650 క్షీణించింది.
మూడు మాసాల గరిష్ఠానికి డాలర్
ఈ ఏడాది ముగింపు నాటికి అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచనున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లో డాలర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం ధర కూడా పడిపోవడంతో మూడు మాసాల గరిష్ఠ స్థాయికి డాలర్ విలువ చేరింది. మరోవైపు అమెరికాలో వినియోగ ధరలు, గృహాల విక్రయాల్లో మద్దతు కూడా డాలర్లో డిమాండ్ను నింపాయి. గ్రీసులో నెలకొన్న సంక్షోభ ఛాయలు, యూరోను బలహీనం చేయడం కూడా డాలర్కు కలిసి వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో యూరో మారకం విలువ 0.2 శాతం తగ్గింది.
మరింత తగ్గొచ్చు..!
రానున్న 12 నుంచి 18 మాసాల్లో ప్రపంచ మార్కెట్లో బంగారం డిమాండ్లో ఒక్క అంకె వృద్ధి మాత్రమే చోటు చేసుకునే అవకాశాలున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. బంగారంపై పెట్టుబడుల ఆకర్షణ తగ్గడానికి తోడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న సంకేతాలు బంగారం విక్రయాల్లో మరింత స్తబ్దతను పెంచనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా అమెరికా వడ్డీ రేట్ల పెంపు జరిగితే ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు తక్కువ డాలర్ల మధ్య కొనసాగే అవకాశాలున్నాయని ఇండ్-రా కార్పొరేట్స్ సీనియర్ డైరెక్టర్ దీప్ ఎన్ ముఖర్జీ పేర్కొన్నారు. భారత్లో 10 గ్రాముల పసిడి ధర రూ.20,500-24,000 మధ్య చోటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
ఘనంగా ఎస్బీహెచ్ ఇఫ్తార్
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
హైదారబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలోని తమ బ్యాంకు ఖాతాదారుల కోసం స్టేట్ బ్యాంక్ హైదరాబాద్(ఎస్బీహెచ్) ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని చిరాగ్ అలీ వీధిలోని రాయల్టన్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి బ్యాంకుకు చెందిన ప్రముఖ అధికారులతో పాటు 500 మందికి పైగా ఎస్బీహెచ్కు చెందిన విశిష్ట ఖాతాదారులు పాల్గొన్నారు. ఖాతాదారులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ.. వారి సహకారంతో దూసుకుపోతున్న ఎస్బీహెచ్ బ్యాంకు ఇలాంటి ప్రోత్సహకర కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
New Delhi, First Published 26, Aug 2018, 11:58 AM IST
Highlights
కొత్త ఖాతాదారులను చేర్చుకోరాదన్న రిజర్వు బ్యాంకు ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని పేటియం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ శేఖర శర్మ తెలిపారు. ఈ పరిమితిని ఎప్పుడు సడలిస్తారన్న అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని ఓ మ్యూచువల్ ఫండ్ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు.
న్యూఢిల్లీ: కొత్త ఖాతాదారులను చేర్చుకోరాదన్న రిజర్వు బ్యాంకు ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని పేటియం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ శేఖర శర్మ తెలిపారు. ఈ పరిమితిని ఎప్పుడు సడలిస్తారన్న అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని ఓ మ్యూచువల్ ఫండ్ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు.
కొత్తవారిని చేర్చుకోవడంపై ఉన్న పరిమితిని సడలించే విషయమై ఆర్బీఐతో చర్చలు కొనసాగుతున్నాయని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ వర్మ తెలిపారు. అయితే ఇవి ఎప్పుడు ఒక కొలిక్కి వస్తాయన్న విషయంలో తెలియడం లేదని పేర్కొన్నారు.
కొత్త ఖాతాదారులను చేర్చుకొనే విషయంలో కొన్ని పేమెంట్స్ బ్యాంకు అవకతవకలకు పాల్పడుతుండడం, ఖాతా తెరవడం కోసం కేవైసీ నిబంధనలను సరిగ్గా పాటించకపోవడం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్బీఐ గత నెలాఖరు నుంచి పేటీఎంలో కొత్త ఖాతాదారులను చేర్చుకోవడంపై నిషేధాన్ని విధించింది.
టెలికాం వినియోగదారుల అనుమతి తీసుకోకుండానే ఎయిర్టెల్ సంస్థ తమ ఖాతాదారుల పేరు మీద పేమెంట్ బ్యాంక్ ఖాతాలను తెరవడం వివాదాస్పదం కావడంతో గత డిసెంబర్లో ఆ సంస్థ లైసెన్స్ను రద్దు చేసిన ఆర్బీఐ తరువాత జులైలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ను పునరుద్ధరించింది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్తో పాటు ఫినో పేమెంట్ బ్యాంక్లను కూడా కొత్త ఖాతాదారులను చేర్చుకోవడాన్ని నిలిపివేయాలని అప్పట్లో ఆర్బీఐ కోరింది.
బ్యాంకు ఖాతాలను తెరిచే ముందు పేమెంట్ బ్యాంకులు కూడా సాధారణ బ్యాంక్ మాదిరిగానే సదరు ఖాతాదారు పూర్తి వివరాలను నో యువర్ కస్టమర్ (కేవైసీ) రూపంలో సమీకరించాల్సిందేనంటూ ఆర్బీఐ గత ఫిబ్రవరిలోనే నిబంధనలను జారీ చేసింది. దీనికి తోడు పేమెంట్ బ్యాంకు వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ కెవైసి విధానాన్ని కూడా ఆర్బీఐ ఆక్షేపించింది. ప్రత్యేక సంస్థల ద్వారా కేవైసీ చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది.
దీంతో పేమెంట్ బ్యాంక్స్కు కేవైసీ ఏర్పాట్లు చేసుకోవడం తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో పేమెంట్ బ్యాంకులు కొత్త వారిని చేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదరయ్యాయి. ఫలితంగా జులై నుంచి పేటిఎంతో సహా కొన్ని పేమెంట్ బ్యాంకుల్లో కొత్త ఖాతాదారుల చేరిక కష్టతరంగా మారింది.
Last Updated 9, Sep 2018, 1:56 PM IST
| 1entertainment
|
Hyderabad, First Published 29, Oct 2018, 9:04 PM IST
Highlights
ఇటీవల కాలంలో వరుసగా బయోపిక్ లు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. మహానటి ఇచ్చిన విజయంతో ఇతర బయోపిక్ లపై కూడా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.
ఇటీవల కాలంలో వరుసగా బయోపిక్ లు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. మహానటి ఇచ్చిన విజయంతో ఇతర బయోపిక్ లపై కూడా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఎలక్షన్స్ కి ముందు విడుదల కాబోయే ఈ సినిమా ఎలా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు.
క్రిష్ డైరెక్షన్ - బాలకృష్ణ తండ్రి పాత్రలో కనిపించడం ఇక ఇతర స్టార్ హీరోలు కూడా సినిమాలో భాగమవ్వడంతో సినిమా స్థాయి పెరిగింది. జనవరికి రానున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇకపోతే అదే సమయానికి చంద్రబాబు బయోపిక్ చంద్రోదయం కూడా విడుదల కానుంది. పెద్దగా స్టార్ డమ్ లేని వారితో రూపొందుతున్న ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుందట.
సీఎం అవ్వక ముందు బాల్యం.. అలాగే రాజకీయ ఓనమాలు.. సీఎం తరువాత జరిగిన పరిణామాల గురించి చంద్రోదయంలో క్లియర్ గా చూపిస్తారట. రీసెంట్ గా చిత్ర యూనిట్ చంద్రబాబుకి సినిమా గురించి వివరించి బ్లెస్సింగ్ తీసుకొని సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చెప్పేశారు. అదే సమయానికి ఎన్టీఆర్ కథానాయకుడు రానుంది. మధ్యలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా రానుంది.
అయితే ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ చంద్రోదయం సినిమాకు ఎఫెక్ట్ అవ్వదా అనే తరహాలో ఆలోచన రాకుండా ఉండదు. మరి ఆ రెండు సినిమాలా క్లాష్ ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Last Updated 29, Oct 2018, 9:04 PM IST
| 0business
|
Hyderabad, First Published 12, Apr 2019, 9:25 AM IST
Highlights
పేటీఎం, మొబిక్విక్ లతోపాటు గూగుల్ పే ద్వారా కూడా బంగారం కొనుగోలు చేయొచ్చు. అక్షయ తృతీయ, ధంతేరస్ లేదా దీపావళి వంటి పర్వదినాల్లో భారతీయులు అధికంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారని గూగుల్ పే ఇండియా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అంబరీష్ కెంఘే తెలిపారు.
న్యూఢిల్లీ: గూగుల్ పే యాప్ వినియోగదారులు పసిడి క్రయవిక్రయాలు చేసే సౌకర్యాన్ని గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియాతో జత కట్టింది. ఇప్పటికే పేటీఎం, మొబిక్విక్, ఫోన్పే యాప్లు బంగారం కొనుగోలు, అమ్మకాలు చేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి.
ఇప్పుడు గూగుల్ పే కూడా ఇదే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రిఫైనరీ సంస్థ ఎంఎంటీసీ-పీఏఎంపీతో ఒప్పందం కుదుర్చుకున్నందు వల్ల గూగుల్ పే వినియోగదారులు 99.99 శాతం 24 క్యారెట్ బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం లభిస్తుందని కంపెనీ తెలిపింది.
‘బంగారం భారతీయుల సంస్కృతి, సంప్రదాయంలో ముఖ్యమైనది. అందుకే బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది. అక్షయ తృతీయ, ధంతేరస్ లేదా దీపావళి వంటి పర్వదినాల్లో భారతీయులు అధికంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు’ అని గూగుల్ పే ఇండియా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అంబరీష్ కెంఘే తెలిపారు.
గూగుల్ పే వినియోగదారులు తమకు నచ్చినంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని, దీన్ని వినియోగదారుని తరఫున ఎంఎంటీసీ-పీఎఎంపీ సెక్యూర్ వాల్ట్స్లో స్టోర్ చేస్తుందన్నారు. తాజా ధరలకే ఎప్పుడైనా ఈ బంగారాన్ని కొనడం, అమ్మడం చేయవచ్చునన్నారు. గూగుల్ పే యాప్పై సదరు బంగారం వివరాలన్నీ ఉంటాయని, వినియోగదారులు సులభంగానే తెలుసుకోవచ్చని కూడా ఆయన ప్రకటించారు.
కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేకుండానే గూగుల్ పేలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయా? అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించిన మరునాడే గూగుల్ పే ఈ పసిడి క్రయ, విక్రయాలకు తెరతీయడం గమనార్హం. ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన నేపథ్యంలో గూగుల్ పే సేవలకున్న అనుమతి విషయంపై అటు గూగుల్ ఇండియాకు, ఇటు ఆర్బీఐకి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతీ విదితమే.
ఢిల్లీ హైకోర్టు నోటీసుల నేపథ్యంలో గూగుల్ పే అన్ని అనుమతుల్ని కలిగి ఉన్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. తమ భాగస్వామ్య బ్యాంకులకు ఓ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్గా సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఆయా బ్యాంకుల ఖాతాదారుల చెల్లింపులను చేస్తున్నామని, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా పేమెంట్స్కు అనుమతినిస్తున్నామని వివరించారు.
ఇది పేమెంట్ ప్రాసెసింగ్ లేదా సెటిల్మెంట్లో భాగం కాదని, ఇందుకు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎటువంటి లైసెన్సులు అక్కర్లేదని గూగుల్ పే అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, డేటా సమాచారాన్ని స్థానికంగానే భద్రపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో భాగస్వామ్య బ్యాంకులు, ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్లు గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
Last Updated 12, Apr 2019, 9:25 AM IST
| 1entertainment
|
ప్రస్తుత రీచార్జిల గడువు ముగిసేవరకు ఫ్రీకాల్స్ అంటూ తాజా ప్రకటన
Reliance Jio
ముంబయి: ఐయూసీ చార్జీల పేరిట నిమిషానికి 6 పైసలు వసూలు చేయాలని జియో తీసుకున్న నిర్ణయం విమర్శలపాలైన నేపథ్యంలో, సదరు సంస్థ నుంచి వినియోగదారులకు ఊరట కలిగించే ప్రకటన వెలువడింది. అక్టోబరు 9న, అంతకుముందు రీచార్జి చేసుకున్నవాళ్లు తమ ప్లాన్ గడువు ముగిసేవరకు ఇతర నెట్ వర్క్ లకు ఉచితంగానే కాల్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ప్రతి నిమిషానికి 6 పైసల చార్జి తప్పదు. దీనికోసం ప్రత్యేకంగా టాప్ అప్ కూపన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయంతో టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే, ట్రాయ్ ఐయూసీ చార్జీల నిబంధన తీసుకురావడంతో జియో తన ప్రణాళికను సమీక్షించుకోవాల్సి వచ్చింది. ఒక నెట్ వర్క్ కు చెందిన యూజర్లు మరో నెట్ వర్క్ కు కాల్ చేస్తే… కాల్ అందుకున్న నెట్ వర్క్ కు కాల్ చేసిన నెట్ వర్క్ కొంత చార్జీ చెల్లించడమే ఐయూసీ (ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి).
ఇప్పటివరకు జియో నుంచి ఇతర నెట్వర్క్ లకు చేసుకునే కాల్స్ కు అయ్యే ఖర్చును జియోనే భరించింది. గత మూడేళ్లలో తన నెట్వర్క్ నుంచి ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ఇతర నెట్వర్క్ లకు వెళ్లే వాయిస్ కాల్స్ పై రూ.13,500 మేర ఐయూసీ చార్జీలు పడగా, ఆ భారం మొత్త జియోనే భరించింది. అయితే, ఇకమీదట ఆ భారం తగ్గించుకోవాలని భావించిన జియో తన యూజర్లు చేసే వాయిస్ కాల్స్ పై నిమిషానికి రూ.6 పైసలు వంతున వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
6..6..6..6.. హిట్టర్ ఆరేసిన వేళ..!
టీ20 ఫార్మాట్లోని సిసలైన మజాను అభిమానులకి.. ఫైనల్లో పోరాడాల్సిన తీరును క్రికెట్ ప్రపంచానికి వరుస
TNN | Updated:
Apr 3, 2017, 03:34PM IST
ప్రపంచకప్ టోర్నీల్లో గత కొంతకాలంగా మనం చాలా ఉత్కంఠ ముగింపులను చూసుంటాం. కానీ.. గత ఏడాది వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ గుర్తుకు వస్తే మాత్రం అవన్నీ దిగదుడుపే అనిపించక మానదు. టీ20 ఫార్మాట్‌లోని సిసలైన మజాను అభిమానులకి.. ఫైనల్లో పోరాడాల్సిన తీరును క్రికెట్ ప్రపంచానికి వరుస సిక్సర్లతో పరిచయం చేశాడు వెస్టిండీస్ హిట్టర్ కార్లోస్ బ్రాత్‌వైట్. చివరి ఓవర్‌లో వెస్టిండీస్ విజయానికి 19 పరుగులు చేయాల్సి ఉండటంతో గెలుపుపై ఇంగ్లాండ్ ధీమాగా ఉంది. కానీ.. హిట్టర్ బ్రాత్‌వైట్ వారి ఆశలపై భీకర హిట్టింగ్‌తో నీళ్లు చల్లాడు. బెన్‌స్టోక్స్ వేసిన చివరి ఓవర్‌లో తొలి నాలుగు బంతుల్ని బ్రాత్‌‌వైట్ వరుసగా బౌండరీ లైన్ దాటించేసి ఔరా అనిపించాడు. అప్పటి వరకు ఏ మాత్రం విజయంపై ఆశలు లేని వెస్టిండీస్.. అనూహ్యంగా విశ్వవిజేతగా నిలవడంతో ఆ జట్టు క్రికెటర్లు ఆనందంతో జెర్సీలను విప్పేసి డ్యాన్స్ చేశారు. ఆ ఉత్కంఠ పోరుకి నేటితో సరిగ్గా ఏడాది.
కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా ఏప్రిల్ 3, 2016లో జరిగిన ఈ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జో రూట్ (54) అర్ధశతకంతో రాణించగా.. జోస్ బట్లర్ (36) ఫర్వాలేదనిపించాడు. భీకర హిట్టర్లున్న వెస్టిండీస్ 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం నల్లేరుపై నడకేనంటూ అంతా భావించారు. కానీ.. ఇంగ్లాండ్ బౌలర్లు అనూహ్యంగా పోరాడి విండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. జో రూట్ రెండు బంతుల వ్యవధిలోనే ఓపెనర్లు ఛార్లెస్ (1), క్రిస్ గేల్ (4)లను పెవిలియన్ పంపించి ఆ జట్టును దెబ్బతీశాడు. అనంతరం వచ్చిన సిమన్స్ డకౌట్.. రసెల్ (1), డారెన్ సామి (2) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. డ్వేన్ బ్రావో (25) కాసేపు పోరాడినా.. క్రీజులో నిలవలేకపోయాడు. ఒక ఎండ్‌లో శామ్యూల్స్ (85 నాటౌట్) ఒంటరి పోరాటం చేసినా.. అతనికి సహకరించే వారే కరవయ్యారు. ఈ దశలో వచ్చిన బ్రాత్‌వైట్ 10 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సర్లతో 34 పరుగులు చేసి అద్భతమే చేశాడు. అప్పటి వరకు రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన బెన్‌సోక్స్ 17 పరుగులే ఇవ్వడంతో కెప్టెన్ మోర్గాన్ అతడిపై నమ్మకంతో చివరి ఓవర్ కోసం బంతి ఇచ్చాడు. కానీ.. న భూతో... అనే రీతిలో బ్రాత్‌వైట్ తొలి నాలుగు బంతుల్ని సిక్సర్లు బాదేయడంతో ... మైదానంలో స్టోక్స్ కన్నీరు పెట్టేసుకున్నాడు. విండీస్ 19.4 ఓవర్లలోనే 161/6తో రెండోసారి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
| 2sports
|
ఏప్రిల్ లో రానున్న 1971 భారత సరిహద్దు మూవీ...రియల్ స్టోరీ
Highlights
భారత్ పాక్ సరిహద్దు వద్ద 1971లో జరిగిన ఘటనలపై చిత్రం
మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్, అల్లు శిరీశ్ నటించిన 1971
ఏప్రిల్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్న చిత్ర నిర్మాతలు
ప్రతి సమస్యకి యుధ్ధం సమాధానం కాదు. యుధ్ధం లేని ప్రపంచాన్ని చూడాలనుకునే ఓ మేజర్ కథే ఈ 1971 భారత సరిహద్దు చిత్రం. 1971 వ సంవత్సరంలో పాకిస్తాన్కి, భారతదేశానికి మద్య జరిగిన యుధ్ధ నేపద్యంలో ఈ కథాంశం నడుస్తుంది. అంతేకాదు ఆ యుధ్ధం జరిగిన ప్రదేశంలోనే ఈ చిత్రాన్ని చిత్రీకరించటం జరిగింది. రియల్ గా యుధ్ధ ట్యాంకర్స్ ని వాడి షూట్ చేశారు. బోర్డర్ లోని ప్రతి సైనికుడు తమ కర్తవ్యాన్ని దైవంలా భావించి వారి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా దేశరక్షణ కోసం ఎలా పని చేస్తారనేది ఈ చిత్రంలోని ముఖ్య కథాంశం.
ఈ చిత్రాన్నిమలయాళంలో మంచి చిత్రాల దర్శకుడు, నటుడు అంతకు మించి మాజి భారత సైనికాధికారి మేజర్ రవి దర్శకత్వం వహించారు. మలయాళ సూపర్స్టార్ మెహన్లాల్ హీరోగా నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో అల్లు శిరీష్ నటించారు. ఈ చిత్రం మొదటి లుక్ ని అతి త్వరలో విడుదల చేయనున్నారు. భారతదేశంలో అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ప్రతి భారతీయుడు చూడవలసిన తెలుసుకోవలసిన చిత్రం ఈ 1971 భారత సరిహద్దు.. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ శ్రీనివాస ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై, పూజా కాత్యాయని నిర్మిస్తున్నారు.
మాటలు- ఎం.రాజశేఖర్ రెడ్డి, ఫోటొగ్రఫి- సుజిత్ వాసుదేవ్, ఎడిటర్-సమ్జిత్, ఆర్ట్- పలు.కె.జార్జ్ , బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్- గొపి సుందర్, సంగీతం- సిద్దార్ధ విపిన్, నాజిమ్ అర్షద్, రాహుల్ సుబ్రమణ్యన్, నిర్మాత- పూజా కాత్యాయని, దర్శకత్వం- మేజర్ రవి
Last Updated 26, Mar 2018, 12:03 AM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Bigg Boss Episode 30 Highlights: బాబా భాస్కర్ భావోద్వేగం.. వెక్కి వెక్కి ఏడ్చేలా చేసిన అలీ
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు 29 ఎపిసోడ్లను ముగించుకుని సోమవారం నాడు 30వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. నేటి (ఆగస్టు 19) ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
Samayam Telugu | Updated:
Aug 20, 2019, 09:04PM IST
బిగ్ బాస్ సీజన్ ఐదోవారం రంజుగా మారింది. సోమవారం నాడు ఎప్పటిలాగే ఎలిమినేషన్కి నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ డిస్కషన్స్ మధ్య నడిచింది. మొదటిగా ఈ నామినేషన్స్ ప్రక్రియకు కెప్టెన్ అలీకి మినహాయింపు లభించింది. దీంతో పాటు ఆయనకు నలుగుర్ని డైరెక్ట్గా నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్.
అయితే నామినేషన్ ప్రక్రియ మొదలు కావడానికి కాస్త సమయం ఇచ్చిన బిగ్ బాస్.. ఈలోపు అలీ నామినేట్ చేసి నలుగురు కంటెస్టెంట్స్ అతన్ని మెప్పించి అతని మనసు మార్చడానికి ప్రయత్నించాలని.. ఫైనల్గా అలీ మనసు మార్చుకుని ఒకరి పేరును సూచిస్తారన్నారు బిగ్ బాస్.
Read Also: బాబా భాస్కర్ కన్నీటిపై జాఫర్ భావోద్వేగ పోస్ట్
ఈ ప్రక్రియలో భాగంగా తొలుత బాబా భాస్కర్, రాహుల్, హిమజ, వితికా పేర్లను సూచించారు అలీ. కాగా అలీ మనసుని మార్చి నామినేషన్స్ నుండి బయటపడటానికి సతవిధాలా ప్రయత్నించారు బాబా భాస్కర్.
అయితే హిమజ-అలీలా మధ్య మళ్లీ డిస్కషన్ నడిచింది. తనను ఎందుకు నామినేట్ చేశావో అర్ధం కావడం లేదని హిమజ అడగడంతో నీకు అర్ధం కాదులే లైట్ తీసుకో.. ఎప్పుడూ నీతో నాకు డిస్కషన్ ఏంటో నాకూ అర్ధం కావడంలేదన్నారు.
Bigg Boss Poll: బిగ్ బాస్ హౌస్ నుండి అయిదో వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు?
ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే..
మొదటిగా పునర్నవి.. హిమజ, రాహుల్ని నామినేట్ చేసింది. రాహుల్ని నామినేట్ చేస్తూ.. అతను గేమ్ని సీరియస్ తీసుకోవడం లేదని నాకు బిగ్ బాస్ కాకపోతే ఇంకో లైఫ్ ఉందని అనుకుంటున్నాడని కారణం చెప్పింది. హిమజని నామినేట్ చేస్తూ.. ఆమె ఎప్పుడూ నేను చేసిందే కరెక్ట్ అని వాదిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక మిగిలిన వాళ్లు ఎవరంటే..
బాబా భాస్కర్.. రాహుల్, అషు
రవి... రాహుల్, హిమజ
వితికా షెరు.. మహేష్ విట్టా, అషు
శ్రీముఖి.. రాహుల్ సిప్లిగంజ్, అషు
రాహుల్.. హిమజ, శ్రీముఖి
అషు.. హిమజ, రాహుల్
వరుణ్.. రాహుల్, మహేష్ విట్టా
శివజ్యోతి.. పునర్నవి, రాహుల్
మహేష్ విట్టా.. రాహుల్, వరుణ్ సందేశ్
హిమజ.. పునర్నవి, అషు
అలీ.. బాబా భాస్కర్ను నామినేట్ చేశారు.
మొత్తంగా ఈ నామినేషన్ ప్రక్రియలో రాహుల్ని ఎక్కువ మంది నామినేట్ చేశారు. అతని తరువాత హిమజను నామినేట్ చేశారు. ఇక ఈవారం ఐదోవారంలో రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్లు ఎలిమినేషన్కి నామినేట్ అయ్యారు.
బాబా భాస్కర్ భావోద్వేగం.. వెక్కి వెక్కి ఏడుపు
బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం నుండి హౌస్ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తూ ప్రేక్షకుల్ని నవ్విస్తున్న బాబా భాస్కర్ ఈరోజు నామినేషన్లో కంటతడి పెట్టారు.
నవ్వుతూ నవ్విస్తూ.. మిగిలిన కంటెస్టెంట్స్ కంటే చాలా బెటర్ పెర్ఫామెన్స్ ఇస్తున్న బాబా భాస్కర్ని టార్గెట్ చేయడంతో భావోద్వేగానికి గురయ్యారు బాబా. తాను ఎప్పుడూ ఎలాగే ఉంటానని.. బిగ్ బాస్ కోసం నటించాల్సిన అవసరం తనకు లేదని.. అలీ తనను నామినేట్ చేసిన పర్లేదు కాని.. అతను చెప్పిన కారణానికి చాలా బాధగా ఉందంటూ శ్రీముఖి దగ్గర ఏడ్చేశారు బాబా భాస్కర్.
అయితే శ్రీముఖి.. మీరు మీలా ఉండండి మహేష్ మాటలు వినొద్దు అంటూ సలహా ఇవ్వడంతో.. ‘నేను జాఫర్ ఉన్నప్పుడు అతనితో ఉన్నా.. ఇప్పుడు మహేష్తో ఫ్రెండ్లీగా ఉంటున్నా’ అని భావోద్వేగానికి గురయ్యారు.
మొత్తంగా నేటి ఎపిసోడ్లో నామినేషన్ ప్రక్రియ హీట్గా నడిచింది. అయితే బాబా భాస్కర్ కంటతడి పెట్టడం ప్రేక్షకుల్ని కూడా భావోద్వేగానికి గురి చేసింది. ఇక రేపటి ఎపిసోడ్లో కెప్టెన్ టాస్క్ ఉండటంతో ఈ ఆటలో ఎలాంటి రచ్చ ఉంటుందో చూడాలి.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘సింధూరం’ సంఘవికి పెళ్లి
అచ్చ తెలుగు అమ్మాయిలాగే కనిపిస్తుంది సంఘవి.
TNN | Updated:
Feb 3, 2016, 10:08AM IST
‘సింధూరం’ సంఘవికి పెళ్లి
అచ్చ తెలుగు అమ్మాయిలాగే కనిపిస్తుంది సంఘవి. ఆమెది కర్ణాటక . సింధూరం , సీతారామరాజు, ఆహ, సూర్య వంశం, మృగరాజు, సమరసింహారెడ్డి ఇలా... నలభై దాకా తెలుగు సినిమాల్లో నటించింది. తాజ్ మహల్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది. ఇప్పుడు సంఘవి పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పెళ్లి నేడే. మలయాళీ అయిన వెంకటేశ్ అనే ఐటీ సంస్థ యజమానిని సంఘవి పెళ్లిచేసుకోబోతోంది. బెంగుళూరులోని తాజ్ హోటల్ లో వీరి వివాహం జరుగబోతోంది. సంఘవి అసలు పేరు కావ్యారమేష్. తండ్రి ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 1993లో అమరావతి అనే తమిళ సినిమాలో అజిత్ సరసన తొలిసారి నటించింది. అనంతరం కన్నడ, తెలుగు ఇండస్ట్రీలోకి కూడా ప్రవేశించింది. తెలుగులో అగ్రహీరోలైనా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజ, బాలకృష్ణతో కలిసి నటించింది. ఇప్పుడు సంఘవి వయసు 39 ఏళ్లు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
దీపావళికి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. ఎంతమేర తగ్గాయంటే?
బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కొనుగోళ్లపై ధన త్రయోదశి ప్రభావం స్పష్టంగా కనిపించింది.
Samayam Telugu | Updated:
Nov 7, 2018, 06:41AM IST
దీపావళికి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. ఎంతమేర తగ్గాయంటే?
రెండు రోజుల వరస వృద్ధి తర్వాత బంగారం, వెండి ధరలు మంగళవారం (నవంబరు 6) స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం రూ. 80 తగ్గి 32,610 రూపాయల వద్ద స్థిరపడింది. అదేవిధంగా కిలోగ్రామ్ వెండి 240 రూపాయలు తగ్గి రూ. 39,300 వద్ద స్థిరపడింది. అయితే.. ధన త్రయోదశి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి కొనుగోళ్లు భారీగా జరిగాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా రిటైల్ వ్యాపారులు బంగారం, వెండిని పెద్ద మొత్తంలో విక్రయించారు. అయితే.. సోమవారం ధన త్రయోదశి ముగియడంతో కొనుగోళ్లు తగ్గి వీటి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. దీంతో ఈ దీపావళికి బంగారం, వెండి ధరలు తగ్గినట్టయింది.
దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 99.9%, 99.5% పసిడి ధరలు రూ. 80 చొప్పున తగ్గి వరసగా రూ. 32,610, రూ. 32,460 వద్ద స్థిరపడ్డాయి. కిలోగ్రామ్ వెండి రూ. 240 తగ్గి రూ. 39,300 వద్ద స్థిరపడింది. మరింత తగ్గే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరల్లో పెద్దగా మార్పు చోటుచేసుకోకపోవడం గమనార్హం.
ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ. 24,900 వద్దే కొనసాగుతోంది. వారాంతపు ఆధారిత డెలివరీ వెండి ధర రూ. 193 తగ్గి రూ. 38,444 వద్ద స్థిరపడింది.
రిటెయిలర్లు, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడం.. బంగారు కొనుగోళ్లు ఊపందుకోవడంతో రెండు రోజులుగా దేశీయంగా బంగారం ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలో సోమవారం పసిది ధర రూ.40 పెరగడంతో.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,690కు; 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,540కు చేరుకున్నాయి. అంతకు ముందు ట్రేడింగ్ (శనివారం)లో బంగారం ధర రూ.20 పెరిగిన సంగతి తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
Feb 03,2019
మార్కెట్లోకి రూ.75 లక్షల బైక్!
రోమ్: ఇటలీకి చెందిన ప్రముఖ డిజైన్ సంస్థ ఆఫిసిన్ జీపీ డిజైన్ తాజాగా డుకాటీ పనిగేల్ వీ4లో కస్టమ్ బైక్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర దాదాపు రూ.74.5 లక్షలు. డుకాటీ పనిగేల్ వీ4 కస్టమ్ బైక్ పేరు వీ4 పెంటా. వీ4 ఎస్ బైక్లకు పలు అదనపు ప్రత్యేకతలను జోడించి ఈ బైక్ను రూపొందించారు. ఇందులో కస్టమ్ స్పోక్డ్ వీల్స్, ఇంజిన్పై బ్రాంజ్ పౌడర్ కోటింగ్, క్రాంక్కేస్ కవర్స్, క్లాసిక్ స్టైల్డ్ గిర్డర్ ఫ్రంట్ ఎండ్ వంటి ప్రత్యకతలున్నాయి. ఈ బైక్ను లూకా పొజాటో డిజైన్ చేసింది. ఇది కేవలం స్ట్రీట్ఫైటర్ మాత్రమే కాదు. అంతకు మించేలా ఉంది. ఫెరింగ్ తొలగింపుతో బైక్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్లా కనిపిస్తుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్. కేవలం 10 బైక్స్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. బైక్కు సంబంధించిన హ్యాండ్బార్స్, ఇండికేటర్లు, ఫుట్పెగ్స్ సహా పలు ఇతర భాగాలను రిజోమా సంస్థ రూపొందించడం విశేషం. అయితే వీలైనన్ని ఎక్కువ బైక్లను భారత్లోనే విక్రయించేలా సంస్థ ప్లాన్ చేసుకున్నట్టుగా సమాచారం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఎస్ఆర్కే సక్సెస్ సెలబ్రేషన్స్లో బాలక్రిష్ణ
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'శివలింగ' కన్నడ నాట సంచలనం సృష్టించింది.
TNN | Updated:
Jun 21, 2016, 03:45PM IST
ఎస్ఆర్కే సక్సెస్ సెలబ్రేషన్స్లో బాలక్రిష్ణ
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'శివలింగ' కన్నడ నాట సంచలనం సృష్టించింది. పైరసీ బెడదతోపాటు వెల్లువలా వచ్చిపడుతున్న సినిమాల కారణంగా 100 డేస్ ఫంక్షన్స్ చాలా చాలా అరుదైన ఈ రోజుల్లో 'శివలింగ' ఆ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంది. పి వాసు డైరెక్ట్ చేసిన ఈ సినిమా గత వారమే 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్కి కన్నడ నటుడు అంబరీష్తోపాటు మన బాలయ్య బాబుకి ఆహ్వానం అందింది.
| 0business
|
Hyderabad, First Published 20, Aug 2019, 3:44 PM IST
Highlights
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో విడుదల సమయం దగ్గరపడే కొద్దీ సినిమాపై అంచనాలు పెరుగిపోతున్నాయి. ఈ చిత్రం కథపై ఇప్పటికే అభిమానుల్లో అనేక ఊహాగానాలున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో విడుదల సమయం దగ్గరపడే కొద్దీ సినిమాపై అంచనాలు పెరుగిపోతున్నాయి. ఈ చిత్రం కథపై ఇప్పటికే అభిమానుల్లో అనేక ఊహాగానాలున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అసలింతకీ ఈ చిత్రంలో ప్రభాస్ సింగిల్ రోల్ లో నటిస్తున్నాడా లేక డ్యూయెల్ రోలా అనే సందేహాలు మొదలయ్యాయి. సాహో పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ని గమనిస్తే ప్రభాస్ హెయిర్ స్టైల్ రెండు రకాలుగా కనిపిస్తోంది. ట్రిమ్ చేసుకుని క్లాస్ లుక్ లో, మరో లుక్ లో రఫ్ గా కనిపిస్తున్నాడు.
ట్రైలర్ లో ప్రభాస్ పాత్రని అండర్ కవర్ కాప్ గా పరిచయం చేశారు. కానీ ప్రభాస్ దొంగగా నటిస్తున్నాడని కూడా వార్తలొస్తున్నాయి. చనిపోయిన తన స్నేహితుల కోసమే అని అంటున్నారు. దర్శకుడు సుజిత్ మాత్రం కథ గురించి ఎక్కడా ఎలాంటి హింట్ ఇవ్వలేదు. 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఐటెం సాంగ్ లో మెరిసింది.
Last Updated 20, Aug 2019, 3:44 PM IST
| 0business
|
Hyd Internet 120 Views Saina
SAINA
ఢిల్లీ: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్కు బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రత్యేక బహుమతి పంపారు. అనుష్క శర్మ ఇటీవలే ‘నుష్ పేరుతో టెక్స్టైల్స్ బిజినెస్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని వస్త్రాలను సైనాకు పంపారు. అవి అందుకున్న సైనా అనుష్కకి కృతజ్ఞతలు తెలిపి త్వరలో వాటిని ధరిస్తానని సైనా తెలిపారు.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సిక్స్ కొట్టబోయి వికెట్లు తొక్కేసిన అఫ్రిది..!
ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ లెగ్సైడ్ విసిరిన బౌన్సర్ని బ్యాక్ఫుట్పైకి వెళ్లి ఫుల్ చేయబోయాడు. కానీ.. బంతి అతని బ్యాట్కి అందకుండా నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లగా.. అఫ్రిది పట్టుజారి మిడ్వికెట్ని తొక్కేశాడు.
Samayam Telugu | Updated:
Jan 14, 2019, 04:26PM IST
సిక్స్ కొట్టబోయి వికెట్లు తొక్కేసిన అఫ్రిది..!
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కామెడీని తలపిస్తూ వికెట్ చేజార్చుకున్నాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన అఫ్రిది.. ప్రైవేట్ టీ20 లీగ్లో మాత్రం ఇప్పటికీ తనదైన హిట్టింగ్తో సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో ఆడుతున్న ఈ పవర్ హిట్టర్.. ప్రత్యర్థి బౌలర్ సంధించిన బౌన్సర్ని స్టాండ్స్లోకి తరలించే ప్రయత్నంలో అదుపుతప్పి వెనుక ఉన్న వికెట్లను తొక్కేశాడు. కానీ.. థర్డ్ అంపైర్ రిప్లైని పరిశీలించి ఔటిచ్చే వరకూ ఆ తప్పుని అఫ్రిది పసిగట్టలేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
బీపీఎల్ టోర్నీలో కామిల్లా విక్టోరియన్స్ జట్టు తరఫున ఆడుతున్న అఫ్రిది.. ప్రత్యర్థి జట్టు చిట్టిగాంగ్ వికింగ్స్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ లెగ్సైడ్ విసిరిన బౌన్సర్ని బ్యాక్ఫుట్పైకి వెళ్లి ఫుల్ చేయబోయాడు. కానీ.. బంతి అతని బ్యాట్కి అందకుండా నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లగా.. అఫ్రిది పట్టుజారి మిడ్వికెట్ని తొక్కేశాడు. దీంతో.. బెయిల్స్ కిందపడినా.. స్టంప్ లైట్స్ లేకపోవడంతో కొన్ని క్షణాల పాటు ఎవరూ గుర్తించలేకపోయారు. కానీ.. ఆ తర్వాత చూసిన వికెట్ కీపర్ హెహజాద్ ఔట్ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్లు ఔట్ నిర్ణయం కోసం థర్డ్ అంపైర్కి నివేదించారు. దీంతో.. రిప్లైలో అసలు విషయం వెలుగులోకి రాగా.. అప్పటి వరకూ నాటౌట్ అని ధీమాతో ఉన్న అఫ్రిది నిరాశగా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
తన కల నెరవేరకుండానే శ్రీదేవి వెళ్లిపోయారు: జయప్రద
ఆల్ ఇండియా సూపర్స్టార్గా ఎదిగి అశేష అభిమానులను సంపాదించుకున్న అతిలోక సుందరి హఠాన్మరంపై దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురయ్యింది.
TNN | Updated:
Feb 25, 2018, 08:33PM IST
ఆల్ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగి అశేష అభిమానులను సంపాదించుకున్న అతిలోక సుందరి హఠాన్మరంపై దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆమె మృతిపట్ల నటి జయప్రద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త తెలియగానే ఏదో పీడకల వచ్చినట్లు భావించానని అన్నారు. శ్రీదేవి మృతి తనను చాలా బాధించిందని తెలిపారు. మొదట దీన్ని పీడకలగా భావించాను. టీవీలో చూసేంత వరకు నమ్మలేదని జయప్రద కన్నీంటి పర్యంతమయ్యారు. తామిద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించామని, శ్రీదేవి అద్భుతమైన నటి, తల్లి అని ప్రశంసలు కురిపించారు. తనలా తన కుమార్తెలు జాన్వి, ఖుషి కూడా వెండితెరపై రాణిస్తే చూడాలన్నది ఆమె కల... కానీ జాన్వి తన తల్లి ని చివరి క్షణాల్లో కలవలేకపోయిందని ఆవేదన చెందారు.
పెళ్లి వేడుక కోసం దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో అక్కడే మృతి చెందారు. ఈ వేడుకకు ఆమె తన భర్త బోనీ కపూర్‌, రెండో కుమార్తె ఖుషీతో కలిసి వెళ్లారు. జాన్వి ‘దఢక్‌’ సినిమా షూటింగ్‌ కోసం ముంబయిలోనే ఉండిపోయారు. దాదాపు బంధువులంతా పెళ్లి వేడుకల కోసం దుబాయ్‌కు వెళ్లడంతో జాన్వి ఇంట్లో ఒక్కరే ఉన్నారు.తల్లి మరణవార్త విన్న జాన్వి కుప్పకూలిపోయారు. ఈ కష్ట సమయంలో ఆమెకు ధైర్యం చెప్పడానికి దర్శక, నిర్మాత కరణ్‌జోహార్‌ లోఖండ్‌వాలాలోని శ్రీదేవి ఇంటికి వెళ్లి ఆమెను జూహూలోని అనిల్‌ కపూర్‌ ఇంటికి తీసుకెళ్లారు.
| 0business
|
internet vaartha 220 Views
న్యూఢిల్లీ : రాజధానిలో ప్రతిష్టాత్మకం గా జరుగుతున్న ఆటోఎక్స్పోలో హుండై కొత్త టక్సన్ మోడల్ను ప్రదర్శించింది. హుండై ఎన్2025, విజన్గ్రాన్టురిస్మోలను కూడా ప్రదర్శించింది. కొత్తతరం హుండైకోసం టక్సన్ ను రూపొందించినట్లు కంపెనీ ప్రకటించింది. టక్సన్ డిజైన్ ప్రగతిశీలక స్ఫూర్తిని ఫ్యాషన్ను వ్యక్తీకరిస్తుంది. ఈ బ్రాండ్ కొత్తతరం హుండైగా ప్రకటించింది. ఆధునీకరించిన ఫ్లోయింగ్ సర్ఫేసెస్, బోర్డ్ప్రపోర్షన్స్, హెక్సాగోనల్గ్రిల్ హుండై బ్రాండ్ సిగ్నేచర్లతో కొత్త టక్సన్ బోల్డ్ అథ్లెటిక్ ఉనికిని ప్రదర్శించింది. సంస్త ఎండి వైకే కూ మాట్లాడుతూ ఆటో ఎక్స్పోలో మా థీమ్ ఎక్ప్పీరియన్స్ హుండై ద్వారా మేధోపరమైన డిజైన్ను జోడించామన్నారు. 2016లో హుండైబ్రాండ్ పటిష్టం చేసేందుకుగాను కొత్త మోడళ్లు మార్కెట్ వాటాను పెంచుతాయని ఎండి వెల్లడించారు.
| 1entertainment
|
HOME LOAN
తక్కువ వడ్డీరేట్లకే ‘ఆస్పైర్ గృహరుణాలు
హైదరాబాద్,జనవరి 29: తక్కువ వడ్డీరేట్లకే ప్రైవేటు రంగంలోని ఆస్పైర్హోమ్ఫైనాన్స్ తెలంగాణలో గృహరుణాలందిస్నుట్లు ప్రకటించింది. దేశవ్యాప్తం గా చౌకగా గృహరుణాలకు పెట్టిందిపేరుగా ఉన్న ఆస్పైర్ కంపెనీ తెలంగాణలో ప్రయోగాత్మక ప్రాజెక్టును నిర్వహించింది. దిగువ, మధ్యతరగతి వర్గాలకు గృహరుణాలను మరింత వేగంగా అందిం చేందుకు కొత్త కేంద్రం ప్రారంభించింది. రూ.25 లక్షలవరకూ రుణాలందిస్తామని ముందుకువచ్చింది. 2022నాటికి అందరికీ పక్కాఇల్లు అన్న ప్రధాని మోడీ కార్యారరణకు అనుగుణంగా తాము గృహ రుణాలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఎండిసిఇఒ అనిల్ సచిదానంద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్యోజన కింద 90 మిలియన్ల పక్కాఇళ్లను నిర్మించాలన్న లక్ష్యానికి మరింత మద్దతునిస్తూ తమసంస్థ గృహరుణాలందిస్తుంద న్నారు. అంతేకాకుండా తాజా గణాంకాలను పరిశీలిస్తే భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో తనఖా నిష్పత్తి 9.2శాతం మాత్రమేనని, అభివృద్ధిచెందిన దేశాలతో పోలిస్తే ఎంతో తక్కువగా ఉందని అనిల్ అన్నారు. హౌసింగ్ ఫైనాన్స్రంగంలో భారీ వృద్ధి సాధ్యమేనని ఆయన అన్నారు. తెలంగాణలో తాము ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తామన్నారు. అంతేకాకుండా ఆస్పైర్ మత్తం డిజిటల్రూపంలో క్రోడీకరిస్తుందన్నారు. ఆస్పైర్ రిటైల్రంగంపై మరిం త దృష్టిపెట్టి 25 లక్షల వరకూ అందిస్తామని మేనేజర్ ఇద్రీస్ హసన్ వెల్లడించారు. కొత్త గృహాల కొనుగోళ్లు, రిటైల్ రుణాలు,రీసేల్ ఇళ్ల కొనుగోలుకు రుణాలు నిర్మాణానికి రుణా లు, మిశ్రమ రుణాలు ప్లాట్నిర్మాణం, గృహ నవీకరణకు రుణాలు, గృహవిస్తరణకు రుణా లిస్తామన్నారు. అంతేకాకుండా మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ మాలా పథకం ప్రవేశపెట్టామని, ఈ పథకం కింద ఉద్యో గులు, జీతం పొందుతున్న స్వయం ఉపాధి పొందు తున్న వారెవరికైనా రెండు లక్షల నుంచి 12 లక్షల వరకూ సొంత ఇంటికలను వారు నెర వేర్చుకోడానికి గృహరుణసాయం అందిస్తామన్నారు. ====== రోకా ఇండియా ఎండిగా రంగనాధన్ న్యూఢిల్లీ, జనవరి 29: రోకా బాత్రూమ్ ఉత్పత్తుల సంస్థ భారత్ బిజినెస్ కు ప్రత్యేకించి కె.ఇ.రంగనాధన్ను మేనేజింగ్ డైరెక్టర్గా నియ మించింది. రోకాలో చేరేందుకుముందు రంగనాధన్ టివిఎస్ ఎలక్ట్రా నిక్స్లో ఎండిగా బాధ్యతలు నిర్వహించారు. టివిఎస్ కేపిటల్కు నిర్వహణ భాగస్వామిగా వ్యవహరించారు. ప్యారివేర్ బిజినెస్విభాగం మురుగప్పగ్రూప్లో 1994 నుంచి 2008వరకూ పనిచేసారు. రోకాతో జాయింట్వెంచర్వరకూ పని చేసారు. రంగాజాయింట్ వెంచర్కు సైతం ఎండిగాపనిచేసారు. అమ్మకాల వృద్ధి లక్ష్యంగా పనిచేసిన రంగా 25శాతం వృద్ధికి బాటలువేసారు. కొత్త పదోన్నతిపై ఎండి రంగనాధన్ మాట్లాడుతూ తనకు ఇదొకమంచి అవకాశమని మార్కెట్ను 15శాతం వరకూ పెంచగలనని తదనంతరం మరింత వృద్ధినిసాధిస్తామని రోకా ఉత్పత్తులకు ప్రపంచమార్కెట్లో తిరుగులేని వాటాఉందని అన్నారు.
=======
| 1entertainment
|
sumalatha 117 Views bse , NSE , stock market
stock market
ముంబయి: దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.38గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 87 పాయింట్ల లాభంతో 38,989 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ 23 పాయింట్లు లాభపడి 11,612 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 68.57 వద్ద కొనసాగుతోంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
భర్త చిత్రహింసలు పెట్టాడు: ప్రముఖ గాయని
వైవాహిక జీవితం తనకు మిగిల్చిన చేదు అనుభవాలను వివరించింది ప్రముఖ గాయని
TNN | Updated:
Aug 8, 2017, 08:57AM IST
వైవాహిక జీవితం తనకు మిగిల్చిన చేదు అనుభవాలను వివరించింది ప్రముఖ గాయని కౌసల్య. అనేక సూపర్ హిట్ సాంగ్స్ ను ఆలపించిన కౌసల్య తన వైవాహిక జీవితం నరకాన్ని తలపింపజేసిందని పేర్కొంది. భర్తతో విడిపోయిన ఈమె అతడు పెట్టిన చిత్రహింసలను వివరించింది. ఈ మేరకు ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధలను చెప్పుకుని, భర్త నుంచి విడిపోయిన పరిస్థితులను వివరించింది.
తనకు వివాహం జరిగి ఆరు సంవత్సరాలు గడిచాయని కౌసల్య తెలిపింది. అయితే పెళ్లైన దగ్గర నుంచి తనకు భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయని, ఆరేళ్ల పాటు చిత్రవధను అనుభవించానని కౌసల్య వివరించింది. పెళ్లి తర్వాత తనకు స్వేచ్ఛాస్వతంత్రాలు లేకుండా పోయాయని, తన అభిప్రాయానికి విలువ లేకుండా పోయిందని ఆమె చెప్పింది. ఈ విధంగా వైవివాహిక జీవితం తనకు నరకప్రాయమైందని ఆవేదన వ్యక్తం చేసింది.
తన భర్తకు వివాహేతర సంబంధం కూడా ఉందని ఆమె కౌసల్య చెప్పారు. ఇలా పెళ్లితో తన జీవితం అన్ని విధాలుగానూ నాశనం అయ్యిందని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్టుగా ఆమె తెలిపారు. భర్త తనను తిడుతూ, దూషిస్తూ చేసిన చాట్ సంభాషణను కూడా తను సేవ్ చేసినట్టుగా కౌసల్య వివరించింది. అనేక సార్లు అతడు చెయి చేసుకున్నాడు, కొంచెం కూడా జాలి చూపకుండా తనను ఇష్టానుసారం కొట్టేవాడని.. కౌసల్య తను ఎదుర్కొన్న హింస గురించి వివరించింది.
| 0business
|
Also Read: ట్రైన్ టికెట్ క్యాన్సల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
ఈ కలెక్షన్లో లిప్, కాజల్, ఐ, బ్రౌ సంబంధిత ప్రొడక్టులు ఉన్నాయి. నైకా స్టోర్లలో, నైక వెబ్సైట్, నైకా యాప్లో ఈ ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. ‘రెండేళ్ల నుంచి వ్యాపార ప్రణాళికలు నడుస్తూ వచ్చాయి. బ్యూటీ, స్కిన్ అనేవి మహిళలకు ఎంతో ముఖ్యం. నా కెరీర్లోని అనుభవంతో ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాను. కే బ్యూటీ వెనుకు పెద్ద టీమ్ ఉంది. మా ప్రొడక్టులు కస్టమర్లను ఆకర్షిస్తాయని భావిస్తున్నా’ అంటూ కత్రినా కైఫ్ జీ బిజినెస్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
Also Read: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ అదిరే ఆఫర్లు.. బంగారం కొనుగోలుపై రూ.10,000 డిస్కౌంట్..!
తాము ఎప్పుడు కెమెరా ముందు ఉంటామని, అందుకని మేకప్లో ఎప్పటికప్పుడు టచింగ్-అప్ అవసమని తెలిపారు. అయితే తాను మాత్రం ఎక్కువ కాలం నిలిచిపోయే బ్రాండ్ను తీసుకురావాలని భావించానని, ఇప్పుడు అది సాధ్యమైందని తెలిపారు. కొన్ని నెలలపాటు టెస్టింగ్ తర్వాత ఈ ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
Also Read: నెలకు కేవలం రూ.2,000తో చేతికి ఏకంగా రూ.50 లక్షలు..!
వివిధ రకాల స్కిన్ టోన్స్, వయసు, ఎమోషన్స్ కలిగిన వారి కోసం కే బ్యూటీ ప్రొడక్టులు ఆవిష్కరించారి కత్రినా తెలిపారు. మహిళలు అందరికీ తమ ప్రొడక్టులు అనువుగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే కత్రినా కైఫ్ ఇప్పుడు ఈ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తే.. సన్నీ లియోన్ ఎప్పుడో ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చారు. సన్సిటీస్టోర్స్ పేరుతో ఇప్పటికే ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. రానున్న కాలంలో ఇద్దరి మధ్య వ్యాపారం రంగంలో ఎలాంటి పోటీ ఉంటుందో చూడాలి.
| 1entertainment
|
orphan children enjoyed spiderman special screening at amb cinemas
నమ్రత చొరవ.. ఏఎంబీ సినిమాస్లో అనాథ పిల్లల కోసం స్పెషల్ షో
అనాథ పిల్లలకు ఏఎంబీ సినిమాస్ అనుభూతిని మహేష్బాబు భార్య నమ్రతా శిరోద్కర్ అందించారు. ‘స్పైడర్ మ్యాన్ - ఇంటూ ది స్పైడర్ వెర్స్’ చిత్రాన్ని ఏఎంబీ సినిమాస్లో అనాథ పిల్లల కోసం ప్రదర్శించారు.
Samayam Telugu | Updated:
Dec 14, 2018, 01:43PM IST
సూపర్స్టార్ మహేష్బాబు , ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే వీరిద్దరూ తమ సంపాదనలో కొంత మొత్తాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నారు. అనాథ పిల్లల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కేవలం వాళ్లకు తిండి, బట్ట ఇవ్వడమే కాకుండా వినోదాన్ని కూడా పంచుతున్నారు.
మహేష్బాబు మల్టీప్లెక్స్ బిజినెస్లోకి అడుపెట్టిన విషయం తెలిసిందే. ఏసియన్ సినిమాస్తో కలిసి గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్ను నెలకొల్పారు. ప్రస్తుతం నగరంలో అంతా ఈ మల్టీప్లెక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. మహేష్బాబు మల్టీప్లెక్స్ చాలా బాగుందని, ఇంటీరియర్ డిజైన్ అదిరిపోయిందని చెబుతున్నారు. వీకెండ్లలో ఫ్యామిలీస్తో ఏఎంబీ సినిమాస్ చూడటానికి వెళ్తున్నారు. అయితే, అనాథ పిల్లలకు కూడా ఏఎంబీ సినిమాస్ అనుభూతిని అందించాలని నమ్రత నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా విడుదలకు సిద్ధంగా ఉన్న ‘స్పైడర్ మ్యాన్ - ఇంటూ ది స్పైడర్ వెర్స్’ చిత్రాన్ని ఏఎంబీ సినిమాస్లో అనాథ పిల్లల కోసం ప్రదర్శించారు.
| 0business
|
Nov 15,2019
పదేండ్ల తర్వాత పాక్లో టెస్ట్ సిరీస్
కరాచీ: పదేండ్ల తర్వాత పాకిస్తాన్లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. కొద్దిరోజుల క్రితం శ్రీలంక టీ20 సిరీస్ ఆడటానికి పాక్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనకు శ్రీలంక స్టార్, సీనియర్ క్రికెటర్లు దాదాపు పది మంది దూరమైనప్పటికీ 'జూనియర్ జట్టు'నే అక్కడికి పంపించగా... ఆ పర్యటన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో పాక్లో టెస్టు సిరీస్ ఆడటానికి శ్రీలంక సమాయత్తమైంది. ఐసీసీ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా పాక్లో శ్రీలంక టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. దాంతో పాక్లో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా స్పష్టం చేసింది. ఇరుజట్ల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా డిసెంబర్ 11 నుంచి 15 వరకూ రావల్పిండిలో తొలి టెస్టు జరుగనుండగా, డిసెంబర్ 19నుంచి 23 వరకూ కరాచీలో రెండో టెస్టు జరగనుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 2sports
|
Recommended byColombia
ఈ కథను ఎన్నుకోవడానికి కారణం..?
ఈ సినిమా ప్రారంభంకాక ముందు చాలా రోజులుగా చరణ్ తో నేను ట్రావెల్ అవుతున్నాను. కొత్తగా ఓ సినిమా చేయాలనేది చరణ్ ఆలోచన. అతనికి బాగా నచ్చిన కథ 'తని ఒరువన్'. అదే విషయాన్ని నాకు చెప్పాడు. నేను రెండు రోజుల సమయం తీసుకొని నేను అసలు చేయగలనో.. లేదో అని ఆలోచించుకొని అప్పుడు మొదలుపెట్టాం.
ఓ రీమేక్ సినిమాను డైరెక్ట్ చేయడం ఎలా అనిపించింది..?
రీమేక్స్ చేయడమనేది చాలా కష్టమైన జాబ్. నా కథ అయితే నాకొక ఇమాజినేషన్ ఉంటుంది. నా మీద నాకు నమ్మకం ఉంటుంది. వేరే కథను అడాప్ట్ చేసుకొని సినిమా చేసేప్పుడు ప్రెషర్ ఉంటుంది. నా చివరి రీమేక్ సినిమా ఇదే. ఇకపై రీమేక్‌ల జోలికి వెళ్లను.
చరణ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశారు. కథకు అది అవసరమా..?
చరణ్ ఈ సినిమాలో పాత్ర ఫిట్ గా ఉండాలనుకున్నారు. ప్రతిదీ పెర్ఫెక్ట్ గా ఉండాలని భావించారు. అందరూ సిక్స్ ప్యాక్ చేస్తారు. కాన్ని దాన్ని మైంటెన్ చేయగలగాలి. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఐదారు రోజులైతే రోజులో 24 గంటలు డిప్స్ చేస్తూనే ఉన్నారు.
చరణ్‌తో కలిసి సినిమా చేయడం ఎలా అనిపించింది..?
బయట ఆయనకున్న ఇమేజ్ వేరు.. పెర్శనల్‌గా ఆయన ఆటిట్యూడ్ వేరు. మంచి మనసున్న వ్యక్తి చరణ్. అంత కమిట్మెంట్ తో, నిజాయితీతో ఉండే వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. డైరెక్టర్ కి ఎంత స్వేచ్చనివ్వాలో అంతా ఇచ్చారు. నేను చెప్పింది చేశారు. తనొకసారి మాట ఇస్తే.. మనం మర్చిపోతామేమో గానీ అతను మాత్రం మర్చిపోరు.
మ్యూజిక్ డైరెక్టర్ ‘హిప్ హాప్ తమిజా’ ఎవరి ఛాయిస్?
ప్రతీదీ కొత్తగా ఉండాలని భావించాము. అలానే మ్యూజిక్ కూడా ఈ సినిమాకు అతడు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుంది.
చిరంజీవి గారు ఓ స్టేజ్ మీద సూరేంద్రరెడ్డి కథ చెప్తే నేను చేయడానికి రెడీ అన్నారు. ఆయనతో సినిమాచేసే ఆలోచన ఉందా..?
నూటికి నూరు శాతం చిరంజీవి గారితో కలిసి పని చేయబోతున్నాను. కథ అంతా సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది ఆయన వీలు బట్టి సినిమా మొదలుపెడతాం. సినిమా చేయడమైతే పక్కా. యాక్షన్ ఎంటర్టైనర్ నేపధ్యంలో సినిమా చేస్తాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
నిర్మాతగా మారి చిన్న సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. ఈ సినిమా రిజల్ట్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
టీమిండియా నిష్క్రమణపై కోహ్లీ స్పందన
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ నుంచి ఇండియా నిష్క్రమించడంపై సర్వత్రా విమర్శలు, ఆవేదన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
TNN | Updated:
Apr 2, 2016, 11:15PM IST
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ నుంచి ఇండియా నిష్క్రమించడంపై సర్వత్రా విమర్శలు, ఆవేదన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ మ్యాచ్లన్నింటిలో పోరాటపటిమ కనబర్చిన టీమిండియా వైస్ కెప్టేన్ విరాట్ కోహ్లీపై చాలామంది సానుభూతి వ్యక్తంచేశారు. విరాట్ కష్టం అంతా వృధా అయ్యింది కదా అని బాధపడ్డారు. ఇండియా గెలవకపోయినా.. తన ఆటతీరుతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ హృదయాలు గెలుచుకున్నాడు విరాట్. టీమిండియా నిష్క్రమణపై తాజాగా స్పందించిన విరాట్.. ఈ టోర్నీలో తమకి సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఇన్స్టాగ్రామ్లో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టిన విరాట్ అందులో ఇలా పేర్కొన్నాడు. "మనం కొన్ని గెలుస్తాం.. ఇంకొన్ని ఓడిపోతాం. కానీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ మనవెంటే తీసుకెళ్తాం. పొరపాట్ల నుంచి కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూ ముందుకుసాగిపోవాల్సిందే. ఈ టోర్నమెంట్ని మరిచిపోలేని అనుభూతిగా మిగిల్చినందుకు ప్రతీఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రతీరోజు అలసట లేకుండా మమ్మల్ని ప్రోత్సహించి మాకు మద్దతుపలికారు. మరోసారి మరింత ఉత్తమమైన ప్రదర్శనతో మీ ముందుకొస్తాం" అని తన మనసులో భావాల్ని అభిమానులతో పంచుకున్నాడు విరాట్. విచిత్రం ఏంటంటే.. 2011లో, అంటే ఐదేళ్ల క్రితం ఇండియా వండే వరల్డ్ కప్ గెల్చింది కూడా ఈరోజే.
| 2sports
|
internet vaartha 127 Views
బెంగళూరు : దీపావళి, దసరా పండు గలను పురస్కరించుకుని ఇ-కామర్స్సంస్థలు ప్రక టించిన కేవలం ఆరురోజుల్లోనే 100 కోట్ల నుంచి 1200 కోట్ల డాలర్ల వ్యాపారం చేసినట్లు అంచనా. ఈ ఆరురోజుల్లోనే 35-40 మిలియన్ల ఉత్పత్తులను పంపిణీచేసినట్లు అంచనా. రెడ్సీర్ కన్స ల్టింగ్ సర్వే ప్రకారం చూస్తే అమెజాన్ ఒక్కటే 15 మిలియన్ ఉత్పత్తులు పంపిణీచేసిందని ప్రకటించింది. రెగ్యులర్గా షాపింగ్చేసేవారు, కొత్తగా షాపింగ్చేసేవారు కూడా ఈసారి ఈజాతాలో మిలియన్ల కొద్దీ పాల్గొన్నట్లు రెడ్సీర్ అంచనా వేసింది. దీనివల్ల అమ్మకాలు మెరుగయ్యాయి. భారత్లో ఇ-టెయిలింగ్ రంగంపరంగా అక్టోబరులో గతంలో ఎన్నడూలేని విదంగా భారీ వృద్ధిని నమోదుచేసిం దని రెడ్సీర్ సిఇఒ అనిల్ కుమార్ వెల్లడించారు. అక్టోబరు నెలలో మొత్తం స్థూల వాణిజ్య విలువలు 1.7 నుంచి 1.9 బిలియన్ డాలర్లుగా ఉంటాయని పేర్కొన్నారు. వార్షిక వాణిజ్యవిలువలు 20-23 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. అయితే దీపావళి, దసరాల తర్వాత మళ్లీ అమ్మకాలు తగ్గు తాయని వెల్లడించారు. ఆన్లైన్ ఉత్పత్తుల విక్ర యాలు ఆరునెలల తర్వాత ఈసారి ఊపందుకున్నాయి. జనవరి మార్చి త్రైమాసికంలో 19శాతం తగ్గాయి. రానున్న త్రైమాసికంలో 5-10శాతంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. చిన్నపట్టణాలనుంచి రుతుపవనాల సీజన్ముగిసాక కొంత డిమాండ్ పెరుగుతుందని అనిల్కుమార్ వివరించారు. ఆన్లైన్ దీపావళి అమ్మకాల్లోరెండు, అంతకు తక్కువస్థాయి ఉన్న పట్టణాలనుంచే డిమాండ్ ఎక్కువ ఉందని తేలింది. దీన్నిబట్టిచూస్తే భారత్లో భవిష్యత్ ఇ-కామర్స్ రంగం భారీ వృద్ధి ని సాధించగలదని ఇ-కామర్స్ంస్థలు పేర్కొంటున్నాయి. ఈ ఐదు రోజుల విక్రయాల్లోనే విదేశీ ఇ-కామర్స్ భారతీయ దిగ్గజం ప్రైమ్ ఆఫర్ కింద కస్టమర్లకు లాయల్టీల రూపంలో 1.6 మిలియన్ల మందికి పంపిణీచేసింది. అలాగే ఫ్లిప్కార్ట్ కూడా తన అనుబంధ సంస్థలు మింత్ర, జబాంగ్లతో పాటుగా మంచి పనితీరు చూపించింది. అయితేఈ ఐదురోజుల జాతా మొత్తం కేవలం మూడుసంస్థల మధ్యనే నడిచింది. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అమెజాన్ సంస్థలచుట్టూనే అమ్మకాలు తిరిగాయి. రిటైలర్ల స్థూల వాణిజ్యవిలువలను కూడా పెంచాయి. జాతాకు ముందు 75-80 శాతం మాత్రమే ఉన్న వాణిజ్య విలువలు ఈ జాతాతో 90శాతానికి పెరిగాయని రెడ్సీర్ అంచనా వేసింది. భారీ ఎత్తున డిస్కౌంట్లు, వివిధ ఆఫర్లు ప్రకటించడమే ఇందుకు కారణమని అంచనా.
| 1entertainment
|
2019 టాప్ బాక్స్ ఆఫీస్ హిట్స్ (కలెక్షన్స్ అప్డేట్)
First Published 6, Aug 2019, 12:28 PM IST
2019 టాలీవుడ్ కి పాజిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. చాలా వరకు ఈ ఏడాది రిలీజైన సినిమాలు మినిమమ్ వసూళ్లు అందుకుంటున్నాయి. నిర్మాతలు సేఫ్ అవుతున్నప్పటికీ కాస్త పంపిణీదారులకు నష్టాలు తప్పడం లేదు. ఇక మొన్నటివరకు రిలీజైన టాప్ 2019 బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.
బెల్లకొండ శ్రీనివాస్ - రాక్షసుడు - గత వారం రిలీజైన ఈ సినిమా మూడు రోజుల్లోనే 6 కోట్లను రాబట్టింది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ అదే ఫ్లోలో షేర్స్ ని అందిస్తోంది.
ఇస్మార్ట్ శంకర్: రామ్ - పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈ ఇయర్ బెస్ట్ ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో టాప్ 1లో నిలిచింది. 50కోట్లకు పైగా లాభాల్ని అందించింది. ఇంకా థియేటర్స్ లో మినిమమ్ కలెక్షన్స్ ను అందుకుంటోంది.
సమంత - ఓ బేబీ - మొదటివారంలో ఎవరు ఊహించని విధంగా 11కోట్ల వరకు లాభాల్ని అందించిన ఈ సినిమా మొత్తంగా 15కోట్లను అందుకున్నట్లు సమాచారం.
బ్రోచేవారెవరురా - అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మంచి టాక్ తో 15కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ: ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఆకట్టుకున్న ఈ సినిమా మౌత్ టాక్ తోనే 10కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
మహేష్ బాబు మహర్షి ఎలాంటి రిస్క్ లేకుండా 100కోట్ల షేర్స్ ను అందించి నిర్మాతలను సేవ్ చేసింది.
అవెంజర్స్ ఎండ్ గేమ్: తెలుగులో డబ్ చేసి భారీగా రిలీజ్ చేసిన బయ్యర్లకు ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ ని అందించినట్లు సమాచారం.
రాఘవ లారెన్స్ - కాంచన 3- ఈ హారర్ కామెడీ తమిళ్ ఫిల్మ్ తెలుగులో 30కోట్లకు పైగా లాభాల్ని అందించింది.
నాని జెర్సీ: హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 28కోట్ల షేర్స్ ను అందించి నిర్మాతలకు నష్టం వాటిల్లకుండా సేవ్ చేసింది.
చిత్రలహరి: వరుస అపజయాలతో ఉన్న సాయి ధరమ్ తేజ్ కి మంచి బూస్ట్ ఇచ్చిన ఈ సినిమా 14కోట్ల షేర్స్ ను రాబట్టింది.
మజిలీ: సమంత - నాగ చైతన్య జోడిగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అక్కటుకుంది. షేర్స్ 37.2కోట్లు
చీకటి గదిలో చితకొట్టుడు: ఈ సినిమా కోసం ఖర్చు పెట్టిన దానికంటే రెండింతలు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.
కళ్యాణ్ రామ్ 118: రిస్క్ లేకుండా సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకున్న నిర్మాతలకు ఈ సినిమా 10కోట్ల షేర్స్ ను అందించింది.
వరుణ్ తేజ్ - వెంకటేష్ - F2 - సంక్రాంతి కానుకగా ఈ ఏడాది మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ఈ చిత్ర దిల్ రాజుకి 79కోట్ల షేర్స్ ను అందించింది.
Recent Stories
| 0business
|
News Room 365 WATCH LIVE TV
వెండితెరపై మళ్లీ ‘గులాబీ’ కాంబినేషన్!
‘గులాబీ’ చిత్రం గుర్తు ఉందా? జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా నటించిన ఈ చిత్రంలో అప్పట్లో కుర్రకారును ఏ స్థాయిలో అలరించిందో తెలిసిందే. ఈ చిత్రం, దర్శకుడు కృష్ణ వంశీ, హీరో చక్రవర్తికి మాంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మళ్లీ వారిద్దరు కలిసి ఏ సినిమా చేయలేదు.
TNN | Updated:
Jan 21, 2017, 06:25PM IST
‘గులాబీ’ చిత్రం గుర్తుందా? జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా నటించిన ఈ చిత్రంలో అప్పట్లో కుర్రకారును ఏ స్థాయిలో అలరించిందో తెలిసిందే. ఈ చిత్రం, దర్శకుడు కృష్ణ వంశీ, హీరో చక్రవర్తికి మాంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈ స్నేహితులు ఇద్దరు కలిసి ఏ సినిమా చేయలేదు. అయితే, ఆ క్రేజీ కాంబినేషన్‌ను మరోసారి చూసే అవకాశం త్వరలోనే దక్కనుంది. కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘నక్షత్రం’ సినిమాలో జేడీ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.
సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా మెరవనున్నాడు. ప్రగ్యా జైశ్వాల్, ప్రకాష్ రాజ్‌‌వి కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలే. వీరితోపాటు జేడీ కూడా స్క్రీన్ పంచుకోనున్నాడు. ఇంతమంది ప్రధాన తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే తెలుగునాట అంచనాలు భారీగా ఉన్నాయి. మరి, వంశీ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి. షూటింగ్‌లో భాగంగా జేడీకి సూచనలిస్తున్న చిత్రాల వీడియోను వంశీ యూట్యూబ్ ద్వారా పంచుకున్నారు.
ఆ వీడియో మీ కోసం..
| 0business
|
TEAM INDIA
ధర్మశాల టెస్టులకు టీమిండియా జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగబోయే మిగతా రెండు టెస్టులకు బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది.తొలి రెండు టెస్టులకు తుది జట్టులో చోటు దక్కని ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాను జట్టు నుంచి విడుదల చేశారు.గాయంతో ఇబ్బంది పడుతున్న పాండ్యాను తప్పించిన సెలెక్షన్ కమిటీ చివరి రెండు టెస్టులకు అదే జట్టును కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.దీంతో పాండ్యాను విడుదల చేయడంతో టీమిండియా జట్టు సభ్యుల సంఖ్య 16 నుంచి 15కు తగ్గింది. పాండ్యా విజ§్ు హజారే ట్రోఫీలో బరోడా తరుపున క్వార్టర్ ఫైనల్లో ఆడనున్నాడు.మరోవైపు పుణే టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి రెండవ టెస్టు ఆడలేకపోయిన ఓపెనర్ మురళీ విజ§్ును జట్టుతో పాటే ఉంచారు.మూడవ టెస్టు వరకు అతడు కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుంది.మార్చి 16 నుంచి రాంచీ వేదికగా మూడవ టెస్టుప్రారంభం కానుంది.ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో ఇరు జట్లు ఒక్కొక్కరు ఒక మ్యాచ్ గెలువడంతో సిరీస్ 1-1 తేడాతో సమమైంది.గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన రోహిత్శర్మ,షమీ కోలుకున్నప్పటికి వారిని ఎంపిక చేయలేదు. రెండు టెస్టులకు భారత జట్టు: కోహ్లీ(కెప్టెన్),మురళీ విజ§్ు, కెఎల్ రాహుల్, పుజారా, రహానే, కరుణ్ నాయర్, అశ్విన్, జడేజా, వృద్దిమాన్ సాహా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్కుమార్, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్.
| 2sports
|
"మెంటల్ మదిలో" మూవీలోని పాట లిరికల్ వీడియో రిలీజ్ చేసిన నాని
Highlights
పెళ్లి చూపులు చిత్రానికి సైమా అవార్డు అందుకునేందుకు అబుదాబి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి
ఇక్కడే "మెంటల్ మదిలో" మూవీలోని పాటను మధుర ఆడియో ద్వారా రిలీజ్ చేసిన నాని
"గుమ్మడికాయ హల్వా" పాట లిరికల్ వీడియో రిలీజ్ చేసిన నేచురల్ స్టార్ నాని
నిర్మాత రాజ్ కందుకూరి తన ఇంతకు ముందు చిత్రం పెళ్ళిచూపులుకి సైమా ఉత్తమ చిత్రం అవార్ద్ లభించిన సందర్భంగా అది స్వీకరించదానికి అబుధాబి విచ్చేశారు. ఈ సందర్భంగా, రాజ్ కందుజూరి తన తదుపరి చిత్రం మెంటల్ మదిలొ చిత్రం నుండి, "గుమ్మడికాయ హల్వ" అనె ఒక గమత్తు పాటని "మధుర ఆడియో" ద్వారా లిరికల్ వీడియో రూపం లొ హీరొ నాని చెతుల మీదుగా అబుధాబి నుండి విడుదల చెశారు.
హీరొ నాని మాట్లాడుతూ తను మెంటల్ మదిలొ టీజర్ ని ఈ మధ్యె చూశానని తనకి చాలా నఛ్చి మళ్ళీ ట్వీట్ కూడా చేశానని,, ఇప్పుడు ఈరొజు తను విడుదల చెసిన ఈ పాట తనకి బాగా నచ్ఛిందని, ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, అలాగే గత సంవత్సరం ఇదే సమయానికి తను పెళ్లిచూపులు సినిమా టీజర్ రిలీజ్ చెశానని చెప్పారు నాని.
రాజ్ కందుకూరి నానికి కృతజ్ఞత తెలిపారు. ఆయన మట్లాడుతూ, జూలై చివరి వారంలొ ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చెస్తున్నట్టు తెలిపారు. రాజ్ కందుకూరి ఈ చిత్రం ద్వారా లఘు చిత్ర దర్శకుదు వివెక్ ఆత్రెయ ను దర్శకుడిగా పరిచయం చెస్తూ నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు,, నివెత పెతురాజ్ ప్రధాన తారాగణం.ప్రషాంత్ విహారి సంగీతం, వెదరామన్ కెమెరా, విప్లవ్ ఎడిటింగ్ మరియు పీఅర్ఒ-వంశీ శేఖర్.
Last Updated 25, Mar 2018, 11:54 PM IST
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కోహ్లి చిన్ననాటి కోచ్.. ఇప్పుడు ఢిల్లీ జట్టుకి..!
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ తాజాగా ఢిల్లీ అండర్-23 జట్టుకి కోచ్గా ఎంపికయ్యాడు
TNN | Updated:
Aug 28, 2017, 09:00PM IST
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ తాజాగా ఢిల్లీ అండర్-23 జట్టుకి కోచ్‌గా ఎంపికయ్యాడు. పశ్చిమ ఢిల్లీలోని క్రికెట్ అకాడమీలో శర్మ వద్దే కోహ్లి క్రికెట్ ఓనామాలు నేర్చుకున్నాడు. తదనంతరం కోహ్లి అండర్-19 జట్టుకి ఎంపికవడం.. కెప్టెన్‌గా జట్టుని విశ్వవిజేతగా నిలపడంతో టీమిండియా నుంచి పిలుపొచ్చింది.
ఢిల్లీ అండర్-23 జట్టుతో పాటు ఢిల్లీ రంజీ జట్టుకి కూడా కోచ్, సహాయ కోచ్‌లను నియమిస్తూ క్రికెట్ అఫైర్స్ కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గంభీర్‌తో గొడవపడి వార్తల్లో నిలిచిన రంజీ కోచ్ భాస్కర్‌ని తిరిగి కోచ్‌గా నియమించి కమిటీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏడాది వ్యవధిలో ఢిల్లీ జట్టు అటు రంజీల్లో, విజయ్ హజారే ట్రోఫీలోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంది. ఈ సమయంలో కోచ్ భాస్కర్ జట్టులోని యువ క్రికెటర్లని భయబ్రాంతులకి గురి చేస్తున్నాడని గంభీర్ ఆరోపించాడు. దీంతో ఇద్దరి మధ్య మీడియా వేదికగా పెద్ద గొడవైంది.
| 2sports
|
Visit Site
Recommended byColombia
ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, వాణీ కపూర్ల మధ్య చోటుచేసుకునే రొమాన్స్, కెమిస్ట్రి బాగా ఆకట్టుకోనుంది అని బేఫికర్ పోస్టర్లలోని హాట్ ఫోజులు చూస్తుంటే అర్థమవుతోంది. రణ్వీర్ గత చిత్రాల్లో అతగాడు అనుష్కా శర్మ, దీపికా పదుకునే లాంటివారితో రొమాన్స్ ఎంత బాగా ఎంజాయ్ చేశాడో ఆడియెన్స్కి తెలుసు. అందుకే ఈ సినిమాలోనూ వాణి కపూర్తో జంటగా మంచి సరసమైన వినోదాన్ని అందిస్తాడని ఆడియెన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు వాణీ కపూర్ సైతం ఏ కండిషన్లు లేకుండా సహకరించిందని టాక్.
లవ్ స్టోరీల ఎక్స్పర్ట్ అయిన ఆదిత్యా చోప్రా డైరెక్షన్
బాలీవుడ్లో ఆదిత్యా చోప్రా ఓ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అంటే అది దీపావళి పండగో లేక క్రిస్టమస్ పండగలాంటిదో అని అనుకోవాల్సిందే. పండగల్ని టార్గెట్ చేసుకుని పండగలాంటి లవ్ స్టోరీల్ని అందించడంలో సిద్ధహస్తుడు ఆది. బేఫికర్ ఈ డిసెంబర్ 9న రిలీజ్ కానుండటంతో ఈసారి క్రిస్టమస్ ఇంకాస్త ముందే వస్తుందనుకోవచ్చు. ప్రేమకథలు చెప్పడంలో ఆది మంచి నిపుణుడు మాత్రమే కాదు... ఆ కథని అంతకన్నా అందంగా తెరకెక్కించడంలో ఆది స్టైలే వేరు. అందుకే బేఫికర్ సినిమాని తానే డైరెక్ట్ చేయబోతున్నాను అని ఆది ప్రకటించినప్పుడే అతడి గురించి తెలిసిన అభిమానుల్లో ఓ రకమైన ఉత్కంఠ ఏర్పడింది. ఆది రెగ్యులర్ హీరో అయిన షారుఖ్నే ఈ సినిమాలోకి తీసుకుంటుండవచ్చని భావించారంతా. కానీ అందరి అంచనాలని తారుమారుచేస్తూ రణ్వీర్ సింగ్ని తీసుకున్నాడు ఆది.
23 ఘాటైన ముద్దులున్న రొమాంటిక్ లవ్ స్టోరీ
అప్పుడెప్పుడో ఓ దశాబ్ధం కింద మల్లికా శరావత్ ఫీమేల్ లీడ్ రోల్లో వచ్చిన క్వాహీష్ సినిమాలో 17 ముద్దు సీన్లున్నాయి. 17 ముద్దులున్నందుకే ఇప్పటికీ క్వాహిష్ని ఎవ్వరూ మరిచిపోలేకపోతున్నారు. అటువంటిది 'బేఫికర్'లో ఏకంగా మొత్తం 23 కిస్సు సీన్లున్నాయంటే రొమాన్స్ కోరుకునే ఆడియెన్స్కి అంతకన్నా ఇంకా ఎక్కువేం కావాలి. అందులోనూ రణ్వీర్ తన తొలి చిత్రమైన 'బ్యాండ్ బాజా బరాత్' నుంచి ఇటీవలే వచ్చిన 'దిల్ దడక్నేదో' చిత్రం వరకు ప్రతీ సినిమాలోనూ హీరోయిన్లని ముద్దాడకుండా ఊరుకోలేదు. అందుకే అనుష్క, దీపికా పదుకునేలతో రొమాన్స్, లిప్ లాక్ సన్నివేశాలకన్నా వాణి కపూర్తో లిప్ లాక్ ఎలా వుంటుందో చూడాలని ఉవ్విళ్లూరుతున్న వాళ్లూ లేకపోలేదు.
నగ్నంగా కనిపించనున్న రణ్వీర్ సింగ్
'బేఫికర్'లోని ఓ సన్నివేశంలో రణ్వీర్ సింగ్ న్యూడ్గా కనిపించాల్సి వుంటుంది అనే వార్త బయటికొచ్చినప్పటి నుంచే ఈ సినిమా బాలీవుడ్ సర్కిల్స్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. చాక్లెట్ బాయ్గా కనిపించనున్న రణ్వీర్ న్యూడ్గా నటిస్తున్నాడు అనే వార్త కూడా ఈ సినిమా ఫ్రీ పబ్లిసిటీకి మరో కారణమైంది. విచిత్రం ఏంటంటే, రణ్వీర్ ఆ సీన్లో ఎలా వుంటాడో చూడాలనుకునే ఫీమేల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారట అతడికి.
ఖరీదైన లొకేషన్లు, ప్యారిస్ అందాలు..
యశ్ రాజ్ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు అందమైన లొకేషన్లకి పెట్టింది పేరు. ప్రపంచంలోని బెస్ట్ లొకేషన్లని ఎంచుకుని సినిమాలు నిర్మించడం ఈ బ్యానర్కున్న మరో స్పెషాలిటీ. 1970 లలోని అందమైన ప్రేమకథా చిత్రాల నుంచి యశ్ చోప్రా చివరి చిత్రమైన 'జబ్ తక్ హై జాన్' వరకు యశ్ రాజ్ ఫిలింస్ పాటించింది కూడా ఈ పాలసీనే. తన తండ్రి తర్వాత ఆయనిచ్చిన వారసత్వాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు ఆది. సిటీ ఆఫ్ లవ్గా పేరున్న ప్యారిస్లోనే బేఫికర్ చిత్రం ఎక్కువ భాగం తెరకెక్కింది. ప్యారిస్ అందాలు చూడాలంటే 'బేఫికర్'కి ఏ ఫికర్ లేకుండా వెళ్లొచ్చనేది ఆడియెన్స్ ఆశ. అదండీ సంగతి.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బంతుల్ని వదిలేయడం తెలియాలి: పుజారా
బౌన్స్ పిచ్లపై కొన్ని బంతుల్ని వదిలేయడం కూడా బ్యాట్స్మెన్కి తెలుసుండాలని భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా సూచించాడు.
TNN | Updated:
Jan 3, 2018, 12:48PM IST
బౌన్స్ పిచ్‌లపై కొన్ని బంతుల్ని వదిలేయడం కూడా బ్యాట్స్‌మెన్‌కి తెలుసుండాలని భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా సూచించాడు. శుక్రవారం నుంచి కేప్ టౌన్ వేదికగా భారత్ జట్టు తొలి టెస్టులో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో నెట్స్‌లో కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్న పుజారా మీడియాతో మాట్లాడాడు. గతంలో రెండు సార్లు సఫారీ గడ్డపై పర్యటించడం తనకి కలుసొస్తుందని.. భారత్ జట్టు కూడా మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఉవ్విళ్లూరుతుందని ఈ మిస్టర్ డిఫెండబుల్ వివరించాడు.
‘ఆసియా వెలుపల.. దేశాలతో ఆడుతున్నప్పుడు కొన్ని బంతుల్ని వదిలేయడం కూడా ముఖ్యమే. ఎందుకంటే అక్కడ పిచ్‌లపై బంతి ఎక్కువ బౌన్స్ అవుతుంటుంది. అందుకే.. బౌన్సర్‌గా వచ్చే బంతిని సహనంతో విడిచిపెట్డడం కూడా బ్యాట్స్‌మెన్‌కి తెలియాలి. దక్షిణాఫ్రికాలో పర్యటించిన అనుభవం నాకుంది. 2010-11, 2013-14 పర్యటన ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఆ అనుభవాన్ని తాజా సిరీస్‌లో వినియోగించుకుంటాను’ అని పుజారా వివరించాడు. వన్డే, టీ20 జట్టులో చోటు దక్కకపోయినా.. గత కొంతకాలంగా పుజారా కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Suresh 108 Views
హైదరాబాద్లో కస్టమర్ కేర్ సేవలు టాప్
హైదరాబాద్, ఆగస్టు 25: కస్టమర్లను ఎక్కువ రాబట్టుకునేవిధంగా సేవలందించే కేటగిరీల్లో హైద రాబాద్ నగరం 200శాతం వృద్ధితో ఉందని రైట్ ట్యాప్ అనే సంస్థ సర్వేచేసింది. కొత్తగా రూపొం దించిన మొబైల్ అప్లికేషన్ సాయంతో నిర్వహిం చిన సర్వేలో కస్టమర్కేర్ విభాగంలో మరింత వృద్ధి ఉన్నట్లు ప్రకటించింది. ఇ-కామర్స్, ఎయిర్ లైన్స్, బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్కేర్ వంటి రంగాల్లో కస్టమర్లు ఎక్కువ వస్తున్నట్లు తేలింది. అంతేకా కుండా కస్టమర్ సానుకూల సేవాసౌకర్యాలు అందు తున్నట్లు తేలింది. వీటితోపాటు డిటిహెచ్ సేవలు, జీవితబీమా సంస్థలసేవలు వంటివి కూడా కీలకంగా ఉన్నాయి. రైట్ట్యాప్ సహవ్యవస్థాప కుడు సిఇఒ రాజీవ్బెనర్జీ మాట్లాడుతూ 21వ శతా బ్దపు వృత్తినైపుణ్యంతో కొత్త టెక్నాలజీ ఆధారంగా వినియోగదారులు ప్రత్యేకతతో కూడిన సంతృప్తి కరమైన సేవలు కోరుకుంటున్నారని తమకు అవస రమైన రంగాల్లో ఈసేవలు మరింతగా ఆశిస్తున్నట్లు తేలింది. హైదరాబాద్ మార్కెట్పరంగా ఎక్కువగా టెలికాం, ఆటో, బ్యాంకింగ్, హెల్త్కేర్ రంగాల్లో కస్ట మర్ల సేవలు ఎక్కువ కోరుతున్నారు. ఐదుశాతం నుంచి 15శాతం వరకూ వృద్ధి చెందినట్లు రైట్ట్యాప్ సిఇఒ వివరించారు. కస్టమర్లను సంతృప్తి పరిచేందు కు సాంప్రదాయంగా వస్తున్న సంస్థలు ఇపుడు కొత్త మార్గాలు అన్వేషించుకోవాల్సి వస్తోందనిసంస్థ వివ రించింది. కొత్తకొత్త కస్టమర్ కేర్ కార్యాచరణలను అనురిస్తున్నాయి. క్రియాశీలకంగా ఉన్న కస్టమర్ల సేవలపై సంతృప్తి ఎలాఉండాలన్న అంశంపైనే ఇపు డిపుడే సంస్థలు, పరిశ్రమరంగం శ్రద్ధచూపిస్తున్నట్లు రైటప్ ట్యాప్ వివరించింది. సుమారు 200 టాప్ బ్రాండ్స్ కలిగి ఉన్న మొబైల్ అగ్రిగేషన్ ప్లాట్ ఫామ్గా ఉన్న రైటప్టాప్ సాయంతో కస్టమర్ కేర్ కేంద్రాలతో సంప్రదించే అవకాశం కలుగుతుంది.
| 1entertainment
|
AMIR1
20వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న అమీర్
షార్జా: వెస్టిండీస్తో షార్జాలో జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ అమీర్ టెస్టులో తొలి క్యాచ్ను అందుకున్నాడు.కాగా తన కెరీర్లో 20వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న అమీర్ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసి ఏడు సంవత్సరాలు అవుతుంది.ఇప్పటి వరకు ఒక్క క్యాచ్ కూడా అందుకోలేదు.అయితే షార్జా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్తో జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్లో అమీర్ అందుకున్న తొలి క్యాచ్లోనే అద్బుతం చేశాడు.పాక్ బౌలర్ జుల్ఫికర్ బౌలింగ్లో వెస్టిండీస్ బ్యాట్స్మెన్ డారెన్ బ్రావో షాట్ కొట్టాడు. ఇంతలో సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న అమీర్ అమాంతం గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు.కాగా అమీర్ బంతిని అందుకున్న సమయంలో అతడు పూర్తిగా గాల్లోనే ఉన్నాడు.ఈ దృశాన్ని మైదానంలో ఉన్న ప్రొఫెషనల్ పోటోగ్రాపర్లు క్లిక్ మనిపించారు.కాగా 2010 ఇంగ్లండ్లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలితే ముగ్గురు క్రికెటర్లు సల్మాన బట్.మహ్మద్ అసిప్లతో పాటు మహమ్మద్ అమీర్ ఒకడిగా ఉన్నాడు.స్పాట్ ఫిక్సింగ్ ఆరోపనణలు రుజువు కావడంతో ఈ ముగ్గురిపై అయిదేళ్లు నిషేదం విధించారు.అయితే ఈ ఏడాడి జనవరిలో మహ్మద్ అమీర్ అంతర్జాతీయ క్రికెట్ట్లోకి పునరాగమనం చేశాడు.కాగా తాజాగా షార్జాలో పాకిస్థాన్,వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలి క్యాచ్ అందుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్లో ఇంత ఆలస్యంగా తొలి క్యాచ్ అందుకున్న క్రకెటర్గా అమీర్ రికార్డు సృష్టించాడు.
| 2sports
|
producer boney kapoor talks about pink telugu remake with power star pawan kalyan reveals the reason behind working with him
అందుకే Pawan Kalyanతో సినిమా చేయాలని అనుకున్నా: బోనీ కపూర్
పవన్ కళ్యాణ్తో కలిసి నిర్మాత బోనీ కపూర్ పింక్ సినిమాను రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. పవన్ ఇక సినిమాలు చేయరేమో అనుకుంటున్న సమయంలో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్న మాట అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.
Samayam Telugu | Updated:
Nov 4, 2019, 03:13PM IST
పవన్ కళ్యాణ్ బోనీ కపూర్
మొత్తానికి పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సెన్సేషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్ పూర్తిగా సినిమాలకు దూరం అయిపోతారు అనుకున్నారంతా. కానీ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ దేవుడిలా వచ్చి మొత్తానికి పవన్ చేత సినిమాను మొదలుపెట్టించబోతున్నారు. అయితే ఈ సినిమాను పవన్తోనే ఎందుకు చేయాలనుకుంటున్నారో తాజాగా బోనీ కపూర్ మీడియా ద్వారా వెల్లడించారు.
‘బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా ‘పింక్’. ఇది చాలా మంది విజయం అందుకుంది. తమిళ నటుడు అజిత్తో కలిసి ఏదన్నా సినిమా చేయాలన్నది నా భార్య శ్రీదేవి కల. ఆ కల నెరవేర్చడం కోసం నేను పింక్ను తమిళంలో ‘నేర్కొండ పార్వాయ్’ టైటిల్తో రీమేక్ చేశాను. ఈ వెర్షన్ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత తెలుగులో తీసినా అంతే విజయం సాధిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. అందుకే ఈ సినిమాను తెలుగులో తీయాలని నిర్ణయించుకున్నాను. తెలుగు ప్రేక్షకులను నచ్చే అంశాలతోనే సినిమాను తీస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఆయన్ను ఒప్పించాను’ అని వెల్లడించారు.
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
భారత్లో వెస్టిండీస్ పర్యటన ఖరారు..!
భారత్లో వెస్టిండీస్ పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ శనివారం మీడియా
TNN | Updated:
Mar 17, 2018, 06:02PM IST
భారత్లో వెస్టిండీస్ పర్యటన ఖరారు..!
భారత్‌లో వెస్టిండీస్ పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ శనివారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. అక్టోబరులో ప్రారంభంకానున్న ఈ పర్యటనలో భారత్‌తో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ని వెస్టిండీస్ జట్టు ఆడనుంది. ఏకైక టీ20 మ్యాచ్‌కి ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనున్నట్లు ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌ (క్యాబ్) అధ్యక్షుడిగా పనిచేస్తున్న గంగూలీ వెల్లడించాడు. అయితే.. మిగతా మ్యాచ్‌ల వేదికల గురించి ఇంకా స్పష్టత రాలేదని ఆయన తెలిపారు.
వెస్టిండీస్ జట్టు 2014లో చివరిసారిగా భారత్‌లో పర్యటించింది. ఆ పర్యటన సమయంలోనే వెస్టిండీస్ బోర్డుతో జీతాల సమస్య ముదరడంతో.. సిరీస్ మధ్యలోనే కరీబియన్ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. బీసీసీఐ తమకి నష్టపరిహారం చెల్లించాలని కోరడంతో.. వెస్టిండీస్ బోర్డు వణికిపోయింది. ఆ తర్వాత 2016లో టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌కి వచ్చిన వెస్టిండీస్ జట్టు.. ఏకంగా టైటిల్‌ని ఎగరేసుకుపోయింది. మళ్లీ.. ఇప్పుడు సుదీర్ఘ సిరీస్‌ ఆడేందుకు భారత్‌కి వస్తోంది. అయితే.. గతంతో పోలిస్తే.. టెస్టులు, వన్డేల్లో ఆ జట్టు భారత్‌కి ఏమాత్రం పోటీనిచ్చే సూచనలు కనిపించడం లేదు. అయితే.. టీ20ల్లో మాత్రం.. ఆ జట్టు ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్‌గానే కొనసాగుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Jul 29,2018
5 రోజుల్లో.. 5లక్షల కోట్ల లాభాలు..
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ల శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ వారంలో మదుపరులు అనూహ్య లాభాలను అందుకున్నారు. స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీతో గత వారం అయిదు సెషన్లలో మదుపర్ల సంపద ఏకంగా రూ.4.67 లక్షల కోట్లు పెరిగింది. శుక్రవారం ముగింపు నాటికి సెన్సెక్స్ ఏకంగా 37,337 పాయింట్ల జీవితాకా గరిష్టాన్ని చేరింది. అంతర్జాతీయ సానుకూల పరిణామాలకు తోడు.. పలు వస్తువులపై జీఎస్టీ కౌన్సిల్ వస్తుసేవల పన్నును తగ్గించడం, కార్పొరేట్ కంపెనీల సానుకూల ఫలితాలు మార్కెట్లకు ప్రధానంగా మద్దతునిచ్చాయి. దీంతో జులై 27తో ముగిసిన వారంలో సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 840.48 పాయింట్లు లేదా 2.30 శాతం పెరిగింది. శుక్రవారం ముగింపు నాటికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,51,44,543 కోట్లకు చేరింది. ఇంతక్రితం వారంలో ఈ విలువ రూ.1,46.77,027 కోట్లుగా వుంది. దీంతో కేవలం ఐదు సెషన్లలో మదుపరి సంపద రూ.4,67,515.16 కోట్లు పెరిగింది.
కార్పొరేట్ ఫలితాలపైనే ప్రధానంగా దృష్టి
జులై 30తో ప్రారంభం కానున్న వారంలో భారత స్టాక్ మార్కెట్లను ప్రధానంగా కార్పొరేట్ కంపెనీల ఆర్ధిక ఫలితాలు ప్రభావితంచేయనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే విధంగా కేంద్ర గణంకాల శాఖ వెల్లడించనున్న పారిశ్రామికోత్పత్తి, టోకు, చిల్లర ద్రవ్యోల్బణ సూచీల అంచనాలను మదుపర్లు కీలకంగా తీసుకోనున్నారు. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ, చమురు ధరలు, అమెరికా-యూరప్ దేశాల మధ్య జరగనున్న పరిణామాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా రిజర్వు బ్యాంకు ఆగస్టు రెండో వారంలో నిర్వహించనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లపై ముందస్తు అంచనాలు కీలకం కానున్నాయని బ్రోకర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో జరిగే చర్చలను పెట్టుబడిదారులు గమనించనున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Maneesh pandy
పాండ్యా మంచి ఆల్రౌండర్: మనీశ్పాండే
ముంబై: చివరి ఓవర్లలో తమ బౌలర్ల బౌలింగ్పై కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ మనీశ్ పాండే అసంతృప్తి వ్యక్తం చేశాడు.చివరల్లో తమ బౌలర్లు సరిగా ఆడలేకపోతున్నారన్నాడు. వారి లోపాలన్ని సరిదిద్దుకోవాల్సిన అవసర ముందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఐపిఎల్-10లో ముంబై ఇండ ియన్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో కోల్కతా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.కోల్కతా బౌలర్లు చివరి మూడు ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి మ్యాచ్ చేజార్చుకున్నారు. గుజరాత్ లయన్స్తో జరిగిన మొదటి మ్యాచ్లోనూ చివరి ఓవర్లలో మా బౌలర్లు సరిగా ఆడలేకపోయారు. డెత్ ఓవర్లలో మా బౌలింగ్ మరింత మెరుగుపడాల్సి ఉంది.బౌలర్లు క్రమం తప్పకుండా యార్కర్లు సంధిస్తే బ్యాట్స్మెన్ ఆడటానికి ఇబ్బంది పడతారు.అయితే చివరి ఓవర్లలో ముంబై బ్యాట్స్మెన్ బాగా ఆడారు.డెత్ ఓవర్లలో మా బౌలింగ్ పదను తేలడానికి మరింత కష్టపడాల్సి ఉంది.ఈ సమస్యను అధిగమిస్తామని పాండే పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తరువాత అతడు మీడియాతో మాట్లాడుతూ హార్థిక్ పాండ్యా,నితీశ్ రాణా తమ నుంచి మ్యాచ్ లాగేసు కున్నారని వ్యాఖ్యానించాడు.
| 2sports
|
నోట్లరద్దు సాహసోపేతమైన చర్య
టాటాసన్స్ ఛైర్మన్ రతన్టాటా
న్యూఢిల్లీ, నవంబరు 23: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల చెలామణి రద్దుచేయడం సాహసోపేతమైన చర్య అని టాటాసన్స్ ఛైర్మన్ రతన్ టాటా వెల్లడించారు. దీనివల్ల నల్లధనం, అవినీతి కట్టడి జరుగుతుందని పేర్కొన్నారు. పాతనోట్లను రద్దుచేసి వాటి స్థానంలో కొత్తనోట్ల ను ప్రవేశపెట్టడం వల్ల అప్పటికప్పుడు నల్లధనం కట్టడిచేయగలమని, అలాగే వ్యవస్థలో వేళ్లూను కుని ఉన్న అవినీతిని కూడా నియంత్రించగలమ ని అయితే ఇందుకు ప్రజల నుంచి కొంత మద ్దతు అవసరం అవుతుందని రతన్ టాటా వెల్లడిం చారు. ఈనెల 8వ తేదీ ఆకస్మికంగా ప్రధాని మోడీ ప్రకటనచేస్తూ పెద్దనోట్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నల్లధనం కట్టడితో పాటు నకిలీకరెన్సీ చెలామణిని కూడా నియంత్రించాలని, ఉగ్రసంస్థలకు నిధులు అందు చేతను నిర్మూలించేందుకు దోహదం చేస్తుందని చేసినమోడీ ప్రకటనతో రతన్టాటా ఏకీభవించారు.
| 1entertainment
|
internet vaartha 132 Views
అహ్మదాబాద్ : భారత్ ఫార్మామార్కెట్ లక్ష కోట్ల వార్షిక టర్నోవర్ను అధిగమించింది. అయితే మార్కెట్ వృద్ధి కాస్త మందించినట్లు తేలింది. ధరల నియంత్రణ, ఫిక్సెడ్డోస్ కాంబినేషన్ మందులపై నిషేధం వంటివాటితో వృద్ధి మందగిం చిందని నిపుణుల అంచనా. గడచిన కొన్ని నెలలు గా ఈ వృద్ధి మరింత మందగించింది. ఆంక్షలు ఎదురవుతున్నప్పటికీ భారతీయ ఔషధ మార్కెట్ లక్షకోట్ల వార్షిక టర్నోవర్ను జూన్లో అధిగమించి నట్లు అంచనా. అఖిలభారత కెమిస్ట్స్ అండ్డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, అవాక్స్ మార్కెట్ రీసెర్చి సంస్థ ల అధ్యయననివేదికను పరిశీలిస్తే ఫార్మా మార్కె ట్ జూన్లో 6.4శాతం వృద్ధిని నమోదుచేసిం ది. జూన్నెలలో 13శాతంగా ఉంది. ఇండియన్ ఫార్మామార్కెట్(ఐపిఎం)లక్షకోట్ల వార్షికటర్నోవర్ ను అధిగమించిందని జూన్నెలలోనే 8460 కోట్ల టర్నోవర్ దాటిందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఐదులక్షల మందుల విక్రేతలున్న ఈ సంఘం ప్రాథమిక అధ్యయనంలో టర్నోవర్ ఉన్నప్పటికీ ఆంక్షలు అధికంగా ఉన్నట్లు అభి ప్రాయపడింది. సంఘం వైస్ప్రెసిడెంట్ హరి నటరాజన్ మాట్లాడుతూ ఏప్రిల్నెలలో మార్కెట్ 3.5శాతం తగ్గిందని, అదే జూన్నెలలో 6.4శాతా నికి పెరిగిందని గత ఏడాదితో పోలిస్తే తక్కువేనని వెల్లడించారు. గత ఏడాది మార్కెట్లకు 1025 కోట్లు జతకలిస్తే ఈ ఏడాది కేవలం 507కోట్లు మాత్రమే అదనంగా వచ్చిందని ఆయన అన్నారు. దీన్నిబట్టిచూస్తే వృద్ధిరేటు మందగమనంతోనే ఉం దని, సగటు వృద్ధి ఈ త్రైమాసికంలో 6.4శాతంగా ఉన్నట్లు ప్రకటించారు. గత ఏడాది ఇదేకాలంలో 14.8శాతంగా ఉందని నటరాజన్ పేర్కొన్నారు. జూన్నెలలో ఎక్కువగా ధరలుపెరుగుదలవల్ల 3.8 శాతం, కొత్త ఉత్పత్తుల విడుదలద్వారా 3.2శాతం, విక్రయాలపరంగా 0.6శాతం తగ్గినట్లు వివరిం చారు. ఫిక్సెడ్డోస్ కాంబినేషన్ (ఎఫ్డిసి) సంబం ధిత మార్కెట్ 14.6శాతం దిగజారింది. నాన్ఎఫ్ డిసి మార్కెట్ 7.0శాతంగాఉంది. భారతీయ కంపె నీలు కూడా ఎఫ్డిసి పోర్టుఫోలియోలో 18.5 శాతం క్షీణించినట్లు అఖిలభారత సంఘం వెల్లడిం చింది. ఇక బహుళజాతి కంపెనీల్లో కూడా ఐదు శాతం జూన్నెలలో మందగించాయి. థెరపీలు, శ్వాసకోస మందుల మార్కెట్పరంగా 8.2శాతం పెరిగింది. గ్యాస్ట్రోఇంటెస్టినల్ మార్కెట్ 8.8శాతం నొప్పులు, ఇతర చికిత్సల మందులు 3.5శాతం పెరిగాయి. ఇక అంటువ్యాధుల నిరోధక మందులు 3.4శాతం, యాంటి డయాబెటిక్స్ 11.7శాతం వృద్ధిని సాధించినట్లు తేలింది. దేశంలో ఒడిశా మార్కెట్ అత్యధికంగా 17.9శాతం వృద్ధి సాధిం చింది. తర్వాత హర్యానా మార్కెట్ 14.9శాతం, ఈశాన్యమార్కెట్ 12.3శాతం పెరిగాయి. కార్పొ రేట్ ఔషధ కంపెనీలు కొత్త ఉత్పత్తుల విడుదల కొంత ఎఫ్డిసిల్లో నష్టాన్ని తగ్గించిందని అంచనా. మొత్తం 324 బ్రాండ్లలో 526 స్టాక్ కీపింగ్ యూనిట్లు జూన్నెలలోనే విడుదలైనట్లు అఖిల భారత కెమిస్టులు డ్రగ్గిస్టుల సంఘం వివరించింది.
| 1entertainment
|
Suresh 83 Views TCS
టిసిఎస్కు తగ్గిన రూ.2730 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ,అక్టోబరు 3: ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ (టిసిఎస్)కు అమెరికా న్యాయస్థానంలో ఉపశమనం లభించింది.ఎపిక్ సిస్టమ్స్ వేసిన కేసులో విధించిన జరిమానాను 420 మిలియన్ డాలర్ల(సుమారు 2730) కోట్లు)కు తగ్గించింది.వ్యాపార రహస్యాల ను చౌర్యం చేసిన అభియోగాలపై టాటా గ్రూపు నకు చెందిన టిసిఎస్,టాటా అమెరికా ఇంటర్నేషనల్ కాల్స్ లపై గతసంవత్సరం ఏప్రిల్లో న్యాయ స్థానం 940 మిలియన్ డాలర్లు (6110కోట్లు) జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఎపిక్ సిస్టమ్స్ వేసిన దావాపై టిసిఎస్ వాదానను పరిగణ లోకి తీసుకుని అమెరికా విస్కా న్సిన్లోని వెస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టు జరిమానా తగ్గింపు ఆదే శాలను జారీచేసింది. టిసిఎస్ వాదనను విన్ని కోర్టు నష్టపరిహార, చౌర్య పరిహారాన్ని 940మిలియన్ డాల ర్ల నుంచి420 మిలియన్ డాలర్ల కు పరిమితం చేసింది. అని టిసిఎస్ నియంత్రణ సంస్థలకు తెలిపింది.ఈ ఆదేశాల పైన మరింత బలంగా వాదిస్తామని స్పష్టం చేసింది.
| 1entertainment
|
Kuldeep Yadav bowls with wet hands at nets ahead of 1st T20I vs New Zealand
బంతిపై పట్టు కోసం.. కుల్దీప్ తడివేళ్లతో..?
ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ని తన చైనామన్ బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టిన భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని.. తొలి వన్డేలోనే
TNN | Updated:
Oct 31, 2017, 07:17PM IST
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ని తన చైనామన్ బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టిన భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని.. తొలి వన్డేలోనే న్యూజిలాండ్ ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ముఖ్యంగా టామ్ లాథమ్, రాస్ టేలర్ స్వీప్, రివర్స్ స్వీప్‌లతో కుల్దీప్ బౌలింగ్‌ని ఆటాడుకున్నారు. దీంతో తర్వాత రెండు వన్డేల్లోనూ అతనికి భారత్ కనీసం తుది జట్టులో కూడా చోటివ్వలేదు. అయితే.. బుధవారం నుంచి టీ20 సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో మళ్లీ ఈ కుర్ర బౌలర్‌కి అవకాశం దక్కేలా కనిపిస్తోంది.
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మంగళవారం కుల్దీప్ యాదవ్ నెట్స్‌లో కఠినంగా ప్రాక్టీస్ చేశాడు. జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేసిన కుల్దీప్.. ప్రతి బంతిని విసిరే ముందు నీటిలో వేళ్లని ముంచి అనంతరం బౌలింగ్ చేశాడు. బంతిపై పట్టు సాధించేందుకే కోచ్ ఇలా సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆదివారం ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ని భారత్ 2-1తో చేజార్చుకున్న నేపథ్యంలో.. కనీసం టీ20లోనైనా.. గెలవాలని కివీస్ ఆశిస్తోంది. 10 ఏళ్ల టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ చేతిలో న్యూజిలాండ్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. దీంతో తొలి టీ20 విజయం కోసం టీమిండియా ఎదురుచూస్తోంది.
| 2sports
|
Suresh 112 Views
ఆసిస్పై భారత్-ఎ జట్టు పరాజయం
బిస్బేన్: చతుర్ముఖ ఎ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో భారత్-ఎ పరాజయం చెందింది. కాగా మనీష్ పాండే 76 బంతులు ఆడి 13 బౌండరీలు,1 సిక్సర్తో 77 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులు చేసింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 228 పరుగులకు ఆలౌటైంది.ఆ జట్టు కెప్టెన్ హాండ్ స్వాంబ్ 93 బంతులు ఆడి 15 బౌండరీలు,1 సిక్సర్తో 87 పరుగులు చేయగా జో బర్న్స్ 125 బంతులు ఆడి 11 బౌండరీలు 1 సిక్సర్తో 78 పరుగులు చేసి సత్తా చాటారు.కాగా రెండు పరుగుల ఆధిక్యంలో రెండవఇన్నింగ్స్ ప్రారంభించిన యువ భారత్కు సరైన ఆరంభం లభించ లేదు. కాగా భారీ స్కోర్ చేయడంలో బ్యాట్స్మెన్ విఫలమవడంతో 156 పరుగులకే కుప్పకూలింది.జయంత్ యాదవ్ 75 బంతులు ఆడి 8 బౌండరీలతో 46 పరుగులు చేశాడు.మూడవ రోజు వర్షం కారణంగా ఆట నిలిపి వేశారు.మైదానం తడిగా ఉండటంతో నాలుగవ రోజు ఆట ఆలస్యంగా ప్రారంభించారు.కాగా బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు చెందిన కామెరాన్ బెన్క్రాప్ట్ 151 బంతులు ఆడి 6 బౌండరీలతో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.దీంతో మూడు వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది.టీమిండియా బౌలర్ శార్ధూల్ ఠాకూర్ 3-42తో ఆకట్టుకున్నాడు. ======= అక్మల్ ఫాం బాగున్నందునే జట్టులోకి: ఇంజుమామ్ కరాచీ: వికెట్ కీపర్ ఉమర్ అక్మల్ ప్రస్తుతం ఫాం బాగున్న కారణంగా మళ్లీ పాకిస్థాన్ టి20 జట్టులోకి తీసుకున్నామని చీఫ్ సెలక్టర్ ఇంజుమామ్ ఉల్ హక్ పేర్కొన్నాడు.దేశవాళీ టి20 చాంపియన్ షిప్లో దూసుకెళ్తున్న అక్మల్ త్వరలో పాక్-వెస్టిండీస్ మధ్య జరుగనున్న టి20 సిరీస్లో స్థానం సంపాదించుకున్నాడు. దేశవాళీ మ్యాచ్లలో ఫాంలోకి వచ్చాడని అతడిని జట్టులోకి తీసుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు సూచన మేరకు సెలక్షన్ ప్యానల్ అక్మల్కు అవకాశం ఇచ్చింది.అయిదు నెలలు జాతీయ జట్టుకు దూరంగాఉండటం ఎంతో కష్టంగా ఉంటుందన్నాడు. వివాదాలు లేకుండా కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నట్లు అక్మల్ పేర్కొ న్నాడు. జట్టులో పర్మినెంట్ ఆటగాడు కావడానికి తగిన ప్రదర్శన చేస్తానని తనతో చెప్పాడని ఇంజుమామ్ వివరించాడు.కాగా మరో వైపు ఫాంలేని కారణంగా షాహిద్ అఫ్రిది, ఓపెనర్ షెహజాద్ అహ్మద్లనుసెలక్టు చేయలేద న్నాడు. వారి పిట్నెస్పైకూడా విశ్వాసం లేదన్నాడు. టి20 సిరీస్ ప్రదర్శనతో వన్డే జట్టులోనూ స్థానం దక్కించుకుంటానని అక్మల్ ధీమా వ్యక్తం చేశాడు.కాగా మరోవైపు లాహోర్ వైట్స్ తరుపున ఉమర్ అక్మల్ 48 బంతుల్లో 115 పరుగులతో నాటౌట్గా నిలవడమే అతడి పునరాగమనానికి కారణమని ఇంజమామ్ వివరించాడు.
| 2sports
|
శ్రుతిహాసన్ కారణంగా కమల్ కు చీవాట్లు!
Highlights
కోలివుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ 'మక్కల్ నీధి మయ్యమ్' అనే పార్టీను స్థాపించి రాజకీయంగా బిజీగా గడుపుతున్నారు
కోలివుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ 'మక్కల్ నీధి మయ్యమ్' అనే పార్టీను స్థాపించి రాజకీయంగా బిజీగా గడుపుతున్నారు. అయితే గత వారంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కమల్.. నా కూతుళ్లను స్కూల్ లో చేర్పించిన సమయంలో వారి కులం, మతం గురించి రాయాల్సిన చోట నేను ఖాళీగా వదిలేశానని చెబుతూ కుల, మత రహిత సమాజం కోసం పాటు పడాలని అన్నారు.
కేరళ ఈ విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ ట్వీట్ చదివిన నెటిజన్లు కొన్నేళ్ల క్రితం శ్రుతిహాసన్ కులంపై చేసిన కామెంట్లను గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఓ చాట్ షోలో పాల్గొన్న శ్రుతిహాసన్ సదరు వ్యాఖ్యతతో 'నువ్వు అయ్యంగార్.. నేను అయ్యంగార్, ఇద్దరం సృజనశీలురం.. మనల్ని ఎవరూ పెళ్లాడే ఛాన్స్ లేదు' అని అన్నారు. ఈ వీడియోను బయట పెట్టిన నెటిజన్లు స్కూల్ అప్లికేషన్ లో కాదు ముందు మీ ఇంట్లో సంస్కరణలు మొదలుపెట్టండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
కుల నిర్మూలనకు అంబేద్కర్ ప్రచురించిన పుస్తకాలు చదవండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇక్కడితో ఆగారా అంటే లేదు.. అతడి వ్యాఖ్యలను సినిమాలకు లింక్ చేస్తూ.. సినిమా టైటిల్స్ లో కులాల పేర్లు చేర్చడానికి ఇబ్బంది పడని కమల్ రాజకీయంగా మాత్రం కులాలకు అతీతుడిగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా 'శభాష్ నాయుడు' సినిమా పేరుని ప్రస్తావిస్తున్నారు.
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Stock Market: కోలుకుంటున్న దేశీయ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు.. కాసేపటి తర్వాత లాభాల బాట పట్టాయి..
Samayam Telugu | Updated:
Sep 25, 2018, 11:27AM IST
Stock Market: కోలుకుంటున్న దేశీయ మార్కెట్లు!
క్రితం ట్రేడింగ్లో భారీ స్థాయిలో పతనమైన దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం కోలుకుంటున్నాయి. ఉదయం నిఫ్టీ 14 పాయింట్లు, సెన్సెక్స్ 6 పాయింట్ల నష్టంలో ఉదయం ట్రేడింగ్ ప్రారంభించాయి. కాసేపటికే 100 పాయింట్లకు పైగా కోల్పోయింది. పరిస్థితి అలాగే ఉండటంతో సెన్సెక్స్ ఒక దశలో 200 పాయింట్ల వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడటంతో సెన్సెక్స్ కోలుకుని లాభాల్లోకి మళ్లింది. బ్యాంకింగ్ రంగ షేర్లతో పాటు ఆటోమొబైల్, లోహ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
| 1entertainment
|
ఏజ్ బార్ అయినా.. క్రేజ్ మారలేదు!
First Published 11, Mar 2019, 11:56 AM IST
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ డికేడ్ పూర్తి చేసుకొని ఆశ్చర్యపరుస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ డికేడ్ పూర్తి చేసుకొని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన అమ్మాయి క్లిక్ అయిందంటే వరుస ఆఫర్లు ఆమె ముందు క్యూ కడతాయి. అలా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకొని ముప్పై ఏళ్లు దాటినా ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు మన భామలు. మరి వారెవరో చూద్దాం!
అనుష్క - 37
| 0business
|
Visit Site
Recommended byColombia
కోచ్ పదవి నుంచి తప్పుకోవడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని లీమన్ చెప్పాడు. ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్ల తప్పు చేశారు.. కానీ వారిని క్షమిస్తారని భావిస్తున్నానని లీమన్ చెప్పాడు. వారు తిరిగి జట్టులో చేరతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
స్మిత్, వార్నర్లపై ఏడాది పాటు నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. డారన్ లీమన్కు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్కు పాల్పడుతూ బాన్క్రాఫ్ట్ కెమెరాలకు చిక్కడంతో.. లీమన్ వాకీటాకీ సాయంతో సబ్స్టిట్యూట్ ఆటగాడితో మాట్లాడి బాన్క్రాఫ్ట్ దగ్గరకు పంపాడు.
ఈ తతంగం కూడా కెమెరాలు పసిగట్టడంతో.. లీమన్కు ఈ ఉదంతం గురించి ముందే తెలుసనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఆయన ఇచ్చిన వివరణతో క్రికెట్ ఆస్ట్రేలియా సంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు కోచ్గా కొనసాగించడానికి సుముఖత వ్యక్తం చేసింది.
లీమన్ 2009-12 మధ్య డెక్కన్ ఛార్జర్స్ కోచ్గా వ్యవహరించాడు. మరుసటి ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. క్వీన్స్లాండ్ కోచ్గానూ వ్యవహరించిన ఆయన.. మిక్కీ ఆర్థర్ రాజీనామాతో 2013 జూన్లో ఆసీస్ ప్రధాన కోచ్గా నియమితులయ్యారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
కుల్దీప్ తిప్పేశాడు, రాహుల్ దంచికొట్టాడు
Highlights
భారత క్రికెట్ జట్టు తన ఇంగ్లాండు పర్యటనలో శుభారంభం చేసింది. కుల్దీప్ యాదవ్ బంతితోనూ కెఎల్ రాహుల్ బ్యాట్ తోనూ అద్భుతమైన ప్రదర్శన చేసి భారత్ ను తొలి ట్వంటీ20 మ్యాచులో విజయ తీరాలకు చేర్చారు. కుల్దీప్ యాదవ్ కేవలం 17 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీయగా, కెఎల్ రాహుల్ పది ఫోర్లు, ఐదు సిక్సర్లతో చెలరేగి 54 బంతుల్లో 101 పరుగులు చేశాడు.
మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు తన ఇంగ్లాండు పర్యటనలో శుభారంభం చేసింది. కుల్దీప్ యాదవ్ బంతితోనూ కెఎల్ రాహుల్ బ్యాట్ తోనూ అద్భుతమైన ప్రదర్శన చేసి భారత్ ను తొలి ట్వంటీ20 మ్యాచులో విజయ తీరాలకు చేర్చారు.
కుల్దీప్ యాదవ్ కేవలం 17 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీయగా, కెఎల్ రాహుల్ పది ఫోర్లు, ఐదు సిక్సర్లతో చెలరేగి 54 బంతుల్లో 101 పరుగులు చేశాడు. దాంతో భారత్ ఇంగ్లాండుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్లు బట్లర్ (46 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 69), జేసన్ రాయ్ (20 బంతుల్లో 5 ఫోర్లతో 30) శుభారంభం చేసినా కుల్దీప్ ధాటికి మిగతా బ్యాట్స్ మెన్ నిలదొక్కుకోలేకపోయారు.
ఏకంగా ఏడుగురు బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఐదు వికెట్లు తీసిన తొలి ఎడమచేతి చైనామన్ బౌలర్గా కుల్దీప్ నిలిచాడు. ఉమేశ్కు రెండు వికెట్లు దక్కా యి.
ఆ తర్వాత లక్ష్యం ఛేదన బరిలోకి దిగిన భారత్ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 163 పరుగులు చేసి నెగ్గింది. రోహిత్ (32) ఫర్వాలేదనిపించాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ శిఖర్ ధావన్ (5) వికెట్ కోల్పోయినప్పటికీ రాహుల్ చెలరేగి ఆడాడు.
రాహుల్ 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 13వ ఓవర్లో రోహిత్ పెవిలియన్ చేరడంతో రెండో వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే 52 బంతుల్లో రాహుల్ తన కెరీర్ లో తొలి సెంచరీ చేయగా ఓ సిక్సర్తో కోహ్లీ మ్యాచ్ను ముగించాడు.
Last Updated 4, Jul 2018, 7:21 AM IST
| 2sports
|
internet vaartha 143 Views
ముంబై : బెంచ్మార్క్ స్టాక్ మార్కెట్ల సూచీలు అంతర్జాతీయ ధోరణులు, పార్లమెంటులో జిఎస్టి బిల్లు ఆమోదం పొందుతున్నద్న ధీమా వ్యక్తం కావడంతో గరిష్టస్థాయిలో పెకరిగాయి. వీటికి తోడు భరత్ వాతావరణశాఖ నైరుతిరుతు పవనాలు సాధారణసగటుకంటే ఎక్కువ ఉంటా యని అంచనావేసింది. వర్షపాతం ఆధారంగా జూలై నెల చివరినాటికి రెండో అంచనాలను కూడా విడుదల చేస్తున్నందున వ్యవసాయ సీజన్కు వర్షపాతం భారీ ప్రయోజాలనిస్తున్నదన్న ధీమా వ్యక్తం అవుతోంది. కేంద్ర కేబినెట్ స్టాక్ ఎక్ఛేంజిల్లో ప్రస్తుతం ఉన్న ఐదుశాతం విదేశీ పెట్టుబడుల పరిమితిని 15శాతానికి పెంచడంతో కొంతమేర ర్యాలీతీసాయి. బిఎస్ఇసెన్సెక్స్184 పాయింట్లు పెరిగి 28,209 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి 51పాయింట్లు పెరిగి 8666 పాయింట్ల వద్ద ముగిసింది. బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్సూచీలు 0.6 నుంచి 0.7శాతం పెరిగాయి. విదేశీ స్టాక్మార్కెట్లపరంగా యూరో పియన్, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 225సూచి 1.13శాతం దిగువన ముగిసింది. ఇన్వెస్టర్లు తదనంతరం బ్యాంకు ఉద్దీపనల ప్యాకేజిపై ఎక్కువ గురిపెట్టడం తో ఈనెల 28,29తేదీల్లో బ్యాంకు సమీక్ష వివరా లకే ఎక్కువ ఆసక్తి చూపించారు. బ్రెగ్జిట్ వోటింగ్ కూడా జపాన్ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపించిం ది. బ్యాంక్ ఆఫ్ జపాన్ చూపించే ఆర్థిక ఉద్దీపన లతో యెన్ పటిష్టం అవుతుందని, ఫలితంగా జపాన్ ఎగుమతిదారుల పోటీతత్వంపై ప్రభావం చూపుతుందన్న అంచనాలున్నాయి. కేంద్ర కేబినెట్ బుధవారం జిఎస్టి సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపట్టేందుకు వీలుగా సవరణలకు ఆమోదం తెలిపింది. ఈ సవరణలకు సానుకూలంగా రవాణా రంగషేర్లు పెరిగాయి. ఏడుశాతం వృద్ధిని సాధిం చాయి. స్నోమాన్ లాజిస్టిక్స్, గతి, ఆల్కార్గో లాజి స్టిక్స్, విఆర్ఎల్ లాజిస్టిక్స్, పటేల్ ఇంటిగ్రేటెడ్, ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ కాంకర్ ర్యాలీతీసాయి. 3-7శాతం పెరి గాయి. ఇక భారీ కేపిటల్ విభాగంలో ఏసియన్ పెయింట్స్ ఆరుశాతం పెరిగాయి. బాంబేస్టాక్ ఎక్ఛేంజిలో సంస్థ మొదటిత్రైమాసిక ఫలితాల అనంతరం భారీగాపెరిగింది. నికరలాభాలు 19 శాతం పెరిగి 553కోట్లకు చేరాయి. మారుతిసుజుకి ఇండియా ఐదుశాతం పెరిగింది. కంపెనీ నెక్సా ఔట్లైట్లను 250కు పెంచతాలని నిర్ణయించింది. ఇక హెల్త్కేర్ విభాగంలో సన్ఫార్మా రెండుశాతం పెరిగింది. కంపెనీ ఆల్మిరాల్ కంపెనీతో లైసెన్సింగ్ ఒప్పందం చేసుకుంది. సోరియాసిస్ నివారణకు ఉపయోగించే ఔషధాన్ని యరోప్లో మార్కెటింగ్కు అనుమతిని సాధించింది. బజాజ్ ఆటో ఒకటిశాతం పెరిగింది. నికరలాభాల్లో రెండుశాతం పెరి గింది. అంచనాలను కూడా అధిగమించింది. పంజాబ్నేషనల్ బ్యాంకు నికరలాభాల్లో నడిచింది. కంపెనీ గత ఏడాది నష్టాలనుంచి ఈ ఏడాది లాభాల్లోనికి వచ్చింది. అయితే స్టాక్ రెండుశాతం పెరిగింది. ఎస్బ్యాంకు రెండుశాతం లబ్ధిపొందింది. ఇక నష్టాల పరంగా చూస్తే టాటాస్టీల్, ఎల్అండ్టి, యాక్సిస్బ్యాంకు, టాటామోటార్స్, భారతి ఎయిర్టెల్ సంస్థలు 1-3శాతం దిగజారాయి. భారత్లోని టాప్మొబైల్ ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ నికరలాభాలు 31శాతం దిగజారి 1462 కోట్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 2113 కోట్లు ఆర్జించిన సంగతి తెలిసిందే. స్పెక్ట్రమ్ వ్యయం పెరగడం, విదేశీ కరెన్సీ నష్టం మారకం విలువలు ప్రతికూలంగా ఉండటంతో కొంతమేర దెబ్బతిన్నది.నైరా నైజీరియా కరెన్సీ విలువలు పతనమే ఇందుకు కీలకం.
| 1entertainment
|
Hyderabad, First Published 15, Sep 2019, 10:49 PM IST
Highlights
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. గత ఆదివారం అలీ ఎలిమినేషన్ తో ప్రేక్షకులకు ఊహించని షాక్ ఎదురైంది. దీనితో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ వారం హిమజ, శ్రీముఖి, మహేష్, పునర్నవి, శిల్పా చక్రవర్తి నామినేట్ అయ్యారు.
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. గత ఆదివారం అలీ ఎలిమినేషన్ తో ప్రేక్షకులకు ఊహించని షాక్ ఎదురైంది. దీనితో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ వారం హిమజ, శ్రీముఖి, మహేష్, పునర్నవి, శిల్పా చక్రవర్తి నామినేట్ అయ్యారు.
వీరిలో శనివారం రోజు హిమజ సేవ్ అయింది. కాగా ఆదివారం రోజు మిగిలిన నలుగురిలో ముందుగా శ్రీముఖి సేవ్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. మధ్యలో వినోదాన్ని అందించేలా నాగార్జున హౌస్ మేట్స్ తో కొన్ని స్కిట్స్ చేయించారు. కొంత సమయానికి మహేష్ కూడా సేవ్ అయ్యాడు.
చివరకు నామినేషన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్ప, పునర్నవి మిగిలారు. నాగ్ వారిద్దరిని కన్ఫెషన్ రూమ్ ఒకరిని, కోర్టు యార్డ్ లోకి మరొకరిని పంపారు. కన్ఫెషన్ రూమ్ డోర్ తెరుచుకోవడంతో శిల్ప బయటకు వచ్చింది. దీనితో శిల్పా ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. పునర్నవి సేవ్ అయింది.
వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశించిన శిల్పా పోటీ కేవలం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలింది. శిల్ప హౌస్ లో కేవలం 14 రోజులు మాత్రమే గడిపింది. ఇంటి సభ్యులంతా శిల్పా చక్రవర్తిని ఉత్సాహపరుస్తూ సెండాఫ్ ఇచ్చారు.
అంతకు ముందు నాగ్ హౌస్ మేట్స్ తో చేయించిన స్కిట్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీముఖి, శిల్పా, వరుణ్, మహేష్ కలసి చేసిన స్కిట్ ఆకట్టుకుంది. ఈ స్కిట్ లో శ్రీముఖి మగ గొంతు కలిగిన అమ్మాయిగా అదరగొట్టింది.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో హిమజాని ఆటపట్టిస్తూ హౌస్ మేట్స్ చేస్తున్న 'హిమజ హిమజ ది డేర్ అండ్ డాషింగ్ గర్ల్' అనే జింగిల్ బాగా పాపులర్ అయింది. అదే తరహాలో ప్రతి ఒక్కరికి జింగిల్స్ క్రియేట్ చేయమని నాగార్జున రాహుల్ కి చెప్పాడు.
రాహుల్ చేసిన జింగిల్స్ లో పునర్నవి, శ్రీముఖి కోసం పాడిన జింగిల్స్ అదరగోట్టాయి. పునర్నవి తన డాన్స్, ఆటిట్యూడ్ తో మెప్పించింది. ఇక శ్రీముఖిని ఉద్దేశిస్తూ ఒసేయ్ రాములమ్మ చిత్రంలో టైటిల్ సాంగ్ ని పేరడీ చేశారు. బిగ్ బాసుకే బాసువమ్మా అనే జింగిల్ ఆకట్టుకుంది. ఎపిసోడ్ మొత్తం నాగార్జున తనదైన పంచులతో ఆకట్టుకున్నారు. పునర్నవిని ఎలాగైనా రీఛార్జ్ చేయవయ్యా రాహుల్ అంటూ నాగార్జున వేసిన సెటైర్ నవ్వులు పూయించింది. మొత్తంగా ఆదివారం ఎపిసోడ్ మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగింది.
Last Updated 15, Sep 2019, 10:49 PM IST
| 0business
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
Bank Holidays 2019: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఈ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే!
అక్టోబర్ నెల కథ ముగిసింది. నవంబర్ నెలలోకి అడుగు పెట్టేశాం. అందుకే ఈ నెలలో ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకుంటే మంచిది. అందుకు తగినట్లుగా ఆర్థిక వ్యవహారాలను ప్లాన్ చేసుకోవచ్చు.
Samayam Telugu | Updated:
Nov 1, 2019, 08:29AM IST
Bank Holidays 2019: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఈ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే!
హైలైట్స్
వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులు లేవు
గురు నానక్ జయంతి రోజున మాత్రమే బ్యాంకులు పనిచేయవు
ఇకపోతే రెండు, నాలుగో శనివారాల్లోనూ బ్యాంకులు ఉండవు
నగదు వ్యవహారాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవసరం. బిజినెస్ వ్యవహారాలు నడిపే వారికి బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయడం, డీడీలు జమ చేయడం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి పని దినమూ ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెలవుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ నెల (నవంబర్)లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నవంబర్ నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 9, 23 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే నవంబర్ నెలలో వచ్చే నాలుగు ఆదివారాలు 3, 10, 17, 24 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు.
| 1entertainment
|
నేను న్యూడ్ గా ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి...
Highlights
హాలీవుడ్ తారలకు అందాల ఆరబోత విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు
హాలీవుడ్ అందాల తార జెన్నిఫర్ లారెన్స్ తాజాగా నటించిన చిత్రం రెడ్ స్పారో
జెన్నిఫర్ ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో నగ్నంగా నటించింది
హాలీవుడ్ తారలకు గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకోరు. హాలీవుడ్ అందాల తార జెన్నిఫర్ లారెన్స్ తాజాగా నటించిన చిత్రం రెడ్ స్పారో. ఇటీవల విడుదలైన చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జెన్నిఫర్ అందాలు ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్ర షూటింగ్ లో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయం గురించి జెన్నిఫర్ తాజాగా వెల్లడించింది.
జెన్నిఫర్ ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో నగ్నంగా నటించింది. ఆ సన్నివేశంలో నగ్నంగా నటించాల్సిన అవసరం ఉందని భావించా. అందుకే నగ్నంగా కనిపించానని జెన్నిఫర్ తెలిపింది. ఆ సన్నివేశం చేసే సమయంలో నేను చిన్న పొరపాటు చేశాను. దానిని సరిచేయడానికి దర్శకుడు నా వద్దకు వచ్చారు. నా ఒంటిపై నూలు పోగు కూడా లేదు. కానీ ఆయన నన్ను బట్టలు ఉన్న అమ్మాయిలాగే చూశారు. నేను కూడా ఫీల్ కాలేదు. ఆయన కథ వివరించడానికి మాత్రమే నా వద్దకు వచ్చారు అని జెన్నిఫర్ తెలిపింది. ఆ సమయంలో సెట్ లో చాలా మంది ఉన్నారు. వారంతా చాలా ప్రొఫెషనల్స్. వారి దృష్టి పనిమీద ఉంది. కానీ నా మీద కాదు అని జెన్నిఫర్ తన న్యూడ్ సీన్ అనుభవాన్ని వివరించింది.
Last Updated 25, Mar 2018, 11:54 PM IST
| 0business
|
Suresh 90 Views
స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి
ముంబై, సెప్టెంబరు 7: స్టాక్మార్కెట్లలో అమ్మకాలకే ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆసక్తి చూపించారు. అంతర్జా తీయ మార్కెట్ధోరణుల ఆధారంగా భారత్ స్టాక్ మార్కెట్లు నడిచాయి. నిఫ్టీపరంగాచూస్తే 8900 వద్ద స్థిరపడింది. గురువారం విడుదలకానున్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు సమావేశంపైనే ఇన్వెస్టర్లు ఎక్కువ దృష్టిపెట్టారు. అమెరికా ఉత్పత్తి రంగ గణాంకాలు కూడా ఆశించిన మద్దతునివ్వలేక పోయాయని అంచనా. బిఎస్ఇ సెన్సెక్స్ 52 పాయిట్లు క్షీణించి 28,926 పాయింట్లవద్ద స్థిర పడితే ఇంట్రాడేలో 29,068 పాయింట్లవద్ద స్థిర పడింది. నిఫ్టీ 50 కూడా 25 పాయింట్లు క్షీణించి 8918 పాయింట్లవద్దకు చేరింది. ఒకదశలో 8969 పాయింట్ల గరిష్టస్థాయికిసైతం చేరింది. బిఎస్ఇ మిడ్క్యాప్ సూచి 0.1శాతం దిగజారితే స్మాల్క్యాప్ సూచి 0.4శాతం పెరిగింది. గడచిన నెలరోజులుగా చూస్తే భారత్ విదేశీ నిధుల రాక ఈనెలలోనే 1.5 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది మందు ఇదే సమయంలో నాలుగు బిలియన్ డాలర్లుగా ఉంది. స్టాక్ఎక్ఛేంజిఉ విడుదలచేసిన గణాంకాలను పరిశీ లిస్తే విదేశీ నిధులు భారతీయ స్టాక్స్లో ముందు రోజు ఎక్కువ కొనుగోళ్లు జరిపాయి. ఎఫ్పిఐలు 1438.72కోట్ల విలువైన షేర్లను కొనుగోలుచేశారు. డాలర్తో రూపాయి మారకం విలువలు 19పైసలు పెరిగింది. నాలుగునెలల గరిష్టంగా 66.33కు చేరింది. ఎస్బిఐ, ఐసిఐసిఐబ్యాంకు, ఒఎన్ఝిసి, ఎల్అండ్టి, టాటాస్టీల్ వంటిసంస్థలు 1-4శాతం పెరిగాయి. భారతీయ స్టేట్బ్యాంకు 2100 కోట్ల నిధుల సమీకరణను ప్రకటించింది. 52వారాల గరిష్టస్థాయికి చేరింది. ఎల్అండ్టి టెక్నాలజీ సేవల విభాగం ఐపిఒద్వారా 890 కోట్ల నిధులు సమీ కరణకు ప్రకటించింది. ఈనెల 12వ తేదీ మార్కెట్ల కు వస్తోంది. ఐపిఒధరను 850-860 రూపాయ లుగా ప్రకటించింది. మొత్తం ఇష్యూ ఎల్అండ్టి ప్రమోటర్ విక్రయిస్తుంది. తన 10.2శాతం వాటా ను తగ్గించుకునేదిశగా ఐపిఒ జారీచేస్తోంది.
ఎల్ అండ్టి ఒకటిశాతంపెరిగింది. టాటాస్టీల్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తాము డిపాజిట్చేసిన సొమ్ము వాపసు చేయాలని కోరింది. బస్తర్లో మెగా స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు భూసేకరణకోసం సొమ్మును డిపాజిట్ చేసింది. అయితే ప్రభుత్వపరంగా సానుకూలం కాక పోవడంతో సొమ్ము వాపసుచేయాలని సూచించిం ది. టాటాస్టీల్ షేర్లు ఒకటిశాతం పెరిగాయి. ప్రభుత్వరంగంలోని భెల్ సంస్థ 14శాతం పెరి గింది. తొలిత్రైమాసికంలో కంపెనీ 777.70 మిలియన్ రూపాయల లాభాలు ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 504.30 మిలియన్ రూపాయలు మాత్రమే లాభాలు ఆర్జించింది. ఇక వేదాంత, కెయిర్న్ ఇండియా షేర్లు ఇంట్రాడేలో నాలుగుశాతం పెరిగా యి. వేదాంత రీసోర్సెస్ కంపెనీ ఈ రెండు గ్రూప్సంస్థల విలీ నాన్ని ఆమోదించింది. ఇక నష్టాల పరంగా చూస్తే హెచ్డిఎఫ్సి, ఏసి యన్ పెయింట్స్, యాక్సిస్బ్యాంకు, టిసిఎస్, ఎన్టిపిసి వంటివి 1-2శాతం పెరిగాయి. హెచ్డిఎప్సి రెండుశాతం దిగజారింది. ఇతరత్రా స్పైస్జెట్ 20శాతం పెరిగింది. 149 కోట్ల నికరలాభాలే ఇందుకు కీలకం. సింప్లెక్స్ ఇన్ఫ్రా, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ, జిఇ టిఅండ్డి ఇండియా, సునీల్ హైటెక్ ఇంజినీర్స్ వంటి సంస్థలు బిఎస్ఇలో కొంత మెరుగైన ఫలితాలు సాధించాయి.
| 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
సాఫ్ట్వేర్లో బగ్: మరోసారి ఫేస్బుక్ డేటా లీక్..
మరో వివాదం సామాజిక మాధ్యమం ఫేస్బుక్ మెడకు చుట్టుకుంది. సాఫ్ట్వేర్ లోపంతో ఫేస్బుక్లోని గోప్యత సెట్టింగ్లో సమస్య తలెత్తి గత నెలలో 1.40 కోట్ల మంది వినియోగదారుల పోస్టులు వారి ప్రమేయంలేకుండానే అందరికీ చేరాయి.
Samayam Telugu | Updated:
Jun 9, 2018, 06:28PM IST
మరో వివాదం సామాజిక మాధ్యమం ఫేస్బుక్ మెడకు చుట్టుకుంది. సాఫ్ట్వేర్ లోపంతో ఫేస్బుక్లోని గోప్యత సెట్టింగ్లో సమస్య తలెత్తి గత నెలలో 1.40 కోట్ల మంది వినియోగదారుల పోస్టులు వారి ప్రమేయంలేకుండానే అందరికీ చేరాయి. ఈ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా వెల్లడించింది. అయితే వెంటనే సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. వినియోగదారులు తమ పోస్టులను స్నేహితులకు మాత్రమే అని సెట్టింగ్స్లో పేర్కొన్నా సాఫ్ట్వేర్లో లోపంతో గత నెలలో కొన్ని రోజులు అవి అందరికీకనిపించాయి.
వినియోగదారుల గోప్యతకు భంగం కలిగిస్తోందని ఇప్పటికే ఫేస్బుక్పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఉదంతాలు ప్రతిష్టను మరింత దిగజార్చే ప్రమాదం లేకపోలేదు.
| 1entertainment
|
virat kohli now joint fastest to score 50 international centuries along with hashim amla
కోహ్లి ఖాతాలో 50వ సెంచరీ.. ఫాస్టెస్ట్ రికార్డ్!
విరాట్ కోహ్లి ఖాతాలో 50 సెంచరీలు చేరాయి. మరో సెంచరీ సాధిస్తే విరాట్ అరుదైన రికార్డు నెలకొల్పుతాడు.
TNN | Updated:
Nov 20, 2017, 02:48PM IST
కోల్‌కతా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లి సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేశాడు. విరాట్ వన్డే తరహా బ్యాటింగ్‌తో 12 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 119 బంతుల్లోనే 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో భారత జట్టు లంక ముందు 231 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కోల్‌కతాలో కోహ్లికి ఇది తొలి సెంచరీ కాగా, టెస్టుల్లో 18వ శతకం. ఓవరాల్‌గా విరాట్ కెరీర్లో ఇది 50వ సెంచరీ కావడం విశేషం. సచిన్ తర్వాత 50 సెంచరీలు బాదిన భారత క్రికెటర్ కోహ్లినే కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా అత్యధిక టెస్టు శతకాలు బాదిన భారత కెప్టెన్ల జాబితాలో కోహ్లి గావస్కర్ సరసన చేరాడు. 11 సెంచరీలు చేసిన కోహ్లి మరో శతకం చేస్తే గావస్కర్‌ను అధిగమిస్తాడు.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ధోనీనే కెప్టెన్సీ నుంచి తీసేశారు..!
గత ఐపీఎల్లో కెప్టెన్గా ఫెయిల్ అయిన ధోనిపై వేటు వేసిన ఫ్రాంఛైజీ
TNN | Updated:
Feb 19, 2017, 01:53PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి అతని ఐపీఎల్ జట్టు రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ ఫ్రాంఛైజీ ఊహించని షాకిచ్చింది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శనను కారణంగా చూపుతూ ధోనీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. అతని స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్-9 సీజన్‌లో రైజింగ్ పుణె జట్టు వరుస ఓటములతో చివరి నుంచి రెండో స్థానానికే పరిమితమైంది. దీంతో ధోనీ కెప్టెన్‌గా తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఏప్రిల్ 5 నుంచి ఐపీఎల్ పదో సీజన్‌ ఆరంభంకానుంది.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐపీఎల్ నుంచి రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్‌ని రెండు సార్లు విజేత నిలిపిన ధోని.. గత ఏడాది మాత్రం మునుపటి నాయకత్వ ప్రతిభను ప్రదర్శించలేకపోయాడు. జట్టు కొత్తది కావడం.. ప్రధాన ఆటగాళ్లు టోర్నీ మధ్యలోనే గాయాలతో దూరమవడం జట్టుపై ప్రభావితం చూపింది. ఆటను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనే ఉద్దేశంతో భారత వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి కూడా ధోని ఇటీవల తప్పుకున్న విషయం తెలిసిందే.
| 2sports
|
Virat Kohli’s consistency is beyond phenomenal, says Sunil Gavaskar
కివీస్పై కోహ్లి ఆ తప్పు చేయలేదు: గవాస్కర్
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ల్లో చేసిన తప్పుల్ని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి సరిదిద్దుకున్నాడని.. కివీస్తో తాజాగా జరుగుతున్న సిరీస్లో వాటిని
TNN | Updated:
Oct 31, 2017, 03:44PM IST
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌ల్లో చేసిన తప్పుల్ని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి సరిదిద్దుకున్నాడని.. కివీస్‌తో తాజాగా జరుగుతున్న సిరీస్‌లో వాటిని పున‌రావృతం చేయడంలేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు. ఆదివారం ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లి రెండు శతకాలు సాధించి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌’గా నిలిచిన విషయం తెలిసిందే. బుధవారం నుంచి కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో మీడియాతో గవాస్కర్ మాట్లాడాడు.
‘విరాట్ కోహ్లి ఫామ్ అసాధారణం. సిరీస్‌లో కివీస్‌పై ఆధిపత్యం చెలాయిస్తూ సాధించిన రెండు శతకాలు అతని ఆత్మవిశ్వాసాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఈ సిరీస్‌ కంటే ముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కోహ్లి కొన్ని తప్పిదాలు చేశాడు. కానీ.. వేగంగా వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా థర్డ్‌ మ్యాన్ దిశగా బంతిని నెట్టి పరుగులు రాబట్టాలనే ఆలోచనే చాలా వరకు అతను తగ్గించుకున్నాడు. ఎందుకంటే.. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల్లో రెండు సార్లు అలా ప్రయత్నిస్తూనే కోహ్లి వికెట్ చేజార్చుకున్నాడు’ అని గవాస్కర్ వివరించాడు. తొలి టీ20 మ్యాచ్ ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం రాత్రి 7 గంటల నుంచి జరగనుంది.
| 2sports
|
internet vaartha 169 Views
ఆట డెస్క్: దక్షిణాసియా క్రీడల్లో సోమవారం నాటి పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. మొత్తతం 40 స్వర్ణాలు, 18 రజతాలు, 6 కాంస్య పతకాలతో విజయా లను సొంతం చేసుకుంటోంది. ఇప్పటివరకు మొత్తం 72 పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది. శ్రీలంక 11 స్వర్ణాలు, 27 రజతాలు, 23 కాంస్య పతకాలతో మొత్తం 61 పతకాలు సాధించగా, పాక్ 4 స్వర్ణాలు, 11 రజతాలు, 14 కాంస్యాలతో మొత్తతం 29 పతకాలు గెలుపొందింది. కాగా బంగ్లాదేశ్ 3 సర్ణాలు, 5 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తతం 27 పతకాలు సాధించింది.
| 2sports
|
Dec 21,2016
అయిదో రోజూ అవే నష్టాలు..
ముంబయి: అంతర్జాతీయ, జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా అయిదో సెషన్లోనూ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. విత్త, టెలికాం, ఔషధ రంగ స్టాక్లు ఒత్తిడికి గురి కావడంతో మంగళవారం కూడా మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. దీంతో వరుసగా ఐదో రోజూ నేల చూపులు చూశాయి. ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వు ఛైర్పర్సన్ జనెట్ యెల్లెన్ వ్యాఖ్యలు, బ్యాంకు ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన సమీక్ష సమావేశం, అదే విధంగా జర్మనీ, టర్కీలోని పరిణామాలు మదుపర్లలో విశ్వాసాన్ని దెబ్బతీశాయి. దీంతో వారు అమ్మకాలకు మొగ్గు చూపారు. ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ కూడా 68కి పడిపోవడం కూడా మార్కెట్లపై ప్రతికూలతను పెంచింది. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 67 పాయింట్లు కోల్పోయి 26,307 పాయింట్లకు పరిమితమయ్యింది. నిఫ్టీ 22 పాయింట్లు తగ్గి 8,082 వద్ద ముగిసింది. ప్రధాన సూచీల నష్టాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 1.40 శాతం, స్మాల్క్యాప్లు 0.92 శాతం చొప్పున తగ్గాయి. మొత్తంగా మదుపర్ల మద్దతు కరువై 1,756 స్టాక్స్ ప్రతికూలతను ఎదుర్కోగా 850 స్టాక్స్ లాభాల్లో ముగియగా, మరో 147 స్టాక్స్ యథాతథంగా ముగిశాయి. టాటా గ్రూపునకు సైరస్ మిస్త్రీ రాజీనామా చేయడంతో ఆ గ్రూపులోని కంపెనీ షేర్లకు మద్దతు లభించింది. టీసీఎస్ 2.38 శాతం, టాటా పవర్ 2.71 శాతం చొప్పున పెరిగాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
May 26,2017
నోట్ల రద్దుతో బ్యాంకింగ్ రంగం అస్తవ్యస్తం
దేశీయ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలుస్తూ వస్తున్న బ్యాంకింగ్ రంగం గత మూడేండ్ల కాలంలో ప్రజల్లో చులకనైపోయింది. మరీ ముఖ్యంగా గత ఏడాది కాలంలో చేపట్టిన పెద్దనోట్ల రద్దు, బ్యాంకింగ్ చార్జీల పెంపు, బ్యాంకులు నష్టాల బాట పట్టడం, బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరగడం విషయాలు దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి... చేస్తున్నాయి. మోడీ పగ్గాలు చేపట్టే నాటికి (జూన్,2014లో) 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు కేవలం రూ.2.34 లక్షల కోట్లుగా మాత్రమే ఉన్నాయి. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇవి తగ్గక పోగా... మరింతగా పెరిగి రూ.6.46 లక్షల కోట్లకు చేరాయి. మోడీ సర్కారు వచ్చాక మొండి బాకీలను తగ్గించే నిర్మాణాత్మక చర్యలు చేపట్టకపోవడం.. పడకేసిన ప్రాజెక్టులు పట్టాలెక్కించే ప్రయత్నాలేవీ చేయకపోవడంతో ఇవి దాదాపు రూ.7 లక్షల కోట్లకు చేరువైనట్టుగా బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఎన్పీఏల దిశగా సర్కారు ఇటీవలి కాలంలో ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ ఇది ఆర్బీఐపై సర్కారు పట్టు పెంచుకొనే విధంగానే ఉంది తప్ప.. అసలు సమస్యకు పరిష్కారం చూపే దిశగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు దేశంలోని బ్యాంకుల ఏకీకరణ దిశగా మోడీ సర్కారు చర్యలు చేపట్టింది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకులను విలీనం చేసింది. మరికొన్ని బ్యాంకులను కూడా విలీనం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి ప్రజల నుంచి ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
కోహ్లీ కంటే జడేజానే చురుకు: ఫీల్డింగ్ కోచ్
దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ డైవ్ చేసి ఒంటిచేత్తో క్యాచ్ల్ని అందుకున్నాడు. కానీ.. జడేజా క్యాచ్ల్ని అందుకుంటూ పరుగుల్నీ కూడా సేవ్ చేయగలడని ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ కితాబిచ్చాడు.
Samayam Telugu | Updated:
Oct 27, 2019, 03:22PM IST
కోహ్లీ కంటే జడేజానే చురుకు: ఫీల్డింగ్ కోచ్
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే రవీంద్ర జడేజానే బెస్ట్ ఫీల్డరని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే తుది జట్టులో అవకాశం దక్కించుకున్న జడేజా ఏకంగా 41 పరుగుల్ని జట్టుకి సేవ్ చేశాడు. ఇందులో 30 యార్డ్ సర్కిల్లో ఫీల్డింగ్ చేస్తూ రక్షించినవే 24 పరుగులు కావడం విశేషం. టోర్నీలో ఏ ఫీల్డర్ కూడా ఇన్ని పరుగుల్ని సేవ్ చేయలేదు. దీంతో.. ఈ దశాబ్దంలోనే భారత్ బెస్ట్ ఫీల్డర్ జడేజా అని ఆర్. శ్రీధర్ కితాబిచ్చాడు. ఇప్పటి వరకూ 146 అంతర్జాతీయ మ్యాచ్ల్లో జడేజా 133 క్యాచ్లు అందుకున్నాడు.
Read More: ధోనీలా మాక్స్వెల్.. బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు
‘మైదానంలో జడేజా చురుకుతనం జట్టులోనూ స్ఫూర్తి నింపుతుంటుంది. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ వికెట్ల మధ్య పరుగు తీసే ముందు పునరాలోచించుకునేలా చేసే ఫీల్డర్లలో అతను ముందుంటాడు. టీమిండియా చరిత్రలో అని చెప్పలేను.. కానీ.. గత పదేళ్లలో జడేజానే భారత అత్యుత్తమ ఫీల్డర్. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం బెస్ట్ ఫీల్డర్లు అంటే..? రవీంద్ర జడేజా , మార్టిన్ గప్తిల్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్. ఈ నలుగుర్ని మైదానంలో ఎక్కడ ఫీల్డింగ్కి ఉంచినా.. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంటారు’ అని శ్రీధర్ వెల్లడించాడు.
Read More: ఢిల్లీలో భారత్ vs బంగ్లాదేశ్ తొలి టీ20 డౌట్..?
పవర్ప్లేలో 30 అడుగుల సర్కిల్లో ఫీల్డింగ్ చేసే విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత లాంగాన్ లేదా లాంగాఫ్లో ఫీల్డింగ్కి వెళ్లిపోతాడు. కానీ.. జడేజా మాత్రం.. మ్యాచ్లో ముప్పావు వంతు పాయింట్లోనే ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఆఖరి ఓవర్లలో మాత్రం.. మిడ్వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఇక పాయింట్, బౌండరీ లైన్స్ వద్ద క్యాచ్లు పట్టడంలో మాక్స్వెల్ ఎక్స్పర్ట్.. మిగిలిన మార్టిన్ గప్తిల్.. ధోనీని వరల్డ్కప్ సెమీ ఫైనల్లో కళ్లుచెదిరే రీతిలో రనౌట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Today Gold Rate: షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే?
బంగారం ధర మళ్లీ పెరిగింది. ధర పెరుగుదల ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. ఇకపోతే వెండి ధర కూడా బంగారం బాటలనే నడుస్తోంది. ఈ రోజు కూడా వెండి ధర పైకి కదిలింది.
Samayam Telugu | Updated:
Nov 15, 2019, 05:54AM IST
Today Gold Rate: షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే?
హైలైట్స్
మళ్లీ పెరిగిన బంగారం ధర
వెండి ధరదీ ఇదే దారి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి కిందకు
1,470 డాలర్ల స్థాయిలో కదలిక
పసిడి ధర మళ్లీ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగింది. దీంతో ధర రూ.39,940కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.280 పెరిగింది. దీంతో ధర రూ.36,620కు చేరింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. రూ.70 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,840కు చేరింది.
Also Read: పీఎఫ్ డబ్బును ముందుగానే విత్డ్రా చేస్తున్నారా? నష్టపోతారు జాగ్రత్త!
ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరుగుదలతో రూ.38,600కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 పెరుగుదలతో రూ.37,400కు ఎగసింది
Also Read: ఎస్బీఐ హెచ్చరిక.. అలా చేయొద్దంటూ కస్టమర్లకు స్ట్రాంగ్ వార్నింగ్..!
బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.70 పెరిగింది. దీంతో ధర రూ.48,840కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.
Also Read: లోన్ తీసుకుంటే రూ.లక్షకు కేవలం రూ.853 ఈఎంఐ.. వారికి మాత్రమే!
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ఔన్స్కు 0.22 శాతం తగ్గుదలతో 1,469.95 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్కు 0.32 శాతం తగ్గుదలతో 16.97 డాలర్లకు క్షీణించింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.
Also Read: ఆధార్ కార్డు ఉందా? ఈ తప్పు చేస్తే రూ.10,000 జరిమానా..!
బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రాజమౌళి మల్టీ స్టారర్: నో గ్రాఫిక్స్.. ఓన్లీ యాక్షన్!
నంది అవార్డులపై చర్చ అయిపోయింది. ఇప్పడు చర్చంతా ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి మల్టీ స్టారర్పైనే!
TNN | Updated:
Nov 21, 2017, 10:19AM IST
నంది అవార్డులపై చర్చ అయిపోయింది. ఇప్పడు చర్చంతా ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాజమౌళి మల్టీ స్టారర్‌పైనే! అవును మరి తెలుగు నాట మంచి ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా అంటే మాటలా. ఇటు హీరోలిద్దరినీ సంతోషపెట్టాలి.. అటు అభిమానులను సంతృప్తి పరచాలి. అన్నిటినీ మించి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తీయాలి. ఇన్ని బాధ్యతలు ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తన భుజాలపై వేసుకున్నారు. శనివారం సాయంత్రం రాజమౌళి ఓ ఫొటోను ట్వీట్ చేసిన దగ్గర నుంచి మల్టీస్టారర్‌పై చర్చ మొదలైన విషయం తెలిసిందే. అయితే సినిమా కచ్చితంగా ఉంటుందని కొంతమంది, రూమర్ అని కొంతమంది అంటున్నారు.
కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ పక్కా అట. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. దానిలో భాగంగానే చరణ్, తారక్‌తో తీసుకున్న ఫొటోను రాజమౌళి ట్వీట్ చేశారని టాక్. ఒకవేళ ఈ వార్త అబద్ధం అయ్యుంటే ఇప్పటికే రాజమౌళి స్పందించేవారు కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్‌లో ముహూర్తం ఫిక్స్ చేసి.. ఆగస్టు నుంచి షూటింగ్ మొదలుపెడతారట. 2019లో సినిమాను విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట.
| 0business
|
విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా రష్మిక మండన్నా
Highlights
అల్లు అరవింద్, బన్నివాసు, పరశురాం, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో చిత్రం
ఈ చిత్రంలో విజయ్ దేవర కొండ హీరోయిన్ గా రష్మిక మండన్నా
కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న రష్మిక
2016 లో వరుసగా " సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, ధృవ " లాంటి హ్యట్రిక్ సూపర్హిట్స్ తో దూసుకుపోతున్న గీతాఆర్ట్స్ కి అనుభంద సంస్థ గా GA 2 బ్యానర్ లో భలేభలేమగాడివోయ్ లాంటి చిత్రం తరువాత నిర్మాత బన్నివాసు మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతాఆర్ట్స్ బ్యానర్ లో మంచి కమర్షియల్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా విజయాన్ని సాధించిన' శ్రీరస్తు శుభమస్తు' దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
ఇటీవల కాలంలో చిన్నచిత్రంగా విడుదలయ్యి ట్రెండింగ్ సక్సస్ ని సొంతం చేసుకున్న అర్జున్ రెడ్డి చిత్రంతో అందరి అభిమానాన్ని గెలుచుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. బన్ని వాసు నిర్మాతగా నాగచైతన్య తో '100%లవ్', సాయిధరమ్తేజ్ తో 'పిల్లా నువ్వులేని జీవితం', నాని తో 'భలే భలే మగాడివోయ్' ఇప్పడు విజయ్ దేవరకొండ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా ఎంపికైంది. కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న రష్మిక... కిరాక్ పార్టీ చిత్రంతో అందరి మనసుల్ని దోచుకుంది. అందం అభినయంతో ఆకట్టుకున్న రష్మిక విజయ్ దేవర కొండ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం విశేషం.
త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.
Last Updated 25, Mar 2018, 11:57 PM IST
| 0business
|
పెట్రో రిటైలింగ్ ప్రయివేటు పరం!
Thu 24 Oct 00:16:29.881141 2019
దేశంలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్న మోడీ సర్కారు.. అందుకు గాను ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలను ఫణంగా పెడుతోంది. రిటైల్ చమురు రంగంలో మేటిగా వెలుగొందుతున్న
వడ్డీ రేట్ల కోత.. మార్కెట్లకు వాత
Thu 03 Aug 06:01:23.454732 2017
చెన్నై : ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధానం సమీక్ష ప్రకటన మార్కెట్లకు భరోసా కల్పించలేకపోయాయి. కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన
ఐటీ రంగంలో క్లిష్ట పరిస్థితులు.. ఊడుతున్న ఉద్యోగాలు
Wed 02 Aug 02:58:04.34922 2017
భారత ఐటీ పరిశ్రమలో క్లిష్ట పరిస్థితులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఉద్యోగుల సంఖ్య నానాటికీ దిగజారిపోతుంది. ఒకప్పుడు భారీగా ఉపాధి కల్పనకు నిలయంగా ఉన్న 154 బి
ఆసియాలోనే ముఖేశ్ రెండో కుబేరుడు
Wed 02 Aug 02:57:55.949856 2017
రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఆసియాలోనే రెండో అతిపెద్ద కుబేరుడిగా రికార్డు నమోదు చేశారు. హాంకాంగ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లి కా-షింగ్ను అధిగమించి అంబ
రూ.2లక్షల కోట్ల 'కార్పొరేట్' అప్పుల పునరుద్ధరణ : జైట్లీ
Wed 02 Aug 02:57:43.597077 2017
కార్పొరేట్లకు చెందిన భారీ మొత్తం రుణాలను బ్యాంకులు పునరుద్ధరిం చాయి. క్రితం ఆర్ధిక సంవ త్సరంలో ఆ వర్గాలకు చెందిన రూ.2,04,884 కోట్ల అప్పులను పునరద్ద రించినట్టు ఆర్ధిక శాఖ
ఫ్లిప్కార్ట్ చేతికి ఈబే ఇండియా
Wed 02 Aug 02:57:24.080157 2017
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరో ఆన్లైన్ పోర్టల్ ఈబే ఇండియాను స్వాధీనం చేసుకుంది.
4జీ చౌక ఫీచర్ ఫోన్లపై గురి
Wed 02 Aug 02:51:07.237728 2017
దేశంలో చౌక 4జీ ఫీచర్ ఫోన్లకు డిమాండ్ పెరుగనున్న నేపథ్యంలో సెల్ఫోన్ తయారీ కంపెనీలు ఈ మార్కెట్ను అందిపుచ్చుకోవడానికి వీలుగా ప్రణాళికలు రూపొంది స్తున్నాయి. రిలయన్స్
Wed 02 Aug 02:50:37.643748 2017
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్లు మేర
జేఎస్డబ్ల్యూకు వ్యయాల భారం
Wed 02 Aug 02:57:30.199878 2017
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థ అధిక వ్యయాల కారణంగా లాభాలు సగం వరకు పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ
పేటీఎం నుంచి మెసేజింగ్ యాప్!
Wed 02 Aug 02:57:14.702223 2017
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం మెసేజింగ్ సేవలను ప్రారంభించే యోచనలో ఉంది. ప్రత్యర్థి సంస్థలైన ఫేస్బుక్, వాట్సాప్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ నెల చివరిలోపు ఈ స
తూచ్..! విలీనం లేదు..
Tue 01 Aug 06:15:34.53993 2017
-నవతెలంగాణ, వాణిజ్య విభాగం *కుదరని ఫిప్కార్ట్ - స్నాప్'డీల్' దేశంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ విలీనంగా భావించిన ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఒప్పంద ప్రక్రియ అర్ధంతరంగా ము
సరికొత్త శిఖరాలకు స్టాక్ మార్కెట్లు
Tue 01 Aug 06:15:41.170273 2017
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఎల్ అండ్ టీ స్టాక్స్ దన్నుతో సూచీ
సేంద్రీయ ఉత్పాదనల్లోకి ఐఐఎల్
Tue 01 Aug 06:15:47.770831 2017
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ వ్యవసాయ క్రిమిసంహారక మందులను విక్రయించే ఇన్సెక్టిసైడ్స్ ఇండియా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం వ్యాపారంలో 20 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్టు
పొదుపు ఖాతాల వడ్డీలో కోత: ఎస్బీఐ
Tue 01 Aug 06:15:53.827517 2017
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తాజాగా పొదుపు ఖాతాల డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లకు కోత పెట్టింది. ప్రస్తుతం సేవింగ్ ఖాతా
జూన్లో పడిపోయిన కీలక రంగాల వృద్ధి
Tue 01 Aug 06:16:00.577375 2017
న్యూఢిల్లీ: జూన్ నెలలో బోగ్గు, చమురు శుద్ధి ఉత్పత్తులు, సిమెంట్ ఉత్పత్తి పడిపోవడంతో కీలక రంగాల వృద్ధిని 0.4 శాతానికి పడిపోయింది. మే నెలలో ఈ వృద్ధి 4.1 శాతంగా నమోదైంది.
ఇండిగోకు ఆకర్షణీయమైన లాభాలు
Tue 01 Aug 06:16:07.568723 2017
న్యూఢిల్లీ: విమానయాన కంపెనీ ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ జూన్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. వేసవి సెలవుల కారణంగా ఏప్రిల్-జూన్
మురిపించిన టెక్ మహీంద్రా ఫలితాలు
Tue 01 Aug 03:27:23.354754 2017
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ టెక్ మహీంద్రా జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ఆసక్తికరమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో సంస్థ
'ఐ'రోపాలో విస్తరణ దిశగా ఇన్ఫోసిస్
Mon 31 Jul 01:48:25.78872 2017
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఐరోపాలో మరింతగా విస్తరించాలని యోచిస్తోంది. ఈ దిశగా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా వెలుగులోకి వచ్చే ఉద్యోగ అవక
జియోకు పోటీగా ఐడియాఫోన్!
Mon 31 Jul 01:48:35.328586 2017
ముంబయి: రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని నిలిచేందుకు గాను దేశంలోని టెలికాం సంస్థలు వివిధ పథకాలను ఎత్తుకుంటున్నాయి. తాజాగా రిలయన్స్ జియో సంస్థ మార్కెట్లో
'మహారాజా'ను విదేశాలకైనా అమ్మేదాం!
Sun 30 Jul 05:42:30.349892 2017
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయం దిశగా సర్కారు వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటి వరకు దేశానికి గర్వకారణంగా నిలుస్తూ వస్తున్న మహారాజా ఎయిర్లైన్స్ ఎ
గడువు పెంచే యోచనేది లేదు: సీబీడీటీ
Sun 30 Jul 05:42:37.822658 2017
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలునకు గడువును పొడిగించే ప్రతిపాదనేది తమ పరిశీలనలో లేదని 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్' (సీబీడీటీ ) శనివారం వెల్లడించి
ఆర్థిక మంత్రి జైట్లీతో ఉర్జిత్ పటేల్ భేటీ
Sun 30 Jul 05:42:44.278598 2017
న్యూఢిల్లీ: 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ శనివారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ఆగస్టు తొలి వారంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష
మార్కెట్లోకి టెస్లా సరసమైన ఎలక్ట్రిక్ కారు
Sun 30 Jul 05:42:51.153161 2017
లాస్ఏంజిల్స్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా 'మోడల్-3' పేరుతో మరో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వచ్చింది. అమెరికా మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర 3
స్మార్ట్ఫోన్ల మార్కెట్ స్మాషేనా!
Sun 30 Jul 05:42:58.297498 2017
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: టెలికాం రంగంలో సంచలనంగా దూసుకు వచ్చిన రిలయన్స్ జియో ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తక్కువ ధరలకు 4జీ డేటా ప్యాకేజీలు.. ఉచిత కాలిం
సెంట్రల్ బ్యాంక్ నష్టం రూ.577 కోట్లు
Sun 30 Jul 05:43:05.380556 2017
ముంబయి: రాని బాకీల నిమిత్తం కేటాయింపులు తగ్గడంతో జూన్తో ముగిసిన త్రైమాసికానికి సెంట్రల్ బ్యాంక్ కొంత మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో బ
నిరాశపరిచిన దేనా బ్యాంక్ ఫలితాలు
Sun 30 Jul 04:41:01.853027 2017
ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ దేనా బ్యాంక్ నష్టాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. జూన్తో ముగిసిన త్రైమాసికానికి బ్యాంకు రూ.132. 65 కోట్ల మేర నికర నష్టాన్ని ప్రకట
ఎంఎస్ఎంఈల పట్ల బ్యాంకుల ఆలోచన మారాలి..
Sat 29 Jul 06:17:32.920847 2017
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈల) పరిశ్రమల పట్ల బ్యాంకుల ఆలోచన విధానం మారాలని ఆర్థిక మంతి ఈటల రాజేందర్ సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రా
లాభాల స్వీకరణతో.. వరుస ర్యాలీకి బ్రేక్
Sat 29 Jul 06:17:40.0642 2017
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు వారాంతంలో బ్రేక్పడింది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో పలు కార్పొరేట్ కంపెనీల ఆర్ధిక ఫలితాలు మదుపర్లను మెప్పించలేకపోయాయి. మర
ఈ-కామర్స్పై 29వేల ఫిర్యాదులు
Sat 29 Jul 06:17:47.907723 2017
న్యూఢిల్లీ : భారత్లో ఆన్లైన్ వ్యాపారం భారీగా పెరుగుతూ 33 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2లక్షల కోట్లు)కు చేరిందని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి సీఆర్ చౌదరీ పేర్కొన్నా
ఎల్ఐసీ లాభాలు అదుర్స్
Sat 29 Jul 06:17:56.510534 2017
ముంబయి : బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఈక్విటీ మార్కెట్లో రికార్డు లాభాలను ఆర్జించినట్టు ప్రకటించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జూన్తో ముగిసిన త
డాక్టర్ రెడ్డీస్ లాభాల్లో భారీ క్షీణత..
Fri 28 Jul 04:45:04.945597 2017
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ లాభాల్లో సగంపైగా క్షీణించాయి. అమెరికా మార్కెట్లో
మరో మూడేండ్లు.. సీఈవోగా శిఖా శర్మ
Fri 28 Jul 04:19:36.150347 2017
ముంబయి : ప్రముఖ ప్రయివేటు రంగ విత్త సంస్థ యాక్సిస్ బ్యాంకు సీఈవోగా ఉన్న శిఖా శర్మ ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారనే ఊహాగానాలకు తెరపడింది. గత తొమ్మిది ఏండ్లుగా ఈ
ఎఫ్ట్యాప్సీ ఉపాధ్యక్షులుగా జాస్తీ
Fri 28 Jul 04:19:42.976605 2017
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండలాలు సమాఖ్య (ఎఫ్ట్యాప్సీ) ఉపాధ్యక్షులుగా కరుణేంద్ర ఎస్.జాస్తీ ఎకగ్రీవంగా ఎన్నిక య్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్
యాక్సిస్ బ్యాంకు చేతికి ఫ్రీఛార్జ్
Fri 28 Jul 04:22:50.561337 2017
న్యూఢిల్లీ : స్నాప్డీల్కు చెందిన డిజిటల్ చెల్లింపుల విభాగం ఫ్రీఛార్జ్ను యాక్సిస్ బ్యాంకు కొనుగోలు చేస్తుందని ఆ బ్యాంకు సీఈవో శిఖా శర్మ స్పష్టం చేశారు. రూ.385 కోట్లకు
టీ-శాట్ నెట్వర్క్ సేవల ఆవిష్కరణ
Thu 27 Jul 05:31:35.428372 2017
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం : టీ-శాట్ నెట్వర్క్ (మన టీవి) శాటిలైట్ ద్వారా ప్రసారాలను మంత్రులు కె తారకరామారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి ప్రారంభించారు. బుధ
ఐదేండ్లలో రూ.200 కోట్ల పెట్టుబడులు
Thu 27 Jul 05:31:41.859264 2017
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: వచ్చే ఐదేండ్లలో సోలార్ రంగంలో రూ. 200 కోట్ల పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నామని ప్రీమియర్ సోలార్ చైర్మెన్ సురేందర్ పాల్సింగ్ తెలిపారు. బుధ
'పది'ల పడని నిఫ్టీ పరుగు!
Wed 26 Jul 04:29:06.905839 2017
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో (ఎన్ఎస్ఈ) మదుపరులు ఎదురు చూస్తున్న చారిత్రాత్మక ఘట్టం మంగళవారం సాకారమైంది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ మంగళవారం తొలిసారిగా చరిత్రలో 10,000
133 సంస్థలు.. రూ.3.4 లక్షల కోట్ల బకాయిలు
Wed 26 Jul 03:23:22.227004 2017
దేశంలో 133 బడా కంపెనీలు ప్రభుత్వానికి దాదాపు రూ.3,39,704 కోట్ల మేర పన్ను బకాయిలను కలిగి ఉన్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మంగళవారం ఆయన రాజ్యసభలో
ఎయిర్టెల్ ఫలితాలు కుదేలు..
Wed 26 Jul 03:23:16.673583 2017
దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియా రాకతో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న భారతీ ఎయిర్టెల్ సంస్థ జూన్ త్రైమాసికానికి నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్తో ముగిసి
లాభాలతో సత్తా చాటిన 'హీరో'
Wed 26 Jul 03:23:11.45819 2017
దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటో కార్ప్ జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 3.5 శాతం వృద్ధితో రూ.914.04 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది
వేదాంత లాభాలు రెట్టింపు
Wed 26 Jul 03:23:06.105166 2017
జింక్ ధరల పెరిగిన నేపథ్యంలో వేదాంత సంస్థ జూన్తో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక
16% పతనమైన యాక్సిస్ లాభాలు
Wed 26 Jul 03:23:00.841313 2017
దేశంలోనే మూడో అతిపెద్ద ప్రయివేటు విత్త సంస్థ యాక్సిస్ బ్యాంకు ఏడాది తొలి త్రైమాసికం లాభాల్లో తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో
18న జియోపై విచారణ
Wed 26 Jul 03:22:54.768584 2017
రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లను కొనసాగింపునపై ఆగస్టు 18న టెలికాం ట్రిబ్యూనల్(డిటిశాట్) విచారించనుంది. జియో ఉచిత ఆఫర్లకు మద్దతునిస్తూ ట్రారు తీసుకున్న నిర్ణయాన్ని
అల్ఫాబెట్ బోర్డులోకి పిచారు
Wed 26 Jul 03:22:47.538146 2017
గూగుల్ సీఈవో సుందర్ పిచారు ఆ మాతృ కంపెనీ అల్పాబెట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. దీంతో గత రెండేండ్లుగా గూగుల్ సంస్థను విజయవంతంగా నడిపిస్తున భారత సంతతికి చ
కీలక వడ్డీరేట్లు తగ్గొచ్చు: ఇక్రా
Wed 26 Jul 03:22:41.472016 2017
ద్రవ్యోల్బణం తగు ముఖం పట్టిన నేపథ్యంలో ఇక భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రానున్న ద్రవ్య పరపతి సమీక్షా సమాశంలో కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్టుగా ప్రముఖ రేటిం
ఆడిటర్లతో సెంట్రల్ బ్యాంక్ ఈడీ సమావేశం
Wed 26 Jul 03:22:35.414173 2017
సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా డైరెక్టర్ నిత్యానంద హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా నిత్యానంద తెలుగు రాష్ట
స్వతంత్ర బ్రాండ్గానే హెచ్పీసీఎల్
Tue 25 Jul 04:38:16.922675 2017
న్యూఢిల్లీ: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో (హెచ్పీసీఎల్) ప్రభుత్వానికి ఉన్న మొత్తం 51.11% వాటాను ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీకి విక్రయించనున్నట్టు ప్రభుత్వం లోక
ఆర్బీఐకి మరిన్ని అధికారాలు!
Tue 25 Jul 04:38:24.933075 2017
న్యూఢిల్లీ: బ్యాంకుల నిరర్థక ఆస్తుల సమస్య పరిష్కారం దిశగా కేంద్రం సోమవారం మరో ముందడుగు వేసింది. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల సమస్య పరిష్కారానికి సంబంధించి బ్యాంకులకు తగిన దిశాని
బ్యాంకింగ్ షేర్ల భళా..!
Tue 25 Jul 04:38:33.268831 2017
ముంబయి: అంతర్జాతీయ సానుకూల పరిణామాలకు తోడు విదేశీ మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సోమవారం భారత మార్కెట్లు నూతన రికార్డులను తాకాయి. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఏకంగా 10,000
మారని భారత్ వృద్ధి అంచనా
Tue 25 Jul 04:38:40.620561 2017
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు 7.2 శాతం దరిదాపులకే పరిమితం కావచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) విశ్లేషించింది. గతంలో వెల్లడించిన అంచనాల్
3 కోట్ల మంది విద్యార్థులకు ఉచిత వైఫై!
Tue 25 Jul 04:38:48.040066 2017
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో వీలైనంత గరిష్ట స్థాయిలో తన విస్తృతిని పెంచుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా సంస్థ ఇటీవలే తక్కువ ఆదాయ వర్గాల వారికి దగ్గర
| 1entertainment
|
kohli team selfy
ఉప్పల్లో కోహ్లీ సేన సాధన
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఈనెల 9 నుంచి బంగ్లాదేశ్,భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జరగ నుంది.ఈ సందర్భంగా హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు మైదానంలో ముమ్మర సాధన చేసింది.జట్టు కోచ్ కుంబ్లే నేతృత్వంలోని సారథి కోహ్లీ, జడేజా, ఇషాంత్, భువ నేశ్వర్ కుమార్, వృద్ధ్దిమాన్ సాహా, పుజారా తదితర ఆటగాళ్లు సాధన చేశారు.కోహ్లీ నగరంలో సం దడి చేశాడు.బంగ్లాదేశ్తో ఏకైక మ్యాచ్ కోసం కోహ్లీ సేన హైదరాబాద్ చేరుకుంది.ఇరు జట్ల మధ్య అయిదు రోజుల టెస్టు మ్యాచ్ ఈనెల 9న ప్రారంభం కానుంది.ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.ఈ నేపథ్యంలో కోహ్లీ సహచర క్రీడాకారులు రాహుల్,పాండ్యా, జయంత్ యాదవ్తో కలిసి దిగిన ఒక ఫొటో ను సోషల్ మీడియా ద్వారా అభిమా నులతో పంచుకున్నాడు.సహచరులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశానని,జయంత్ యాదవ్తో అభిమానులం దరికి ఈ రోజు శుభదినం కావాలని కోరు కుం టున్నట్లు కోహ్లీ ట్వీట్ చేశాడు. చారిత్రక సిరీస్ కోసం వెల్లడికాని టైటిల్ 2000 సంవత్సరంలో టెస్టు హోదా సాధిం చిన బంగ్లాదేశ్ తొలిసారి భారత పర్యటనకు వచ్చింది.రెండు జట్ల మధ్య ఈనెల 9 నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.ఈ చారిత్రక టెస్టు సిరీస్కు భారత జట్టు మాజీ సారథి గంగూలీ, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ నైముర్ రహమాన్ దుర్జా§్ుల పేరు పెట్టాలని వూహాగానాలు వచ్చాయి. మ్యాచ్ ప్రారంభం కానున్న నేప థ్యంలో టైటిల్ పేరుపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.దీంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయడంలో బిసిసిఐ తలమునకలై ఉన్నందున సిరీస్కు ప్రత్యేకంగా పేరు పెట్టడం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రస్తుతం బిసిసిఐ పరిపాలనను సుప్రీంకోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటీ పర్య వేక్షిస్తున్న సంగతి తెలిసిందే.
| 2sports
|
sardar destributors huger strike
పవన్ ను దేవుడు.. అనుకుంటే, ఇప్పుడిలా అయ్యింది!
దీనిపై స్పందించాలని కోరుతున్నారు. స్పందించేంత వరకూ నిరాహార దీక్షను ఆపేది లేదని అంటున్నారు.
TNN | Updated:
Mar 17, 2017, 10:04AM IST
హైదారాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ వద్ద నిరాహార దీక్షను మొదలుపెట్టారు ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ సినిమా డిస్ట్రిబ్యూటర్లు. ఆ సినిమాతో తాము తీవ్రంగా నష్టపోయామని.. తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఈ విషయంలో సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా హీరో పవన్ కల్యాణ్, ఆ సినిమా నిర్మాత శరత్ మరార్, పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ లు స్పందించాలని పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు.
సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా పంపిణీ హక్కులను తాము భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి కొన్నామని.. అయితే ప్రేక్షకాదరణ పొందని ఆ సినిమా తమను నిండా ముంచేసిందని వారు చెబుతున్నారు. ఇలా నష్టపోయిన తమకు న్యాయం చేస్తామని.. పవన్ కల్యాణ్ , ఆయన సన్నిహితుడు శరత్, మేనేజర్ శ్రీనివాస్ లు హామీ ఇచ్చారని అంటున్నారు. ఆ న్యాయం ఏమిటి? అనగా.. పవన్ కల్యాణ్ తదుపరి సినిమా పంపిణీ హక్కులను తక్కువ ధరకు ఇస్తామని వారు హామీ ఇచ్చారని.. అయితే ఇప్పుడు మాత్రం వాటిని తమకు దక్కకుండా వేరే వాళ్లకు ఇచ్చారని వీరు ఆరోపిస్తున్నారు.
| 0business
|
ఈ ముంబై ఇండియన్ ఆటగాడు ఐపిఎల్ డబ్బులు ఏం చేశాడో తెలుసా?
Highlights
ఇది తన కోసం కాదు...తల్లిదండ్రుల కోసం
సూర్య కుమార్ యాదవ్...ఐపిఎల్ సీజన్ 11 లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడి అద్బుత ప్రదర్శన చేసిన ఆటగాడు. ముంబై జట్టులో ఓపెరన్ గా చక్కగా రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి. ఈ ఐపిఎల్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన సూర్యకుమార్ 521 పరుగులు సాధించి, ఐపిఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన టాప్ టెన్ బ్యాట్స్ మెన్స్ జాబితాలో నిలిచాడు. అయితే తనలో అద్బుతమైన ఆటగాడే కాదు, మంచి కొడుకు దాగున్నాడని నిరూపించుకున్నాడు. ఐపిఎల్ ద్వారా వచ్చిన భారీ మొత్తాన్ని తన తల్లిదండ్రులకు గిప్ట్ ఇవ్వడానికి ఖర్చుపెట్టి తనకు తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
ఐపీఎల్ 11 సీజన్ వేలంలో సూర్య కుమార్ ను ముంబై ఇండియా జట్టు రూ. 3.02 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకుంది. అయితే ఇలా ఐపీఎల్ ద్వారా వచ్చిన భారీ డబ్బుతో సూర్యకుమార్ ఓ స్కోడా కారును కొన్నాడు. అయితే, ఈ కారు కొన్నది తనకోసం కాదట, తన తల్లిదండ్రుల కోసమని సూర్యకుమార్ చెప్పాడు.
" ఇది నా జీవితంలో మధుర క్షణం... నేను కొన్న మొదటి కారు ఇది. దీన్ని కొన్నది నా కోసం కాదు, అమ్మానాన్నలకు గిప్ట్ ఇవ్వడానికి తీసుకున్నాను. ఇలా నా సంపాదనతో తల్లిదండ్రులకు గిప్ట్ ఇవ్వడం ఆనందంగా భావిస్తున్నాను. వారు తన ఈ గిప్ట్ తో సంతోషిస్తారని బావిస్తున్నా. లవ్యూ మామ్ ఆండ్ డాడ్'' అంటూ తల్లిందండ్రులతో కొత్త కారు వద్ద దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు.
| 2sports
|
రషీద్ స్పిన్ మాయాజాలం.. ఆ బంతి కోహ్లీ మతి పొగొట్టింది
Highlights
ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా లీడ్స్ జరిగిన మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వడం.. సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. స్పిన్ను సమర్థవంతంగా ఆడతారని ప్రపంచం చేత జేజేలు కొట్టించుకున్న భారత బ్యాట్స్మెన్ ఈ వన్డేలో అదే స్పిన్కు తలొగ్గక తప్పలేదు
ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా లీడ్స్ జరిగిన మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వడం.. సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. స్పిన్ను సమర్థవంతంగా ఆడతారని ప్రపంచం చేత జేజేలు కొట్టించుకున్న భారత బ్యాట్స్మెన్ ఈ వన్డేలో అదే స్పిన్కు తలొగ్గక తప్పలేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు స్పిన్నర్ రషీద్ స్పిన్ మాయాజాలంలో టీమిండియా విలవిలలాడిపోయింది.
ఈ మ్యాచ్లో సహచరులంతా పెవిలియన్ బాట పడుతున్నప్పటికీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంయమనంతో ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. 72 బంతుల్లో 7 ఫోర్లతో కోహ్లీ 71 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ కూడా రషీద్ స్పిన్కు దొరికిపోయాడు. 31 ఓవర్లో చెలరేగిన రషీద్.. దినేశ్ కార్తీక్ను బౌల్డ్ చేశాడు.. ఆ తర్వాత వేసిన అద్భుతమైన లెగ్బ్రేక్ లెగ్స్టంప్పై పడి గిర్రున తిరిగి కోహ్లీ బ్యాట్ను ముద్దాడి ఆఫ్స్టంప్ను కూల్చింది..
ఈ అనూహ్యమైన బంతికి ఆశ్చర్యపోయిన కోహ్లీ కొద్దిసేపు బౌలర్ను, పిచ్ను, వికెట్లను చూస్తూ షాక్లో నిలిచిపోయాడు... ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
| 2sports
|
పోల్
శ్రీముఖి కన్నింగ్...
ప్రేక్షకుల నుండి వచ్చిన ట్వీట్స్లో శ్రీముఖి జెండర్ కార్డ్ వాడుతుందని, వరస్ట్ కంటెస్టెంట్ అని ట్వీట్స్ రాగా.. నాకు ఆ కార్డ్ వాడటం ఇష్టం ఉండదని మా నాన్నతో పాటు ఇంట్లో ఉన్న శివజ్యోతి, వితికాకు కూడా చెప్పానని క్లారిటీ ఇచ్చింది శ్రీముఖి. ఇక శ్రీముఖిని కన్నింగ్ అంటూ మరో ట్వీట్ రావడంతో.. ఎవరి అభిప్రాయం వారిది. పరిస్థితిని బట్టి వాళ్లు అలా అనుకుని ఉండొచ్చు అంటూ వివరణ ఇచ్చింది శ్రీముఖి. అనంతరం ఆమెను బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ కూల్ అంటూ మరో ట్వీట్ రావడంతో దాన్ని చూసి మురిసిపోయింది శ్రీముఖి. ఈ ట్వీట్ ఎవరు చేశారో వాళ్లని నా ముద్దు అంటూ ఎయిర్ కిస్ ఇచ్చింది శ్రీముఖి.
Read Also: హేమకు బిగ్ బాస్ పిలుపు.. జరిగిన అవమానం చాలంటూ ఝలక్
అనంతరం బాబా భాస్కర్కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ ట్వీట్స్ వచ్చాయి. ‘బాబా ఈజ్ బెస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ 3. టాస్క్లో తోపు, వర్క్లో తోపు, ఎంటర్ టైన్మెంట్లో బాప్, డాన్స్ కా కింగ్, నో బ్యాక్ బిచ్చింగ్, లవ్స్ ఎవ్రీ వన్’ అంటూ తన అభిమాని పంపిన ట్వీట్ను చదివారు బాబా. ఆ ట్వీట్ నిజంగానే అంతలా ఉందా? నా డౌట్ అంటూ శ్రీముఖి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక అనంతరం బాబాను మాస్కర్, ఊసరవిల్లి అంటూ నెటిజన్లు ఫైర్ అయిన ట్వీట్లను సైతం చదివి వినిపించారు.
అనంతరం వరుణ్ సందేశ్ సైతం తనకు వచ్చిన ట్వీట్స్ చదివి వినిపించారు. ‘ఈ సీజన్లోనే వరస్ట్ కంటెస్టెంట్.. హౌలే ఫ్రూట్ వరుణ్ సందేశ్’ అని ఆడియన్స్ నుండి వచ్చిన ట్వీట్ను సైతం చదివి వాళ్లకు థాంక్స్ చెప్పాడు వరుణ్.
రాహుల్లో పాజిటివ్, నెగిటివ్..
‘నువ్ చాలా మంది హార్ట్స్ని గెలుచుకున్నావు. ఎవరు ఏమన్నా స్మైల్తోనే ఆన్సర్ ఇచ్చే మంచి మనిషి’ అంటూ పాజిటివ్ ట్వీట్ రాగా.. అతన్ని నక్కతో పోల్చుతూ చాలా అగ్రిసివ్ అంటూ వచ్చిన నెగిటివ్ ట్వీట్స్ని చదివివినిపించాడు. అనంతరం తన గురించి పాజిటివ్గా మాట్లాడినా, నెగిటివ్గా మాట్లాడినా పాజిటివ్గానే తీసుకుంటా అంటూ క్లారిటీ ఇచ్చాడు రాహుల్. అనంతరం సినిమా చూపిస్త మామా అంటూ రాహుల్ పాట అందుకోగా.. శ్రీముఖి స్టెప్పులతో రచ్చ చేసింది. వీరికి యాంకర్ సుమ, బాబా భాస్కర్, అలీలు తోడై బిగ్ బాస్ హౌస్ను హోరెత్తించారు. ఇది ముగిసిన తరువాత గెస్ట్గా వచ్చిన సుమతో కంటెస్టెంట్స్తో కలిసి దీపావళి సంబరాలను హౌస్లో నిర్వహించుకున్నారు. బాణాసంచా కాల్చుతూ ఇంటి సభ్యులతో ఆనందంగా గడిపారు.
ఎవరి జాతకం ఏంటి?
ఇక బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలేందుకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరి జాతకం ఏంటో తెలుసుకునేందుకు హౌస్లోకి జోతిష్యురాలిని పంపారు బిగ్ బాస్. అయితే ఆమె ఎవరు విన్నర్ అవుతారో చెప్పలేదు కాదు.. ఒక్కొక్కరు లైఫ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో వివరణ ఇచ్చారు.
చివర్లో రాహుల్.. గుల్ గులౌతోంది బిగ్ బాస్. నాకు ట్యాబ్లెట్స్ పంపించండి అంటూ పాట అందుకుని బిగ్ బాస్ పై పేరడీ సాంగ్ పాడి వినిపించడం నవ్వుల్ని పూయించింది. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో.
| 0business
|
Hyderabad, First Published 9, Mar 2019, 1:15 PM IST
Highlights
photo courtesy: instagram
సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ ల గురించి నిత్యా ఎదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. ఒకప్పుడు ఎంతో ప్రేమగా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట కొన్నాళ్లకే విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సల్మాన్ ఖాన్ పెళ్లి అనే కార్యాన్ని మర్చిపోయాడు. లైఫ్ లో పెళ్లి చేసుకోను అని ప్రతిసారి చెబుతూ వస్తున్నాడు.
సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ ల గురించి నిత్యా ఎదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. ఒకప్పుడు ఎంతో ప్రేమగా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట కొన్నాళ్లకే విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సల్మాన్ ఖాన్ పెళ్లి అనే కార్యాన్ని మర్చిపోయాడు. లైఫ్ లో పెళ్లి చేసుకోను అని ప్రతిసారి చెబుతూ వస్తున్నాడు.
ఇక కత్రినా ఆ ప్రస్తావన వస్తే తెలివిగా నవ్వుతో నో కామెంట్స్ అంటూ తప్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ కాంబినేషన్ లో బ్రేకప్ తరువాత కూడా చాలా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి కూడా. ఇకపోతే ప్రస్తుతం భరత్ సినిమాలో నటిస్తోన్న వీరిద్దరి రీసెంట్ గా ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నారు.
అది చూసిన అభిమానులు బెస్ట్ కపుల్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. హ్యాపీగా పెళ్లి చేసుకోండని ఎందుకు ప్రేమను దాచి మోసం చేస్తున్నారు అని కూడా కామెంట్ చేస్తున్నారు. వారి స్మైల్ చూస్తుంటే అలానే అనిపిస్తోందని మరికొంత మంది వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. దీంతో ఆ కామెంట్స్ కాస్త ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక భరత్ సినిమా ఈ ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated 9, Mar 2019, 1:14 PM IST
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రాంచరణ్ ప్లేస్లోకి నాని!
గత కొన్నిరోజులుగా దర్శకుడు గౌతమ్ మీనన్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. గౌతమ్ మీనన్ కథల శైలి విభిన్నంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు భావించారు.
TNN | Updated:
Nov 1, 2016, 05:38PM IST
గత కొన్నిరోజులుగా దర్శకుడు గౌతమ్ మీనన్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. గౌతమ్ మీనన్ కథల శైలి విభిన్నంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు భావించారు. అయితే చరణ్ వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వడం వలన గౌతమ్‌తో సినిమా ఎప్పుడు చేస్తాడనే అనుమానాలు కూడా కలిగాయి. కానీ ఇప్పుడు అసలు చరణ్‌తో గౌతమ్ సినిమా లేదని క్లియర్ కట్ గా తెలుస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో గౌతమ్ మీనన్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఆయనతో సినిమా చేయాలని చాలా మంది హీరోలు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ చరణ్ మాత్రం గౌతమ్‌తో సినిమా చేయడానికి డేట్స్ కేటాయించలేకపోయాడనే టాక్ వినిపిస్తుంది. గౌతమ్ మీనన్ చరణ్‌తో చేయాలనుకున్న సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందించాలనుకున్నాడు. ఈ విధంగా చేయడం వలన ఖచ్చితంగా సినిమా చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే చరణ్ ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా ఆసక్తి చూపలేదు. డేట్స్ లేవనే కారణం చెప్పి తప్పించుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.
| 0business
|
Sep 21,2016
హిమాలయా నుంచి 'మాతృ సంరక్షణ'
న్యూఢిల్లీ: ఔషధ గుణాలతో కూడిన ఉత్పత్తులతో వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ ప్రోడక్ట్స్ను అందిస్తున్న హిమాలయా తాజాగా 'మాతృ సంరక్షణ' విభాగంలోకి అడుగుపెట్టింది. తల్లి కావాలని కలలు గంటున్న వారు గర్భధారణకు ముందు, కాన్పు తరు వాత కూడా ఉపయోగించి రక్షణ పొందేలా పలు మూలికలతో తయారు చేసిన ఔషధ గుణాలతో కూడిన ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నట్లుగా తెలిపింది. రానున్న రెండేండ్ల కాలంలో ఈ విభాగం నుంచి మొత్తం టర్నోవర్లో ఆరు శాతం వాటాను ఆర్జిం చాలని తాము లక్ష్యంగా పెట్టుకు న్నట్లుగా సంస్థ సీఈవో ఫిలిప్పీ హేడోన్ తెలిపారు. గత ఏడాది రూ.1,800 కోట్లుగా ఉన్న సంస్థ ఆదా యాన్ని ఈ ఆర్థిక సంవత్స రానికి రూ.2,100 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టు కున్న ట్లు తెలిపారు. మాతృ సంరక్షణ విభాగంలో నాలుగు ఉత్పత్తులను ప్రారంభించం..వచ్చే ఏడాదిలో ఏడేేనిమిది ప్రాడక్ట్సు ప్రారంభిస్తామని వెల్లడించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Team india
వెస్టిండీస్పై భారత్ ఘనవిజయం
విండీస్తో జరుగుతున అయిదు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయంసాధించింది.. 252 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన వెస్టీండీస్ 158 పరుగుల కే ఆలౌట్ అయ్యింది.. తొలి వన్డే వర్షార్పణం కాగా రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది.. మూడో వన్డేకూడ భారత్ కైవసం చేసుకోవటంతో భారత్ సిరీస్లో 2-0 ఆధిక్యతలో ఉంది.
| 2sports
|
Suresh 173 Views tennis
షరపోవాపై కరోలిన్ వోజ్నియా అభ్యంతరం
ఇండియన్ వేల్స్: నిషేధిత ఉత్ప్రేరకం వాడినందుకు పడిన ఏడాది నిషేదం వచ్చే నెలలో పూర్తి చేసుకోబోతున్న రష్యా టెన్నిస్ తార మరియా షరపోవాను హడావిడిగా స్టట్ గార్ట్ డబ్ల్యూటిఎ టోర్నీలో ఆడించడానికి నిర్వహకులు అంగీకరించడంపై ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వోజ్నియా అభ్యంతరం వ్యక్తం చేసింది.ఏప్రిల్ 26న షరపోవాపై నిషేదం నుంచి బయటపడే సమయానికి ఈ టోర్నీ ఆరంభమై ఉంటుందని,డోపిగా తేలి నిషేదం ఎదుర్కొన్న క్రీడాకారిణికి టోర్నీ మధ్యలో ఆడే అవకాశం కల్పించాల్సిన అవసరమేముందని ఆమె ప్రశ్నించింది.దీన్ని ప్రశ్నించాలి. అక్కడున్నదెవరైనా సరే నిషేదం నుంచి బయటపడ్డ క్రీడాకారిణిని టోర్నీ మధ్యలో అనుమతించడమేంటి? ప్రతిఒక్కరికి రెండవ అవకాశం ఉండాల్సిందే.అయితే పునరాగమనం కోసం చూస్తున్న షరపోవా సరైన మార్గంలో పోరాడాలి.డోపీగా తేలి నిషేదం ఎదుర్కొన్న క్రీడా కారిణిగా ఆమె సున్నా నుంచి మొదలుపెట్టాలి అని వోజ్నియాకి కుండబద్దలు కొట్టింది. స్టట్గార్డ్ టోర్నీలో సత్తా చాటి ర్యాంకింగ్ పాయింట్స్ సాధిస్తేనే ఆ తరువాత జరిగే ఫ్రెంచ్ ఓపెన్లో క్వాలిఫయింగ్ టోర్నీ ఆడేందుకు షరపోవాకు మార్గం సుగమవుతుంది. నిషేధం తరువాత తాను ఆడేందుకు వీలున్న తొలి గ్రాండ్స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలని షరపోవా కోరుకుంటుంది. అయితే ఈ టోర్నీలో షరపోవాకు వైల్డ్ కార్డ్ ఇవ్వడానికి నిర్వహకులు నిరాకరించడంతో స్టట్గార్డ్ టోర్నీ పై షరపోవా దృష్టిపెట్టింది.
| 2sports
|
Visit Site
Recommended byColombia
‘ఏదో ఒక రోజు మళ్లీ అవకాశం నా తలుపు తడుతుందని నేననుకుంటున్నాను. ఎందుకంటే నేను పెద్ద తప్పేమీ చేయలేదు. ఒక్కసారి నాకు అవకాశం వస్తే దాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను’ అని అశ్విన్ చెప్పాడు. రంజీ ట్రోఫీ 2017 ప్రచారంలో భాగంగా ఆదివారం అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. రంజీ, అంతర్జాతీయ మ్యాచ్‌లను పోలుస్తూ.. ‘నేనెప్పుడూ స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల కోసం ఆడలేదు. ఐదో డివిజన్ మ్యాచ్‌లో ఆడినా నా ఆటను నేను ఆస్వాదిస్తాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. స్టేడియంలోని పరిస్థితులు సమస్య కాదు. సందర్భానుసారంగా నాలోని ఆటతీరును మారుస్తాను, ఆస్వాదిస్తాను. కాబట్టి ప్రస్తుతం నేనేమీ కోల్పోవడం లేదు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
అయితే 2019 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఉత్తమ జట్టు కూర్పు కోసం జడేజా, అశ్విన్‌కు అవకాశాలివ్వాలని కోచ్ రవిశాస్త్రి భావించారు. కానీ వన్డేల్లో చాహల్, కుల్దీప్ అద్భుతంగా రాణిస్తుండటంతో కెప్టెన్ కోహ్లి వారివైపే మొగ్గు చూపిస్తున్నాడు. వీరిద్దరూ మణికట్టు స్పిన్నర్లు. వేళ్లతో బంతిని తిప్పేవారు (జడేజా, అశ్విన్) కన్నా మణికట్టు స్పిన్నర్లే ఉత్తమమని కోహ్లి భావిస్తున్నాడట. అందుకనే వీరిద్దరినే కోహ్లి జట్టులోకి తీసుకుంటున్నాడు. కాగా, ఇప్పటి వరకు 111 వన్డేలు ఆడిన 31 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్ 150 వికెట్లు తీశాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
మార్చి 3న అంజలి "చిత్రాంగద"
Highlights
శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై చిత్రాంగద
అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం
మార్చి 3న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల
అందం, అభినయం కలగలిసిన తార అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద. తమిళంలో యార్నీ పేరుతో నిర్మిస్తున్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ ఫేం అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్ర ఆడియోను వినూత్న పద్దతిలో ఒక్కొ పాటను ఒక్కొ లైవ్ షోల ద్వారా రిలీజ్ చేస్తున్నారు. మార్చి 3న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జానర్లో రూపొందుతున్న చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది. చిత్రంలో వుండే ట్విస్ట్లు ఆడియన్స్కు షాక్ గురిచేస్తాయి. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా నాయిక జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే మా చిత్ర ఇతివృత్తమని తెలిపారు. ఈ హారర్, థ్రిల్లర్లో ప్రతి సన్నివేశం ఊహించని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథానుగుణంగా ఆమెరికాలోని పలు అందమైన లొకేషన్స్ కీలక ఘట్టాల్ని చిత్రీకరించాం అన్నారు.
జెపీ, సప్తగిరి, రాజారవీంద్ర, సిందుతులానీ,రక్ష, దీపక్, సాక్షిగులాటి, జబర్ధస్త్ సుధీర్, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్, ఎడిటర్: ప్రవీణ్పూడి, కెమెరా:బాల్రెడ్డి (హైదరాబాద్) మరియు, జేమ్స్ క్వాన్, రోహిన్ (యూఎస్ఎ), సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి, కథ-స్క్రీన్ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్.జి, నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్.
Last Updated 25, Mar 2018, 11:56 PM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
గోల్డ్ మెడల్ సాధిస్తా అనుకున్నా
బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా ఆటలో ఒక వైవిధ్యం ఉంటుంది. వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ సైనా నెహ్వాల్ పతకం గెలిచేలా తన ఆట మెరుగుపరుకుంది.
TNN | Updated:
Jun 30, 2016, 04:09PM IST
బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా ఆటలో ఒక వైవిధ్యం ఉంటుంది. వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ సైనా నెహ్వాల్ పతకం గెలిచేలా తన ఆట మెరుగుపరుకుంది. లండన్ ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్లో కాంస్యం నెగ్గిన సైనా... ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు కృషిచేస్తోంది. ఒలింపిక్స్ ఆమె మూడో సారి ఆడనున్నారు. 2008 , 2012 లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో ఆమె పాల్గొని ఆడారు. 'నా ఒలింపిక్ జర్నీ' అనే పుస్తకంలో ఒలింపిక్స్ లో ఎదురైన తన అనుభవాలను ఆమె పంచుకున్నారు. పాత్రికేయుడు దిగ్విజయ్ సింగ్ డియో, అమిత్ బోస్ ఈ పుస్తకాన్ని రాస్తున్నారు. 2008 ఒలింపిక్ క్రీడలలో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం ఆమె లైఫ్ కు టర్నింగ్ పాయింట్ అయింది. ఇండోనేషియన్ ఓపెన్ పోటీలో చైనా కు చెందిన వాంగ్ లింగ్ ఓడించి 2009 లో సైనా తొలి సూపర్ సిరీస్ టైటిల్ కైవసం చేసుకుంది సైనా. 2012 ఒలింపిక్స్ లో సైనా ముందు నుంచీ తన ఆటలో ప్రతిభ చూపించింది. గ్రూప్ స్టేజ్లో జుక్చిట్, ఎల్ టాన్పై విజయం సాధించి, ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్ యాజీ, క్వార్టర్ ఫైనల్స్లో టిని బయిన్పై విజయ పరంపర కొనసాగించింది. సెమీ ఫైనల్స్లో చైనా క్రీడాకారిణి యాంగ్ యహన్ చేతిలో పరాభవం ఎదురైంది. కాంస్య పతకం రేసులో చైనాకు చెందిన యాంగ్ జిన్ పై విజయం సాధించి భారత్ పతాకాన్ని ఎగురవేసింది సైనా. కానీ ఆ ఒలింపిక్స్ లో బంగారం పతకం సాధించడమే తాను లక్ష్యంగా పెట్టుకున్నాని చెప్పారు సైనా.
"నేను బ్యాడ్మింటన్ గా కెరీర్ ప్రారంభించడం గర్వంగా ఉంది. ఇతరులకు నేను ఇన్ స్పైర్ గా మారడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్ అమ్మాయిలకు ఆదర్శంగా ఉండడాన్ని హ్యాపీగా ఫీలవుతున్నా. బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత నాపై మరింత అంచనాలు పెరిగాయి. అందుకనుగుణంగా నేను నా ఆట తీరును మరింత మెరుగుపరుచుకున్నా’’.
‘‘నేను ఎప్పుడూ నా ఆటను స్థిరంగానే ఆడతాను. చాలా టోర్నమెంట్ లో సెమీ ఫైనల్స్, ఫైనలుకు చేరుకుని ఆడాను. అలాగే నా ర్యాంకింగ్ కూడా చాలా మెరుగుపడింది. 2010లో నేను వరుసగా నేను వరుసగా మూడు టైటిళ్లను గెలుచుకున్నా. ది ఇండియన్ ఓపెన్, సింగపూర్ ఓపెన్, ఇండోనేషియన్ ఓపెన్స్ లో నేను విజయం సాధించాను. అదే ఏడాది నేను దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు నన్ను వరించింది. అలాగే ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లోనూ బంగారం పతకాన్ని గెలుచుకున్నాను. అయితే నా ఆట విషయంలో నా విజయాలలో గురువు పుల్లెల గోపిచంద్ కృషి ఎంతో ఉంది.’’
2012 లండన్ ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో సైనా నెహ్వాల్ కాంస్యాన్ని అందుకుంది. కాంస్యం కోసం సైనాతో పోటీపడ్డ చైనాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ జిన్ వాంగ్ ఆధిక్యంలో ఉండగా గాయంతో వైదొలిగింది. మ్యాచ్ సాగితే విజయం ఎవరిని వరించేదో తెలియదు గానీ, ఇన్నేళ్లు సైనా పడ్డ శ్రమకు విజయం ఈ రూపంలో దక్కింది.‘‘నేను ఒక సందర్భంలో చాలా నిరాశ చెందాను. (సెమీ ఫైనల్ కోల్పోవడం). నేను బంగారం పతకం గెలుచుకునేందుకు లండన్ వెళ్లాను. కచ్చితంగా బంగారం పతకంతోనే తిరిగి వస్తానని నేను అనుకున్నా. నాలుగేళ్లుగా కలలు కన్నది కూడా నేను దాని కోసమే.’’
| 2sports
|
బొగ్గులతో పిచ్ను ఆరబెట్టే ప్రక్రియ
చెన్నై: ఇంగ్లండ్తో అయిదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా చివరి టెస్టు చెన్నైలో శుక్రవారం నుంచి జరుగుతుంది.కాగా అయిదవ టెస్టు కోసం చెపాక్ మైదానాన్ని సిద్దం చేయ డంలో గ్రౌండ్ సిబ్బంది తలమునకై ఉన్నారు. వార్థా తుపాను కారణంగా చెన్నై నగరం అతలా కుతలమైన సంగతి తెలిసిందే.ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అయిదవ టెస్టు కోసం చిదం బరం స్టేడియం తమిళనాడు క్రికెట్ అసోసి యేషన్ సిద్దం చేస్తుంది.వర్షం కారణంగా మైదానం తడిగా మారినపుడు సూపర్ సాపర్లతో అవుట్ ఫీల్డ్నుంచి నీరుతొలగించడం, డ్రైయర్లతో పిచ్ను ఆరబెట్టడం ఇంతకు ముందు మనం చూశాం.అయితే చెన్నైలోని చిదంబరం స్టేడి యంలో పిచ్ను ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది బొగ్గును మండిస్తున్నారు.వార్దా తుపాను కారణంగా చిదంబరం స్టేడియంలోని పిచ్ బాగా తడిసిపోయింది. పిచ్పై ఉన్న తేమను తగ్గించడానికి గ్రౌండ్ సిబ్బంది సంప్రదాయ పద్దతిని ఉపయోగిస్తున్నారు.
ఇందులో భాగంగా ఎర్రగా కాలుతున్న బొగ్గులను ఇనుప ట్రేలలో పోసి వాటి కింద స్టంప్స్ను ఉంచి పిచ్పై అటు ఇటు తిప్పుతున్నారు.ఇలా చేయడం వల్ల మామూలుగా కంటే చాలా వేగంగా పిచ్ ఆరి పోయి మ్యాచ్ కోసం అందుబాటులోకి వస్తుం దని టిఎస్సిఎ నమ్ముతుంది.పిచ్ ప్రస్తుత స్థితిపై సౌత్ జోన్ క్యురేటర్ విశ్వనాథన్ సంతృప్తి వ్యక్తం చేశాడు.
మ్యాచ్కు సిద్దం చేసిన పిచ్ ఔట్ ఫీల్డ్ మంచి స్థితిలో ఉన్నాయి.అయితే మ్యాచ్ సందర్భంగా పిచ్ ఎలా స్పందిస్తుందో చెప్పలేను అని పేర్కొన్నాడు.ఇక చెన్నై స్టేడియానికి అత్యు న్నత డ్రైనేజీ వ్యవస్థ ఉందని విశ్వనాథన్ వెల్లడిం చాడు. కాగా నేడు చెన్నైలో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య అయిదవ టెస్టు జరుగ నుంది.స్టేడియం బుధవారం తడిగా ఉండటంతో ఇరు జట్లు ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాయి.ఔట్ ఫీల్డ్ కూడా ఆరలేదు.మరోవైపు అయిదవ టెస్టును ఎలాగైనా నిర్వహించాలని పట్టుదలతో టిఎస్సిఎ తీవ్రంగా శ్రమిస్తుంది. అమ్మ కోసం వినూత్న నివాళి అయిదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా,ఇంగ్లండ్ జట్టు మధ్య చివరి టెస్టు శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభం కానుంది.
కాగా టెస్టు సిరీస్లో ఈ టెస్టు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది.ఈ టెస్టు మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు నల్ల బ్యాండ్లను ధరించి మ్యాచ్ ఆడనున్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తమిళ నాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులర్పిస్తూ,గౌరవ సూచకంగా ఈ విధంగా చేయనున్నారు. ఈ మేరకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టిఎన్సిఎ) అధికారిక ప్రకటన చేసింది.డిసెంబర్ 6న తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.కాగా ఈసందర్భంగా జయ లలిత మృతికినివాళులర్పిస్తూ గౌరవ సూచకంగా ఇరుజట్ల ఆటగాళ్లు నల్ల మోచేతి బ్యాండ్ ధరించి మ్యాచ్లో పాల్గొంటారని టిఎన్సిఎ పేర్కొంది. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి ప్రత్యక్ష కార్యక్ర మాలు,సన్మాన కార్యక్రమాల వంటివి నిర్వహిం చడం లేదని టిఎన్సిఎ అధికారి వెల్లడించాడు.
| 2sports
|
f2 movie teaser: venkatesh, varun tej shows funny frustration
F2 teaser: తెలంగాణ రాకముందు, ఆ తర్వాత.. వెంకీ, వరుణ్ నవ్వుల పండుగ!
మగాడి గురించి చెప్పాలంటే.. ‘పెళ్లైన తర్వాత.. పెళ్లికి ముందు’ అని చెప్పాలంట. ఈ భార్య బాధితుల బాధ.. తప్పకుండా మిమ్మల్ని నవ్విస్తుంది.
Samayam Telugu | Updated:
Dec 12, 2018, 06:50PM IST
పండుగ రోజున నవ్వులు పూయించేందుకు సిద్ధమైపోయారు సంక్రాంతి అలుళ్లు. తమ ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ చూపించేందుకు వచ్చేస్తున్నారు. ఆ అల్లుళ్లు మరెవ్వరో కాదు.. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ . ‘F2 ఫన్ అండ్ ప్రస్ట్రేషన్’ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
‘‘ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం అని చెబుతాం. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత..’’ అంటూ వెంకీ డైలాగులతో ఈ డైలాగ్ మొదలవుతుంది. ‘‘ఇప్పుడీ పెళ్లి అవసరమా వెంకీ?’’ అని రఘుబాబు అంటే.. ‘‘నేను మీలాగ కాదు.. పెళ్లాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు’’ అంటూ వెంకీ, తన భార్య తమన్న పెట్టే ఇబ్బందులను టీజర్లో చూపించారు.
| 0business
|
RBI
ఆర్బిఐ ద్రవ్యవిధాన సమీక్షలే కీలకం
ముంబై,: దేశీయస్టాక్ మార్కెట్లకు వచ్చేవారం పలు అం శాలు ప్రభావితంచేసే అవకాశాలున్నాయి. గతవారం లో ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్కు మెజార్టీ వర్గాలు ఓటువేసాయి. స్టాక్ మార్కెట్లకు సైతం జైట్లీబడ్జెట్ జోష్ ఇచ్చింది. ప్రధాన సూచీల న్నీ నాలుగునెలల గరిష్టానికి చేరాయి. వచ్చేవారం రిజర్వుబ్యాంకు గవర్నర్ పటేల్ అధ్యక్షతన ద్రవ్య విధానపరపతి సమీక్ష ఉంటున్నది. దీనితోపాటు మరికొన్ని బ్లూచిప్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలోని 3వ త్రైమాసిక ఫలితాలు వెల్లడిస్తాయి. ఇవికూడా దేశీయంగా సెంటిమెంట్కు కీలకంగా నిలువనున్నట్లు నిపుణుల అంచనా. అలాగే డిసెం బరునెల పారిశ్రామిక ఉత్పత్తిసూచి వివరాలు కూడా ఈ వారంలోనే విడుదలవుతాయి. ఇక ఆర్బిఐ చేపట్టే మానిటరీపాలసీ సమీక్ష వడ్డీరేట్లకు కీలకంగా నిలిచే రెపోరేట్లను 6.25శాతంవద్దనే కొనసాగించా లని గత సమీక్షలో నిర్ణయించింది. పెద్దనోట్ల రద్దు, బడ్జెట్ కేటాయింపుల నేపథ్యంలో ఈసారి రెపోరేట్ల లో పావుశాతం కోతుండవచ్చని ఆర్థిక వేత్తల అంచ నా.వచ్చేవారం మరికొన్ని కంపెనీలు త్రైమాసిక ఫలి తాలు ప్రకటిస్తాయి. బ్లూచిప్ కంపెనీల జాబితాలో టాటాస్టీల్, భెల్, పిఎన్బి, బుధవారం సిప్లా, హీరో మోటో, ఎన్టిపిసి, యూనియన్బ్యాంకు, గురు వారం బిపిసిఎల్, లూపిన్ పవర్గ్రిడ్, శుక్రవారం గెయిల్, ఎంఅండ్ఎం, స్టేట్బ్యాంకు, టాటాపవర్ సంస్థలున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ఫలితాలు నేడు వెల్లడి అయ్యాయి. ఈ ప్రభావం సోమవారం ట్రేడింగ్లో కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్తో సహా ఐదు రాష్ట్ర అసెంబ్లీకు జరుగుతున్నప్రస్తుత ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్లకు కీలకంగా నిలువను న్నాయి. గత ఏడాది నవంబరులో ప్రధానిమోడీ ఉన్నట్లుండి పెద్దనోట్ల రద్దునిర్ణయాన్ని ప్రకటించా రు. నల్లధనానికి చెక్పెట్టే బాటలో మరిన్ని చర్య లుంటాయని కూడా వెల్లడించారు. నగదు కొరతతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురికావ డంతో ప్రతి పక్షాలు నోట్లరద్దు అమలులో ప్రభు త్వం విఫలంఅంటూ విమర్శించాయి. ఈ ప్రభా వంఎలా ఉంటుందన్న అంచనాలు కొంతవరకూ ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ప్రతింబిస్తాయని విశ్లేషకుల అంచనా. అయితే స్థానిక అంశాలకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని తెలియజేస్తున్నారు.
పలితాలు శనివారం 11న వెల్లడి అవుతాయి. విదేశీ మార్కెట్లలోని పరిణా మాలు, డాలరుతో రూపాయి మారకం విలువలు, ముడిచమురుధరలు వంటి అంవాలు దేశీయంగా మార్కెట్లపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.
| 1entertainment
|
Hyderabad, First Published 5, Jul 2019, 1:14 PM IST
Highlights
నందమూరి హీరో తారకరత్న నటించిన కాకతీయుడు సినిమా నేడు కొన్ని థియేటర్స్ లో రిలీజయింది. అయితే ఈ సినిమా రిలీజవుతున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. ఒకప్పుడు కెరీర్ మొదట్లో వరుసగా 5 సినిమాలకు సైన్ చేసిన తారకరత్న ఇప్పుడు అవకాశాల్ని అందుకోవడమే కష్టంగా మారింది.
నందమూరి హీరో తారకరత్న నటించిన కాకతీయుడు సినిమా నేడు కొన్ని థియేటర్స్ లో రిలీజయింది. అయితే ఈ సినిమా రిలీజవుతున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. ఒకప్పుడు కెరీర్ మొదట్లో వరుసగా 5 సినిమాలకు సైన్ చేసిన తారకరత్న ఇప్పుడు అవకాశాల్ని అందుకోవడమే కష్టంగా మారింది.
2015లో పూర్తయిన కాకతీయుడు ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. అప్పట్లో దాసరి నారాయణరావు చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే సినిమా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. అలాగే ఆ తరువాత రిలీజ్ చేద్దామని అనుకున్నా బిజినెస్ లేక మూలన పడింది. మొత్తానికి నేడు విడుదల చేసినప్పటికీ థియేటర్స్ లో కూడా జనాలు కనిపించడం లేదు.
ఒకప్పుడు సింహారాశి - శివరామరాజు - ఎవడైతే నాకేంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వి.సముద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మినిమమ్ గ్యారెంటీ ఉన్న ఈ దర్శకుడు కాకతీయుడుని పెద్దగా మెప్పించేలా తెరకెక్కించలేకపోయాడు. అయినా ఆర్థికంగా దెబ్బ పడ్డ సినిమాకు ఎన్నో సమస్యలు.. ఎవరిని ఏమన్నా లాభం ఉండదు. నిజంగా ఈ సినిమా రిలీజ్ కాకపోయినా బావుండేదేమో.. సినిమా ఆడదాని తెలిసినా ఈ ప్రయోగాలు చేయడం ఎందుకో?
Last Updated 5, Jul 2019, 1:23 PM IST
| 0business
|
ఐసిసి కీలక పదవిలో ఉన్నందున బిసిసిఐ
అనుకూలంగా వ్యవహరించలేను: శశాంక్
దుబా§్ు: గత మేనెలలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శశాంక్ మనోహర్ బిసిసిఐకి అంతగా ప్రాధాన్యత ఇవ్వడంలేదనే ఆరోపణలపై తనదైన శైలిలో స్పందించారు.ప్రస్తుతం ఐసిసిలో కీలకపదవిలో ఉన్నం దున బిసిసిఐకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం తగని పని అని స్పష్టంచేశాడు.తాను బిసిసిఐకి బాస్ను కాదని,ఐసిసి బాస్ అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.ఈ మేరకు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశాంక్ మనోహర్ పలు విష యాలను వెల్లడించాడు.నేను ఐసిసిలో ఉన్న 105 దేశాలకు ప్రతినిధిని,ఐసిసి స్వలాభాల కోసం పనిచేయాలి.అది నా డ్యూటీ కేవలం ఏదో ఒకవ్యక్తిగత దేశమే నన్ను ఎన్నుకో లేదు. ప్రపంచంలోని వివిధదేశాలు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నాయి.అటువంటప్పుడు ఏదో ఒక క్రికెట్ బోర్డు ప్రయోజనాల కోసం పని చేయలేను,
ఏ ఒక్కరి సంతృప్తి కోసమో పనిచేయలేను.బిసిసిఐ వ్యవహారలను ఆ బోర్డు పర్యవేక్షించు కుంటుందని ఆయన వెల్లడించారు. ఐసిసి చైర్మన్గా శశంక్ మనోహర్ పదవి చేపట్టి సుమారు నాలుగు నెలలు అయింది. అయితే ఐసిసి ఆర్థిక, వ్యాపార కార్యక్రమాల్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి ఏ ఒక్కరికీ ప్రాతి నిత్యం కల్పించకపోవడంపై శశాంక్పై ఆరోపణలు వెలుగుచూశాయి. కాగాఆయన వాదనమరోలా ఉంది. వచ్చే అక్టోబరులో కొత్తగాఫైనాన్షియల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్కమిటీలు ఏర్పాటు కానున్నట్లు పేర్కొ న్నాడు. ఆ కమిటీలను బోర్డు డైరెక్టర్ల ఆమోదం మేరకు ఏర్పాటు చేయనున్నట్లు మనోహర్ స్పష్టం చేశాడు.
| 2sports
|
SRISANTH
శ్రీశాంత్ను కరుణించని బిసిసిఐ
కొచ్చి: కేరళ హైకోర్టు తనపై నిషేధాన్ని ఎత్తివేసినా బిసిసిఐ మాత్రం శ్రీశాంత్ను కరుణించేలా లేదు. స్కాట్లాండ్ లీగ్లో ఆడేందుకు అనుమతివ్వాలంటూ బిసిసిఐకి ఎన్ఓసి పంపిస్తే…ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు. స్కాట్లాండ్ లీగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసిందని, కనీసం ఇప్పటికైనా బిసిసిఐ తనకు అనుమతివ్వకపోతే లీగ్లో ఆడే అవకాశాన్ని పూర్తి కోల్పోతానని పిటిషన్లో శ్రీశాంత్ పేర్కొన్నాడు. కోర్టు జోక్యం చేసుకుని బిసిసిఐ నుంచి త్వరితగతిన స్పందన వచ్చేలా చూడాలని కోరాడు. కాగా, ఐపిఎల్లో ఫిక్సింగ్కు పాల్పడి బిసిసిఐ చేత నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్…కేరళ హైకోర్టు దాన్ని ఎత్తివేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆగస్టు 7న కేరళ హైకోర్టు అతనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయపోరాటం చేయడానికి అటు బిసిసిఐ కూడా సన్నద్ధమవుతోంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసే యోచనలో బిసిసిఐ ఉంది. బిసిసిఐ కోర్టుకు వెళ్తే మాత్రం స్కాట్లాండ్ లీగ్కు సంబందించి శ్రీశాంత్కు ఎన్ఓసి రావడం కష్టమే అని చెప్పాలి. ===
| 2sports
|
హిరో మహేష్ బాబు భార్య నమ్రతను దూరం పెట్టేశాడు ఎందుకో తెలుసా
Highlights
మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం స్పైడర్
ఈ నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న స్పైడర్ సినిమా
ఇప్పటివరకు మహేష్ బాబు మూవీస్ ప్రమోషన్స్ అన్ని దగ్గర ఉండి చూసుకున్న నమ్రత
స్పైడర్ మూవీ ప్రమోషన్ విషయంలో నమ్రతను దూరంగా పెట్టిన మహేష్ బాబు
టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు చిత్రాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన చిత్రాలు విడుదలవుతున్నాయి అంటే ప్రిన్స్ అభిమానులు పండగే అని చెప్పాలి. అయితే ప్రిన్స్ మహేష్ బాబు చిత్రాలు ప్రమోషన్స్ ఏర్పాట్లు అన్ని ఆయన భార్య నమత్రా శిరోద్కరే స్వయంగా చూసుకుంటుంది. ఈ కార్యక్రమాల్లో ఎక్కడ ఎలాంటి కించిత్ పొరపాటు కూడా లేకుండా అంతా తానే స్వయంగా పర్యవేక్షిస్తు అన్ని తానై జాగ్రత్తగా నడిపిస్తుంది.
చివరికి మహేష్ నటించిన చిత్రం తాలుక విషయాలు కూడా మీడియాకు నమ్రతానే వెల్లడిస్తుంది. ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే స్పైడర్ ప్రమోషన్ విషయంలో నమత్రను దూరంగా ఉంచాలని మహేశ్ భావిస్తున్నాడట. ఇంతకీ సంగతి ఏమంటేమహేష్ బాబు నటించిన తాజా చిత్రం స్పైడర్. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ కు నమ్రత దూరంగా ఉన్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి విషయంపై ఆమె పదవి విప్పలేదు. అంతే కాదు భర్త మహేష్ బాబు చిత్రం విడుదల అవుతున్న రెండు వారాల ముందు నుంచే ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. ఓ విధంగా చెప్పాలంటే మహేష్ చిత్రాల ప్రమోషన్స్ కి నమ్రత
అలాంటిది ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.
స్పైడర్ విడుదలకు సమయం సమీపిస్తున్న నమత్ర మాత్రం ఇంకా రంగంలోకి దిగకపోవడంపై పలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే త్వరలోనే నమ్రత రంగంలోకి దిగే అవకాశం ఉందని ఓ వర్గం భావిస్తున్నది. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంతో తొలిసారి తమిళ చిత్ర రంగ ప్రవేశం చేస్తున్నారు మహేష్.
అలాగే ప్రిన్స్ మహేష్ నటించిన గత చిత్రాల్లా కాకుండా ఈ చిత్రం విభిన్నంగా ఉంటుందని సినీ పరిశ్రమలో ఓ టాక్.ఈ చిత్రం దేశవ్యాపంగా కూడా విడులయ్యే అవకాశం ఉండటంతో బాలీవుడ్లో కూడా ప్రమోషన్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్తో నమ్రతకు మంచి సంబంధాలున్నాయి. డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్ బాధ్యతలను నమ్రత నిర్వహించే అవకాశముందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
కానీ ఈ సారి నమత్రను స్పైడర్కు దూరంగా ఉంచాలని మహేశ్ భావిస్తున్నట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మహేశ్ కెరీర్లోనే స్పైడర్ ఓ డిఫరెంట్ చిత్రం కానున్నది. ఈ చిత్రాన్ని అరబిక్ భాషలోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అరబిక్ ట్రైలర్ను ఇటీవల హైదరాబాద్లో ప్రదర్శించారు. ఈ ట్రైలర్ను చూసి ప్రిన్స్ మహేష్ నవ్వుల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే.
Last Updated 25, Mar 2018, 11:54 PM IST
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అయ్యో మాక్స్వెల్.. సూపర్ చాహల్
ఆస్ట్రేలియా విధ్వంసక హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్ని వరుసగా నాలుగోసారి కూడా భారత మణికట్టు స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ బుట్టలో వేసేశాడు.
TNN | Updated:
Oct 7, 2017, 08:03PM IST
ఆస్ట్రేలియా విధ్వంసక హిట్టర్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ని వరుసగా నాలుగోసారి కూడా భారత మణికట్టు స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ బుట్టలో వేసేశాడు. రాంచీ వేదికగా శనివారం జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్ బౌలింగ్ వేసిన చాహల్.. ఆఫ్ స్టంప్‌కి దూరంగా బంతి‌ని విసిరి మాక్స్‌వెల్‌(17: 16 బంతుల్లో)‌ని ఔట్ చేశాడు. మిడ్ వికెట్‌లో ఫీల్డర్ జస్‌ బుమ్రా తలమీదుగా బంతిని కొట్టేందుకు యత్నించిన మాక్స్‌వెల్ అతనికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. చాహల్‌ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతిని స్లిప్‌లో బౌండరీకి తరలించిన మాక్స్‌వెల్.. రెండో బంతికే వికెట్ సమర్పించుకోవడం విశేషం.
ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మూడు వన్డేల్లోనూ మాక్స్‌వెల్‌‌ని వరుసగా చాహల్ ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా చివరి రెండు వన్డేల్లో ఈ హిట్టర్‌కి తుది జట్టులో చోటివ్వలేదు. అయితే.. గాయం కారణంగా టీ20 సిరీస్‌కి కెప్టెన్ స్టీవ్‌స్మిత్ దూరమవడంతో అతని స్థానంలో జట్టులోకి.. ఆశ్చర్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా స్మిత్ వచ్చే మూడో స్థానంలో వచ్చిన మాక్స్‌వెల్ మళ్లీ చాహల్ బౌలింగ్‌లోనే ఔటవడంతో అవమాన భారంతో మైదానంలోనే బాధపడిపోయాడు. అతను ఔటైన తర్వాత.. చాహల్ విజయగర్వంతో.. సిగ్గుపడుతూ మైదానంలో ముసిముసిగా నవ్వుకుంటూ కనిపించాడు.
| 2sports
|
internet vaartha 99 Views
హైదరాబాద్ : సైబర్సిటీ నుంచి రూ.1000కోట్ల పెట్టుబడులతో కూడిన మారినా స్కైస్ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. ప్రీమియం హైరైజ్ నివాస గృహాల ప్రాజెక్టును చేపట్టింది. జిప్లస్31 అంతస్తులతో 8.5 ఎకరాల విస్తీర్ణంలో 80శాతంఓపెన్ స్పేస్, ప్రతి టవర్లోను నాలుగు బేస్మెంట్ స్థాయిలుంటాయని కంపెనీ వివరించింది. మొత్తం రెండు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 1250 యూనిట్లను నిర్మిస్తామని ప్రకటించింది. 2బిహెచ్కె 1200 ఎస్ఎఫ్టివరకూ ఉంటుంది. 3బిహెచ్కె 1350 నుంచి 2200 ఎస్ఎఫ్టివరకూ ఉన్నట్లు కంపెనీ వివరించింది. ప్రముఖ ఆర్కిటెక్ట్ హపీజ్ కాంట్రాక్టర్ ఈ ప్రాజెక్టుకు డిజైన్చేసారు. 30వ, 31వ అంతస్తుల్లో అన్ని టవర్లలోను డూప్లెక్స్ యూనిట్లుగా ఉంటాయి. మూడువలే చదరపు అడుగుల నుంచి 41-00 చదరపు అడుగుల విస్తీర్ణంతో వస్తాయని సైబర్సిటీ ఎండి వేణువినోద్ వివరించారు. క్లబ్హౌస్, జిప్లస్3 అంతస్తుల్లో 50 వేల చదరపుఅడుగుల ఇండోర్వసతులు, అన్ని వయసులవారికి అన్ని ప్రాధాన్యతలకు సరిపడే ఉంటుందని వేణు వినోద్ వివరించారు. ప్రాజెక్టు మారినా స్కైస్ హైదరాబాద్లో అత్యంత కీలకమైనవసతులున్న నివాస ప్రాజెక్టుగా నిలుస్తుందని వివరించారు. హైటెక్ సిటీకి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే మారినా స్కైస్ వస్తోంది.
| 1entertainment
|
Abu Dhabi - United Arab Emirates, First Published 22, Sep 2018, 12:25 PM IST
Highlights
ఆసియా కప్ లో అప్ఘానిస్తాన్ జట్టు సూపర్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇప్పటికే గ్రూప్ బి లో అగ్రస్థానంలో నిలిచి అప్ఘాన్ సంచలనం సృష్టించింది. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి అగ్రశ్రేణి జట్లను ఓడించి సూపర్ 4 కు చేరుకుంది. అయితే శుక్రవారం సూపర్ 4 లో బాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ను కూడా ఓడించినంత పని చేసింది. అయితే చివరివరకు పోరాడిన పాక్ చివరి ఓవర్లో విజయం సాధించి గట్టెక్కింది.
ఆసియా కప్ లో అప్ఘానిస్తాన్ జట్టు సూపర్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇప్పటికే గ్రూప్ బి లో అగ్రస్థానంలో నిలిచి అప్ఘాన్ సంచలనం సృష్టించింది. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి అగ్రశ్రేణి జట్లను ఓడించి సూపర్ 4 కు చేరుకుంది. అయితే శుక్రవారం సూపర్ 4 లో బాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ను కూడా ఓడించినంత పని చేసింది. అయితే చివరివరకు పోరాడిన పాక్ చివరి ఓవర్లో విజయం సాధించి గట్టెక్కింది.
మొదట బ్యాటింగ్ చేసిన అప్ఘాన్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. కెప్టెన్ అస్గర్ అప్గాన్ మెరుపు బ్యాటింగ్ కు హహ్మతుల్లా షాహిదీ సమయోచిత షాట్లు తోడవటంతో అప్ఘాన్ మంచి స్కోరు సాధించింది. అస్గర్ 56 బంతుల్లో 67 పరుగులు చేయగా షాహిదీ 118 బంతుల్లో 97 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇతడు కొద్దిలో సెంచరీ మిసయ్యాడు.
ఇక 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ కు ఆదిలోనే షాక్ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే వఖార్ జమాన్ అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత పాక్ బ్యాట్ మెన్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తడ్డారు. రెండో వికెట్కి ఓపెనర్ ఇమామ్, బాబర్ ఆజమ్ 154 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఇమామ్ రనౌట్ మ్యాచ్ ను మలుపుతిప్పింది. ఆ తర్వాత పాక్ బ్యాట్ మెన్స్ వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో ఉత్కంట పెరిగింది. షోయబ్ మాలిక్ (43 బంతుల్లో 51 నాటౌట్) చివరివరకు క్రీజులో నిలిచి పాక్ కు విజయాన్ని అందించాడు.
పాక్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అప్ఘాన్ సంచలన బౌలర్ రషీద్ ఖాన్ 3, మజీబ్ ఉల్ రెహ్మాన్ 2, గుల్బదిన్ నబి 1 వికెట్ పడగొట్టారు.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ind vs Aus Odi: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో సిరీస్లకి భారత్ జట్టు ప్రకటన
ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత జనవరి 23 నుంచి న్యూజిలాండ్తో ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.
Samayam Telugu | Updated:
Dec 24, 2018, 06:01PM IST
Ind vs Aus Odi: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో సిరీస్లకి భారత్ జట్టు ప్రకటన
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో వచ్చే ఏడాది జరగనున్న వన్డే, టీ20 సిరీస్ల కోసం 16 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ బుధవారం ప్రకటించింది. పేలవ ఫామ్ కారణంగా టీ20 జట్టులో చోటు కోల్పోయిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ వన్డే, టీ20 జట్టులోకి ఎంపికవగా.. ఆసియా కప్లో గాయపడిన హార్దిక్ పాండ్యా కూడా పునరాగమనం చేయనున్నాడు. దినేశ్ కార్తీక్ వన్డే, టీ20 జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. రిషబ్ పంత్ మాత్రం కేవలం టీ20లకే ఎంపికయ్యాడు.
టీమ్లోకి ధోనీ రీఎంట్రీపై ముందే వచ్చిన లీక్లు..!
ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనున్న భారత్ .. ఆ తర్వాత జనవరి 23 నుంచి న్యూజిలాండ్తో ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఈ మొత్తం సిరీస్లకి జట్టుని సెలక్టర్లు ఈరోజే ప్రకటించేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో మెప్పించిన కృనాల్ పాండ్య.. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కి ఎంపికయ్యాడు. అతను తన సోదరుడు హార్దిక్ పాండ్యాతో కలిసి ఆ సిరీస్లో ఆడే అవకాశం ఉంది.
India’s squad for ODI series against Australia and New Zealand: Virat (Capt), Rohit (vc), KL Rahul, Shikhar, Rayudu… https://t.co/c6fXe7YlHk
— BCCI (@BCCI) 1545651491000
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో తలపడే భారత్ జట్టు ఇదే..!
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ
India’s squad for T20I series against New Zealand: Virat(Capt), Rohit (vc), KL Rahul, Shikhar Dhawan, Rishabh Pant,… https://t.co/0l7USfUOLS
— BCCI (@BCCI) 1545651505000
న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో తలపడే భారత్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఉద్యోగులకు జులై నెల జీతాలివ్వని ఎయిరిండియా
వరుసగా 5వ సారి ప్రభుత్వ విమానయాన సంస్థ విఫలం అవడంతో ఉద్యోగుల శాలరీలు సకాలంలో ఇవ్వలేకపోయినట్లు ఎయిరిండియా పేర్కొంది.
Samayam Telugu | Updated:
Aug 12, 2018, 09:50AM IST
పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా కష్టాలు ఉద్యోగులకు పాకాయి. వేతనాలు చెల్లించలేదు. అయితే తమ ఉద్యోగుల ఎయిర్ ఇండియా శుభవార్త అందించింది. ఉద్యోగులకు చెల్లించాల్సి జులై నెల జీతాలను వచ్చేవారంలో ఇస్తామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సిబ్బందికి సకాలంలో జులై నెలజీతాలను చెల్లించలేదు. వరుసగా 5వ సారి ప్రభుత్వ విమానయాన సంస్థ విఫలం అవడంతో ఉద్యోగుల శాలరీలు సకాలంలో ఇవ్వలేకపోయినట్లు సంస్థ పేర్కొంది. ప్రతి నెల 30, 31 తేదీన ఉద్యోగుల జీతాలను చెల్లిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. మార్చి నెలలో జీతాల చెల్లింపు కొంత ఆలస్యం అయిందని, ఏప్రిల్, మే, జూన్ నెల్లో సక్రమంగా ఉద్యోగుల శాలరీలను చెల్లించామని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా సంస్థకు పర్మినెంట్ ఉద్యోగులు 11 వేల మంది ఉన్నారు.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆసియా కప్లో రేపు మళ్లీ పాక్తో భారత్ ఢీ..!
హాంకాంగ్పై ఘన విజయంతో టోర్నీలో బోణి అందుకున్న పాకిస్థాన్ జట్టు ఆ తర్వాత భారత్ చేతిలో రెండు రోజుల క్రితం ఓడి.. అఫ్గానిస్థాన్పై నిన్న అతికష్టంగా గెలిచి పూర్తి ఒత్తిడిలో కనిపిస్తోంది.
Samayam Telugu | Updated:
Sep 22, 2018, 09:56PM IST
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో మళ్లీ దాయాదుల మధ్య సమరం జరగనుంది. టోర్నీలో భాగంగా గ్రూప్ దశలో ఇప్పటికే గత బుధవారం ఢీకొన్న భారత్ , పాకిస్థాన్ జట్లు.. ఆదివారం సాయంత్రం సూపర్-4లో అమితుమీ తేల్చుకోనున్నాయి.
హాంకాంగ్పై ఘన విజయంతో టోర్నీలో బోణి అందుకున్న పాకిస్థాన్ జట్టు ఆ తర్వాత భారత్ చేతిలో రెండు రోజుల క్రితం ఓడి.. అఫ్గానిస్థాన్పై నిన్న అతికష్టంగా గెలిచి పూర్తి ఒత్తిడిలో కనిపిస్తోంది. మరోవైపు భారత్ జట్టు మాత్రం టోర్నీలో తిరుగులేని ప్రదర్శనతో హ్యాట్రిక్ విజయాలు సాధించి మంచి జోరుమీదుంది. అయితే.. అనిశ్చితికి మారుపేరైనా పాకిస్థాన్ని తక్కువ అంచనా వేస్తే.. భారత్ మూల్యం చెల్లించుకోక తప్పదు..!
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు అర్ధశతకాలతో సూపర్ ఫామ్లో ఉండగా.. శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, ధోనీ టచ్లోకి వచ్చారు. బౌలింగ్ విభాగంలోనూ జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కేదార్ జాదవ్ మంచి జోష్లో ఉండగా.. బంగ్లాదేశ్పై 4 వికెట్లు పడగొట్టి జడేజా కూడా సత్తాచాటాడు. దీంతో.. భారత్ జట్టు హాట్ ఫేవరెట్గా రేపు బరిలోకి దిగనుంది.
| 2sports
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నా: బుల్లి తెర బ్యూటీ
బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌనిక గుంటక త్వరలో సిల్వర్ స్క్రిన్ ఎంట్రీకి రెడీ అవుతోంది. పున్నాగ సీరియల్తో అభిమానులను ఆకట్టున్న ఈ బ్యూటీ ఇప్పుడు వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది.
Samayam Telugu | Updated:
Nov 3, 2019, 09:54AM IST
మౌనిక గుంటక
ప్రస్తుతం సినిమా స్టార్స్తో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు బుల్లితెర నటీనటులు. సీరియల్స్తో ప్రతిరోజు పలకరించే తారలకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోతున్నారు. అందుకే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి స్మాల్ స్క్రీన్ను ఏ వేదికగా ఎంచుకుంటున్నారు తారలు. ఇప్పటికే ఝాన్సీ, అనసూయ, రష్మిక లాంటి యాంకర్స్ వెండితెర మీద కూడా ఆకట్టుకుంటున్నారు.
Also Read: బన్నీకి విలన్గా కోలీవుడ్ హీరో.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
తాజాగా ఓ సీరియల్ నటి వెండితెర అరంగేట్రానికి సిద్ధమయ్యింది. బుల్లితెర ప్రేక్షకులకు మౌనిక గుంటుక ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పని లేదు. జీ తెలుగులో ప్రసారమైన ' పున్నాగ ' సీరియల్ తో టీవీ ప్రేక్షకుల్లో అభిమానులను సొంతం చేసుకుంది మౌనిక. ప్రస్తుతం అదే చానల్లో మరో రెండు సీరియల్స్లోనూ నటిస్తోంది. 'గుండమ్మ కథ'లో ప్రియా, 'సూర్యకాంతం'లో ప్రమీల పాత్రల్లో ఆకట్టుకుంటోంది.
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
విశ్వక్ సేన్ను మొదట నేను నమ్మలేదు: తరుణ్ భాస్కర్
‘ఫలక్నుమా దాస్’ సినిమాను మే 31న విడుదల చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తోంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
Samayam Telugu | Updated:
May 20, 2019, 04:35PM IST
‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్నుమా దాస్’. వాజ్ఞ్మయి క్రియేషన్స్ కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్ బ్యానర్స్పై కరాటే రాజు, చర్లపల్లి సందీప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘మీడియా 9’ మనోజ్కుమార్ సహ నిర్మాత. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి ఈ సినిమాను మే 31న విడుదల చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తోంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ సలోని మిశ్రా, తరుణ్ భాస్కర్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘సినిమాను ఇటీవల 100 మంది దాకా చూశారు. చూసిన వాళ్లంతా సినిమా బాగుందని ప్రశంసలు కురిపించారు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మే 31న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’ అని అన్నారు. ఈ సినిమా హైదరాబాద్ కల్చర్ను ప్రతిబింబిస్తుందని, అందరికీ నచ్చేలా ఉంటుందని నిర్మాత కరాటే రాజు చెప్పారు.
ఈ చిత్రంలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘మొదట్లో విశ్వక్ మీద నమ్మకం ఉండేది కాదు. కానీ ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాడు. అప్పుడు విశ్వక్ మీద నమ్మకం కలిగింది. ఇది మలయాళం సినిమాకి రీమేక్ అని తెలిసిన విషయమే. సినిమా చాలా బాగా వచ్చింది’ అని అన్నారు.
డి.సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘ఇది తెలుగు సినిమాకి కొత్త కాన్సెప్ట్. విశ్వక్ తాను నటిస్తూ దర్శకత్వం చేశారు. తరుణ్ భాస్కర్ బాగా నటించారు. విశ్వక్ ఎంతో ఇష్టంతో సినిమా చేశారు. ఇందులో సంభాషణలు చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. దీన్ని ఓ ఆర్ట్ ఫిల్మ్లా కాకుండా.. కమర్షియల్ చిత్రంగా బాగా తీశారు. సంగీతం బాగుంది’ అన్నారు. ఇందులో రా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని, చూసి ఎంజాయ్ చేయండంటూ హీరోయిన్ సలోని మిశ్రా ఉత్సాహంగా చెప్పారు.
| 0business
|
HABEEB
రాజ్కోట్ టెస్టుతో అరంగేట్రం చేసిన హబీబ్
రాజ్కోట్: టీమిండియా,ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత సంతతికి చెందిన 19 సంవత్సరాల బ్యాట్స్మెన్ హబీబ్ హమీద్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.ఇంగ్లండ్ తరుపున అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడు హబీబ్ హమీదే కావడం విశేషం.ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అయిదవ పిన్న వయస్కుడు హబీబ్ వయసు 19 సంవత్సరాల 297 రోజులు.గుజరాత్కు చెందిన హబీబ్ కుటుంబం ఇంగ్లండ్లోని మాంచెస్టర్లో నివాసం ఉంటున్నారు.హబీబ్ హమీద్ సోదరుడు సుమాన్ గత వారమే రాజ్కోట్కు చెందిన అమ్మా యిని వివాహం చేసుకున్నాడు.ఇంగ్లండ్ కౌంటీలో హబీబ్ హమీద్ లాంగేర్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్ జెప్రీ బా§్ుకాట్ ఆటతీరుని హబీబ్ హమీద్ ఆటతీరు పోలి ఉండటంతో జట్టులోని సహచర ఆటగాళ్లంతా హబీబ్ను బేబీ బా§్ుకాట్ అని పిలు స్తుంటారు.ఇటీవల బంగ్లాదేశ్తో ముగిసిన టెస్టు సిరీస్లో హబీబ్ చోటు దక్కించుకున్నా తుది జట్టులో మాత్రం స్థానం లభించలేదు. దీంతో బంగ్లాదేశ్ టెస్టు సిరీస్లో హబీబ్ ఆడలేదు.బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు.హబీబ్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ సందర్భంగా లాంగ్ష్తె క్లబ్ హబీబ్ నుద్దేశించి ట్విటర్ల పోస్టు చేసింది.కాగా రాజ్కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో హబీబ్ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా వెనుదిరిగాడు.టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.టెస్టు క్రికెట్లో చాలారోజుల తరువాత టీమిండియా టాస్లో ఓడిపో యింది. రాజ్కోట్ స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుంది. ========
పోలార్డ్కు విండీస్ బోర్డు షాక్ న్యూఢిల్లీ: జీతభత్యాల విషయంలో గతంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్లూఐసిబి)కి ఆటగాళ్లకు మధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.అంతేకాదు బోర్డు మాట విన్న ఆటగాళ్లకు పెద్దపీట వేసి,కీలకమైన ఆటగాళ్లను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మరో వివాదంలో తలదూర్చింది.వెస్టిండీస్కు చెందిన క్రికెటర్లు విదేశీ లీగ్లు ఆడితే అందులో 20 శాతం సొమ్ము ను తమక చెల్లించాలని వెస్టిండీస్ బోర్డు కొత్త నిబంధనను విధించింది.వెస్టిండీస్కు చెందిన ఆటగాడు తమ దేశానికి బయట జరిగే టి20టోర్నమెంట్ అందులోని 20 శాతం సొమ్మును బోర్డుకు చెల్లించాలంటూ నిబంధన పెట్టింది.అలా అయితేనే నో అబ్జేక్షన్ సర్టిఫికెట్ ఇస్తామని స్పష్టం చేసింది.కాగా తాజా నిర్ణయంతో దక్షిణాఫ్రికా టి20 లీగ్ రామ్ స్లామ్లో ఆడేందుకు గాను రెండేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్న పోలార్డ్ ఈ టోర్నీలో పాల్గొనడం అనుమానంగా మారింది.ఈ మేరకు పోలార్డ్కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఈమెయిల్లో స్పష్టం చేసింది.అంతేకాదు వెస్టిండీస్ జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరైనా విదేశీ లీగ్లో ఆడటానికి వెళ్లి ముందు 20 శాతం ఫీజును చెల్లించడానికి అంగీకరించి నో అబ్జెక్షన్ సర్టిపికెట్ తీసుకోవాలని అందులో పేర్కొంది.దీంతో త్వరలో దక్షిణాఫ్రికాలో జరిగే ఆ లీగ్లో పోలార్డ్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘మెహ్రీన్’కు హ్యాండ్ ఇచ్చేసిన మెగా హీరోస్!
కృష్ణగాడి వీరప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కౌర్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది.
TNN | Updated:
Apr 22, 2017, 09:28PM IST
కృష్ణగాడి వీరప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కౌర్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆ వెంటనే బాలీవుడ్‌కు వెళ్ళి ఫిల్లౌరి సినిమా చేసి అక్కడ కూడా తనమార్క్‌ను క్రియేట్ చేసుకుంది. తాజాగా టాలీవుడ్‌లో అమ్మడుకి వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. రవితేజతో 'రాజా ది గ్రేట్' సినిమా చేస్తోన్న ఈ బ్యూటీ సందీప్ కిషన్‌తో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది.
అలానే సాయి ధరం తేజ్‌తో 'జవాన్', వరుణ్ తేజ్ కొత్త సినిమా కోసం, అల్లు శిరీష్ తదుపరి సినిమా కోసం కూడా అమ్మడు పేరునే ఫైనల్ చేసుకున్నారు. దీంతో ఇక మెహ్రీన్ టాలీవుడ్‌లో తన చక్రం తిప్పుతుందని అనుకున్నారు. కానీ సడెన్‌గా అమ్మడు చిక్కుల్లో పడింది.
మెగాహీరోలతో అనుకున్న మూడు ప్రాజెక్టుల నుండి మెహ్రీన్ తప్పుకుంది.
అసలు ఆమె తప్పుకుందా..? లేక తప్పించారా..? అనే విషయం అంతుపట్టకుండా ఉంది. డేట్లు అడ్జస్ట్ చేయకపోవడమే కారణం అని చెబుతున్నా.. కెరీర్ ఇప్పుడే ఆరంభించిన ఈ బ్యూటీ డేట్స్ కేటాయించలేకపోతోంది అనే మాట నమ్మశక్యంగా లేదు. అసలు కారణం చెప్పలేదు గానీ అమ్మడు స్థానంలో సాయేషా సైగల్, అను ఎమ్మాన్యూయల్ వంటి హీరోయిన్లను తీసుకునే పనిలో ఉన్నారు.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
టీమిండియాలో ధోనీకెవరూ సాటిలేరు..!
భారత జట్టులో మహేంద్రసింగ్ ధోనీ ఫిట్నెస్తో ఎవరూ సరితూగలేరని చెన్నై సూపర్ కింగ్స్ ఫిజికల్ ట్రైనర్ రామ్జీ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల
Samayam Telugu | Updated:
Jun 1, 2018, 12:58PM IST
టీమిండియాలో ధోనీకెవరూ సాటిలేరు..!
భారత జట్టులో మహేంద్రసింగ్ ధోనీ ఫిట్నెస్తో ఎవరూ సరితూగలేరని చెన్నై సూపర్ కింగ్స్ ఫిజికల్ ట్రైనర్ రామ్జీ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్లో 30కిపైబడి వయసు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లను ఫిట్గా ఉంచడంలో రామ్జీ క్రియాశీలక పాత్ర పోషించాడు. భారత జట్టు త్వరలోనే అఫ్గానిస్థాన్తో టెస్టు మ్యాచ్, ఐర్లాండ్తో రెండు టీ20 మ్యాచ్లు ఆడనున్న నేపథ్యంలో.. ఆటగాళ్లు యో-యో ఫిట్నెస్ టెస్టుతో పాటు కొత్తగా డెక్సా స్కాన్ పరీక్షని కూడా ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో.. రామ్జీ మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటిలానే ధోనీ ఈ ఫిట్నెస్ టెస్టుల్ని అలవోకగా పూర్తి చేసేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. డెక్సా స్కాన్ ద్వారా.. ఆటగాళ్ల శరీరంలో కొవ్వు శాతం, ఎముకల పటుత్వాన్ని పరీక్షించనున్నారు.
| 2sports
|
Dubai - United Arab Emirates, First Published 25, Sep 2018, 2:15 PM IST
Highlights
ఫిక్సింగ్ భూతం మరోసారి పడగవిప్పింది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం రేపింది. కొందరు బుకీలు తనను కలిసినట్లుగా ఆఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ మొహ్మద్ షహ్జాద్ జట్టు మేనేజ్మెంట్కు తెలిపాడు.
ఫిక్సింగ్ భూతం మరోసారి పడగవిప్పింది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం రేపింది. కొందరు బుకీలు తనను కలిసినట్లుగా ఆఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ మొహ్మద్ షహ్జాద్ జట్టు మేనేజ్మెంట్కు తెలిపాడు.
దీంతో ఆఫ్గాన్ మేనేజ్మెంట్ అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) అవినీతి నిరోధక విభాగం రంగంలోకి దిగింది. షహజాద్ను కలిసిన బుకీలు.. త్వరలో జరగనున్న టీ20 లీగ్లో ఫిక్సింగ్ చేయాలంటూ ప్రేరేపించారు.
ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన.. ఐసీసీ యాంటీ కరెప్షన్ యూనిట్ గత ఏడాదిగా ఐదుగురు అంతర్జాతీయ స్థాయి కెప్టెన్లను బుకీలు కలిశారని.. ఇందులో ఐసీసీ సభ్యత్వం ఉన్న నాలుగు దేశాలకు చెందిన కెప్టెన్లు ఉన్నారని అవినీతి నిరోధక విభాగం తెలిపింది.
ఈ వ్యవహారంలో మొత్తం 32 మంది క్రికెటర్లను విచారించినట్లుగా ఐసీసీ తెలిపింది. ఫిక్సింగ్ నేపథ్యంలో ఆసియా కప్లోని మిగిలిన మ్యాచ్ల్లో ఆటగాళ్ల కదిలికలపై ఐసీసీ నిఘా పెట్టింది.
Last Updated 25, Sep 2018, 2:15 PM IST
| 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.