news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Hyderabad, First Published 2, Sep 2018, 10:32 PM IST Highlights బిగ్ బాస్ సీజన్ 2లో ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని విషయాన్ని ముందుగానే వెల్లడించారు. ఓట్ల ప్రకారంలో గణేష్, అమిత్ వెనుకంజలో ఉన్నారని ఈ వారంలో గణేష్, అమిత్ లు బయటకు వెళ్లిపోయే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపించాయి బిగ్ బాస్ సీజన్ 2లో ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని విషయాన్ని ముందుగానే వెల్లడించారు. ఓట్ల ప్రకారంలో గణేష్, అమిత్ వెనుకంజలో ఉన్నారని ఈ వారంలో గణేష్, అమిత్ లు బయటకు వెళ్లిపోయే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపించాయి. అనుకున్నట్లుగానే శనివారం ఎపిసోడ్ లో గణేష్ ఎలిమినేట్ అయినట్లుగా హోస్ట్ నాని ప్రకటించారు. కౌశల్ సేవ్ అయినట్లుగా వెల్లడించడంతో మిగిలిన ముగ్గురు సామ్రాట్, అమిత్, నూతన్ లలో అమిత్ వెళ్లిపోతాడనుకుంటే.. అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నూతన్ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్నాడని నాని ప్రకటించి షాక్ ఇచ్చాడు. రీఎంట్రీలో మరోసారి హౌస్ లోకి వెళ్లిన నూతన్ భుజానికి గాయం కావడంతో మరోసారి హౌస్ నుండి బయటకి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని మళ్లీ హౌస్ లోకి వచ్చారు. మూడోసారి అతడు హౌస్ లోకి అడుగుపెట్టడం అటు హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా వ్యతిరేకత వచ్చింది. బిగ్ బాస్ షోని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చాయి. ఇక వెళ్లిపోతూ వెళ్లిపోతూ.. బిగ్ బాంబ్ ని కౌశల్, దీప్తిలపై విసిరాడు నూతన్ నాయుడు. దీనిప్రకారం ఈ వారం మొత్తం హౌస్ లో ఎవరేం తిన్నా.. ఆ గిన్నెలు మొత్తం వీరిద్దరే శుభ్రం చేయాలి! ఇవి కూడా చదవండి..
0business
RJIO AIR`1 ఆర్‌జియో స్పీడు తక్కువే న్యూఢిల్లీ: టెలికాం పోటీ ప్రపంచంలో ముకుష్‌ అంబానీ ప్రవేశపెట్టిన ఆర్‌జియో 4జి సేవలు అన్ని సంస్థలకంటే ఎక్కువ స్పీడ్‌తో ఉంటాయని ప్రకటించినా. రానురాను ఎయిర్‌టెల్‌ కంటే తక్కువ వేగంతో సేవలు చేస్తున్నట్టు సర్వే సంస్థలు నివేదికలిచ్చాయి.. సిఎల్‌ఎన్‌ఎ నిర్వహించిన నసర్వే ప్రకారం చూస్తే ఎయిర్‌టెల్‌ 11.45 ఎంబిపిఎస్‌ వేగం అందిస్తుంటే జియో 6 ఎంబిపిఎస్‌ వేగంతో మాత్రమే సేవలందిస్తోందని పేర్కొంది.
1entertainment
Jun 03,2016 రేపు సహారా భూముల వేలం న్యూఢిల్లీ: సహారా గ్రూపు ఆస్తుల వేలానికి ముహూర్తం ఖరారయ్యింది. సుమారు రూ.722 కోట్ల రిజర్వు ధరతో సహారాకు చెందిన 87 స్థిరాస్తులను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టనున్నారు. శనివారం (జులై 4న) నిర్వహించనున్న ఈ వేలంలో తెలుగు రాష్ట్రాలలోని పలు ఆస్తులు కూడా ఉన్నాయి. సహారా అధిపతి సుబ్రతో రారు చెల్లించాల్సిన బకాయిలకు గాను అన్యాక్రాంతంకాని, తనఖాలోలేని సహారా ఆస్తులను వేలం వేయాల్సిందిగా 'సెబీ'కి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
MANGO విదేశీ కొత్త మార్కెట్లకు భారత్‌ మామిడి న్యూఢిల్లీ, మే 20: ఆస్ట్రేలియా, దక్షిణకొరియా మార్కెట్ల తర్వాత భారత్‌ మామిడి ఎగుమతులకు ఇరాన్‌ మంచి మార్కెట్‌గా ఎంచుకుంది. మహారాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ బోర్డు (ఎంసాంబ్‌) ఇప్పటికే మామిడి ఇరాన్‌ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు వేడినీళ్లతో శుద్ధిచేసే విధానం ప్రారంభించింది. కొన్ని ఆర్డర్లు కూడా ఇరాన్‌కు ప్రయోగాత్మకంగా పంపించేం దుకు మహారాష్ట్ర సిద్ధం అవుతోంది.మహారాష్ట్ర రాష్ట్ర వ్యవ సాయ మార్కెటింగ్‌ బోర్డు(ఎంసాంబ్‌) అంచనాలప్రకారం పూర్తి ఎగుమతులు వచ్చే సీజన్‌ నుంచి ప్రారంభం అవుతాయి. ఆస్ట్రే లియా, దక్షిణకొరియా దేశాలకు ఇటీవలే మామిడి ఎగుమతి వుతున్నది. ఆయాదేశాల్లో భారతీయ మామిడికి మంచి డిమాం డ్‌ ఉంది. భారత్‌ ఆస్ట్రేలియాకు ఇప్పటివరకూ మామిడిని ఎగుమతిచేయలేదు. ఎక్కువ ఆంక్షల కారణంగా రేడియేషన్‌ రహిత శుద్ధి విధానం, ఎగుమతులకు ముందు తనిఖీ విధానం సంక్లిష్టంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ఆస్ట్రేలియా కు చెందిన ఒకబృందం మహారాష్ట్రలో ఉన్న రేడియేషన్‌ ప్లాంట్‌ ను సందర్శించింది. ఆస్ట్రేలియన్‌ బయోసెక్యూరిటీ ఇంపోర్ట్‌ కండిషన్స్‌(బైకాన్‌) అథారిటీ ఇటీవలే తన ప్రోటోకాల్‌ నిబంధ నలను సవరించి భారత్‌కు చెందిన రేడియేషన్‌లేని మామిడిని దిగుమతులకుఅనుమతించింది. నవిముంబైలోని వాషిలో ఉన్న రేడియేషన్‌ రహిత సౌకర్యకేంద్రాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసింది. లాసల్‌గాంవద్ద ఉన్న కృషక్‌ కేంద్రంపై కూడా సంతృప్తి వ్యక్తంచేసింది. మొత్తం 800 టన్నువరకూ ఆస్ట్రేలి యాకు ఈసీజన్‌లో ఎగుమతి కావచ్చని అంచనా. వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి ప్రాధికార సంస్థ (అపెడా)ఇప్పటికే 2017 సీజన్‌కు సంబంధించి ట్రేడ్‌నోటీస్‌ జారీచేసింది. అమెరికాకు, రిపబ్లిక్‌ ఆఫ్‌కొరియా, జపాన్‌ దేశాల ప్రతినిధిబృందాలు నాశిక్‌, ముంబై, బెంగళూరులకు చేరుకు న్నాయి. 2004లో చైనాకు భారత్‌మామిడి ప్రారంభించిన తర్వాత అపెడా భారత్‌ దౌత్యకార్యాలయం సాయంతో చైనాను మరిన్ని మామిడిపాకింగ్‌ హౌస్‌లను రిజిస్టరుచేసుకునేవిధంగా ప్రయత్నాలు చేసింది. చైనా ప్లాంట్‌ క్వారంటైన్‌ అథారిటీ ప్రస్తు త మామిడిప్యాకింగ్‌ కేంద్రాలను క్రమబద్ధీకరించి వేడినీళ్ల శుద్ధి విధానం వంటి కేంద్రాలను ప్రారంభించింది. సంస్థవెబ్‌సైట్‌లపై కూడా పొందుపరిచింది. నిన్నమొన్నటివరకూ యూరోప్‌ భారత్‌ మామిడిపండ్లకు అత్యంత కీలకమైన మార్కెట్‌గా నిలిచింది. యూరోప్‌ మార్కెట్‌కు ఐదువేల టన్నులు ఎగుమతి అవుతాయి. యూరోప్‌కోసం ప్రత్యేక వేడినీళ్ల శుద్ధివిధానంతో రూపొంది స్తారు. దక్షిణకొరియాకు సస్యరక్షణ విశ్లేషణ ఖచ్చితంగా చేయా లి. మారిషస్‌ ఇప్పటికే భారత్‌ మామిడికి మార్కెట్‌కు చేరువ చేస్తామని ప్రకటించింది. స్విట్జర్లాండ్‌కూడా భారతీయ మామిడి పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. కెనడా, మలేసియా, న్యూజి లాండ్‌లకు కూడా భారత్‌ మామిడి ఎగుమతి అవుతుంది. వీటితోపాటే ఇపుడు దక్షిణకొరియా, ఉత్తర కొరియా, ఆస్ట్రేలి యా దేశాలు కూడా ఉన్నాయి. గణాంక వివరాలప్రనకారం 50 వేలనుంచి 70వేల టన్నుల వరకూ ఎగుమతులు జరుగుతా యని అంచనావేసారు. యూరోఫ్‌కు ఐదువేల టన్నులు, 1500 టన్నులు అమెరికా, 150 టన్నులు జపాన్‌కు వెళుతుంటాయి. ఎక్కువగా ఆల్ఫాన్సో, కేసర్‌ రకాల మామిడికి మంచి డిమాండ్‌ పలుకుతున్నది. ప్రస్తుతం అమెరికాకు ఎయిర్‌కార్గోద్వారా మామిడి ఎగుమతిఅవుతున్నది. రానున్నకాలంలో సముద్ర మార్గం లో పంపించేందుకు యోచిస్తున్నట్లు వివరించారు. 2.10లక్షల మామిడితోటలు మాంగోనెట్‌ కింద రిజిష్టరు అయ్యాయి. మామిడి ఎగుమతిదారులు కేవలం మామిడి నెట్‌లో రిజిస్టరుచేసుకున్న రైతుల నుంచి మాత్రమే కొనుగోలుచేయాల్సి ఉంటుంది. 35వేల టన్నుల వరకూ గతఏడాది ఎగుమతి చేసింది. ఈ ఏడాది 45వేల టన్నులవరకూ ఉండవచ్చని అంచనా. మహారాష్ట్రపరంగా దేశం లోనే అత్యధికంగా మామిడి ఎగుమతిచేస్తున్న రాష్ట్రంగా నిలిచింది.
1entertainment
Sep 20,2015 బీఓఎం నుంచి 'ముద్ర్ర'    నవతెలంగాణ, హైదరాబాద్‌ : సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఔత్సాహికవేత్తల రుణాల కోసం ప్రభుత్వ రంగంలోని బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) ముద్రా కార్డును ఆవిష్కరించింది. బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర హైదరాబాద్‌ జోన్‌ జోనల్‌ మేనేజర్‌ ఎన్‌ రాంబాబు ఈ కార్డును ఆవిష్కరించారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఔత్సాహికవేత్తల మూలధన అవసరాలను తీర్చేందుకు గాను ముద్రా కార్డును అందుబాటులోకి తెచ్చినట్లు బీఓఎం వివరించింది. బ్యాంకు 81వ వార్షికోత్సవం పురస్కరించుకొని బీఓఎం ఈ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. ముద్రా కార్డును రూపే డెబిట్‌ కార్డు రూపంలో అందిసున్నట్లుగా బ్యాంకు తెలిపింది. ఈ కార్డును ఏటీఎం, పీఓఎస్‌ కేంద్రాల వద్ద లావాదేవీలు నిర్వహించుకోవచ్చని బీఓఎం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం తయారీ, ట్రేడింగ్‌, సర్వీసు రంగాల్లోని ఔత్సాహికవేత్తలకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించడానికి ముద్రా రుణాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ రుణాల మంజూరులో రూ.5 లక్షల వరకు ఎలాంటి ప్రాసెసింగ్‌ రుసుము వసూలు చేయడం లేదని, చౌక వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి.aఞ మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Team India visits Virat Kohli’s restaurant Nueva ahead of 1st T20I against New Zealand కోహ్లి రెస్టారెంట్‌లో టీమిండియా..! న్యూజిలాండ్‌పై 2-1తేడాతో వన్డే సిరీస్‌ని చేజిక్కించుకున్న భారత్ జట్టు ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉంది. ఢిల్లీ‌లోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో TNN | Updated: Nov 1, 2017, 04:06PM IST న్యూజిలాండ్‌పై 2-1తేడాతో వన్డే సిరీస్‌ని చేజిక్కించుకున్న భారత్ జట్టు ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉంది. ఢిల్లీ‌లోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం తొలి టీ20 జరగనున్న నేపథ్యంలో అక్కడికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. కెప్టెన్ విరాట్ కోహ్లి రెస్టారెంట్‌ ‘నుయేవా’లో సందడి చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న కొన్ని ఫొటోల్ని కోహ్లి, శిఖర్ ధావన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
2sports
Vaani Pushpa 131 Views STEFANI RICE , swimming academy STEFANI RICE ప్రభాతవార్త స్పోర్ట్స్‌ ప్రతినిధి: ఆస్ట్రేలియా స్విమ్మింగ్‌ లెజెండ్‌ స్టెఫానీ రైస్‌ భారత్‌లో తన సొంత స్విమ్మింగ్‌ అకాడమీ నెలకొల్పనుంది. 2024, 2028 ఒలింపిక్స్‌లో భారత స్విమ్మర్లు పతకాలు సాధించాలన్న లక్ష్యంతో ఆమె ఈ అకాడమీని నెలకొల్పబోతున్నట్లు వెల్లడించింది. స్టెఫాన్‌ రైస్‌ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియాకి వచ్చిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ఆస్ట్రేలియాలోని ప్రతి ఒక్క కోచ్‌ కూడా ట్రైనింగ్‌ తీసుకున్న వారే. మైకేల్‌ ఫిలిప్స్‌, నా కోచ్‌ మైకేల్‌ బోల్‌ ఎలాగైతే కోచింగ్‌ తీసుకున్నారో అలాగే. వారు ప్రపంచంలోని అత్యుత్తమ కోచ్‌లు వారి అథ్లెట్లను ఎలా తీర్చిదిద్దుతారో చూశారని అన్నారు. ఈకారణం చేతనే నేను నా సొంత అకాడమీని నెలకొల్పాలని భావించా. ఇందులో భాగంగా హైలెవల్‌ కోచ్‌లను ఇక్కడికి తీసుకురావాలని అనుకుంటున్నా. భారత స్విమ్మర్లకు సరైన శిక్షణ ఇస్తే మెరుగవుతారు. భారత్‌లో స్విమ్మింగ్‌కు ఎంతో ఆదరణ ఉంది. ఇక్కడ ప్రతిభావంతులకు కొదవలేదు. వారిని గుర్తించి సానబెట్టాలని స్టెఫానీ రైస్‌ తెలిపింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత స్టఫానీ రైస్‌కు మూడు షోల్డర్‌ సర్జరీలు జరిగాయి. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/
2sports
ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌సీఎల్‌ ఐటీ సెజ్‌ - సమ్మతి తెలిపిన కేంద్ర ప్రభుత్వం సెజ్‌ బోర్డు - దాదాపు రూ. 400 కోట్ల వ్యయంతో ఏర్పాటు - విజయవాడలో 10.5 హెక్టార్లలో స్థాపన న్యూడిల్లీ: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయదలచిన ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలికి (సెజ్‌) కేంద్ర వాణిజ్య శాఖ అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడ సమీపంలో దాదాపు రూ.400 కోట్ల వ్యయంతో సంస్థ దీనిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హెచ్‌సీఎల్‌ చేసిన ప్రతిపాదనకు వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా నేతృత్వంలో సమావేశంమై సెజ్‌ అనుమతుల అందించే మంత్రిత్వ శాఖ అంతర్గత బోర్డు సమ్మతి తెలియజేసింది. హెచ్‌సీఎల్‌ ప్రతిపాదనలను పరిశీలించి చర్చలు జరపిన తరువాత ఈ ప్రత్యేక ఐటీ సెజ్‌ ఏర్పాటు ప్రతిపాదనకు సమ్మతి తెలియజేసినట్టుగా ఈ సమావేశం మినట్స్‌లో సర్కారు వర్గాలు తెలిపాయి. మొత్తం 10.43 హెక్టార్లలో దీనిని హెచ్‌సీఎల్‌ ఏర్పాటు చేయనుంది. దేశంలో జరిగే ఎగుమతుల్లో దాదాపు 25 శాతం వాటాను మన దేశంలో సెజ్‌లే అందిస్తున్నాయి. సెజ్‌లో ఏర్పాటు చేసే యూనిట్లు, డెవలపర్లు పన్ను రాయితీలతో పాటు పలు ఆర్థికేతర లబ్ధిని పొందుతుంటారు. దీనికి తోడు ఆయా సంస్థలు ఇక్కడ తమ ఉత్పత్తులను ఏర్పాట చేసుకొనేందుకు గాను ఒక గవాక్ష పద్ధతిలో అనుమతులు లభిస్తాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 223 సెజ్‌లు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో 5,146 యూనిట్లు పని చేస్తున్నాయి. ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లెదర్‌, బయోటెక్నాలజీ, డైమండ్‌ పాలిషింగ్‌కు చెందిన రంగాలలో ఈ సెజ్‌లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా సెజ్‌లు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ఉన్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఆర్‌బిఐ తాజా ప్రతిపాదన ATM’s న్యూఢిల్లీ: బ్యాంకుల్లో తీసుకున్నరుణాలు చెల్లించేటప్పుడు ఒక్క రోజు ఆలస్యమైనా బ్యాంకులు వడ్డీవేస్తాయి. మరి అలాంటప్పుడు మనకు ఇవ్వాల్సిన సర్వీసులు కూడా అదేవిధంగా ఇవ్వాలి కదా. అయితే ఎటిఎంలకు వెళ్లినప్పుడు అవి పని చేయట్లేదనో, డబ్బులు లేవనో వాటి ముందు బోర్డులు వేలాడదీస్తుంటారు. దీంతో ఇబ్బందిపడుతున్నది మనమే కదా. దీనిపై బ్యాంకులు ఎందుకు సమాధానం చెప్పవన్నది తేలాల్సిన ప్రశ్న. ఇలాంటి పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు రిజర్వ్‌ బ్యాంకు ఒక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎటిఎంల ముందు గంటల తరబడి నో క్యాష్‌ బోర్డు వేలాడదీస్తే కుదరదు. 3 గంటలకు మించి ఆ బోర్డు ఉంటే, ఆ ఎటిఎం కేంద్రంపై ఆర్‌బిఐ చర్యలు తీసుకుంటుంది. జరిమానా వేసి బ్యాంకుకి పంపిస్తుంది. ఈ ఫైన్‌ అన్ని ఎటిఎంలకూ ఒకే విధంగా ఉండదు. ఎటిఎం ఉన్న ప్రదేశం, దానికి ఉన్న డిమాండ్‌, వచ్చే కస్టమర్లు అన్నింటినీ లెక్కలోకి తీసుకొని ఫైన్‌వేసి, ఆ నోటీస్‌ను బ్యాంకు శాఖకు పంపిస్తుంది ఆర్‌బిఐ, దేశంలో రోజూ కొన్ని లక్షల ఎటిఎంలు ఇలాగే పనిచేయకుండా డబ్బులు లేకుండా ఉన్నాయి. వాటి వల్ల కొన్ని కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమందైతే ఎటిఎంలలో డబ్బుల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. ఆర్‌బిఐ నిర్ణయం మనకు కలిసొచ్చే అంశమే. ఇలాంటి ఫైన్లు వేస్తేనే బ్యాంకులు జాగ్రత్తపడి ఎటిఎంలలో ఎప్పటికప్పుడు క్యాష్‌ ఫిలప్‌ చేస్తాయని భావించవచ్చు. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/
1entertainment
Sports తైక్వాండో పోటీలకు 44 మంది ఎంపిక జగిత్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ఎక్కువ నిదులు కెటాయించాలని సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎమ్మెలన్యే తాటిపర్తి జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాZష స్థాయి తైక్వాండో పోటిలు జగిత్యాల జిల్లా కేంద్రంలో విరూపాక్షి గర్డెన్‌లో శనివారం ప్రారంబమయ్యాయి. ఈ రాZష స్థాయి తైక్వాండో పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలనుండి 400మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 50 మంది జడ్జిలుపాల్గొని పొటిలను నిర్వహించారు. అదివారం చివరి రోజు జరిగిన పోటీలలో 44 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అందులో 22మంది మహిళ క్రీడాకారులలో 11మంది సబ్‌ జూనియర్స్‌, 11మంది క్యాడెడ్స్‌, 22 మంది బా§్‌ు్స క్రీడాకారులలో 11మంది సబ్‌ జూనియర్స్‌, 11మంది క్యాడెడ్స్‌ గెలుపోందారు. ఇందులో గెలుపోందిన వారు కెరాళలో ఎప్రిల్‌ 20 నుండి24వరకు నిర్వహించే జాతీయ స్థాయి పోటిలలో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడల పట్ల చిన్న చూపు చూస్తుందని ఇప్పటికైన పాఠశాల స్థాయి నుండే క్రీడలకు ఎక్కువ నిదులు కేటాయించి చిన్ననాటినుండే క్రీడాకారులు ప్రోత్సహించాలన్నారు. క్రీడాకారులు గేలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని చూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తాటిపర్తి విజయలక్ష్మిదేవెందర్‌ రెడ్డి, ఓలంపిక్‌ అసోపియోషన్‌ సబ్యులు రవికుమార్‌, జగిత్యాల క్లబ్‌ కార్యదర్శి టివి సూర్యం, తైక్వాండో అసోషియేషన్‌ రాష్ట్ర కార్యదరిక్శ శ్రీహరి, తైక్వాండో అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధక్షులు కోల గంగాధర్‌, తైక్వాండో అసోసి యేషన్‌ జిల్లా అధ్యక్షులు మంచాల క్రిష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గందె సంతోష ్‌కుమార్‌, ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌, పరశు రాం గౌడ్‌, ఎండి యూనూస్‌ తదితరులు పాల్గొన్నారు.
2sports
Suresh 197 Views ఐపిఎల్‌ 2016 విజేత సన్‌రైజర్స్‌ ఐపిఎల్‌ 2016 టైటిల్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సొంతం చేసుకుంది. 8 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఘనవిజయంసాధించింది. టాస్‌ గెలిచి మొదటగా బ్యాటింగ బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పియి 200 పరుగలు మాత్రమే చేయగలిగింది.
2sports
Visit Site Recommended byColombia టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు 216 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జొనాథన్ మెర్లో 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెర్లో, పరమ్ ఉప్పల్ (34) నాలుగో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. వీరిద్దరూ రాణించడంతో ఆసీస్ ఓ దశలో మూడు వికెట్ల నష్టానికి 134 పరుగులతో పటిష్టంగా కనిపించింది. దీంతో 260 పరుగులు చేసేలా కనిపించింది. కానీ భారత బౌలర్లు మ్యాజిక్ చేశారు. 33 పరుగులు వ్యవధిలో చివరి ఐదు వికెట్లను కూల్చారు. దీంతో ఆసీస్ 216 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు ఓపెనర్లు పృథ్వీ షా (29), మన్జోత్ కల్రా (101 నాటౌట్) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. వన్‌డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన శుభ్‌మన్ గిల్ 31 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో భారత్ 131 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. కానీ మరో ఎండ్‌లో కల్రా పాతుకుపోయాడు. హార్విక్ దేశాయ్‌ (47 నాటౌట్)తో కలిసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. భారత్ మరో 67 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్, శివ సింగ్, కమలేష్ నాగర్‌కోటి, అనుకుల్ రాయ్ తలో రెండు వికెట్లు తీశారు. శివమ్ మావికి ఒక వికెట్ దక్కింది. అభిషేక్ శర్మ మినహా మిగతా బౌలర్లందరికీ వికెట్ దక్కింది. చదవండి: మన్జోజ్ కల్రా.. యువీని మరిపిస్తున్నాడు 18 ఏళ్ల క్రితం మహ్మద్ కైఫ్ నాయకత్వంలోని యువ భారత్ తొలిసారి వరల్డ్ కప్ నెగ్గగా.. 2008లో కోహ్లి కప్ అందించాడు. 2012లో ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ గెలుపొందింది. ఈసారి భారత జట్టు ఓటమి అనేది లేకుండానేు జైత్రయాత్ర కొనసాగించడం విశేషం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
London, First Published 3, Sep 2018, 3:05 PM IST Highlights ఇంగ్లాండ్ పర్యటనకు ఏ ముహూర్తాన వెళ్లాడో కానీ... టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు బొజ్జ నిండా తిని కునుకు పాట్లు పడటం, తన ఫిట్‌నెస్‌ను పక్కనబెట్టి భారీ బొజ్జతో కనిపించడం, కూల్‌డ్రింక్ ప్రమోషన్ చేయడం ఇలా ఒకటేమిటి అన్ని వివాదాలే. ఇంగ్లాండ్ పర్యటనకు ఏ ముహూర్తాన వెళ్లాడో కానీ... టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు బొజ్జ నిండా తిని కునుకు పాట్లు పడటం, తన ఫిట్‌నెస్‌ను పక్కనబెట్టి భారీ బొజ్జతో కనిపించడం, కూల్‌డ్రింక్ ప్రమోషన్ చేయడం ఇలా ఒకటేమిటి అన్ని వివాదాలే. తాజాగా రవిశాస్త్రి గురించి ఓ పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో రవిశాస్త్రి డేటింగ్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన నిమ్రత్ కౌర్.. మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యింది. దీని తర్వాత వచ్చిన ఫేమ్‌తో బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఈమె వయసు 36 కాగా, రవిశాస్త్రి వయసు 56 సంవత్సరాలు.. వీరిద్దరికి రెండేళ్ల నుంచి పరిచయం ఉందని... ఒక ప్రమోషన్ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా.. ప్రేమగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రస్తుతం నిమ్రత్ కూడా లండన్‌లోనే ఉండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. రవిశాస్త్రికి గతంలోనే రితూ అనే ఆమెతో పెళ్లయ్యింది. అయితే పదేళ్ల నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. మొన్నామధ్య భార్యాభర్తలు విడాలకు తీసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. 1980ల ప్రాంతంలో నాటి బాలీవుడ్ నటి అమృతా సింగ్‌తో రవిశాస్త్రి డేటింగ్ చేశారు.. తాజాగా ఈ వయసులో ప్రేమ, డేటింగ్ అనే వార్తలు రావడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. Last Updated 9, Sep 2018, 11:25 AM IST
2sports
bse స్పాట్‌ ఎక్ఛేంజి ఏర్పాటుదిశగా బులియన్‌రంగం ముంబయి: దేశంలోని బులియన్‌రంగం మొత్తం స్వీయ నియంత్రణదిశగా అడుగులు వేస్తోం ది. ఇందుకోసం బులియన్‌రంగంలోనే మూడు కమిటీలు ఏర్పాటుచేశారు. బంగారం వర్తకం నియమా వళి, రెండో కమిటీ మంచి పంపిణీ నిబంధనలు, మూడో అంశం స్పాట్‌ ఎక్ఛేంజిని ఏర్పాటు చేయా లన్న ప్రతిపాదనలతో బులియన్‌రంగం కసరత్తులు చేస్తోంది. బిజినెస్‌ సంఘాలు, వర్తకసంఘాలు, ప్రపంచ పసిడి మండలి, బ్యాంకులు, భారత బులియన్‌ జ్యుయెలరీ అసోసియేషన్‌(ఇబ్జా) ఇండియా గోల్డ్‌ పాలసీ సెంటర్‌ ఐఐఎం అహ్మదాబాద్‌ వంటి సంస్థల ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజర య్యారు. భారత్‌లో బంగారం పంపిణీకి సంబంధించిన సహేతుక నియమనిబంధనలపై ఒక సమగ్ర నివేదికను రూపొందించేపనిలో ఉన్నాయి. బంగారం వెండి కడ్డీల పంపినీలో ఖచ్చితమైన నియమా వళిని అనుసరించేవిధంగా ఈ పత్రం ఉంటుందని ఇబ్జా వెల్లడించింది. ఇందుకోసం ఇప్పటికే ఒక కమిటీని నియమించామని, కమోడిటీ ఎక్ఛేంజిలు, బంగారం శుద్ధి కేంద్రాలు నుంచి అందరు ప్రతి నిధులు ఉంటారని ఇబ్జా వివరించింది. అంతేకాకుండా బంగారం వెండి కమోడిటీల మార్కెట్‌కోసం స్పాట్‌ఎక్ఛేంజిని ఒకదానిని ఏర్పాటుచేయాలని ప్రతిపాదన తెచ్చారు. ఇక సహేతుక పంపిణీ నిబంధనలకు సంబంధించి సాంకేతిక కమిటీ తన నివేదికను 90రోజుల్లో అందచేస్తుంది.దీనిపై అందరు సంబంధిత విభాగాల్లో అధ్యయనంచేసి తమతమ అభిప్రాయాలు వివరిస్తారు. ఆ తర్వాత కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, సెక్యూరిటీ ఎక్ఛేంజిల పర్యవేక్షణ సంస్థ సెబీకి పంపిస్తారని తేలింది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఆ సినిమాకు 100 థియేటర్లు పెరిగాయి గత వారం రిలీజైన మూడు భారీ బడ్జెట్ చిత్రాలు అంతే భారీ పోటీ ఎదుర్కున్నాయి. ఒకేసారి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కావడంతో... TNN | Updated: Aug 19, 2017, 04:15PM IST Jaya Janaki Nayaka movie stills గత వారం రిలీజైన మూడు భారీ బడ్జెట్ చిత్రాలు అంతే భారీ పోటీ ఎదుర్కున్నాయి. ఒకేసారి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కావడంతో అందులో ఒకట్రెండు సినిమాలకు థియేటర్ల కొరత ఏర్పడింది. అందులో జయ జానకి నాయక సినిమా కూడా ఒకటి. విడుదల సమయంలో భారీగా థియేటర్ల కొరత సమస్య ఎదుర్కున్న జయ జానకి నాయకి సినిమాకు ఈ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదారు మరో 100 థియేటర్లు పెరిగినట్టు తెలుస్తోంది.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరబ్బా.. వరుణ్ తేజ్‌కి వంటబట్టేసింది! మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ చిత్రం ద్వారా మాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. వరుణ్‌ను హరీష్ శంకర్ భయంకరంగా చూపించబోతున్నారు. ఈనెల 20న గద్దలకొండ గణేష్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. Samayam Telugu | Updated: Sep 15, 2019, 09:56PM IST ‘‘ఇది నా తొమ్మిదో సినిమా. ఇప్పటి వరకు ప్రయోగాత్మక చిత్రాలు, క్లాస్ సినిమాలు, లవ్ స్టోరీలంటూ ఏదో ఒకటి చేస్తూ వచ్చాను. కానీ, ఫస్ట్ టైమ్ ఒక మాస్ సినిమా చేస్తే.. ఆ కిక్కే వేరబ్బా. మామూలుగా లేదమ్మ’’.. ఈ మాటలన్నది ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ . ఇప్పటి వరకు వరుణ్ తేజ్‌ను మనం లవర్ బోయ్‌గా చూశాం.. సోల్జర్‌గా చూశాం.. సైంటిస్ట్‌గా చూశాం. కానీ, ఫస్ట్ టైమ్ ఊర మాస్‌లో చూడబోతున్నాం. ఈ విషయం ‘వాల్మీకి’ టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమైంది. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. తమిళ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. గ్యాంగ్ స్టర్‌గా వరుణ్ లుక్ చూసి అంతా వహ్వా అన్నారు. గద్దలకొండ గణేష్‌గా ఆయన్ని తెరపై ఎప్పుడు చూద్దామా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ముందుగా వెంకటేష్‌కు థ్యాంక్స్ చెప్పారు. తాను ఫోన్ చేసి అడిగిన వెంటనే ఆయన ఓకే చెప్పారని అన్నారు. మాస్ సినిమాలో ఒక కిక్ ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి తనకు చెప్పారని, దాన్ని ఇప్పుడు కొంచెం రుచి చూశానని అన్నారు వరుణ్.
0business
mohammed siraj to make his debut in today's second t20 match against new zealand రెండో టీ20లో సిరాజ్ అరంగేట్రం తొలి టీ ట్వంటీ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్ రెండో టీ-20 గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు రాజ్ కోటలో అడుగుపెట్టింది. TNN | Updated: Nov 4, 2017, 07:11PM IST తొలి టీ ట్వంటీ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్ రెండో టీ-20 గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు రాజ్ కోటలో అడుగుపెట్టింది. మూడు మ్యాచ్‌లో టీ-20 సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో ఉంది. కాగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని కివీస్ భావిస్తుండగా.. గెలుపు జోరును కొనసాగించి సిరీస్‌ను పట్టేయాలని భారత్ కసితో ఉంది. కాగా రాజ్ కోటలో జరిగే రెండో టీ-20 మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఈ యువ పేసర్ సిరాజ్‌కు తుది జట్టులో స్థానం లభించింది. ఆశీష్ నెహ్రా రిటైరైన నేపథ్యంలో అతని స్థానాన్ని సిరాజ్‌తో భర్తీ చేస్తున్నట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపారు.
2sports
Jun 04,2017 43% కుంగిన స్పైస్‌జెట్‌ లాభాలు ముంబయి : నోట్ల రద్దు, ఇంధన ధరల్లో పెరుగుదల కారణంగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ లాభాలు తగ్గాయి. 2017 మార్చితో ముగిసిన తైమాసికంలో సంస్థ నికర లాభాలు 43 శాతం మేర క్షీణించి రూ.41.06 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో సంస్థ నికర లాభం రూ.73 కోట్లుగా ఉంది. 2016-17 మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ నికర లాభం రూ.407 కోట్ల నుంచి రూ.430 కోట్లకు పెరిగింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల నడుమ.. కంపెనీ వరుసగా తొమ్మిదో త్రైమాసికంలో కూడా లాభాదాయకతలో నిలిచినట్టు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ త్రైమాసికంలో నిర్వహణ రెవెన్యూ రూ. 1,625.7 కోట్లుగా ఉందని, మొత్తం ఆర్థిక సంవత్సరానికి రూ.6191.3 కోట్లుగా నమోదు అయిందని తెలిపింది. అయితే బలమైన పనితీరు కనబర్చినప్పటికీ... సంస్థకు డీమానిటైజేషన్‌ పెద్ద గుదిబండగా నిలిచిందని పేర్కొంది. దీనికితోడు ఇంధన ధరలు 46శాతం పెరగడంతో దాదాపు రూ.160 కోట్ల లాభాల్లో కోత పడినట్టు వివరించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV శ్రీవారి సేవలో అల్లువారి ఫ్యామిలీ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా సోమవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. TNN | Updated: Feb 6, 2017, 03:16PM IST స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా సోమవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తన గారాలపట్టి అర్హ తలనీలాలను స్వామివారికి అర్పించేందుకు భార్య స్నేహ, తల్లిదండ్రులు అరవింద్, నిర్మల, కొడుకు అయాన్‌తో కలసి తిరుమల వచ్చారు. ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. దర్శనానంతరం అల్లు వారి ఫ్యామిలీకి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. కాగా, అర్జున్ దంపతులకు బాబు ఉండగా ఇటీవలే మరో పాప జన్మించిన విషయం తెలిసిందే. బాబు పేరు అయాన్ కాగా, పాపకు అర్జున్‌లో AR, స్నేహ‌లో HA అక్షరాలను కలిపి ARHA (అర్హ) అని నామకరణం చేసారు.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పుజారా.. రవిశాస్త్రితో మాట్లాడొచ్చు కదా..! భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న చతేశ్వర్ పుజారా.. అన్ని ఫార్మాట్లలోనూ తాను ఆడాలని TNN | Updated: Aug 22, 2017, 08:49PM IST భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న చతేశ్వర్ పుజారా .. అన్ని ఫార్మాట్లలోనూ తాను ఆడాలని కోరుకుంటున్నాడట. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో శతకం బాదిన పుజారా.. ఈ ఏడాది ఎక్కువ టెస్టు పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. మరథాన్ ఇన్నింగ్స్‌లకి పెట్టింది పేరైన పుజారా.. వన్డే, టీ20 జట్టులో మాత్రం స్థానం సంపాదించలేకపోతున్నాడు. ఈ విషయమై కోచ్ రవిశాస్త్రితో మాట్లాడి.. ఆయన సూచనలతో బ్యాటింగ్‌లో మెరుగులు దిద్దుకుని పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడొచ్చు కదా..? అని ప్రశ్నించగా.. పుజారా సమాధానమిచ్చాడు. ‘కోచ్ రవిశాస్త్రి ఇప్పటి వరకు ఈ విషయమై చర్చించలేదు. కానీ.. తప్పకుండా త్వరలోనే మాట్లాడతాను. వ్యక్తిగతంగా నాకు తెలుసు నేను అన్ని ఫార్మాట్లలోనూ రాణించగలనని. ఎందుకంటే ఆట మెరుగుకి నేను ఎంతైనా కష్టపడగలను. ఆ సమయం వచ్చినప్పుడు.. నిరూపించుకుంటాను. ఇటీవల నేను ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడటం‌తో 2019 ప్రపంచకప్‌ ఆడే ఉద్దేశంతో ఆ మ్యాచ్‌లు ఆడారా..? అని చాలా మంది అడుగుతున్నారు. ఆ ఉద్దేశంలో కాదుగానీ.. ఎవరికైనా.. ఆ మ్యాచ్‌లు కెరీర్‌లో చాలా ఉపయోగపడతాయి’ అని పుజారా వివరించాడు.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV సల్మాన్ ఖాన్ 51వ బర్త్‌డే సర్‌ప్రైజ్ ఏంటో తెలుసా ? త్వరలోనే తన 51వ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోనున్న సల్మాన్ ఖాన్... ఆ రోజు అభిమానులకి ఓ బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్టు.. TNN | Updated: Dec 19, 2016, 11:25PM IST త్వరలోనే తన 51వ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోనున్న సల్మాన్ ఖాన్... ఆ రోజు అభిమానులకి ఓ బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్టు ఈమధ్యే ట్వీట్ చేశాడు. సాధారణంగా సల్మాన్ లాంటి స్టార్స్ తమ బర్త్ డేల సందర్భంగా తమ అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కానీ లేదా సాంగ్ కానీ లేదా టైటిల్ లాంటివి రిలీజ్ చేస్తుంటారు. ప్రస్తుతం సల్మాన్ ట్యూబ్ లైట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. బహుషా ఈసారి తన బర్త్ డే రోజున కబీర్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏదో పంచుకోబోతున్నాడా అనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.... సల్మాన్ చెప్పిన తీరు మాత్రం అది కాకుండా ఇంకా ఏదో ఉందనే అనిపించింది. — Salman Khan (@BeingSalmanKhan) December 19, 2016 అందరూ అనుకున్నట్టుగానే తాజాగా తన బర్త్ డేకి ఓ వారం రోజులు ముందుగానే ఆ సడెన్ సర్‌ప్రైజ్ ఏంటో చెప్పేశాడు సల్మాన్. డిసెంబర్ 27న నా యాప్ బర్త్ డే వుంది అని సోమవారం మధ్యాహ్నం ట్వీట్ చేసిన సల్మాన్... ఆ యాప్ కేవలం మీ కోసమే అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ యాప్ ద్వారా అభిమానులతో నిరంతరం టచ్‌లో వుండటంతోపాటు తన లేటెస్ట్ సినిమాల వివరాలు, అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్, తాను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే వివరాల్ని అభిమానులకి అందించాలనుకుంటున్నాడట సల్మాన్. బాలీవుడ్ బిగ్ సట అంతా హాజరయ్యే ఈ బర్త్ డే పార్టీకి అమీర్ ఖాన్ రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. కింగ్ ఖాన్ షారుఖ్ మాత్రం ఈ పార్టీలో చాలా సందడి చేయనున్నాడని సమాచారం. ఇదిలావుంటే, సల్మాన్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే, ప్రస్తుతం చేస్తున్న ట్యూబ్ లైట్ మూవీ వచ్చే ఏడాది ఈద్ పర్వదినం కానుకగా రిలీజ్ కానుండగా ఆ తర్వాత అలీ అబ్బాస్ జఫర్ డైరెక్షన్‌లో ''టైగర్ జిందా హై'' అనే సినిమా చేయనున్నాడు. ఏక్ థా టైగర్ సినిమాకి సీక్వెల్‌గా రానున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ సల్మాన్‌కి జంటగా నటించనుంది.
0business
Visit Site Recommended byColombia 2008 నుంచి 2011 ప్రపంచకప్ వరకూ టీమిండియా ఆటగాళ్లతో కలిపి పనిచేసిన ప్యాడీ అప్టన్‌ తాజాగా ‘ది బేర్‌ ఫుట్‌ కోచ్‌’ పేరుతో తన అనుభవాల్ని పుస్తకం రూపంలో తీసుకొచ్చాడు. ఇందులో ధోనీ గురించే కాకుండా.. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి కూడా ఆసక్తికరమైన విషయాల్ని ప్రస్తావించాడు. టీమ్‌తో ఉన్న సమయంలో గంభీర్ ఎక్కువ అభద్రతో ఉండేవాడని చెప్పుకొచ్చిన ప్యాడీ అప్టన్‌.. ప్రతికూల ఆలోచనలతో సతమతమయ్యేవాడని వెల్లడించాడు. మరోవైపు ధోనీతో పోలిస్తే.. భావోద్వేగాల విషయంలో విరాట్ కోహ్లీ పూర్తి భిన్నమని కూడా ప్యాడీ అప్టన్‌ అభిప్రాయపడ్డాడు. ‘మ్యాచ్ సమయంలో ధోనీ తన ఎమోషన్స్‌ని బాగా కంట్రోల్ చేసుకుంటాడని అంతా అనుకుంటున్నారు. కానీ.. వాస్తవంగా చెప్పాలంటే ధోనీకి అసలు ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. ఒక క్రికెటర్‌గానే కాకుండా.. వ్యక్తిత్వంలోనూ అతనంటే నాకు చాలా గౌరవం. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న ఒత్తిడికి తలొగ్గకుండా ప్రశాంతంగా ఆడగలిగే మానసిక సామర్థ్యం బహుశా ధోనీకి పుట్టకతోనే వచ్చి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఎమోషన్స్ లేకపోవడమే ధోనీకి వరమేమో..?’ అని ప్యాడీ అప్టన్‌ వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు TNN| Oct 14, 2016, 03.36 PM IST గురువారం భారీ పతనం అనంతరం కాస్త తేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 30 పాయింట్లు లాభపడి 27,673 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు లాభంతో 8,583 వద్ద ముగిసింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. గెయిల్ ఇండియా, లార్సెన్ అండ్ టర్బో, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, బీపీసీఎల్, టీసీఎస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు జీ ఎంటర్టైన్మెంట్, హిందుస్థాన్ యూనీలీవర్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐడియా సెల్యూలార్ షేర్లు నష్టపోయాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 66.73వద్ద స్థిరపడింది.
1entertainment
Thailand team వరల్డ్‌ కప్‌ వన్డే టోర్నీలో అర్హత న్యూఢిల్లీ: ప్రపంచక్రికెట్‌లోకి థా§్‌ులాండ్‌ అరం గేట్రం చేయడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ పేర్కొన్నాడు. వచ్చే వారం నుంచి శ్రీలంకలోని కొలంబోలో జరిగే వరల్డ్‌ కప్‌ అర్హత టోర్నీలో ఆడనుంది.ఈ ఏడాది జూన్‌-జులైలో జరిగే ఐసిసి మహిళల వరల్డ్‌ కప్‌ టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఐసిసికి రాసిన కాలమ్‌లో సచిన్‌ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌లో జరుగనున్న వరల్డ్‌ కప్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొందరు అత్యుత్తమ మమిళా క్రికెటర్లు పాల్గొంటారని,అటు వంటి ఆటను కొన్ని నెలల్లో వీక్షించబోతున్నామని సచిన్‌ వివరించాడు. మహిళా క్రికెట్‌ విస్తరణ లింగ సమానత్వం, హక్కు లకు ఉత్ప్రేరకంగా సచిన్‌ అభివర్ణించాడు.మహిళా క్రికెటర్లు ఆటతో యువతుల్లో క్రికెట్‌పై ఆసక్తి పెంచుతుందని సచిన్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.ఈ మెగా టోర్నీలో టీమిండియా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌,ఆల్‌ రౌండర ఝలన్‌ గోస్వామి రానున్న ప్రపంచ కప్‌లో బాగా ఆడతారని సచిన్‌ పేర్కొన్నాడు.మరోవైపు దక్షిణాఫ్రికా క్రీడాకారిణులు మిగ్నాస్‌ డు ప్రీజ్‌,డేన్‌ వాన్‌ నీకెర్క్‌,మరిజెన్నె కాప్‌,పాకిస్థాన్‌ క్రికెటర్లు బిస్మా మరూప్‌,సనా మిర్‌ వంటి క్రీడాకారిణలు మంచి ఆట తీరుతో మహిళా క్రికెట్‌ టోర్నీల పట్ల ఆసక్తి పెంచేలా చేస్తున్నారని ఆయన వివరించాడు.ప్యాన్‌ అందరూ మమిళా క్రికెట్‌ను ప్రోత్సహించాలని సచిన్‌ సూచించాడు. ్థౖయువ క్రికెటర్లు గుర్తుంచుకోవాలి క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ ఇచ్చిన ప్రేరణను యువ క్రికెటర్లందరూ గుర్తుంచుకోవాల్సిన అవరసం ఎంతైనా ఉందని వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ బియనాలారా పేర్కొ న్నాడు.యువ క్రికెటర్లుకు నాడు సచిన్‌ కలిగించిన ప్రేరణ ఎంతగానో ఉందని,ఈ విషయాన్ని వారు గుర్తుచేసుకోవాలన్నాడు.సచిన్‌ వారసత్వాన్ని యువ క్రికెటర్లంతా విజయవంతంగా కొనసాగిస్తున్నారని చెప్పిన లారా,కోహ్లీ బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలో కూడా తన శైలిలో దూసుకుపోతున్నాడన్నాడు.ఒక ఆటగాడిని ఇతర ఆటగాళ్లతో పోల్చి చూసి వాళ్లలో గొప్ప అని తాను ఎప్పుడు చెప్పేవాడిని కాదని ఈ సందర్భంగా లారా పేర్కొన్నాడు.
2sports
ఒఎన్‌జిసి గ్యాస్‌ను తోడుకున్న రిలయన్స్‌ - డిఅండ్‌ఎం రిపోర్టు వెల్లడి - రూ.12వేల కోట్లు విలువ అంచనా - దిగజారిన రిల్‌ షేర్‌ న్యూఢిల్లీ : ప్రముఖ బిలియనేర్‌ ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ (రిల్‌) కేజి బేసిన్‌లో చేతివాటం ప్రదర్శించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఆయిల్‌ అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఒఎన్‌జిసి)కు చెందిన రూ.12,000 కోట్ల విలువ చేసే గ్యాస్‌ను అక్రమంగా తోడుకుందని డిఅండ్‌ఎం నివేదికలో వెల్లడయ్యింది. క్రిష్ణా గోదావరి బేసిన్‌లో ఒఎన్‌జిసి, రిలయన్స్‌ ఇండిస్టీస్‌కు వేర్వేరు గ్యాస్‌ క్షేత్రాలను ప్రభుత్వం కేటాయించినప్పటికీ, ఒఎన్‌జిసికి చెందిన గ్యాస్‌ను కొంత పక్కనే ఉన్న రిలయన్స్‌ వెళికితీసుకొని సొమ్ము చేసుకుందని కన్సల్టెన్సీ సంస్థ డిఅండ్‌ఎం పేర్కొంది. కాగా రిల్‌ కంపెనీ దీన్ని తోసిపుచ్చుతు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో డిఅండ్‌ఎం రిపోర్టుకు మరింత బలం చేకూరుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒఎన్‌జిసికి చెందిన జి4 బ్లాకు, ఆర్‌ఐఎల్‌కు చెందిన కెజి డి6 బ్లాక్‌ పక్కపక్కనే ఉన్నాయి. అయితే పైకి చూస్తే స్పష్టమైన సరిహద్దులతో ఇవి వేర్వేరుగానే కనిపిస్తున్నప్పటికీ అనేక మీటర్ల లోతులో అంతర్గతంగా ఒకే భారీ నిక్షేపం ఉందని, దీనికి సరిహద్దులంటూ లేవని డిఅండ్‌ఎం పేర్కొంది. దీంతో ఒకే నిక్షేపాన్ని రెండు సంస్థలు పంచుకంటూన్నాయని తమ ప్రాథమిక పరిశీలన నివేదికలో వెల్లడయ్యిందని ఆ సంస్థ పేర్కొంది. ఉమ్మడి సరిహద్దుతో కావాలనే బావులు తవ్వి తమ నిక్షేపం నుంచి రిలయన్స్‌ ఉద్దేశ్యపూర్వంగా గ్యాస్‌ను దోచుకుంటుందని 2013లోనే ఒఎన్‌జిసి ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలోనే వాస్తవాలను గుర్తించడానికి ఇరు సంస్థలు సంయుక్తంగా డిఅండ్‌ఎంను నియమించుకున్నాయి. ఇది ఇరు సంస్థల అధికారులతో పాటు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌తో కూడా భేటీ అయ్యింది. గణాంకాలన్నింటీని పరిశీలించిన మీదట ఒఎన్‌జిసికి చెందిన దాదాపు 11.9 బిలియన్‌ ఘనపు మీటర్ల గ్యాస్‌ను రిలయన్స్‌ తోడి ఉండొచ్చని డిఅండ్‌ంఎ అంచనా వేసింది. 2015 మార్చి 31 నాటికి రిలయన్స్‌ మొత్తగా 58.67 బిలియన్‌ క్యూబిక్‌ మిటర్లు (బిసిఎం) గ్యాస్‌ను వెలికి తీసింది. ఇందులో సుమారు పావు శాతం ఒఎన్‌జిసిది ఉంటుందని ప్రాథమిక అంచనా. వచ్చే నెలలో డిఅండ్‌ఎం ఈ నివేదికను చమురు మంత్రిత్వశాఖకు సమర్పించనుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఒఎన్‌జిసికి రిలయన్స్‌ ఇండిస్టీస్‌ పరిహారం చెల్లింపుపై ఆ శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డిఅండ్‌ఎం నివేదిక ప్రకారం 11.9 బిలియన్‌ మీటర్ల గ్యాస్‌కు ఒఎన్‌జిసికి రూ.12,000 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. కేంద్రానికి డిఅండ్‌ఎం రిపోర్టు అందించన ఆరు మాసాల్లో ఒఎన్‌జిసికి పరిహారం చెల్లించేలా చమురు మంత్రిత్వశాఖ రిలయన్స్‌పై చర్యలు తీసుకోవాలని ఇది వరకే సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. ఒఎన్‌జిసి నివేదిక ప్రకారం రిలయన్స్‌కు చెందిన డి6-ఎ9, డి6-ఎ13 బావులు ఒఎన్‌జిసి క్షేత్రానికి అనుకుని ఉన్నాయి. రెండు రోజు తగ్గిన షేర్‌ డిఅండ్‌ఎం నివేదిక నేపథ్యంలో ఒఎన్‌జిసి క్షేత్రాల్లో రిలయన్స్‌ చేతి వాటం ప్రదర్శించిందన్న వార్తల నేపథ్యంలో రిల్‌ షేరు వరుసగా రెండు రోజులు పడిపోయింది. గురువారం ఇంట్రా ట్రేడింగ్‌లో 915 వద్ద నమోదైన షేర్‌ తుదకు 2.7 శాతం విలువ కోల్పోయి 88.9.15కు దిగజారింది. శుక్రవారం మరో 0.31 శాతం నష్టపోయి 886.35 వద్ద ముగిసింది. తొలి గంటలో ఓ దశలో రూ.900 ఎగువన చోటు చేసుకున్నప్పటికీ రోజంత ఒత్తిడిలోనే కొనసాగి నష్టం నమోదు చేసుకుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia తాము పంపిన షోకాజ్ నోటీసులకు నటుడు అలోక్ నాథ్ సమాధానం సంతృప్తిగా లేదంటున్నారు IFTDA ప్రెసిడెంట్ అశోక్ పండిట్. డైరెక్టర్ సాజిద్ ఖాన్ అయితే నోటీసులకు స్పందించకపోవడం దారుణమన్నారు. అందుకే తమ మాతృ సంస్థ అయిన వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE)ను సంప్రదించామన్నారు. IFTDA నుంచి మరోసారి షోకాజ్ నోటీసులు పంపుతామని.. వాటికి సమాధానం రాకపోతే FWICE నుంచి నాన్-కోఆపరేషన్ నోటీసులు ఇస్తామన్నారు. షోకాజ్ నోటీసుల విషయంలో IFTDA సీరియస్‌గా ఉంది. నోటీసులు పంపించినా స్పందించకపోవడంపై.. డైరెక్టర్ సాజిద్ ఖాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నటుడు సాజిద్ ఖాన్‌ సమాధానం కూడా సంతృప్తిగా లేకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. FWICE నుంచి నాన్-కోఆపరేషన్ నోటీసులు కనుక అందితే అలోక్‌ నాథ్, సాజిద్ ఖాన్‌లు మరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. Read This Story In English   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ఎల్‌ఐసీ ఆకర్షణీయ బోనస్‌ అదనంగా 40 శాతం పెంపు - 2016-17కు గాను వర్తింపు - పాలసీదారులకు బోనస్‌ పంట - ప్రభుత్వానికి పెరగనున్న డివిడెండ్‌ ముంబయి : దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీి) 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను తమ పాలసీదారులు, ప్రభుత్వానికి ఇచ్చే డివిడెండ్‌, బోనస్‌ను 40 శాతం పెంచాలని నిర్ణయించింది. ఖాతాదారులకు ఇచ్చే బోనస్‌ కోసం రూ.47,387.44 కోట్లు కేటాయింపులు చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వానికి రూ.2,494.08 కోట్ల డివిడెండ్‌ అందించాలని నిర్ణయించింది. ఇంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపులు వరుసగా రూ.34,207 కోట్లు, రూ.1,800.40 కోట్ల చొప్పున ఉన్నాయి. 2016-17లో ముఖ్యంగా జీవన్‌ శ్రీ, జీవన్‌ ప్రముఖ్‌, జీవన్‌ నిధి, జీవన్‌ అమ్రిత్‌ పాలసీదారులు అత్యధికంగా బోనస్‌ను పొందనున్నారు. అదే విధంగా కొత్తగా ఆవిష్కరించిన జీవన్‌ తరుణ్‌, జీవన్‌ లాబ్‌, జీవన్‌ ప్రగతి ఖాతాదారులకు కూడా బోనస్‌ను అందించాలని ఎల్‌ఐసి నిర్ణయించింది. అదే విధంగా డైమాండ్‌ జూబ్లీ వార్షికోత్సవాల సందర్బంగా ప్రత్యేక బోనస్‌ను కూడా అందించాలని నిర్ణయించింది. దీంతో ఖాతాదారులు రూ.5 నుంచి రూ.60వేల వరకు తమ పాలసీలపై బోనస్‌ పొందే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో జరిగిన 57వ వార్షిక సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్ల సమావేశంలో ఎల్‌ఐసీ ఛైర్మన్‌ వికె శర్మ మాట్లాడుతూ వ్యాపారపరంగా 2016-17 గొప్ప ఏడాది అని అభివర్ణించారు. ఈ కాలంలో చాలా ఎక్కువ పోటీ వాతావరణం చోటు చేసుకుందన్నారు. గది బయటి అంశాలను ఆలోచించలేకపోతే మార్కెట్లో తమ లీడర్‌ స్థానాన్ని పదిలపర్చుకోవడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఛైర్మన్‌ ప్రసంగ అంశాలు.. ఈక్విటీల విక్రయం, మిగులు పెట్టుబడుల వల్ల రూ.19,302.46 కోట్ల లాభాలు వచ్చాయి. 2016-17లో ఎల్‌ఐసి మొత్తంగా రూ.3,61,654 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ కార్పొరేషన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో రూ.2.60 లక్షల కోట్ల పెట్టుబడులు నమోదు చేసింది. దీంతో ఏడాదికి సగటున 7.65 శాతం రాబడి పెరిగింది. మరో రూ.27,350 కోట్లు కార్పొరేట్ల బాండ్లలో పెట్టుబడిగా పెట్టడం ద్వారా ఏడాదికి 7.80 శాతం వడ్డీని పొందింది. ఇదే సమయంలో ఈక్విటీల్లో రూ.41,751 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా యువత, మాస్‌ జనాలను ఆకర్షించడానికి కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఇందుకోసం వేగవంతమైన డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. ఎల్‌ఐసి ప్రధానంగా రెండు సెగ్మెంట్లపై దృష్టి కేంద్రీకరించింది. కొత్త పాలసీదారులు, అధిక ఆదాయం కలిగిన యువతను లక్ష్యంగా చేసుకుందని శర్మ తన రిపోర్టులో పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Suresh 103 Views రిస్క్‌ తక్కువనే షేర్ల విభజన ప్రతిపాదనలు! ముంబై, అక్టోబరు 1: స్టాక్‌మార్కెట్లు భారీ స్థాయిలో నడుస్తున్నపుడు అత్యధికశాతం షేర్లు లాభాలతో దౌడు తీస్తున్నాయి. దీనితో షేర్లధరలు కొండెక్కుతా యి. ఇన్వెస్టర్లకు అక్కరకురానివిగా మారుతుంటా యి. దీనివల్లపెట్టుబడులు కూడా అంతంత మాత్రం గానే ఉంటాయి. ఈవిధానం నుంచి మార్చేందుకు ఎక్కువశాతం కంపెనీల ప్రమోటర్లు బోనస్‌షేర్లజారీ లేదా షేర్ల విభజనను ప్రకటిస్తారు. కంపెనీపై ఎలాంటి ప్రభావం పడకుండానే షేరుధర దిగి వస్తుంది. అంతేకాకుండా షేర్లసంఖ్య కూడా పెరిగి మరిన్ని షేర్లు అందుబాటులోనికి వస్తాయి. వాటా దారులకు మేలుచేకూర్చే చర్యలే కావడంతో ఇందు కు అభ్యంతరాలు కూడా పెద్దగా ఉండవు. అందు వల్లనే ఇటీవలి మారుతిసుజుకి వాటాదారులు కూడా షేర్ల విభజనకు డిమాండ్‌చేసారు. ఈ ఏడాది మార్చి నుంచి మారుతి 74శాతం ముందుకు దూకింది. రూ.5537 రూపాయలకు చేరింది. గతవారంలోనే 5630వద్ద నమోదయింది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలో ఇప్పటికే 45 కంపెనీలు షేర్ల విభజనను చేపట్టాయంటే రిస్క్‌ తక్కువన్న భావనతోనే ముం దుకు వస్తున్నట్లు తెలుస్తోంది. కెపిఆర్‌మిల్‌, క్యాప్రి గ్లోబల్‌, కెఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఇదేబాటలో ఉన్నా యి. గతఏడాది ఆరునెలల్లోనే 48కంపెనీలు గరిష్టం గా షేర్ల విభజనను చేపట్టాయి. అత్యంత పనితీరును చూపిస్తున్న బజాజ్‌ఫైనాన్స్‌ షేరుధర 593గా ఉంది. 90శాతం దూసుకువెళ్లి తాజాగా 1106కు చేరింది. కంపెనీ యాజమాన్యం రూ.10 ముఖవిలువ ఉన్న షేరును రూ.రెండు ముఖవిలువ ఉన్న ఐదుషేర్లుగా విభజించేందుకు నిర్ణయించింది. ఒక్కోషేరుకు మరో షేరును ఉచితంగా జారీచేయాలని నిర్ణయించింది. కేవలం రెండునెలల్లోనే దేశంలో 27 కంపెనీలు షేర్ల విభజనకు ముందుకువచ్చాయి. గ్రాసిమ్‌, 8కెమైల్స్‌, కరూర్‌వైశ్యా తదితర బ్యాంకులున్నాయి. 2015 కేలం డర్‌ సంవత్సరంలో 68 కంపెనీలు షేర్ల ను విభజిస్తే 2016లో 65 కంపెనీలు షేర్ల విభజన చేపట్టాయి. ==============
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV యాక్టివా '5జీ' కూడా వచ్చేసిందోచ్...! హోండా యాక్టివా 5జి కొత్త మోడల్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టింది. దీని ప్రారంభ ధర రూ.52,460గా ఉంది. హైదరాబాద్‌లోని ఎక్స్‌ షోరూంలో.. స్టాండర్డ్‌ మోడల్‌ ధర రూ.54,096.. డీలక్స్‌ మోడల్‌ ధర రూ.55,961గా ఉంది. TNN | Updated: Mar 17, 2018, 05:47PM IST హోండా యాక్టివా 5 జి కొత్త మోడల్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టింది. దీని ప్రారంభ ధర రూ.52,460గా ఉంది. హైదరాబాద్‌లోని ఎక్స్‌ షోరూంలో.. స్టాండర్డ్‌ మోడల్‌ ధర రూ.54,096.. డీలక్స్‌ మోడల్‌ ధర రూ.55,961గా ఉంది. గత మోడల్‌తో పోలిస్తే కొత్త యాక్టివాలో అనేక మార్పులు చేశారు. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా హోండా తన యాక్టివా 5జీలో ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌, కొత్త స్మార్ట్ డిజిటల్‌, అనలాగ్‌ స్పీడ్‌ ఇండికేటర్‌, ముందు వైపు సీట్‌ వద్ద చిన్న బ్యాగు తగిలించుకునేలా మార్పులు చేసింది. కొత్త 4 ఇన్‌ 1 లాక్‌ సిస్టమ్‌ ద్వారా సీట్‌ ఓపెనింగ్‌ స్విచ్‌ను ఏర్పాటు చేసింది. ఇక సీటు కింద అరలో మొబైల్‌ ఛార్జింగ్‌ పోర్టును అందిస్తోంది. మొత్తం మీద యాక్టివా 5జీ బాడీని గత వెర్షన్‌తో పోలిస్తే ఇంచుమించు దగ్గరిగా ఉన్నప్పటికీ కొన్ని మార్పులు చేశారు. యాక్టివా గత మోడల్‌లాగే ఆరు రంగులతో పాటు కొత్తగా మెటాలిక్‌ బ్లూ, మెరిసే ఎరుపు రంగుల్లోనూ 5జీ మోడల్‌ లభించనుంది.
1entertainment
స్పైడర్ కు 150కోట్లు వచ్చినా బయ్యర్లకు నష్టాలే...షాకింగ్ ఫిగర్ Highlights దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన స్పైడర్ మహేష్,మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పైడర్ చిత్రం ఈ మూవీకి 150 కోట్ల గ్రాస్, అయినా బయ్యర్లకు భారీ నష్టాలే మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'స్పైడర్' మూవీ రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో స్పైడర్ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా అనుకున్నంతగా నెంబర్స్ నమోదు చేసుకోలేకపోతోంది.   అయితే స్పైడర్ చిత్రం తాజాగా వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 150 కోట్లను క్రాస్ అయినట్లు నిర్మాత ఠాగూర్ మధు అఫీషియల్‌గా ప్రకటించారు. బాక్సాఫీసు వద్ద 12 రోజుల్లోనే ఈ చిత్రం భారీ మొత్తం వసూలు ననమోదు చేసిందని, ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేయడం ఆనందంగా ఉందని, ఇంత భారీ కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన ప్రేక్షకులకు, మహేష్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు నిర్మాత ఠాగూర్ మధు ప్రకటించారు.   స్పైడర్ మూవీ మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది. మహేష్ ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన చిత్రం కూడా ఇదే. సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 51 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 72 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్కును అందుకుంది. నెగెటివ్ టాక్ వచ్చినా.. మహేష్ బాబు సినిమాలపై ఫ్యామిలీ ప్రేక్షకులకు ఉన్న ఆసక్తే ఇంత భారీ కలెక్షన్ రావడానికి కారణమైంది.    ‘స్పైడర్' మూవీ ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌ లోనే 1 మిలియన్‌ డాలర్లకుపైగా కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. సినిమా రూ. 150 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడానికి కారణం కేవలం మహేష్ బాబే అని అంటున్నారు. ఆయనకు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ వల్లే ఇది సాధ్యమైందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినా... స్పైడర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వచ్చే పరిస్థితి మాత్రం లేదని అంటున్నారు. సినిమాకు భారీ బడ్జెట్ ఖర్చు చేయడమే దీనికి కారణంగా చెప్తున్నారు. Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
Oct 03,2018 వచ్చే ఏడాదికి లాభాల్లోకి: పీఎన్‌బీ తిరువనంతపురం: వచ్చే ఆర్థిక సంవత్సరానికి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) తిరిగి లాభాలను నమోదు చేసే అవకాశం ఉందని ఆ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ మెహతా ఆశాభావం వ్యక్తంచేశారు. నీరవ్‌ మోదీ కుంభకోణం ఇక అయిపోయిన అంశమని, సంస్థ మళ్లీ ప్రతికూలతలను ఎదుర్కొంటూనే నిలదొక్కుకోని లాభాల బాటలోకి వెళ్లనుందని ఆయన తెలిపారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పీఎన్‌బీలో సుమారు రూ.14వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఎన్‌బీ ఈ ఏడాది భారీగా నష్టపోయింది. కాగా బ్యాంకు తీసుకుంటున్న చర్యల కారణంగా తిరిగి పుంజుకుంటోందని, 2019 ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలు నమోదయ్యే అవకాశం ఉందని మెహతా తెలిపారు. వరదలతో అతలాకుతలమైన కేరళకు సహాయం అందించేందుకు మెహతా రూ.5 కోట్లను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 112 Views హైదరాబాద్‌ : ఫిక్కీ ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ మండలి కొత్త కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. ప్రస్తుత ఛైర్మన్‌ఫిక్కీ అధ్యక్షురాలు అపోలో జాయిం ట్‌ ఎండి సంగీతారెడ్డి కొత్త కార్యవర్గానికి బాధ్య తలు అప్పగించారు. ఫిక్కీ తెలంగాణ అధ్యక్షులుగా దేవేంద్రసురానా, ఎపి అధ్యక్షునిగా ఎం ప్రభాకరరావులు బాధ్యతలు స్వీకరించారు. ఎన్‌ఎస్‌ఎల్‌గ్రూప్‌ ఛైర్మన్‌గా ఉన్న ప్రభాకరరావు ఆరువేల కోట్ల టర్నోవర్‌ గ్రూప్‌కు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ గ్రూప్‌ త్వరలోనే ఐదుమిలియన్‌ చదరపు అడుగుల ఐటిపార్కులు, సెజ్‌ లను బెంగళూరు, హైదరాబాద్‌లలో అభివృద్ధిచేయడం జరిగిందన్నారు. ఆయన జాతీయ విత్తన సంఘం అధ్యక్షుడు, ఫిక్కీవ్యవసాయ కమిటీకి కూడా అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఎంపికి ఫిక్కీ బాధ్యతలు చేపట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎపిలో వివిధ రంగాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఇక తెలంగాణ ఫిక్కీ అధ్యక్షునిగా వచ్చిన దేవేంద్రసురానా భాగ్యనగర్‌ ఇండియా లిమిటెడ్‌కు ఎండి, సురానావెంచర్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఫిక్కీ తెలంగాణ, ఎపి స్టేట్‌కౌన్సిల్‌కు కోచైర్‌గా ఉన్నారు. పారిశ్రామిక కుటుంబంనుంచే వచ్చిన సురానా గతంలో ఫ్యాప్సీ అధ్యక్షునిగా కూడా పని చేశారు. విధాన మార్పుకోసం పారిశ్రామిక గళం అన్న దృష్టికోణాన్ని సాధించడంలో ప్రభుత్వం, పరిశ్రమ, మీడియా పూర్తి సహాయ సహకారాలుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఐటి, ఉత్పత్తిరంగం, ఇంజినీరింగ్‌, పునరుత్పత్తి విద్యుత్‌, వ్యవసాయ ఆహారశుద్ధి, ఎంఎస్‌ఎంఇ, ఇన్‌ఫ్రా, ఫార్మా, పర్యాటకరంగాల్లో అభివృద్ధిచేయాలని ఫిక్కీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ పరంగా వ్యవసాయ రంగం, ఆహార శుద్ధిరంగం, ఫార్మా, కెమికల్స్‌, రక్షణరంగం, రవాణా, గోదాముల వ్యవస్థను సిద్ధంచేయాలని చూస్తోంది. రెండు కొత్త రాష్ట్రాల్లో అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని ఆయా రంగాలకు పెట్టబడులను విస్తారంగా రప్పించేందుకు కృషిచేయాల్సిన బాధ్యత ఫిక్కీ వంటి పారిశ్రామిక మండళ్లపైనే ఉందని కొత్త కార్యవర్గం అభిప్రాయపడింది. ఫిక్కీ ఛైర్మన్‌గా సంగీతారెడ్డి చేసిన సేవలను కొత్త కార్యవర్గం అభినందించింది. రెండు రాష్ట్రాల్లో పారిశ్రామి కాభివృద్ధి దిశగా ఫిక్కీ కృషిచేస్తుందని వెల్లడించారు.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ​ ధావన్ ఫిట్ కానీ.. కోహ్లి ఒప్పుకోవాలి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం నుంచి కోలుకుని ఫిటెనెస్ సాధించాడా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేప్ టౌన్ వేదికగా TNN | Updated: Jan 3, 2018, 03:45PM IST ​ ధావన్ ఫిట్ కానీ.. కోహ్లి ఒప్పుకోవాలి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం నుంచి కోలుకుని ఫిటెనెస్ సాధించాడా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేప్ టౌన్ వేదికగా శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌కి భారత్ సిద్ధమవుతోంది. అయితే.. ఓపెనర్ శిఖర్ ధావన్‌‌ చీలమండలానికి గాయమైందని అతను తొలి టెస్టు ఆడటం అనుమానమే అంటూ గత వారం వార్తలు వచ్చాయి. అతని స్థానంలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కి టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వనున్నట్లు కూడా తెలిసింది. కానీ.. గాయం నుంచి కోలుకున్న ధావన్.. బుధవారం ప్రాక్టీస్ సెషన్‌లో ఉత్సాహంగా కనిపిస్తూ చాలాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ‘శిఖర్ ధావన్ నెట్స్‌లో ఈ రోజు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతను ఏమీ అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించలేదు. ధావన్ చాలా ఉత్సాహంగా అన్ని షాట్లు ఆడుతూ కనిపించాడు. అయితే.. తొలి టెస్టు తుది జట్టు ఎంపిక నిర్ణయం పూర్తిగా కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రిదే’ అని టీమిండియా మేనేజ్‌మెంట్ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో భారీ స్కోర్లు సాధించిన ధావన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే.. గాయం నుంచి కోలుకున్న ధావన్‌కి కోహ్లి అవకాశం ఇస్తాడా..? లేదా విశ్రాంతి పేరుతో రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేస్తాడో శుక్రవారమే తేలనుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 16, Oct 2018, 9:14 PM IST Highlights రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంచన: ముని 2 ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.  రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంచన: ముని 2 ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. బయ్యర్స్ కు కాసుల వర్షాన్ని కురిపించింది. ఇకపోతే ఆ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  అయితే కథానాయకుడిగా అక్షయ్ కుమార్ కనిపించనున్నట్లు సమాచారం. సౌత్ సినిమాలను అప్పుడపుడు రీమేక్ చేసే అక్షయ్ మంచి హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు హారర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాంచన సినిమాలో రాఘవ నట విశ్వరూపం చూపించాడు. ఆ స్థాయిలో అక్షయ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది.  కాంచన సినిమాలో శరత్ బాబు చేసిన హిజ్రా పాత్ర కూడా ప్రధానమైంది. అప్పట్లో ఆయన ఆ పాత్ర చేస్తున్నారు అనగానే ఏ మాత్రం సెట్ అవ్వదని విమర్శలు వచ్చాయి. కానీ లారెన్స్ పట్టుబట్టి శరత్ బాబును ఆ పాత్ర ను ఛాలెంజింగ్ గా చేయించారు. సినిమా రిలీజ్ అనంతరం అందరికి ఆ పాత్రే ఎక్కువగా హార్ట్ ని టచ్ చేసింది. మరి ఇప్పుడు బాలీవుడ్ లో ఆ పాత్రను ఎవరు చేస్తారో చూడాలి. Last Updated 16, Oct 2018, 9:14 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV చివరి టీ20లో ఉత్కంఠ రేపిన మూడు ఓవర్లు..! భారత్, దక్షిణాఫ్రికా మధ్య శనివారం రాత్రి మూడో టీ20 మ్యాచ్‌ ఉత్కంఠగా ముగిసింది. 173 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన TNN | Updated: Feb 25, 2018, 12:14PM IST చివరి టీ20లో ఉత్కంఠ రేపిన మూడు ఓవర్లు..! భారత్, దక్షిణాఫ్రికా మధ్య శనివారం రాత్రి మూడో టీ20 మ్యాచ్‌ ఉత్కంఠగా ముగిసింది. 173 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా విజయానికి చివరి మూడు ఓవర్లలో 53 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో.. భారత్‌ జట్టుకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తుండగా.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన శార్ధూల్ ఠాకూర్ 18 పరుగులు సమర్పించుకుని మ్యాచ్‌ని ఉత్కంఠగా మార్చేశాడు. దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మెన్ జాంకర్‌ ఆ ఓవర్‌లో ఒక సిక్స్, మూడు ఫోర్లు బాదేయడంతో సమీకరణాలు 12 బంతుల్లో 35 పరుగులుగా మారిపోయాయి. Visit Site Recommended byColombia ఈ దశలో 19వ ఓవర్‌ కోసం డెత్‌ఓవర్ స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా చేతికి తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ బంతినివ్వగా.. అతని బౌలింగ్‌లోనూ జాంకర్ ఒక సిక్స్ బాదేయగా.. బెహార్డీన్ ఒక ఫోర్ కొట్టేశాడు. దీంతో ఆ ఓవర్‌లోనూ దక్షిణాఫ్రికా 16 పరుగులు పిండుకుంది. సమీకరణం 6 బంతుల్లో 19 పరుగులుగా మారిపోయి.. ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అయితే.. చివరి ఓవర్ బౌలింగ్‌కి వచ్చిన భువనేశ్వర్ కుమార్ .. సగం ఓవర్ వరకూ కాస్తా ఒత్తిడిలో కనిపించినా.. 11 పరుగులు మాత్రమే ఇచ్చి చివరి బంతికి జాంకర్‌ని ఔట్ చేయడంతో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. అంతకముందు ఓపెనర్ శిఖర్ ధావన్ (47: 40 బంతుల్లో 3x4), సురేశ్ రైనా (43: 27 బంతుల్లో 5x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV 2.0లో ఆ పాత్ర కోసం కమల్‌‌హాసన్‌ను అడిగా: శంకర్ దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘2.0’ సినిమాలోని కీలక పాత్రను కమల్ ఎందుకు వదులుకున్నారో తెలిపిన దర్శకుడు శంకర్. Samayam Telugu | Updated: Nov 2, 2018, 10:39AM IST 2.0లో ఆ పాత్ర కోసం కమల్‌‌హాసన్‌ను అడిగా: శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘2.0’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ప్రతి నాయకుడుగా అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పాత్ర కోసం ముందుగా తాను ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌ను ఎంపిక చేయాలని భావించామని, ఈ పాత్ర పోషించడానికి ఆయన కూడా ఆసక్తి చూపారన్నారు. దీంతో ప్రతినాయకుడుగా ఆర్నాల్డ్ ఖారారయ్యారనే భావించానని, అనుకోకుండా ఆయన ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో మళ్లీ ప్రతినాయకుడి పాత్ర కోసం అన్వేషించానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ భారీ చిత్రంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కలిగిందని, ఈ విషయాన్ని ఆయనతో చెప్పగా.. తనతో ‘భారతీయుడు 2’ సినిమా చేయడానికే ఆయన ఎక్కువ ఆసక్తి చూపారన్నారు. దీంతో తాను బాలీవుడ్ మీరో అక్షయ్ కుమార్‌ను ప్రతినాయకుడిగా ఎంపిక చేసుకున్నానని తెలిపారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
internet vaartha 170 Views న్యూఢిల్లీ : టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ధోనీ జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ఎంఎస్‌ ధోనీ ద అన్‌ టోల్ట్‌ లవ్‌ స్టోరీ. కాగా ధోనీ గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ చిత్రంలో ఉన్నాయని చిత్ర బృందం చెబుతున్న విషయం తెలిసిందే. ధోనీ తొలి ప్రేమను కూడా ప్రత్యేకంగా తెరకెక్కించినట్లు సమాచారం. టీమిండియాలోకి ధోనీ రాకముందు రాంచీలో ప్రియాంక ఝూ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడట. కానీ దురదృష్టం కొద్దీ ఒక ప్రమాదంలో ప్రియాంక చనిపోయింది. కాగా ఈ సంఘటనతో షాక్‌కు గురైన ధోనీ రాంచీలో ఉండలేకపోయాడు.అప్పటికే టీమిండియా నుంచి ధోనీకి పిలుపు రావడంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. ప్రియాంక సంఘటన ఒక సంవత్సరం పాటు ధోనీని వెంటాడటం, కాల క్రమంలో దాని నుంచి బయటపడటం జరిగింది. ఆ తరువాత తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షి సింగ్‌ ధోనీ పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే తన వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పేందుకు ఎక్కువగా ఇష్టపడని ధోనీ తొలి ప్రేమ ఈ చిత్రం ద్వారా వెలుగుచూడ నుండటం గమనార్హం.
2sports
Suresh 130 Views తలకు బంతి తగలడంతో కుప్పకూలిన ప్రజ్ఞాన్‌ ఓజా నోయిడా: టీమిండియా స్పిన్నర్‌ ప్రజ్ఞన్‌ ఓజా తలకు బంతి తగలడంతో మైదానంలో కుప్పకూలిపోయాడు.వివరాల్లోకి వెళితే దులీప్‌ ట్రోఫీలో భాగంగా గ్రేటర్‌ నోయిడాలో ఇండియా గ్రీన్‌, ఇండియా బ్లూ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది.ఇండియా గ్రీన్‌ జట్టు తరపున ఓజా ఫీల్డింగ్‌ చేస్తున్న సందర్భంలో అతని తలకు వెనుక భాగంలో బంతి తగిలింది.ఇండియా గ్రీన్‌ జట్టు బౌలర్‌ జలజ్‌ సక్సెనా వేసిన బంతిని ఇండియా బ్లూ జట్టు బ్యాట్స్‌మెన్‌ పంకజ్‌ సింగ్‌ మిడ్‌ ఆన్‌ మీదుగా షాట్‌ ఆడాడు.ఫీల్డింగ్‌ చేస్తున్న ఓజా వైపునకు బంతి దూసుకొచ్చింది. దీంతో ఓజా వెనక్కి తిరగ్గా బంతి మెడ వెనుక భాగాన్ని బలంగా తాకింది.కొద్ది సమయం పాటు కోమాలోకి వెళ్లినట్లు కనిపించాడు.అంతే మిగతా ఆటగాళ్లందరు షాక్‌కుగురై అతన్ని చుట్టు ముట్టేశారు. వెంటనే ఇండియా గ్రీన్‌ హెడ్‌ కోచ్‌ రమన్‌ సహాయంతో ఓజాను ఆసుపత్రికి తరలించారు. అక్కడ తనకు ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ పరీక్షలు చేశారు.కాగా రిపోర్టులో అంత ప్రమాదం లేదని రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ సమాచారం తెలుసుకున్న బిసిసిఐ అధికారులు ఓజాకు పోన్‌ చేసి పరామర్శించారు.అయితే ప్రజ్ఞన్‌ ఓజా పూర్తిగా కోలుకునే వరకు వైద్య పర్యవేక్షణలోనే ఉంచనున్నారు.
2sports
Jun 23,2016 ఎల్‌ఐసీ నుంచి 'మౌలిక' నిధి                న్యూఢిల్లీ: మౌలిక రంగ కంపెనీలు సులభంగా రుణాలు పొందడానికి వీలుగా 'భారతీయ జీవిత బీమా సంస్థ' (ఎల్‌ఐసీ) ప్రత్యేక 'రుణ వితరణ వద్ధి నిధి'ని ఏర్పాటు చేయనుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిధిని త్వరలోనే అందుబాటులోకి తెస్తూ ఎల్‌ఐసీ ఒక ప్రకటన చేయనుందని ఆయన వివరించారు. కాగా ఇది అందుబాటులోకి వస్తే మౌలిక వసతుల కంపెనీల వారు చౌక వడ్డీతో అప్పులు పొందవచ్చని తెలిపారు. సదరు కంపెనీలు ఈ నిధిని వినియోగించుకుంటే రేటింగ్‌లో (-) ఏఏఏ స్థాయిలో ఉన్న సంస్థల వారు ఏఏఏ స్థాయికి దీటుగానే రుణాలు తీసుకోనే వెసులుబాటు లభిస్తుందని తెలిపారు. క్రితం బడ్జెట్‌లో ఇదే విషయాన్ని మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. దీంతో మౌలిక కంపెనీలు ఎదుర్కొంటున్న రుణ సమస్య తీరనుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
చిరంజీవి బట్టలు, చెప్పుల ఖర్చు రూ.5కోట్లు Highlights చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవితకథ  ఆధారంగా తెరకెక్కుతున్న సైరా సైరా సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ఖైదీ నెం.150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దాని తర్వాత చిరు నటిస్తున్న తాజా చిత్రం సైరా నర్సింహారెడ్డి. రాయలసీమకు చెందిన స్వాత్రంత్య సమరయోధుడు ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.   ఈ సినిమాని తమ సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు.  కొణిదెల ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చరణ్ ఒకవైపు తన సినిమా షూటింగ్ లలో పల్గొంటూనే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి  పర్యవేక్షిస్తున్నారట.   ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో చిరంజీవి వాడబోతున్న చెప్పులు - క్యాస్ట్యూమ్స్ కోసం భారీగా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి ఇద్దురు డిజైనర్లుని రప్పించి ఈ సినిమాలో ఉండే సన్నివేశాలకు తగ్గట్లుగా కాస్ట్యూమ్స్ వాటికి సరిపడా చెప్పులు రెడీ చెయిస్తున్నారట. ఇలా డిజైన్ చేయించినందుకు ఆ బాలీవుడ్ డిజైనర్లు దాదాపు అయిదుకోట్ల రూపాయులు ఛార్జ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో కేవలం చెప్పులు - బట్టలు కోసమే ఇంత భారీగా ఖర్చు చేస్తున్నారంటే సినిమా ఓ రేంజ్ లో ఉండి ఉంటుందని ఫిల్మ్ నగర్ లో ఊహాగానాలు మొదలయ్యాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తోండగా.. నయనతార, ప్రగ్యా జైశ్వాల్  హీరోయిన్లుగా నటిస్తున్నారు. Last Updated 25, Mar 2018, 11:56 PM IST
0business
జియో దెబ్బకు ఎయిర్‌టెల్‌ కుదేలు! - సగానికిపైగా పడిపోయిన లాభాలు - రూ.503.7 కోట్లకే పరిమితమైన లాభం న్యూఢిల్లీ: మార్కెట్లోకి రిలయన్స్‌ జియో రాకతో దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ లాభాలు కుదేలయ్యాయి. కొత్త టెలికాం సంస్థ రాకతో పాటు పోటిలో నిలదొక్కుకునేందుకు ఆ సంస్థ భారీగా ఛార్జీలను తగ్గించడం వంటి చర్యలతో డిసెంబరు త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌ లాభాలు సగానికి పైగా (54%) కుంగాయి. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలానికి సంస్థ నికర లాభం రూ.503.7 కోట్లుగా నిలిచినట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో సంస్ధ లాభం రూ.1,108.1 కోట్లుగా నమోదైనట్టుగా సంస్థ వివరించింది. కొత్త పోటీదారు మార్కెట్‌ దోపిడి ధరలు ప్రకటించడం వల్ల అల్లకల్లోల పరిస్థితి ఏర్పడి ప్రతికూల ఆర్థిక ఫలితాలు నమోదైనట్టుగా భారతీ ఎయిర్‌టెల్‌ భారత్‌, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్‌ విఠల్‌ తెలిపారు. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సంస్థ సమీకృత ఆదాయం 3 శాతం మేర తగ్గి రూ.24,103.4 కోట్ల నుంచి రూ.23,363 కోట్లకు కుంగింది. కొత్త టెలికాం సంస్థ అనుచిత పథకాల కారణంగా టెలికాం రంగంలోని సంస్థల లాభాలపై తీవ్ర ప్రభావం నెలకొందని ఆయన అన్నారు. ఇది టెలికాం రంగం ఆరోగ్య పరిస్థితిపై పెను ప్రభావం చూపుతోందని వివరించారు. ఇదే కాలంలో సంస్థ మొబైల్‌ డేటా రెవెన్యూ గత ఏడాది మాదిరిగానే రూ.4,049 కోట్ల స్థాయి వద్దే నమైదనట్టు విఠల్‌ వివరించారు. ఇదే సమయంలో ఎయిర్‌టెల్‌ రెవెన్యూ మార్కెట్‌ షేరు 33 శాతం మేర పెరిగి జీవతకాల అత్యున్నత స్థితిని తాకినట్టుగా తెలిపారు. ఎయిర్‌టెల్‌ ఇండియా విభాగం ఆదాయంలో 1.8 శాతం, ఆఫ్రికాలో ఆదాయం 6 శాతం మేర పెరిగినట్టుగా వివరిం చారు. డిసెంబరు ముగింపు నాటికి ఎయిర్‌టెల్‌ రుణ భారం 24 శాతం పెరిగింది. భారతీ ఎయిర్‌టెల్‌ స్టాక్‌ మంగళ వారం 0.95 శాతం మేర కుంగి రూ.3,16.35 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sumalatha 150 Views Ashok Leyland , profit-drops Ashok Leyland న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ ముగింపు త్రైమాసికంలో అశోక్ లేలాండ్ రూ.230 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.422 కోట్ల నికర లాభం వచ్చిందని కంపెనీ వెల్లడించింది. అంటే లాభం 45 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.6,263 కోట్ల నుంచి రూ.5,684 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్ ధీరజ్ జి. హిందుజా తెలిపారు. పూర్తి ఏడాది పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో రూ.33,325 కోట్ల ఆదాయం, రూ.2,195 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొన్నారు. వాహన పరిశ్రమలో అమ్మకాలు 17 శాతం తగ్గగా, తమ కంపెనీ మార్కెట్ వాటా 4 శాతం పెరిగిందని ధీరజ్ వెల్లడించారు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/national/
1entertainment
ind vs sa 1st t20: dharamshala weather forecast today Dharamshala T20కి వర్షం ముప్పు.. మ్యాచ్ డౌట్ ధర్మశాల స్టేడియం పరిసరాల్లో శనివారం భారీగా వర్షం పడింది. ఈరోజు కూడా ఉదయం నుంచి చిరుజల్లు కురుస్తుండటంతో.. మైదానాన్ని కవర్లతో సిబ్బంది కప్పి ఉంచారు. ఇప్పటికే ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారినట్లు తెలుస్తోంది. Samayam Telugu | Updated: Sep 15, 2019, 04:09PM IST హైలైట్స్ భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు రాత్రి 7 గంటలకి ధర్మశాలలో తొలి టీ20 గత రెండు రోజుల నుంచి ధర్మశాల స్టేడియం పరిసరాల్లో వర్షం ఈరోజు కూడా చిరుజల్లులు.. మైదానాన్ని కవర్లతో కప్పివేత స్టేడియం డ్రైనేజీ సిస్టమ్‌ని ఇటీవల ఆధునీకరించామంటున్న హెచ్‌‌పీసీఏ భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు రాత్రి జరగనున్న తొలి టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. శనివారం నుంచి స్టేడియం పరిసరాల్లో వర్షం పడుతుండగా.. మైదానాన్ని కవర్లతో సిబ్బంది కప్పి ఉంచారు. ఈరోజు కూడా ఉరుములతో కూడిన వర్షం వచ్చే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలపడంతో.. మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. Read More: టీమిండియా ఆ బలహీనతే.. సఫారీలకి బలం మ్యాచ్‌కి అనుగుణంగా ప్రస్తుతం మైదానాన్ని పూర్తిగా సిద్ధం చేయాలంటే సాయంత్రం ఐదు గంటలకి వర్షం పూర్తిగా తగ్గిపోవాలని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్‌ (హెచ్‌‌పీసీఏ) సిబ్బంది చెప్తున్నారు. ఒకవేళ ఐదు గంటల తర్వాత కూడా వర్షం పడినా.. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్‌ని ఆడించేందుకు తాము ప్రయత్నిస్తానమని వెల్లడించారు. స్టేడియం డ్రైనేజ్‌ సిస్టమ్‌ని ఇటీవల ఆధునీకరించిన నేపథ్యంలో.. వర్షం తగ్గుముఖం పట్టిన నిమిషాల వ్యవధిలోనే మైదానాన్ని సిద్ధం చేయనున్నట్లు హెచ్‌సీఏ చెప్తోంది.
2sports
పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ First Published 6, Nov 2017, 8:25 PM IST పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ పూజ కుమార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ Recent Stories
0business
Hyderabad, First Published 7, Sep 2018, 2:48 PM IST Highlights సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంటుంది. దాన్ని బట్టే నటీనటుల రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. 'RX100' చిత్రంతో విజయం అందుకున్న హీరో కార్తికేయ ఆ సక్సెస్ ను ఇప్పుడు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు.  సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంటుంది. దాన్ని బట్టే నటీనటుల రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. 'RX100' చిత్రంతో విజయం అందుకున్న హీరో కార్తికేయ ఆ సక్సెస్ ను ఇప్పుడు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. అజయ్ భూపతి RX100 చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ ఇద్దరికీ ఈ సినిమా తరువాత ఆఫర్లు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరూ కూడా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. తాజాగా హీరో కార్తికేయ తనతో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలను కోటి రూపాయల పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క సినిమా సక్సెస్ తోనే కోటి అడగడంతో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. అతడికి రెమ్యునరేషన్ గా అంత మొత్తం ఇస్తే సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే ఆలోచనతో కొందరు నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తికేయ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న సినిమాలో హీరోగా నటించనున్నాడు.  Last Updated 9, Sep 2018, 1:31 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV పోలీసులకి సినిమా చూపిస్తానంటున్న వర్మ! ఒకే ఒక్క క్రిమినల్ని 1200 మంది పోలీసులు 15 సంవత్సరాలు పాటు ఎందుకు పట్టుకోలేకపోయారనేది భారత దేశపు క్రైమ్ చరిత్రలోనే ఒక మరిచిపోలేని చాప్టర్. | Updated: Dec 24, 2015, 06:30PM IST ఒకే ఒక్క క్రిమినల్ని 1200 మంది పోలీసులు 15 సంవత్సరాలు పాటు ఎందుకు పట్టుకోలేకపోయారనేది భారత దేశపు నేర చరిత్రలోనే ఒక మరిచిపోలేని చాప్టర్. వీరప్పన్‌ని పట్టుకోవటానికి ట్రై చేసి పోలిస్ డిపార్టుమెంటులోని కొన్ని వందలమంది ఎన్నో రకాలుగా తమ ప్రాణాలను కోల్పోయారు. కాని చివరికి ఒక పోలిస్ ఆఫీసరే కనీ వినీ ఎరుగని ఒక ఇంటలిజెన్స్ ఆపరేషన్లో వీరప్పన్‌ని చంపేశారు. వీరప్పన్ క్రైమ్ స్టోరీ - పోలీసుల హంట్ ఆపరేషన్ నేపధ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జనవరి 1 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే అందరికంటే ముందు మొట్టమొదటిగా ' కిల్లింగ్ వీరప్పన్ 'ని పోలిస్ డిపార్టుమెంటుకి ఒక స్పెషల్ షో వేసి చూపించాలని నిర్ణయించుకున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV నిషిత్‌‌ని బలిగొన్న కారు పవన్‌ కల్యాణ్‌ది కాదట ఈ ప్రమాదం జరిగిన సమయంలో నిషిత్ డ్రైవ్ చేస్తున్న కారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి చెందినదని, గతేడాదే పవన్.... | Updated: May 11, 2017, 07:19PM IST బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో నిషిత్ డ్రైవ్ చేస్తున్న కారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి చెందినదని, గతేడాదే పవన్ ఆ కారుని నిషిత్‌కి అమ్మేశాడని సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ మెర్సిడెస్ బెంజ్ కారు అమ్ముతున్నారని తెలిసి ఆయనకి వీరాభిమాని అయిన నిషిత్ తన తండ్రి నారాయణతో ఎంతో పట్టుపట్టి మరీ ఆ కారుని కొనిపించుకున్నారనేది ఆ ప్రచారం సారాంశం. — JanaSena Party (@JanaSenaParty) May 11, 2017 తాను ఈ కారుని అమ్మను మొర్రో అని పవన్ కల్యాణ్ ఎంత మొత్తుకున్నా వినకుండా తనయుడి కోరిక మేరకు నారాయణ సైతం పవన్ వద్ద చొరవ తీసుకుని మరీ ఆ కారుని కొడుక్కి కొనిచ్చారట అని సోషల్ మీడియాలో నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. ఇదే విషయమై గురువారం సాయంత్రం పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు అక్కడున్న పాత్రికేయులు.
0business
sandhya 222 Views Internet banking , mobile banking , SBI , SBI app SBI ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ ఖాతాదారులకు శుభవార్త తెలియజేసింది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బిఐ యాప్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా లావాదేవీలు జరిపే ఖాతాదారులకు ఛార్జీల నుంచి ఊరట లభించనుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్ధేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎస్‌బిఐ రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగ ఎండి మాట్లాడుతూ..భారత ప్రభుత్వ విజన్‌లో భాగమైన డిజిటల్‌ ఎకానమీలో భాగమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
1entertainment
San Francisco, First Published 26, Sep 2018, 8:12 AM IST Highlights ప్రముఖ ఫొటో షేరింగ్‌ సర్వీస్‌ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రాం సహ వ్యవస్థాపకులు కెవిన్‌ సిస్ట్రోమ్‌, మైక్‌ క్రెగర్‌ తప్పుకుంటున్నారు. వారిద్దరి నుంచి ఇన్‌స్ట్రాగ్రాంను ఆరేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే ప్రముఖ ఫొటో షేరింగ్‌ సర్వీస్‌ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రాం సహ వ్యవస్థాపకులు కెవిన్‌ సిస్ట్రోమ్‌, మైక్‌ క్రెగర్‌ తప్పుకుంటున్నారు. వారిద్దరి నుంచి ఇన్‌స్ట్రాగ్రాంను ఆరేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రాం సహ వ్యవస్థాపకులు సిస్ట్రోమ్‌, క్రెగర్‌ రాజీనామా చేస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. సంస్థ సీఈఓగా కెవిన్ సిస్ట్రోమ్‌, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మైక్ క్రెగర్‌ ఉన్నారు. కెవిన్ సిస్టోమ్, మైక్ క్రైగర్ తమ పదవుల నుంచి తప్పుకుంటున్న మాట నిజమైనా ఎందుకు రాజీనామా చేస్తున్నారో కారణం తెలియజేయలేదని సమాచారం. వారు కాస్త విరామం కోసమే తప్పుకుంటున్నట్లు మాత్రమే చెప్పారని ఆ వార్తాకథనం పేర్కొంది. దీనిపై ఫేస్‌బుక్‌ను స్పందన కోరగా స్పందించలేదని వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌లో ఇన్‌స్టాగ్రాం తమకు 100 కోట్ల మంది క్రియాశీల వినియోగదారులు ఉన్నట్లు తెలిపింది. అలాగే సరికొత్త లాంగ్‌ ఫామ్‌ వీడియో ఫీచర్‌ను విడుదల చేసింది. ప్రముఖ మెసెజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు జాన్‌ కోయుమ్‌ కూడా ఈ ఏడాది ఆరంభంలో రాజీనామా చేశారు. వాట్సాప్‌నూ ఫేస్‌బుక్‌ 19 బిలియన్‌ డాలర్లకు కొన్న సంగతి తెలిసిందే. అప్పట్లో కోయుమ్‌ కూడా కొంత విరామం తీసుకునేందుకు రాజీనామా చేస్తున్నానని, తన ఆసక్తులు, హాబీలను కొనసాగించేందుకు సమయం కావాలని తన ఫేస్‌బుక్‌ పేజీలో రాశారు. అమెరికా మీడియా మాత్రం కోయుమ్‌ రాజీనామాకు ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటా లీకేజీ వ్యవహారం ఓ కారణం కావచ్చునని  పేర్కొన్నాయి. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతోంది. కొత్త కొత్త ఫీచర్లు రావడం, ఎక్కువ మంది సెలబ్రిటీలు దీన్ని వాడటం ఇన్‌స్టాగ్రామ్‌కు క్రేజీగా మారింది. ఎనిమిదేళ్ల కింద ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫామ్‌ను, ఆరేళ్ల కిందట సోషల్‌ మీడియా దిగ్గజంగా ఉన్న ఫేస్‌బుక్‌ సొంతం చేసుకుంది. అప్పుడే, దాని స్వయం ప్రతిపత్తికి ఏ ఢోకా ఉండదని వాగ్దానం చేసింది. కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ పూర్తిగా తన స్వేచ్ఛ కోల్పోతున్నట్టు తెలుస్తోంది.  తాజాగా ఆ కంపెనీలో నెలకొన్న పరిణామం కూడా ఇదే సూచిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ సహ వ్యవస్థాపకులైన సీఈవో కెవిన్‌ సిస్ట్రోమ్‌, సీటీఓ మైక్‌ క్రెగర్‌ కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించారు. వారిద్దరూ రాజీనామా చేయడం టెక్‌ కంపెనీల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇన్‌స్టాగ్రామ్‌కు, ఫేస్‌బుక్‌కు మధ్య నాయకత్వ విషయంలో విభేదాలు వచ్చినందుకే, వీరు రాజీనామా చేశారని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.  ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొడక్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కెవిన్‌ వైల్‌ కొన్ని రోజుల క్రితమే ఫేస్‌బుక్‌ కొత్త బ్లాక్‌ చైన్‌ టీమ్‌కు బదిలీ అయ్యారు. జుకర్‌బర్గ్‌ ఇన్నర్‌ సర్కిల్‌లోకి వెళ్లిపోయారు. ఈ ఏడాది ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌కు, సిస్ట్రోమ్‌కు పలుమార్లు విభేదాలు వచ్చాయని సంబంధిత వర్గాలు చెప్పాయి.  ‘కెవిన్‌, మైక్‌ అద్భుతమైన ప్రొడక్ట్‌ లీడర్లు. ఇన్‌స్టాగ్రామ్‌ వారి సృజనాత్మక ప్రతిభే. గత ఆరేళ్లలో వారి నుంచి చాలా నేర్చుకున్నాను. చాలా బాగా ఎంజాయ్‌ చేశాం. నేను వారికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నా. తర్వాత ఏం అభిృద్ధి చేయబోతున్నారో చూడాల్సి ఉంది’ అంటూ మార్గ్‌ జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ వ్యవస్థాపకులతో గొడవలు, విభేదాలు ఉన్నట్టు జుకర్‌బర్గ్‌ ఎక్కడా బయటపడలేదు. అదేవిధంగా సిస్ట్రోమ్‌ కూడా స్పందించారు. తమ ఉత్సుకతను, సృజనాత్మకతను మరోసారి వెలికితీయాలని ప్లాన్‌ చేస్తున్నామని అన్నారు. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌ను 715 మిలియన్‌ డాలర్లతో ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. Last Updated 26, Sep 2018, 8:12 AM IST
1entertainment
బిగ్ బాస్2 లో ఎన్టీఆర్ హీరోయిన్! Highlights బిగ్ బాస్ సీజన్ 1 ను హోస్ట్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తనకున్న  బిగ్ బాస్ సీజన్ 1 ను హోస్ట్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తనకున్న సినిమాల కమిట్మెంట్స్ కారణంగా సీజన్ 2 కు వ్యాఖ్యాతగా వ్యవహరించలేకపోతున్నాడు. దీంతో ఆయన స్థానంలోకి నేచురల్ స్టార్ నాని వచ్చి చేరాడు. తన వాక్చాతుర్యంతో నాని ఈ షోని రసవత్తరంగా నడిపిస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఈ షోలో పోటీదారులుగా ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారనే విషయంలో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. తెలుగమ్మాయి తేజస్వి మదివాడ, సింగర్ గీతామాధురి,అలానే ఒకప్పటి హీరో లవర్ బాయ్ తరుణ్ లను పోటీదారులుగా ఎంపిక చేసుకున్నారు. తరుణ్ పేరు గతంలో కొన్ని వివాదాల్లో వినిపించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురితో పాటు ట్రాన్స్ జెండర్ శ్యామల ను కూడా ఈ షోలో పాల్గొనబోతుంది. తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  ఎన్టీఅర్ నటించిన 'స్టూడెంట్ నెం1' సినిమాలో హీరోయిన్ గా నటించిన గజాలాను బిగ్ బాస్ షో కోసం సెలెక్ట్ చేశారని సమాచారం. సినిమాలలో నటించే సమయంలోనే గజాలా పెద్దగా పాపులర్ అవ్వలేదు.అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా ఆమెను తీసుకోవడం చర్చకు దారితీస్తుంది. మరి ఈ షోతో అయినా.. గజాలాకు క్రేజ్ వస్తుందేమో చూడాలి! Last Updated 16, May 2018, 12:29 PM IST
0business
Visit Site Recommended byColombia అలాగే రూ.3 లక్షల కోట్ల కొత్త కరెన్సీని మార్కెట్లోకి ప్రభుత్వం విడుదల చేయనుందని ఆయన పేర్కొన్నారు. రోజూ బ్యాంకుల ద్వారా రూ.25,000 కోట్ల మార్కెట్లోకి వస్తోందని ఆయన తెలిపారు. రూ.1,000, 500 నోట్లను కేంద్రం రద్దుచేయడంతో రూ.2,000 నోట్ల మార్చుకోడానికి ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే కొత్త రూ.500 నోట్లను విడుదల చేస్తామని ఆయన అన్నారు. రూ.1,000 నోట్లపై భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి గాంగ్వార్ వివరించారు. Union minister of state for finance Santosh Kumar Gangwar has said that the government is working to dispense more of the new Rs 500 notes to address the inconvenience people are facing to get change for the Rs 2,000 notes.Gangwar said, "A total of Rs 8 lakh crore in scrapped currency notes has been deposited in banks, out of Rs 14.5 lakh crore in circulation. However, currency notes worth Rs 3 lakh crore have been introduced in the market so far. A gap has been created, but new currency notes worth nearly Rs 25,000 crore are being pumped into the market through banks every day. The matter will be sorted out soon.""The scrapping of both Rs 500 and Rs 1,000 notes is causing inconvenience as people are unable to get change for a Rs 2,000 note. The government is trying to introduce more new notes of the Rs 500 denomination, and the scarcity will be sorted out in a week's time. We will decide in the future how to reintroduce Rs 1,000 notes and in which form."   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
Hyderabad, First Published 10, Aug 2019, 10:00 AM IST Highlights పారిస్-పారిస్ లాంటి సినిమాకు సెన్సార్ సమస్యలు రావడం ఆశ్చర్యంగా ఉంది. పూర్తిగా నాకు తెలీదు కానీ చాలా పెద్ద సమస్యలు వచ్చాయని విన్నాను. హిందీ వెర్షన్ ను యాజ్ ఇటీజ్ తీశాం. అదనంగా ఏదీ పెట్టలేదు. కానీ ఎందుకు సమస్య వచ్చిందో అర్థంకాలేదు. బహుశా తమిళ సెన్సార్ బోర్డు నిబంధనలు అలా ఉన్నాయేమో..అంటూ కాజల్ చెప్పుకొచ్చింది    బాలీవుడ్ లో హిట్ అయిన 'క్వీన్' సినిమాను సౌత్ భాషల్లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్ 'పారిస్ పారిస్'లో కాజల్ హీరోయిన్ గా నటించింది. అయితే అందులో ఉన్న అడల్ట్ కంటెంట్, బూతు పదాల కారణంగా ఏకంగా 25 కట్స్ సూచించింది తమిళనాడు సెన్సార్ బోర్డ్. దీనిపై కాజల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 'పారిస్ పారిస్'  లాంటి సినిమాకి సెన్సార్ సమస్యలు రావడం ఆశ్చర్యంగా ఉందని.. పూర్తిగా తనకు విషయం తెలియదు కానీ చాలా సమస్యలు వచ్చాయని విన్నట్లు చెప్పింది. హిందీ వెర్షన్ ని ఉన్నది ఉన్నట్లు తమిళంలో తీశామని.. కానీ ఎందుకు సమస్య వచ్చిందో అర్ధం కాలేదని.. బహుశా తమిళ సెన్సార్ బోర్డ్ నిబంధనలు అలా ఉన్నాయేమోనని చెప్పుకొచ్చింది. నాలుగు భాషల్లో సినిమాను రీమేక్ చేస్తే.. మూడు భాషల్లో ఎలాంటి సెన్సార్ కట్స్ లేవని.. కేవలం తమిళ వెర్షన్ కే సెన్సార్ కట్స్ ఇచ్చారని.. ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం కావడం లేదని.. ప్రస్తుతం నిర్మాతలు ఆ పని మీదే ఉన్నట్లు.. రివైజింగ్ కమిటీకి వెళ్తున్నట్లు వెల్లడించింది.  కాజల్ ఇలా స్పందించినప్పటికీ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉందనే మాట మాత్రం నిజమే.. సినిమా టీజర్ తోనే షాక్ ఇచ్చింది చిత్రబృందం. కాజల్ వక్షభాగాన్ని మరోనటి పట్టుకోవడం వంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి. అలానే సినిమాలో ఆమె బాత్ రూమ్ లో బట్టలు మార్చుకునే సీన్ కూడా ఉంది. ఇలాంటి సీన్లు మిగతా వెర్షన్స్ లో లేవు. కాబట్టి ఆ సినిమాలకు సెన్సార్ సమస్యలు లేవు. కాజల్ సినిమాకి మాత్రం ఈ  తిప్పలు తప్పేలా లేవు!
0business
internet vaartha 155 Views ముంబై : ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ బయోపిక్‌లో బాలీవుడ్‌ హిరో ఇమ్రాన్‌ హష్మీ నటించనున్నాడు. మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం అజహర్‌ టోనీ డిసౌజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజరుద్దీన్‌ పాత్రను ఇమ్రాన్‌హష్మీ పోషించారు. క్రికెటర్ల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కొందరు పర్వాలేదనగా మరికొందరు బాహాటంగానే విమర్శించారు.ఇమ్రాన్‌ ఈ మధ్యే అభిమానులతో ట్విటర్‌ ద్వారా చాట్‌ చేశాడు. మళ్లీ ఏ క్రికెటర్‌ బయోపిక్‌లో నటించాలనుకుంటున్నారని ఒక అభిమాని ప్రశ్నించగా తొలి టి20 ప్రపంచ కఫ్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిని యువరాజ్‌ జీవిత చిత్రంలో నటించడం తనకెంతో ఇష్టమని ఇమ్రాన్‌ పేర్కొన్నాడు. ధోనీ నేతృత్వంలో భారత్‌ రెండు ప్రపంచ కప్‌ ట్రోఫీలు సాధించడంలో వెన్నెముకగా నిలిచి, క్యాన్సర్‌ పైన విజయం సాధించి, జాతీయ జట్టులోకి వచ్చిన యువరాజ్‌ బయోపిక్‌లో ఇమ్రాన్‌కు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV MS Dhoniతో సరితూగేది ఎవరు..? : సురేశ్ రైనా ధోనీ బ్యాటింగ్‌ స్టైల్‌కి బాగా నప్పే స్థానం ఐదు లేదా ఆరు. తన సుదీర్ఘ క్రికెట్ అనుభవంతో మ్యాచ్‌ గమనాన్ని వేగంగా ధోనీ పసిగట్టగలడు. అలానే క్లిష్ట సమయాల్లోనూ జట్టు ఇన్నింగ్స్‌ను అతను నిర్మించగలడు. -సురేశ్ రైనా Samayam Telugu | Updated: Mar 6, 2019, 05:05PM IST MS Dhoniతో సరితూగేది ఎవరు..? : సురేశ్ రైనా హైలైట్స్ ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోని మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ మొదలు ధోనీని ఐదు లేదా ఆరో స్థానంలో ఆడించాలని సురేశ్ రైనా సూచన మ్యాచ్ గమనాన్ని అంచనా వేయడంలో ధోనీకి తిరుగులేదన్న రైనా మ్యాచ్‌ని గెలుపుగా ముగించడంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో ఎవరూ సరితూగలేరని టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. గత ఏడాది పేలవ ఫామ్‌తో నిరాశపరిచిన ధోనీ కనీసం ఒక్క అర్ధశతకం కూడా సాధించలేకపోవడంతో.. ప్రపంచకప్‌లో అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ.. ఈ ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ అర్ధశతకాలు బాదిన ధోనీ సూపర్‌ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ధోనీ మ్యాచ్ ఫినిషింగ్ అనుభవం ప్రపంచకప్‌లో భారత్ జట్టుకి లాభిస్తుందన్న సురేశ్ రైనా.. అతడ్ని లోయర్ మిడిలార్డర్‌లో ఆడించాలని సూచించాడు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుంది. ‘ధోనీ బ్యాటింగ్‌ స్టైల్‌కి బాగా నప్పే స్థానం ఐదు లేదా ఆరు. తన సుదీర్ఘ క్రికెట్ అనుభవంతో మ్యాచ్‌ గమనాన్ని వేగంగా ధోనీ పసిగట్టగలడు. అలానే క్లిష్ట సమయాల్లోనూ జట్టు ఇన్నింగ్స్‌ను అతను నిర్మించగలడు. ధోనీ మ్యాచ్‌ ఫినిషింగ్‌ నైపుణ్యానికి ప్రస్తుతం ఎవరూ సరితూగలేరు’ అని రైనా కితాబిచ్చాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
అర్జున్ రెడ్డి సినిమా వర్మ, వీహెచ్ ల చావుకొచ్చింది.. వర్మ కౌంటర్ వామ్మో.. Highlights అర్జున్ రెడ్డి సినిమా పై పెరిగిన హైప్ ముద్దు ఫోటోపై కాంగ్రెస్ నేత వీహెచ్ అభ్యంతరం మద్దతిచ్చిన వర్మను హైదరాబాద్ ల తిరగనియ్యబోమన్న వీహెచ్ నేను హైదరాబాద్ లోనే వున్నానంటూ సోషల్ మీడియాలో వర్మ రిప్లై  పెళ్లిచూపులు సక్సెస్ తో మాంచి క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం “అర్జున్ రెడ్డి”. తాజాగా  ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చేసిన కమెంట్స్ పై నెటిజన్లే కాక తెలుగు సొసైటీ నుండి భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధించి ఇప్పుడు రాజకీయ నేతలు కూడా స్పందించడంతో... ఆ సినిమాతో సంబంధం లేకున్నా... వివాదాలకు నెలవు, సంచలనాలకు మారుపేరు రామ్ గోపాల్ వర్మ తెగ రియాక్ట్ అవుతున్నాడు. మొత్తానికి అర్జున్ రెడ్డి సినిమా విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుండటం హాట్ టాపిక్ అయింది.   వీరి మధ్య చిన్నగా మొదలైన ఈ వివాదం మరింత ముదురుతోంది. 'అర్జున్ రెడ్డి' పోస్ట‌ర్ల‌ను కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి హ‌నుమంత‌రావు చించేసిన నేప‌థ్యంలో ఆయ‌న‌పై ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మండి పడ్డారు. ఆ సినిమా హీరో విజయ్ వెళ్లి విహెచ్ దుస్తులు చించేయాలంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.   వర్మ కామెంట్లపై వి. హనుమంతరావు స్పందిస్తూ.... ముంబై లో ఉండి ఏదిప‌డితే అది మాట్లాడ‌టం కాదు, ఈ సారి హైద‌రాబాద్ లో ఎలా అడుగు పెడ‌తావో చూస్తా అంటూ రామ్ గోపాల్ వర్మకు వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు.   వీహెచ్ కామెంట్లపై వర్మ రిప్లై తెగ ఇంట్రెస్టింగ్ గా మారింది. ‘సార్... మీరు నన్ను హైద‌రాబాద్ లో అడుగుపెట్ట‌నివ్వ‌రా? ప్ర‌స్తుతం నేను హైద‌రాబాద్‌లోనే ఉన్నా' అంటూ కౌంటర్ వేశారు. ‘వీహెచ్ సార్... నేను రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ప్ర‌సాద్ ఐమ్యాక్స్ లో అర్జున్ రెడ్డి మార్నింగ్ షో చూసేందుకు వ‌స్తున్నా... అక్క‌డ చూసుకుందాం.. బ‌స్తీ మే స‌వాల్' అంటూ రామ్ గోపాల్ వ‌ర్మ ఛాలెంజ్ విసిరాడు. హనుమంతరావుగారు హైద‌రాబాద్‌లో నన్ను అడుగు పెట్టనీయడం కన్నా, మీకు దమ్ముంటే మీ మనవళ్ల వయసున్న అబ్బాయిల‌ను, అమ్మాయిల‌ను ‘అర్జున్ రెడ్డి' సినిమా థియేట‌ర్లలోకి అడుగు పెట్ట‌కుండా ఆపండి అంటూ సవాల్ చేశారు. Last Updated 25, Mar 2018, 11:45 PM IST
0business
Delhi Dare devils ఢిల్లీడేర్‌ డెవిల్స్‌ స్కోరు 168-8 ఐపిఎల్‌లో భాగంగా రైజింగ పుణె జెయింట్స్‌తో జరుగుతునన మ్యాచ్‌లో ఢిల్లీ డేవర్‌ డెవిల్స్‌ నిరీ€త 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 168 పరుగులుచేసింది.. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టన ఢిల్లీ తొలి ఓవర్లనే వికెట్‌ కోల్పోయింది.. తర్వాత మూడో ఓవర్‌లో మరో వికెట్‌ కోల్పోయింది.. ఓపెనర్‌గా బ్యాటింగ్‌ ప్రారంబఙంచిన కరుణ్‌ నాయర్‌ (64), రిఫబ్‌ పంత్‌ (37), అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శించి స్కోరు బోర్డుకు పరుగుల వరద కురిపించారు.. దీంతో పుణేకు 169 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు.
2sports
బ్రహ్మపుత్రపై చైనా డ్యామ్ కడుతుందా..!? మాకు తెలియదే..! Hanumantha Reddy| Last Modified సోమవారం, 3 జనవరి 2011 (12:30 IST) చైనా మీదుగా భారత్‌లోకి ప్రవేశిస్తున్న బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యామ్ కడుతుందనే విషయం తమకు తెలియదని భారత్ స్పష్టం చేసింది. బ్రహ్మపుత్రపై చైనా డ్యామ్ నిర్మిస్తుందనే విషయం తనతో ఏ త్రైమాసికంలోనూ చర్చించలేదని, కాబట్టి దీనిపై స్పందించాల్సిన అవసరమే లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే విలేఖరులతో చెప్పారు. భారత్‌కు ఎగువ భాగాన్న టిబెట్‌లో ఉన్న బ్రహ్మపుత్ర నదిపై చైనా ఓ డ్యామ్‌ను నిర్మించి నీటిని దారిమళ్లిస్తుందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. అంతకు ముందు "విద్యుత్ రంగంలో ఉన్న అవకాశాలు" అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. త్రిపుర నుంచి బంగ్లాదేశ్‌కు పవర్ ట్రాన్సిమిషన్ లైన్ ద్వారా అనుసంధానించాలన్న త్రిపుర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. దీనిపై మరింత చదవండి :
1entertainment
పెట్రో వడ్డనకు సిద్ధమవుతున్న కేంద్రం న్యూఢిల్లీ (ఏజెన్సీ)| PNR| Last Modified శుక్రవారం, 4 జనవరి 2008 (15:42 IST) అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్‌ ధరలు అమాంతం పెరిగిపోవడంతో స్వదేశీయంగా పెట్రో ధరలు పెంచేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. ఈ నెలలో దేశ ప్రజలకు అతి ముఖ్యమైన సంక్రాంతి పండుగ ఉండటంతో ఈ ధరలను వచ్చే నెల నుంచి పెంచేందుకు నిర్ణయించినట్టు కేంద్ర పెట్రోలియం శాఖ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు వంద డాలర్ల మేరకు పెరిగిందని, అందువల్ల లీటరు పెట్రోల్‌పై రూ.నాలుగు, డీజల్‌‍పై రూ.రెండు పెంచే సూచనలు ఉన్నట్టు ఆ శాఖ కార్యదర్శి ఎంఎస్.శ్రీనివాసన్ సూచన ప్రాయంగా వెల్లడించారు. అయితే లీటరుకు రూ.నాలుగు అంటే మరీ ఎక్కువగా ఉందని, దీనికి యూపీఏలోని కీలక భాగస్వామ్య పార్టీలు వ్యతిరేకించే అవకాశం ఉందని అందువల్ల రెండింటిపై రూ.రెండు చొప్పున పెంచే అవకాశాలు లేకపోలేదని మరో సీనియర్ అధికారి తెలిపారు. అయితే కిరోసిన్, వంట గ్యాస్ ధరల జోలికి మాత్రం వెళ్లక పోవచ్చని వారు పేర్కొన్నారు. సంబంధిత వార్తలు
1entertainment
Ivestment ఫండ్‌ ఇన్వెస్టర్లలో భారీ వృద్ధి న్యూఢిల్లీ,జూన్‌ 16: మ్యూచువల్‌ఫండ్స్‌ ఇన్వెస్టర్ల ఖాతాలు గణనీయంగా పెరి గాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌మే నెలల మధ్యకాలంలోనే 19లక్షల ఖాతాదారులు చేరినట్లు తేలింది. దీనితో మొత్తం భారత్‌లో పెట్టు బడులు పెడుతున్న ఫండ్‌ ఇన్వెస్టర్ల ఖాతాలు 5.72 కోట్లకు చేరాయి. రిటైల్‌, బిలియనీర్‌ ఇన్వెస్టర్ల నుంచి ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో 77లక్షల ఖాతాలు అదనంగా చేరా యి. అందకుముందు ఆర్థిక సంవత్సరంలో 59 లక్షల ఖాతాలు చేరాయి. రెండేళ్ల వ్యవధిలోనే ఇన్వె స్టర్ల ఖాతాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. చిన్నచిన్న పట్టణాల నుంచి కూడా ఇన్వెస్టర్లు ఫండ్స్‌ పెట్టుబడులకు ముందుకువస్తున్నారు. ఫోలియోస్‌ అంటే వ్యక్తిగత ఇన్వెస్టర్‌ ఖాతాలుగా పరిగణిస్తారు. ఒక ఇన్వెస్టరు ఎన్నిఖాతాలైనా కొనసాగించవచ్చు. మ్యూచువల్‌ఫండ్స్‌ సంఘం గణాంకాల ప్రకారం మొత్తం ఇన్వెస్టర్‌ ఖాతాలు 42 ఫండ్‌ హౌస్‌లనుండి చూస్తే 5,71,90,11 వర కూ ఉన్నాయి. అంతకుముందు మార్చినెలలో 5,53,99,631 ఖాతాలున్నా యి. రెండునెలల వ్యవధిలోనే 17.90లక్షల మంది పెరిగారు. ఎక్కువశాతం బిలియనీర్‌ ఖాతాలు, రిటైల్‌ ఖాతాలే ఉన్నాయని అంచనా. ఫండ్స్‌ ఇండియా డాట్‌కామ్‌, విద్యాబాల మాట్లాడుతూ రిటైల్‌ ఇన్వెస్టర్ల ఖాతాలు ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లోను, కొంత సమన్వయం ఉన్న కేటగిరీల్లో పెట్టుబడులు 4.60 కోట్లకు పెరిగాయి. మార్చినెలలో 4.4కోట్లుగా ఉన్నాయి. ఈక్విటీ ఆధా రిత పథకాల్లో ఎక్కువ మంది గడచిన 24 నెలల్లో పెట్టు బడులు మరింతగా పెట్టారు. దీర్ఘకాలిక మూలధన లభ్ధికి ఆధారంగా ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లోనే ఎక్కువ మంది పాలుపంచుకున్నట్లు బజాజ్‌ కేపిటల్‌ సిఇఒ రాహుల్‌పారిఖ్‌ అన్నారు. మ్యూచువల్‌ఫండ్‌ రంగం మొత్తంగా చూస్తే నిర్వ హణ ఆస్తులు 19 లక్షలకోట్ల రూపాయల వరకూ ఉన్నాయి. రానున్న కాలంలో ఈ ఏడాదిలోనే 20 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ఎక్కువ మంది ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను సేకరించివారి తరపున ప్రాతినిధ్యం వహిస్తూ పెట్టుబడులను వివిధ స్కీంలలో ఫండ్‌సంస్థలు పెడుతుంటాయి. స్టాక్స్‌, బాండ్లు, మనీమార్కెట్‌ ఉత్పత్తుల్లో ఎక్కువ పెట్టుబడులు పెడుతుంటాయి.
1entertainment
Hyderabad, First Published 29, Oct 2018, 10:52 AM IST Highlights ఓ సినీ డిస్ట్రిబ్యూటర్ ను యాంకర్ రవి బెదిరించాడని, అతడిపై దాడికి పాల్పడ్డాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైనట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన కంప్లైంట్ తో రవిని హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అతడిని ఎంక్వైరీ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.  ఓ సినీ డిస్ట్రిబ్యూటర్ ను యాంకర్ రవి బెదిరించాడని, అతడిపై దాడికి పాల్పడ్డాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైనట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన కంప్లైంట్ తో రవిని హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అతడిని ఎంక్వైరీ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించాడు రవి. తనపై వస్తోన్న వార్తలను ఖండించాడు. ఆ వార్తలను ఎవరూ నమ్మొద్దని చెప్పాడు. ''నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేదు.. పోలీసులు విచారణ చేయలేదు.  నేను ప్రస్తుతం మచిలీపట్నంలో ఉన్నాను. ఓ ఛానెల్ కి సంబంధించి దీపావళి ఉత్సవ కార్యక్రమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాను'' అంటూ వెల్లడించాడు. అలానే తాను ఎక్కడ ఉన్నాడనే విషయంతో పాటు ఏం చేస్తున్నాడో కూడా ఓ వీడియో ద్వారా రవి వెల్లడించాడు. తనపై నెగెటివ్  వార్తలను స్ప్రెడ్ చేయొద్దని కోరాడు.    సంబంధిత వార్త..
0business
hardik pandya to be rested during sri lanka test series: report శ్రీలంకతో టెస్టు సిరీస్: పాండ్యకు విశ్రాంతి లంకతో సిరీస్‌కు పాండ్యకు విశ్రాంతినిచ్చిన సెలక్షన్ కమిటీ. కీలక దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్న బీసీసీఐ TNN | Updated: Nov 10, 2017, 05:25PM IST శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇటీవలి కాలంలో మితిమీరిన క్రికెట్ ఆడుతున్నందున మూడు టెస్టుల సిరీస్‌కి పాండ్యను ఎంపిక చేయలేదు. శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటన ఉండటంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేసే విషయంలో మాత్రం బోర్డు స్పష్టత ఇవ్వలేదు. తొలుత 16 మంది ప్రాబబుల్స్ జాబితాలో పాండ్య పేరు ఉన్నప్పటికీ.. సెలక్షన్ కమిటీ పాండ్యకు విశ్రాంతినిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విరామం సమయంలో పాండ్య తన ఆటతీరును మరింత మెరుగు పరచుకునేలా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందనున్నాడు. జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడిన అనంతరం సెలక్షన్ కమిటీ పాండ్యకు విశ్రాంతి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV తొలి రౌండ్‌లోనే పేస్‌, బోపన్న ఔట్‌ రియో ఒలింపిక్స్ లో భారత టెన్నిస్ ధ్వజం లియాండర్ పేస్, రోహన్ బోపన్న పురుషుల డబుల్స్ లో తొలి మ్యాచ్ లోనే నిరాశపరిచింది. TNN | Updated: Aug 7, 2016, 02:10AM IST X రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ... రియో ఒలింపిక్స్ లో భారత టెన్నిస్ ధ్వజం లియాండర్ పేస్, రోహన్ బోపన్న పురుషుల డబుల్స్ లో తొలి మ్యాచ్ లోనే నిరాశపరిచింది. పోలెండ్‌ జంట మార్సిన్‌ మట్కోస్కీ-లూకాస్‌ కుబోట్‌ చేతిలో 4-6, 6-7 తేడాతో వీరు ఓటమి పాలయ్యారు. కాగా వీరిద్దరి మధ్య సమన్వయలోపం కారణంగానే ఆటపై దృష్టిపెట్టకపోవడంతో తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యారని స్పష్టంగా తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ఒక్కసారి కూడా ప్రాక్టీస్‌ చేయకపోవడం గమనార్హం. ఇద్దరు మధ్య సమన్వయం లేదని ముందే తెలిసినా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయానికి ఎదురుదెబ్బే తగిలింది. రూమ్‌ విషయంలో ఒలింపిక్ క్రీడా గ్రామంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం కూడా జరిగింది.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV దినేశ్ కార్తీక్ సంచలన బ్యాటింగ్.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీ దినేశ్ కార్తీక్ సంచలన బ్యాటింగ్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. చివరి బంతికి సిక్స్ బాది ఫైనల్లో భారత్‌ను గెలిపించాడు. Samayam Telugu | Updated: Mar 19, 2018, 01:05PM IST దినేశ్ కార్తీక్ సంచలన బ్యాటింగ్.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీ రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ కు దినేశ్ కార్తీక్ మెరుపులు తోడవటంతో టీమిండియా నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్ పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఇరు జట్లు విజయం కోసం హోరాహోరీగా పోరాడాయి. ఆఖరి బంతికి విజయానికి ఐదు పరుగులు అవసరమైన దశలో దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 27) సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. 167 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ (42 బంతుల్లో 56), శిఖర్ ధావన్ (10) మెరుపు ఆరంభాన్నిచ్చారు. కానీ ధావన్, రైనా (0) వెనువెంటనే అవుటవడం స్కోరు బోర్డుపై ప్రభావం చూపింది. లోకేశ్ రాహుల్ (14 బంతుల్లో 24)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ముందుకు నడిపాడు. కానీ జట్టు స్కోరు 83 పరుగుల వద్ద రాహుల్ అవుటవడంతో రోహిత్ ఆచితూచి ఆడాడు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరు ఆడే క్రమంలో హిట్ మ్యాన్ నజ్ముల్ ఇస్లాం బౌలింగ్ లో మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికీ భారత్ విజయానికి 40 బంతుల్లో 69 పరుగులు అవసరం. దీంతో క్రీజులో ఉన్న ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది. అప్పటి వరకూ మెల్లగా ఆడిన మనీష్ పాండే (18) ధాటిగా ఆడేందకు ప్రయత్నించి విఫలమయ్యాడు. రోహిత్ స్థానంలో క్రీజ్లోకి వచ్చిన విజయ్ శంకర్ ఆరంభంలో వేగంగా ఆడినప్పటికీ చివర్లో ఒత్తిడికి లోనయ్యాడు. చివరి 3 ఓవర్లలో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో ముస్తాఫిజుర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. విజయ్ శంకర్ కి వరుసగా నాలుగు డాట్ బాల్స్ విసరడంతోపాటు ఒక పరుగు మాత్రమే ఇచ్చి మనీష్ పాండే వికెట్ పడగొట్టాడు. తీవ్ర ఒత్తిడి మధ్య క్రీజ్లోకి వచ్చిన దినేశ్ కార్తీక్ తర్వాతి ఓవర్లో వరుసగా 6,4,6,0,2,4 బాది 22 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి ఓవర్లో భారత్ విజయానికి 12 పరుగులు అవసరమయ్యాయి. సౌమ్య సర్కార్ విసిరిన ఆఖరి ఓవర్లో ఎట్టకేలకు విజయ్ శంకర్ బౌండరీ బాదడంతో సమీకరణం రెండు బంతుల్లో 5 పరుగులుగా మారింది. కానీ ఐదో బంతికి విజయ్ క్యాచ్ అవుటయ్యాడు. చివరి బంతికి దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 29) సిక్స్ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు మాత్రమే చేసిన బంగ్లా.. సబ్బీర్ రహ్మాన్ (50 బంతుల్లో 77; 7x4, 4x6) పోరాటంతో కోలుకుంది. చివర్లో మెహదీ హసన్ (7 బంతుల్లో 19) మెరుపులు మెరిపించడంతో ఊహించని రీతిలో 166 రన్స్ చేసింది. భారత బౌలర్లలో చాహల్ కు 3 వికెట్లు దక్కగా, ఉనద్కత్ రెండు వికెట్లు పడగొట్టాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
VOHRI111 కళ్లు చెదిరే వోహ్రా ఫీల్డింగ్‌ మొహాలీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదవ సీజన్‌లో కళ్లు చెదిరే మరో ఫీల్డింగ్‌ విన్యాస మిది.కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌ పీల్డర్‌ మనన్‌ వోహ్రా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధ్యమను కున్న ఫీట్‌ను సాధ్యం చేశాడు.బౌండరీ లైన్‌ వద్ద బాస్కెట్‌ బాల్‌ ఆడాడు.విలియమ్సన్‌ బాదిన సిక్సర్‌ను గాల్లోనే ఆపేసి నాలుగు పరుగులు ఆదా చేశాడు. మొహాలీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ మొదట బ్యాటింగ్‌ చేసింది.తొలి ఓవర్‌ నుంచి ధాటిగా ఆడింది.ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో వోహ్రా ఈ అద్భుతం చేశాడు.అయిదవ బంతిని ఇషాంత్‌ శర్మ షార్ట్‌పిచ్‌లో వేశాడు.క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ విలియమ్సన్‌ ఆఫ్‌ సైడ్‌ రెండు అడుగులు జరిగిన తన బలాన్నంతా ఉపయో గించి బంతిని లాగి కొట్టాడు.బంతి డీప్‌ మిడ్‌ వికెట్‌ వైపు గాల్లోకి లేవడంతో అందరూ సిక్స్‌ అనుకున్నారు.కానీ అక్కడే ఉన్న ఫీల్డర్‌ మనన్‌ వోహ్రా తన సత్తా చాటాడు.గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు.అదుపు తప్పి బౌండరీ లైన్‌ అవతల పడిపోతానని తెలుసుకుని రెప్పపాటులో బంతిని ముందుకు విసిరి అభిమానులను విస్మయానికి గురిచేశాడు. తరువాత కిందపడి పోయాడు.దీంతో పంజాబ్‌కు నాలుగు పరుగులు ఆదా అయ్యాయి.
2sports
sandhya 373 Views MUTUAL FUNDS , sebi , SEBI norms SEBI న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్ల డబ్బుకు రక్షణ కల్పించేందుకు, సంస్థల అడ్డగోలు పెట్టుబడులకు కళ్లెం వేసేందుకు సెబి కఠినచర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు కఠిన నిబంధనలతోపాటు డిబెంచర్ల డిఫాల్ట్స్‌ అరికట్టేందుకు మరిన్ని ఆంక్షలను విధించింది సెబి. తాను ఏర్పాటు చేసిన మ్యూచువల్‌ ఫండ్‌ అడ్వైజరీ కమిటీ సిఫార్సుల ప్రకారం అనేక మార్పులను చేపట్టింది సెబి. సెప్టెంబరు 2020 నుంచి అనేక కొత్త నిబంధనలను కూడా తీసుకురాబోతోంది. ఇవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బిఎఫ్‌సి)మరింత గడ్డుపరిస్థితులను తీసుకురాబోతున్నాయి. సెబి చెబుతున్న లెక్కల ప్రకారం ప్రస్తుతం డెట్‌ ఫండ్స్‌లో రూ.13.24లక్షల కోట్ల విలువైన అసెట్స్‌ నిర్వాహణలో ఉన్నాయి. వీటిల్లో రూ.3.12 లక్షల కోట్లు ఎన్‌బిఎఫ్‌సిలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకే ఎక్స్‌్‌పోజర్‌ ఉంది. ఈక్విటీ సహా వివిధ ఫండ్స్‌లో మొత్తం రూ.25.93లక్షల కోట్లను మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయి. సెప్టెంబరు 2020 నాటికి ఇవన్నీ కొత్త నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవి 20 శాతం ఆస్తులను లిక్విడ్‌ సెక్యూరిటీస్‌లో ఉంచాలి. ఒకే రంగంలో ఇన్వెస్ట్‌ మెంట్‌ని 25-20శాతానికి కుదించడం, మొత్తం షేరు కేపిటల్‌లో 20 శాతానికి మించి ప్రమోటర్లు తనఖా పెడితే సదరు సమాచారాన్ని బహిర్గతపరచాలి. ఇప్పుడు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ప్రమోటర్లకు షేర్లను తనఖా పెట్టుకుని రూ.50వేల కోట్ల వరకూ రుణాలు ఇచ్చారు. ఈ నిబంధనల్లో కూడా మార్పు ఉండాలి. ప్రస్తుతం రెండు రూపాయల విలువైన షేర్లు తనఖా పెట్టుకుని ఒక్క రూపాయి రుణమిస్తున్నారు. దీన్ని నాలుగు రూపాయలకు పెంచబోతున్నారు. అంటే ఇకపై 4 రూపాయల విలువైన షేర్లు పెట్టిన తర్వాతే ఒక్క రూపాయి వరకూ రుణం తీసుకోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, ప్రమోటర్ల మధ్య ఒప్పందాన్ని తాము ఎంత మాత్రమూ అంగీకరించబోమనే సెబి చైర్మన్‌ త్యాగీ స్పష్టంచేశారు. ప్రస్తుతం ఏదైనా డెట్‌ సాధనం ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ కంటే కిందకి దిగి వస్తే మేనేజర్లు తమ సొంత నిర్ణయాలతో వాటిని రైట్‌ ఆఫ్‌ చేసేస్తున్నారు. ఇకపై అలాంటి చర్యలు కుదరవు. సదరు ఇన్వెస్ట్‌మెంట్‌ పేపర్‌ను బూస్ట్‌ చేయడానికి గానీ, పడేయడానికి గానీ సొంత ట్రేడ్స్‌, రైట్‌ ఆఫ్స్‌ వంటివి చేయడానికి కుదరదు. త్వరలో ఇందుకు సంబంధించిన యూనివర్సల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ అందుబాటులోకి రాబోతోంది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
1entertainment
India won three match series beating Srilanka with 2-1 points 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ గెలిచిన భారత్ టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఆసీస్ పై 3-0 తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టు | Updated: Feb 14, 2016, 11:13PM IST టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఆసీస్ పై 3-0 తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం వరల్డ్ టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టు ఆ దండయాత్రని శ్రీలంకపై కూడా అలాగే కొనసాగించి తన నెంబర్ 1 స్థానాన్ని పదిలపర్చుకుంది. ఆదివారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన మూడవ(చివరి) టీ20 మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో లంకని ఓడించి 3 మ్యాచ్‌ల సిరీస్ కైవసం చేసుకుంది భారత్. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా జట్టు బౌలింగ్ పరంగా లంక ఆటగాళ్లని కట్టడి చేయడంలో పైచేయి సాధించింది. దీంతో టీమిండియా స్పిన్నర్ల ధాటికి తట్టుకోలేకపోయిన లంక ఆటగాళ్లు కేవలం 82 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అనంతరం 83 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఈ మ్యాచ్‌ని ఈజీగానే గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కి దిగిన రోహిత్ శర్మ 13 పరుగులకే వెనుదిరిగినా తర్వాత శిఖర్ దావన్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్ బాది స్కోరుని పరుగులెత్తించాడు. ధావన్ సాధించిన 46 పరుగులకితోడు అజింక్య రహానే చేసిన 22 పరుగులు ఈ మ్యాచ్‌ని సునాయసంగానే విజయం వైపు నడిపించాయి. 14వ ఓవర్లో ధావన్ సాధించిన ఓ ఫోర్, మరో సిక్స్‌తో టీమిండియా మ్యాచ్ గెలిచి ఈ సిరీస్‌ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ విజయంలో లంక ఆటగాళ్లని కట్టడి చేయడంలో సక్సెస్ అయిన బౌలర్లదే కీలకపాత్రగా మారింది. భారత బౌలర్లు అశ్విన్ 4 వికెట్లు తీసుకోగా సురేష్ రైనా రెండు వికెట్లు, జడేజా, నెహ్రా, బుమ్రాలకి చెరో వికెట్ లభించింది. 4 వికెట్లు పడగొట్టి లంకని బెంబేలెత్తించిన అశ్విన్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సైతం వరించింది. ఇక తర్వాతి షెడ్యూల్స్ విషయానికొస్తే, ఈ నెల 24 నుంచి జరగనున్న టీ20 ఆసియా కప్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది.
2sports
mohammed siraj in tears during india national anthem తొలి అవకాశం.. సిరాజ్ కంటతడి! హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ టీం ఇండియాకు ఎంపికయ్యాడని తెలియగానే అతని కుటుంబంతో పాటు తెలుగు ప్రజలంతా ఆనందం వ్యక్తం వేశారు. TNN | Updated: Nov 5, 2017, 04:52PM IST హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ టీం ఇండియాకు ఎంపికయ్యాడని తెలియగానే అతని కుటుంబంతో పాటు తెలుగు ప్రజలంతా ఆనందం వ్యక్తం వేశారు. చాన్నాళ్ల తరవాత హైదరాబాద్‌కు చెందిన ఆటగాడు భారత్ తరఫున ఆడబోతున్నాడని మురిసిపోయారు. అయితే తుది జట్టులో చోటు ఉంటుందా లేదా అనే అనుమానం. కానీ సిరాజ్‌కు అవకాశం దక్కింది. కాన్పూర్‌లో శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో సిరాజ్‌ తీసుకున్నారు. మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు జాతీయ గీతాలు ఆలపించడానికి మైదానంలోకి చేరుకున్నాయి. భారత జాతీయ గీతం ఆలపించిన తరవాత సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. తొలిసారి భారత్‌కు ఆడుతున్న ఆనందమో, అంచెలంచెలుగా అతను ఎదిగిన తీరు గుర్తొంచిందో తెలియదు కానీ తనలోని భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. కంటతడి పెట్టుకున్నాడు. అతను కళ్లు చెమర్చుకుంటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కడం, దాన్ని మ్యాచ్ మధ్యలో టెలీకాస్ట్ చేయడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక సోషల్ మీడియాలో అయితే సిరాజ్‌ను పొగుడుతూ పోస్టులు, ట్వీట్లు. అతను ఆడిన తొలి మ్యాచ్‌లో పెద్దగా రాణించకపోయినా క్రికెట్ అభిమానులు ఎక్కడా నిరాశపడలేదు. ఒక ఆటో డ్రైవర్ కొడుకు టీం ఇండియాకు ఆడుతున్నాడంటూ పొగడ్తలతో ముంచెత్తారు. — Cricket Videos (@CricketKaVideos) November 4, 2017 Mohammed Siraj story is the classic rags to riches story. A humble beginning. A sporting talent. Luck. Life altering opportunity. — Rashi Kakkar (@rashi_kakkar) November 4, 2017 When Nation is debating whether to stand for national anthem or not? Tears in Mohammed Siraj eyes shows how true patriotic feels! #INDvNZ — Boring... (@graphicalcomic) November 4, 2017 The national anthem gave tears to Mohammed Siraj. No hate-monger can take this moment away from him. Dil bole INDIA. #INDVSNZ
2sports
కేవలం 4 గంటల్లోనే బోలెడు సమాచారం..ముగిసిన చిన్నా సిట్ విచారణ Highlights డ్రగ్స్ కేసులో ముగిసిన ఆర్ట్ డైరెక్టర్ చిన్నా విచారణ కేవలం నాలుగు గంటలల్లోనే ముగిసిన విచారణ 4 గంటల్లో కీలక సమాచారం అందించటంతో త్వరగా ముగిసిన విచారణ   డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి ఎక్సైజ్ సిట్ విచారణ గత వారం రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే పూరీ జగన్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్ లను విచారించిన సిట్ మంగళవారం ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను విచారించింది.   అయితే వీళ్ల నుంచి కీలక సమాచారం సేకరించిన సిట్ మరికొందరి ప్రమేయం ఉన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ రోజు ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా అలియాస్‌ ధర్మారావును విచారించిన సిట్ గతంతో పోలిస్తే చాలా తక్కువ సమయంలో విచారణ ముగించింది. ఉ. 10.30 కు ఎక్సైజ్ కార్యాల‌యంలో చిన్నా విచార‌ణ ప్రారంభమైంది. నిన్న న‌టుడు న‌వ‌దీప్ ను రాత్రి 9.45 వ‌ర‌కు విచారించిన సిట్ అధికారులు... చిన్నాను కేవలం నాలుగు గంటల పాటు విచారించి వదిలేశారు. అయితే ఈ కొద్ది సమయంలోనే తనకు తెలిసిన పూర్తి కీలక సమాచారం అందించడంతో చిన్నా విచారణ త్వరగా పూర్తయినట్లు తెలుస్తోంది.   ఇప్పటి వరకు హాజరైన సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక సమాచారం ఇచ్చిన నేపథ్యంలో చిన్నా విచారణ కూడా సుదీర్ఘంగా సాగుతుందని అంతా భావించినా చాలా కొద్ది సమయంలో విచారణ ముగియటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు సిట్ విచారణకు హాజరైనంత మాత్రాన అందరూ నిందితులే అని భావించడం సమంజసం కాదని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు. సిట్ విచారణకు సినిమా వాళ్లు నిందితులుగా హాజరు కావడం లేదని, కేవలం విచారణకు సహకరించేందుకు మాత్రమే వెళ్తున్నారని అంటున్నారు.   ఇక రవితేజ విచారణపై ప్రస్థుతానికి సందిగ్దత నెలకొన్నా... సిట్ కార్యాలయానికి రవితేజ హాజరవుతారని సిట్ అధికారులు భావిస్తున్నారు. రేపు మాత్రం హైకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో చార్మి సిట్ విచారణకు హాజరు కావాల్సి వుంది. అయితే.. చార్మి సిట్ కార్యాలయానికి వస్తుందా లేక మరేదైనా రహస్య ప్రాంతంలో విచారణ జరుగుతుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV కాగ్నిజంట్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ మెహతా కాగ్నిజంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ మెహతా నియమితులయ్యారు. TNN | Updated: Oct 1, 2016, 02:38PM IST కాగ్నిజంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ మెహతా నియమితులయ్యారు. ఇటీవల రాజీనామా చేసిన గోర్డాన్ కోబర్న్ స్థానాన్ని రాజీవ్ భర్తీ చేశారు. అంతకు ముందు కంపెనీ ఐటీ సర్వీసులకు సీఈవోగా ఉన్నారు. కంపెనీ మార్కెటింగ్ కార్యకలాపాలను ఆయన చూసుకునేవారు. ఈ సంస్థతో రాజీవ్‌కు 20 ఏళ్ల అనుబంధం ఉందని, ఆయన ఇప్పటికే సమర్ధవంతమైన నాయకుడిగా నిరూపించుకున్నారని కాగ్నిజంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా వెల్లడించారు. గడిచిన దశాబ్ద కాలంలో కంపెనీకి రాజీవ్ అందించిన సేవలు అమోగమని, సంస్థ ఎదుగుదలకు అది ఎంతగానో తోడ్పడిందని ఆయన కొనియాడారు. ఆయనతో మరింత సన్నిహితంగా కలసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని, కాగ్నిజంట్ 2020 వ్యూహాన్ని తామిద్దరం కలసి అమలుచేస్తామని ఆయన వివరించారు. రాజీవ్ మెహతా 1997లో కాగ్నిజంట్‌లో చేరారు. ఇండ్రస్ట్రీస్, మార్కెట్స్ విభాగానికి గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌‌గా సేవలందించారు. అంతేకాకుండా గ్లోబల్ క్లైంట్ సర్వీసెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, ఫైనాన్సియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనజర్‌గా కూడా పనిచేశారు.
1entertainment
internet vaartha 131 Views హైదరాబాద్‌ : ప్రముఖ డిటిహెచ్‌ కంపెనీ జీటివి నుంచి డిట్టోటివిని విడుదలచేసింది. లైవ్‌ టీవీ ప్లాట్‌ఫామ్‌ కూడా అందిస్తున్నది. ఫోన్‌ ట్యాబ్‌ పిసి, పర్సనల్‌ కంప్యూటర్లపై కేవలం 20 రూపాయలు చెల్లించడం ద్వారా అన్నిరకాల టెలివిజన్‌ ఛానల్స్‌ చూసేందుకు అవకాశం కలుగుతుందని కంపెనీ వివరించింది. 100కుపైగా హిందీ, ఇంగ్లీస్‌ ప్రాంతీయభాషా ఛానెల్స్‌వినోదం, స్పోర్ట్సు మూవీలు న్యూస్‌ లైఫ్‌స్టైల్‌ విభాగంలో చూసేందుకుఅవ కాశం కల్పిస్తోంది. ఎండిసిఇఒ పునీత్‌గోయంకా మాట్లాడుతూ జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌నుంచి భారత్‌ లో డిజిటల్‌ వినియోగంలో అగ్రగామిగా ఉందని, డిట్టోటివి విడుదలచేయడం ద్వారా వృద్ధిచెందు తున్న వినియోదారుల మీడియా వినియోగ ప్రాధాన్యతలను తెలుసుకుని ముందుకువెళుతు న్నట్లు తెలిపారు. అందుబాటుధరల్లో డిట్టోటివిని అందిస్తున్నట్లు వివరించారు. డిట్టోటివి ఆండ్రా యిడ్‌, విండోస్‌, ఐవోఎస్‌ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తం ది. వార్షిక కాంట్రాక్టులు, శాటిలైట్‌ డిష్‌లు, సెట్‌ టాప్‌బాక్స్‌లు ఇకపై చెల్లవని మూడునెలలు, ఆరు నెలలు సంవత్సరానికి 59,90రూ.170 రూపా యలుగా చందాఉందని కంపెనీ తెలిపింది. కేవలం 20 రూపాయల ఖర్చుతో డిటో టీవి వీక్షించే అవకాశం ఉందని బిజినెస్‌ హెడ్‌ అర్చనా ఆనంద్‌ వెల్లడించారు. మొబైల్‌ఫోన్లపై డిఫాల్ట్‌ యాప్‌గా చేసుకోవచ్చని వివరించారు. డిట్టో టివితో ఫోన్‌ లేదా రెండోస్క్రీన్‌ ఇష్టమైన కార్యక్రమాలు ఎన్నడూ మిస్‌ కాకుండా చూసేలాదోహదంచేస్తుందని వెల్లడించారు.
1entertainment
Hyderabad, First Published 11, May 2019, 10:03 AM IST Highlights విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామ. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు ఈ చిత్రాల్లో రీల్ లైఫ్ కూడా మామ అల్లుళ్ళుగా మారారు. జైలవకుశ ఫేమ్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామ. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు ఈ చిత్రాల్లో రీల్ లైఫ్ కూడా మామ అల్లుళ్ళుగా మారారు. జైలవకుశ ఫేమ్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఆరంభంలో వెంకీ మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. దీనితో వెంకీ మామపై అంచనాలు పెరిగాయి.  దర్శకుడు బాబీ ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య ఈ చిత్రంలో మిలటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక వెంకటేష్ గోదావరి ఒడ్డున ఉండే పల్లెటూరిలో రైస్ మిల్ ఓనర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్ కి సిద్ధం అవుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ ని బాబీ కాశ్మీర్ బోర్డర్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నాగ చైతన్యపై అక్కడ మిలటరీ సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో ఆసక్తికరంగా సాగే కథతో పాటు వినోదాత్మక అంశాలని కూడా బాబీ పుష్కలంగా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ జోడిగా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తోంది.  Last Updated 11, May 2019, 10:03 AM IST
0business
ముంబై చేరిన శ్రీదేవి పార్థివ దేహం, రేపు మ.3.30కు అంత్య క్రియలు Highlights ముంబై చేరిన శ్రీదేవి పార్థివ దేహం అభిమానుల కోసం ఉ.8.30 నుంచ సెలబ్రేషన్స్ క్లబ్ లో శ్రీదేవి రేపు మ.3.30కు అంత్య క్రియలు అందాలతార శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించటంతో ఎంబామింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో భారత్ కు తరలించారు. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో శ్రీదేవి పార్థివ దేహం ముంబై ఎయిర్ పోర్ట్ చేరుకుంది. అక్కడ్నించి శ్రీదేవి నివాసానికి తరలించారు. ఇక శ్రీదేవి  మృతిపై అభిమానుల్లో అనేక సందేహాలున్నా... ప్రస్థుతానికి జరగాల్సిన కార్యక్రమంపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన వెలువరించారు.   ఇక శ్రీదేవి భౌతిక కాయం ప్రత్యేక అంబులెన్స్ లో.. లోఖండ్ వాలాలోని శ్రీదేవి నివాసమైన గ్రీన్ ఏకర్స్ కు తరలించారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం ఉ.8.30 నుంచి ముంబై సెలెబ్రేషన్స్ క్లబ్ లో వుంచుతారు. అనంతరం ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు సంతాప సభ నిర్వహిస్తారు. అనంతరం మ. 2 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని, ఆ తర్వాత మ.3.30కు పవన్ హన్స్ స్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన వెలువరించారు. Last Updated 25, Mar 2018, 11:55 PM IST
0business
New Delhi, First Published 4, Feb 2019, 4:36 PM IST Highlights కేంద్రం యావత్ దేశాన్ని డిజిటలీకరిస్తామని పదేపదే చెబుతోంది. కానీ ఆచరణలో పరిస్థితి భిన్నంగా ఉంది. బడ్జెట్ లో స్టార్టప్ ల అభివృద్ధి కోసం కేవలం రూ.25 కోట్లు కేటాయించింది. ఇది 2018-19 సంవత్సరంలో కంటే మూడు కోట్లు తక్కువ. అంటే ప్రభుత్వ లక్ష్యాలు ఆచరణ యోగ్యమా? అంటే అనుమానమే మరి. న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కేంద్రం సంకల్పించింది. అందుకు బాటలు వేసే స్టార్టప్‌లపై మాత్రం కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని అర్థం అవుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో స్టార్టప్‌ల కోసం రూ.25 కోట్ల నిధులను మాత్రమే కేటాయించింది.  2018-19 కంటే స్టార్టప్‌లకు నిధులు తక్కువ స్టార్టప్‌ల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.28 కోట్ల కంటే ఇది తక్కువ. అత్యంత వేగవంతంగా భారతదేశాన్ని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్రం స్టార్టప్ ఇండియా పేరుతో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. మరోవైపు మేక్ ఇన్ ఇండియా పథకాలకు మాత్రం రూ.232.02 కోట్లు, జాతీయ తయారీ దారుల పథకాలకు రూ.8.47 కోట్లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు రూ.100 కోట్లను కేటాయించింది.  మేకిన్ ఇండియాకు రూ.573.3 కోట్లు మొత్తంమీద వచ్చే ఏడాది మేక్ ఇన్ ఇండియా కోసం రూ. 473.3 కోట్ల నిధులను అందించనున్నది. 2018-19లో కేటాయించిన రూ.149 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు అధికం. భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 2014 సెప్టెబర్ 24న మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్ నిధుల కేటాయింపులు రూ.5,674.51 కోట్లకు తగ్గించింది. Last Updated 4, Feb 2019, 4:36 PM IST
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Sreeja: మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న శ్రీజ.. మెగా అల్లుడు పోస్ట్ పండుగ పూట మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. తన భార్య శ్రీజ తల్లికాబోతుందని ఆమెతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు కళ్యాణ్ దేవ్. Samayam Telugu | Updated: Nov 6, 2018, 12:15PM IST Sreeja: మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న శ్రీజ.. మెగా అల్లుడు పోస్ట్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత కాబోతున్నారు. పండుగ పూట మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. తన భార్య శ్రీజ తల్లికాబోతుందని ఆమెతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు కళ్యాణ్ దేవ్. #శ్రీజకళ్యాణ్‌బేబి2, #లోడింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌లతో ఫొటోని షేర్ చేశారు. 2016 మార్చిలో తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్ దేవ్‌ని రెండో వివాహం చేసుకుంది శ్రీజ. అంతకు ముందు శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ.. వ్యక్తిగత కారణాలతో విడిపోయి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరికి నివ్రిత అనే ఐదేళ్ల కూతురు ఉంది.
0business
Infosys ఇన్ఫోసిస్‌కు మరో విఘాతం! బెంగళూరు,జూన్‌ 17: ఇన్ఫోసిస్‌లో చోటుచేసుకున్న మరో కీలక పరిణామంతో షేర్లు మరింతగా దిగ జారాయి. కంపెనీ వ్యవస్థాపకులు నారాయణమూర్తి తదితరులు తమ వాటాలను విక్రయిస్తున్నారన్న వార్తలతో కొంత దెబ్బతిన్న కంపెనీకి తాజాగా అమెరికా హెడ్‌ గ్లోబల్‌ ఉత్పత్తి,రిటైల్‌ హెడ్‌ సందీప్‌ దాడ్లాని కంపెనీ నుంచి వైదొలిగేందుకు నిర్ణయించుకోవడంతో మరో విఘాతంగా భావిస్తున్నారు. అయితే వెనువెంటనే రీప్లేస్‌మెంట్స్‌తో ఇన్ఫోసిస్‌ తనవంతు బాధ్యతలు నిర్వర్తించింది. గ్లోబల్‌ రిటైల్‌ హెడ్‌ కార్మేష్‌ వాస్వానిని, నితేష్‌ బంగాను గ్లోబల్‌ ఉత్పత్తి హెడ్‌గాను నియమించేందుకు నిర్ణయించింది. దాడ్లాని ఇన్ఫోసిస్‌లో గడచిన 16 ఏళ్లకుపైగా పనిచేసారు. ప్రస్తుతం ఆయన వైదొలిగే నిర్ణ యం కంపెనీకి కొంత తలనొప్పులేనని ఎడె ల్విసిస్‌ రీసెర్చి అంచనావేసింది. అయితే మార్కెట్లలో ఏమంత స్పందన లేదు. కంపె నీ షేర్లు రూ.946గా ట్రేడింగ్‌ జరిగింది. గరిష్టంగా 953కివెళ్లింది. ఇంట్రాడేలో 940 రూపాయల వరకూ వచ్చింది. మార్కెట్లు ఇన్ఫోసిస్‌ రికవరీ అవుతుందన్న అంచనాలే ఇందుకు కీలకంగా భావిస్తున్నారు. దాడ్లాని వంటి వారి నిష్క్రమణ ప్రభావాలు తాత్కా లికమేనని చెపుతున్నారు. వీటన్నింటి దృష్ట్యా ఇన్ఫోసిస్‌ 2020 నాటికి తన 20 బిలియన్‌ డాలర్ల లక్ష్యం చేరుకోగలదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 70శాతం తన నగదు నిల్వల నుంచి డివిడెండ్లు చెల్లించడం లేదా షేర్ల బైబాక్‌ పథకాలను చేపట్టింది. బోర్డు 13 వేల కోట్లతో బైబాక్‌ పథకం ప్రకటించింది. 2018 ఆర్థిక సంవ త్సరంలో రాబడులు 7-8శాతం వృద్ధి ఉంటుందని కంపెనీ చెపుతోంది. 12నెలల పరంగా సగటు షేరు ధర రూ.1100గా ఉంటుందని, ప్రతివాటాకు రాబడిని 15రెట్లు అంచనావేసింది. రాబడి మార్గ దర్శకాలను చూస్తే ఇన్ఫోసిస్‌ ఇతర కంపెనీలకంటే ఉత్తమంగా కనిపించింది. ఎక్కువ పోటీ, పటిష్ట పడుతున్న రూపాయి వంటి కారణంగా కొంత ఒత్తిడులు ఉంటాయని జఫరీస్‌, ఎడెల్విసిస్‌ వంటి సంస్థలు చెపుతున్నాయి. కంపెనీ షేరు 1173గా కొనుగోలు చేసుకోవచ్చని ఎడెల్విసిస్‌ సూచించింది.
1entertainment
Hyderabad, First Published 7, Sep 2018, 2:05 PM IST Highlights టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే గౌతమ్ నటించిన సినిమాలు ఆయన్ని హీరోగా నిలబెట్టలేకపోతున్నాయి.  నటీనటులు: రాజా గౌతమ్‌, చాందినీ చౌదరి, జాన్‌ కోట్లే, అభిరామ్‌, మోహన్‌ భగత్‌ తదితరులు సంగీతం: నరేష్‌ కుమారన్‌ సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్‌రెడ్డి ఎడిటింగ్: ఫణీంద్ర నరిశెట్టి నిర్మాణం: ది క్రౌడ్‌ దర్శకత్వం: ఫణీంద్ర నరిశెట్టి టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే గౌతమ్ నటించిన సినిమాలు ఆయన్ని హీరోగా నిలబెట్టలేకపోతున్నాయి. ఈ క్రమంలో మూడున్నరేళ్లు కష్టపడి 'మను' అనే సినిమా కోసం పని చేశాడు. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ తో ఆడియన్స్ దృష్టి ఆకర్షించింది. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతమేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం! కథ:  ఈస్ట్ కోస్ట్ సముద్ర తీరంలో సియా అనే దీవిలో నివసించే ఆర్టిస్ట్ మను(రాజా గౌతమ్). అక్కడే ఫోటో స్టూడియోని నడుపుతూ తన తండ్రితో కలిసి జీవిస్తుంటుంది నీల(చాందిని చౌదరి). మను ఆర్ట్ అంటే నీలకి చాలా ఇష్టం. అయితే వీరి పరిచయం మాత్రం గొడవతో మొదలవుతుంది. ఆ తరువాత మనుని అర్ధం చేసుకొని అతడిని ప్రేమిస్తుంది నీల. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడిన తరువాత వీరి జీవితంలో లోకి నలుగురు వ్యక్తులు ప్రవేశిస్తారు. వారి కారణంగా మను, నీల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది..? చివరికి వీరి ప్రేమ సక్సెస్ అవుతుందా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ:  ఓ వజ్రాన్ని దొంగిలించడం కోసం ముగ్గురు వ్యక్తులు చేసే పని కారణంగా ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఎలా మలుపు తీసుకుంటాయనే పాయింట్ తో దర్శకుడు ఈ సినిమా కథను రాసుకున్నాడు. సినిమా మొదలైన కాసేపటికే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో నడిచే కథ అనుకుంటాం. కానీ కొద్దిసేపటికే హారర్ జోనర్ లో కథ నడుస్తుంది. హారర్ అంటే మన తెలుగు సినిమాల్లో కనిపించే తెల్లజీర, విరబూసిన జుట్టు లాంటి రొటీన్ సన్నివేశాలు కాకుండా కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా కోసం ఒక దీవిని సెలెక్ట్ చేసుకోవడం, కథనాన్ని కొత్తగా నడిపించాలని డైరెక్టర్ చేసిన ప్రయత్నం పూర్తి స్థాయిలో వర్కవుట్ కాలేదు. ఒకే కథను పలు రకాల జోనర్లలో నడిపిస్తూ ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి ట్రై చేసి దర్శకుడు బోల్తా పడ్డాడు. స్క్రీన్ ప్లే పరంగా దొర్లిన తప్పులు సినిమాను దెబ్బతీశాయి. దర్శకుడు అనుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో తప్పులు జరగడంతో సినిమా రిజల్ట్ పై దాని ప్రభావం పడింది. ప్రయోగాత్మక సినిమా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా తీయగలమా..? లేదా..? అని కూడా చూసుకోవాలి. మనం చెప్పాలనుకునే పాయింట్ ఆడియన్స్ కి అర్ధంకాకుండా కన్ఫ్యూజన్ లో పడేస్తే.. గనుక ఇంక అంతే సంగతులు. ఈ సినిమా పరిస్థితి కూడా అదే. హీరో పాత్ర చెప్పే డైలాగ్స్ అర్ధం చేసుకుంటే పర్వాలేదు లేదంటే మాత్రం అయోమయానికి గురవుతాం. ఈ సినిమా కోసం హీరో రాజా గౌతమ్ మూడున్నరేళ్లు కష్టపడ్డానని చెప్పాడు. సినిమా చూసిన తరువాత అంతగా కష్టపడానికి ఏముందని అనిపిస్తుంది. కానీ తన మార్చుకొని డిక్షన్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకున్నాడు. సరికొత్తగా కనిపిస్తూ సన్నివేశానికి తగ్గట్లుగా నటిస్తూ మెప్పించాడు. కథ మొత్తం అతడి చుట్టూనే తిరుగుతుంటుంది. చాందిని చౌదరి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో నటన పరంగా ఆకట్టుకుంటుంది. తెరపై అందంగా కూడా కనిపించింది. టిపికల్ రోల్ లో కనిపించి తన నటనతో మెప్పించాడు అభిరాం వర్మ. మిగిలిన పాత్రదారులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నరేష్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్. కథ మొత్తం రెండు, మూడు గదుల్లోనే జరుగుతున్నప్పటికీ ఆ ఫీలింగ్ ప్రేక్షకులకు కలగదు. లొకేషన్లు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. దర్శకుడిగా తన భావాలను ప్రేక్షకులకు చెప్పే తొందరలో ఫణీంద్ర నరిశెట్టి ఏదేదో చెప్పేశాడు. గంటన్నరలో చెప్పాల్సిన కథని మూడు గంటల పాటు సాగదీసి ప్రేక్షకులకు విసుగొచ్చేలా చేశాడు. ఆయన రాసుకున్న డైలాగ్స్ లో కొన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ఈ ప్రయోగం ఆడియన్స్ కు అర్ధమవ్వడం కష్టమనిపిస్తుంది. రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ఆడియన్స్ మాత్రం ఒకసారి ఈ సినిమా చూసే సాహసం చేయొచ్చు.  రేటింగ్: 2/5
0business
Aug 21,2017 సేవింగ్స్‌ వడ్డీరేట్లకు మరో రెండు బ్యాంకులు కోత! ముంబయి: సేవింగ్‌ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ మరో రెండు బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీిఐసీఐ బ్యాంకు కూడా సేవింగ్‌ అకౌంట్‌ డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లను 50 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టింది. దీంతో రూ.50 లక్షలు కన్నా తక్కువున్న డిపాజిట్లపై వడ్డీరేట్లు 3.5 శాతానికి పడిపోయాయి. రూ.50 లక్షలు ఆపై ఉన్న డిపాజిట్లకు వడ్డీరేట్లను యథాతథంగా 4 శాతంగానే కొనసాగిస్తున్నట్టు ఆ బ్యాంకు తెలిపింది. ఈ వడ్డీరేట్లు ఆగస్టు 19 నుంచి అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. కాగా యూనియన్‌ బ్యాంకు కూడా సేవింగ్‌ ఖాతాలపై అర్ధశాతం వడ్డీ రేట్లకు కోత పెట్టినట్టు తెలిపింది. రూ.25లక్షల డిపాజిట్ల వరకు మూడున్నర శాతం వడ్డీ చెల్లించనున్నట్లు పేర్కొంది. రూ.25 లక్షలు పైబడిన వాటిపై యథాతథ వడ్డీ రేటును అందించనున్నట్టు తెలిపింది. ఎస్‌బీఐతో మొదలైన సేవింగ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు ఒక్కో బ్యాంకు ఈ కోతలకు వరుస కడుతున్నాయి. ఇప్పటికే బ్యాంకు ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, యాక్సిస్‌ బ్యాంకు, యెస్‌ బ్యాంకు, కర్నాటక బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా వడ్డీరేట్లను తగ్గించాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
అధిక మూలధనంతో ఆదుకోవాలి - నోట్ల రద్దుతో నిలిచిన రుణాలు - తాత్కాలిక ఇబ్బందులు తలెత్తాయి - సేవాపన్ను ఎత్తివేయాలి :బ్యాంకర్ల సమావేశాల్లో పీఎస్‌బీలు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారంలో తాత్కాలిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంగళవారం 'ప్రభుత్వ రంగ బ్యాంకు'లు (పీఎస్‌బీ) సర్కారుకు తమ ఆవేదన వ్యక్తం చేశాయి. వీటిని తట్టుకొని రాణించేందుకు సర్కారు అధిక మూలధనాన్ని సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని వేడుకున్నాయి. దీనికి సంబంధించి 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్‌బీఐ)కి పలు ప్రతిపాదన పంపినట్లు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ముందస్తు కసరత్తులో భాగంగా మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ బ్యాంకుల ప్రధాన అధికారులతో భేటీ అయ్యారు. గతేడాది రూపొందించిన 'ఇంద్రధనుస్సు' రోడ్‌మ్యాప్‌లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వారు గుర్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీలకు రూ.25,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చాల్సి ఉంది. గత జులైలో తొలి రౌండ్‌లో భాగంగా 13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.22,915 కోట్ల మూలధనాన్ని ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 75 శాతం కేటాయింపులు మాత్రమే జరిగాయి. పెద్దనోట్ల రద్దు ప్రకటించిన నవంబర్‌ 8 నుంచి బ్యాంకులు రుణాలు ఇవ్వడం మానేశాయి. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో బ్యాంకులపై పని భారం పెరిగి రుణాల జారీని నిలిపివేశాయి. డిజిటల్‌ లావాదేవీలపై సర్వీసు ట్యాక్స్‌ను ఎత్తివేయాలని బ్యాంకర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఆందోళన బాటన బ్యాంకు ఉద్యోగులు.. పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న బ్యాంకు ఉద్యోగులు అందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దశల వారీగా తమ పని ఒత్తిడిని, ఆందోళనను సర్కారుకు తెలియజేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. 'ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన'్‌, 'ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌' సహా వివిధ బ్యాంకులు, వారి ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28న భారీ ఎత్తున ఆందోళన నిర్వహించనున్నారు. అనంతరం 29న జైట్లీకి ఒక లేఖను అందించనున్నామని యూనియన్లు ప్రకటించాయి. ఇదే అంశమై జనవరి 2, 3 తేదీల్లో కూడా ఆందోళన నిర్వహించనున్నట్టు తెలిపాయి. ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌, ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌ వెంకటాచలం, బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఎస్‌ నాగార్జున ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. తమ సంస్థల పిలుపు మేరకు, ఇప్పటికే తమ యూనిట్లు అన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రదర్శనల కార్యక్రమం చేపట్టి స్థానిక ఆర్‌బీఐ అధికారులకు మెమోరాండం అందించినట్టు తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV Actress Hema: హేమకు బిగ్ బాస్ పిలుపు.. జరిగిన అవమానం చాలంటూ ఝలక్ బిగ్ బాస్ సీజన్ 3‌ ముగింపు దశకు చేరుకుంది. టైటిల్ పోరులో ఐదుగురు పోటీ పడుతుండగా.. విజేత ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇక ఫైనల్ ఎపిసోడ్ షూట్‌కి కసరత్తులు మొదలయ్యాయి. Samayam Telugu | Updated: Oct 29, 2019, 07:01PM IST హేమ, నాగార్జున సీనియర్ నటి హేమ కెరియర్‌లో బిగ్ బాస్ సీజన్ 3 ఒక చేదు జ్ఞాపకం అనే చెప్పాలి. 17 మంది కంటెస్టెంట్స్‌‌ బిగ్ బాస్ హౌస్‌కి రాగా.. వాళ్లలో తొలి వారమే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. మొదట్లో హేమక్కా.. హేమక్కా అంటూ ఇంటి సభ్యులు ఆమెతో బాగానే ఉన్నా.. కిచెన్ ఈమె ఆధిపత్యాన్ని భరించలేక హేమక్క ఆటకట్టించారు. ఆమెను తొలివారమే నామినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుండి బ్యాగ్ సర్దేలా చేశారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత హేమ ఆ షోపై సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా శ్రీముఖిని ఉద్దేశించి ఆమె వల్లే తను బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యానని.. శ్రీముఖి బర్త్ డే వేడుకలో తనను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపడానికి కుట్ర చేశారంటూ సంచలన ఆరోపణలు చేసింది హేమ. పోల్ ఎవరు ఎన్ని వారాలు ఉండాలి? ఎవర్ని ఎలిమినేట్ చేయాలి? ఎవర్ని విన్నర్ చేయాలనేది అంతా ప్లాన్ ప్రకారం జరిగిందన్నారు హేమ. ముఖ్యంగా తనను నెగిటివ్‌గా చూపించాలనే బిగ్ బాస్ ప్లాన్ అని.. తాను మంచిగా మాట్లాడిన ఒక్కదాన్ని కూడా చూపించలేదని.. ఇంతకీ బిగ్ బాస్ అంటే ఎవడో కాదు.. ఎడిటరే బిగ్ బాస్.. వాడికి నెగిటివ్ తప్ప పాజిటివ్ కనిపించదు. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తరువాత షో డైరెక్టర్‌కి గట్టిగా క్లాస్ ఇచ్చా. తప్పై పోయింది అని వాళ్లు ఒప్పుకోవడంతో వాళ్లను వదిలేశా’ అంటూ ఫైర్ అయ్యింది హేమ. Read Also: షాకింగ్: ‘బిగ్ బాస్ విన్నర్‌గా శ్రీముఖి.. మిగిలినోళ్లు వెర్రి వెంగలప్పలు’ ఇక బిగ్ బాస్ షో ముగింపు దశకు చేరుకోవడంతో ఫైనల్ ఎపిసోడ్ షూట్‌కి కసరత్తులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బిగ్ బాస్ హౌస్‌ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను ఫైనల్ ఎపిసోడ్ పిలవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఫైనల్ ఎపిసోడ్‌ కోసం బిగ్ బాస్ నిర్వాహకులు హేమను సంప్రదించగా.. వాళ్లకు ఝలక్ ఇచ్చిందట. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ ఫైన్ ఎపిసోడ్ షూట్ ఈనెల 31 తరువాతి 1, 2 తారీఖుల్లో షూట్ కోసం రమ్మని నన్ను పిలిచారు. నాకు జరిగిన అవమానం చాలు మళ్లీ అవసరం లేదని వాళ్లకు చెప్పేశా. నేను బిగ్ బాస్ ఫైనల్‌కి వెళ్లడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది హేమ.
0business
మిస్టర్‌ యోగి ఫస్ట్‌లుక్‌ విడుదల ఫోటో గ్యాలరీ First Published 10, Jul 2017, 3:33 PM IST మిస్టర్‌ యోగి ఫస్ట్‌లుక్‌ విడుదల ఫోటో గ్యాలరీ మిస్టర్‌ యోగి ఫస్ట్‌లుక్‌ విడుదల ఫోటో గ్యాలరీ మిస్టర్‌ యోగి ఫస్ట్‌లుక్‌ విడుదల ఫోటో గ్యాలరీ మిస్టర్‌ యోగి ఫస్ట్‌లుక్‌ విడుదల ఫోటో గ్యాలరీ మిస్టర్‌ యోగి ఫస్ట్‌లుక్‌ విడుదల ఫోటో గ్యాలరీ మిస్టర్‌ యోగి ఫస్ట్‌లుక్‌ విడుదల ఫోటో గ్యాలరీ మిస్టర్‌ యోగి ఫస్ట్‌లుక్‌ విడుదల ఫోటో గ్యాలరీ మిస్టర్‌ యోగి ఫస్ట్‌లుక్‌ విడుదల ఫోటో గ్యాలరీ మిస్టర్‌ యోగి ఫస్ట్‌లుక్‌ విడుదల ఫోటో గ్యాలరీ మిస్టర్‌ యోగి ఫస్ట్‌లుక్‌ విడుదల ఫోటో గ్యాలరీ మిస్టర్‌ యోగి ఫస్ట్‌లుక్‌ విడుదల ఫోటో గ్యాలరీ మిస్టర్‌ యోగి ఫస్ట్‌లుక్‌ విడుదల ఫోటో గ్యాలరీ Recent Stories
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు బంగారం, వెండి ధరలు చాలా రోజుల తరువాత తగ్గాయి. TNN | Updated: Oct 5, 2016, 07:46PM IST బంగారం, వెండి ధరలు చాలా రోజుల తరువాత తగ్గాయి. బుధవారం బంగారం ధర రూ.730 తగ్గింది. పదిగ్రాముల పసిడి ధర రూ.30,520 కు చేరింది. ఈ ఏడాది ఒక్క రోజులో ఇంత మొత్తం తగ్గడం ఇదే తొలిసారి. ఇక వెండి ధర రూ.1750 పడిపోయి రూ.43,250కు దిగజారింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర చాలా తగ్గింది. ఔన్సు బంగారం ధర 1300 డాలర్ల దిగువకు పడిపోయింది. అమెరికాలో వడ్డీరేట్లు పెరిగే అవకాశమున్నట్టు సంకేతాలు రావడంతో ఆ ప్రభావం పసిడిపై పడినట్టు నిపుణులు చెబుతున్నారు.
1entertainment
Jun 06,2015 కొనసాగిన స్తబ్ధత..           ముంబయి : వరుసగా నాలుగో సెషన్‌లోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులపై నెలకొన్న ఆందోళన లకు తోడు ఇక ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించనుందన్న అంచనా ల్లో మార్కెట్లు ప్రతికూల తలతో నమోద య్యాయి. ఈ నేపధ్యం లోనే బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 44.93 పాయింట్లు లేదా 0.17 శాతం పడిపోయి 26,768.49కు దిగజారింది. ఇదే తరహాలో నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 15.95 పాయింట్లు తగ్గి 8,114.70 వద్ద ముగిసింది. రంగాల వారిగా లోహ సూచీ అత్యధికంగా 1.78 శాతం రాణించింది. పిఎస్‌యు 1.35 శాతం, ఎఫ్‌ఎంసిజి 1.05 శాతం, మౌలిక వసతులు 0.93 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు రియాల్టీ సూచీ అత్యధికంగా 1.44 శాతం నష్టపోయింది. ఇదే క్రమంలో బ్యాంకింగ్‌ 0.93 శాతం, ఐటి 0.8 శాతం, ఆటో 0.6 శాతం చొప్పున నష్టాలు చవి చూశాయి. కోల్‌ ఇండియా 4.44 శాతం, గెయిల్‌ 3.42 శాతం, ఎన్‌టిపిసి 2.58 శాతం, ఒఎన్‌జిసి 2.32 శాతం, సన్‌ఫార్మా 1.97 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంకు 2.18 శాతం, టాటా మోటార్స్‌ 2.11 శాతం, హెచ్‌డిఎఫ్‌సి 1.62 శాతం, యాక్సిస్‌ బ్యాంకు 1.38 శాతం, టిసిఎస్‌ 1.3 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌ సూచీ యథాతథంగా చోటు చేసుకోగా, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.3 శాతం తగ్గించింది. మదుపర్ల మద్దతుతో 1,379 స్టాక్స్‌ లాభాల్లో ముగియగా, మరోవైపు 1,292 స్టాక్స్‌ ప్రతికూలతలో నమోదయ్యాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
11న హరారే వేదికగా తొలి వన్డే 3 వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు పర్యటనలో ధోనీ ఒక్కడే సీనియర్‌ బంగర్‌ తాత్కాలిక ప్రధాన కోచ్‌ హరారే : జింబాబ్వే పర్యటనలో భారత యువ క్రికెటర్లు సత్తా చాటేందుకు ఒక మంచి అవకాశమని టీమిండియా తాత్కాలిక ప్రధాన కోచ్‌ సంజయ్ భంగర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఈనె 11న ఆరంభం కానున్న పరిమితి ఓవర్ల సిరీస్‌లో భారత్‌ మూడు వన్డేలు,మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. సీనియర్‌ క్రికెటర్లకు విశ్రాంతి నిచ్చిన సెలక్టర్లు, అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేని యువ క్రికెటర్లకు ఈ పర్యటనకు ఎంపిక చేసింది.అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా నిరూపించుకునేందుకు యువ క్రికెటర్లకు ఇదొక మంచి అవకాశం, జట్టు తాత్కాలిక కోచ్‌గా నన్ను బిసిసిఐ ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది అని భంగర్‌ పేర్కొన్నాడు. కాగా 2013, 2015లో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత్‌ జట్టు ఆతిథ్య జట్టును వైట్‌వాష్‌ చేసింది.జట్టులో ధోనీ ఒక్కడే అనుభవం ఉన్న ఆటగాడు కావడంతో పర్యటనలో కుర్రాళ్లను ఎలా నడిపిస్తాడనే ఆసక్తి నెలకొంది.కాఆ జూన్‌ 11న తొలి వన్డే మ్యాచ్‌ హరారే వేదికగా జరుగనుంది. జింబాబ్వే చేరుకున్న ధోనీ సేన ధోనీ నాయకత్వంలో యువకులతో కూడిన భారత క్రికెట్‌ జట్టు గురువారం జింబాబ్వే చేరుకుంది.పదహారు మంది సభ్యుల భారత క్రికెట్‌ బృందం జింబాబ్వే పయనమైన సంగతి తెలిసిందే. సుమారు రెండు రోజుల సుధీర్ఘ ప్రయాణం అనంతరం ఎట్టకేలకు భారత క్రికెట్‌ జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టింది. కాగా ఈ మేరకు ధోనీ అండ్‌ గ్యాంగ్‌ జింబాబ్వే చేరుకున్నట్లు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బిసిసిఐ) ట్విటర్‌లో స్పష్టం చేసింది. జింబాబ్వే పర్యటనలో టీమిండియా 3 వన్డేలు,3 టి20ల సిరీస్‌ ఆడనుంది.ఇరుజట్ల మధ్య జూన్‌ 11 నుంచి 15 వరకు వన్డే సిరీస్‌,18వ తేదీ నుంచి 22 వరకు టి20 సిరీస్‌ జరుగనుంది. జూన్‌ 11న తొలి వన్డే,జూన్‌ 13న రెండవ వన్డే,జూన్‌ 15న మూడవ వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి టి20 జూన్‌ 18న, రెండవ టి 20 జూన్‌ 20న, మూడవ టి20 జూన్‌ 22న జరుగనుంది. కాగా ఈ మ్యాచ్‌లన్నీ హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ స్టేడియంలో నిర్వహించనున్నారు.
2sports
internet vaartha 157 Views నేరుగా వాణిజ్య రవాణా హైదరాబాద్‌ : భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు సముద్ర యానానికి కృష్ణపట్టణం పోర్టు వేదికగా నిలిచింది. రెండుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు వృద్ధి చేసుకునేందుకు ఒప్పందం కూడా జరిగింది. మెరు గైన కనెక్టివిటీ ఈసేవల ద్వారా ఖర్చుకూడా ఆదా అవుతుందని పోర్టు వెల్లడించింది ఇరుదేశాల ఓడలను దేశీయ ఓడలుగానే భావిస్తారని స్పష్టం అయింది. రెండు దేశాలమధ్య వాణిజ్యం సులభ తరం చేయడానికి మొట్టమొదటి కంటెయినర్‌ వెస్సల్‌ ఈనెల 28వతేదీనుంచి ప్రయాణం ప్రారంభించింది. తొలుత భారతప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ హయాంలో 1974లోనే ఒప్పందం జరి గింది. ఆతర్వాత నాలుగు దశాబ్దాల తర్వాత నరేంద్రమోడీ గత ఏడాది ఢాకా పర్యటనలో భాగంగా పునరుద్ధరించారు. ఎంవిహార్బర్‌-1ను నీసా పారి బహాన్‌సొంతం చేసుకున్నారు. వెస్ట్రన్‌ మెరైన్‌షిప్‌ యార్డ్‌ నిర్మించిన ఈ నౌక ఇరుదేశాలనుంచి అంగీ కార పత్రాలను పొందిన మొట్టమొదటి బంగ్లాదేశ్‌ కంటైనర్‌గా నిలిచింది. కృష్ణపట్టణం ఎండి చింతా శశిధర్‌ మాట్లాడుతూ కృష్ణపట్టణం పోర్టుకే కాకుం డా ఉపఖండంలోని రెండు దేశాల నడుమ ద్వైపా క్షిక వాణిజ్యం వృద్ధి చేయనున్న ఒప్పందం అని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం విస్తరించేందుకు అనువుగా కొన్నినిబంధనలు కూడా సడలించినట్లు తెలిపారు రెండుదేశాల వెస్సెల్స్‌ ఇండియా, బంగ్లాదేశ్‌లలో ప్రవేశించినంతనే వాటిని దేశీయ ఓడలుగా పరిగణిస్తారని ఆయన అన్నారు. భారత్‌లోని పెట్రా పోల్‌, బంగ్లాదేశ్‌లోని బెనాపోల్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ పరిష్కరించేందుకు కీలకపాత్ర పోషిస్తుంద న్నారు. గతంలో భారతీయ నౌకాశ్రయాలకు బంగ్లాదేశ్‌కు రవాణాచేయాలంటే కొలంబో లేదా సింగపూర్‌మార్గాల నుంచి చేయాల్సి వచ్చేదని, ఇపుడు ప్రత్యక్ష సేవలను ప్రారంభిం చడం ద్వారా ఈ తరహా రవాణాకు అయ్యే సమయాన్ని రెండునుంచి ఐదురోజులకు తగ్గించే అవకాశం ఉందన్నారు రెండుదేశాలమధ్య మరింత పటిష్టమైన వాణిజ్య బంధం ఏర్పడుతుందని చింతాశశిధర్‌ వెల్లడించారు. డైరెక్టర్‌ సిఇఒ అనిల్‌ యెండ్లూరి మాట్లాడుతూ ఎగుమతి, దిగుమతి దారుల మధ్య సానుకూలతను మరింత వృద్ధి చేస్తుందన్నారు. ఈశాన్యరాష్ట్రాలకు కూడా కోస్తా షిప్పింగ్‌ద్వారా ప్రయోజనం కలుగుతుందని, చట్ట గ్యాంగ్‌వరకూ సరుకురవాణాచేసి అక్కడినుంచి రోడ్డు లేదా ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ ద్వారా రవాణా చేసుకోవచ్చుని అన్నారు. 94శాతం భారతీయ ఎగుమతులు, దిగుమతుల వాణిజ్యం, పశ్చిమ, మధ్య దక్షిణభారత్‌ల నుంచే బంగ్లాదేశ్‌కు జరుగు తున్నాయని, ఇపుడు అత్యధికశాతం కార్గో రోడ్‌ నుంచి సముద్రమార్గం ద్వారా జరగడంతో పాటు ఎగుమతి దారులకు ధరలు, రవాణా పరంగా బహుళ ప్రయోజనాలు కలుగుతాయన్నారు పంజాబ్‌లోని లూథియానా నుంచి యార్న్‌ను ముంద్రాకు పంపడం కాకుండా కృష్ణపట్టణం పోర్టుకు నేరుగా పంపించవచ్చన్నారు. బెంగళూరునుంచి బంగ్లాదేశ్‌ తో వాణిజ్యంజరిపే ఎగుమతి దిగుమతిదారులు ఐసిడి బెంగళూరు నుంచి వారం రైలు సర్వీసు, లేదారోడ్డుద్వారా ట్రక్‌, ట్రైలర్‌ సర్వీసులు ఉపయో గించుకోవచ్చని కృష్ణపట్టణం పోర్టు కంటెయినర్‌ టెర్మినల్‌ డైరెక్టర్‌ వినీతా వెంకటేష్‌ పేర్కొన్నారు.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV జాఫర్ భాయ్.. 40 ఏళ్ల వయసులోనూ ఏంటీ ఆట! వషీం జాఫర్.. ఒకప్పుడు టీమ్ ఇండియా తరఫున 31 టెస్టు మ్యాచులు ఆడిన బ్యాట్స్‌మన్. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో దూరమైన ఈ ఆటగాడి వయసు ప్రస్తుతం 40 ఏళ్లు. TNN | Updated: Mar 15, 2018, 05:42PM IST వషీం జాఫర్.. ఒకప్పుడు టీమ్ ఇండియా తరఫున 31 టెస్టు మ్యాచులు ఆడిన బ్యాట్స్‌మన్. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో దూరమైన ఈ ఆటగాడి వయసు ప్రస్తుతం 40 ఏళ్లు. అయితే ఆయన బ్యాటింగ్‌లో జోరు మాత్రం తగ్గలేదు. వయసు మీదపడినా దేశవాళీ క్రికెట్‌లో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నాడు. ప్రస్తుతం ఇరానీ కప్‌లో విదర్భ తరఫున ఆడుతున్న డబుల్ సెంచరీ సాధించాడు. ఇరానీ కప్‌లో భాగంగా విదర్భ, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య బుధవారం నుంచి నాగ్‌పూర్‌లో ఐదు రోజుల మ్యాచ్ ప్రారంభమైంది. విదర్భ బ్యాటింగ్ ఆరంభించింది. తొలిరోజు సెంచరీ బాదిన జాఫర్.. రెండో రోజు కూడా తన జోరును కొనసాగించాడు. 40 ఏళ్ల వయసులోనూ చూడచక్కని ఆటతో కట్టిపడేశాడు. రెండో రోజు ఆటముగిసే సమయానికి జాఫర్ 285 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం 425 పరుగులు ఎదుర్కొన్న జాఫర్.. 34 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో ట్రిపుల్ సెంచరీకి చేరువయ్యాడు. జాఫర్‌తో పాటు గణేశ్ సతీష్ (120), ఫయీజ్ ఫజల్ (89), సంజయ్ రామస్వామి (53), అపూర్వ వాంఖడే (44 నాటౌట్) రాణించడంతో విదర్భ మూడు వికెట్ల నష్టానికి 598 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇదిలా ఉంటే, ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 53వ సెంచరీ నమోదుచేసిన జాఫర్ దాన్ని డబుల్ సెంచరీగా మలచడం ద్వారా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 40 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ సాధించిన ఐదో భారత ఆటగాడిగా జాఫర్ రికార్డులకెక్కాడు. అంతేకాకుండా, ఇరానీ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో పాటు ఇరానీ కప్‌లో వరుసగా ఆరు అర్ధశతకాలు నమోదు చేసిన రెండో ఆటగాడిగానూ నిలిచాడు. మాజీ క్రికెటర్‌ గుండప్ప విశ్వనాథ్‌ మాత్రమే ఇప్పటి వరకు ఇరానీ కప్‌లో వరుసగా ఆరు అర్ధశతకాలు నమోదు చేశారు. ఇప్పుడు ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా జాఫర్‌ నిలిచాడు. ఇప్పటి వరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మొత్తం 242 మ్యాచ్‌లు ఆడిన జాఫర్.. 18,109 పరుగులు చేశాడు. వీటిలో 53 సెంచరీలు, 86 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 314 నాటౌట్. వయసు మీద పడినా అద్భుతంగా ఆడుతున్న జాఫర్‌కు గంగూలీ, కైఫ్, ఆకాశ్ చోప్రా వంటి సీనియర్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుతం 285 పరుగుల వద్ద ఉన్న జాఫర్ మూడో రోజు డబుల్ సెంచరీ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. Well done Wasim Jaffer ..old man still super @bcci — Sourav Ganguly (@SGanguly99) March 15, 2018 Wasim Jaffer is an inspiration. At 40, has scored a brilliant double hundred against a Rest of India attack also compromising Ashwin. — Mohammad Kaif (@MohammadKaif) March 15, 2018 Jaffer’s contribution to Indian cricket goes beyond the runs he’s scored....players like him are the very reason of Indian cricket’s robust domestic circuit. Keep raising the bar. Keep pushing the next generation. Class Act. — Aakash Chopra (@cricketaakash) March 15, 2018   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Virat Kohli‌ని చూసి నేర్చుకోండి.. ఆసీస్‌కి కోచ్ అక్షింతలు విరాట్ కోహ్లీ ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో..? చూసి నేర్చుకోవాలని ఇప్పటికే మా టీమ్ ఆటగాళ్లకి చెప్పాను. కోహ్లీ, పుజారా.. చాలా ప్రమాదకరమైన ఆటగాళ్లు -ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్ Samayam Telugu | Updated: Dec 29, 2018, 12:44PM IST Virat Kohli‌ని చూసి నేర్చుకోండి.. ఆసీస్‌కి కోచ్ అక్షింతలు టెస్టుల్లో ఎలా ఆడాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని ఆస్ట్రేలియా క్రికెటర్లకి ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్ సూచించాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో పేలవంగా 151 పరుగులకే ఆలౌటైన ఆస్ట్రేలియా జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 227/8తో ఓటమికి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో.. మీడియాతో మాట్లాడిన గ్రేమ్ హిక్.. పైవిధంగా స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో..? చూసి నేర్చుకోవాలని ఇప్పటికే మా టీమ్ ఆటగాళ్లకి చెప్పాను. కోహ్లీ, పుజారా.. చాలా ప్రమాదకరమైన ఆటగాళ్లు. తొలుత.. 20 నుంచి 25 బంతుల వరకూ ఎలాంటి సాహసాలకి వెళ్లకుండా.. పిచ్‌ని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ని నిర్మించడం మొదలెడతారు. వాస్తవానికి ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లంతా అలానే బ్యాటింగ్ చేస్తారు. ఎవరైనా.. వారిలా ఆడాలనుకుంటే తొలుత మైదానంలో వారి ఆటతీరుని పరిశీలించాలి. ఆ సమయంలో తమ తప్పిదాలు ఏవైనా ఉంటే సరిదిద్దుకోవాలి. ఇంకా చెప్పాలంటే.. అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడాలంటే మైదానంలో క్రమశిక్షణతో పాటు సహనంతోనూ మెలగాలి’ అని గ్రేమ్ హిక్ సూచించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Visit Site Recommended byColombia 314 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు 37 ఓవర్లు ముగిసే సమయానికి 211/5తో మెరుగైన స్థితిలో నిలిచింది. క్రీజులో అప్పటికే 41వ శతకాన్ని పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి, నిలకడగా ఆడుతున్న విజయ్ శంకర్ (32: 30 బంతుల్లో 4x4) ఉండటంతో భారత్ గెలుపు ఖాయమేనని అంతా అనుకున్నారు. కానీ.. ఇన్నింగ్స్ 38వ ఓవర్‌లో ఆడమ్ జంపా బౌలింగ్‌కిరాగా.. హిట్టింగ్‌ గేర్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. తొలి రెండు బంతుల్నీ కళ్లు చెదిరే రీతిలో ఫోర్‌గా మలిచాడు. మూడో బంతిని కూడా హిట్ చేసేందుకు ప్రయత్నించగా.. అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి లెగ్‌స్టంప్‌ను గీరాటేసింది. దీంతో.. 219 పరుగుల వద్ద కోహ్లీ ఔటవగా.. భారత్ 48.2 ఓవర్లలోనే 281 పరుగులకి ఆలౌటైంది. విరాట్ కోహ్లీని ఒకే సిరీస్‌‌లో మూడుసార్లు ఔట్ చేయడం గురించి ఆడమ్ జంపా మాట్లాడుతూ ‘విరాట్ కోహ్లీ చాలా సీరియస్ బ్యాట్స్‌మెన్. మ్యాచ్‌లో కీలకమైన అతని వికెట్ తీయడం చాలా సంతోషంగా ఉంది. సులువుగా నా బౌలింగ్‌‌లో అతను ఔటవుతాడనే అభిప్రాయాన్ని నేను ఒప్పుకోను. కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం. నేను కూడా ఒకింత ఒత్తిడికి గురయ్యాను. నా ఓవర్‌లో అతను మరో రెండు బౌండరీలు కొట్టి ఉంటే..? మ్యాచ్ పూర్తిగా భారత్‌వైపు తిరిగిపోయేది..?’ అని వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ‘అరవింద సమేత’ స్పెషల్ షోలకు అనుమతి రోజుకు ఆరు షోలను ప్రదర్శించుకునే అవకాశాన్ని థియేటర్లకు కల్పించింది. దీంతో ఏ ఇబ్బంది లేకుండా సినిమా చూడొచ్చునని నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. Samayam Telugu | Updated: Oct 8, 2018, 10:08PM IST ‘అరవింద సమేత’ స్పెషల్ షోలకు అనుమతి యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘అరవింద సమేత’. విజయదశమి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్ తాజా చిత్రానికి స్పెషల్ షోలకు పర్మిషన్ లభించింది. వారం రోజులపాటు అదనపు షోలు ప్రదర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోజుకు ఆరు షోలను ప్రదర్శించుకునే అవకాశాన్ని థియేటర్లకు కల్పించింది. దీంతో ఏ ఇబ్బంది లేకుండా సినిమా చూడొచ్చునని నందమూరి ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఫీల్డర్‌ని చూస్తూ.. రోహిత్ శర్మ రనౌట్..! పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కపుగెదర వేగంగా బంతిని సమీపిస్తుండటంతో అతని వైపు చూస్తూ.. బౌలింగ్ ఎండ్‌వైపు TNN | Updated: Aug 20, 2017, 07:12PM IST శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో 217 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన లసిత్ మలింగ బౌలింగ్‌లో బంతిని పాయింట్ దిశగా తరలించిన రోహిత్ శర్మ (4: 13 బంతుల్లో) సింగిల్ కోసం మరో ఎండ్‌లో ఉన్న శిఖర్ ధావన్‌ని పిలిచాడు. దీనికి ధావన్ కూడా వేగంగా స్పందించడంతో సింగిల్ భారత్‌కి సులభంగా వచ్చేలా కనిపించింది. కానీ.. పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కపుగెదర వేగంగా బంతిని సమీపిస్తుండటంతో అతని వైపు చూస్తూ.. బౌలింగ్ ఎండ్‌వైపు రోహిత్ శర్మ నెమ్మదిగా పరుగెత్తాడు. దీని పసిగట్టిన కపుగెదర గురి చూసి వికెట్లవైపు నేరుగా బంతిని విసరగా.. క్రీజుకి ఒక అడుగు దూరంలో రోహిత్ శర్మ బ్యాట్‌ని జారవిడిచి ముందుకు కదిలాడు. అతని పాదం గాల్లో ఉండగానే బంతిని వికెట్లను గీరాటేయడంతో రోహిత్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఒకవేళ బ్యాట్‌ని జారవిడచకపోయినా రోహిత్‌కి జీవనదానం లభించేంది. మొత్తం వ్యవహారం చూస్తే.. బద్ధకంతోనే లంకేయులకి రోహిత్ శర్మ వికెట్ సమర్పించుకున్నట్లు అయ్యింది.
2sports
ఐకియా స్థానికతను పెంచుతాం - అనుకున్న స్థాయిలో సందర్శకులు రావట్లేదు నవతెలంగాణ, వాణిజ్య విభాగం: స్వీడన్‌ పర్నిచర్‌ దిగ్గజం ఐకియా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్టోర్‌కు అంచనా వేసిన స్థాయిలో సందర్శకుల తాకిడి లేదని స్టోర్‌ మేనేజర్‌ జాన్‌ అచిల్లియా అన్నారు. తొలత తాము ప్రతియేటా దాదాపు 70 లక్షల మంది సందర్శకులు స్టోర్‌కు వస్తారని భావించామని.. అయితే ఇప్పుడు దానిని 5 లక్షలకు సవరించుకుంటున్నట్టుగా ఆయన వివరించారు. గత ఆరు నెలల అనుభవం మేరకు తమ అంచనాలను సవరించుకుంటున్నట్టుగా ఆయన తెలిపారు. స్టోర్‌ ప్రారంభంలో తాము అంచనావేసిన దానికంటే సందర్శకుల తాకిడి ఎక్కువగా నమోదు అయిందని.. అయితే రానురాను ఇది తగ్గుతూ వస్తోందని ఆయన తెలిపారు. పానిపట్‌, హర్యాణా సంప్రదాయాలకు అద్దం పడుతూ రూపొందించిన 'ఆంగ్లతర' టెక్స్‌టైల్స్‌ కలెక్షన్‌ను ఆయన స్టోర్‌లో ఆవిష్కరించారు. ఐకియాలో స్థానిక వస్తువులను సమీకరించి విక్రయించే విషయంలో వేగంగా ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. తొలినాళ్లలో స్థానిక వస్తువుల విక్రయం ఒక అంకె స్థాయిలో ఉంటే.. ప్రస్తుతం అది 19% స్థాయికి చేరిందని.. భవిష్యత్తులో దీనిని 30 శాతానికి చేర్చనున్నట్టుగా ఆయన తెలిపారు. షాపింగ్‌ సమయంలో భారతీయులు డబ్బుకు ఎక్కువ విలువనిస్తారని ఆయన వివరించారు. తమ స్టోర్‌లో రూ.15ల నుంచి మొదలుకొని దాదాపు రూ.11 లక్షల వరకు విలువైన ఫర్నిచర్‌ను విక్రయిస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ స్టోర్‌లో గతంలో ప్రపంచంలో ఎక్కడాలేనన్ని ఇంటీరియర్‌ ఫర్నిచర్‌ను అందుబాటులో ఉంచినట్టుగా ఆయన తెలిపారు. గడిచిన ఆరు నెలలో అన్నింటికంటే ఎక్కువగా రంగురంగుల చెంచాలను ఎక్కువగా విక్రయించినట్టుగా ఆయన తెలిపారు. ఆరు నెలల్లో దాదాపు 5 లక్షల చెంచాలను విక్రయించామని ఆయన తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
క్వింటాలుకు రూ.25 పెంపు! చెరకు గిట్టుబాటు ధరలకు ప్రభుత్వ మద్దతు న్యూఢిల్లీ,మే 26: ప్రభుత్వం చెరకు రైతులకు గిట్టుబుధరలు కల్పించే లక్ష్యం తో క్వింటాలకు 25 రూపాయలు పెంచింది. అక్టోబరు నుంచి ప్రారంభం అయ్యే సీజన్‌కోసం క్వింటాలు ధర రూ.255గా నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈమేరకు చెరకు ధర పెంపు నిర్ణ యానికి ఆమోదం తెలిపింది. గిట్టుబాటుధరలపరంగా చెరకు రైతులు న్యాయపరంగా హామీ పొందగలిగే ధరగా భావిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమరాష్ట్రాల్లో సలహా ధర లేదా సూచనాత్మక ధరలను ప్రకటిస్తాయి. మిల్లర్లు ఎఫ్‌ఆర్‌పి ధరకంటే ఎక్కువ ఎంతకైనా కొనుగోలుచేసే వీలుంటుంది. ప్రస్తుతం చక్కెర మిల్లుల పరిస్థితి మెరుగుపడిందని 2017-18లో చక్కెరధరలు రూ.255 క్వింటాలుకు ఆమోదం తెలిపినట్లు ఆర్థికమంత్రి అరున్‌జైట్లీ వెల్లడిం చారు. ప్రస్తుతం ఉన్న ధరకంటే 10.6శాతం ఎక్కువ ఉందని ఆయన అన్నారు. చెరకు మద్దతుధరలు ప్రాథమిక రికవరీరేటు 9.5శాతానికి లింకు అయి ఉంటుంది. వ్యవసాయ ధరల నిర్ణాయక సంస్థ చేసిన సిఫారసులకు అనుగుణంగానే ప్రస్తుత ధరలున్నా యని అభిప్రాయపడింది. ఈఏడాది ఎఫ్‌ఆర్‌పి ధరలు 230గా నిర్ణయించారు గరిష్టధరలకారణంగా ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిం దన్న భావన ఉంది. మిల్లర్లు కూడా ఈ ధరను చెల్లించగలిగే స్థాయిలోనే ఉంటారని రానున్న రోజుల్లో చక్కెరధరలను కూడా సమీక్షించే అవకాశంఉందని నిపుణుల అంచనా. కొన్ని రాష్ట్రాలు ప్రస్తుత ఎఫ్‌ఆర్‌పి ధరకంటే ఎక్కువ ధరలు నిర్ణయిస్తే పరిస్థితిఏమిటన్న ప్రశ్నకు ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. చెరకు దిగుబడి ఈ ఏడాది 12శాతం దిగజారి 306.03 మిలియన్‌టన్నులకు చేరింది. కీలకమైన రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరువు పరిస్థితులు అలుముకోవడమేనని స్పష్టం అవుతున్నది. ఈసారి సాధారణ వర్షపాతఛాయలు అలుముకుంటాయన్న అంచనాలే వాతావరణ శాఖ ప్రకటించడంతో కొంతమేర దిగుబడులు ఆశాజనకంగా ఉండవచ్చని నిపుణులు చెపుతున్నారు.
1entertainment
త్వరలో బాహుబలి పెళ్లి బాజా Highlights త్వరలోనే ప్రభాస్ పెళ్లికి ముహూర్తం -బాహుబలి మూవీకే కొన్నేళ్లుగా అంకితమైన ప్రభాస్ -బాహుబలి 2 షూటింగ్ పూర్తి కాగానే వివాహం మొత్తానికి బాహుబలి మూవీ ప్రభాస్కు ఇచ్చిన సక్సెస్ కిక్ మాత్రం మామూలుది కాదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ దశ తిరిగింది. తన స్టార్ ఇమేజ్ మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ప్రపంచ ప్రముఖుల సరసన తన మైనపు విగ్రహం ప్రతిష్టించే వరకు వెళ్లింది. పెళ్లికి ముందు తనజీవితంలో చెప్పుకోవడానికి ఓ గొప్ప అధ్యాయం ఉండాలని భావించిన ప్రభాస్.. చివరకు అనుకున్నది సాధించాకే పెళ్లికి రెడీ అయ్యాడు. ‘బాహుబలి-2' షూటింగ్ ప్రస్థుతం చివరి దశలో ఉంది. అది పూర్తి కాగానే.. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వ్యవహారాల్లో తలమునకలయ్యేందుకు సిద్ధం కాబోతున్నాడు. వచ్చే సమ్మర్లో వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. బాహుబలి-2 సినిమా రిలీజ్ కంటే ముందే ప్రభాస్ వివాహం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి టుసాడ్ రేంజ్ స్టార్ ప్రభాస్ ను వరించే అమ్మాయి ఎవరనేది ప్రస్థుతానికి సస్పెన్స్ గానే కొననసాగుతోంది. కొంతకాలంగా ప్రభాస్ కు తగిన అమ్మాయి వేటలో ఉన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ చివరకు విశాఖపట్నంలో ప్రభాస్ ఒడ్డు పోడవు, అందానికి తగిన సరిజోడి అయిన పెళ్లి కూతురుని ఎంపిక చేసారట. ప్రభాస్ ను వరించబోయే ఆ అదృష్టవంతురాలు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమర్తె అని తెలుస్తోంది. Last Updated 25, Mar 2018, 11:45 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV బెస్ట్‌ రికార్డుకి అడుగు దూరంలో కోహ్లి..! శ్రీలంకతో సిరీస్‌లో మళ్లీ పరుగుల వేటని మొదలెట్టిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ ఏడాది బెస్ట్ స్కోరర్ రికార్డ్‌కి అడుగు దూరంలో ఉన్నాడు. TNN | Updated: Aug 22, 2017, 03:38PM IST శ్రీలంకతో సిరీస్‌లో మళ్లీ పరుగుల వేటని మొదలెట్టిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ ఏడాది బెస్ట్ స్కోరర్ రికార్డ్‌కి అడుగు దూరంలో ఉన్నాడు. దంబుల్లా వేదికగా ఆదివారం ముగిసిన తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్‌ శతకంతో పాటు కోహ్లి 82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ని 9 వికెట్ల తేడాతో గెలిపించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ రెండో వికెట్‌కి 192 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ 217 పరుగుల లక్ష్యాన్ని కేవలం 28.5 ఓవర్లలోనే అలవోకగా ఛేదించేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు వన్డేల్లో దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్ 16 మ్యాచ్‌ల్లో మొత్తం 814 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతని తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 14 మ్యాచ్‌ల్లో 785 పరుగులతో ద్వితీయ స్థానంలో ఉండగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో 14వ వన్డే(ఏడాదిలో)ని పూర్తిచేసుకున్న కోహ్లి 769 పరుగులతో కొనసాగుతున్నాడు. తాజా సిరీస్‌లో ఇంకా 4 వన్డేలు మిగిలి ఉన్న నేపథ్యంలో కోహ్లి మరో 45 పరుగులు చేస్తే.. ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు అందుకుంటాడు. రెండో వన్డే గురువారం జరగనుంది.
2sports
New Delhi, First Published 4, Apr 2019, 3:05 PM IST Highlights  దేశీయ రెండో విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్‌లో ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ నెలలో కూడా విమానాలు పైకెగరలేవని ఆ సంస్థ వర్గాలే చెబుతున్నాయి. సంస్థ ఉజ్వల భవిష్యత్ కోసం నియంత్రణ అధికారాలను, ప్రయోజనాలను వదులుకుంటున్నట్లు జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ తెలిపారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్ వాణిజ్య లావాదేవీల సంగతి తమకేమీ తెలియదని, బ్యాంకర్లు చూసుకుంటారని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. సర్వీసుల నిర్వహణను మాత్రమే తాము పర్యవేక్షిస్తామన్నారు.  ముంబై: నరేశ్ గోయల్ సారథ్యం నుంచి బ్యాంకర్ల కన్సార్టియం చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ ప్రభ మారలేదు. గోయల్, ఆయన భార్య రాజీనామా చేసిన వెంటనే బ్యాంకర్ల కన్సార్టియం జెట్ ఎయిర్వేస్ సంస్థకు తక్షణ సాయంగా రూ.1,500 కోట్ల డెట్ రుణం మంజూరు చేశాయి. రుణం నిధులు మరో వారంలోగా సంస్థ ఖాతాలో చేరకుంటే ఈ నెలలోనూ జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ దిశగా ముందడుగు వేయలేదని విశ్వసనీయ వర్గాల కథనం. ఇప్పటివరకు సాంకేతిక కారణాల వల్లే సంస్థ ఖాతాల్లో చేరలేదని సమాచారం. జెట్ ఎయిర్వేస్ టాప్ మేనేజ్మెంట్ ఇప్పటికే పునరుద్ధరణ ప్రణాళిక భవితవ్యంపై స్పష్టత కోసం బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ప్రత్యేకించి ఆర్బీఐ దివాళా సర్క్యులర్ కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత రుణ బకాయిల వసూలు విషయమై బ్యాంకర్లలోనే స్పష్టత లేదని తెలుస్తోంది.  ఇదిలా ఉంటే సంస్థ ఉజ్వల భవిష్యత్ కోసం తాను దాని నుంచి లభించే అన్ని నియంత్రణ, ప్రయోజనాలను వదులుకుంటున్నట్లు జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ ప్రకటించారు. గత వారంలో వచ్చిన రూ.180- 200 కోట్ల రుణం డిసెంబర్ వేతనాల చెల్లింపు, జెట్ ఫ్యూయల్ డ్యూస్ చెల్లింపులకే సరిపోయాయి.  విమాన లీజు సంస్థలకు పైసా చెల్లించకపోవడంతో వాటి యాజమాన్యాలు అసంత్రుప్తిగా ఉన్నాయి. తమకు బకాయిలు చెల్లించే వరకు విమానాలను ఎగురనివ్వబోమని విమాన లీజు సంస్థల యాజమాన్యాలు పేర్కొంటున్నట్లు సమాచారం.  మరోవైపు ఉద్యోగులు వేతన బకాయిల పరిస్థితిపై స్పష్టత కోరుతున్నారు. టీపీజీ అనే సంస్థ కూడా జెట్ ఎయిర్వేస్ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి నిరాకరించింది. ప్రస్తుతం 28 జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు మాత్రమే సేవలందిస్తున్నాయని, అందులో 15 దేశీయ మార్గాల్లో నడుస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ ఖరోలా తెలిపారు. అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులు కొనసాగించే సామర్థ్యం సంస్థకు ఉందా అనే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ ఖరోలా తెలిపారు. జెట్‌కు నిధులందించడంపై మాట్లాడుతూ, ఆ విషయాన్ని బ్యాంకులు చూసుకుంటాయన్నారు. దీనిపై జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రతినిధి స్పందిస్తూ, తగినన్ని విమానాలతో, కుదించిన షెడ్యూల్‌ ప్రకారం విమానాలు నడుపుతున్నట్లు వివరించారు. మంగళవారం స్టాక్‌ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో 15 విమానాలు కార్యకలాపాలు నిలిపేసినట్లు జెట్‌ వెల్లడించిన సంగతి విదితమే. జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు 28 నడుస్తున్నాయని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) కూడా తెలిపింది. 15 విమానాలు నిలిపేశామని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు జెట్‌ ఇచ్చిన సమాచారం అంతకుముందుదని, డీజీసీఏ స్పష్టం చేసింది. సంక్షోభంలో చిక్కుకోకముందు జెట్‌ ఎయిర్‌వేస్‌ మొత్తం 119 విమానాలతో కార్యకలాపాలు నిర్వహించేది. లీజుదార్లకు అద్దె చెల్లించ లేకపోవడంతో, క్రమంగా విమానాలను నిలిపివేస్తూ వచ్చింది. ఇలా నిలిచిన విమానాల సంఖ్య 69 గా సంస్థ పేర్కొంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ తన 16 వేల మంది సిబ్బందికి మార్చి నెల వేతనాలు కూడా ఆలస్యంగా అందించనుంది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ రాహుల్‌ తనేజా ఉద్యోగులకు తెలిపారు. ఈనెల 9న తదుపరి సమాచారం ఇస్తామని సంస్థ పేర్కొంది. సంస్థ యాజమాన్య బాధ్యతను ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకర్లు తీసుకున్న నేపథ్యంలో, ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళిక ఖరారులో సంక్లిష్టతల వల్లే ఈ పరిణామం చేటుచేసుకుందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. అనుకున్న సమయం కంటే పరిష్కారం అమలు ప్రక్రియ ఆలస్యమైందని, కార్యకలాపాల్లో స్థిరత్వం తేవడం కోసం రుణదాతలు, ఇతర సంస్థలతో సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయని వివరించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ వాణిజ్య కార్యకలాపాల్లో తమ శాఖ జోక్యం చేసుకోబోదని, ఎటువంటి సాయమూ చేయడం లేదని పౌర విమానయాన మంత్రి సురేశ్‌ప్రభు స్పష్టం చేశారు. జెట్‌ యాజమాన్య బాధ్యత స్వీకరించిన బ్యాంకులే నేరుగా వాటాదార్లయినందున, అవే చూసుకుంటాయన్నారు. విమాన ప్రయాణికుల భద్రత అంశాలను మాత్రం తాము పర్యవేక్షిస్తామని, జెట్‌ ప్రతినిధులతో ఆ మేరకే తమ శాఖ అధికారులు సంప్రదింపులు జరిపారని వివరించారు. Last Updated 4, Apr 2019, 3:05 PM IST
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV 'హువావే' స్మార్ట్‌వాచ్2.. భలే ఉందే! చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌వాచ్ 'వాచ్2 (2018)' ను తాజాగా విడుదల చేసింది. కేవలం బ్లాక్ కలర్ వేరియెంట్‌లో మాత్రమే ఈ వాచ్ విడుదల కాగా ఇందులో ఇ-సిమ్ వెర్షన్‌ను రూ.20,915లకు అందిస్తున్నారు. Samayam Telugu | Updated: Jun 3, 2018, 10:56PM IST చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌వాచ్ 'వాచ్2 (2018)' ను తాజాగా విడుదల చేసింది. కేవలం బ్లాక్ కలర్ వేరియెంట్‌లో మాత్రమే ఈ వాచ్ విడుదల కాగా ఇందులో ఇ-సిమ్ వెర్షన్‌ను రూ.20,915లకు అందిస్తున్నారు. అలాగే 4జీ నానో సిమ్ వెర్షన్ ధర రూ.19,860 గా ఉంది. ఇక సాధారణ బ్లూటూత్ వేరియెంట్ ధర రూ.17,750 గా నిర్ణయించారు. ఈ వాచ్ ఇప్పటికే చైనా మార్కెట్‌లో అందుబాటులో ఉండగా త్వరలో భారత్‌లోనూ లభ్యం కానుంది.ఈ వాచ్ ఆండ్రాయిడ్ 4.3 ఆపైన, ఐఓఎస్ 8.2 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. అందుకు ప్రత్యేకంగా యాప్‌ను కూడా ఆయా యాప్ స్టోర్స్‌లో అందిస్తున్నారు. స్మార్ట్‌వాచ్ ఫీచర్లు.. 1.2 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే 390 x 390 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ 1.1 గిగాహెడ్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ వియర్ 2100 ప్రాసెసర్ 768 ఎంబీ ర్యామ్ 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ వియర్ 2.0 ఓఎస్ బారో మీటర్
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Shikhar Dhawan, రాయుడిపై వేటు తప్పదా..? సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ విశ్రాంతి కోరడంతో చివరి రెండు వన్డేల్లో రిషబ్ పంత్ ఆడటం దాదాపు ఖాయమవగా.. శిఖర్ ధావన్‌పై వేస్తే..? కేఎల్ రాహుల్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. Samayam Telugu | Updated: Mar 9, 2019, 12:05PM IST Shikhar Dhawan, రాయుడిపై వేటు తప్పదా..? హైలైట్స్ ఈ ఏడాది 11 వన్డేలాడి 265 పరుగులే చేసిన శిఖర్ ధావన్ నిన్న రాంచీ వన్డేలోనూ 10 బంతులాడి ఒక్క పరుగుకే ఔట్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడిది కూడా అదే బాట ఈ ఏడాది 10 వన్డేలాడి 247 పరుగులు.. నిన్న 8 బంతులాడి రెండు పరుగుల వద్ద క్లీన్‌బౌల్డ్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్ , మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడిపై వేటు పడేలా కనిపిస్తోంది. రాంచీ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో 10 బంతులాడిన ధావన్ కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరగా.. 8 బంతులాడిన అంబటి రాయుడు రెండు పరుగుల వద్ద పేలవంగా క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో.. ఈ ఇద్దరిపై చివరి రెండు వన్డేల్లోనూ వేటు వేస్తారనే వార్తలు వస్తున్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రాంచీ వన్డే ఓటమి తర్వాత జట్టులో మార్పులు తప్పవని పరోక్షంగా వెల్లడించాడు. నాలుగో వన్డే మొహాలి వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది.
2sports
Bathukamma Song: మంగ్లీ బత... సింగపూర్: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా , మహిళల సింగిల్స్‌ ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ మార్టీనా హింగిస్‌ జోడీ మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకుంది. సింగపూర్‌లో జరిగిన సీజన్‌ ముగింపు టోర్నీ డబ్లూటీఏ ఫైనల్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. సింగపూర్ లో ఆదివారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ సానియా-హింగిస్‌ జోడీ 6-0, 6-3తో ఎనిమిదో సీడ్‌ స్పెయిన్‌ ద్వయం గార్బీన్‌ ముగురుజ, సువారెజ్‌ నవారోపై అలవోక విజయం సాధించింది. కాగా.. సానియా-హింగిస్‌ జోడీకిది తొమ్మిదో టైటిల్‌ కావడం విశేషం. దీంతో ఈ జోడీ సాధించిన టైటిళ్ల సంఖ్య తొమ్మిదికి చేరుకోగా.. వీరి ఖాతాలో వరుసగా 22వ విజయం వచ్చి చేరింది. ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 32వ డబుల్స్‌ టైటిల్‌. కాగా హింగిస్‌కిది 50వ డబుల్స్‌ టైటిల్‌ కావడం విశేషం. ఇప్పటి వరకు టెన్నిస్‌లో కేవలం 15 మంది క్రీడాకారులు మాత్రమే ఈ ఘనతను సాధించారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న సానియా-హింగిస్‌ జోడీ ఈ ఏడాది చివరిదైన డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోర్నీలోనూ టైటిల్‌ కొల్లగొట్టి 2015 సీజన్‌ను ఘనంగా ముగించింది. ఈ ఏడాది అత్యుత్తమ జోడీగా శనివారమే అవార్డు అందుకున్న సాన్‌-టీనా ఆ మరుసటి రోజే మరో ట్రోఫీని దక్కించుకుంది.
2sports
Hyderabad, First Published 25, Aug 2018, 3:37 PM IST Highlights యాంకర్ గా బుల్లితెరపై పేరు సంపాదించిన రష్మీ నటిగా కూడా సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన 'అంతకుమించి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాంకర్ గా బుల్లితెరపై పేరు సంపాదించిన రష్మీ నటిగా కూడా సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన 'అంతకుమించి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మికి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో సుడిగాలి సుధీర్ టాపిక్ కూడా ఉంది. 'ఓ రియాలిటీ షో కోసం సుడిగాలి సుధీర్, నేను పెళ్లి చేసుకున్నట్లుగా నటించాం. కేవలం షో కోసం, జనాలను నవ్వించడానికి అలా చేశాం. ఆ తరువాత దానిపై వివరణ కూడా ఇచ్చాము. అయితే అవేవీ పట్టించుకోకుండా నిజంగానే పెళ్లి జరిగిందన్నట్లు కొందరు అనుకుంటున్నారు. అందులో వాళ్ల తప్పేంలేదు. ఏదొక రోజు నేను పెళ్లి చేసుకుంటాను. సుధీర్ కూడా చేసుకుంటాం. అది ఎప్పుడు జరుగుతుందనేది నాకు తెలియదు. సుధీర్, నేను పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటా. అప్పుడు ఇద్దరి పెళ్లి పక్క, పక్క వేదికల మీదే జరగాలని తనతో చెబుతుంటాను. ఎందుకంటే నేను ముందు పెళ్లి చేసుకుంటే.. సుధీర్ ని మోసం చేశానని అంటారు. అతడు ముందు పెళ్లి చేసుకుంటే నేనే అతడిని మోసం చేశానని అంటారు. అందుకే ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలి అన్నట్లుగా అతడితో చెబుతుంటాను. సుధీర్ తో నాకు మంచి రిలేషన్ ఉంది. ఒకరినొకరు గౌరవించుకుంటాం'' అంటూ చెప్పుకొచ్చింది.  ఇవి కూడా చదవండి..
0business
Ratan Tata ఉద్వాసనకు ముందే రాజీనామా చేయాలని కోరాం ముంబై, జనవరి 10: టాటాసన్స్‌ఛైర్మన్‌గా తొలగించే ముందు సైరస్‌మిస్త్రీకి స్వయంగా రాజీనామా చేయాలని సూచించామని రతన్‌టాటా ఆధ్వర్యం లోని టాటాసన్స్‌ కంపెనీ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ముందు తన వివరణ ఇచ్చింది. అందు వల్లనే మెజార్టీ ఓట్ల సాయంతో సైరస్‌ మిస్త్రీని తొల గించాల్సి వచ్చిందని టాటాసన్స్‌ ట్రిబ్యునల్‌కు తన వివరణఇచ్చింది. మొత్తం తొమ్మి ది మంది డైరెక్టర్లలో ఏడుగురు మిస్త్రీని మార్చాలని ప్రతిపాదిం చారని, వీరిలో ఫరీదా కంభాటా సమావేశానికి హాజరుకాలేదని వివరించింది. మిస్త్రీ ఓటింగ్‌కు అర్హతలేదని అందువల్లనే మెజార్టీ ఓటింగ్‌ సాయంతో మిస్త్రీని తొల గించక తప్పలేదని టాటాసన్స్‌ వివరించింది. ఓటింగ్‌కుముందే టాటాసన్స్‌ మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటా, డైరెక్టర్‌ నితిన్‌ నోహ్రియా లు వ్యక్తిగతంగా సైరస్‌మిస్త్రీతో చర్చలుజరిపి రాజీనామా చేయా లని కోరారని అయితే అందుకు మిస్త్రీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా రాజీనామా చేసేందుకు నిరాకరించారని తన 204 పేజీల అఫిడవిట్‌లో వివరించింది. మిస్త్రీ తొలగింపు నిర్ణయం అప్పటికప్పుడు ఆకస్మికంగా తీసుకున్నది కానేకాదని, వరుసవెంబడి జరిగిన సంఘటనలతో టాటాగ్రూప్‌ ప్రతిష్ట, నైతిక విలువ లను పరిరక్షించేందుకు ఈ చర్యలు తప్పలేదని టాటాసన్స్‌ వివరించింది. ఆయన హయాం నాలు గేళ్లలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని, దానివల్లనే ఆయన నాయకత్వం సమర్ధంగా లేదని భావించాల్సి వచ్చిందన్నారు. మూలధన కేటాయిం పుల నిర్ణయాలు, సమస్యల పరిష్కారంలో మంద గమనం, వ్యూహాత్మక ప్రణాళిక, బిజినెస్‌ ప్రణాళి కలు వంటివి అనుకున్నస్థాయిలో లేవని టాటాసన్స్‌ వివరించింది. టాటాగ్రూప్‌లోని ఇతర మేజర్‌ కంపె నీల్లో మిస్త్రీ వ్యూహాత్మకంగా వ్యవహరించి టాటా సన్స్‌ డైరెక్టర్ల పాత్రను తగ్గించారని ఆరోపించింది. అనేక కంపెనీల్లో టాటాసన్స్‌ డైరెక్టర్లు రిటైర్‌ అయి నప్పటికీ మిస్త్రీ తిరిగి నియామకాలు చేయ లేదని, టాటాసన్స్‌ ప్రతినిధులనే నియమిం చలేదని టాటాకంపెనీల బోర్డుల్లో టాటాసన్స్‌ కు ప్రాతినిధ్యం లేకుండాచేయాలన్నదే ఆయన వ్యూహంగా భావించాల్సి వచ్చిందని వివరిం చింది. అనేకకేసుల్లో మిస్త్రీ టాటాసన్స్‌కు తానే ఏకైక అసాధారణ డైరెక్టరు అన్నట్లు వ్యవహరించారన్నారు. టాటాసన్స్‌కు, టాటా గ్రూప్‌ కంపెనీలకు తానే వారధి అన్నట్లుగా వ్యవహఱించారని, మిస్త్రీచర్యలు టాటాగ్రూప్‌ నిర్మాణాన్ని నిర్వీర్యంచేసేవిధంగా ఉన్నాయని టాటాసన్స్‌ ఆసక్తి, అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. రానురాను ప్రమోటింగ్‌ కంపెనీ డైరెక్టర్ల నిర్ణయాలకు విలువలేకుండా చేస్తూ అన్నింటా తానై అయి ఏకపక్షంగా వ్యవహరి స్తుండటంవల్లనే టాటాగ్రూప్‌ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకువీలుగా తొలగింపు చర్య అనివార్యమైం దని టాటాసన్స్‌ తన అఫిడవిట్‌లో విశ్లేషించింది.
1entertainment
Hyderabad, First Published 22, Mar 2019, 2:53 PM IST Highlights దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా RRR 2020 ఈద్ కి రాబోతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలతో పోటీ ఉండకూడదని ముందుగానే సినిమా రిలీజ్ డేట్ జులై 30 అని కూడా ప్రెస్ మీట్ లో చెప్పేశాడు. అయితే అదే సమయంలో ప్రతి ఏడాది సల్మాన్ ఖాన్ సినిమా వాస్తు ఉంటుంది.  దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా RRR 2020 ఈద్ కి రాబోతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలతో పోటీ ఉండకూడదని ముందుగానే సినిమా రిలీజ్ డేట్ జులై 30 అని కూడా ప్రెస్ మీట్ లో చెప్పేశాడు. అయితే అదే సమయంలో ప్రతి ఏడాది సల్మాన్ ఖాన్ సినిమా వాస్తు ఉంటుంది.  ఈద్ సందర్బంగా సల్మాన్ సినిమాలను వదలడం సెంటిమెంట్ గా వస్తోంది. అయితే ఈ సారి ఇన్షాల్లా అనే సినిమా రాబోతున్నట్లు అధికారికంగా చెప్పేశాడు. పద్మావత్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అలియా భట్ సినిమాలో కథానాయికగా నటించనుంది. అయితే ఇప్పుడు జక్కన్న కొంచెం సందిగ్ధంలో పడ్డాడని తెలుస్తోంది.  ఎలాంటి పెద్ద సినిమాలు లేని టైమ్ లో RRR ని ఫిక్స్ చేసుకున్నప్పటికి ఇప్పుడు అదే సమయంలో సల్మాన్ ఖాన్ సినిమా రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో అక్షయ్ కుమార్ నటిస్తున్న సినిమాను ఎలా పోస్ట్ ఫోన్ చేయించాలా అని ఆలోచిస్తున్న జక్కన్నకు ఇప్పుడు సల్మాన్ సినిమా వచ్చి టెన్షన్ పెడుతోంది.  రామ్ చరణ్ -  తారక్ లకు సౌత్ లో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లో అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ వస్తేనే లాభం వచ్చినట్లు లెక్క. కానీ ఇప్పుడు వేరే సినిమాలు పోటీకి దిగితే పాన్ ఇండియన్ సినిమాకు కొంత ఎఫెక్ట్ పడవచ్చు అని తెలుస్తోంది. మరి రాజమౌళి తన బడా మల్టీస్టారర్ ను ఈద్ కు వదులుతాడా లేక ఆ తరువాత రిలీజ్ చేస్తాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Last Updated 22, Mar 2019, 2:53 PM IST
0business