news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Hyderabad, First Published 14, Mar 2019, 1:03 PM IST
Highlights
కోహ్లీ తీసుకున్న నిర్ణయాల కారణంగానే టీం ఇండియా వన్డే సిరీస్ చేజార్చుకుందని టీం ఇండియా మాజీ క్రికెటర్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
కోహ్లీ తీసుకున్న నిర్ణయాల కారణంగానే టీం ఇండియా వన్డే సిరీస్ చేజార్చుకుందని టీం ఇండియా మాజీ క్రికెటర్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో 35పరుగుల తేడాతో టీం ఇండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా ఓటమికి కోహ్లీనే కారణమంటూ.. గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సిరీస్ గెలవకముందే ప్రయోగాలు చేయడం భారత పరాజయానికి కారణమని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సిరీస్ గెలిచిన తర్వాత ప్రయోగాలు చేసి ఉంటే బాగుండేదని, ఆసీస్ను తక్కువ అంచనా వేయడం, కోహ్లి అనాలోచిత నిర్ణయాలతో సిరీస్ చేజారిందన్నాడు.
తొలి రెండు వన్డేలు గెలిచి ఆధిపత్యం కనబర్చిన భారత్.. మరో మ్యాచ్ గెలిచాక ప్రయోగాలు చేయాల్సిందన్నాడు. ప్రపంచకప్ ముంగిట జట్టు రిజర్వ్ బెంచ్ని పరీక్షించుకోవడం ముఖ్యమే.. కానీ.. సిరీస్లో విజేతగా నిలవడం అంతకన్నా కీలకమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
Last Updated 14, Mar 2019, 1:03 PM IST
| 2sports
|
- టీబీ, సెప్టీసీమియాసహా 78 రకాల అంటువ్యాధులు
- తాజా పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ: చేతుల ద్వారా పలు అంటువ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయన్నది తెలిసిందే. నిత్యం మన చొక్కా జేబుల్లో పెట్టుకొని తిరిగే కరెన్సీ నోట్ల ద్వారా కూడా అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయన్న పరిశోధనా ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గొలుసుకట్టుగా చేతులు మారే కరెన్సీ నోట్ల ద్వారా క్షయ(టీబీ), సెప్టీసీమియాసహా 78 రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీనిపై నివేదికను వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో పని చేసే ఐజీఐబీ వెల్లడించింది.
2016లో మైక్రోబయోలజీ అండ్ అప్లయిడ్ సైన్స్ వెల్లడించిన నివేదికలోనూ కరెన్సీ నోట్ల ద్వారా అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయని తేలింది. ఈ నివేదిక తమిళనాడులోని తిరునవేలీ వైద్య కళాశాల నిర్వహించిన పరిశోధన ద్వారా రూపొందింది. ఆ సందర్భంగా 120 కరెన్సీ నోట్లను ప్రయోగశాలలో పరీక్షించి చూడగా, 86.4 శాతం నోట్లపై వ్యాధికారక సూక్ష్మక్రిములున్నట్టు తేలింది. ఈ నోట్లను వ్యాపారులు, డాక్టర్లు, విద్యార్థులు, గృహిణుల నుంచి సేకరించారు.
కరెన్సీ నోట్లు ఎక్కువగా చేతులు మారేది వ్యాపారుల నుంచి. అందువల్ల వ్యాపారులు రోగాల బారిన పడటం అధికంగా ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది. దాంతో, ఆందోళన చెందిన అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(కెయిట్) ఈ అంశంపై ఆర్థికమంత్రి అరుణ్జైట్లీకి లేఖ రాసింది. వ్యాపారుల ఆరోగ్య రక్షణ కోసం చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి కెయిట్ విజ్ఞప్తి చేసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కమల్ హాసన్ హాలీవుడ్ ప్రాజెక్ట్ ఖరారు
ఇండియన్ సినిమా గర్వించదగిన నటులలో కమల్ హాసన్ ఒకరు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
| Updated:
Feb 11, 2016, 08:59PM IST
కమల్ హాసన్ హాలీవుడ్ ప్రాజెక్ట్ ఖరారు
ఇండియన్ సినిమా గర్వించదగిన నటులలో కమల్ హాసన్ ఒకరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమాని ఒక నటుడిగా ప్రేమిస్తూనే టెక్నీషియన్లా, బిజినెస్మేన్లా, విమర్శకుడిలా ఆలోచించడంలోనే కమల్ ప్రత్యేకత ఏంటో తెలిసిపోతుంది. భారతీయ సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఈ నటుడు తాజాగా ఓ హాలీవుడ్ సినిమాని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో ' లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ' ఫేమ్ బ్యారీ ఎమ్ ఓస్బోర్న్తో ఓ ఇంగ్లీష్ మూవీకి ప్లాన్ చేసినప్పటికీ ఎందుకో అది వర్కౌట్ అవలేదు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరోసారి హాలీవుడ్ ప్రాజెక్టుకి కసరత్తు మొదలుపెట్టాడు కమల్. అమెరికాలో అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. తాను మరో ముగ్గురు స్నేహితులతో కలిసి హాలీవుడ్ సినిమా తెరకెక్కిండానికి సిద్ధమవుతున్నట్టు చెప్పారు. ఈ సినిమాని తానే డైరెక్ట్ చేసి నిర్మించనున్నట్టు కూడా వెల్లడించారు. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయి. మిగతా వివరాలన్నీ త్వరలోనే చెబుతానని అన్నారు కమల్. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అని గట్టిగా నమ్మే కమల్ హాసన్కి రెండోసారి చేస్తున్న ఈ ప్రయత్నమైనా కలిసి రావాలని ఆశిద్దాం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
internet vaartha 101 Views
న్యూఢిల్లీ : వస్తుసేవల చట్టం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలు లోనికి తెచ్చేందుకు కేంద్రప్రభుత్వం ముందు అన్నిరకాల కసరత్తులు చేస్తోంది. ఇందుకు సంబంధించి ముందుగా రిజిస్ట్రేషన్, ఇన్వాయిస్, చెల్లింపులు వంటి వాటిపైముసాయిదా నిబంధనలు రూపొందిస్తోంది. జిఎస్టి మండలిపరంగా వీటిని ఆమోదించింది. ఈనెల 30వతేదీనాటి సమావేశంలో మరింత విస్తృతం చేసేందుకు కసరత్తులుచేస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్ల డించారు. ముసాయిదానిబందనలను చూస్తే సిబిఇసి అభిప్రాయాలను కోరింది. జిఎస్టి కౌన్సిల్ మొదటిసమావేశానికే అభిప్రాయాలు కావాలని చూసింది. జిఎస్టి సిబిఇసి ప్రభుత్వ వెబ్సైట్కు తమతమ అభిప్రాయాలను 28వ తేదీకే పంపించాలని కోరింది. ముసాయిదా నిబంధనలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను దర ఖాస్తు పూరించిన మూడురోజులలోపే జరిగేవిధానం అమలుకుతెస్తామన్నారు. బిజినెస్ ప్రారంభించే ఐదురోజుల ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉం టుంది. ప్రభుత్వ లక్ష్యాలమేరకు కొత్త పరోక్షపన్నుల వ్యవస్థను అమలు చేస్తోంది. జిఎస్టి మండలిపరంగా తన రెండోసమావేశం ఈనెల 30వ తేదీనాటికి జిఎస్టి నియమ నిబంధనలను ఖరారుచేస్తుంది. నిర్దిష్టగడువులోపు దరఖాస్తును ఆమోదించనిపక్షంలో పన్నులశాఖపరంగా ఆ దరఖాస్తును ఆమోదించినట్లే భావించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పాన్నెంబరు, మొబైల్ నంబరు, ఇమెయిల్ చిరునామావంటివి పోర్టల్లో పొందుపరచాల్సి ఉంటుంది. పన్నుల శాఖ అధికారులు ఈపాన్ నంబరు, వన్టైమ్ పాస్వర్డ్, ఆధార్ నంబరు వంటివి సంస్థ లేదా వ్యక్తుల వివరాలను తెలుసుకునేందుకు వీలవుతుంది. అన్ని దస్త్రాలు సక్రమంగా ఉంటే పన్నులశాఖ అధికారులు జిఎస్టి రిజిస్ట్రేషన్ను దరఖాస్తు అందిన మూడు రోజులలోపే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారని అధియా వివరించారు.
| 1entertainment
|
Indian Spinner
ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ కూల్చిన స్పిన్నర్లు
న్యూఢిల్లీ: టీమిండియా,ఇంగ్లండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరిగిన రెండవ టెస్టులో ఇంగ్లండ్పై 247 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.విశాఖపట్నంలోని ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో భారత బౌలర్లు చెలరేగిపోయారు.ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ను భారత స్పిన్నర్లు కుప్ప కూల్చారు.కాగా ఈ విజయంతో అయిదు మ్యాచ్ల సిరీస్ 1-0తో భారత్ ముందంజలో ఉంది.రెండవ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 158 పరుగులకే ఆలౌటైంది.ఇంగ్లండ్ జట్టులో ఆరుగురు బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.టీమిండియా బౌలర్లలో అశ్విన్,యాదవ్లు ఒక్కొక్కరు 3 వికెట్లు తీసుకోగా జడేజా,షమీ ఒక్కొక్కరు రెండు వికెట్లు తీసుకున్నారు.కాగా 2 వికెట్లకు 87 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండవ ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 71 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.కాగా అయిదవ రోజు భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లండ్ విలవిలలాడింది.లంచ్ సమయానికి 7 వికెట్లును కోల్పోయిన ఇంగ్లండ్ ఆ తరువాత అరగంట వ్యవధిలో ఇంగ్లండ్ మిగతా మూడు వికెట్లను కోల్పోయి పరాజయం చెందింది.
ఆట ప్రారంభం నుంచే వికెట్ల పతనం ఇంగ్లండ్లో జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్ చివరి రోజు ఆట ప్రారంభం నుంచి ఇంగ్లండ్ వికెట్ల పతనం కొనసాగింది.ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా క్రీజులో కుదరుకునే ప్రయత్నం చేయలేదు.కాగా రెండవ టెస్టు ఇన్నింగ్స్ నాలుగవ రోజు ఆటలో ఇంగ్లండ్ పోరాటం కనబడితే చివరి రోజు మాత్రం అందుకు భిన్నంగా సాగింది.ఆట ముగింపునకు ఒక రోజు ముందు ఆదివారం సుమారు 60 ఓవర్లు ఆడి రెండు వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు చివరి రోజు మాత్రం 38 ఓవర్లు ఆడి మిగతా 8 వికెట్లను కోల్పొయి పరాజయం చెందింది.కాగా తన ఆరంగేట్రంలోనే భారత స్పిన్నర్ జయంత్ యాదవ్ ఆకట్టుకున్నాడు.తొలి ఇన్నింగ్స్లో 35 పరుగులు చేయడంతో పాటు,వికెట్ తీసిన జయంత్ ఫీల్డింగ్లో సత్తా చాటాడు. కాగా రెండవ ఇన్నింగ్స్లో భారత స్కోరు 200 దాటడంలో ముఖ్య భూమిక పోషించిన జయంత్ యాదవ్ చివరి వరకూ క్రీజులో నిలబడి 27 పరుగులు చేశాడు.ఇక బౌలింగ్ విషయానికి వస్తే 11.3 ఓవర్ల పాటు బౌలింగ్ వేసి మూడు వికెట్లు తీసుకున్నాడు.ఇందులో నాలుగు మేడిన్ ఓవర్లు ఉండటం విశేషం
| 2sports
|
baahubali director ss rajamouli voice over to srivalli
శ్రీవల్లీకి రాజమౌళి వాయిస్ఓవర్!
బాహుబలి చిత్రకథా రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లి.
TNN | Updated:
Sep 6, 2017, 08:03PM IST
బాహుబలి చిత్రకథా రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లీ. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్న ఈ మూవీని రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తున్నారు. ఈ నెల 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, విజయేంద్రప్రసాద్ తనయుడు రాజమౌళి వాయిస్‌ ఓవర్ చెప్పడం విశేషం.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ తండ్రి దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి తనయుడు వాయిస్‌ఓవర్ ఇవ్వడం ఎంతో ఆనందంగా వుంది. ఓ వైవిధ్యమైన కథతో విజయేంద్రప్రసాద్ గారు ఎంతో అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు.
Visit Site
Recommended byColombia
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రమిది. పేరున్న నటీనటులు వారి ఇమేజ్‌ను పక్కనపెట్టి కొత్త తరహా సినిమాలు చేసినా అవి ఆకట్టుకోవడం కష్టం. ప్రేక్షకులకు తొందరగా రుచించవు. ఎలాంటి ఇమేజ్‌లేని కొత్త నటీనటులయితే పాత్రల కంటే కథపైనే దృష్టిపెట్టి సినిమాను బలంగా తెరపై చూపించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే నూతన తారలతో ఈ సినిమా చేశాను. ప్రోటాన్స్, న్యూట్రన్స్‌తో పాటు విశ్వాంతరాలలో లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఖగోళాలను మనసుతో చూడగలుగుతున్నాం. అలాంటి మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది.
పుట్టుకతో ఏ మనిషి దొంగ, వ్యసనపరుడు కాడు. పరిస్థితులే వారిని అలా మారుస్తాయి. ఆ మార్పును సరిదిద్ది వారిని స్వచ్ఛమైన మనస్కులుగా మళ్లీ మార్చగలిగితే ఎలా ఉంటుందనే అంశాన్ని సినిమాలో చూపించాం. ఓ అమ్మాయి మనసుపై శాస్త్రవేత్త చేసిన ప్రయోగం కారణంగా ఆమెకు గతజన్మలోని ప్రియుడితో పాటు స్మృతులు గుర్తుకువస్తాయి. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది అని తెలిపారు. రాజీవ్‌కనకాల, సత్యకృష్ణ, హేమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎమ్.ఎమ్ శ్రీలేఖ అందిస్తున్నారు.
| 0business
|
సుప్రియతో అడివి శేష్ పెళ్లంటూ ప్రచారం
స్పందించిన హీరో
హైదరాబాద్: టాలీవుడ్లో మరో పెళ్లి రూమర్ వైరల్ అవుతోంది. ప్రముఖ నటి, నాగార్జున మేనకోడలు సుప్రియతో సినీ నటుడు అడివి శేష్ పెళ్లి జరగబోతోందంటూ పలు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. నటి సమంతే వీరి పెళ్లి చేయబోతున్నట్లు వార్తలు కూడా రాశాయి. ఈ వదంతులపై తాజాగా అడివి శేష్ స్పందించారు. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందంటూ ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ‘నా జీవితంలో ప్రస్తుతం సినిమాలు తప్ప మరేమీ లేదు. యాక్టింగ్, రైటింగ్.. ఇలా నా కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను. తలదించుకుని నా పని నేను చేసుకుపోతున్నాను. కష్టపడుతున్నాను. నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. అంతకుమించి ఏమీ లేదు. ఇట్లు మీ శేష్’ అని క్లారిటీ ఇచ్చారు.
అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ చిత్రంలో సుప్రియ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నారు. ‘గూఢచారి 2’ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. తొలి సినిమాకు అడివి శేషే కథ అందించారు. మరి ఈ సినిమాకు కూడా ఆయన రాసిన కథతోనే తెరకెక్కుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Tags :
| 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఆ హీరోయిన్ కోసమే దేవీ శ్రీ పట్టు
సంగీతంతో యువతని ఉర్రూతలూగించిన దేవీ శ్రీ ప్రసాద్ త్వరలో కథానాయకుడిగా వెండితెరపై మెరవబోతున్నాడు.
TNN | Updated:
Jan 5, 2016, 12:09PM IST
సంగీతంతో యువతని ఉర్రూతలూగించిన దేవీ శ్రీ ప్రసాద్ త్వరలో కథానాయకుడిగా వెండితెరపై మెరవబోతున్నాడు. ఆర్య సినిమా కాంబినేషన్లోనే ఆ సినిమా సిద్ధమవుతోంది. సుకుమార్ డైరెక్టర్ గా, దిల్ రాజు నిర్మాతగా ఉండబోతున్నారు. మరి హీరోయిన్? ఆ పాత్ర ఎంపిక జరిగిపోయిందని సమాచారం. దేవి కూడా ఓ విజయవంతమైన హీరోయిన్ తన పక్కనుండాలని కోరుకుంటున్నాడట. ఆమె ఎవరో కాదు... అందాల సమంత. సుకుమార్ దర్శకత్వంలో కూడా సమంత ఇంతవరకు చేయలేదు. దీంతో రెండు కాంబినేషన్లు కుదిరినట్టు ఉంటుందని సమంతనే ఖాయపరిచే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం సుకుమార్ నాన్నకు ప్రేమతో సినిమా పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు. దాని తరువాత దేవీ సినిమాకి కథ తయారుచేసే పని మొదలుపెడతాడు. మంచి లవ్ స్టోరీ చేయాలనే ఉద్దేశంతో సుక్కు ఉన్నట్టు తెలుస్తోంది. అదే నిజమైన మరో అందమైన ప్రేమ కావ్యాన్ని తెరపై చూడొచ్చు.
| 0business
|
భారత్- ఆస్ట్రేలియా ఫైనల్లో ఢీకొంటాయి..?
TNN| May 13, 2017, 04.55 PM IST
ఇంగ్లాండ్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా మూడు వారాలు గడువు ఉండగానే అప్పుడే విజేతపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడనున్న ఈ టోర్నీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, ఆస్ట్రేలియా తలపడతాయని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. జూన్ 1 నుంచి ఈ టోర్నీ ఆరంభమవనుండగా.. ఫైనల్ మ్యాచ్ జూన్ 18న జరగనుంది. ఐపీఎల్లో విరాట్ కోహ్లి, అజింక్య రహానె బ్యాట్తో నిరాశపరుస్తున్నా.. ఛాంపియన్స్ ట్రోఫీలో వారి పేలవ ఫామ్ భారత్పై ఎలాంటి ప్రభావం చూపబోదని క్లార్క్ వివరించారు. అక్కడి వాతావరణం పేస్, స్వింగ్కి అనుకూలిస్తే ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తుందని.. ఒకవేళ స్పిన్కి అనుకూలిస్తే భారత్దే పైచేయి అవుతుందని ఈ మాజీ కెప్టెన్ అంచనా వేశారు.
‘ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడతాయని నా నమ్మకం. అక్కడి పరిస్థితులు కూడా మ్యాచ్లపై ప్రభావం చూపుతాయి. పేస్, స్వింగ్కి సహకారం లభిస్తే మిచెల్ స్టార్క్, పాటిన్సన్, హేజిల్వుడ్, కమిన్స్ తదితర ఆస్ట్రేలియా పేసర్లను ఎదుర్కోవడం బ్యాట్స్మెన్కి కష్టమవుతుంది. ఒకవేళ స్పిన్కి అనుకూలిస్తే.. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పండగ చేసుకుంటారు. టోర్నీలోని ఏ జట్టుకూ ఇలాంటి సమర్థ స్విన్ జోడీ లేదు. ఐపీఎల్తో పోలిస్తే వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో ఇన్నింగ్స్ నిర్మించేందుకు చాలా సమయం ఉంటుంది కాబట్టి విరాట్ కోహ్లి, రహానె ఫామ్పై భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అని క్లార్క్ వివరించాడు. జూన్ 4న పాకిస్థాన్ తన తొలి మ్యాచ్లోనే భారత్ ఢీకొంటుంది.
| 2sports
|
Hyderabad, First Published 2, Sep 2018, 10:26 AM IST
Highlights
అభిమానం అనే పదాన్ని భక్తిస్థాయికి తీసుకువెళ్లిన ట్రెండ్ సెట్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
అభిమానం అనే పదాన్ని భక్తిస్థాయికి తీసుకువెళ్లిన ట్రెండ్ సెట్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రజల కోసం నిలబడ్డ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టింది ఈరోజే. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు, స్టార్లు ఉండొచ్చు.. కానీ పవర్ స్టార్ కి ఉండే క్రేజే వేరు. అభిమానుల్లో ఆయనకు ఉన్న స్థాయి వేరు.. స్థానం వేరు. పవన్ అభిమానులు తాము పవన్ కి భక్తులమని చెప్పుకుంటుంటారు. అంతలా పవన్ ని తమ అభిమానంతో పూజిస్తుంటారు. మెగాస్టార్ తమ్ముడిగా 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు.
ఆ తరువాత 'గోకులంలో సీత','సుస్వాగతం' వంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. 'తొలిప్రేమ' చిత్రంలో నటించి ఓ అద్భుత ప్రేమ కావ్యాన్ని తెలుగు వారికి అందించారు. ఆ తరువాత తమ్ముడు, బద్రి ఇలా వరుస హిట్స్ తో ఆయన స్టామినా అమాంతం పెరిగిపోయింది. 2001లో వచ్చిన 'ఖుషి' ఆయన కెరీర్ లో బెస్ట్ ఫిలింగా నిలిచిపోయింది. భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేసింది. నటుడిగానే కాకుండా 'జానీ' సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు.
ఆ తరువాత కెరీర్ పరంగా ఎన్నో ఫ్లాపులు చూసినప్పటికీ 'జల్సా'తో మరోసారి తన స్టామినా నిరూపించాడు. మళ్లీ 'పులి','తీన్ మార్','పంజా' సినిమాలతో ఫ్లాపులు వెంటాడినప్పటికీ.. ''కొన్నిసార్లు రావడం లేటవ్వొచ్చేమో.. కానీ రావడం మాత్రం పక్కా'' అంటూ 'గబ్బర్ సింగ్' తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. పవర్ స్టార్ స్టామినా ఇదీ అని నిరూపించిన ఈ సినిమాతో పవన్ మార్కెట్ మరింత పెరిగింది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అతడు ఏర్పాటు చేసిన 'జనసేన' పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావడంతో నటుడిగా పవన్ కి గ్యాప్ వచ్చేసింది.
సినిమాల్లో బిజీగా ఉండే పవన్ ప్రజల కోసం ఆలోచించి వారికి సాయం చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చారు.ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా.. సహించడు. వారి తరఫున పోరాడాడు.. పోరాడుతున్నాడు.. పోరాడతాడు. పొలిటికల్ గా కూడా తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. వచ్చే ఏడాది ఎలెక్షన్స్ లో పూర్తి స్థాయిలో జనసేన పార్టీని రంగంలోకి దించి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయన తలపెట్టిన కార్యానికి మంచి జరగాలని కోరుకుంటూ మరోసారి పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం!
Last Updated 9, Sep 2018, 12:01 PM IST
| 0business
|
Hyderabad, First Published 9, Aug 2019, 9:38 AM IST
Highlights
ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్ వదిలింది. ఇందులో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్ వదిలింది.
ఇందులో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. టెంట్ లో నుండి మహేష్ అలా నడిచొస్తున్న సీన్ హైలైట్ గా నిలిచింది. 'సరిలేరు.. నీకెవ్వరు..' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంతో స్పెషల్ గా ఉంటుందట.
అలానే కమెడియన్ బండ్ల గణేష్ కూడా ఈ సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు. కే ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.మహేశ్బాబు ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్రాజు, మహేశ్బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ajinkya Rahane: విరాట్ స్థానంలో కెప్టెన్గా అజింక్య రహానే!
విరాట్ కోహ్లి కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్తున్న నేపథ్యంలో అతడి స్థానంలో సారథ్య బాధ్యతలను అజింక్య రహానే స్వీకరించనున్నాడని తెలుస్తోంది.
Samayam Telugu | Updated:
May 7, 2018, 10:17AM IST
Ajinkya Rahane: విరాట్ స్థానంలో కెప్టెన్గా అజింక్య రహానే!
అప్ఘాన్తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్కు అజింక్య రహానే భారత సారథిగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. బెంగళూరు వేదికగా జూన్ 14న భారత్, అప్ఘానిస్థాన్ జట్ల మధ్య ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్తోనే అప్ఘాన్ జట్టు టెస్టు క్రికెట్లోకి అడుగుపెడుతోంది. సర్రే తరఫున కౌంటీల్లో ఆడేందుకు కోహ్లి ఇంగ్లాండ్ వెళ్తుండటంతో అతడి స్థానంలో వెస్ కెప్టెన్ రహానే కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటాడనే వార్తలొస్తున్నాయి.
గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో రహానే తొలిసారి కెప్టెన్గా వ్యవహరించాడు. భుజం గాయం కారణంగా కోహ్లి దూరం కావడంతో.. ధర్మశాలలో జరిగిన టెస్ట్ మ్యాచ్కు రహానే నాయకత్వం వహించాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టెస్టులకు అతణ్ని పక్కనబెట్టారు. రహానే బదులు రోహిత్కు అవకాశం కల్పించారు.
మూడో టెస్టులో జట్టులోకి వచ్చిన రహానే 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్లో భారత్ 63 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం యార్క్షైర్ తరఫున కౌంటీల్లో ఆడుతున్న ఛటేశ్వర్ పుజారా అప్ఘాన్తో టెస్ట్ కోసం భారత్ తిరిగి రానున్నాడు. కౌంటీల్లో ఆడుతున్న ఇషాంత్ శర్మ కూడా ఈ టెస్టులో ఆడే ఛాన్స్ ఉంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Hyderabad, First Published 6, Nov 2018, 10:29 AM IST
Highlights
'నర్తనశాల' సినిమా ఫ్లాప్ కావడంతో హీరో నాగశౌర్య ఎక్కడా కనిపించడం లేదు. తొందరగా సినిమాలు చేయడం కంటే ఆలస్యంగానైనా.. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడికి ప్రొడ్యూసర్ నుండి షాక్ తగిలినట్లు సమాచారం.
'నర్తనశాల' సినిమా ఫ్లాప్ కావడంతో హీరో నాగశౌర్య ఎక్కడా కనిపించడం లేదు. తొందరగా సినిమాలు చేయడం కంటే ఆలస్యంగానైనా.. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడికి ప్రొడ్యూసర్ నుండి షాక్ తగిలినట్లు సమాచారం.
బాలకృష్ణతో 'పైసా వసూల్', గోపీచంద్ తో 'లౌక్యం' వంటి సినిమాలు చేసిన నిర్మాత ఆనంద ప్రసాద్.. శౌర్య హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయాల్సివుంది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది.
అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. 'నర్తనశాల' సినిమా తరువాత శౌర్యతో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఆనంద ప్రసాద్ కూడా అదే పరిస్థితుల్లో పడ్డాడు. పైగా కొత్త దర్శకుడు కావడంతో బిజినెస్ ఏ రేంజ్ లో అవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో సినిమా ఆపేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్ని శౌర్యతో నేరుగా చెప్పకుండా.. టీడీపీ పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో తను సెర్లింగపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఇప్పుడు తనకు డబ్బు అవసరం ఉందని, సినిమా కొన్ని రోజులు వాయిదా వేద్దామని శౌర్యని కన్విన్స్ చేశాడట నిర్మాత. అయితే ఈ ప్రాజెక్ట్ మళ్లీ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదేమోనని భావించిన శౌర్య మరో సినిమా కోసం సిద్ధమవుతున్నాడు!
Last Updated 6, Nov 2018, 10:29 AM IST
| 0business
|
విపణిలోకి 'కూల్' ఫోన్లు
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ కూల్ ప్యాడ్ భారత మార్కెట్లోకి రెండు మరో కొత్త మొబైల్స్ విడుదల చేసింది. డాజెన్ 1, డాజెన్ 7 పేరుతో రెండు స్మార్ట్ ఫోన్లును వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. తాము భారత్లో మరింత విస్తరించ ప్రణాళికలో భాగంగా ఇక్కడ ఆర్ అండ్ డీతో పాటు అసెంబ్లీ యూనిట్ను కూడా భారత్లో ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఫ్లివ్కార్ట్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
డాజెన్ 1 ఫోన్లోని ప్రత్యేకతలు: 8 మెగా పిక్సెల్ కెమెరా, 2 జీబీ ర్యామ్, 8 జీబీ అంతర్గత మెమొరీ, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2500 ఎంఏహచ్ బ్యాటరీ సామర్థ్యం, 1.2 గిగా హెడ్జ్ కోర్ ప్రాసెసర్. ఈఫోన్ ధరను కంపెనీ రూ.6,999గా నిర్ణయించింది.
డాజెన్ 7 ఫోన్లోని ప్రత్యేకతులు: 5.2 అంగుళాల పూర్తి హెచ్డీ తెర, 13 మోగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1.7 గిగా హెచ్జ్ అక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ 16 జీబీ అంతర్గత మెమొరీ, 2.7 ఎంఏ హచ్ సామర్థ్యపు బ్యాటరీ. దీని ధరను కంపెనీ రూ. 17.999గా ప్రకటించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Recommended byColombia
హీరో పాత్రకు నెగెటివ్ షేడ్స్ ఉంటాయా..?
ప్రతి మనిషిలో కూడా పాజిటివ్, నెగెటివ్ రెండు ఉంటాయి. అయితే మన సినిమాల్లో హీరోని మొత్తం పాజిటివ్ గా చూపిస్తారు. కానీ నేను అలా కాకుండా జోగేంద్ర అనే వ్యక్తి జీవితంలో ఐదేళ్లలో జరిగే కథ చూపించాను. దానిలో అతడు చేసిన మంచి, చెడు అన్ని పనులు ఉంటాయి.
సినిమా పూర్తిగా రాజకీయ నేపధ్యంలో సాగుతుందా..?
సినిమా ట్రైలర్ ను బట్టి పొలిటికల్ త్రిల్లర్ అనుకుంటున్నారు. కానీ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. పాలిటిక్స్ పది శాతం మాత్రమే ఉంటాయి. స్క్రీన్ మీద ఇది కొత్త కథ. కానీ రియల్ లైఫ్ లో చాలా చూస్తుంటాం. సొసైటిలో నుండి తీసుకునే కథలకు తొందరగా కనెక్ట్ అవుతాం. కామెడీతో ఉండే కమర్షియల్ సినిమాల కంటే మనసుని కదిలించే సినిమాలు పెద్ద హిట్స్ అవుతాయి.
ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత ఇండస్ట్రీ నుండి అప్రిసియేషన్ కాల్స్ ఏమైనా వచ్చాయా..?
ట్రైలర్ కు ముందు నేను కనిపిస్తే లోపలకి వెళ్ళి తలుపులు వేసేసుకునే వారు కానీ ఇప్పుడు వచ్చి మరీ పలకరిస్తున్నారు. ట్రైలర్ చూసి చాలా మంది సినిమా చేద్దామని నా దగ్గరకు వచ్చారు. కానీ నేను అంగీకరించలేదు. రాజకీయనాయకుడు ఐదేళ్ళకు ఒకసారి పార్టీ మారితే సినిమా వాళ్ళు మాత్రం ప్రతి శుక్రవారం పార్టీ మారుస్తుంటారు. అసలు ఎవరినీ నమ్మడానికి లేదు.
సినిమా ఔట్ పుట్ చూసిన తరువాత ఏమనిపించింది..?
సురేష్ బాబు గారికి సాధారణంగా అంత తొందరగా సినిమాలు నచ్చవు. కానీ ఈ సినిమా నచ్చిందని చెప్పారు. రామానాయుడుగారుంటే ఈ సినిమాకు బెస్ట్ రియాక్షన్ ఆయన ఇచ్చి ఉండేవారు.
ఈ సినిమా షూటింగ్ లో మీరు ఎవరినీ కొట్టలేదా..?
ఒక్కో మనిషికి ఒక్కో యాటిట్యూడ్ ఉంటుంది. కొందరు చెప్పగానే అర్ధం చేసుకుంటారు. కొందరికి ఒక స్క్రీన్ అడ్డంగా ఉంటుంది. దాన్ని నుండి బయటకు రావాలంటే.. కన్విన్స్ చేయడమో, తిట్టడం, కొట్టడం ఏదొకటి చేయాలి. కానీ ఈ సినిమా విషయంలో నాకు ఎవరిని కొట్టాల్సిన అవసరం రాలేదు.
రానాతో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
రానా ఇంటెలిజెంట్ యాక్టర్. సీన్ చెప్పగానే ఆలోచించడం మొదలుపెడతాడు. అలా ఆలోచించే
నటులు చాలా తక్కువ మంది ఉంటారు. కొందరు మాకు యాక్టింగ్ వచ్చు.. సెట్ కి వెళ్ళాక చూసుకుందాం అంటుంటారు. కానీ రానా అలా కాదు.. సీన్ చెప్పగానే జోగేంద్ర బాధ పడితే ఎలా ఉంటాడు.. ఎమోషనల్ గా ఎలా ఉంటాడో.. ఆలోచించి వెంటనే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాడు.
మీరు సినిమాలు చేసేప్పుడు దాని రిజల్ట్ ఊహించగలరా..?
హోప్, రియాలిటీ అనీ రెండు ఉంటాయి. సినిమా బాగాలేదని రియాలిటీ తెలుస్తుంటుంది. కానీ
ఆడుతుందేమో అనే హోప్ ఉంటుంది. రియాలిటీను హోప్ డామినేట్ చేస్తుంటుంది. ఇప్పటివరకు వచ్చిన ఫ్లాపులన్నీ నేను ఊహించినవే. కానీ 'నిజం' సినిమా ఆడుతుందనుకున్నా.. కానీ వర్కవుట్ కాలేదు.
సురేష్ బాబుతో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
నాకు రామానాయుడు గారితో పని చేయాలనుండేది. కానీ కుదరలేదు. ఆయన కొడుకుతో కలిసి వర్క్ చేసే ఛాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నాకు దొరికిన పెర్ఫెక్ట్ ప్రొడ్యూసర్లలో సురేష్ బాబు ఒకరు. సినిమాలో సీన్ బాగుంటే అసలు మాట్లాడరు. సరిగ్గా లేకపోతే వెంటనే చెప్పేస్తారు. అప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సినిమాను ఆయనొక ఆడియన్ లాగా చూస్తాడు.
ఇప్పుడు తేజ గారిలో ఏమైనా మార్పొచ్చిందా..?
వాస్తవం చెప్పాలంటే ఎవరు మారరు. పరిస్థితిని బట్టి నటిస్తుంటారు. నేను అసలు మారలేదు.
చాలా మంది దర్శకుడిగా తేజ పనైపోయిందని అంటుంటారు. అలాంటి మాటలు విన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు..?
అలా పనైపోయిందని ఎవరు అంటారు.. పనిలేని వాడు అంటాడు. వాడు బిజీగా ఉంటే పక్క వాళ్ళ గురించి పట్టించుకునేంత సమయం వాడికి ఎక్కడ ఉంటుంది. అలాంటి మాటలు అసలు పట్టించుకోను.
ఈ సినిమా ఎవరికి బాగా ప్లస్ అవుతుంది..?
ఈ సినిమాతో రానాకు మంచి పేరు వస్తుంది. టాప్ లీగ్ లోకి వెళ్లిపోతాడు. అలానే కాజల్ కు కూడా. చాలా బాగా నటించింది. సినిమాటోగ్రాఫర్‌కు మంచి పేరొస్తుంది.
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘హలో’..ఆర్జీవీ!! అఖిల్ అంత నచ్చేశాడా!
అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘హలో’.
TNN | Updated:
Nov 15, 2017, 10:14PM IST
అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘హలో’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండటంతో ఈ మూవీ టీజర్‌ విడుదలలో భాగంగా మంగళవారం టీజర్‌పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. కాగా ఈ టీజర్ పోస్టర్‌పై వివాదాల వర్మ అఖిల్ పోస్టర్ అద్భుతంగా ఉంది.. మతిపోగొట్టేలా ఉందంటూ.. పాజిటివ్‌గా స్పందించారు. ఇది అఖిల్‌ జీవితంలోనే తొలి నిజమైన చిత్రమవుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తూ.. ‘హలో’ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నవంబర్ 16న హలో టీజర్‌ను విడుదల చేస్తుండగా.. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్‌లో నాగార్జున భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అఖిల్ సరసన దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి నటిస్తుంది. డిసెబర్ 22న క్రిస్మస్ కానుకగా ‘హలో’ మూవీ విడుదల కానుంది. కాగా రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నాగార్జున హీరోగా శివ-2 మూవీని తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 20న ఈ మూవీ షూటింగ్ పట్టాలెక్కనుంది.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ట్విట్టర్ నిర్ణయం వెనుక కారణాలేంటి?
బెంగళూరు కేంద్రంలోని ఆర్ అండ్ డీ విభాగాన్ని మూసేయాలని ట్విట్టర్ నిర్ణయించింది. దీనికి కారణం.. సృజనాత్మకత కొరవడటమా? లాభాలు రాకపోవడమా?
TNN | Updated:
Sep 20, 2016, 05:39PM IST
ఇండియాలోని ఇంజినీర్లను తయారు చేయడం కాదు, వారిలో ప్రతిభను వెలికి తీయాలి. కేవలం రోబో మాదిరిగా కాకుండా ఒక పని నుంచి మరో పనికి మార్పు చేందడానికి వీలుగా వారిలో నైపుణ్యాలకు సానబట్టాలి. ట్విట్టర్ తన బెంగళూరు కేంద్రంలోని ఉద్యోగులను తగ్గించుకోడానికి ప్రధాన కారణం ఈ నైపుణ్యాలు కొరవడటమే. బెంగళూరులో డెవలప్మెంట్ సెంటర్ వల్ల ట్విట్టర్కు పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. కిందటి ఏడాది మొబైల్ మార్కెటింగ్ అండ్ ఎనలిస్ట్ కంపెనీ జిప్ డయల్ను ట్విట్టర్ కొనుగోలు చేసింది. మొత్తం కేంద్రాన్ని మూసేయాలని నిర్ణయించుకున్నా అది వీలు కాదు ఎందు కంటే జిప్ డయల్కు కూడా ఇందులో కొంత వాటా ఉంది. జిప్ డయల్ సామర్థ్యం, టెక్నాలజీ వల్ల ట్విట్టర్కు ఒరిగిందేమీ లేదు. ఇది ట్విట్టర్కు అంత అవసరం కూడా లేదు కాబట్టి రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని మూసేయాలనే నిర్ణయానికి వచ్చింది.
ట్విట్టర్కు ప్రపంచ వ్యాప్తంగా 3860 మంది ఉద్యోగులు ఉంటే అందులో 120 మంది బెంగళూరు కేంద్రంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వెబ్సైట్ నుంచి ఎక్కువ పోటీ ఎదుర్కొంటుంది. అలాగే ఈ ఏడాది జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయంలో అంచనాలు తలకిందులయ్యాయి. గత ఎనిమిదేళ్లలో వచ్చిన ఆదాయం కంటే ప్రకటనలకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది. ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం అమాంతం పెరిగిపోయింది. అందుకే మొదట బెంగళూరు కేంద్రాన్ని మూసేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విషయాలను ట్వీట్ చేస్తూ సాంకేతిక పరిఙ్ఞానంతోనే మా సంస్థ మనుగడ సాధ్యం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కృషిచేస్తుంది. మా సాధారణ సమీక్షలో బెంగళూరు సెంటర్ కార్యకలాపాలను నిలుపుదల చేయాలని నిర్ణయించామని ట్వీట్ చేసింది.
బెంగళూరులోని శాఖ అమెరికా బయట ఉన్న రెండో అతి పెద్ద కేంద్రం. 2014లో యాహూ కూడా 600 మంది ఉద్యోగులను ఇలాంటి కారణాలు చూపి తొలగించింది. దాని బాటలోనే ట్విట్టర్ కూడా పయనిస్తోంది. మేథో సంపత్తి విలువలకు ఇది గొడ్డలిపెట్టు లాంటిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పుణేలోని డెవలప్మెంట్ సెంటర్లు నైపుణ్యాల అభివృద్ధికి కృషిచేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆఫ్షోర్ రోబోటిక్ వర్క్ విధానానికి చైనా ప్రధాన పోటీదారుగా అవతరిస్తుందని అంటున్నారు. చైనా కొత్తగా ఏర్పాటు చేసిన 100 ఇంజినీరింగ్ సంస్థల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్ను నేర్పించి ప్రపంచ విపణిలోకి త్వరలో వీరిని పంపుతుంది. వీరి ప్రభావం ఇండియాలోని ఉద్యోగార్థులపై ఉంటుంది. ఇండియాలో ఐటీ ఉద్యోగులకు జీతాలు అమెరికా మార్కెట్తో సమానంగా చెల్లిస్తున్నారు. అయితే చైనాలో మాత్రం ఉద్యోగులకు చాలా తక్కువ మొత్తంలో జీతాలు చెల్లిస్తున్నారు. ఇండియాలో గత మూడేళ్లలో ఆహారం, మెడిసిన్తో కలపి అన్ని విభాగాల్లోనూ ప్రత్యక్ష, పరోక్ష పన్నులు ఆదాయం రెండింతలు పెరిగింది. అధిక ద్రవ్యోల్భణం వల్ల అవసరమైన రంగాల్లో పెరుగుదల లోపించింది. చైనా, దుబాయ్లోని స్వేచ్చా పన్ను విధానం వల్ల భారత్ పోటీలో వెనుకబడే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. 2000,2008 సంవత్సరాల్లో ఆర్థిక మాంద్యం నిరుద్యోగితపై ప్రభావం చూపిందని, అలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే సరైన చర్యలు తీసుకోవాలని నాస్కమ్, ఫిక్కీ హెచ్చరించాయి.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Rishabh Pantకి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ టిప్స్
ధోనీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడనే ఆందోళన కంటే ఇప్పటి వరకూ నిలకడగా రాణించే వికెట్ కీపర్ జట్టుకి దొరకలేదనే బెంగ టీమిండియాలో ఇటీవల ఎక్కువైంది. ధోనీ స్థానంలో చోటు దక్కించుకుంటున్న రిషబ్ పంత్.. పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తున్నాడు.
Samayam Telugu | Updated:
Sep 13, 2019, 05:36PM IST
హైలైట్స్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం నుంచి టీ20 సిరీస్ మొదలు
ధోనీ స్థానంలో టీ20 జట్టులోకి ఎంపికైన రిషబ్ పంత్
రిషబ్ పంత్ తప్పిదాల్ని దిద్దుకునే విధానం తెలుసుకోవాలన్న సఫారీ బ్యాటింగ్ కోచ్
ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో తేలిపోయిన రిషబ్ పంత్
సీనియర్ వికెట్ కీపర్/ బ్యాట్స్మెన్ మహేంద్రసింగ్ ధోనీ స్థానంలో భారత జట్టులో చోటు దక్కించుకుంటున్న యువ హిట్టర్ రిషబ్ పంత్ .. పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో ముగిసిన టీ20, వన్డే, టెస్టుల్లో అవకాశం దక్కించుకున్న ఈ యువ వికెట్ కీపర్.. ఒక్క టీ20 మ్యాచ్లో మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. అయితే.. పంత్లో అపారమైన ప్రతిభ ఉంది.. కానీ.. తప్పిదాల్ని దిద్దుకునే విధానం అతనికి తెలియడం లేదంటూ తాజాగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసెనర్ అభిప్రాయపడ్డాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం నుంచి మూడు టీ20ల సిరీస్ మొదలుకానుండగా.. ఈ సిరీస్కి కూడా ధోనీ స్థానంలో పంత్ వికెట్ కీపర్గా ఎంపికైన విషయం తెలిసిందే.
Read More: భారత గడ్డపై టీ20ల్లో దక్షిణాఫ్రికాదే రికార్డ్
‘రిషబ్ పంత్ బలహీనతల గురించి చెప్పాలంటే కష్టమే. అతను చాలా ప్రతిభావంతుడు. అయితే.. తప్పిదాల్ని దిద్దుకుంటూ నిలకడగా రాణించడంలోనే పంత్ విఫలమవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలంటే..? స్వీయ తప్పిదాల్ని దిద్దుకోవడం కంటే ఇతరులు చేస్తున్న తప్పుల్ని పరిశీలిస్తూ వాటిని తాము చేయకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే.. స్వీయ తప్పిదాల్ని దిద్దుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ.. ఇతరులు చేస్తున్న తప్పిదాల్ని చూడటం ద్వారా.. చాలా వేగంగా పాఠాలు నేర్చుకోవచ్చు. కాబట్టి.. రిషబ్ పంత్ ఇకనైనా జట్టులోని సీనియర్ ఆటగాళ్ల సలహాలు, సూచనలు తీసుకుంటూ ఎదగాలి. కానీ.. తన సహజసిద్ధమైన ఆటని మాత్రం విడవకూడదు’ అని క్లూసెనర్ సూచించాడు.
Read More: భారత్లో దక్షిణాఫ్రికా టూర్.. టీమ్, షెడ్యూల్ ఇదే
అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసినప్పటికీ నుంచి రిషబ్ పంత్పై వస్తున్న విమర్శ ఒక్కటే. మ్యాచ్ని సులువుగా ముగించాల్సిన స్థితిలోనూ తన వికెట్ విలువ తెలుసుకోకుండా పేలవ షాట్ సెలక్షన్తో ఔటవ్వడం. ఫార్మాట్ ఏదైనా.. షాట్ ఒక్కటే అనే తరహాలో ఈ యువ హిట్టర్ సిక్సర్ల కోసం ప్రయత్నిస్తూ తరచూ వికెట్ చేజార్చుకుంటున్నాడు. దీంతో.. అతని నిలకడపై ఇప్పటికీ టీమిండియా ఓ స్పష్టతకి రాలేకపోతోంది.
భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ షైనీ
| 2sports
|
Read Also: శ్రీరెడ్డి విప్పేసిన పాంటీ.. నాగ్కి గిఫ్ట్గా! ‘ఛీ’ అరాచకం
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై సెటైర్లు వేశాడు సినీ, రాజకీయ విశ్లేషకుడు మహేష్ కత్తి. ఏకంగా పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడు అంటూ ఆయనకు అభినందలు తెలుపుతూ వివాదాస్పద పోస్ట్లను షేర్ చేశారు కత్తి మహేష్ .
‘ఢిల్లీలో రాజలాంఛనాలతో పవన్ కల్యాణ్కి స్వాగతం. ఎయిర్ పోర్టుకే తరలివచ్చిన ప్రధాని మోడీ, అమిత్ షాలు. ఎయిర్ పోర్ట్ నుండి తిరిగివచ్చిన పవన్’ అంటూ సెటైర్ వేశాడు. అంతటితో ఆగకుండా.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. నారా లోకేష్ ను రాష్ట్ర బీజేపీ జెనరల్ సెక్రెటరీని చేస్తే తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేసేదిశగా చంద్రబాబు ఆలోచన. దత్తపుత్రుడితో పాటు పుత్రుడికి న్యాయం చేసే దిశగా మంతనాలు.
See Photo Story : 'సాఫ్ట్వేర్' భామ చంపేస్తుందిరో.. మామ!
‘నేను ఎప్పుడో చెప్పాను... పవన్ కళ్యాణ్ అల్టిమేట్గా బీజేపీలోకే పోతాడని. గుంటూరు సభకి ఫండ్ చేశారు. ఇప్పుడు డీల్ కుదిరితే స్టేట్లో ముఖ్యనాయకుడిని చేస్తారు. మిత్రుడు త్రివిక్రమ్ చేత జంధ్యం వేయించుకున్నందుకు ఆమాత్రం గిట్టుబాటు కావాలిగా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కత్తి మహేష్.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆస్కార్ అవార్డ్స్ రేసులోంచి మన సినిమా ఔట్
ఆస్కార్ అవార్డ్సులో బెస్ట్ ఫారెన్ ఫిలిం కేటగిరిలో భారత్కి అవార్డు తెచ్చిపెడుతుందనుకున్న కోర్టు సినిమా నిరాశే మిగిల్చింది.
TNN | Updated:
Dec 28, 2015, 06:02PM IST
ఆస్కార్ అవార్డ్సులో బెస్ట్ ఫారెన్ ఫిలిం కేటగిరిలో భారత్కి అవార్డు తెచ్చిపెడుతుందనుకున్న కోర్టు సినిమా నిరాశే మిగిల్చింది. 88వ అకాడెమీ అవార్డులకిగాను భారత్ తరపున ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో బరిలోకి దిగిన చిత్రం కోర్టు. ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 80 సినిమాలు పోటీపడగా... అందులోంచి తొమ్మిది చిత్రాలతో ఓ తుది జాబితాని సిద్ధం చేసింది అవార్డ్సు కమిటీ జ్యూరీ. ఈ తుది జాబితాలో మరాఠీ చిత్రం 'కోర్టు'కి స్థానం దక్కకపోవడంతో ఈ అవార్డు విషయంలో భారత్కి చివరికి నిరాశే మిగిలింది.
ఇక ఈ అవార్డు కోసం పోటీపడుతూ తుది జాబితాలో చోటు దక్కించుకున్న సినిమాల వివరాలిలా వున్నాయి.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఏపీ, తెలంగాణలో ఎయిర్టెల్ 15వేల టవర్లు
ప్రముఖ టెలికాం సేవల సంస్థ భారతి ఎయిర్టెల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తన నెట్వర్క్ను మరింత విస్తరిస్తోంది.ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 15,000 టవర్లను రెండు రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
Samayam Telugu | Updated:
Jun 21, 2018, 12:01PM IST
ప్రముఖ టెలికాం సేవల సంస్థ భారతి ఎయిర్టెల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తన నెట్వర్క్ను మరింత విస్తరిస్తోంది.ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 15,000 టవర్లను రెండు రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దేశంలోనే అగ్రశ్రేణి టెల్కో అయిన ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్లో మిమో టెక్నాలజీ సాయంతో ప్రీ-5జీ సేవలను విస్తరించేందుకు సైతం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలే ఐపీఎల్ 2018 సమయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో ఈ టెక్నాలజీతో సేవలను అందించింది. ముఖ్యమైన బిజినెస్, రెసిడెన్షియల్ హబ్స్లో ప్రీ-5జీ పరీక్షలను చేయనున్నారు. దీని ద్వారా వినియోగదారులు అత్యధిక డేటా వేగం పొందుతారు.
తన నెట్వర్క్కు 3,000 కిలోమీటర్ల మేర అదనపు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ను జోడించనుంది ఈ టెలికాం సంస్థ. విస్తరణ ద్వారా హై స్పీడ్ మొబైల్ డేటాను మరిన్ని ప్రాంతాలకు అందిస్తామని భారతీ ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఈవో అవనీత్ సింగ్ పురి బుధవారం మీడియాకు తెలిపారు.
‘ఔటర్ రింగ్ రోడ్డులో 60 రోజుల్లో 100 శాతం నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది. 2017–18లో 10,000 టవర్లు, 500 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ అనుసంధానించాం. 3 కోట్ల మంది కస్టమర్లున్న తెలంగాణ,ఏపీ సర్కిల్లో 85 శాతం మేర 4జీ కవరేజీ ఉంది’ అని చెప్పారు.
| 1entertainment
|
Visit Site
Recommended byColombia
రాహుల్ సంకృత్యాన్ అనే నూతన దర్శకుడితో.. జిఏ2 పిక్చర్స్ మరియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి ఈ చిత్రం ‘గీతా గోవిందం’ ముందే విడుదల కావాల్సి ఉండగా.. పలు వాయిదాల అనంతరం నవంబర్ 16న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు అఫీషియల్గా ప్రకటించారు. అయితే మరోసారి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తూ.. కొత్త విడుదల తేదీని ప్రకటించారు. విజయ్ వెనక్కి తగ్గటానికి మాస్ రాజా రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రమే కారణం.
మాస్ రాజా రవితేజ, శ్రీను వైట్ల కాంబో మూవీ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం అదే రోజు (నవంబర్ 16) విడుదల కానుండటంతో థియేటర్స్ సర్ధుబాట్లు ఇతరత్రా రిలీజ్ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కరోజు వెనక్కి తగ్గి.. నవంబర్ 17న ‘టాక్సీవాలా’చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా ‘టాక్సీవాలా’ కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదల చేస్తూ.. ‘టాక్సీవాలా కొత్త విడుదల తేదీ ఇదిగో.. డ్రైవర్ ఒకరోజు లేట్గా వస్తున్నాడు కాని.. మీకు ఆ డ్రైవర్ ఫుల్ ఫన్ రైడ్ ఇవ్వడం గ్యారంటీ’ అంటూ ట్వీట్ చేశారు విజయ్ దేవరకొండ. హిలేరియస్ సస్పెన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు నటించారు.
Release date announcement - #Taxiwaala will now arrive Nov 17! Driver arriving a day late, but driver promises a f… https://t.co/eUiUpueVLj
— Vijay Deverakonda (@TheDeverakonda) 1541302774000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్తో ఫైనల్ అనగానే.. అమీర్ రెడీ
నెట్స్లో ఈ రోజు చాలాసేపు అమీర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం అతను పూర్తిగా ఫిటెనెస్ సాధించినట్లే. ఇక ఫైనల్లో
TNN | Updated:
Jun 18, 2017, 01:11PM IST
వెన్నునొప్పి కారణంగా ఇంగ్లాండ్‌తో కీలకమైన సెమీస్ మ్యాచ్‌కి దూరమైన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ భారత్‌తో ఫైనల్‌ కోసం బరిలోకి దిగుతాడట. టోర్నీ తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌‌లు ఆరంభ ఓవర్లలో అమీర్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ మొత్తం ఆడిన రోహిత్ శర్మ కనీసం ఒక పరుగు కూడా రాబట్టలేకపోయాడు. దీంతో ఫైనల్‌లో కూడా అలాంటి ఆరంభాన్నే పాకిస్థాన్ కోరుకుంటోంది.
‘నెట్స్‌లో ఈ రోజు చాలాసేపు అమీర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం అతను పూర్తిగా ఫిటెనెస్ సాధించినట్లే. ఇక ఫైనల్లో అతడ్ని ఆడించాలా లేదా అనే నిర్ణయం తీసుకోవడం ఒకటే తరువాయి. సాధారణంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే ఫైనల్ లాంటి మ్యాచ్‌ల్లో అనుభవం ఉన్న ఆటగాళ్లకి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి అతను తప్పకుండా ఆదివారం మ్యాచ్‌కి తుది జట్టులో ఉంటాడు. ఒకవేళ ఫిటెనెస్ టెస్టులో అతను ఫెయిల్ అయితే.. తర్వాత ఏంటని..? ఆలోచిస్తాం’ అని పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ అజహర్ మహ్మద్ వెల్లడించాడు.
| 2sports
|
indian cricket team to fly business class during home series as well
కోహ్లీ సేనకు శుభవార్త: స్వదేశంలోనూ బిజినెస్ క్లాస్!
టీమిండియా సభ్యులకు శుభవార్త. ఇప్పటి వరకు స్వదేశంలో జరిగే సిరీస్లకు విమానంలో సాధారణ ఎకానమీ క్లాస్లో ప్రయాణించిన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఇకపై బిజినెస్ క్లాస్లో ఎగిరిపోనున్నారు.
TNN | Updated:
Nov 13, 2017, 03:21PM IST
టీమిండియా సభ్యులకు శుభవార్త. ఇప్పటి వరకు స్వదేశంలో జరిగే సిరీస్‌లకు విమానంలో సాధారణ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించిన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఇకపై బిజినెస్ క్లాస్‌లో ఎగిరిపోనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదం తెలిపింది.
స్వదేశంలో మ్యాచ్‌ల సందర్భంగా తాము విమానంలో ప్రయాణించినప్పుడు అసౌకర్యానికి గురవుతున్నామని క్రికెటర్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం వల్ల చాలా మంది తోటి ప్రయాణికులు సెల్ఫీల కోసం ఇబ్బంది పెడుతున్నారని, కాళ్లు పెట్టుకునే స్పేస్ కూడా తక్కువగా ఉంటుందని బీసీసీఐకి వెల్లడించారు. స్వదేశంలో కూడా బిజినెస్ క్లాస్ ప్రయాణాన్నే తమకు కల్పించాలని కోరారు. దీనికి బీసీసీఐ సానుకూలంగా స్పందించింది.
వాస్తవానికి ఇప్పటి వరకు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రమే టీమిండియా సభ్యులకు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. స్వదేశంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాల్సి ఉంది. అయితే కెప్టెన్, కోచ్ మాత్రం స్వదేశంలోనూ బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించొచ్చు. దీంతో మిగిలిన క్రికెట్ల అసౌకర్యాన్ని పరిగణనలోనికి తీసుకున్న బీసీసీఐ.. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ముందు ఉంచింది. ఇటీవల జరిగిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మీటింగ్‌లో ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా చెప్పారు.
కాగా, న్యూజిలాండ్ వన్డే, టి20 సిరీస్‌లను నెగ్గి ఉత్సాహంతో ఉన్న భారత జట్టు.. శ్రీలంకతో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ఇప్పటికే భారత్ చేరుకున్న శ్రీలంక జట్టు వామప్ మ్యాచ్‌లు కూడా ఆడేస్తోంది. భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్ట్ నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ప్రారంభంకానుంది.
| 2sports
|
Sarfraz Ahmed Dismisses Dinesh Chandimal's Witchcraft Claim
లంక కెప్టెన్పై పెదవి విరిచిన పాక్ కెప్టెన్
శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ రెండు రోజుల క్రితం చేసిన మంత్రాల వ్యాఖ్యలపై పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పెదవి విరిచాడు. మంత్రగత్తె
TNN | Updated:
Nov 2, 2017, 06:14PM IST
శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ రెండు రోజుల క్రితం చేసిన మంత్రాల వ్యాఖ్యలపై పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పెదవి విరిచాడు. మంత్రగత్తె అయిన తన స్నేహితుడి తల్లి ఆశీర్వాదం తీసుకోవడంతోనే.. యూఏఈ వేదికగా పాక్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ శ్రీలంక గెలిచిందని చండిమాల్ వెల్లడించాడు. దీంతో సోషల్ మీడియాలో లంక అభిమానులు ఈ వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోశారు. అదే నిజమైతే.. టెస్టు సిరీస్‌ తర్వాత జరిగిన ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో శ్రీలంక ఎందుకు ఓడిపోయిందంటూ ప్రశ్నించారు.
తాజాగా చండిమాల్ మాటలపై సర్ఫరాజ్ అహ్మద్ కూడా స్పందించాడు. ‘మంత్రాల బలంతోనే టెస్టు మ్యాచ్‌ల్ని శ్రీలంక గెలిచిందనుకుంటే.. వన్డే, టీ20ల్లోనూ ఆ జట్టు గెలవాలి కదా..?. అంతెందుకు నేను ఖురాన్‌ని నమ్ముతాను. ప్రపంచంలో ఏదో మ్యాజిక్‌ ఉందని కూడా విశ్వసిస్తాను. కానీ.. మా జట్టు పేలవంగా ఆడటంతోనే టెస్టు సిరీస్‌లో విజయావకాశాల్ని చేజార్చుకుందనే చెప్తాను’ అని సర్ఫరాజ్ అహ్మద్ వివరించాడు. ఆటలోకి ఇలాంటి అంశాల్ని తీసుకురావొద్దని.. పాకిస్థాన్‌కి సరైన వ్యూహం లేకపోవడంతోనే టెస్టుల్లో ఓడిపోయిందని మాజీ క్రికెటర్ యూసఫ్ అభిప్రాయపడ్డాడు.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
తిత్లీ తుఫాన్ బాధితులకు ‘మా’ సాయం
తిత్లీ తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) సభ్యులు.
Samayam Telugu | Updated:
Oct 20, 2018, 06:31PM IST
తిత్లీ తుఫాన్ బాధితులకు ‘మా’ సాయం
తిత్లీ తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) సభ్యులు. భయంకర తిత్లీ తుఫాన్ బీభత్సంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ. 2800 కోట్ల మేర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. బాధితులను ఆదుకోవడానికి పెద్ద మనసుతో ముందుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందజేయాలని రాష్ట్ర ప్రజలను కోరుతోంది ఏపీ ప్రభుత్వం.
| 0business
|
New York, First Published 7, Sep 2018, 7:33 AM IST
Highlights
అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మరోసారి జూలు విదిల్చింది.. యూఎస్ ఓపెన్ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో లాత్వియా క్రీడాకారిణి సెవాస్తోవాపై 6-3, 6-0 తేడాతో సెరెనా విజయం సాధించింది.
అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మరోసారి జూలు విదిల్చింది.. యూఎస్ ఓపెన్ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో లాత్వియా క్రీడాకారిణి సెవాస్తోవాపై 6-3, 6-0 తేడాతో సెరెనా విజయం సాధించింది. కేవలం 66 నిమిషాల్లో లాత్వియాను సెరెనా మట్టికరిపించింది. ఈ ఫైనల్లో సెరెనా విలియమ్స్ విజయం సాధిస్తే.. 24వ గ్రాండ్స్లామ్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నట్లే.. ఇప్పటి వరకు సెరెనా గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం ఈ ఫైనల్ కలిపి మొత్తం 31 సార్లు ఫైనల్స్కు వెళ్లింది.
| 2sports
|
Baroda
గ్రామీణ ప్రాంతాలకు బరోడా బ్యాంకు విస్తరణ
ముంబయి,జూలై 24: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్సేవలో మరిన్ని కొత్త స్కీంలు ప్రారంభించింది. 110వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇబిజినెస్, ప్యాక్ను ఎంఎస్ఎంఇ కస్టమర్లకోసం ప్రవేశపెట్టింది. ఓవర్డ్రాప్డు, డిమాండ్లోన్, స్వల్పకాలికరుణం, కాంపోజిట్లోన్ వంటివి ఉన్నాయి. బరోడా ఛాంప్స్ సేవింగ్ ఖాతాలను కూడా ప్రారంభించింది. 17 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు ఈ ఖాతాలను ఏర్పాటుచేస్తోంది. డిజిటల్ లావాదేవీల ద్వారా కాగితరహిత లావాదేవీలను ఎక్కువ నిర్వహిస్తూ వ్యక్తిగత రునాలను కూడా డిజిటల్ విధా నంలోనే పంపిణీచేస్తోంది. నెట్బ్యాంకింగ్; మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ద్వారా వీటిని వెనువెంటనే బదలా యిస్తున్నది.
కంపెనీలు ఆల్ఫ్రెష్ సప్లయిమేనేజ్ మెంట్, లారెన్స్డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ వంటి కంపెనీ లతో టైఅప్ద్వారా కొత్త రుణఛానళ్లను రైతులకోసం ప్రారంభించామని, కొత్తగా 1000కిపైగా బిజినెస్ కరస్పాండెంట్లను నియమించినట్లు వెల్లడించారు. ఆధార్సాయంతో పిఒఎస్ మెషిన్లు దేశవ్యాప్తంగా వీరికి అందచేసింది. గ్రామీణ బ్యాంకింగ్ను మరింతగా విస్తృతం చేసేందుకు బ్యాంకు అదనంగా 10వేల కొత్త పిఒఎస్ మెషిన్లను భారతీయ రైల్వేలకోసం ఏర్పాటుచేస్తోంది. బ్యాంకుఛైర్మన్ రవి వెంకటేషన్, ఎండిసిఇఒ పి.ఎస్జయకుమార్ తదితరులు బ్యాంకు చేపట్టిన కొత్త కార్యాచరణను మీడియాకు వివరించారు.
బ్యాంకు కొత్తగా బరోడా డేటాకార్డ్, నవోద§్ు, సెంట్రల్కెవైసి రిజిస్ట్రీల సాయంతో నిర్వహణ సామర్ధ్యం పెంచుతోంది. బ్యాంకు కొత్తగా 12ప్రాంతీయ భాషల్లో ఎస్ఎంఎస్సేవలను ప్రారంభించినట్లు వివరించారు. ఎటిఎంలద్వారా కూడా నిధులు బదలా యింపునకు బ్యాంక్ఆఫ్ బరోడా కృషిచేస్తున్నట్లు ఎండి వివరించారు. బరోడా ఎంకనెక్ట్ప్లస్, ప్రస్తుతం సౌదీ అరేబియా, ఫిజి,బ్రిటన్, ఉగాండా, న్యూజిలాండ్,మారిషస్లలో అందుబాటులోకి తెచ్చామన్నారు.
| 1entertainment
|
Enlgland team
ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్: ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
లండన్: లండన్ వేదికగా ప్రతిష్టాత్మక ఐసిసి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభమైంది.. తొలి మ్యాచ్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి.. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.. కాసేపట్లో భారత్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.
| 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
Shikhar Dhawan Injury: పంత్ త్వరగా ఇంగ్లాండ్ వచ్చేయ్.. బీసీసీఐ నుంచి పిలుపు
ధావన్కు బ్యాకప్గా రిషబ్ పంత్కు బీసీసీఐ నుంచి పిలుపొచ్చింది. త్వరలోనే అతడు ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ వెల్లడించాడు.
Samayam Telugu | Updated:
Jun 12, 2019, 06:19PM IST
హైలైట్స్
ధావన్కు బ్యాకప్గా రిషబ్ పంత్కు బీసీసీఐ నుంచి పిలుపొచ్చింది.
త్వరలోనే అతడు ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లనున్నాడు.
ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ వెల్లడించాడు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్లో గాయపడిన శిఖర్ ధావన్కు ప్రత్యామ్నాయంగా రిషబ్ పంత్ను ఎంపిక చేస్తారని వస్తోన్న వార్తలు నిజమయ్యాయి. ధావన్కు బ్యాకప్గా రిషబ్ పంత్కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. సాధ్యమైనంత త్వరగా ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లాలని క్రికెట్ బోర్డు పంత్కు సూచించింది. కానీ ఇప్పుడే అతడు వరల్డ్ కప్ జట్టులో భాగం కాబోడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పడం గమనార్హం. బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో.. పంత్ హుటాహుటిన లండన్ బయల్దేరి వెళ్లనున్నాడు. వచ్చే ఆదివారం పాకిస్థాన్తో మ్యాచ్ కల్లా అతడు జట్టుతో కలుస్తాడు.
శిఖర్ ధావన్ గాయం విషయంలో బీసీసీఐ ఆచితూచి వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ధావన్ పది లేదా 12 రోజుల తర్వాత గాయం నుంచి కోలుకునే అవకాశం ఉందని, ఆ తర్వాతే అతడి పరిస్థితిని సమీక్షిస్తామని టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. అప్పటి వరకూ పంత్ ధావన్కు బ్యాకప్గా ఉండనున్నాడు.
| 2sports
|
sandhya 315 Views AFG vs BAN , Afganistan team , World Cup 2019
Afganistan team
సౌతాంప్టన్: ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసక్తికర పోరు జరగుతుంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్తో బరిలోకి దిగి రెండు వికెట్లు కోల్పోయింది. ముజీబ్ రెహ్మాన్కే మొదటి వికెట్ లిట్టన్ దాస్(16) దక్కింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లను కట్టడి చేస్తూ బంగ్లాపై ఆఫ్ఘన్ బౌలర్లు ఒత్తిడి పెంచుతున్నారు. నబీ బౌలింగ్లో తమీమ్ ఇక్బాల్(36) ఔటయ్యాడు. బంగ్లా 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షకీబ్ అల్ హసన్(48), ముష్ఫిర్ రహీమ్(28)లు ఉన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/
| 2sports
|
Hyderabad, First Published 4, Jul 2019, 11:45 AM IST
Highlights
మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2కి సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు.
మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2కి సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే సినిమా ఆడియెన్స్ ని మరింత ఆకర్షించాలంటే ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాల్సిందే.
అందుకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాంకర్ గా కొత్త అవతారంలో కనిపించనున్నాడట. సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్ - సుదీప్ - విజయ్ సేతుపతి వంటి స్టార్ యాక్టర్స్ తో రామ్ చరణ్ స్వయంగా ముచ్చటించనున్నాడట. అందరితో కాకుండా ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడి ఆ వీడియోలను అన్ని ఛానెల్స్ కి అందిస్తారట.
చరణ్ యాంకర్ గా మారితే సినిమాపై ఒక్కసారిగా జనల ద్రుష్టి పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే RRR షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో చరణ్ కి సమయం దొరకడమే కష్టమే. అయితే రాజమౌళితో ఈ విషయంపై చర్చించి సైరా ప్రమోషన్స్ లో పాల్గొనాలని చరణ్ ఆలోచిస్తున్నాడు. మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Last Updated 4, Jul 2019, 11:45 AM IST
| 0business
|
సల్మాన్ కు ఎట్టకేలకు అమ్మాయి దొరికింది...ఎవరో తెలుసా?
Highlights
తనకు అమ్మాయి దొరికిందంటూ సల్మాన్ ట్వీట్
తెగ సంబర పడిపోతున్న సల్లూ భాయ్ ఫ్యాన్స్
ఇంతలోనే ఆ అమ్మాయి అందుకు కాదని ట్వీట్
అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా భాయ్ ఓ ఇంటివాడు ఎప్పుడు అవుతాడో అని ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు షారుక్ ఖాన్, రాణీ ముఖర్జీ తదితరులు.. సల్మాన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని వివిధ సందర్భాల్లో ప్రశ్నించారు. కాగా సల్మాన్ తన బ్రహ్మచారి జీవితానికి స్వస్తి పలుకుతున్నాడనేలా... ఆయన మంగళవారం ‘నాకు అమ్మాయి దొరికింది’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు. చాలా సంతోషిస్తూ తెగ కామెంట్స్ చేశారు. ఆ అమ్మాయి ఎవరు? అనేది ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ విషయం కూడా భాయ్ చెబితే తెలుసుకోవాల్సిందే.
రొమేనియన్ మోడల్ ఉలియా వంతూర్తో సల్మాన్ ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆమె కూడా అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి బయట కనిపించారు. అంతేకాదు సల్మాన్ కుటుంబసభ్యులను కూడా కలిశారు. దీంతో వీరిద్దరి వివాహం నిశ్చయమైందంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై సల్మాన్ స్పష్టత ఇవ్వలేదు. కానీ ఉలియా మాత్రం సల్మాన్ కుటుంబంతో తనకు మంచి బంధం ఉందని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
సల్మాన్ ఇటీవల ‘టైగర్ జిందా హై’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.340 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు తెలిపారు. కత్రినా కైఫ్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అలీ అభ్బాస్ జఫర్ దర్శకత్వం వహించారు. సల్మాన్ ప్రస్తుతం ‘రేస్ 3’ సినిమా చిత్రీకరణకు సిద్ధమౌతున్నారు. ఇందులో అనిల్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇక తాజాగా సల్మాన్ కు దొరికిన అమ్మాయి ఎవరా అంటే.. వరీనా హుస్సేన్. ఈమె అయుష్ శర్మ తెరకెక్కిస్తున్న లవ్ రాత్రి అనే సినిమాలో హిరోయిన్ గా దొరికకిందట. సల్మాన్ అమ్మాయి దొరికిందంటూ చేసిన ట్వీట్ పై సస్పెన్స్ ఎత్తివేస్తూ.. వరీనా హుస్సేన్ ఫోటోతో మరో ట్వీట్ చేశాడు. దొరికింది ఆయుష్ సినిమాకు హిరోయిన్ వరీనా. సో డోంట్ వరీనా. బీ హేపీనా అంటూ సల్మాన్ వెరైటీగా ట్వీట్ చేశాడు.
Nothing to worry na @aaysharma ki film #Loveratri ke liye ladki mil gayi Warina, Toh dont worry na be happy na pic.twitter.com/uetTpUKRdi
— Salman Khan (@BeingSalmanKhan) February 6, 2018
Mujhe ladki mil gayi
— Salman Khan (@BeingSalmanKhan) February 6, 2018
Last Updated 25, Mar 2018, 11:59 PM IST
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Afg vs Ire T20: అప్ఘాన్ ఓపెనర్ విధ్వంసం.. వరల్డ్ రికార్డ్లు బ్రేక్!
డెహ్రాడూన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన టీ20లో అప్ఘానిస్థాన్ ఓపెనర్ జజాయ్ 62 బంతుల్లో 162 పరుగులు బాదాడు. దీంతో అప్ఘాన్ జట్టు టీ20ల్లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. జజాయ్ విధ్వంసంతో అప్ఘాన్ రికార్డులు బ్రేక్ చేసింది.
Samayam Telugu | Updated:
Feb 23, 2019, 09:14PM IST
Afg vs Ire T20: అప్ఘాన్ ఓపెనర్ విధ్వంసం.. వరల్డ్ రికార్డ్లు బ్రేక్!
హైలైట్స్
డెహ్రాడూన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన టీ20లో అప్ఘానిస్థాన్ ఓపెనర్ జజాయ్ 62 బంతుల్లో 162 పరుగులు బాదాడు.
దీంతో అప్ఘాన్ జట్టు టీ20ల్లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది.
జజాయ్ విధ్వంసంతో అప్ఘాన్ రికార్డులు బ్రేక్ చేసింది.
డెహ్రాడూన్: ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో అప్ఘానిస్థాన్ బ్యాట్స్మెన్ చెలరేగారు. సిక్స్ల మోత మోగిస్తూ.. పొట్టి ఫార్మాట్లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేశారు. ఓపెనర్ అజ్రతుల్లా జజాయ్ (62 బంతుల్లో 162 నాటౌట్; 11x4, 16x6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో అప్ఘాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. తద్వారా టీ20ల్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.
ఈ మ్యాచ్లో అప్ఘాన్ బ్యాట్స్మెన్ 22 సిక్స్లు బాదారు. 2016లో విండీస్ జట్టు టీ20 మ్యాచ్లో భారత్పై 21 సిక్స్లు బాదగా.. ఆ రికార్డ్ను అప్ఘానిస్థాన్ బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్లో జజాయ్ ఒక్కడే 16 సిక్స్లు బాదాడు. పొట్టి ఫార్మాట్లో ఒకే మ్యాచ్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్గా జజాయ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో ఫించ్ (16) పేరిట ఉన్న రికార్డ్ను అతడు బ్రేక్ చేశాడు.
సిక్స్లతో చెలరేగిన జజాయ్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఘనీ (48 బంతుల్లో 73; 7x4, 3x6)తో కలిసి తొలి వికెట్కు ఏకంగా 236 పరుగులు జోడించాడు. టీ20ల్లో ఏ వికెట్కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. గతంలో విరాట్ కోహ్లి-డివిలియర్స్ జోడి రెండో వికెట్కు 236 పరుగులు జోడించగా.. జజాయ్-ఘనీ ఆ రికార్డును బద్దలు కొట్టారు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో జజాయ్ మూడో స్థానంలో నిలిచాడు. 175 నాటౌట్తో గేల్ టాప్ స్కోరర్గా నిలవగా.. జింబాబ్వేపై 172 పరుగులు చేసిన ఫించ్ రెండో స్థానంలో ఉన్నాడు. మసకద (162*)తో కలిసి జజాయ్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల పరంగా చూస్తే.. ఈ అప్ఘాన్ బ్యాట్స్మెన్ రెండో స్థానంలో ఉన్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
తెలుగులో హిట్టయిన టాప్ తమిళ్ సినిమాలు
First Published 18, Mar 2019, 7:26 PM IST
కోలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరు మన ప్రేక్షకులకు పరిచయమే.. ఎన్నో డబ్బింగ్ సినిమాలను తెలుగు జనాలు తమిళ్ ప్రేక్షకులతో పోటీపడి ప్రేమించారు. అలాంటి ఎన్నో సినిమాల్లో కొన్ని టాప్ సినిమాలు ఇవే..
కోలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరు మన ప్రేక్షకులకు పరిచయమే.. ఎన్నో డబ్బింగ్ సినిమాలను తెలుగు జనాలు తమిళ్ ప్రేక్షకులతో పోటీపడి ప్రేమించారు. అలాంటి ఎన్నో సినిమాల్లో కొన్ని టాప్ సినిమాలు ఇవే..
Recent Stories
| 0business
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
సముద్రంలో జలకాలాట.. మాల్దీవుల్లో ఒంటరిగా ఎంజాయ్ చేస్తోన్న రేణు దేశాయ్
ఎప్పుడూ తన పిల్లలు అకీరా నందన్, ఆధ్యతో విహారయాత్రలకు వెళ్లే రేణు దేశాయ్.. ఈసారి మాత్రం ఒంటరిగా మాల్దీవులు వెకేషన్కు వెళ్లారు. అక్కడ సముంద్రంలో జలకాలాడుతోన్న ఫొటోలను షేర్ చేశారు.
Samayam Telugu | Updated:
Oct 31, 2019, 05:58PM IST
మాల్దీవుల్లో రేణు దేశాయ్
మల్టీ టాలెండెట్ రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత తన ఇద్దరు పిల్లలతో జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. కేవలం వ్యక్తిగత జీవితాన్నే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తనకెంతో ఇష్టమైన సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. హైదరాబాద్ నుంచి పుణే వెళ్లిపోయిన ఆమె.. మరాఠి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దర్శకురాలుగా ఒక సినిమా, నిర్మాతగా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగులోనూ ఒక సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు.
ఒకవైపు తన ప్రొఫెషనల్ లైఫ్తో బిజీగా ఉంటూనే పిల్లలతోనూ ఆనందమైన వ్యక్తిగత జీవితాన్ని గుడుపుతున్నారు రేణు. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. అయితే, ప్రస్తుతం ఆమె ఒంటరిగా వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా అందమైన మాల్దీవుల్లో. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, రెండు అందమైన ఫొటోలను కూడా షేర్ చేశారు. సముద్రంలో ఒంటరిగా జలకాలాట ఆడటం ఎంతో బాగుందని పేర్కొన్నారు.
| 0business
|
ఆర్ఐఎల్- ఆర్పీఎల్ విలీనానికి గ్రీన్సిగ్నల్
PNR|
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్) విలీనానికి ఆమోదముద్ర పడింది. సోమవారం సమావేశమైన రెండు కంపెనీల బోర్డులు ఈ భారీ విలీనానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చాయి. రెండు కంపెనీలకు ముకేశ్ అంబానీ ప్రమోటర్గా వ్యవహరిస్తున్నారు.
ప్రపంచంలోనే ఓ అతిపెద్ద రిఫైనరీ సంస్థగా ఆర్ఐఎల్ను ఆవిష్కరించే దిశగా, ఆర్పీఎల్ను అందులో విలీనం చేస్తున్నారు. ఈ విలీనం ఏప్రిల్ 1, 2008 నుంచి అమల్లోకి వస్తుంది. ఆర్ఐఎల్- ఆర్పీఎల్ మధ్య 1:16 షేర్ల నిష్పత్తితో ఈ విలీనం జరుగుతుంది. ప్రతి 16 ఆర్పీఎల్ వాటాలకు ఒక ఆర్ఐఎల్ షేరును వాటాదారులకు కేటాయించాలని తాజా బోర్డు సమావేశంలో నిర్ణయించారు.
విలీనంతో ఆర్ఐఎల్ ప్రపంచంలోని 50 అతిపెద్ద రిఫైనరీ కంపెనీల్లో ఒకటిగా నిలవనుంది. ఇదిలా ఉంటే అంతకుముందు ఆర్పీఎల్లో అమెరికాకు చెందిన ఇంధన దిగ్గజం చెవ్రోన్ ఎనర్జీకి ఉన్న ఐదు శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఆర్ఐఎల్ బోర్డు ప్రకటించింది. చెవ్రోన్కు ఉన్న 22.50 కోట్ల వాటాలు లేదా ఐదు శాతం వాటా కొనుగులతో ఆర్పీఎల్లో ఆర్ఐఎల్ వాటా 75.38 శాతానికి చేరుతుంది.
సంబంధిత వార్తలు
| 1entertainment
|
Jun 19,2015
సామ్సంగ్ నుంచి మరో రెండు కొత్త ట్యాబ్లు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల దిగ్గజ సంస్థ సామ్సంగ్ గురువారం రెండు మధ్య శ్రేణి గెలాక్సీ ట్యాబ్లెట్లను భారత్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. గెలాక్సీ ట్యాబ్-ఏ, గెలాక్సీ ట్యాబ్-ఈ పేర్లతో మధ్య శ్రేణి ట్యాబ్లెట్లను కంపెనీ విపణిలోకి అందుబాటులోకి తెచ్చింది. తక్కువ బరువు, ఆకర్షణీయమైన రూపాల సరైన మేళవింపుతో ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చినట్లు సంస్థ వివరించింది. ఈ రెండు ట్యాబ్లలోనూ వాయిస్ కాలింగ్ సౌకర్యం కలదు. గెలాక్సీ ట్యాబ్ -ఏ బరువు 320 గ్రాములు కాగా, ట్యాబ్-ఈ 495 గ్రాముల బరువు ఉంటుందని సంస్థ తెలిపింది. గెలాక్సీ ట్యాబ్-ఏ, 4:3 నిష్పత్తి డిస్ల్పేతో ఉన్నతమైన స్పష్టత కలిగిన ప్రదర్శనను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ట్యాబ్ల అంతర్గత మెమోరీని 128 జీబీ వరకు పెంచుకొనే సౌలభ్యం కలదు.ఈ ట్యాబ్ 4జీ ఎల్టీఈ బహుళ బ్యాండ్లలో పని చేస్తుంది. ట్యాబ్-ఏ ధరను కంపెనీ రూ.20,500గా నిర్ణయించింది.ట్యాబ్-ఏ ట్యాబ్లు స్మోకీ టైటానియమ్, తెలుపు రంగులలో అందుబాటులో ఉంటాయి.
గెలాక్సీ ట్యాబ్-ఈ..
ఈ సరికొత్త ట్యాబ్ 16:10 నిష్పత్తితో కూడిన 9.6 అంగుళాల తెరతో కంపెనీ రూపొందించింది. దీనిలో పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ మోడ్ను అందుబాటులోకి తెచ్చారు. దీని ధర రూ.16,900. ఇది కేవలం ఫ్లిప్ కార్టులోనే కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. మెటాలిక్ నలుపు, ముత్యపు తెలుపు రంగులలోనే ట్యాబ్-ఈ అందుబాటులో ఉంటుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
internet vaartha 135 Views
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియా ప్రకటించిన స్పాట్ ఫేర్ స్కీంలో మరో ఏడు సెక్టార్లను చేర్చింది. మరికొన్ని రూట్లను రాజధాని ఎసి టైటైర్ ఛార్జిలకు అనుగుణంగా మారుస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీ రాంచి ఢిల్లీ, ఢిల్లీ అహ్మదాబాద్ ఢిల్లీ, ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ, ఢిల్లీ భువనేశ్వర్ ఢిల్లీ, ఢిల్లీ గోవా ఢిల్లీ, ఢిల్లీ పాట్నా ఢిల్లీ, ఢిల్లీ రాయ్ పూర్ ఢిల్లీ రూట్లను ఎంపికచేసింది. ఢిల్లీ రాంచికి 2770, ఢిల్లీ అహ్మదాబాద్కు రూ.2270, ఢిల్లీ హైదరాబాద్కు రూ.3275, ఢిల్లీ భువనేశ్వర్కు 3475, ఢిల్లీ గోవాకు 3665, ఢిల్లీ పాట్నాలకు రూ.2315, ఢిల్లీ రా§్ుపూర్కు రూ.2240 లుగా ప్రకటించింది. గతనెల 27వ తేదీనుంచి ఎసి టు టైర్ ఛార్జీలతోస్పాట్ఫేర్ స్కీంనుఎయిర్ ఇండియా ప్రకటించింది. ఢిల్లీజమ్ము, ఢిల్లీముంబై, ఢిలీనుంచి కోల్కత్తా, బెంగలూరు,చెన్నై, రాంచి, అహ్మదాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, గోవా, పాట్నా, రాయ్ పూర్, తరువనంతపురం, గౌహతిరూట్లలో ఈ సౌకర్యం ప్రకటించింది. అలాగే ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, చెన్నైనగరాలకు రాజధాని ఎక్స్ ప్రెస్ ఎసి2టైర్ ధరలతోనేనడపాలని నిర్ణయించింది.
| 1entertainment
|
New Delhi, First Published 8, Sep 2019, 2:05 PM IST
Highlights
దేశంలో ఆర్ధిక మాంద్యం ప్రభావాన్ని తగ్గించేందుకు మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంపై ద్రుష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు 2024-25 నాటికి దేశ ఆర్ధిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
మందగిస్తున్న దేశ ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించడానికి కేంద్రం ఎప్పుడూ లేని భారీగా ఆలోచిస్తోంది. దేశ ఆర్ధిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చడానికి 2024-25 నాటికి మౌలిక వసతుల రంగంలోకి ఏకంగా రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చేయాలని భావిస్తోన్నట్లు శనివారం కేంద్ర ఆర్ధిక శాఖ ఓ ప్రకటన చేసింది.
ఈ మొత్తం పెట్టుబడుల కల్పనకు రోడ్మ్యాప్ రూపొందించడానికి ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ కమిటీ రూ.100 కోట్ల పైబడిన గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నది.
ఈ టాస్క్ఫోర్స్లో పలు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులు, నీతి అయోగ్ సీఈఓ తదితరులు భాగస్వాములుగా ఉంటారు. ఇది 2019-20 నుంచే ఆర్ధికంగా, విత్తపరంగా ఫలించే ప్రాజెక్టులను గుర్తించనున్నది.
2020-21 ఆర్ధిక సంవత్సరం నుంచి 2014-25 ఆర్ధిక సంవత్సరం వరకు ఐదేళ్ల పాటు వచ్చే ప్రాజెక్టులకు అవకాశాలను గర్తించి జాబితాను రూపొంచనున్నది. ఈ టాస్క్ ఫోర్స్ 2019-20కి ప్రాజెక్టులపై నివేదికను వచ్చే నెల అక్టోబర్ 31 కల్లా విత్త మంత్రి నిర్మలా సీతారామన్కు అందించనుంది. ఈ మేరకు నివేదికను 2019 డిసెంబర్ ముగింపు నాటికి ఇవ్వనుంది.
2024-25 నాటికి భారత ఆర్ధిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చే లక్ష్యంలో భాగంగా మౌలిక వసతుల రంగంలో రూ.100 లక్షల కోట్ల (1.4 ట్రిలియన్ డాలర్లు) వ్యయం చేయాలని కేంద్రం నిర్దేశించుకుందని ఆర్ధిక శాఖ తెలిపింది. గడిచిన దశాబ్దం (2008-17) కాలంలో మౌలిక వసతుల రంగ వసతులపై 1.1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి.
మౌలిక వసతులు కల్పించకుండా వృద్ధి రేటును ఆశించలేమని ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో మౌలిక వసతుల రంగంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామన్నారు.
సామాజిక, ఆర్ధిక మౌలిక వసతులపై ఈ పెట్టుబడులు ఉంటాయని న్నారు. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణలో ప్రతి శాఖ, విభాగం బాధ్యులుగా ఉంటాయని ఆర్ధిక శాఖ పేర్కొంది. గడువు సమయంలో, అంచనా వేసిన వ్యయంలో పూర్తి చేయడంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది.
Last Updated 8, Sep 2019, 2:07 PM IST
| 1entertainment
|
DEMONETISATION
న్యూఢిల్లీ: గత నవంబర్లో 500,1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ సంచలన నిర్ణయం
తీసుకున సంగతి తెలిసిందే. కాగా పాత నోట్లను మార్చుకునేందుకు ఈ సంవత్సరం చివరి వరకు అవకాశం
కల్పించారు.ఈ నేపథ్యంల బ్యాంకు ఖాతాల్లో భారీగా డిపాజిట్లు పెరిగాయి.అయితే నోట్ల రద్దు అనంతరం కేంద్ర
ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసిన నిధులపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ చీఫ్ కెవి
చౌదరి పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే ఆదాయపు పన్ను అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
నోట్ల రద్దు తరువాత ఉద్యోగులు జమ చేసిన నగదంతా వారి ఆదాయం నుంచి చేశారా లేదా అన్న కోణంలో
దర్యాప్తు చేపట్టనున్నాం. ఇప్పటికే నోట్ల రద్దు తరువాత వ్యక్తిగత ఖాతాలను సిబిడిటి పరిశీలిస్తుంది.దీంతో ఈ
నిర్ణయం తీసుకున్నాం అని చౌదరి పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగంలో
పనిచేసే ప్రతి ఒక్కరి ఖాతాలను కూడా పరిశీలించనున్నట్లు వివరించారు.ఒకవేళ వారి ఖాతాల్లో జమ అయిన
నగదులో ఏమైనా అవకతవకలు కనిపిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.బ్యాంక్ డిపాజిట్లలో
అవకతవకలు జరిగి ఉండవచ్చనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చౌదరి పేర్కొన్నారు.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్ చేతిలో వన్డేల్లోనూ లంక క్లీన్స్వీప్..!
శ్రీలంక గడ్డపై భారత్ వన్డేల్లోనూ జైత్రయాత్ర కొనసాగించింది. ఇప్పటికే టెస్టుల్లో ఆ జట్టును వైట్వాష్ చేసిన టీమిండియా తాజాగా వన్డేల్లోనూ
TNN | Updated:
Sep 3, 2017, 10:25PM IST
శ్రీలంక గడ్డపై భారత్ వన్డేల్లోనూ జైత్రయాత్ర కొనసాగించింది. ఇప్పటికే టెస్టుల్లో ఆ జట్టును వైట్‌వాష్ చేసిన టీమిండియా తాజాగా వన్డేల్లోనూ తిరుగులేని ప్రదర్శనతో క్లీన్‌స్వీప్ చేసేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి (110 నాటౌట్: 116 బంతుల్లో 9x4) అజేయ శతకం బాదడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు.. పేసర్ భువనేశ్వర్ కుమార్ (5/42) ధాటికి 49.4 ఓవర్లలో 238 పరుగులకే కుప్పకూలిపోయింది. లాహిరు తిరుమానె (67: 102 బంతుల్లో 3x4, 1x6), మాథ్యూస్ (55: 98 బంతుల్లో 4x4), కెప్టెన్ ఉపుల్ తరంగ (48: 34 బంతుల్లో 9x4) ఫర్వాలేదనిపించినా.. చివర్లో ఆ జట్టు తడబడి తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఛేదనలో కోహ్లితో పాటు కేదార్ జాదవ్ (63: 73 బంతుల్లో 7x4) అర్ధశతకంతో రాణించాడు. దీంతో భారత్ లక్ష్యాన్ని 46.3 ఓవర్లలోనే 239/4తో ఛేదించేసింది. ఈ రెండు జట్ల మధ్య బుధవారం రాత్రి 7 గంటలకి ఏకైక టీ20 మ్యాచ్ జరగనుంది.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
నటి కారుపై మూత్రం పోశాడు.. అడ్డుకోబోతే ఇలా!!
‘సుడిగాడు’ చిత్రంలో అల్లరి నరేష్తో జోడి కట్టిన గుజరాత్ నటి మోనాల్ గజ్జర్కు ఒక చేదు అనుభవం ఎదురైంది. తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని అడ్డుకున్నందుకు వేధింపులకు గురైంది.
TNN | Updated:
Mar 8, 2018, 10:04PM IST
‘సుడిగాడు’ చిత్రంలో అల్లరి నరేష్‌తో జోడి కట్టిన గుజరాత్ నటి మోనాల్ గజ్జర్‌కు ఒక చేదు అనుభవం ఎదురైంది. తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని అడ్డుకున్నందుకు వేధింపులకు గురైంది. వివరాళ్లోకెళ్తే.. మోనాల్ గజ్జర్ రెండు రోజుల క్రితం అహ్మదాబాద్ లో ఓ కాఫీ షాప్‌కి వెళ్ళింది. ఆ సమయంలో కాఫీ షాప్ దగ్గరిలోనే తన కారుని పార్క్ చేసింది. తిరిగి బ్యూటీ పార్లర్ నుండి తిరిగి వచ్చేసే ప్రయత్నంలో భాగంగా పార్క్ చేసిన కారు దగ్గరికి రాగానే ఒక గుర్తు వ్యక్తి తన కారుపై మూత్రవిసర్జన చేయడం గమనించి తప్పని చెప్పుతూ.. కార్ హారన్ కొట్టింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ గుర్తుతెలియని వ్యక్తి హారన్‌ ఎందుకు కొట్టావంటూ మోనాల్‌తో వాగ్వాదానికి దిగడంతో పాటు అసభ్యపదజాలంతో తిట్టడం ప్రారంభించాడు.
వీడియో కోసం క్లిక్ చేయండి:
ఈ మొత్తాన్ని ఆమె తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి.. ఆ వీడియోను పోలీసులకు అందచేసింది మోనాల్ గజ్జర్‌ . ఆమె ఇచ్చిన వీడియో ఆధారంగా పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా ఆ వీడియాను సోషల్ మీడియా ద్వారా షేర్ చూస్తూ.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫ్యాన్స్‌కి వివరించింది ‘సుడిగాడు’ సుందరి మోనాల్ గజ్జర్.
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నాగబూబు కామెంట్లపై యండమూరి స్పందన
శనివారం గుంటూరులో జరిగిన ఖైదీ నం.150 చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి తమ్ముడు నాగబాబు ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మలపై నిప్పులు
| Updated:
Jan 8, 2017, 10:56AM IST
శనివారం గుంటూరులో జరిగిన ఖైదీ నం.150 చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి తమ్ముడు నాగబాబు ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మలపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ‘‘ఓ ప్రముఖ రచయిత, రచనా వ్యాసంగంలో ఆరితేరిన మూర్ఖుడు ఒకడున్నాడు. వాడంటే నాకు ఇప్పటికి గౌరవం. కనిపిస్తే కాళ్ళకు దండం పెడతాను. కాని వాడికి వ్యక్తిత్వ వికాసం లేదు. వాడు చరణ్ గురించి ఏవో చెత్త కామెంట్లు చేశాడు. వాడు వ్యక్తిత్వ వికాసం గురించి అందరికీ క్లాసులు చెప్పే ముందు.. కాస్త వ్యక్తిత్వం నేర్చుకుంటే బెటర్’’ అంటూ యండమూరిపై ఫైర్ అయ్యాడు నాగబాబు.
అటు వర్మపై ఫైర్ అయ్యారు. ఆయన విసిరే వేస్ట్ ట్విట్ల బాంబులు ముంబైలో విసురుకోవాలని సలహా ఇచ్చారు. అయితే నాగబాబు సభలో మాట్లాడిన కొద్ది సేపటికే వర్మ ట్విట్టర్లో తెలుగు, ఇంగ్లిష్ లో స్పందించారు. తెలుగులో క్షమాపణ చెప్పడం ఇంగ్లిష్ లో మళ్లీ కౌంటర్ రిప్లై ఇవ్వడం జరిగిపోయాయి.
ఇక, యండమూరి మాత్రం ఇవేవీ చేయకుండా...నాగబాబు కామెంట్లపై కాల్ గా స్పందించారు. అసలు నాగబాబు ఎందుకు అలా ఎందుకు మాట్లాడారో తనకు అర్ధం కావడం లేదన్నారు. ‘‘ఇటీవలే మేమిద్దరం ఓ ఫంక్షన్ లో కలిసాం. గురువు గారు అంటూ నన్ను ఆప్యాయంగా పలకరించి ఓ కథ ఉంటే చెప్పమని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఆవేశంతో ఆ మాటలు ఎలా అన్నాడో అర్దం కావడంలేదని’’ యండమూరి తన సన్నిహితుల వద్ద వాపోయారు.
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
సుల్తాన్ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్ ?
ప్రేమ్ రతన్ ధన్ పాయో తర్వాత సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సుల్తాన్.
TNN | Updated:
Jan 9, 2016, 10:40PM IST
సుల్తాన్ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్ ?
ప్రేమ్ రతన్ ధన్ పాయో తర్వాత సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సుల్తాన్. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సల్మాన్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది మొదటి నుంచి ఓ పెద్ద మిస్టరీగా మారింది. దీపికా పదుకునే నుంచి పరిణీతి చోప్రా , కత్రినా కైఫ్ వరకు చాలామంది హీరోయిన్ల పేర్లు ఆ జాబితాలో వినిపించాయి. కానీ తాజాగా ఆ జాబితాలో లేని అనుష్కా శర్మని ఫైనల్ చేసినట్లు మేకర్స్ స్పష్టంచేశారు. సుల్తాన్ సినిమా అధికారిక ట్విటర్ ఎకౌంట్లో ''మీట్ సుల్తాన్స్ లీడింగ్ లేడీ'' అని అనుష్కా శర్మ పేరుని ప్రకటిస్తూ ఓ ట్వీట్ చేశారు మేకర్స్.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Nov 18,2015
నాలుగు మాసాల కనిష్ఠానికి స్వర్ణం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలకు తోడు ఆభరణాల వర్తకులు, రిటైలర్ల కొనుగోళ్లలో స్తబ్ధత చోటు చేసుకోవడంతో పసిడి ధర మరింత తగ్గింది. మంగళవారం ఒకే రోజు రూ.450 మేర తగ్గింది. దీంతో పసిడి ధర నాలుగు మాసాల కనిష్ఠ స్థాయికి చేరింది. ఇదే క్రమంలో కిలో వెండి ధర కూడా దాదాపు రూ.500 దిగివచ్చింది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.450 పతనమై వరుసగా రూ.25,700, రూ.25,550గా పలికింది. గత జులై 20న పసిడి ధర ఈ స్థాయిలో నమోదయింది. అమెరికా ఫెడరల్ రిజర్వు త్వరలో వడ్డీ రేట్లు పెంచనుందన్న అంచనాల్లో పసిడి ధర తగ్గుదలకు కారణమైంది. ఈ అంచనాల్లోనే డాలర్కు డిమాండ్ పెరిగడం, బంగారంపై పెట్టుబడిదార్లకు ఆసక్తి తగ్గిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అశ్విన్పై వేటు వేసి.. విశ్రాంతి అంటారా..?
సెలక్టర్లు వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం అయితే అతనికి రెస్ట్ ఇచ్చారు. అలా అయితే.. అశ్విన్ ఇంటి దగ్గర విశ్రాంతి
TNN | Updated:
Aug 22, 2017, 09:28PM IST
భారత సెలక్టర్లు ఉద్దేశపూర్వకంగానే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని విశ్రాంతి పేరుతో పక్కన పెట్టారని హర్భజన్ సింగ్ ఆరోపించాడు. ఒకవేళ విశ్రాంతి అయితే.. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ మ్యాచ్‌లు ఆడేందుకు అశ్విన్ ఎందుకు వెళ్తున్నాడని ప్రశ్నించాడు. శ్రీలంకతో ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం ఇటీవల ఎంపిక చేసిన భారత్ జట్టులో స్పిన్నర్ జడేజాతో పాటు అశ్విన్‌‌కి సెలక్టర్లు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో అక్షర్‌పటేల్, యుజ్వేందర్ చాహల్‌‌కి అవకాశమిచ్చారు.
‘నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అశ్విన్‌పై వేటు వేశారా..? లేక విశ్రాంతినిచ్చారా.? అని. సెలక్టర్లు వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం అయితే అతనికి రెస్ట్ ఇచ్చారు. అలా అయితే.. అశ్విన్ ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోకుండా ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఎందుకు వెళ్తున్నాడు. ఇది ఏ తరహా విశ్రాంతో సెలక్టర్లే చెప్పాలి’ అని హర్భజన్ విమర్శించాడు. టెస్టుల్లో మెరుగ్గా రాణిస్తున్న అశ్విన్.. గత కొంతకాలంగా వన్డే, టీ20ల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోతున్నాడు. ఈ కారణంతోనే ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కొన్ని మ్యాచ్‌ల్లో అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు.
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బాధ్యత నాదే.. సవాల్ చేయను: స్మిత్
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కఠినంగా వ్యవహరించిందని శిక్ష తగ్గించాలని డిమాండ్ వినిపిస్తోన్న నేపథ్యంలో స్మిత్ భిన్నంగా స్పందించాడు.
Samayam Telugu | Updated:
Apr 4, 2018, 12:02PM IST
బాధ్యత నాదే.. సవాల్ చేయను: స్మిత్
బాల్ ట్యాంపరింగ్ వివాదంతో దేశానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించడంతో వార్నర్, స్మిత్, బాన్క్రాఫ్ట్లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకుంది. ఏడాదిపాటు క్రికెట్ ఆడకుండా స్మిత్, వార్నర్పై నిషేధం విధించింది. బాన్క్రాఫ్ట్ను 9 నెలలపాటు సస్పెండ్ చేసింది. వేటుకు గురైన తర్వాత ఆటగాళ్లు మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పారు. తప్పు చేశామంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
క్రికెటర్లపై ఏడాదిపై శిక్ష విధించడం అన్యాయమని మాజీలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ముగ్గురిపై తీసుకున్న చర్యలు కఠినంగా ఉన్నాయని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం అభిప్రాయపడింది. ఆంక్షల విషయంలో బోర్డు మరోసారి ఆలోచించాలని, నిషేధాన్ని తగ్గించే అవకాశాలను పరిశీలించాలని బోర్డును కోరింది. దేశవాళీ క్రికెట్లోనైనా ఆడే అవకాశం కల్పించాలని అభ్యర్థించింది.
I would give anything to have this behind me and be back representing my country. But I meant what I said about tak… https://t.co/CDGtoVpwUm
— Steve Smith (@stevesmith49) 1522820754000
ఈ నేపథ్యంలో స్మిత్ స్పందిస్తూ.. తాను దేశం తరఫున తిరిగి ఆడటానికి కృషి చేస్తానని తెలిపాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో కెప్టెన్గా పూర్తి బాధ్యత నాదే. నాపై విధించిన ఆంక్షలను సడలించాలని అభ్యర్థించను. మాపై విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని సవాల్ చేయను. తప్పు చేస్తే ఉపేక్షించబోమని సంకేతాలు పంపడానికే క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. నేను దాన్ని అంగీకరించానని స్మిత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బాహుబలి గ్రాఫిక్ నావెల్కి పెరుగుతున్న క్రేజ్
బాహుబలి సినిమాకున్న క్రేజ్ని మరింత పెంచుతూ కొత్తగా ఆ చిత్ర యూనిట్ తీసుకురానున్న గ్రాఫిక్ నావెల్పై అప్పుడే...
TNN | Updated:
Nov 16, 2016, 12:55AM IST
బాహుబలి గ్రాఫిక్ నావెల్కి పెరుగుతున్న క్రేజ్
బాహుబలి సినిమాకున్న క్రేజ్‌ని మరింత పెంచుతూ కొత్తగా ఆ చిత్ర యూనిట్ తీసుకురానున్న గ్రాఫిక్ నావెల్‌పై అప్పుడే ఆడియెన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. గ్రాఫిక్ ఇండియాతో కలిసి బాహుబలి మేకర్స్ తీసుకురానున్న ఈ గ్రాఫిక్ నావెల్‌కి 'బ్యాటిల్ ఆఫ్ ది బోల్డ్' అని పేరు పెట్టారు. ఇటీవలే బాహుబలి మూవీ మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీపై షేర్ చేసుకున్న కొన్ని శాంపిల్ పిక్స్ కూడా ఇప్పుడు సినీప్రియుల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. మాహిష్మతి రాజ్యంలో బాహుబలి, భళ్లాలదేవ పాత్రలు చేసే అద్భుతమైన సాహసాలు, విన్యాసాల కథాకమామిషే ఈ బ్యాటిల్ ఆఫ్ ది బోల్డ్ అని ఆ శాంపిల్ పిక్స్ చెప్పకనే చెబుతున్నాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
admin 233 Views
న్యూఢిల్లీ: ఐసిసి 2015 సంవత్సరానికి అవార్డుల జాబితాను వెల్లడించింది.కాగా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)తో పాటు ఐసిసి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సొంతం చేసుకున్నాడు.ఐసిసి వన్డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎబి డివిలియర్స్కు దక్కింది.కాగా ఈ మేరకు బుధవారం ఐసిసి అవార్డుల జాబితాను ప్రకటించింది.ఆస్ట్రేలియా కెప్టెన్ స్టివ్ స్మిత్ రెండు అవార్డులతో మొదటి స్థానంలో నిలిచాడు.కాగా ఈ ఏడాది ఐసిసి ప్రకటించిన అవార్డుల జాబితాలో ఒక్క భారతీయ క్రికెటర్ కూడా లేకపోవడం విశేషం.సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని అందుకున్న నాలుగవ ఆస్ట్రేలియన్ క్రికెటర్గా స్టీవ్ స్మిత్ రికార్డు సృష్టించాడు.ఐసిసి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న 11వ ఆస్ట్రేలియా ఆటగాడ.ఇక ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆస్ట్రేలియా పాస్ట్ బౌలర్ జోష్ హెజల్వుడ్ని వరించింది.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మ్యాచ్ అక్కడే మలుపు తిరిగింది: కుల్దీప్
శ్రీలంకతో విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డే మ్యాచ్ 28వ ఓవర్లోనే కీలక మలుపు తిరిగిందని భారత మణికట్టు
TNN | Updated:
Dec 18, 2017, 03:04PM IST
మ్యాచ్ అక్కడే మలుపు తిరిగింది: కుల్దీప్
శ్రీలంకతో విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డే మ్యాచ్ 28వ ఓవర్‌లోనే కీలక మలుపు తిరిగిందని భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. ఆ ఓవర్ బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్.. అప్పటికే భారత్‌ బౌలర్లకి వరుస బౌండరీలతో సవాల్ విసురుతున్న ఓపెనర్‌ ఉపుల్ తరంగ (95)‌ని ఔట్ చేసి శ్రీలంక‌కి షాకిచ్చాడు. తర్వాత నాలుగు బంతుల వ్యవధిలోనే దూకుడుగా ఆడే నైజమున్న డిక్వెల్లా (8)ని కూడా కుల్దీప్ ఔట్ చేయడంతో ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు చేజార్చుకున్న లంక ఒత్తిడిలో పడింది. చివరికి ఆ జట్టు 215 పరుగులకే కుప్పకూలగా.. లక్ష్యాన్ని భారత్ 32.1 ఓవర్లలోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
| 2sports
|
Aug 23,2015
'ఐఓసీ' ఆఫర్ కనీస ధర రూ.387
ముంబయి: దేశంలో అతిపెద్ద చమురు సంస్థ 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్'లో (ఐఓసీ) మరో 10 శాతం వాటా విక్రయానికి గాను ప్రభుత్వం శనివారం కనీస ధరను ప్రకటించింది. సోమవారం నాడు జరగనున్న ఈ వాటా విక్రయానికి గాను షేరు ఒక్కింటికి కనీస ధరను ప్రభుత్వం రూ.387గా నిర్ణయించింది. ఇది శుక్రవారం నాడు మార్కెట్ ముగింపు సమయానికున్న స్క్రిప్ ధర కంటే రెండు శాతం తక్కువ. కనీస ధర వద్ద 10 శాతం వాటా విక్రయం వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.9390 కోట్ల మేర నిధులు సమకూరనున్నాయి. ప్రభుత్వ సంస్థలలో వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 11 బిలియన్ డాలర్లను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జీడీపీలో ఆర్థిక లోటును ప్రణాళికీకరించిన 3.9 శాతానికి తీసుకు వచ్చేందుకు గాను ఇది చాలా అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. సంస్థలో 68.6 శాతం వాటా కలిగిన ప్రభుత్వం తాజాగా 10 శాతం వాటాకు సమానమైన 24.28 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనుంది. రిటైల షేరుహోల్డర్లకు అయిదు శాతం మేర డిస్కౌంట్ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వానికి దాదాపు రూ.9.302.21 కోట్ల మేర నిధులు సమకూరనున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అందుకే కీర్తిరెడ్డికి విడాకులిచ్చాను: సుమంత్
సుమంత్ తొలిసారిగా తన వ్యక్తిగత విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు. ఆయన మాజీ సతీమణి, నటి కీర్తి రెడ్డితో విడాకులు తీసుకోవడం వెనుక గల కారణాన్ని వెల్లడించారు.
TNN | Updated:
Dec 18, 2017, 07:32PM IST
‘మళ్లీ రావా’ అంటూ వ‌చ్చిన‌ హీరో సుమంత్ ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ ఓ హిట్ అందుకున్నాడు. విజ‌యోత్సాహంలో ఉన్న సుమంత్ త‌న తదుపరి చిత్రం కోసం క‌థ‌లు వినే ప‌నిలో ఉన్నారు. అయితే, ఆయ‌న తొలిసారిగా త‌న వ్య‌క్తిగ‌త విష‌యాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆయ‌న మాజీ స‌తీమ‌ణి, న‌టి కీర్తి రెడ్డితో విడాకులు తీసుకోవ‌డం వెనుక గ‌ల కార‌ణాన్ని వెల్ల‌డించారు. 2004లో పెళ్లి చేసుకున్న‌ సుమంత్‌, కీర్తిరెడ్డి ఏడాదిలోనే విడాకులు తీసుకున్నారు. అయితే, సుమంత్ ఈ విష‌యంపై మాట్లాడ‌టానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డేవారు కాదు.
దీనిపై ఆయ‌న మాట్లాడుతూ.. ఒక‌రినొక‌రు ఇష్డ‌ప‌డే పెళ్లి చేసుకున్నాం. కానీ, పెళ్లి త‌ర్వాత మా అభిప్రాయాలు వేర‌ని అర్థమైంది. అందుకే, ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడిపోయాం. అయితే, కీర్తి ఇప్ప‌టికీ నాకు మంచి ఫ్రెండ్. అప్పుడ‌ప్పుడు ఫోన్ చేసి యోగ‌క్షేమాలు తెలుసుకుంటాను. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి కావ‌డం నాకు సంతోషంగా అనిపించింది. మా తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు క‌న్నుమూసిన త‌ర్వాత ఆమె ప‌రామ‌ర్శ‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆమెను క‌ల‌వ‌లేదు. అదే చివ‌రిసారి అని సుమంత్ తెలిపారు.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘బ్యాడ్మింటన్ డబుల్స్’ని పట్టించుకోరేంటి..?
భారత్లో బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులపై గత కొంతకాలంగా వివక్ష కొనసాగుతోందని సీనియర్ షట్లర్ అశ్విని పొన్నప్ప పెదవి విరిచింది.
TNN | Updated:
Dec 28, 2017, 11:34AM IST
‘బ్యాడ్మింటన్ డబుల్స్’ని పట్టించుకోరేంటి..?
భారత్‌లో బ్యాడ్మింటన్‌ డబుల్స్ క్రీడాకారులపై గత కొంతకాలంగా వివక్ష కొనసాగుతోందని సీనియర్ షట్లర్ అశ్విని పొన్నప్ప పెదవి విరిచింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ సీజన్-3లో ఢిల్లీ డాషర్స్ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న అశ్విని మీడియాతో మాట్లాడింది. గత ఆదివారం ఓ వ్యాపార వేత్తని అశ్విని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డబుల్స్‌ క్రీడాకారులకి సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో యువ క్రీడాకారులు డబుల్స్‌ని ఎంచుకునేందుకు వెనకాడుతున్నారని అశ్విని ఈ సందర్భంగా వివరించింది.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బాహుబలి ఫస్టేం కాదు.. ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాహుబలి కన్నా చాలా ముందే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ సినిమా తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చిందన్న ప్రభాస్.
Samayam Telugu | Updated:
Oct 25, 2019, 12:55PM IST
ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ విజువల్ వండర్ బాహుబలి. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని వెయ్యి కోట్లకు పెంచిన సినిమా బాహుబలి. తాజాగా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో బాహుబలి తొలి భాగాన్ని ప్రదర్శించటంతో మరోసారి బాహుబలి సినిమా వార్తల్లో నిలుస్తోంది.
ఇటీవల జరిగిన ఈ ప్రదర్శనకు చిత్రయూనిట్ అంతా తరళివెళ్లారు. ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రం బాహుబలే కావటం విశేషం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాతీయ స్థాయిలో ఇంత ప్రభావం చూపిన తెలుగు సినిమాలో నటించటం మీకెలా అనిపించింది. అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రభాస్.
| 0business
|
Today Petrol Price: దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు..!
Samayam Telugu| Oct 10, 2019, 06.58 AM IST
దేశీ ఇంధన ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం పెట్రోల్ 5 పైసలు, డీజిల్ ధర 6 పైసలు చొప్పున దిగొచ్చింది. దీంతో హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.78.20కు తగ్గింది. డీజిల్ ధర రూ.72.79కు క్షీణించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి.
అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.77.80కు క్షీణించింది. డీజిల్ ధర కూడా 7 పైసలు క్షీణతతో రూ.72.05కు తగ్గింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.77.43కు క్షీణించింది. డీజిల్ ధర కూడా 6 పైసలు క్షీణతతో రూ.71.71కు తగ్గింది.
Also Read: బ్యాంక్ బంపరాఫర్.. 71 లీటర్ల పెట్రోల్/డీజిల్ ఉచితం!
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 5 పైసలు క్షీణతతో రూ.73.54కు తగ్గింది. డీజిల్ ధర కూడా 6 పైసలు తగ్గుదలతో రూ.66.75కు క్షీణించింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 5 పైసలు క్షీణతతో రూ.79.15కు తగ్గింది. డీజిల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.69.97కు క్షీణించింది.
Also Read: పండుగ ఆఫర్ అదుర్స్: రూ.150 పెట్రోల్ కొట్టిస్తే అదిరిపోయే బహుమతులు!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.53 శాతం తగ్గుదలతో 58.03 డాలర్లకు తగ్గింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.40 శాతం తగ్గుదలతో 52.37కు క్షీణించింది.
| 1entertainment
|
shoaib akhtar reply to virat kohli's praise
కోహ్లికి బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది: అక్తర్
కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పు బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది. అతడో గొప్ప బ్యాట్స్మెన్.
TNN | Updated:
Nov 6, 2017, 04:55PM IST
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్ ఏదైనా ఓ రేంజ్‌లో చెలరేగిపోయే కోహ్లి.. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. బౌలర్ ఎవరైనా దీటుగా ఎదుర్కొనే విరాట్.. ఈ మధ్య పాకిస్థానీ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్‌పై ప్రశంసలు గుప్పించాడు. ‘‘నేనెప్పుడూ అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కోలేదు. అతడు బలంగా విసిరిన బంతి బ్యాట్స్‌మెన్ శరీరాన్ని తాకుతుందేమో అనిపిస్తుంది. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ చాలా ప్రమాదకారి. షోయబ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉండటం ఉత్తమం.’’ అని ప్రపంచంలోని ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన షోయబ్‌ను ఉద్దేశించి కోహ్లి చెప్పాడు.
విరాట్ వ్యాఖ్యల పట్ల అక్తర్ స్పందించాడు. కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పు బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది. అతడో గొప్ప బ్యాట్స్‌మెన్. అతడికి బౌలింగ్ వేయడం కచ్చితంగా గొప్ప పోటీ అని ట్వీట్ చేశాడు.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ధోనీ.. నిన్ను హీరోని చేసిన శ్రీలంకే మళ్లీ..?
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. తన ఫామ్పై విమర్శలు చెలరేగిన ప్రతిసారి బ్యాట్తో సమాధానం చెప్తూ
TNN | Updated:
Aug 19, 2017, 01:31PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని .. తన ఫామ్‌పై విమర్శలు చెలరేగిన ప్రతిసారి బ్యాట్‌తో సమాధానం చెప్తూ ముందుకు వెళ్తున్నాడు. కానీ.. ఒకప్పటితో పోలిస్తే మ్యాచ్‌ని ఫినిష్ చేయడం, వేగంగా పరుగులు రాబట్టడంలో ధోనీ దూకుడు బాగా తగ్గిపోయిందని అతని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. 2016 ఆరంభం నుంచి ధోనీ కేవలం ఐదు సార్లు మాత్రమే 50+ స్కోరు చేయడమే దీనికి నిదర్శనం. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో ధోనీ చేసిన అతి నెమ్మది అర్ధశతకం చర్చనీయాంశంగా మారింది. గత 16 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో అంతటి నెమ్మది హాఫ్ సెంచరీ ఏ బ్యాట్స్‌మెన్ చేయలేదు.
2019 ప్రపంచకప్ నేపథ్యంలో శ్రీలంకతో వన్డే సిరీస్‌కి యువ బ్యాట్స్‌మెన్/ వికెట్ కీపర్‌ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు అవకాశం ఇస్తారేమోనని అంతా భావించారు. కానీ.. యువరాజ్‌పై వేటు వేసిన సెలక్టర్లు ధోనీపై నమ్మకం ఉంచారు. దీంతో సర్వత్రా విమర్శలు చెలరేగాయి. అయితే.. ధోనీ వర్జినల్ ఆటని ఈ పర్యటనలో మీరే చూస్తారని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తమ ఎంపికపై ధీమా వ్యక్తం చేశారు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై అజేయ ఇన్నింగ్స్‌తో 28 ఏళ్ల తర్వాత భారత్‌కి ప్రపంచకప్ అందించి హీరోగా మారిన ధోనీ.. మళ్లీ అదే జట్టుపై తన స్టామినాని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవైపు జట్టులో పోటీ.. మరోవైపు విమర్శకుల వాగ్భాణాలకి సమాధానం చెప్పాలంటే ధోనీ ఈ పర్యటనలో బ్యాట్‌ ఝళిపించాల్సిందే. ఆదివారం మధ్యాహ్నం 2.30గంటలకి తొలి వన్డే ప్రారంభంకానుంది.
| 2sports
|
జర్మనీకి ఇలా హంగేరీ షాక్.. 1950వ దశకంలో సాకర్ రారాజు హంగేరీ
Highlights
జర్మనీకి ఇలా హంగేరీ షాక్
హైదరాబాద్: ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే 1954 సాకర్ కప్ టోర్నీలో వెస్ట్ జర్మనీ జట్టును దిగ్భ్రాంతికి గురి చేసిన హంగేరియా జట్టు ఒక రికార్డు. అంతే కాదు అత్యంత హింసాత్మకంగా సాగిన మ్యాచ్ల్లో ఒకటిగా రికార్డు నమోదు చేసింది. తొలి ఎనిమిది నిమిషాల్లోనే వెస్ట్ జర్మనీ చకచకా రెండు గోల్స్ సాధించి పై పట్టు సాధించింది. కానీ అనూహ్యంగా కోలుకున్న హంగేరియా మూడు గోల్స్ సాధించి మ్యాచ్ గెలుచుకున్నది.
టోటల్ ఫుట్బాల్ ఆటకు బ్రాండ్ హంగేరియా
హంగేరియా జట్టు 1950 వ దశకంలో ‘టోటల్ ఫుట్బాల్’ ఆటకు బ్రాండ్గా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. తనకంటూ సొంత బ్రాండ్ నెలకొల్పింది. వరుసగా 27 మ్యాచ్ల్లో అజేయంగా నిలిచి 1954 టోర్నమెంటులో పాల్గొనేందుకు వచ్చిన మాజికల్ మాగ్యార్స్ జట్టు వ్యతిరేకంగా నిలబడి.. డబ్బు ఖర్చు చేసేందుకు ఏ ఒక్కరికీ ధైర్యం చాలలేదంటే అతిశయోక్తి కాదు.
నాలుగు మ్యాచ్ల్లోనే 25 గోల్స్తో ఇలా రికార్డు
నాడు ప్రముఖ ప్లేయర్లు ఫెరెంక్ పుష్కాస్, సాండూర్ కోక్సిస్, నాండోర్ హెడేగ్కుటి, జోసెఫ్ బోజిక్, గ్యూలా గ్రోసిస్స్లతో కూడిన వెస్ట్ జర్మనీ 1954 టోర్నమెంట్లో కేవలం నాలుగు మ్యాచ్ల్లోనే 25 గోల్స్ సాధించి ఫైనల్స్లో అడుగు పెట్టింది వెస్ట్ జర్మనీ. సెమీ ఫ్రొపెషనల్స్తోపాటు కోచ్ సెప్ప్ హర్బర్గర్ సాయంతో గ్రూపు దశలో హంగేరియా జట్టుపై 8 - 3 తేడాతో విజయం సాధించింది. కానీ వాంక్డార్ఫ్ స్టేడియం లోపల 60 వేల మంది వీక్షిస్తుండగా, మరోవైపు జోరున వర్షం కురుస్తుండగా జరిగిన ఫైనల్స్ టోర్నీలో హంగేరియా చేతిలో షాక్కు గురైంది. దీన్ని ‘మిరకిల్ ఆఫ్ బెర్న్’ అని అభివర్ణిస్తుంటారు.
బ్రెజిల్తో క్వార్టర్ మ్యాచ్ హింసాత్మకం
ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ టోర్నీలో బ్రెజిల్ జట్టుపై జరిగిన మ్యాచ్ అత్యంత హింసాత్మక మ్యాచ్గా నిలిచింది. హంగేరియా వివాదాస్పదమైన పెనాల్టీ అవార్డుతో గోల్ సాధించి విజయం సాధించింది. కానీ రెండు జట్ల డ్రస్సింగ్ రూమ్ల్లో భారీగా ఘర్షణలు జరిగాయి. ఈ మ్యాచ్లో బ్రెజిల్ జట్టుపై హంగేరియా 4 - 2 స్కోర్ తేడాతో గెలుపొందింది. అంతేకాదు 16 జట్ల వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టెలివిజన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన చరిత్ర 1954 ప్రపంచ కప్ టోర్నీకే దక్కింది.
Last Updated 30, May 2018, 2:53 PM IST
| 2sports
|
TAXES
సూట్కేస్ కంపెనీలపై ‘క్రమశిక్షణ వేటు!”
న్యూఢిల్లీ,జూలై 24: :దేశవ్యాప్తంగా కార్పొ రేట్, పారిశ్రామికరంగంలో మొత్తం ఒక కోటి 62 లక్షల సూట్కేస్ కంపెనీలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడంలేదని తేలింది. వీటి ని వెంటనే రిజిస్ట్రేషన్ రద్దుచేసామని అంతేకాకుండా వెంటనే ఈ సూట్కేస్ కంపెనీలపై తక్షణ క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కంపెనీల చట్టంపరిధిలో షెల్ కంపెనీ అనే పదానికి నిర్వచనం ఏదీ లేదని, ఇలాంటి సంస్థలు భారీ ఎత్తున పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు తేలిం దని ఆర్థిక మంత్రి వెల్లడించారు. కంపెనీల రిజి స్ట్రార్లు మొత్తం 1,62,618 కంపెనీలను రిజిస్ట్రేషన ్నుంచి తొలగించారని అన్నారు. కంపెనీల చట్టం సెక్షన్ 248ని అనుసరించి తక్షణ చర్యలు చేపట్టా మని అన్నారు. నల్లధనం, హావాలా లావాదేవీలకు ఈ సూట్కేస్ కంపెనీలు లేదా షెల్కంపెనీలు ఎక్కు వ కారణం అవుతున్నట్లు పార్లమెంటులో అడిగిన ప్రశ్నలపై జైట్లీ స్పందించారు. సెక్షన్ 248ని అను సరించి రిజిస్ట్రార్లకు కంపెనీలను రిజిష్టరు నుంచి తొలగించే అధికారాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం తొలగించిన 1,62,618కంపెనీల్లో ముంబై రిజిస్ట్రార్ నుంచే 33వేలవరకూ ఉన్నాయని తేలింది. ఇతరత్రా ఢిల్లీ రిజిస్ట్రార్పరంగా 22,863 కంపెనీలను రద్దుచేస్తే హైదరాబాద్ ఆర్ఒసి 20,588 కంపెనీల రిజిస్ట్రేషన్ను రద్దుచేసి నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా పారిశ్రామికీకరణ ఎక్కువ జరుగుతున్న రాష్ట్రాల్లోనే సూట్కేస్ కంపె నీలు ఎక్కువఉన్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖగుర్తించింది. ప్రస్తుతంనాలుగు రాష్ట్రా ల్లో వీటిజోరు ఎక్కువగాఉంది. ఈషెల్ కంపెనీల ద్వారా ఇప్పటివరకూచూపించిన ఆదాయ వనరుల పై కూడా ఐటిశాఖ దృష్టిపెట్టిందని, వీటి మూల మార్గాలను కట్టడిచేసే కార్యాచరణ అమలవుతున్న దని ఆర్థికమంత్రి వివరించారు. కంపెనీల డైరెక్టర్ల పై తక్షణ క్రమశిక్షణచర్యలు తీసుకుంటున్నట్లు వివ రించారు. చట్టపరిధిలో ఎలాంటి ఉల్లంఘనలు ఉన్నా ఉపేక్షించేదిలేదని మంత్రి వెల్లడించారు.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ind vs Pak: పాక్తో ఇక ద్వైపాక్షిక సిరీస్ కష్టమే..! :గంగూలీ
ప్రపంచకప్లో పాక్తో మ్యాచ్పై ప్రజల మనోభావాల్ని నేను అర్థం చేసుకోగలను. పాక్ దుశ్చర్యకి భారత్ ధీటుగా బదులివ్వాలని వారు కోరుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా అదే.. కానీ..? -గంగూలీ
Samayam Telugu | Updated:
Feb 21, 2019, 11:16AM IST
Ind vs Pak: పాక్తో ఇక ద్వైపాక్షిక సిరీస్ కష్టమే..! :గంగూలీ
హైలైట్స్
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ మొదలు
జూన్ 16న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్
ఆ మ్యాచ్ను బహిష్కరించాలని టీమిండియాకి పెరుగుతున్న డిమాండ్స్
దేశ ప్రజల మనోభవాల్ని అర్థం చేసుకోగలనని గంగూలీ వ్యాఖ్య
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రపంచకప్లో భాగంగా జూన్ 16న జరగాల్సిన మ్యాచ్ గురించి ఇప్పుడు విస్తృత చర్చ నడుస్తోంది. పాకిస్థాన్ దుశ్చర్య కారణంగా 40 మంది జవాన్లు అసువులుబాసినా.. పాక్తో క్రికెట్ ఆడటం అవసరమా..? ఆ మ్యాచ్ను బహిష్కరించి ప్రపంచకప్ వేదికగా జవాన్లకి నివాళి అర్పించాలని పెద్ద ఎత్తున అభిమానులు కోరుతున్నారు. ఒకవేళ ఆ మ్యాచ్ను భారత్ బహిష్కరిస్తే.. అప్పుడు పాక్ విజేతగా నిలిచి రెండు పాయింట్లు చేజిక్కించుకుంటుంది. దీంతో.. తాము ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చెప్పుకొస్తోంది. పాక్తో మ్యాచ్ను భారత్ ఆడకపోతే పాయింట్లతో పాటు.. కనీసం రూ.100కోట్లుపైనే బ్రాడ్కాస్టర్స్కి నష్టపరిహారం చెల్లించాల్సి రావొచ్చు.
| 2sports
|
Dec 30,2016
రూ.1,200 కోట్ల ఎఫ్డీఐలకు అనుమతి
న్యూఢిల్లీ: 'విదేశీ పెట్టుబడుల ప్రోత్సహక బోర్డు' ఆరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనలకు గురువారం ఆమోదం తెలిపింది. దీంట్లో సనోఫి సింథ్లాబో ఇండియా, స్టార్ డెన్ మీడియా సర్వీసెస్, ఐడీయా సెల్యూలర్ ఇన్ఫ్రాస్టక్చర్ సర్వీసెస్, ఎన్విసాజింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.1,200 కోట్లు. కాగా మొత్తం 17 ఎఫ్డీఐలకు కానీ ఆరు ఎఫ్డీఐలకు ఆమోదం లభించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. బోహ్రింగర్ ఇంగేల్హీం ఇండియా ప్రయివేటు లిమిటెడ్, ఏ మెనారీని ఇండియా ప్రయివేటు లిమిటెడ్, రిసిఫార్మా పార్టిస్పేషన్ సంస్థలకు పచ్చజెండా ఊపినట్టు ఆ వర్గాలు తెలపాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మూడింటిని తిరస్కరించారు. దీంట్లో ఏఎంపీ సోలార్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ తిరస్కరణకు గురైనట్టు వివరించాయి. కాగా మరో ఆరింటిపై మరిన్ని సంప్రదింపులు జరపలని వాయిదా వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వాయిదా వేసిన వాటిలో క్రెస్టా ప్రిమీడియా ప్రయివేటు లిమిటెడ్, యు బ్రాండ్బ్యాండ్ ఇండియా, సైంటిఫిక్ పబ్లిషింగ్ హౌస్ ప్రయివేటు లిమిటెడ్ ఉన్నాయని పేర్కొన్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నిజామాబాద్: గురువు మృతితో ప్రభుదేవా కంటతడి
ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా గురువు బాడిగ ధర్మరాజు (97) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిజామాబాద్ జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపులో అనారోగ్యంతో మృతిచెందారు.
TNN | Updated:
Dec 2, 2017, 07:02PM IST
ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా గురువు బాడిగ ధర్మరాజు (97) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిజామాబాద్ జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం అంకోల్‌ క్యాంపులో అనారోగ్యంతో మృతిచెందారు. గురువు మరణవార్త తెలుసుకున్న ప్రభుదేవ అక్కడికి చేరుకొని ధర్మరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించాడు. విగతజీవిగా మారిన గురువును చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సినీ రంగానికి చెందిన కృపావతిని ధర్మరాజు వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సంతానం లేదు.
క్లాసికల్‌ డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధర్మరాజు చాలా మంది సినీ స్టార్లకు శిక్షణ ఇచ్చారు. ఆయన దగ్గర ప్రభుదేవా భరతనాట్యంలో శిక్షణ పొందాడు. గురువులకే గురువైన ధర్మరాజు వద్ద అనేక మంది శిక్షణ తీసుకున్నారు. ధర్మరాజు వద్ద శిక్షణ తీసుకున్న హాంకాంగ్‌, హైదరాబాద్‌కు చెందిన పలువురు శిష్యులు మరెంతోమందికి నృత్యం నేర్పుతున్నారు.
| 0business
|
News Room 365 WATCH LIVE TV
70 ఖాతాల్లోనే... రూ. 3.80 లక్షల కోట్ల ఎన్పీఏలు
దాదాపు 70 ఖాతాలు సెప్టెంబర్ చివరిలోగా రిజర్వు బ్యాంకు సవరించిన ఫ్రైమ్వర్కులోకి రావాల్సిందేనని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదికలో హెచ్చరించింది.
Samayam Telugu | Updated:
Jul 7, 2018, 12:30PM IST
దేశంలో మొండి బకాయిల సమస్య ఇప్పట్లో తీరేలా లేదు. ప్రతి త్రైమాసికంలో బ్యాంకుల్లో మొండి బకాయిల జాబితా చాంతాడంత పెరిగిపోతోంది. బడా కార్పొరేట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయల రుణం తీసుకొని ఎగ్గొట్టడం రివాజుగా మారిపోయింది. తాజాగా రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తయారు చేసిన గణాంకాలను చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. కేవలం 70 ఖాతాలే రూ.3.80 లక్షల కోట్ల వరకు ఎన్పీఏలుగా మారిపో యాయి. ఈ ఖాతాలు సెప్టెంబర్ చివరిలోగా రిజర్వు బ్యాంకు సవరించిన ఫ్రైమ్వర్కులోకి రావాల్సిందేనని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదికలో హెచ్చరించింది.
ఈ ఖాతాలన్నీ ప్రధానంగా విద్యుత్, ఇంజినీ రింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) టెలికాం రం గాలకు చెందినవి. ఇక్రా నివేదికలో ప్రకారం చూస్తే ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల నష్టం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పన్ను చెల్లించడానికి ముందు నష్టం రూ.41,000 నుంచి రూ.1,01,600 కోట్ల వరకు ఉంటుందని ఇక్రా ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్ చీఫ్ అనిల్ గుప్తా చెప్పారు.
మొత్తంలో 70 అతి పెద్ద ఖాతాల్లో 34 ఖాతాలు ఎలక్ట్రిసిటీ రంగానికి చెందినవి. ఇవన్నీ దాదాపు 41,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినవి. ఈ విద్యుత్ కంపెనీల అప్పులు రూ.2 లక్షల కోట్ల వరకు ఉంటుందని, ఈ ఖాతాలన్నీ ప్రస్తుతం రిజర్వు బ్యాంకు సవరించిన ఫ్రేమ్వర్కుకు కిందికి రావాల్సి ఉంటుందని తెలిపింది. బ్యాంకులు ఇచ్చిన రూ.3.8 లక్షల కోట్ల రుణాల్లో 92 శాతం రుణాలను బ్యాంకులు ఇప్పటికే ఎన్పీఏ లేదా మొండి బకాయిల ఖాతాల కిందకు తీసుకొచ్చాయి. ప్రస్తుతం బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో వసూళ్లు మాత్రం పరిమితంగా ఉన్నాయని గుప్తా తెలిపారు.
గతంలో ఆర్బీఐ ఫ్రేమ్వర్కు కిందికి వచ్చిన వాటిలో ఉక్కు రంగం నుంచి బకాయిలు వసూల య్యాయి. దీనికి ఉదాహరణగా భూషణ్ స్టీల్ను టాటా స్టీల్ కొనుగోలు చేసి.. భూషణ్ స్టీల్కు చెందిన బ్యాంకుల బకాయిలను టాటాస్టీల్ చెల్లించిన విషయం తెలిసిందే. విద్యుత్ రంగానికి వస్తే అతి పెద్ద 70 ఖాతాలు పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిపోయింది. ఈ రుణాల నుంచి కొంత తోసేసి నికరంగా ఎంతకు విక్రయించాలో ఆర్బీఐ నిర్ణయిస్తూ తీర్మానిస్తుంది. బ్యాడ్ లోన్లకు సంబంధించి ఈ ఖాతాలపై బ్యాంకులు 60 నుంచి 65 శాతం వరకు కేటాయింపులు చేయాల్సి వుంటుంది. సాధారణంగా అయితే మూడు శాతం వరకు కేటాయింపులు చేస్తే చాలు. పైన తెలిపిన ఖాతాలకు కేటాయింపులు చేయాలంటేనే రూ.1.4 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు ఖాతాల్లోని సొమ్ము అవసరం పడుతుంది. వీటితో పాటు అదనంగా బాండ్ పోర్టుపోలియో నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్స రం ముగిసే నాటికి ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాం కుల నష్టాలు భారీగా పెరిగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఎన్పీఏ ఖాతాలపై ఇక్రా తాజా నివేదిక
ప్రస్తుతం బ్యాంకులు పేరుకుపోతున్న మొండి బకాయిలను ఆర్బీఐ ప్రేం వర్కులోకి తీసుకువచ్చి వాటిని ఎన్సీఎల్టికి సిఫారసు చేయడం.. అటు తర్వాత ఆయా ఆస్తులను విక్రయించడం జరుగుతోంది. ఈ ప్రక్రియ అంతా సవ్యంగా జరిగితే పైన తెలిపిన ఖాతాలపై మార్చి 2019 నాటికి మొత్తం బ్యాంకింగ్ రంగ ఎన్పీఏ 10 శాతానికి, నికర ఎన్పీఏ 4.3 శాతానికి దిగివస్తుంది. లేదంటే ఈ ఖతాలకు సంబంధించిన వాటితో కలుపుకుని బ్యాంకుల మొత్తం ఎన్పీఏలు 12.2 శాతానికి, నికర ఎన్పీఏ 5.6 శాతానికి ఎగబాకుతాయి.
మార్చి 2018 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం ఎన్పీఏ, నికర ఎన్పీఏలు వరుసగా 11.6 శాతం, 6.2 శాతంగా నమోదయ్యాయి. ఇదే నివేదికలో ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకుల కేటాయింపులు గరిష్ఠ, నికర కేటాయింపులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.22,500 కోట్ల నుంచి రూ.33,300 కోట్లకు దిగివస్తాయని, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.50,300 కోట్ల వరకు కేటాయింపులు చేశాయని ఇక్రా నివేదించింది.
ఇది ఇలాగే కొనసాగితే బ్యాంకుల నష్టాలు ఇప్పుడున్న స్థాయి నుంచి పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇక్రా జోస్యం చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.419 నుంచి రూ.1016 కోట్ల మధ్య బ్యాంకుల నష్టాలు ఉండొచ్చని అంచనా వేసింది. దీని కారణంగా ఒకవేళ అంచనా మేరకు గరిష్ట నష్టం వచ్చినట్లయితే ప్రభుత్వం బ్యాంకులకు కేటాయించే మూలధనం విలువ పెరగొచ్చని ఇక్రా నివేదించింది.
| 1entertainment
|
శ్రీదేవితో రోజూ ఫోన్ లో మాట్లాడుతా.. చావుకు కారణమదే-పింకిరెడ్డి
Highlights
శ్రీదేవికి చిన్ననాటి నుంచి స్నేహితురాలైన పింకిరెడ్డి
హైదరాబాద్ వస్తే సుబ్బరామిరెడ్డి ఇంటికి వెళ్లే శ్రీదేవి
శ్రీదేవితో తరచూ(రోజూ) ఫోన్ మాట్లాడే పింకిరెడ్డి..
దుబయి వెళ్లే ముందు మాటల్ని బట్టి శ్రీదేవి చావుపై పింకి విశ్లేషణ
శ్రీదేవి ఆకస్మిక మృతితో సినీ ప్రేక్షకలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, బాలీవుడ్ సహనటులు విషాద సంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి బాల్య స్నేహితురాలు, ప్రముఖ నిర్మాత టి సుబ్బిరామిరెడ్డి కూతురు పింకిరెడ్డి సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన అంశాలు బయటపెట్టింది.
మొహిత్ మార్వా వివాహానికి వెళ్లే ముందు తాను శ్రీదేవితో కడసారి మాట్లాడాను. తనకు ఆనారోగ్యంగా ఉంది. మొహిత్ పెళ్లికి వెల్లడం ఇష్టం లేదు. నేను యాంటీ బయోటిక్స్ వాడుతున్నాను అని నాకు చెప్పింది. కుటుంబ కారణాల వల్ల శ్రీదేవి తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి హాజరుకావాల్సి వచ్చింది. కానీ దుబాయ్కి వెళ్లిన శ్రీదేవి శాశ్వతంగా దూరమవుతుందని ఊహించలేదు అని పింకిరెడ్డి ఉద్వేగానికి లోనైంది.
నేను 8 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు నాకు శ్రీదేవితో పరిచయం జరిగింది. అప్పటి నుంచి ప్రాణస్నేహితులుగా మారాం. ఇప్పుడు నా సోదరి లాంటి శ్రీదేవిని శాశ్వతంగా కోల్పోయాను అని పింకిరెడ్డి చెప్పింది. శ్రీదేవి వ్యక్తిగత జీవితంలోనే కాకుండా సినీ జీవితంలో కూడా పింకిరెడ్డి ప్రధాన పాత్ర పోషించింది. అత్యంత ప్రజాదరణను మూటగట్టుకొన్న చాందినీ చిత్రానికి నా తండ్రి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎంతో సంబంధాలున్న శ్రీదేవి మరణం షాక్ గురిచేసింది. చాలా కుంగిపోయాను అని పింకిరెడ్డి వెల్లడించింది.
ఇక మిస్టరీగా మారిన ప్రశ్నకు సంబంధించి అనారోగ్యంతోనే శ్రీదేవి దుబాయ్కి వెళ్లింది. దుబాయ్ వెళ్లే ముందు రోజు వరకు ప్రతీరోజు శ్రీదేవితో మాట్లాడాను. కొద్దిరోజులుగా శ్రీదేవి జ్వరంతో బాధపడుతున్నది. అప్పుడు యాంటి బయోటిక్స్ తీసుకొంటున్నారు. చాలా నీరసంగా ఉన్నట్టు కనిపించింది. కానీ పెళ్లికి వెళ్లక తప్పడం లేదు అని చెప్పిందని పింకిరెడ్డి తెలిపింది.
సినీరంగంలో మహోన్నత కీర్తి సాధించిన శ్రీదేవి మరణంపై కొందరు జోక్గా మార్చడంపై పింకిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మరణంపై సందేశాలు వ్యక్తం చేస్తున్న తీరుపై కోపాన్ని తెప్పించింది అని ఆమె అన్నారు. శ్రీదేవి బరువు తగ్గడానికి లైపోసెక్షన్ చెయించుకొన్నదనే వార్తలో వాస్తవం లేదు. ప్రజలు ఎందుకు ఇలా మాట్లాడుకొంటారో అర్థం కాదు. ఆమె సాధించిన మంచి గురించి ఎందుకు మాట్లాడుకోరు. శ్రీదేవి భౌతికంగా లేనప్పుడు ఆమె గురించి చెడుగా మాట్లాడుకోవడం సరికాదు అని చెప్పింది.
శ్రీదేవి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయనే విషయాన్ని కూడా పింకిరెడ్డి తోసిపుచ్చింది. శ్రీదేవిని బోని బాగా చూసుకొన్నారు. వారిద్దరిది అన్యోన్య జీవితం. వారి మధ్య కలతలు, కలహాలు ఉన్నట్టు కూడా నా దృష్టికి రాలేదు. ఒకరంటే మరొకరికి చెప్పలేనంత ప్రేమ ఉంది అని పింకిరెడ్డి చెప్పింది. ఇటీవల నా కూతురు శ్రీమంతం కోసం శ్రీదేవి హైదరాబాద్కు వచ్చింది. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నా కోసం కేవలం రెండు గంటలు ఉండి వెళ్లింది. ఆమెను కలవడం, చూడటం అదే చివరిసారి అని పింకిరెడ్డి చెప్పింది.
Last Updated 25, Mar 2018, 11:46 PM IST
| 0business
|
Suresh 106 Views
సంస్థాగత వృద్ధిపై గోద్రేజ్ గ్రూప్ దృష్టి
న్యూఢిల్లీ, ఆగస్టు 21: గోద్రేజ్గ్రూప్ సంస్థాగతంగా వృద్ధిసాధనపై దృష్టిపెట్టింది. ఇందుకోసం అవసరమైన సంస్థల కొనుగోళ్లు విలీనాకు ప్రాధాన్యతనిస్తోంది. కొత్త బిజినెస్లను గత ఏడాదినుంచే కొనుగోళ్లు ప్రారం భించినట్లు ఛైర్మన్ ఆదిగోద్రేజ్ వెల్లడించారు. వినియోగరంగం, వ్యవసాయాధారిత రంగ పరిశ్రమలను కొనుగోలుచేస్తున్నట్లు వివరించారు. వచ్చే కొన్నేళ్లలోనే తాము మరింతగా విస్తరిస్తామన్నారు. విశ్వవ్యాప్తం గా ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని, సాధారణ స్థాయికంటే తక్కువ వనరులకే అందు బాటులోనికి వచ్చే వ్యాపారాలను కొనుగోలుచేస్తున్నట్లు వివరించారు. ఈగ్రూప్ బిజినెస్లను సాధిం చేందుకు ఎంతో కృషిచేస్తోందని, ఆసియా ఆఫ్రికా, దక్షిణ అమెరాకా ప్రాంతాల్లో ఎక్కువ కొనుగోళ్లు చేస్తున్నట్లు తేలింది. వినియోగరంగ విభాగంపై ఎక్కువ దృష్టిపెట్టింది. వ్యక్తిగత సంరక్షణ, గృహోపకరణాల ఉత్పత్తుల విభా గంలో ఎక్కువ కొనుగోళ్లున్నాయి. ఇందుకు నిధుల సమస్యలులేవని, అవసరమైతే నిధు లను సమీకరించుకుంటామని ఆయన వివరిం చారు. బిజినెస్ వృద్ధిసాధిస్తున్నదని అయితే గడచిన రెండేళ్లుగా మందగమనంతో ఉందన్నా రు. వచ్చే పదేళ్లలో ప్రస్తుతం ఉన్న వృద్ధిశాతా నికి పదిరెట్లు వృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండేళ్లుగా వృద్ధి మంద గించడంతో వెనుకబడిన మాట వాస్తవమేనన్నారు. కంపెనీ సంఘటిత వృద్ధి సాలీనా 26శాతంగా ఉంది. వినియోగరంగ డిమాండ్ జిఎస్టి పన్నులు అమలయితే మరింతగాపెరుగుతుందని కొన్ని రంగా ల్లో ఉత్పత్తుల ధరలు తగ్గడమే ఇందుకుకీలకమని ఆయన అన్నారు. జిఎస్టి రంగపరంగా భారత్ ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధిని సాధిస్తుందన్నారు.ముంబై కేంద్రంగా పనిచేస్తున్న గోద్రేజ్గ్రూఫ్ రియల్ ఎస్టేట్, వినియోగరంగ ఉత్పత్తులు, పారిశ్రామిక ఇంజినీరింగ్, లప్లయెన్సెస్, ఫర్నిచర్, సెక్యూరిటీ, వ్యవసాయ రంగ ఉత్పత్తులరంగాల్లో వ్తిరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1.1 బిలియన్ల మందికి గోద్రెజ్ ఉత్పత్తులు చేరుతున్నాయి. సుమారు 750 మిలియన్లవరకూ భారత్లో గోద్రేజ్ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి.
=====================
| 1entertainment
|
చంద్రబాబులా.. రానా మారారిలా..!
మేకింగ్ వీడియోను విడుదల చేసిన చిత్రబృందం
హైదరాబాద్: ‘యన్టిఆర్’ బయోపిక్లోని రెండో భాగమైన ‘మహానాయకుడు’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన మేకింగ్ వీడియోలను, ప్రోమోలను విడుదల చేస్తూ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. ఇటీవల సినిమాకు సంబంధించిన ఎమోషనల్ ప్రోమో పేరిట ఓ వీడియోను విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా సినిమాలో రానా పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా.. ఎన్టీఆర్ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించారు. సినిమా కోసం రానా.. చంద్రబాబులా ఎలా మారారు? ఎలాంటి మేకప్ వేశారు? తదితర విషయాలను ఈ వీడియోలో చూపించారు. రానా.. చంద్రబాబులా మారడానికి ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్బాబు కూడా మేకప్ విషయంలో సాయం చేశారు. చంద్రబాబు మేనరిజాన్ని రానా అనుకరిస్తున్నట్లు కనిపించారు. ‘మహానాయకుడు’లో రానా పాత్రే కీలకమని చిత్రబృందం మొదటి నుంచి చెప్తూ వస్తోంది.
| 0business
|
Shane warne
మాట నిలబెట్టుకున్న షేన్ వార్న్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఇష్టంలేని పని ఒకటి చేశాడు. జీవితంలో ఎప్పుడూ వేసుకోవద్దనుకున్న ఇంగ్లాండ్ జెర్సీని వార్న్ వేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కట్టిన పందెంలో ఓడిపోయినందుకు ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఇంగ్లాండ్ జెర్సీని వేసుకోవాల్సి వచ్చింది. తాను ఇంగ్లాండ్ జెర్సీ వేసుకున్న ఫోటోను షేన్ వార్్న తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. తాను ఇంగ్లండ్ జెర్సీ వేసుకున్న ఫోటోను వార్న్ ట్వీట్ చేశాడు.
దురదృష్టవశాత్తు తాను చేయాల్సిన పని ఇంకా ఉందని ఆట్వీట్లో వార్న్ రాశాడు. ఐసిసి కూడా వార్న్ ట్వీట్ను రీట్వీట్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సందర్భంగా షేన్ వార్న్ సౌరభ్ గంగూలీతో ఓ ఛాలెంజ్ చేశాడు. జూన్ 10న ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఖచ్చితంగా గెలుస్తుందంటూ గొప్పలకు పోయిన షేన్ వార్న్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీతో పందెం కాశాడు. ఇంతకీ ఆపందెం ఏమిటంటే ఆమ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిస్తే ఆసీస్ జెర్సీని గంగూలీ ధరించాలి.
అదే సమయంలో ఇంగ్లాండ్ గెలిస్తే ఆజట్టు జెర్సీని వార్న్ ధరిస్తాడన్న మాట. తాను కాసిన పందెంలో ఓడిపోయిన వార్న్ ఇంగ్లాండ్ జెర్సీని వేసుకున్నాడు. ఇప్పుడు గంగూలీని డిన్నర్కు కూడా తీసుకెళ్లాల్సి ఉంది. ఒక వేళ గంగూలీ ఓడిపోయి ఉంటే అతడు రోజంతా ఆస్ట్రేలియా జెర్సీ వేసుకోవాల్సి వచ్చేది.
| 2sports
|
Vaani Pushpa 79 Views FIR file , lakshmi vilas bank , SHARES DOWN
lakshmi vilas bank
ముంబై: రెలిగేర్ ఫిన్వెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి బ్యాంకు అవకతవకలకు పాల్పడిన అంశంపై ఇఒడబ్ల్యూకు చెందిన ఢిల్లీ పోలీసులు లక్ష్మీ విలాస్ బ్యాంకుకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ను నమోదు చేసినట్లు తెలియడంతో ఈ సంస్థ షేరు డీలాపడింది. ప్రస్తుతం ఎన్ఎస్ఇలో 4.6శాతం క్షీణించి రూ.37వద్ద ట్రేడవుతోంది. రెలిగేర్ ఫిన్వెస్ట్ ఫిర్యాదు మేరకు న్యూఢిల్లీ కన్నాట్ప్లేస్లోని లక్ష్మీ విలాస్ బ్యాంకు డైరెక్టర్తోపాటు, ఇతరులపై ఇఒడబ్ల్యూ క్రిమినల్, చీటింగ్ తదితర కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా థామస్ కుక్ ఇండియా పిఎల్సి దివాళా తీసిన నేపథ్యంలో దేశీయ ట్రావెల్, లీజర్ సర్వీసుల కంపెనీ థామస్ కుక్ రేటింగ్ను యథాతథంగా ఉంచుతున్నట్లు క్రిసిల్ తెలియచేసింది. బ్రిటిష్ సంస్థతో దేశీయ కంపెనీకి ఎలాంటి సంబంధంలేకపోవడం దీనికి కారణమని క్రిసిల్ వెల్లడించింది. వాస్తవానికి 2012 ఆగస్టులో ఫెయిర్ఫాక్స్ హోల్డింగ్స్ థామస్ కుక్ ఇండియాను కైవలం చేసుకుంది. అప్పటినుంచీ ఈ సంస్థ థామస్కుక్తో సంబంధాలు లేకుండా విడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఫెయిర్ఫాక్స్ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఇలో 2.5శాతం పెరిగి రూ.144వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.148వరకూ దూసుకెళ్లింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/
| 1entertainment
|
Hyderabad, First Published 1, Nov 2018, 12:40 PM IST
Highlights
తీవ్రంగా గాయపడిన అతనిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రాక్టీస్ మ్యాచ్ లో శ్రీలంక క్రికెటర్ ఒకరు తీవ్రగాయాలపాలయ్యారు. పాతుమ్ నిస్సాంకా తలకు బంతి తగిలి తీవ్ర గాయమైంది. బుధవారం లంక బోర్డ్ లెవన్తో ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన అతనిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇంగ్లండ్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ కొట్టిన ఓ బలమైన షాట్.. షార్ట్లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న నిస్సాంకా తలకు గట్టిగా తాకడంతో అతడు కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం నిస్సాంకా ఆరోగ్యం నిలకడగా ఉంది. కాగా, నిస్సాన్ హెల్మెట్కు తగిలిన బంతి కాస్తా లెగ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న ఏంజెలో మాథ్యూస్ చేతిలో పడింది. ఫలితంగా బట్లర్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Last Updated 1, Nov 2018, 12:40 PM IST
| 2sports
|
భారతీయురాలిని పెళ్లాడిన నాలుగో పాక్ క్రికెటర్ హసన్ అలీ
Hasan Ali, Pakistan cricketer, wedding
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భారతీయ యువతి షామియా అర్జూను పెళ్లాడాడు. దుబాయ్ లో నిన్న వీరి వివాహం జరిగింది. తమ వివాహం గురించి 25 ఏళ్ల హసన్ అలీ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన బ్యాచిలర్ జీవితానికి ఇదే చివరి రాత్రి అని ట్వీట్ చేశాడు. ఎడారి మధ్యలో నిర్వహించిన మెహిందీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కూడా అప్ లోడ్ చేశాడు. మరోవైపు, హసన్ అలీకి ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ‘కంగ్రాట్ హసన్ అలీ. మీరిద్దరూ జీవిత కాలం సంతోషంగా, ప్రేమాభిమానాలతో ఉండాలి.’ అని ట్వీట్ చేసింది. తన వివాహానికి ఇండియన్ క్రికెటర్లను కూడా హసన్ అలీ ఆహ్వానించాడు. తన పెళ్లికి ఇండియన్ క్రికెటర్లు కూడా వస్తే తనకు మరింత సంతోషంగా ఉంటుందని తెలిపాడు. హసన్ అలీ భార్య షామియా హర్యానాకు చెందిన యువతి. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లో ఆమె ఫ్లైట్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. ఆమె కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/business/
| 2sports
|
JEWELLERY
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
ముంబై, మే 4: వరుసగా మూడోరోజు బంగారం ధర తగ్గుముఖం పట్టింది. బుధవారం స్వచ్ఛమైన పసిడి ధర రూ.200తగ్గి పదిగ్రాముల బంగారం ధర రూ.29,150 కి చేరింది. స్థానిక వ్యాపారుల నుండి బంగారం కొను గోళ్లు మందగించడంతో ధర తగ్గముఖం పట్టినట్లు బులి యన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. బంగారం బాట లోనే వెండి పయనించింది. రూ.500 తగ్గడంతో వెండి ధర 40,000 దిగువకు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుండి కొనుగోళ్లు తగ్గడంతో ధరతగ్గింది. దీంతో కిలో వెండిధర రూ.39500కి చేరింది. అంతర్జాతీయంగా పసిడిధర 0.26శాతం తగ్గడంతో ఔన్సుబంగారం ధర1,253 డాలర్లు పలుకుతోంది.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
విశాఖలో చెమటోడ్చిన టీమిండియా
శ్రీలంకతో విశాఖపట్నం వేదికగా ఆదివారం జరగనున్న చివరి వన్డే కోసం భారత్ జట్టు సిద్ధమైంది. ధర్మశాల వన్డే ఘోర
TNN | Updated:
Dec 16, 2017, 07:04PM IST
విశాఖలో చెమటోడ్చిన టీమిండియా
శ్రీలంకతో విశాఖపట్నం వేదికగా ఆదివారం జరగనున్న చివరి వన్డే కోసం భారత్ జట్టు సిద్ధమైంది. ధర్మశాల వన్డే ఘోర పరాభవం నుంచి వేగంగా కోలుకుని.. మొహాలిలో అద్భుత విజయం సాధించిన భారత్.. ఈ చివరి వన్డేలోనూ అదే జోరుని కొనసాగించి సిరీస్‌ చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు 0-1తో ఇటీవల టెస్టు సిరీస్‌ని చేజార్చుకున్న శ్రీలంక కనీసం ఈ వన్డే సిరీస్‌నైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో క్రికెటర్లు చెమటోడ్చారు. దినేశ్ కార్తీక్ ఎక్కువ సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. ధోనీ, ఇతర యువ క్రికెటర్లు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. మొహాలి వన్డేలో డబుల్ సెంచరీ బాది సూపర్ ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ.. చివరి వన్డే‌కి జట్టులో మార్పులు లేకుండానే బరిలోకి దిగాలని యోచిస్తున్నాడట.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
తెలంగాణ ఎక్స్ప్రెస్ పేరు మార్పు
Sat 06 Jun 02:00:29.03101 2015
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ప్రెస్ పేరు మారనుంది. తెలంగాణ ఎక్స్ప్రెస్ పేరును కాగజ్నగర్ ఎక్స్ప్రెస్గా పేరు మా
ఆర్టీఈ నిబంధనలు అమలు చేయండి
Sat 06 Jun 02:00:01.011646 2015
విద్యాహక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని 'కోవా' ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి మహ్మద్ తురబ్ కోరారు.
ప్రశ్నార్థకంగా 'పొరుగు సేవల' భవిష్యత్ !
Sat 06 Jun 01:59:37.424704 2015
రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తోన్న పొరుగు సేవల (ఔట్సోర్సింగ్) ఉద్యోగులు, సిబ్బంది భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
తక్కువ వర్షాలతో ఇబ్బంది లేదు..
Fri 05 Jun 02:45:27.195543 2015
ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ స్థాయిలో వర్షాలు కురిసినా పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ దేశ ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. గురువారం ఆయన ఇ
తెలంగాణ వైపు చూడండి
Fri 05 Jun 02:45:33.09404 2015
మూడు రోజుల విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు గురువారం హాంకాంగ్లో 'ఇన్వెష్ట్మెంట్ రోడ్ షో అండ్ ఇంటరాక్టివ్ సెషన్ విత్
4 సెకన్లలో 100 కి.మీ. వేగం..!
Fri 05 Jun 02:45:38.427462 2015
విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ గురు వారం కొత్త స్పోర్ట్స్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆర్ఎస్ 6 అవాంత్ పేరుతో మార్కెట్లోకి తెచ్చిన ఈ కారు నాలుగు సెకన్లలో 1
నిమిషానికో వాచీ కొంటున్నారు..
Fri 05 Jun 02:45:45.01156 2015
ఆన్లైన్లో చేతి గడియారాల అమ్మకాలకు మంచి ఆదరణ లభిస్తోందని ఈ-బే ఇండియా అధినేత (రిటైల్ ఎక్స్పొర్ట్, లైఫ్స్టైల్) నవీన్ మిస్త్రీ తెలిపారు. భారత్లో తొలిసారిగా తాము వ
రోజంతా ఊగిసలాటే..
Fri 05 Jun 02:45:52.267835 2015
వర్షాభావ పరిస్థితులు, వృద్ధి రేటుపై ఆర్బిఐ అనుమానాలు దేశీయ స్టాక్ మార్కెట్లను వరుసగా మూడో సెషన్లోనూ ఒత్తిడికి గురి చేశాయి. వీటికి తోడు రూపాయి మారకం విలువ మరింత దిగజారడ
ఉక్కు దిగ్గజంగా జేఎస్డబ్ల్యూ స్టీల్
Fri 05 Jun 02:45:59.203482 2015
ముంబయి: దేశీయంగా అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆవిర్భవించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)ను వెనక్కి నెట్టుతూ
ఫెడరల్ బ్యాంకుకు గ్రీన్టెక్ అవార్డు
Fri 05 Jun 02:20:39.227871 2015
హైదరాబాద్: బెంగళూరులో ఫెడరల్ బ్యాంకు ట్రయినింగ్, అభివృద్ధిలో అత్యుత్తమ ప్రగతిని కనబర్చినందుకు గాను ఆ సంస్థకు గ్రీన్టెక్ హెచ్ఆర్ ఎక్సలెన్సీ అవార్డు -2015 లభించింది.
ఆంధ్రా బ్యాంకు రుణం చౌక
Fri 05 Jun 02:19:58.150975 2015
హైదరాబాద్: ఆంధ్రా బ్యాంకు రుణాలపై బేస్ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, 10 శాతంగా నిర్ణయించింది. తగ్గించిన ఈ వడ్డీరేటు ఈ నెల 11 నుంచి అమల్లోకి వస్తుందని ఆ బ్యాంకు
ఎస్బీఐలో విలీనం వద్దు
Fri 05 Jun 01:57:53.758405 2015
ముంబయి: ఎస్బిఐలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఐదు అసోసియేట్ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఎస్బిఐకి అనుబంధ బ్యాంకులుగా వుండడంపై వారు వ్యతిరేకత వ్యక్తం చేశారు.
విద్యా రుణాల మంజూరీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు బేష్!
Fri 05 Jun 01:57:34.115868 2015
కొచ్చి: దేశంలో పేదలు ఉన్నత చదువులను చదివేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) తగిన తోడ్పాటునే అందిస్తున్నాయని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (సిబిల్)
జులైలో కామత్ చేతికి 'న్యూ' బ్యాంక్
Fri 05 Jun 01:57:14.298266 2015
న్యూఢిల్లీ : బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న 'న్యూ డెవలప్మెంట్ బ్యాంకు' (ఎన్డీబీ)నకు అధినేతగా కెే.వి. కామత్ వచ్చే నెలలో బాధ్యతలు స్వీకరించనున్నారు. రాను
వానలపై అంత గుబులొద్దు..
Thu 04 Jun 03:22:57.378992 2015
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ ఏడాది సాధారణం కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందంటూ వెలువరించిన ముందస్తు నివేదిక ప్రభావం ఇప్పటి నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థపై కనిప
ఉడుకుతోన్న 'మ్యాగీ' వివాదం
Thu 04 Jun 03:23:03.110835 2015
మ్యాగీ నూడిల్స్ లో ప్రమాదకర రసాయానాలు ఉంటున్నట్లు వస్తున్న వార్తలతో ఆ సంస్థపై ఒత్తిడి మరింతగా పెరుగుతోంది. మరోవైపు ఆ సంస్థకు చెందిన పాలపొడిలోనూ పురుగులు ఉంటున్నట్లు వ
మార్కెట్లోకి సెలీరియో డీజిల్
Thu 04 Jun 03:23:08.267068 2015
మారుతీ సుజుకీ సంస్థ బుధవారం సెలీరియో డీజిల్ వేరియంట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. సుజుకీ సంస్థ రూపొందించిన మొదటి డీజిల్ ఇంజిన్ డీడీఐఎస్తో ఈ కారును విపణిలోకి
అవే భయాలు వెంటాడాయి..
Thu 04 Jun 03:23:13.73245 2015
దేశీయ స్టాక్ మార్కెట్లను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. వడ్డీ రేట్లను మరిసారి తగ్గించే పరిస్థితి లేదని ఆర్బిఐ సంకేతాలు ఇవ్వడానికి తోడు ఈ ఏడాది రుతుపవనాలు ఆశించన
విప్రో ఉద్యోగుల వేతనాలు 7% పెంపు
Thu 04 Jun 03:12:07.566388 2015
విప్రో తమ ఉద్యోగుల వేతనాలను 7 శాతం పెంచుతూ ప్రకటన చేసింది. అర్హులైన ఉద్యోగుల వేతన పెంపు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆ కంపెనీ మానవ వనరుల విభాగం
విజయా ఏజెన్సీస్ 32వ వార్షికోత్సవం
Thu 04 Jun 03:11:36.482876 2015
వంటింటి గృహోపకరణాల సంస్థ విజయా ఏజెన్సీస్ 32 వార్షికోత్సవాన్ని జరుపుకుంది. హైద్రాబాద్లోని లియోనియా రిసార్ట్స్లో సోమవారం ఫ్యామిలీ మీట్ నిర్వహించి సంస్థ డీలర్లకు అవార్డు
భారీగా పడిన అదానీ షేర్లు..!
Thu 04 Jun 03:10:51.3266 2015
అదాని ఎంటర్ప్రైజెస్ వాటాలు బుధవారం దాదాపు 83 శాతం మేర కుంగాయి. సంస్థ మార్కెట్లకు తమ పునర్నిర్మాణ ప్రణాళికను సమర్పించిన నేపథ్యంలో ఈ కంపెనీ వాటాలు మంగళవారం బాగా
కార్యాలో టాటా పెట్టుబడులు
Thu 04 Jun 03:10:20.051764 2015
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మహిళల ధరించే ఉత్పత్తుల ఫ్యాషన్ పోర్టల్ కార్యాలో వాటాను కొనుగోలు చేశారు. అయితే ఇందులో ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టారనేది ఆ
వారిని విధుల్లోకి తీసుకోవాలి
Thu 04 Jun 03:07:45.294625 2015
తొలగించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మారవల్లి సుధ
అరరే.. ఆర్బీఐ..!
Wed 03 Jun 03:59:43.245325 2015
ముంబయి: అనుకున్నదే జరిగింది... మంగళవారం వెల్లడించిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆర్థిక వ్యవస్థకు కొత్త సత్తువ నిం
గృహ, వాహన రుణాలు చౌక
Wed 03 Jun 03:59:59.044377 2015
ముంబయి: ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళ వారం రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. దీంతో గృహ, వాహన రుణాలు, కార్పొరేట్ రుణాలు ఇక తక్కు
కరవుకు సిద్ధంగా ఉందాం..
Wed 03 Jun 02:50:38.239077 2015
ఈ ఏడాది తక్కువ వర్షపాతం కారణంగా కరువు నెలకొనే అవకాశాలు వుండవచ్చునని వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనాలను వెలువరించిన నేపథ్యంలో ఆ పరిస్థితిని
మనకూ ప్లాస్టిక్ కరెన్సీ అవసరం
Wed 03 Jun 03:59:53.640979 2015
న్యూఢిల్లీ : దేశానికి ప్లాస్టిక్ కరెన్సీ అవసరం ఎంతో ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి మాట్
మొబైల్ తయారీ హబ్గా హైదరాబాద్
Wed 03 Jun 04:00:06.28406 2015
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు పలు సెల్ఫోన్ తయారీ సంస్థలు ముందుకు వచ్చాయి. 'ఇండియన్ సెల్యూలర్ అసోస
మార్కెట్లకు కరువు గుబులు
Wed 03 Jun 02:47:22.579479 2015
ముంబయి : పెట్టుబడిదార్లు, మదుపర్లు ఆశించిన విధంగానే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించనప్పటికీ మార్కెట్లకు సంతృప్తిని మిగల్చలేదు.
ఇంటెక్స్ నుంచి కొత్త స్మార్ట్పోన్లు
Wed 03 Jun 04:00:13.138659 2015
హైదరాబాద్ : ఇంటెక్స్ భారత మార్కెట్లోకి రెండు నూతన స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. అక్వా 3జి ప్రొ, అక్వా 3జి స్ట్రాంగ్ మోడళ్లను ఆవిష్క రించింది.
అప్పు సెటిల్ చేసుకుందాం రండి
Wed 03 Jun 04:00:19.187081 2015
హైదరాబాద్: రుణం తీసుకొని వాటిని చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఈ నెల 9న 'బృహత్ సిండ్ అదాలత్'ను నిర్వహిస్తున్నట్లు సిండికెట్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
దిగివస్తున్న బ్యాంకులు
Wed 03 Jun 02:44:02.160771 2015
ముంబయి: రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును తగ్గిస్తూ తన ద్రవ్య పరపతి విధానాన్ని మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ వడ్డీరేట్ల తగ్గింపు ప్
భెల్కు రూ.18000 కోట్ల భారీ ఆర్డరు
Wed 03 Jun 04:00:25.378157 2015
తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి కార్పొరేషన్ (టీఎస్ జెన్కో) నుంచి తాము రూ.17,950 కోట్ల విలువైన పనులను చేజిక్కించుకున్నట్లు 'భారత్ హెవి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్' (భెల్
Wed 03 Jun 02:35:38.791988 2015
తెలంగాణ తాగునీటి సరఫరా పథకానికి(టిడిడబ్ల్యూఎస్పి) రాష్ట్ర ప్రభుత్వం రూ.15,603.05 కోట్లను కేటాయించింది.
చీకట్లు తొలగించాం
Wed 03 Jun 02:34:55.251925 2015
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారమౌతుందనే విమర్శల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టగల్గామని ఎస్పీడిసిఎల్ ఇంఛార్జ్ సిఎమ్డి టి శ్రీనివాస్ అన్నారు.
రూ.2,500 కోట్ల ' ట్రైన్ సెట్' ప్రాజెక్టుకు టెండర్ల ఆహ్వానం
Wed 03 Jun 02:34:15.624825 2015
'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా రూ.2,500 కోట్ల 'ట్రైన్ సెట్' ప్రాజెక్టుకు రైల్వే శాఖ టెండర్లను ఆహ్వానించింది.
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది
Tue 02 Jun 01:21:54.478529 2015
సింగపూర్: భారత రిటైల్ మార్కెట్ 2020 నాటికి 1.3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి విస్తరిస్తుందని, జీడీపీ కూడా రానున్న మూడేళ్లలో 8% వృద్ధితో దూసుకుపోగలదని లండన్ కేంద్రంగా పని
29న మార్కెట్లోకి విండోస్-10
Tue 02 Jun 01:22:44.257174 2015
న్యూయార్క్ (అమెరికా): సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) విండోస్-10ని ఈ నెల 29న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లుగా ప్రకటిం చింది
అరబిందో మందుకు అమెరికా అనుమతులు
Tue 02 Jun 01:22:51.740359 2015
హైదరాబాద్: వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపయోగించే 'మెట్రోనైడజోల్' మాత్రల తయారీకి గాను అరబిందో ఫార్మాకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యుఎస్ ఎఫ్డీఏ) అను
వేచిచూసే ధోరణిలో మార్కెట్లు..
Tue 02 Jun 01:16:17.034227 2015
ముంబయి: భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో మదుపరులు సోమవారం ఆచితూచి ట్రేడింగ్లో పాల్గొన్నారు. దీంతో సోమవారం మార్కెట్ల
రెట్టింపు ఆదాయమే లక్ష్యం
Tue 02 Jun 01:22:59.275483 2015
చెన్నై: చైనా కేంద్రంగా మొబైల్ ఫోన్లను తయారు చేసే జియోనీ సంస్థ భారత్లో నేరుగా తమ తయారీ కార్యకలాపాలను ఇప్పట్లో ప్రారంభించే అవకాశాలు కనిపించడం లేదు. భారత్లో విస్తర
ఎన్ఎండీసీకి ప్రతిష్ఠాత్మక గ్రీన్టెక్ హెచ్ఆర్ అవార్డు
Tue 02 Jun 01:23:05.486976 2015
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మానవ వనరుల విభాగంలో అత్యుత్తమ శిక్షణను అందిస్తున్నందుకు గాను ప్రభుత్వ రంగంలోని ఎన్ఎండీసీ సంస్థకు గ్రీన్టెక్ పౌండేషన్ వారు అందించే ప్లాటినమ్
పడకేసిన కీలక రంగాల ఉత్పత్తి
Tue 02 Jun 01:23:15.983769 2015
న్యూఢిల్లీ : వరుసగా రెండో మాసంలోనూ కీలక రంగాల వృద్ధి రేటు పడిపోయింది. ఎనిమిది ప్రధానమైన రంగాలు కలిగిన ఈ ప్రాధాన్యత రంగాల వృద్ధి రేటు ఈ ఏడాది ఏప్రిల్లో 0.4 శాతానికి పరి
ఉత్పత్తి పెరిగింది.. ఉద్యోగాలు కాదు..
Tue 02 Jun 01:05:31.846438 2015
న్యూఢిల్లీ: గత నెలలో (మే మాసంలో) తయారీ కార్యకలాపాలలో మంచి వృద్ధి కనబడిందని హెచ్ఎస్బీసీ 'పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్' (పీఎంఐ) వెలువరించింది. దేశ, విదేశీ మార్కెట్ల
ఒక్క నెలలోనే లక్షల కోట్ల సమీకరణ..
Tue 02 Jun 01:04:58.256475 2015
న్యూఢిల్లీ: భారత సంస్థలు ఏప్రిల్ మాసంలో తమ కార్పొరేట్ అవసరాల నిమిత్తం దాదాపు రూ.లక్ష కోట్లను సమీకరించాయి. పెరుగుతున్న సంస్థ అవసరాలు నేపథ్యంలో వారు మార్కెట్లను ద్రవ్
'హీరో' ఛైర్మన్గా పవన్ ముంజాల్
Tue 02 Jun 01:04:30.837088 2015
ముంబయి: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఛెర్మన్గా పవన్ ముంజాల్ బాధ్యతలు స్వీకరించారు. పవన్ ముంజాల్ తండ్రి సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రిజ్మోహన్ లాల
మరో 'జెట్' పథకం
Tue 02 Jun 01:02:42.892158 2015
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ టిక్కెట్ల ధరపై 30శాతం డిస్కౌంట్ను ప్రకటించింది. ఈ ఆఫర్ సోమవారం (1వ తేది) నుంచి ఈనెల నాలుగో తేది వరకు టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి మ
అంచనాలకు చేరని వస్త్ర ఎగుమతులు
Tue 02 Jun 00:59:36.082385 2015
ముంబయి: మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ వస్త్ర మరియు దుస్తుల పరిశ్రమ కొంత మెరుగైన పనితీరునే ప్రదర్శించింది అయితే నిర్ధారిత లక్ష్యాలను మాత్రం అందుకోలేక
త్వరలో 1000 జన ఔషధ స్టోర్స్
Tue 02 Jun 00:58:12.333781 2015
న్యూఢిల్లీ : మార్కెట్లో 60 నుంచి 70శాతం వరకు తక్కువ ధరకు మందులు లభ్యమయ్యేలా కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా మరో వెయ్యి జన ఔషధస్టోర్స్ ఏర్పాటు చేయబోతున్
పన్ను చెల్లింపుదారులకు కాస్త ఊరట..
Mon 01 Jun 01:07:19.327992 2015
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కలిగిస్తూ ఆర్థిక శాఖ ఆదివారం కొత్త ఆదాయపు పన్ను దాఖలు (ఐటీఆర్) ఫారములను ప్రవేశపెట్టింది. మూడు పేజీలతో కూడిన ఈ సరికొత్త ఐటీఆ
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఒక్క నెలలో కొత్తగా 8 లక్షల ఫోలియోలు
కేంద్ర ప్రభుత్వం వ్యవస్థీకృత పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా నగదు లావాదేవీలను కట్టుదిట్టం చేస్తుండటంతో మార్కెట్ పెట్టుబడులవైపు ఇన్వెస్టర్ల చూపు మళ్లుతోంది.
Samayam Telugu | Updated:
May 21, 2018, 02:45PM IST
ఒక్క నెలలో కొత్తగా 8 లక్షల ఫోలియోలు
కేంద్ర ప్రభుత్వం వ్యవస్థీకృత పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా నగదు లావాదేవీలను కట్టుదిట్టం చేస్తుండటంతో మార్కెట్ పెట్టుబడులవైపు ఇన్వెస్టర్ల చూపు మళ్లుతోంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ల వైపు కొత్తగా వచ్చే వారి సంఖ్యలో వృద్ది కనబడుతోంది.
మ్యూచువల్ ఫండ్లు
మ్యూచువల్ ఫండ్లలో మొదటిసారి ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. దీనికి సంకేతమే కొత్తగా వచ్చి చేరుతున్న ఫోలియోలు. కేవలం ఏప్రిల్ నెలలోనే కొత్తగా 8 లక్షల ఫోలియోలు మ్యూచువల్ ఫండ్లలో జతయ్యాయి. దీంతో 2018 ఏడాది ఏప్రిల్ చివరికి మ్యూచువల్ ఫండ్ల రంగంలో మొత్తం ఫోలియోల సంఖ్య 7.23 కోట్లకు చేరింది. ఇక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు సంఖ్యను ఫోలియోగా పేర్కొంటారు. ఈ ప్రకారం ఒక ఇన్వెస్టర్కు ఎన్నిఫోలియోలు అయినా ఉండొచ్చు.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇండియా గణాంకాల ప్రకారం 42 ఏఎంసీలు మొత్తం నిర్వహిస్తున్న ఫోలియోల సంఖ్య 7 కోట్లకు పైగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి వీటి సంఖ్య 7.13 కోట్లు. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాల్లో ఫోలియోల పెరుగుదల 7.35 లక్షలుగా ఉండగా.. బ్యాలెన్స్ఢ్ విభాగంలో పెరుగుదల ఒక లక్షగా ఉంది. ఇన్కమ్ ఫండ్స్ విభాగంలో మాత్రం ఫోలియోలు తగ్గాయి. మొత్తం ఫోలియోల్లో ఈక్విటీ ఫోలియోలు 5.43 కోట్లు కావడం గమనార్హం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
డిటిసి ప్యానెల్ ఆర్థిక మంత్రికి నివేదిక
tax
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల నియమావళి ప్యానెల్ దేశం మొత్తం మీద నాలుగే నాలుగు శ్లాబ్లలో ఆదాయపు పన్ను ఉండాలని, సాలుసరి రెండుకోట్ల రూపాయలకుపైబడిన ఆదాయం ఉన్నవారికి 35శాతం పన్నుగా ఉండాలని సిఫారసులుచేసింది. అలాగే వ్యక్తిగత పన్ను పరిమితి సాలుసరి ఐదు లక్షలుగా ఉండాలని సిఫారపులుచేసింది. ప్రత్యక్షపన్నులకోసం కొత్త చట్టాలను రూపొందించేందుకు నియమించిన ఈ ప్యానెల్ వ్యక్తిగత ఆదాయపు పన్నుశ్లాబ్ల పరిమితిని పెంచాలని, చరవనరులనుంచి వచ్చే ఆదాయంకు మంచి ప్రోత్సాహం ఉండాలని, దీనివల్ల వినియోగరంగంలో డిమాండ్పెరుగుతుందని అనానరు. ముసాయిదా చట్టం నాలుగు శ్లాబ్లను మాత్రమే నిర్ణయించింది. డిటిసి అని పిలుచుకుంటున్న ఈ ప్యానెల్ వ్యక్తిగత ఆదాయపు పనునపరిమితి ఏడాదికి ఇపుడున్న 2.5 లక్షలనుంచి రూ.ఐదులక్షలకు పెంచాలనినిర్ణయించింది ఐదు లక్షలనుంచి పదిలక్షలలోపు ఉన్నవారికి పదిశాతం, పదిలక్షలనుంచి 20 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి 20శాతం, 20 లక్షలనుంచి రెండుకోట్ల రూపాయలు పైబడి ఉన్నసంపన్నులకు 30శాతం పన్నులు ఉండాలని సూచించింది. ప్రస్తుతం వ్యక్తిగత ఆదాయపు పన్నుశ్లాబ్ ఐదుశాతం 2.5 నుంచి ఐదులక్షలవరకూ ఉన్నవారికి వసూలుచేస్తున్నారు. 20శాతంపన్నును ఐదు నుంచి పదిలక్షల ఆదాయం ఉన్నవారికి, 30శాతం పదిలక్షల రాబడులు పైబడి ఉన్నవారికి వసూలుచేస్తున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/
| 1entertainment
|
Visit Site
Recommended byColombia
పాలసీ టర్మ్ 10-18 ఏళ్లు ఉంటుంది. ఐదేళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్ ఎంచుకుంటే పాలసీ ప్రీమియాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లించొచ్చు. చేతిలో డబ్బులు ఉంటే ఒకేసారి ప్రీమియం చెల్లించొచ్చు. 90 రోజుల నుంచి 65 ఏళ్ల వయసు ఉన్న వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఒకేసారి ప్రీమియం చెల్లింపు, ఐదేళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్ల ప్రాతిపదికన వయసు మారుతుంది.
పాలసీ ప్రారంభమైన ఐదు సంవత్సరాల్లో రిస్క్ డేట్ ప్రారంభం కాకముందే పాలసీదారు చనిపోతే చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ఎలాంటి వడ్డీ ఉండదు. రిస్క్ డేట్ ప్రారంభమైన తర్వాత చనిపోతే ఎంత మొత్తానికైతే పాలసీ తీసుకున్నారో ఆ మొత్తం అందిస్తారు. అదే పాలసీ తీసుకుని ఐదేళ్లు గడిచిన తర్వాత మెచ్యూరిటీ కన్నా ముందే పాలసీదారు చనిపోతే అప్పుడు బీమా మొత్తంతోపాటు లాయల్టీ అడిషన్ కూడా అందిస్తారు.
ఇక పాలసీ మెచ్యూరిటీ తర్వాత కూడా పాలసీదారు జీవించి ఉంటే ఎంత మొత్తానికైతే పాలసీ తీసుకున్నారో ఆ మొత్తం లభిస్తుంది. అలాగే దీనికి అదనంగా లాయల్టీ అడిషన్ వస్తుంది.
ఉదాహరణకు మీరు రూ.10 లక్షలకు పాలసీ తీసుకున్నారు. లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ కింద ఐదేళ్లు ప్రీమియం పేమెంట్ ఎంచుకున్నారు. తొలి ఏడాది నెలకు దాదాపు రూ.9,628 చెల్లించాలి. రెండో ఏడాది నుంచి రూ.9,430 కట్టాల్సి ఉంటుంది. 15 ఏళ్ల అనంతరం మెచ్యూురిటీ తర్వాత పాలసీదారుడికి రూ.10 లక్షలు, లాయల్టీ అడిషన్ మొత్తం లభిస్తుంది. అదే మీరు రూ.10 లక్షల పాలసీ మొత్తానికి సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఎంచుకుంటే 15 ఏళ్ల టర్మ్కు ఒకేసారి రూ.5,01,287 చెల్లించాలి. మెచ్యూరిటీ తర్వాత రూ.10 లక్షలతోపాటు లాయల్టీ లభిస్తుంది.
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Bigg Boss Telugu : రవిని ఇష్టపడ్డ తమన్నా.. కాదన్నాడనే ఆ కసి: బండారం బయటపెట్టిన రోహిణి
Bigg Boss Ravi Krishna: బిగ్ బాస్ హౌస్లో ట్రాన్స్ జెండర్గా ఎంట్రీ ఇచ్చి.. రవిక్రిష్ణకు చుక్కలు చూపించడం వెనుక కారణం ఏమిటి? ప్రత్యేకించి రవినే ఆమె ఎందుకు టార్గెట్ చేసిందో సంచలన విషయాలు బయటపెట్టిన రోహిణి.
Samayam Telugu | Updated:
Aug 23, 2019, 09:24PM IST
Bigg Boss Telugu : రవిని ఇష్టపడ్డ తమన్నా.. కాదన్నాడనే ఆ కసి: బండారం బయటపెట్టిన ...
తమన్నా సింహాద్రి.. బిగ్ బాస్ హౌస్లో ఒక్కవారమే అయినా కంటెస్టెంట్తో పాటు ఆడియన్స్కి దడ పుట్టించింది ఈ ట్రాన్స్జెండర్. బిగ్ బాస్ వాళ్లు ఒక ఉద్దేశంతో ఆమెను బిగ్ బాస్ హౌస్కి పంపిస్తే.. ఆమె అక్కడకు వెళ్లి రచ్చ రచ్చ చేసింది. బాబోయ్ ఈమెను హౌస్లో మేం తట్టుకోలేం.. ఎలిమినేట్ చేసేయండి నాగార్జున గారూ.. అని హౌస్ మేట్స్ గగ్గోలు పెడితే... ప్రేక్షకులు సైతం మే భరించలేం బిగ్ బాస్ అని ఛానల్స్ మార్చడం మొదలు పెట్టారు.
దీంతో వెళ్లిన వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది తమన్నా. అయితే ఆమె హౌస్కి వెళ్లిన తొలి రోజు నుండి ఎర్రగా బుర్రగా ఉండే రవిక్రిష్ణను పండూ.. పండూ అని అతని వెంట పడేది. రెండు మూడు సందర్భాల్లో నన్ను వదిలేయండి ప్లీజ్ అని కూడా అన్నాడు రవి.
అయితే సడెన్గా ప్లేట్ మార్చేసింది తమన్నా.. పండూ అని ముద్దుగా పిలిచిన నోరూ పప్పూ.. అని అతనికి చుక్కలు చూపించింది. ఎలిమినేషన్ని నామినేట్ చేశాడనే కారణంతో.. ‘నువ్ మగాడివేనా? రోషంలేదా? సిగ్గులేదా? నీలో పవర్ లేదా? అంటూ రవికి రక్తకన్నీరు చూపించింది తమన్నా.
అయితే ఆమె ఎందుకు అంతలా రవిని టార్గెట్ చేసిందో ప్రేక్షకులకు కూడా అర్ధం కాలేదు సరికదా.. హోస్ట్ చేస్తున్న నాగార్జునకు సైతం అర్ధం కాలేదు. తనను నామినేట్ చేశాడనే కారణంతో అలా చేశానని తమన్నా చెప్పినా.. దానికి అసలు కారణం వేరే ఉంది అంటూ గుట్టు విప్పింది రోహిణి .
బిగ్ బాస్ సీజన్లో నాలుగో వారం ఎలిమినేషన్ ద్వారా ఇంటి బయటకు వచ్చిన రోహిణి.. తమన్నా గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. రవిను ఆమె టార్గెట్ చేయడం వెనుక కారణంతో పాటు ఆమెకు సంబంధించిన రహస్యాలను బయటపెట్టింది.
రోహిణి మాట్లాడుతూ.. ‘ఆమె హౌస్లోకి వచ్చిన తరువాత నాకు ఫైనాన్సియల్గా ప్రాబ్లమ్ ఉంది.. ఎవరూ నామినేట్ చేయొద్దన్నని బ్రతిమిలాడింది. ఆమెకు ఏసీ లేకుండా నిద్రపట్టదు అన్న విషయం నాకు తెలియదు కాని.. హౌస్కి వచ్చిన తరువాత హిమజ ఎవరో ఎవరికీ తెలియదు. ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ కాదని అంది. కాని ఎలిమినేట్ అయిన తరువాత హిమజ క్యూట్ లేడి స్వీట్ లేడీ అనిచెప్పింది. దాన్నిపట్టి ఆవిడ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
అయితే రవి విషయంలో ఆమె చాలా దారుణంగా ప్రవర్తించారు. నామినేట్ చేశాడనే కారణంతో అతన్ని నువ్ పప్పువిరా పప్పు.. మీ అమ్మా నాన్న చూస్తున్నారు. నువ్ ఎంత నీచమైన గేమ్ ఆడుతున్నావో అంటూ టార్చర్ పెట్టింది. రవి ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్లి తిట్టింది. కనీసం బాత్ రూంకి వెళ్లినా వదిలేది కాదు.. వెనుకనే వెళ్లిపోయేది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
39ఏళ్ల టెస్టు రికార్డ్ని బద్దలుకొట్టిన బుమ్రా
మెల్బోర్న్ టెస్టులో మూడో రోజైన శుక్రవారం 8/0తో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు.. జస్ప్రీత్ బుమ్రా (6/33) ధాటికి 151 పరుగులకే కుప్పకూలిపోయింది.
Samayam Telugu | Updated:
Dec 28, 2018, 10:38AM IST
39ఏళ్ల టెస్టు రికార్డ్ని బద్దలుకొట్టిన బుమ్రా
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో అరుదైన రికార్డ్ని బద్దలుకొట్టాడు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో ఆరు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఏడాదిలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత ఫాస్ట్ బౌలర్గా రికార్డుల్లో నిలిచాడు. ఈ ఏడాది జనవరి 5న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్తో ఐదు రోజుల ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన జస్ప్రీత్ బుమ్రా.. ఇప్పటి వరకు 9 టెస్టులాడి ఏకంగా 45 వికెట్లు పడగొట్టాడు. మెల్బోర్న్ టెస్టులో మూడో రోజైన శుక్రవారం 8/0తో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు.. జస్ప్రీత్ బుమ్రా (6/33) ధాటికి 151 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. భారత్కి 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
@Jaspritbumrah93 Here's @Jaspritbumrah93 claiming his fifth wicket. He ended with figures of: 15.5 overs 4 maidens… https://t.co/JvjSDz7WRA
— Telegraph Sport (@telegraph_sport) 1545972633000
| 2sports
|
తారల తెరచాటు ప్రేమకథలు!
First Published 23, Apr 2019, 11:21 AM IST
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ కి సంబంధించిన రూమర్స్ బాగా వినిపిస్తుంటాయి.
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ కి సంబంధించిన రూమర్స్ బాగా వినిపిస్తుంటాయి. రెండు, మూడు సినిమాలు కలిసి నటిస్తే వారి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుందని పుకార్లు పుట్టిస్తుంటారు. ఇదంతా సాధారణ విషయమే.. అయితే కొన్ని రూమర్లు పెళ్లి వరకు వెళ్తే మరికొన్ని మధ్యలో తెగిపోయాయి. మరికొన్ని సహజీవనం సాగించేవరకు నడిచాయి. అలా ఇండస్ట్రీలో బాగా రూమర్లు వినిపించిన కొన్ని ఎఫైర్లు ఇప్పుడు చూద్దాం!
శృతి హాసన్ - మైకేల్ కోర్సలె : లండన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ తో శృతి చాలా రోజులుగా డేటింగ్ చేస్తుంది. శృతికి సంబంధించి ప్రతి ఈవెంట్ లో మైకేల్ కనిపిస్తాడు. ఇంట్లో వాళ్లకు కూడా వీరి సంగతి తెలుసు. కానీ శ్రుతి మాత్రం ఎప్పుడూ ఈ విషయం గురించి ప్రస్తావించదు.
సమంత - సిద్ధార్థ్ : 'జబర్దస్త్' సినిమా షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది సమంత. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. కానీ వారి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఈ విషయంలో ఈ జంట మీడియా ముందు కూడా మాట్లాడింది. సామ్ ఇప్పుడు చైతుని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది.
త్రివిక్రమ్ - పార్వతి మెల్టన్ : త్రివిక్రమ్ హీరోయిన్ పార్వతి మెల్టన్ తో చాలా సన్నిహితంగా మెలిగేవాడు. 'జల్సా' సమయంలో త్రివిక్రమ్ ఆమెకి డైమండ్ నెక్లస్ గిఫ్ట్ గా ఇచ్చాడని గాసిప్. కానీ ఇప్పుడు వీరి మధ్య ఎలాంటి బంధం లేదని తెలుస్తోంది.
రానా - త్రిష : టాలీవుడ్ హీరో రానా చాలా కాలం పాటు నటి త్రిషతో డేటింగ్ చేశాడని టాక్. వీరిద్దరూ కలిసి తీసుకున్న కొన్ని పెర్సనల్ ఫోటోలు కూడా అప్పట్లో బయటకొచ్చాయి.
రిచా గంగోపాధ్యాయ - సుందర్ రాము : 'మయక్కం ఎన్న' సినిమా సమయంలో వీరిద్దరూ క్లోజ్ అయ్యారు. సన్నిహితంగా మెలిగేవారు. సుందర్ రాము.. రిచాని పెళ్లి చేసుకోవడం కోసం ప్రయత్నించాడు. సూసైడ్ చేసుకుంటానని ఆమెని బెదిరించాడు. కానీ దానికి ఆమె అంగీకరించలేదు. కొన్నాళ్లకు ఆమె ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోయింది.
పవన్ కళ్యాణ్ - అన్నా లెజ్నేవా : రష్యాకి చెందిన ఆమెతో పవన్ ప్రేమాయణం సాగించాడు. అప్పటికే పవన్ కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తరువాత తన భార్య రేణుకి విడాకులిచ్చి అన్న లెజ్నేవాను వివాహం చేసుకున్నాడు.
ఇలియానా - ఆండ్రూ నీబోన్ : ఆస్ట్రేలియాకి చెందిన ఆండ్రూ అనే ఫోటోగ్రాఫర్ తో ఇలియానా చాలా రోజులుగా డేటింగ్ చేస్తుంది. వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని అంటారు. కానీ ఇప్పటికీ ఈ విషయంపై ఇలియానా క్లారిటీ ఇవ్వడం లేదు.
అసిన్ - నీల్ నితిన్ ముఖేష్ : మొదట్లో అసిన్, నీల్ నితిన్ మంచి స్నేహితులు. వారి స్నేహం ప్రేమగా మారింది. కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఆ తరువాత ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో విడిపోయారు.
హన్సిక - శింబు : చాలాకాలం పాటు రిలేషన్షిప్ సాగించిన హన్సిక -శింబు ఆ తరువాత విడిపోయారు.
వరుణ్ సందేశ్ - శ్రద్ధాదాస్ : వీరిద్దరూ కలిసి తరచూ పార్టీలకు వెళ్లడం, టైం స్పెండ్ చేయడంతో ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించేవి. కానీ తామిద్దరం మంచి స్నేహితులమని వీరిద్దరూ చెప్పేవారు.
Recent Stories
| 0business
|
Visit Site
Recommended byColombia
కాగా.. కోల్కతా, నేపాల్లోని అందమైన ప్రదేశాల్లో సినిమా షూటింగ్ జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే ఐమ్యాక్స్కు ఎదురుగా ఉన్న లేక్వ్యూ పార్క్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రంలో మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అయితే శర్వానంద్, సాయిపల్లవి నటన సినిమాకు హైలైట్ కానుందని చిత్ర యూనిట్ చెబుతోంది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని అంటున్నారు.
ఈ సినిమా హను రాఘవపూడి తన స్టైల్లో టిపికల్ యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారట. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ‘పడిపడి లేచే మనసు’ విడుదల కానుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Oct 05,2015
ట్రెడా ప్రాపర్టీషోకు అనూహ్య స్పందన
హైదరాబాద్ : తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) మాదాపూర్లోని హైటెక్స్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీషో అనూహ్య స్పందన లభించింది. మూడు రోజుల ప్రదర్శనలో చివరి రోజు కావటంతో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతోపాటు ఆదివారం సెలవు కావటంతో ప్రభుత్వ, ఐటి ఉద్యోగులతోపాటు ఔత్సాహికులు ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 180 స్టాల్స్లో తమకు అనువైన వెంచర్ల వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ముగింపు కార్యక్రమంలో లక్కీడీప్ నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Gopi chand (file)
పుల్లెల గోపీిచంద్ అధికార పరిధి తగ్గించే అవకాశం?
న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్కు గొప్ప గుర్తింపు తెచ్చిన ఒలం పిక్స్ పతకాలు గెలిచే స్థాయికి భారత బ్యాడ్మింటన్ను తీసు కెళ్లిన ఘనత బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్కే దక్కుతుంది. భారత బ్యాడ్మింటన్కు ఎన్నో అద్వి తీయ విజయాలు అందించి, దేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ అధికారి పరిధిని తగ్గించే అవకాశం కనిపిస్తోంది. భారత బ్యాడ్మింటన్ సంఘం నూతన అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ నియమావళిలో పలు మార్పులు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో జాతీయ చీఫ్ కోచ్ అనే పదవిని తొలగించి దాని స్థానంలో రెండేళ్ల పదవి కాలంతో జాతీయ కోచ్ల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. దీంతో పాటు సింగిల్స్,డబుల్స్, జూనియర్స్ విభాగాలకు ప్రత్యేకంగా వేర్వేరు కోచ్ల నియా మకానికి ఆయన మొగ్గుచూపుతున్నారు. ఈకొత్త ప్రతిపాదన ప్రకారం కోచ్లు మరే ఇతర రాష్ట్ర సంఘాలలో ఎలాంటి పదవులు చేపట్టకూడదు. గోపిచంద్ 2006 నుంచి జాతీయ చీఫ్ కోచ్గా కొనసాగుతున్నారు. గోపిచంద్ పర్యవేక్షణలో ఇతర జాతీయ కోచ్లు పనిచేస్తున్నారు. తెలంగాణ బాడ్మింటన్ సంఘానికి ఆయన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం కోచ్ల బృందానికి ప్రత్యేక పర్యవేక్షణాధికారి ఉండరు. రాష్ట్ర సంఘంలోనూ ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఈ అంశంపై జూన్ 11న బెంగుళూరులో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. వీటితో పాటు ఇన్స్టిట్యూషన్ జట్టు అయిన ఎయిరిండియా, సిఎస్పిబి, రైల్వేస్, కాగ్, ఇంటర్ యూనివర్సిటీ కంట్రోల్ బోర్డులకు ఓటింగ్ హక్కును తొలగించాలని కూడా ప్రతిపాదించారు.
| 2sports
|
జాలీ ఎల్ఎల్బి సినిమా ఓ ట్రెండ్ సెట్టర్: అక్షయ్కుమార్
Highlights
యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు ఉన్న బాలీవుడ్ హిరో అక్షయ్ కుమార్
ఆ ఇమేజ్కి భిన్నంగా జాలీ ఎల్ఎల్బి -2 కామేడి మూవీ లో నటించిన అక్షయ్
ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ
ఈ సందర్భంగా చిత్ర కథానాయిక హ్యూమా ఖురేషితో కలసి అక్షయ్ హైదరాబాద్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ – ‘‘నేనెప్పుడూ న్యాయవాది పాత్ర చేయలేదు. సో, ఈ కథ వినగానే ఎగ్జయిటింగ్గా అనిపించింది. న్యాయవ్యవస్థపై సెటైరికల్ సినిమా కాదిది... అందులో లోపాలను ఎత్తిచూపే ప్రయత్నమూ చేయలేదు.
వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన కామెడీ మూవీ ఇది. ‘జాలీ ఎల్ఎల్బి’ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ఈ సీక్వెల్ను కొత్త కథతో తెరకెక్కించాం. ‘జాలీ ఎల్ఎల్బి’లో హీరోగా నటించిన అర్షద్ వార్సితో నా నటనను పోల్చి చూస్తారని తెలుసు. అర్షద్ చిన్నోడు కాదు, మంచి నటుడు. నా స్నేహితుడు కూడా. ‘జాలీ ఎల్ఎల్బి’ తరహాలో ఈ సీక్వెల్ కూడా మంచి హిట్టవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘అక్షయ్తో నటించడం హ్యాపీ. సినిమాలో నాకు, ఆయనకూ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది’’ అన్నారు హ్యూమా ఖురేషి.
Last Updated 25, Mar 2018, 11:57 PM IST
| 0business
|
ఎస్బీఐలో బ్యాంకుల విలీనానికి సై!
- సూత్రప్రాయ అంగీకారం తెలిపిన క్యాబినెట్
- ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు
- 'భారతీయ మహిళా బ్యాంకు'పై తరువాత నిర్ణయం
- విలీనం అమలు తేదీని త్వరలోనే వెల్లడిస్తాం
- ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ దిగ్గజం కానున్న ఎస్బీఐ: క్యాబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడి
న్యూఢిల్లీ: 'భారతీయ స్టేట్ బ్యాంక్'లో (ఎస్బీఐ) అయిదు అనుబంధ బ్యాంకుల విలీనానికి బుధవారం కేంద్ర క్యాబినెట్ పచ్చజెండాను ఊపింది. అయితే భారతీయ మహిళా బ్యాంకు విలీనంపై మాత్రం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనానికి ఆయా బ్యాంకుల బోర్డులు సమ్మతి తెలపడంతో ఈ ప్రతిపాదనకు మంత్రివర్గం పచ్చజెండా ఊపినట్టుగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆయా బ్యాంకుల బోర్డులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటూనే క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా ఆయన తెలిపారు. క్యాబినెట్ ఆమోదంతో త్వరలోనే 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్' (ఎస్బీబీజే), 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్' (ఎస్బీఎం), 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్' (ఎస్బీటీ), 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాల' (ఎస్బీపీ), 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్'లు (ఎస్బీహెచ్) ఎస్బీఐలో విలీనం కానున్నాయి. విలీనపు నిర్ణయంతో ఎస్బీఐ దేశీయంగానే కాకుండా ప్రపంచ స్థాయి విత్త సంస్థగా ఎదుగుతుందని మంత్రి అన్నారు. మేటి సామర్థ్యంతో పని చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని జైట్లీ వివరించారు. ఈ నిర్ణయంతో నిర్వహణ ఖర్చులు దిగివస్తాయని అన్నారు. నిధుల సమీకరణ వ్యయం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. 'భారతీయ మహిళా బ్యాంకు' విలానానికి సంబంధించిన ప్రతిపాదన ఇంకా పరిశీలనలోనే ఉందని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి బుధవారం సమావేశంలో ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఎప్పటి నుంచి ఈ విలీనం అమలులోకి రానుందన్న విషయమై జైట్లీ స్పష్టతనివ్వలేదు. విలీనం తేదీని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. విలీనం కారణంగా బ్యాంకుల్లోని ఏ ఒక్క ఉద్యోగిపైనా ప్రభావం చూపకుండా తగిన చర్యలు తీసుకోనున్నట్టుగా వివరించారు.
విలీన ప్రతిపాదన ఇదీ.
అనుబంధ బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎస్బీఐ ఇప్పటికే విలీన ప్రణాళికను సిద్ధం చేసి ఉంచింది. దీనికి బ్యాంకు బోర్డు ఆమోదం కూడా తెలిపింది. ఈ ప్రణాళిక ప్రకారం ఎస్బీబీజే వాటాదారులు తమ వద్ద ఉన్న ప్రతి 10 షేర్లుకు బదులుగా 28 ఎస్బీఐ వాటాలు లభించనున్నాయి. అలాగే ఎస్బీఎం, ఎస్బీటీ వాటాదారులకు వారి వద్దనున్న ప్రతి పది వాటాలకు 22 ఎస్బీఐ షేర్లను అందించనున్నారు. ఎస్బీపీ, ఎస్బీహెచ్ల విలీనానికి బ్యాంకు ప్రత్యేక ప్రణాళఙకను సిద్ధ చేసింది.
ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజంగా ఎస్బీఐ..
అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం తరువాత ఎస్బీఐ ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ దిగ్గజం కానుంది. బ్యాంకు ఆస్తుల విలువ రూ.37 లక్షల కోట్లకు చేరనుంది. ఖాతాదారుల సంఖ్య 50 కోట్లకు, బ్యాంకు బ్రాంచీల సంఖ్య 22,500లకు చేరుతుంది. ఇక మొత్తం 58,000 ఏటీఎంలు ఎస్బీఐ గొడుగు కిందకు రానున్నాయి. ప్రస్తుతం ఎస్బీ 16,500 శాఖలు, 191 విదేశీ శాఖలతో 36 దేశాలలో విస్తరించి ఉంది.
22 కంపెనీలకు 31 చమురు బ్లాక్లు
'డిస్కవర్డ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫీల్డ్స్' (డీఎస్ఎఫ్) వేలంలో భాగంగా మొత్తం దేశంలోని 31 చమురు, గ్యాస్ వెలికితీత బ్లాకులను 22 కంపెనీలకు అప్పగించేందుకు కేంద్ర క్యాబినెట్ అమోదం తెలిపింది. బుధవారం జరిగిన సమావేశంలో దీనికి సంబంధించి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
డీఎస్ఎఫ్ కింద మొత్తం 46 కాంట్రాక్టులను వేలానికి పెట్టగా 31 బ్లాకులకే స్పందన లభించింది. వీటిని రెండో దశలో వేలం వేయనున్నారు. బ్లాకులను చేజిక్కించుకున్న 22 కంపెనీల్లో 15 కొత్త సంస్థలేనని మంత్రి తెలిపారు. ఈ బ్లాకుల ద్వారా కంపెనీలకు రానున్న 15 ఏండ్లలో దాదాపు రూ.46,000 కోట్ల స్థూల ఆదాయం లభిస్తుందని అంచనా. ఇందులో సర్కారు వాటా రూ.9,600 కోట్ల వరకు ఉండవచ్చు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
నాని హీరోగా వస్తున్న "నిన్నుకోరి" మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్ నివేదా థామస్
First Published 29, Jun 2017, 10:53 PM IST
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
"నిన్నుకోరి" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నివేదా థామస్
Recent Stories
| 0business
|
Suresh 102 Views
దులీప్ ట్రోపీ తొలి మ్యాచ్లో ఇండియా రెడ్ ఘన విజయం
న్యూఢిల్లీ: దులీప్ ట్రోఫీలో భాగంగా ప్లడ్ లైట్ల వెలుతురులో గులాబి బంతితో నిర్వహించిన తొలి మ్యాచ్లో యువరాజ్ సారథ్యంలో ని ఇండియా రెడ్ ఘన విజయం సాధించింది.కాగా సురేష్ రైనా నేతృత్వంలోని ఇండియా గ్రీన్పై యువరాజ్ సేన 219 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగిం చింది.టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రెడ్ తొలి ఇన్నింగ్స్లో 161 పరుగుతు చేసింది.ఒపెనర్ అభినవ్ ముకుంద్ 116 బంతులు ఆడి 12 బౌం డరీలతో 77 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించి ఒంటరి పోరాటం చేశాడు.గ్రీన్ బౌలర్లలో సందీప్ శర్మ 62 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. కాగా తరువాత బ్యాటింగ్కు దిగిన ఇండియా గ్రీన్ నాథూ సింగ్ 53 పరుగులిచ్చి 6 వికెట్లు,కుల్దీప్ యాదవ్ 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకో వడంతో 151 పరుగు లకే కుప్పకూలింది.కాగా తొలి ఇన్నింగ్స్ల బౌలర్లదే పై చేయి కాగా రెండవ ఇన్నిం గ్స్లో బ్యాట్స్మెన్ సత్తా చాటారు.పది పరుగులు ఆధిక్యంలో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా రెడ్ ఓపెనర్ అభినవ్ ముకుంద్ 221 బంతులు ఆడి 20 బౌండరీలతో 169 పరుగులు చేయగా,సుదీప్ ఛటర్జీ 182 బంతులు ఆడి 114 పరుగులతో సెంచరీతో చెలరేగడంతో 486 పరుగులు టార్గెట్ను గ్రీన్ ముందుం చింది. గురు కీరత్ సింగ్ మన్ 96 బంతులు ఆడి 13 బౌండరీలు, 1 సిక్సర్తో 82 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు.యువరాజ్ రెండవ ఇన్నింగ్స్లో కూడా విఫలమ య్యాడు.గ్రీన్ బౌలర్లలో శ్రేయాన్ గోపాల్ 123 పరుగులిచ్చి 5 వికెట్లతో ఆకట్టు కున్నాడు.తరువాత బ్యాటింగ్కు దిగిన సురేష్ రైనా సారథ్యంలోని గ్రీన్ బౌలర్ కుల్దీప్యాదవ్ 88 పరుగులిచ్చి 6 వికెట్లతో తన సత్తా కనబ రిచడంతో 277 పరుగులకే చేతులెత్తేసింది.కాగా రాబిన్ ఉతప్ప 66 బంతులు ఆడి 10 బౌండరీలు,1 సికి ్సర్తో 72 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ సురేష్ రైనా 101 బంతులు ఆడి 11 బౌండరీలు,3 సిక్సర్లతో 90 పరుగులు చేసి జట్టు స్కోరు 275 వద్ద కుల్తీప్ బోల్తా కొట్టించాడు.ఆ తరువాత రెండు పరుగులకే ప్ర జ్ఞాన్ ఓజా 7 పరు గులతో వెనుది రగడంతో ఇండియా రెడ్ 219 పరు గుల తో విజయం సాధించింది.
| 2sports
|
internet vaartha 228 Views
కాన్బెర్రా : ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు దేశంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడాకారులుగా రికార్డులకు ఎక్కనున్నారు.ఆ దేశ క్రికెట్ సంఘం క్రికెట్ ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు భారీ జీత భత్యాలను పెంచింది. ప్రస్తుతం సంవత్సరానికి 1.8 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలరర్లు ఉన్న వీరి ఆదాయం త్వరలో 3.2 మిలియన్లకు చేరనుంది.దీంతో టాప్ లిస్ట్లో ఉన్న మహిళా క్రికెటర్లు సుమారు ఆరు రెట్లు, తరువాతి స్థానాల్లో ఉన్న క్రికెటర్లకు రెండు రెట్లు అధికంగా జీతాలను అందుకోనున్నారు.మరి ఇతర క్రీడల్లోనూ ఇంత పెద్ద మొత్తంలో క్రీడాకారిణులకు జీత భత్యాలు లేవు.దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా క్రికెటర్లకు 37వేల నుంచి 50 వేల డాలర్లకు జీతా లను పెంచారు.మహిళా బిగ్బాష్ లీగ్కు ప్రాతి నిధ్యం వహిస్తున్న వారికి 12 వేల ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచారు.ఆస్ట్రేలియా తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ ప్లేయర్లకు 62 వేల ఆస్ట్రేలియన్ డాలర్లతోపాటురావాణా ఖర్చులు, టూర్ చార్జిలను అదనంగా క్రికెట్ ఆస్ట్రేలియా భరించనుంది.సాధారణ మహిళా క్రికెటర్లకు సైతం 14 వేల నుంచి 30 వేల ఆస్ట్రేలియన్ డాలర్లకు సంవత్సర ఆదాయాన్ని పెంచింది క్రికెట్ ఆస్ట్రే లియా. క్రికెట్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచి ప్రతిభను ప్రొత్సహించేం దుకు జీత భత్యాలు భారీగా పెంచుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సిఈఓ జేమ్స్ సదర్లాండ్ వివరించాడు. కాగా రాబోయే కాలంలో తాము మరింతగా మహిళలను ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నాడు.మహిళలు క్రికెట్ను కెరీర్గా ఎంచుకునే విధంగా క్రికెట్ ఆస్ట్రేలియా పనిచేస్తుందన్నాడు.
| 2sports
|
Hyderabad, First Published 10, Sep 2019, 2:00 PM IST
Highlights
ఆర్థిక మాంద్యం ప్రభావంతో దేశీయంగా స్వర్ణకారులకు ఉపాధి దూరం కావచ్చునని దేశీయ గోల్డ్ అండ్ జ్యువెల్లరీ కౌన్సిల్ (జీజేసీ) సంకేతాలిచ్చింది. దేశీయ ఎగుమతుల్లో భారత ఎగుమతుల్లో జెమ్స్ అండ్ జువెలరీ రంగం వాటా 970 కోట్ల డాలర్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్-జూలైలో దేశ జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం తగ్గాయి.
కోల్కతా: మాంద్యం ముప్పును ఎదుర్కోనున్న తర్వాతి రంగం.. ఆభరణాల పరిశ్రమేనా?. ఈ ప్రశ్నకు అవును అంటున్నది అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ). మార్కెట్లో నెలకొన్న మందగమన పరిస్థితులు.. జ్యుయెల్లరీ ఇండస్ట్రీని కమ్ముకుంటున్నాయని, దీనివల్ల నైపుణ్యం ఉన్న ఎంతోమంది స్వర్ణకారులు ఉపాధిని కోల్పోయే వీలుందని జీజేసీ వైస్ చైర్మన్ శంకర్ సేన్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు.
దిగుమతి బంగారంపై కస్టమ్స్ సుంకం, ఆభరణాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) ప్రకటించిన బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు.
ఇక మునుపటి విలువ ఆధారిత పన్ను (వ్యాట్) విధానంలో 1 శాతంగా ఉన్న పన్ను భారం.. జీఎస్టీ రాకతో 3 శాతానికి చేరింది. ఇదిలావుంటే నగల కొనుగోలుకు పాన్ కార్డు తప్పనిసరి అన్న నియమాన్ని రూ.5 లక్షలు, ఆపై నుంచి వర్తింపజేయాలని సేన్ సర్కార్కు విజ్ఞప్తి చేశారు.
ప్రపంచంలోని అతిపెద్ద జెమ్స్ అండ్ జువెలరీ ఇండస్ట్రీల్లో భారత్ ఒకటి. అంతర్జాతీయ ఆభరణాల వినియోగంలో మన ఇండస్ట్రీ వాటా 29 శాతం. 2018లో రూ.5.32 లక్షల కోట్ల స్థాయికి చేరిన మార్కెట్ సైజు 2025 నాటికి రూ.7.10 లక్షల కోట్లకు పెరగవచ్చని అంచనా. 3 లక్షలకు పైగా వర్తకులున్న ఈ రంగం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 7 శాతం వాటా కలిగి ఉంది. 46.4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది.
మాంద్యం ప్రభావం నేపథ్యంలో ఆభరణాల రంగాన్ని ఆదుకునేందుకు దిగుమతి బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంతోపాటు జువెలరీ విక్రయాలపై జీఎస్టీ భారం తగ్గించాలని ఈ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. బంగారు నగల విక్రయాలపై జీఎస్టీని 3 శాతంగా నిర్ణయించారు.
జీఎస్టీకి ముందు హయాంలో వీటిపై వ్యాట్ (విలువ ఆధారిత సేవా పన్ను) ఒక శాతంగా ఉండేది. ఒకవైపు పన్నుల మోత, పెరుగుతున్న బంగారం ధరలు.. మరోవైపు తగ్గిన డిమాండ్. అన్నీ వెరసి తమ వ్యాపారాలను సంక్షోభంలోకి నెట్టాయని ఆభరణ రంగ వర్గాలు వాపోతున్నాయి.
బంగారంపై దిగుమతి సుంకాన్ని మళ్లీ 10 శాతానికి తగ్గించాలని దేశీయ గోల్డ్ అండ్ జ్యువెల్లరీ కౌన్సిల్ (జీజేసీ) కోరింది. జీఎస్టీని ఒక శాతానికి కుదించాలని అభ్యర్థించింది. బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
బంగారాన్ని అసెట్ క్లాస్గా ప్రకటించిన నేపథ్యంలో ఆభరణాల కొనుగోళ్లకూ నెలవారీ కిస్తీ (ఈఎంఐ) చెల్లింపు పథకాన్ని ప్రవేశపెట్టాలని తెలిపింది. ప్రస్తుతం రూ.2 లక్షల విలువైన ఆభరణ కొనుగోళ్లకు పాన్ కార్డు వివరాలివ్వడం తప్పనిసరన్న నిబంధనను రూ.5 లక్షలకు పెంచాలని జీజేసీ కోరింది.
గిరాకీ తగ్గడంతో ప్రస్తుతం ఆభరణ పరిశ్రమ మాంద్యం పరిస్థితులను దుర్కొంటోంది. దీంతో ఈ రంగంపై ఆధారపడి ఉన్న వేలాది మంది స్వర్ణకారుల ఉపాధికి ముప్పు ఏర్పడింది. కస్టమ్స్ సుంకం పెంపు, అధిక జీఎస్టీతో ఆభరణాల రేట్లు పెరిగాయి. దాంతో వినియోగదారుల సెంటిమెంట్కు గండిపడిందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ కౌన్సిల్ వైస్ చైర్మన్ శంకర్ సేన్ చెప్పారు.
Last Updated 10, Sep 2019, 2:00 PM IST
| 1entertainment
|
సంతోషం కలిగించలేదు
- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
సింగపూర్: దేశం జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికంలో సాధించిన ఏడు శాతం వృద్ధి తమకు ఆమోదయోగ్యంగా లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సదస్సులో మాట్లాడుతూ ఆర్థిక మందగమనం సమయంలో భారత్ ఏడు శాతం వృద్ధిని అందుకోవడం చాలా మెరగైన పని తీరుకు దర్పణమని అందరూ భావించారని ఆయన అన్నారు. అయితే ఈ వృద్ధి గణాంకాలు మనలో చాలా మంది ముఖాలపై నిజమైన ఆనందాల్ని పంచలేకపోయాయన్న విషయాన్ని తాను అంగీకరిస్తానని ఆయన ఆర్థిక మంత్రి తెలిపారు. ఏడు శాతం వృద్ధి మన ఆర్థిక వ్యవస్థకు సరిపోదని ఆయన అన్నారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.5 శాతంగా నమోదైన వృద్ధిరేటు ఈ ఏడాది 7 శాతానికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 8-8.5శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. వృద్ధిని పెంపొందించేందుకు ప్రభుత్వం మౌలికరంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచుతున్నట్లుగా ఆయన తెలిపారు. ఉక్కు, సిమెంట్, ఉపాధి తదితర రంగాలలో వృద్ధి పుంజుకోవడాన్ని త్వరలోనే గమనించవచ్చని ఆయన అన్నారు. రైల్వేలు ఆధునికీకరించేందుకు గాను తాము తగిన ఆర్థిక తోడ్పాటును అందించిన సంగతిని ఆయన ఇక్కడ వివరించారు. వృద్ధికి ఊతం ఇచ్చేలా సబ్సిడీల సవరణ ద్వారా లభిస్తున్న పొదుపును తాము నీటిపారుదల, మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తున్నట్లుగా తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyd Internet 106 Views Team India
Team India
ముంబాయిః భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సీరీస్లో పాల్గొనే 15మందితో కూడిన భారత బృందాన్ని బీసీసీఐ శనివారం ప్రకటించింది.కాగా ఈ నెల 22న మొదటి వన్డే, 25న రెండో వన్డే, 29న మూడో వన్డే జరగనుంది. జట్టు వివరాలుః విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్యా రహానె, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎమ్మెస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, ఆక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహెల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్.
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
Jio
జియోధనాధన్తో పోటీసంస్థల రాబడులకు బ్రేక్!
ముంబయి: బిలియనీర్ ముఖేష్ అంబానీ ప్రవేశపెట్టిన ఆర్జియో తాజా ఆఫర్తో మరోసారి టెలికాం రంగంలోని ఇతర కంపెనీలపై ఎక్కువ ప్రభావం పడేఅవకాశం ఉంది. ధనాధన్పేరుతో ఆర్జియో ట్రా§్ు నిబంధనలు ఉల్లంఘించి మరీ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టిందని టెలికాం ఇతర సంస్థలు ఆరోపిస్తున్నప్పటికీ జియో సమ్మర్సర్ప్రైజ్ ఆఫర్ను నిలిపివేసిన తర్వాత ఆర్జియో కొత్త ఆఫర్లతో మళ్లీ వస్తామంటూ తన వెబ్సైట్లు, మైజియో యాప్లలో విస్తృత ప్రచారంచేసింది. అందుకు తగ్గట్లుగానే 303 ప్లాన్కాకుండా కొత్తగాధనాధన్ ప్లాన్ను ప్రవేశ పెట్టింది. 28 రోజుల వాలిడిటీతో వరుసగా మూడు నెలలపాటు ఉచిత ఆఫర్సేవలు అందుకోవడంతో పాటు డేటా వినియోగం కూడా భారీగా పెంచింది. ప్రస్తుతం టెలికాం రంగంలో కొనసాగుతున్న ఈ అనుచితపోటీవల్ల కస్టమర్లకు కొంత లాభమే అయినా సంస్టలపై ఆర్థికభారం తప్పదని రేటింగ్, విశ్లేషణ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
ఆర్జియో ప్రవేశపెట్టిన టారిఫ్లు టెలికాం రంగంలో విధ్వంసం సృష్టంచేవిగా ఉంటాయని కేవలం ఒకే సంస్థకు లాభంతోపాటు ఇతర సంస్థలు చావుతప్పి కన్నులొట్టపోయేటట్లు చేసే పరిణామాలు ఇవేనని కోటక్ ఈక్విటీస్ బ్రోకరేజి సంస్థ ప్రకటిం చింది. దీనివల్ల ఆర్జియో మినహాయించి భారత్ లోని టెలికాం రంగ సంస్థల్లో లాభాలు వార్షికపద్ధతి లో చూస్తే 60శాతం చొప్పున దిగజారుతాయని అంచనా. 2018 ఆర్థికసంవత్సరంలోనే 20వేల కోట్లవరకూ ఉంది. దీనికితోడు టెలికాంరంగంలోని వివిధ సంస్థల రుణభారం కూడా నాలుగు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ సిఎల్ఎస్ఎ కూడా తన ఇటీవలి నివేదికలో జియో ధరల విధానంతో ఈ రంగంలోని ఇతర సంస్థల రాబడులను దెబ్బతీస్తాయని అంచనా వేసింది. రాబడులు 2018 ఆర్థికసంవత్సరంలో 184 లక్షల కోట్లకు చేరతాయని గడచిన తొమ్మి దేళ్లలో ఇవే కనిష్టస్థాయి రాబడులని అంచనావేసిం ది. ప్రస్తుతం స్టాక్ ఎక్ఛేంజిల్లో జాబితా అయిన కంపెనీల్లో ఎయిర్టెల్ వార్షిక పద్ధతిలో 25శాతం చొప్పున నిర్వహణలాభాల్లో తగ్గుదల కనిపిస్తోంది. 4400 కోట్లుగా ఉంది.
ఐడియా సెల్యులర్కు 45 శాతం నష్టం అంటే 1800 కోట్లుగా ఉంటుందని అంచనా. ఎయిర్టెల్తన ఆఫ్రికా కార్యకలాపాలు, డిటిహెచ్, వాణిజ్యసేవలు, సంస్థాగతసేవలు వంటి వాటిని మినహాయించినా రాబడులపై ఒత్తిడి పెరు గుతున్నది. ఐడియా పరంగాచూస్తే మార్చి త్రైమాసి కంలో నికరంగా రూ.1000కోట్లనష్టం చవిచూస్తుం దని అంచనా.ఏడాది క్రితం వరకూ ఐడియా 576 కోట్ల లాభాలతోనడిచింది. డిసెంబరులో 384 కోట్ల నికరనష్టం చవిచూసింది. వెయ్యికోట్ల నష్టం వాటి ల్లుతుందంటే ఎంతమేర భారీస్థాయిలో పోటీ నడు స్తుందో అవగతం అవుతుందని నిపుణులు చెపుతు న్నారు. ఎయిర్టెల్, వొడాఫోన్ తరహాలో కాకుండా మార్చినెల త్రైమాసిక అంచనాలను పరిశీలిస్తే వార్షికపద్ధతిన బేరీజువేస్తే ఐడియా తన నిర్వహణ లాభం 7200 కోట్లుగా ఉంటుందని ంచనా.
సంస్థ రుణభారం 50వేల కోట్లుగా ఉంది. మూలధన వ్యయం ఏడువేల కోట్లుగా ఉంటుంది. వడ్డీఇతర ఖర్చులకోసం 4500 కోట్లు వ్యయం అవుతుంది. వీటిని చెల్లించేందుకు కూడా మళ్లీ నిధులు సేకరిం చాల్సి ఉంటుంది. ఈపరిస్థితుల్లో చిన్న ఆపరేటర్లకు మరింత కష్టం అవుతుందని అంచనా. తమ మార్కె ట్ వాటాను సైతంసుస్థిరం చేసుకునేందుకు మరిం త కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ప్రతి వినియోగ దారుడి నుంచి వచ్చే సగటు రాబడి కూడా తగ్గుతు న్నది. తొలి త్రైమాసికంలో భారతి ఎయిర్టెల్ రూ.196 నుంచి 180కి తగ్గింది. అలాగే నాలుగో త్రైమాసికంలో 157 ఉన్న సగటు రాబడి 142కు తగ్గుతుందని అంచనా. ప్రతి త్రైమాసికం వారీగా చూస్తే సగటు రాబడులు కూడా దెబ్బ తింటున్నట్లు మోటీలాల్ ఓస్వాల్ అంచనావేసింది. దీనికితోడు జియో కొత్తగా ధనేఆధన్ పథకం కింద వన్జిబి 4జి డేటా మూడునెలల పాటు 309కే అందిస్తుం ది. ప్రైమ్సభ్యుల కోసమేనని ప్రకటించింది. నాన్ ప్రైమ్ సభ్యులు కూడా ఈ ఆఫర్ పొందేందుకు వీలుందని ఇందుకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 509 చొప్పున ప్రైమ్ సభ్యులకు 2జిబిడేటా అందుతుంది. నాన్ప్రైమ్ సభ్యులైతే రూ.408, రూ.608లు చెల్లిస్తే సరిపోతుంది.
| 1entertainment
|
Hyderabad, First Published 19, Sep 2018, 5:20 PM IST
Highlights
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమాలో ఇటీవల టైటిల్ సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు విశేష ప్రేక్షకాదరణ లభించింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమాలో ఇటీవల టైటిల్ సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు విశేష ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా చిత్రబృందం 'పెనివిటి' అనే మరో పాటను విడుదల చేసింది.
ఈ పాటలో ముందుగా ఎన్టీఆర్ కి తమ బామ్మ ''నువ్ కడుపున పడినాకే నీ అమ్మని గెలిసేసానని అనుకున్నాడో ఏందో.. దాన్ని వంటింట్లో వదిలేసి వరండాలోకి పోయి ఊరిని గెలసడం మొదలుపెట్టాడు'' అంటూ ఎన్టీఆర్ తండ్రి గురించి చెబుతుంటుంది.
పాటకు ముందు వినిపించిన ఈ మాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇక రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పాటకే హైలైట్ నిలిచింది. థమన్ అందించిన సంగీతం పాటకి ప్రాణం పోసిందనే చెప్పాలి. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
— Haarika & Hassine Creations (@haarikahassine) September 19, 2018
Last Updated 19, Sep 2018, 5:20 PM IST
| 0business
|
శ్రీదేవితో నా అనుబంధం అలాంటిది-వెంకీ
Highlights
శ్రీదేవితో అనుబంధాన్ని నెమరువేసుకున్న వెంకీ
క్షణక్షణం చిత్రంలో నటించిన శ్రీదేవి, వెంకీ
అంత్యక్రియల తర్వాత అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకున్ వెంకీ
అతిలోక సుందరి శ్రీదేవి కోట్లాదిమంది అభిమానులను విడిచి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. ఆమె నటించిన చిత్రాలు, జ్ఞాపకాలు మాత్రం సినిమా ఉన్నన్ని రోజులు ఉంటాయి. శ్రీదేవి అంత్యక్రియలకు హాజరై ముంబై నుంచి తిరిగి వచ్చిన తరువాత విక్టరీ వెంకటేష్ శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
శ్రీదేవి తెలుగులో అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలతో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాతి తరం హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జునలతో కూడా శ్రీదేవి నటించి తెలుగు వెండి తెరపై శ్రీదేవి సోయగం, నటన తెలుగువారు ఎప్పటికి మరచిపోకుండా చేసింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో దేవకన్యగా శ్రీదేవి రూపం, తన నటన వర్ణనాతీతం.
జగదేకవీరుడు అతిలోక సుందరి తరువాత శ్రీదేవి విక్టరీ వెంకటేష్ క్షణక్షణం చిత్రంలో నటించి మెప్పించింది. ఈ మూవీతో శ్రీదేవితో వెంకీకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అలాంటి నేపథ్యంలో శ్రీదేవి మరణ వార్త తెలుసుకుని వెంకీ దిగ్బ్రాంతికి లోనయ్యారు. ముంబై వెళ్లి ఆమె అంత్య క్రియల్లో పాల్గొన్నారు. తిరిగి వచ్చాక శ్రీదేవి జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు.
తమ కుటుంబం చెన్నైలో ఉన్నప్పుడే శ్రీదేవి గురించి విన్నానని వెంకీ అన్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా శ్రీదేవి సినిమాల్లోకి వచ్చినప్పుడే ఆమె గురించి తెలుసుకున్నా అని వెంకీ అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి చాలా బాగా చేస్తోంది అని అంతా అనేవాళ్ళు. శ్రీదేవి సినిమా జర్నీ మోస్ట్ రేర్ అని వెంకీ అన్నారు. శ్రీదేవి లాంటి వాళ్ళని చూస్తే వారు సినిమా కోసమే పుట్టారని అనిపిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా విజయం సాధించారు. అన్ని చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్ గా టాప్ పొజిషన్ కు చేరుకున్నారు. శ్రీదేవి ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటులతో నటించారు. ఆ తరువాత మా తరం నటులతో కూడా నటించారు అని వెంకీ తెలిపాడు. వెళ్లిన ప్రతి ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు. అదే శ్రీదేవి ప్రత్యేకత అని వెంకీ అన్నారు.
క్షణ క్షణం చిత్రంలో శ్రీదేవి హీరోయిన్ అనగానే మేమంతా చాలా ఎగ్జైట్ అయ్యాం అని వెంకీ అన్నారు. నటనలో శ్రీదేవి అప్పటికే నా కన్నా చాలా సీనియర్. క్షణ క్షణం చిత్ర క్లైమాక్స్ గమ్మత్తుగా ఉంటుంది. ట్రైన్ సన్నివేశాల్లో నేను పడిపోతే ఆమె చేయి ఇవ్వడం చాలా ఫన్నీగా ఉంటుంది. మేమిద్దరం చాలా బాగా నటించాం. కొన్ని అద్భుతమైన భావాల్ని మా నుంచి రాంగోపాల్ వర్మ రాబట్టారు. జామురాతిరి జాబిలమ్మ సాంగ్ ఓ క్లాసిక్. సాంగ్ మొత్తం నేను, శ్రీదేవి కూర్చునే హావ భావాల్ని పలికించాం అని వెంకీ అన్నారు. హీరో హీరోయిన్లు కూర్చుని సాంగ్ మొత్తం చేయడం మరెక్కడ జరగలేదు అని వెంకీ అన్నారు. శ్రీదేవి నా ఎక్స్ ప్రెషన్స్ ని గమనించే వారు, నేను ఆమె ఎక్స్ ప్రెషన్స్ ని గమనించే వాడిని. ఆ సాంగ్ మా ఇద్దరికీ మధురమైన అనుభవం అని వెంకీ అన్నారు.
మా నాన్న రామానాయుడు గారికి ఫెవరెట్ ఆర్టిస్ట్ శ్రీదేవి. ఆమె చూపించే డెడికేషన్ గురించి ఆయన ప్రశంసించే వారు. సురేష్ ప్రొడక్షన్స్ లో శ్రీదేవి ముందడుగు, తోఫా వంటి చిత్రాల్లో నటించారు. శ్రీదేవి మరణ వార్త తెలియగానే చాలా షాక్ కి గురయ్యా అని వెంకీ తెలిపాడు. వెంటనే ముంబై వెళ్లి వారి కుటుంబానికి అండగా ఉండాలని అనిపించింది. నాకు, అన్నయ్యకు బోనికపూర్, అనిల్ కపూర్ చాలా సన్నిహితులు అంటూ తన జ్ఞాపకాలు నెమరు వేసుకొన్నారు వెంకీ.
Last Updated 25, Mar 2018, 11:53 PM IST
| 0business
|
May 18,2016
మార్కెట్లోకి మోటో జీ4 స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా జీ4, జీ4 ప్లస్ స్మార్ట్ ఫోన్ల్ను భారత మార్కెట్లోకి మంగళవారం విడుదల చేసింది. మోటో జీ4 ప్లస్ 2జీబీ/16జీబీ ధర రూ. 13,299/- , జీ4 ప్లస్ 3జీబీ /32జీబీ వెరియంట్ ధర రూ. 14,999, జీ4 ధరను ఇంకా వెల్లడించలేదు. ప్రముఖ ఈ కామర్స్ ఫోర్టల్ అమెజాన్ ఇండియా ద్వారా వినియోగదారులకు వచ్చే నెలలో అందించనున్నట్టు తెలిపింది. ఈ ఫోన్ల్లో ఫీచర్లు ఇలా ఉన్నాయి. జీ4లోని ప్యూచర్స్ 5.5 ఇంచ్ పుల్ హెచ్డీ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3, 1.5 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, జీ4 2జీబీ ర్యామ్, జీ4ప్లస్ 3జీబీ ర్యామ్, జీ4 వీత్13/ జీ4ప్లస్ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ సిమ్ సదుపాయం, 4జీ సపోర్టింగ్తో, అండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు 3000 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ టార్బో పవర్ చార్జింగ్తో 15 నిమిషలలో 6గంటల చార్జింగ్ను అందిస్తుందని పేర్కొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
internet vaartha 158 Views
న్యూఢిల్లీ : వరల్డ్ టి20 టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండర్ యువరాజ్ చేసింది 24 పరుగులే అయినా భారత విజయంలో అవి కీలక ఇన్నింగ్స్. సరైన సమయంలో పరుగులు చేసిన యువరాజు భారత్ విజయంలో తన పాత్ర పోషించాడు.అయితే కీలక సమయంలో తను ఔటవడం పట్ల యువరాజ్ కొంత నిరాశకు లోనయ్యాడు.అవసరమైన సమయంలోనే బాగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నట్లు యువరాజ్ పేర్కొన్నాడు.పరిస్థితులకు తగినట్లు ఆడేందుకు తాను ప్రయత్నిస్తానని పేర్కొనని, ఆ సందర్భం పెద్దదా? చిన్నదా అనేది అవసరం లేదు,బంతని చూసి బాదేయాలనే తాను చేసినట్లు పేర్కొన్నాడు. అయితే అనుకోకుండా తాను ఔట్కావడం కొంత నిరాశకు గురిచేసిందని, దీంతో తాను ఆటను ముగించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. మంచిఫాంలో ఉన్న కోహ్లీ బాగా ఆడాడని, కెప్టెన్ ధోనీ విజయంతో ముగించేశాడని బిసిసిఐ టివితో యువరాజ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.నేను కొన్ని బంతులు నెమ్మదిగా ఆడతా,ఆ తరువాత నా శైలిలో చెలరేగిపోతా,న్యూజిలాండ్ ఓటమి తమను కొంత ఒత్తిడికి గురిచేసిందని,మేం ఆ మ్యాచ్లో అనుకున్నంతగా ఆడలేకపోయాం,పాక్ మ్యాచ్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు అని యువరాజ్ వివరించాడు.పాక్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించడం పట్ల యువరాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ జట్టుతో తదుపరి మ్యాచ్లో ఆత్మవిశ్వాసంతో ఆడే అవకాశం వచ్చిందని యువరాజ్ పేర్కొన్నాడు. ఇక తమ జట్టు మంచి ఫాంతో ముందుకు వెళుతుందన్నాడు. పాక్ మ్యాచ్లో భారత బౌలర్లు బాగా ఆడారని యువరాజ్ వివరించాడు.
| 2sports
|
Hyderabad, First Published 8, Aug 2019, 2:53 PM IST
Highlights
కింగ్ నాగార్జునకు టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ ని ప్రోత్సాహిస్తాడనే పేరుంది. ప్రస్తుతం నాగార్జున రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 చిత్రంలో నటించాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. మన్మథుడు పేరు చెప్పగానే త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో పనిచేసిన తొలి స్టార్ హీరో సినిమా నాగార్జున నటించిన నిన్నే ప్రేమిస్తా.
కింగ్ నాగార్జునకు టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ ని ప్రోత్సాహిస్తాడనే పేరుంది. ప్రస్తుతం నాగార్జున రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 చిత్రంలో నటించాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. మన్మథుడు పేరు చెప్పగానే త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో పనిచేసిన తొలి స్టార్ హీరో సినిమా నాగార్జున నటించిన నిన్నే ప్రేమిస్తా.
ఆ తర్వాత త్రివిక్రమ్ నువ్వునాకు నచ్చావ్ చిత్రంతో మాటల రచయితగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు. నాగార్జున మన్మథుడు చిత్రం త్రివిక్రమ్ లోని మాటల మాంత్రికుడిని మరోమారు బయటపెట్టింది. ఆ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు కాకున్నా ఆయన పంచ్ డైలాగ్స్ కు అంతా ఫిదా అయ్యారు.
అలా త్రివిక్రమ్ కెరీర్ ఆరంభంలో నాగార్జున చిత్రాలకు పనిచేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్. ప్రతి హీరో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని భావిస్తారు. అఖిల్ ని డైరెక్ట్ చేయాలని నాగార్జున చాలా రోజులుగా త్రివిక్రమ్ ని రిక్వస్ట్ చేస్తున్నాడట. అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు నిరాశపరచడంతో నాగార్జున ఆలోచనలో పడ్డాడు.
కానీ త్రివిక్రమ్ మాత్రం ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు కొనసాగిస్తున్నాడు. ఇదే నాగార్జున కోపానికి కారణం అయిందని ఇండస్ట్రీలో టాక్. మన్మథుడు 2 ప్రీరిలీజ్ ఈవెంట్ తో పాటు ఓ ఇంటర్వ్యూలో కూడా నాగార్జున త్రివిక్రమ్ గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు.
| 0business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.