news
stringlengths
299
12.4k
class
class label
3 classes
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV 35,000 మార్కు దాటిన సెన్సెక్స్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 292.76(0.84%) పాయింట్ల లాభంతో 35,208 వ‌ద్ద ముగియ‌గా , నిఫ్టీ 97 పాయంట్ల లాభంతో 10,715 వ‌ద్ద స్థిర‌ప‌డింది. Samayam Telugu | Updated: May 7, 2018, 04:37PM IST బీఎస్ఈ సెన్సెక్స్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ ముగిసే స‌రికి లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నడుమ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివర్లో మరింత జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఆద్యంతం మార్కెట్లు పటిష్టంగా ట్రేడయ్యాయి. చివరికి ఇంట్రాడే గరిష్టాల వద్ద మార్కెట్లు ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 292.76(0.84%) పాయింట్ల లాభంతో 35,208 వ‌ద్ద ముగియ‌గా , నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 10,715 వ‌ద్ద స్థిర‌ప‌డింది. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV మిశ్రాకు గాయం.. కుల్దీప్‌‌కు కలిసొచ్చింది బంగ్లాతో టెస్టు మ్యాచ్‌ కోసం 22 ఏళ్ల కుల్దీప్‌ యాదవ్‌కు అనూహ్యంగా జట్టులో స్థానం దక్కింది. TNN | Updated: Feb 7, 2017, 05:36PM IST బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అమిత్ మిశ్రా గాయపడటంతో అతడి స్థానంలో కుల్దీప్‌కు అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన మిశ్రా.. బంగ్లాతో టెస్టు మ్యాచ్‌కు ముందు తొలి ప్రాక్టీస్ సెషన్‌కు కూడా హాజరు కాలేదు. అతడికి విశ్రాంతి తప్పనిసరి కావడంతో హైదరాబాద్‌లో బంగ్లాతో జరగనున్నఏకైక టెస్టులో కులదీప్ ఆడనున్నాడు. మిశ్రా గాయం కారణంగా అనూహ్యంగా యాదవ్ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కే అవకాశాలున్నాయి. 22 ఏళ్ల కులదీప్ 8 రంజీ మ్యాచ్‌ల్లో 35 వికెట్లు తీయడంతోపాటు 466 రన్స్ చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇండియా -ఎ తరఫున బరిలోకి దిగిన కుల్దీప్ యాదవ్.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు.
2sports
బ్లూచిప్‌ కంపెనీల్లో మందగమనం కొన్నింటిలో భారీ ర్యాలీ ముంబయి, ఆగస్టు 5: భారత్‌ స్టాక్‌ మార్కెట్లలో భారీర్యాలీ తీసిన బ్లూచిప్‌కంపెనీల షేర్లు నేడు మందగమనంతో ట్రేడ్‌అవుతున్నాయి. శుక్రవారంమార్కెట్లలో కొన్ని ఎంపికచేసి న కంపెనీల షేర్లు నత్తనడకన సాగుతున్నాయి.రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డి ఎఫ్‌సి, భారతి ఎయిర్‌టెల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడితో కొనసాగుతున్నాయి. ఐదు బ్లూచిప్‌ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడితో సాగుతున్నట్లు అంచనా. మార్కెట్లలోట్రేడర్లు ఎక్కు వగా రిలయన్స్‌, హెచ్‌డిఎఫ్‌సి భారతి ఎయిర్‌టెల్‌ షేర్లను వియ్రించేందుకే ఆసక్తిచూపుతున్నారు. అమె రికా ఎఫ్‌డిఎ బయోకాన్‌లో లోపాలున్నాయని ఎత్తి చూపించిన తర్వాత ఆ కంపెనీ షేర్లు కూడా ఒత్తిడికి లోనవుతున్నాయి. అమెరికా ఎఫ్‌డిఎ తాము పరిశీలిం చిన ప్లాంట్‌లో పది లోపాలను ఎత్తిచూపించడంతో బయోకాన్‌ స్టాక్‌9.13శాతం దిగజారింది. కనిష్టస్థాయి లో రూ.341వద్ద నమోదయింది. ఈ ఏడాది మార్చి నెల రెండవ తేదీ మాత్రమే ఇంతటి భారీ నష్టం చవి చూసింది. నిఫ్టీ ఫార్మాసూచీలో అన్ని కంపెనీలు కూడా దాదాపు దిగజారాయి. 2.5శాతంవరకూ తగ్గింది. సూచి 90336.9 పాయింట్లవద్ద స్థిరపడింది సన్‌ఫార్మా 4.43శాతం, కేడిల్లా హెల్త్‌కేర్‌ 4.17శాతం, డా.రెడ్డీస్‌ లేబ్స్‌ 4.16 శాతం, లూపిన్‌ 3.1శాతం, సిప్లా 2.46శాతంగా దిగజారాయి. ఇదిలా ఉంటే మరో ఐదు కంపెనీలు బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌లో లాభపడుతున్నాయి. ఇండి యన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఐదుశాతం వరకూ పెరిగింది. కిరోసిన్‌పై సబ్సిడీని ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తుండటమే ఇందుకు నిదర్శనంగా చెపుతున్నారు. ఐఒసి 5.13శాతం పెరిగి 406.75 పాయింట్లవద్ద నిలిచింది. ఇక టైటాన్‌కంపెనీ షేర్లు 10.51వాతంపెరిగి 52వారాల గరిష్టానికి చేరాయి. 616.15 రూపా యలుగా ట్రేడ్‌అయ్యాయి. టాటాగ్రూప్‌కు చెంది న ఈసంస్థ తాజాగా 96.84శాతం నికర లాభాల్లో పెరుగుదల ప్రకటించింది. 237.97 కోట్లరూపాయలుగా తొలిత్రైమాసిక లాభాలను ప్రకటించింది. జ్యుయెలరీ వ్యాపారంలో విక్ర యాలు ఊపందుకోవడంతో లాభాలుపెరిగినట్లు కంపెనీ ఎండి భాస్కర్‌భట్‌ వెల్లడించారు. ఇక హీరోమోటోకార్ప్‌ షేర్లు 2.91శాతంపెరిగి 52 వారాల గరిష్టస్థాయికి అంటే రూ.3951కి చేరా యి. 17.13శాతం జూలై విక్రయాలు పెరగడ మే కీలకం. ఇక బజాజ్‌ ఫిన్‌సెర్వ్‌ కంపెనీ షేర్లు 2.92శాతంపెరిగి 5270.4 రూపాయలకు చేరాయి. కంపెనీ సుమా రు 11 శాతం వాటాను మొబైల్‌ వాయలెట్‌ కంపెనీ మొబిక్విక్‌లో కొనుగోలు చేసింది. ఈడీల్‌ విలువ రూ.225కోట్లుగాఉంది. వేదాంతగ్రూప్‌ షేర్లు 2.51 శాతం పెరిగి 287కు పెరిగాయి. అనిల్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలోని వేదాంత ఎఫ్‌టిఐ కన్సల్టింగ్‌ సంస్థ పరంగా అత్యున్నత ర్యాంకింగ్‌ను సాధించింది.
1entertainment
Visit Site Recommended byColombia ఫాంటమ్ మాజీ ఉద్యోగిని తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం తేలేవరకూ ఓ నిర్ణయానికి రాకపోవడం ఉత్తమమని చెప్పారు. తన ప్రొడక్షన్ భాగస్వాములైన అనురాగ్ కశ్యప్ , విక్రమాదిత్య మోత్వానీలు ఉద్దేశపూర్వకంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. వృత్తిపరంగా ఉన్న ద్వేషం కారణంగా అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్యలు తన పరువుకు భంగం వాటిల్లేలా ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారని తెలిపారు. పేరు ప్రతిష్టలు దిగజార్చి, తన కెరీర్‌ను నాశనం చేయాలన్న దురుద్దేశంతోనే వారు తన గురించి దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. చదవండి: #MeToo: ‘భర్త దేవుడైతే విడాకులెందుకు తీసుకున్నావ్?’ బాంబే హైకోర్టు కేసు విచారణ చేస్తుంది కనుక, తనపై ఎలాంటి చర్య తీసుకోవద్దని ఐఎఫ్‌టీడీఏను వికాస్ బెహెల్ కోరారు. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్యలపై 10 కోట్ల మేర వేసిన పరువునష్టం దావా బాంబే హైకోర్టులో ఆదివారం విచారణకు రానుంది. వికాస్ బెహెల్‌పై చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ప్రవేశపెట్టకపోతే ఆ ఇద్దరూ పరువునష్టం దావా చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: కంగనాను ఏకిపారేసిన దర్శకుడి మాజీ భార్య కాగా, #MeTooలో భాగంగా.. క్వీన్ దర్శకుడు వికాస్ తనను వేధించాడని నటి కంగనా రనౌత్ చేసిన ఆరోపణలను అతడి మాజీ భార్య రిచా దుబే ఖండించారు. ఒకరిపై ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉందని, లైంగిక వేధింపులపై జరుగుతున్న ఉద్యమాన్ని కంగనా తప్పుదోవ పట్టిస్తుందని వికాస్ మాజీ భార్య మండిపడ్డారు. ఓ పురుషుడు మిమ్మల్ని అసభ్యంగా తాకడంతో పాటు మిమ్మల్ని వేధింపులకు గురిచేస్తే అతడితో మీరు స్నేహం చేస్తారా అని మహిళల్ని ప్రశ్నించారు. చదవండి: MeToo సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రెండు సార్లు రేప్‌కు గురైనా ఆ ఫీలింగే లేదు- నిత్యామీనన్ ఎవరిమీదైనా అత్యాచారం జరిగితే పోలీస్ కేసు పెడతారు లేదా ఆ వ్యక్తిపై తిరగబడి రివేంజ్ తీర్చుకుంటారు. కాని నిత్యామీనన్ మాత్రం నాపై రెండు సార్లు రేప్ జరిగింది కాని రేప్ చేసిన సంగతి నాకు తెలియకుండానే అయిపోయింది. రేప్ ఇంత పొందికగా కూడా చేస్తారా అనిపించిందని సంచలన కామెంట్స్ చేసింది. TNN | Updated: Nov 24, 2016, 06:17PM IST ఎవరిమీదైనా అత్యాచారం జరిగితే పోలీస్ కేసు పెడతారు లేదా ఆ వ్యక్తిపై తిరగబడి రివేంజ్ తీర్చుకుంటారు. కాని నిత్యామీనన్ మాత్రం నాపై రెండు సార్లు రేప్ జరిగింది కాని రేప్ జరిగిన సంగతి నాకు తెలియకుండానే అయిపోయింది. రేప్ ఇంత పొందికగా కూడా చేస్తారా అనిపించిందని సంచలన కామెంట్స్ చేసింది. అయితే తనపై రేప్ జరిగింది రియల్ లైఫ్‌లో కాదని రీల్ లైఫ్‌లో అని చమత్కరించింది. అసలు విసయానికి వస్తే ఈ మలయాళ బొద్దుగుమ్మ నటించిన ‘ఘటన’ సినిమా ఇటీవల విడుదలైంది. ఆ సినిమా రిజల్ట్ మాట పక్కన పెడితే ఈ భామ ఘటన సినిమాపై ఒక ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాపై రెండుసార్లు అత్యాచారం జరిగిందని అయినా తనపై రేప్ జరిగినట్టు తనకు తెలియలేదని షాకిచ్చింది. ఆ రెండు సన్నివేశాలను చాలా సున్నితంగా చిత్రీకరించడంతో అసలు అప్పుడే అయిపోయిందా అని అనిపించిందని ‘ఘటన’సినిమాలో రేప్ సీన్‌ల గురించిన వివరాలను వెల్లడించింది. ఇంతకీ అంత పొందిగ్గా రేప్ చేసిన నటుడు నరేష్ కూడా ఆ సీన్‌లలో బాగా చేశావ్ అని ప్రశంసలు అందుకున్నట్లు స్వయంగా ఆయనే వివరించాడు. మొత్తానికి నిత్యమీనన్ తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడమే కాదు వీలున్నప్పుడు చలోక్తులు విసురుతూ మాటలు బాగా నేర్చుకున్నానని ఇలా ఫ్రూప్ చేసుకుంటుందన్నమాట.
0business
sandhya 147 Views ENG vs SA , Eoin Morgan Eoin Morgan ఓవెల్‌ మైదానంలో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్‌ బెయిర్‌స్టో రెండవ బంతికే ఔటయ్యాడు. కానీ రా§్‌ు, రూట్‌లు మాత్రం నిలకడగా ఆడుతూ పరుగుల ప్రవాహాన్ని సృష్టించారు. రా§్‌ు 53 బంతుల్లో 54 పరుగులు చేయగా, రూట్‌ 59 బంతుల్లో 51 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో ఇయాన్‌ మోర్గాన్‌(35), బెన్‌స్టోక్స్‌(16)లున్నారు. 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేశారు. తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV జోహో బుక్స్‌తో జ‌ట్టు క‌ట్టిన ఐసీఐసీఐ బ్యాంకు జోహో బుక్స్ దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గ‌జం ఐసీఐసీఐతో జ‌ట్టు క‌ట్టింది. దీని ద్వారా జోహో బుక్స్ వినియోగ‌దారులు డిజిట‌ల్ బ్యాంకింగ్ అనుభ‌వాన్ని పొంద‌గ‌లుగుతారు. అంతే కాకుండా ఐసీఐసీఐ క‌రెంటు ఖాతా నిర్వ‌హించేవారు త‌మ ఖాతాల‌ను జోహో బుక్స్²తో అనుసంధానం చేసుకోగ‌లుగుతారు. | Updated: Feb 12, 2018, 05:50PM IST * క్లౌడ్ఆధారిత డిజిట‌ల్ బ్యాంకింగ్ కోస‌మే... అకౌంటింగ్, బ్యాంకింగ్ వంటి స‌రికొత్త అనుభ‌వాల‌ను త‌మ క‌స్ట‌మ‌ర్లకు అందించేందుకు జోహో బుక్స్ దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గ‌జం ఐసీఐసీఐతో జ‌ట్టు క‌ట్టింది. దీని ద్వారా జోహో బుక్స్ వినియోగ‌దారులు డిజిట‌ల్ బ్యాంకింగ్ అనుభ‌వాన్ని పొంద‌గ‌లుగుతారు. అంతే కాకుండా ఐసీఐసీఐ క‌రెంటు ఖాతా నిర్వ‌హించేవారు త‌మ ఖాతాల‌ను జోహో బుక్స్²తో అనుసంధానం చేసుకోగ‌లుగుతారు. త‌ద్వారా వ్యాపార‌స్థులు డేటా ఎంట్రీ బాధ‌లు త‌ప్ప‌డంతో పాటు, ఆటోమేటిక్‌గా బిల్లు జ‌న‌రేట్ అవ‌డం, బ‌హుళ చెల్లింపు విధానాలు అందుబాటులోకి రావ‌డం వంటివి జ‌రుగుతాయి. వీటి ద్వారా మూల‌ధ‌నం కోసం రుణాలు స‌మ‌కూర్చ‌డం, నేరుగా ఖాతా నుంచే స‌ర‌ఫ‌రాదారుల‌కు బిల్లు చెల్లింపు చేయ‌డం వంటివి చేయ‌వ‌చ్చు.
1entertainment
యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ First Published 30, Oct 2017, 1:12 PM IST యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ Recent Stories
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రైనా ఆ దూకుడేంది..? జట్టులో ఇక ఫిక్స్..! భారత్ టీ20 జట్టులోకి ఏడాది తర్వాత పునరాగమనం చేసిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా తన స్థానాన్ని సుస్థిరం TNN | Updated: Feb 25, 2018, 11:15AM IST రైనా ఆ దూకుడేంది..? జట్టులో ఇక ఫిక్స్..! భారత్ టీ20 జట్టులోకి ఏడాది తర్వాత పునరాగమనం చేసిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో శనివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సురేశ్ రైనా కేవలం 27 బంతుల్లోనే 5x4, 1x6 సాయంతో 43 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఓపెనర్ శిఖర్ ధావన్‌ (47: 40 బంతుల్లో 3x4)తో కలిసి రెండో వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగలిగింది.
2sports
zero balance savings account: sbi vs hdfc bank SBI, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు.. పూర్తి వివరాలు! కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ప్రారంభించొచ్చు. స్టేట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. Samayam Telugu | Updated: Nov 4, 2019, 09:49AM IST SBI, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు.. పూర్తి వివరాలు! హైలైట్స్ స్టేట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరవొచ్చు ఈ అకౌంట్లపై పలు పరిమితులు ఉంటాయి బ్యాంక్ ప్రాతిపదికన అకౌంట్ ప్రయోజనాల్లో మార్పు ఉచిత ఏటీఎం కార్డు, పాస్‌బుక్ వంటి సేవలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని టాప్ 2 బ్యాంకులు ఇవి. దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా ఎస్‌బీఐ కొనసాగుతూ ఉంటే.. ప్రైవేట్ రంగంలో టాప్ బ్యాంక్‌గా హెచ్‌డీఎఫ్‌సీ కొనసాగుతోంది. చాలా మంది ఈ బ్యాంకుల్లో అకౌంట్ తెరవాలని భావిస్తూ ఉంటారు. వీరికి శుభవార్త. ఈ బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి బ్యాలెన్స్ లేకుండానే అకౌంట్ తెరవొచ్చు. అయితే జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై కొన్ని పరిమితులు ఉంటాయి. Visit Site Recommended byColombia హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంకుల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ల బెనిఫిట్స్, ఫీచర్లు వేర్వురుగా ఉంటాయి. అవేంటో చూద్దాం.. SBI zero balance savings account భారతీయ పౌరులందరూ ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ తెరవొచ్చు. ఒకరు లేదా ఇద్దరు కలిసి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. రెగ్యులర్ ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వడ్డీ రేటే ఈ ఖాతాలకు కూడా వర్తిస్తుంది. జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లో డిపాజిట్లకు ఎలాంటి నియంత్రణ లేదు. Also Read: ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ‘అకౌంట్ స్టేటస్‌’ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవద్దు.. లేదంటే.. కస్టమర్లు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేసుకున్నా కూడా చార్జీలు పడవు. ఖాతాదారులకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు ఇస్తారు. ఎలాంటి మెయింటెనెన్స్ చార్జీలు ఉండవు. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవలు ఉచితం. నెలకు ఏటీఎం నుంచి 4 సార్లు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. HDFC Bank zero balance savings account హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో గతంలో ఎన్నడూ ఎలాంటి అనుబంధం లేని వారు జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్‌లో నెలకు రూ.50,000 మించి డబ్బులు ఉండకూడదు. అలాగే నెలకు రూ.10,000 వరకు మాత్రమే డబ్బులను విత్‌డ్రా లేదా ట్రాన్స్‌ఫర్ చేసుకోగలం. ఒక ఆర్థిక సంవత్సరంలో అకౌంట్ క్రెడిట్స్ విలువ రూ.లక్ష దాటకూడదు. Also Read: ఎస్‌బీఐ బంపరాఫర్.. 35 శాతం తగ్గింపు + 10 శాతం క్యాష్‌బ్యాక్.. 6 రోజులే గడువు! బ్యాంక్‌లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ కలిగి వారికి పాస్‌బుక్ ఉచితంగానే లభిస్తుంది. క్యాష్ డిపాజిట్, చెక్ బుక్ డిపాజిట్ సేవలు కూడా ఉచితమే. రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు అందజేస్తారు. నెలకు 4 సార్లు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV టెస్టులకి స్పిన్నర్ రంగనా హెరాత్ వీడ్కోలు..! టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతి వాటం స్పిన్నర్‌గా రికార్డుల్లో కొనసాగుతున్న హెరాత్.. గత ఎనిమిదేళ్ల కాలంలో శ్రీలంక జట్టు మొత్తం 81 టెస్టులు ఆడితే ఏకంగా 70 టెస్టుల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. Samayam Telugu | Updated: Oct 22, 2018, 04:17PM IST శ్రీలంక సీనియర్ స్పిన్నర్ రంగనా హెరాత్ టెస్టు క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్‌తో నవంబరు 6 నుంచి గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్.. తన కెరీర్‌లో ఆఖరిదని సోమవారం హెరాత్ ప్రకటించాడు. గాలే వేదికగా 1999లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్.. ఆ స్టేడియంలోనే రిటైర్మెంట్ తీసుకోబోతుండటం విశేషం. 19 ఏళ్ల కెరీర్‌లో మొత్తం 92 టెస్టులాడిన హెరాత్ 430 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అతని తర్వాత స్థానం హెరాత్‌దే. ప్రపంచవ్యాప్తంగానూ ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న బౌలర్లలో ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ (564), స్టువర్ట్ బ్రాడ్ (433) తొలి రెండు స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో హెరాత్ కొనసాగుతున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతి వాటం బౌలర్‌ కూడా రికార్డుల్లో కొనసాగుతున్న హెరాత్.. గత ఎనిమిదేళ్ల కాలంలో శ్రీలంక జట్టు మొత్తం 81 టెస్టులు ఆడితే ఏకంగా 70 టెస్టుల్లో తుది జట్టులో ఉన్నాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV విరాట్ కొహ్లీని దాటేశాడు.. డోపింగ్ లో పట్టుబడ్డాడు..! అఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ షాజాద్ డోప్ టెస్టులో పట్టుబడ్డాడు. TNN | Updated: Apr 14, 2017, 03:59PM IST ​అఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ షాజాద్ డోప్ టెస్టుల్లో దొరికాడు. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినందుకు గానూ ఇతడిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఈ అఫ్ఘన్ వికెట్ కీపర్ కమ్ స్టార్ బ్యాట్స్ మన్ పై ఈ సస్పెన్షన్ సంచలనంగానే మారింది. అరుదుగా మాత్రమే క్రికెట్ లో డోపీలు అగుపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఇంకా అంతగా గుర్తింపుకు నోచుకోని అఫ్ఘనిస్తాన్ జట్టుకు చెందిన ఆటగాడు చేరడం విశేషం. ఇతడు టెస్టు హోదా లేని అఫ్ఘన్ జట్టు క్రికెటరే కానీ.. వ్యక్తిగత ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో చాలా మంచి స్థానాల్లో ఉన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో ఇటీవలే ఇతడు టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీని కూడా దాటేశాడు.
2sports
హైకాన్ నుండి కొత్త సోలార్ హీటర్స్ కోచి (ఏజెన్సీ)| Selvi| Last Modified గురువారం, 4 అక్టోబరు 2007 (15:52 IST) ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హైకాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. దేశంలోనే తొలిసారిగా కొత్తరకం సోలార్ హీటర్స్‌ను విడుదల చేసింది. ఈ విషయాన్ని కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి క్రిష్టో జార్జి బుధవారం విలేకరులకు తెలిపారు. ఆయన ఈ సోలార్ హీటర్ ప్రాధాన్యత గురించి వివరిస్తూ...ఈ సోలార్ హీటర్ బాల్కనీ, కిటికిలకు బిగించి ఉపయోగించవచ్చునని ఆయన అన్నారు. వీటి ధర రూ. 19,750 నిర్ణియించామని ఆయన చెప్పారు. ఈ హీటర్లను పారిశ్రామిక, గృహ అవసరాలకు వినియోగించవచ్చునని ఆయన వెల్లడించారు. వీటిని సబ్సీడీలకు కూడా సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. ఈ హీటర్లకు అవసరమైన ముఖ్య విడిభాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్నామి, వీటిని కేరళలోని త్రిసూర్‌లో తయారు చేస్తున్నామని జార్జీ పేర్కొన్నారు. సంబంధిత వార్తలు
1entertainment
Hyderabad, First Published 29, Sep 2018, 10:19 PM IST Highlights బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం ఎపిసోడ్ తో పూర్తి కానుంది. దీంతో హౌస్ లో సందడి మరింత ఎక్కువైంది. శుక్రవారం నాడు హౌస్ లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ తీసుకొచ్చారు. నూతన్ నాయుడు తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ కి వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.  బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం ఎపిసోడ్ తో పూర్తి కానుంది. దీంతో హౌస్ లో సందడి మరింత ఎక్కువైంది. శుక్రవారం నాడు హౌస్ లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ  తీసుకొచ్చారు. నూతన్ నాయుడు తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ కి వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. శనివారం ఎపిసోడ్ లో రోల్ రైడా, అమిత్ లు యాంకర్లుగా మారి బిగ్ బాస్ హౌస్ ని పార్టీ హౌస్ గా మార్చేశారు. ముందుగా గీతామాధురి పాటలతో హౌస్ లో అందరూ డాన్స్ లు చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత హౌస్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ ఇచ్చిన ప్రశ్నలని అడిగి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ నిర్వహించారు. అనంతరం కంటెస్టెంట్స్ అందరికీ బిగ్ బాస్ వారి పెర్సనాలిటీకి తగ్గట్లు అవార్డుల లిస్ట్ ని ఇచ్చారు. ఎవరెవరు ఏ ఏ అవార్డులు దక్కించుకున్నారో చూద్దాం..
0business
Visit Site Recommended byColombia అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.230 తగ్గింది. దీంతో ధర రూ.36,350కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా పడింది. రూ.150 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,600కు పడిపోయింది. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 తగ్గింది. దీంతో ధర రూ.38,370కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 తగ్గుదలతో రూ.37,100కు దిగొచ్చింది. Also Read: ఎస్‌బీఐ అదిరిపోయే స్కీమ్‌.. దీంతో కస్టమర్లకు ప్రతి నెలా ఆదాయం..! బంగారం ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.150 క్షీణించింది. దీంతో ధర రూ.48,600కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. Also Read: ట్రైన్ టికెట్‌ను ఇలా ‘ఫాస్ట్‌’గా బుక్ చేసుకోండి.. చాలా సింపుల్! అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. ఔన్స్‌కు 0.46 శాతం తగ్గుదలతో 1,459.60 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 1.44 శాతం క్షీణతతో 16.76 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. Also Read: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌ న్యూస్.. 3 కొత్త సర్వీసులు లాంచ్ చేసిన ఈపీఎఫ్‌వో! బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. Also Read: బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం.. ఏకంగా రూ.2,000 పతనమైన ధర!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
sandhya 83 Views stock markets stock markets ముంబై: బుధవారం నాడు దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ఆరంభమయ్యాయి. బిఎస్‌ఈ 7 పాయింట్లు స్వల్ప లాభంతో 39,138 వద్ద కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌ఈ 5 పాయింట్లు లాభంతో 11,667 వద్ద ట్రేడవుతుంది. అమెరికా, చైనా వాణిజ్యం చర్చల విషయంలో ఆస్థిరత నెలకొన్న నేపథ్యంలో అక్కడి మార్కెట్లు మంగళవారం నష్టాల బాట పట్టాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 68.78 వద్ద కొనసాగుతుంది. తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/
1entertainment
35వేల మైలురాయిని దాటిన సెన్సెక్స్‌ - మార్కెట్‌ చరిత్రలోనే అరుదైన రికార్డు - 10,788 పాయింట్లకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ - 'అదనపు అప్పు'ల్లో కోత మద్దతు - బ్యాంకింగ్‌ షేర్ల దన్ను ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నూతన రికార్డులను చేరాయి. సెన్సెక్స్‌ చరిత్రలోనే తొలిసారి 35వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రభుత్వం అప్పుల సమీకరణ ప్రణాళికలను తగ్గించుకుంటున్నట్టు ప్రకటించడంతో బుధవారం మార్కెట్లు పరుగులు పెట్టాయి. మార్కెట్‌ బాండ్ల నుంచి అదనంగా రూ.50వేల కోట్లు సమీకరించనున్నట్టు ఇది వరకు ప్రకటించిన ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.20,000 కోట్లకు తగ్గించుకుంటున్నట్టు వెల్లడించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఐటీ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. మరోవైపు క్రితం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కార్పొరేట్‌ కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తుండటంతో మార్కెట్లపై ఆశలు మరింత పెరిగాయి. దీంతో విదేశీ, స్వదేశీ మదుపర్లు భారీగా కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ పరిణామాల మధ్య బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 310.77 పాయింట్లు పెరిగి 35,081కు చేరింది. 34,753 వద్ద మొదలైన సూచీ ఇంట్రా ట్రేడింగ్‌లో 34,700 కనిష్ట స్థాయిని తాకి అనంతరం కొనుగోళ్ల మద్దతుతో 35,118.61 గరష్ట స్థాయిని తాకింది. జనవరి 15న ఈ సూచీ 34,843.51 గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 88.1 పాయింట్లు పెరిగి 10,788.55కు చేరింది. ఇంట్రా ట్రేడింగ్‌లో 10,803-10,783 మధ్య నమోదయ్యింది. రంగాలన్నీ... బీఎస్‌ఈలో అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీ అత్యధికంగా 1.59 శాతం పెరిగింది. ఇదే క్రమంలో బ్యాంకింగ్‌ 1.55 శాతం, పీఎస్‌యూ 1.41 శాతం, ఐటీ 1.28 శాతం చొప్పున రాణించి మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్‌లో యాక్సిస్‌ బ్యాంకు 4.65 శాతం, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా 3.44 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 2.68 శాతం, ఇన్ఫోసిస్‌ 2.61 శాతం, యెస్‌ బ్యాంకు 2.58 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు విప్రో 1.85 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 0.88 శాతం, హీరో మోటో కార్ప్‌ 0.8 శాతం, ఓఎన్‌జీసీ 0.74 శాతం, హెచ్‌యూఎల్‌ 0.68 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో కార్పొరేట్‌ కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయనే అంచనాల్లో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఇంతక్రితం సెషన్‌లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.693.17 కోట్ల విలువ చేసే ఈక్విటీలు కొనుగోలు చేశారు. కాగా దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.246.38 కోట్ల విలువ చేసే ఈక్విటీలు సొంత చేసుకున్నారు. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసల మేర పుంజుకుంది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పెద్ద నోట్లు రద్దు చేయడంతో అప్పుడు చాలా వరకూ కార్పొరేట్‌ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆ త్రైమాసికంతో పోల్చితే క్రితం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండనున్నాయనే సంకేతాలు కలిసి వచ్చాయి. ఐటీ షేర్ల పరుగు.. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ తగ్గడంతో ఐటీ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ సూచీ వరుసగా ఎనిమిదో సెషన్‌లోనూ పెరిగింది. ఇన్ఫోసిస్‌ 3.5 శాతం ర్యాలీ చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ 2.6 శాతం పెరిగింది. దీంతో ఐటీ సూచీ 1.8 శాతం రాణించింది. ఎన్‌ఎస్‌ఈ బ్యాంకింగ్‌ సూచీలో పీఎన్‌బీ 6.61 శాతం, బీవోబీ 5.38 శాతం, కెనరా బ్యాంకు 4.49 శాతం, ఎస్‌బీఐ 4.04 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3 శాతం, యాక్సిస్‌ బ్యాంకు 2 శాతం చొప్పున రాణించాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Dec 01,2018 తీవ్ర స్తబ్దతలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ముంబయి: దేశ వృద్ధి రేటు గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్తబ్దతతో కొనసాగాయి. అంతకు ముందు నాలుగు సెషన్లలో మెరుగ్గా రాణించిన స్టాక్‌ మార్కెట్లు శుక్రవారానికి కొంత మందగించాయి. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థకు చెందిన గణాంకాలు శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ప్రకటించే సన్నాహాలు చేసింది. దీంతో మదుపరులు ఉదయం నుంచే అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఆచితూచి ట్రేడింగ్‌ను నిర్వహించారు. దీంతో స్వల్ప లాభాల దరిదాపుల్లోనే సూచీలు తచ్చాడాయి. తుదకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 23.89 పాయింట్లు పెరిగి 36,194.30 పాయింట్ల వద్ద ముంగిసింది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 18.05 పాయింట్లు రాణించి 10,876.75 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో యెస్‌ బ్యాంకు 5.73 శాతం, విప్రో 3.14 శాతం, కొటాక్‌ బ్యాంకు 2.44 శాతం చొప్పున రాణించి అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో నిలిచాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మహానుభావుడు ట్రైలర్: ఊపిరి పీల్చుకోనీయట్లేదు! ‘నా పేరు ఆనంద్‌. నాకు ఓసీడీ ఉంది. ఓసీడీ అంటే బీటెక్‌, ఎంటెక్ లాంటి డిగ్రీలు కాదు. డిజార్డర్‌. ఈ వ్యాధి లక్షణం అతిశుభ్రం’ TNN | Updated: Sep 18, 2017, 08:15PM IST నా కళ్లు బురదను మాత్రమే చూస్తాయి.. తుమ్మొచ్చినా దూరంగా పారిపోండంటూ అతి శుభ్రాన్ని ప్రదర్శిస్తున్నాడు ‘మహానుభావుడు’. అమ్మాయి ముద్దుస్తా రా అంటే బ్రష్ చేశావా అంటూ టీజర్‌లో అడిగిన ఈ మహానుభావుడు తాజా ట్రైలర్‌లోనూ తన రోగాన్ని వదల్లేదు. వరుస హిట్‌లతో జోరు మీద ఉన్న ‘శర్వానంద్’ తాజాగా మారుతి దర్శకత్వంలో ‘మహానుభావుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుండటంతో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈయనే ఆనంద్.. ఇతడికి ఓసీడీ ఉంది. ఓసీడీ అంటే బీటెక్‌, ఎంటెక్ లాంటి డిగ్రీలు కాదు. డిజార్డర్‌. ఈ వ్యాధి లక్షణం అతిశుభ్రం’అదే ఈ మహానుభావుడికి ఉంది. అలాంటి ఆనంద్ బురదలో దొర్లి మరీ ఫైట్ చేసే పరిస్థితి వచ్చింది. మనం దేన్నైతే అసహ్యించుకుంటామో దేవుడు అందులోనుంచే ముంచి లేపుతాడంటూ ‘మహానుభావుడ్ని’ చివర్లో మార్చే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు మారుతి. హీరోకి ఉండే అతి శుభ్రత వ్యాధిని ఆధారంగా చేసుకుని ‘మహానుభావుడు’ కథను అల్లాడు. మరి మనోడి అతిశుభ్రం ఎలా ఉంటుందో తెరపై చూడాల్సిందే అన్నట్టు ట్రైలర్‌ను కట్ చేశారు.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV టాటూస్ వేసుకుంటేనే జట్టులో చోటిస్తారా..? శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ జట్టు క్లీన్‌స్వీప్ చేసినా.. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం సెలక్టర్ల తీరుపై TNN | Updated: Sep 4, 2017, 01:06PM IST శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ జట్టు క్లీన్‌స్వీప్ చేసినా.. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం సెలక్టర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అజింక్య రహానె, భువనేశ్వర్ కుమార్, చాహల్ లాంటి ప్రతిభావంతమైన క్రికెటర్లకి ఈ సిరీస్‌లో సెలక్టర్లు తగిన అవకాశాలు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ముఖ్యంగా ఈ సిరీస్‌కి ముందు వెస్టిండీస్‌తో సిరీస్‌లో మెరుగ్గా రాణించిన అజింక్య రహానెకి చివరి వన్డే వరకూ ఎందుకు ఛాన్సివ్వలేదని ప్రశ్నించారు. చిత్రమైన కేశాలంకరణ, టాటూస్ వేసుకున్న వారికి మాత్రమే తుది జట్టులో చోటిస్తారేమో అని వ్యంగ్యంగా విమర్శించారు. ‘వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఫామ్ చాటుకున్న అజింక్య రహానె.. గాయం తర్వాత పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో అతనేమైనా బాగా ఆడాడా..? అంటే అదీ లేదు. అతని బ్యాటింగ్ స్థానాన్ని ముందుకు.. వెనక్కి జరిపి విఫలమయ్యేలా టీమ్ మేనేజ్‌మెంట్ చేసింది. ఇక తుది జట్టులో రహానె, భువనేశ్వర్, చాహల్‌కి సరైన అవకాశాలు ఇవ్వలేదు. చిత్రమైన కేశాలంకరణ, టాటూస్ వేసుకున్న క్రికెటర్లకి మాత్రమే తుది జట్టులో చోటిస్తారేమో..?’ అని గవాస్కర్ విమర్శించారు. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యని ఉద్దేశించి ఈ దిగ్గజ క్రికెటర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
2sports
May 19,2015 మ్యాట్‌కు 'షా' పరిష్కారం: జైట్లీ           న్యూఢిల్లీ : విదేశీ సంస్థాగత మదుపర్ల లాభాలపై కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్‌)పై జస్టిస్‌ షా కమిటీ పరిష్కారాలను చూపిస్తుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఈ కమిటీ ఇతర ముఖ్యమైన పన్ను కేసులను కూడా పరిగణలోకి తీసుకుంటుందన్నారు. ఎఫ్‌ఐఐలు మ్యాట్‌ చెల్లించాలని అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (ఎఎఆర్‌) 2012 సూచిస్తుందన్నారు. గతంలో జరిగిందానికి తమ చేతిలో ఏమి లేదన్నారు. ఈ నేపధ్యంలోనే ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశామన్నారు. 68 ఎఫ్‌ఐఐలు భారత్‌కు సుమారు రూ.602.83 కోట్ల లెవీ చెల్లించాల్సి ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 161 Views రియో డిజెనీరో : భారత అగ్రశ్రేణి షట్లర్‌ పివి సింధు రియో ఒలింపిక్స్‌లో శుభారంభం చేసింది.కాగా మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ గ్రూపు దశ మ్యాచ్‌లో హంగేరికి చెందిన సరోసి లారాను 2-0తో ఓడించింది.29 నిముషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఆది నుంచి దూకుడు కనబరిచిన సింధు 21-8,21-9తో ప్రత్యర్థిని చిత్తుచేసింది.
2sports
DHANALAKSHMI కెనరా హెచ్‌ఎస్‌బిసితో ధనలక్ష్మిబ్యాంకు టైఅప్‌ హైదరాబాద్‌, జూలై 8: కెనరా, హెచ్‌ఎస్‌బిసి ఓరియం టల్‌బ్యాంక్‌ ఆఫ్‌కామర్స్‌బీమా కొత్తగా ధనలక్ష్మి బ్యాంకుతో టైఅప్‌చేసుకుని బీమా పథకాలను విక్రయిం చేందుకు నిర్ణ యించింది. కెనరాహెచ్‌ఎస్‌బిసి ఓరియంటల్‌బీమా ఒక్కటే బ్యాంకుశాఖలద్వారా విస్తృతంగా బీమాఉత్పత్తులను విక్ర యిస్తోంది. ఇపుడు ధనలక్ష్మిబ్యాంకు ఖాతాదారులకు ఈ బీమాపథకాలు అందుబాటులోఉంటాయి. పూర్తిగాబ్యాంకు అస్యూరెన్స్‌ విధానంలో దేశవ్యాప్తంగా 115మిలియన్ల కస్టమర్లకుసేవలందిస్తోంది. మొత్తం మూడు భాగస్వామ్య బ్యాంకులకు ఉన్న 9500శాఖలద్వారా బీమా ఉత్పత్తులు అందిస్తోంది. ధనలక్ష్మీ బ్యాంకు 260శాఖలు, 371 ఎటిఎంలు 129నగరాల్లో విస్తరించింది. 20లక్షలమందికి పైగా ఉన్న కస్టమర్లకు ఇపుడు కెనరా హెచ్‌ఎస్‌బిసి ఓరి యంటల్‌బీమా ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. మూడేళ్లపాటు ఈఒప్పందంఅమలులోఉంటుంది. బ్యాంకు కార్పొరేట్‌ ఏజెంట్‌గాపనిచేస్తుంది. ఈ ఒప్పందంపై బీమా కంపెనీ సిఇఒ అనూజ్‌మాధుర్‌ హర్షం ప్రకటించారు. బ్యాంకు ఎండి సిఇఒ జి.శ్రీరామ్‌మాట్లాడుతూ కెనరా హెచ్‌ఎస్‌బిసితోభాగస్వామి కావడంవల్ల బీమా ఉత్పత్తులు కస్టమర్లకు చేరువ చేయగలుగుతున్నట్లు వివరించారు.
1entertainment
"రాధా" పోలీసుల విలువను పెంచే సినిమా: బీవీఎస్ఎన్ ప్రసాద్ Highlights రాధా చిత్రం సక్సెస్ పై నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ పోలీసులకు గౌరవాన్ని పెంచే సినిమా రాధా ఎస్ వీ సీసీ బేనర్ లో తదుపరి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర అధినేత బీవీఎస్ఎన్ ప్రసాద్ తాజాగా శర్వానంద్ కథానాయకుడిగా చంద్రమోహన్ దర్శకత్వంలో రూపొందిన 'రాధ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. నిన్ననే ఈ సినిమా భారీ స్థాయిలో  రిలీజై పాజిటివ్ టాక్ సాధించింది.  ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడారు. దర్శకుడు చంద్రమోహన్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడనీ, శర్వానంద్ తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయాడని చెప్పారు.   పోలీసుల పట్ల విలువను పెంచే చిత్రమనీ .. ప్రతి పోలీస్ చూడదగిన సినిమా అని అన్నారు. ప్రేక్షకుల మధ్యలో కూర్చుని తాను ఈ సినిమా చూశాననీ, వాళ్ల నుంచి వస్తోన్న రెస్పాన్స్ తనకి ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. త్వరలో తమ బ్యానర్లో రానున్న సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా ఉంటాడనీ, వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని అన్నారు. భారీ వసూళ్లతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. Last Updated 25, Mar 2018, 11:54 PM IST
0business
internet vaartha 233 Views ముందు వరుసలో కోహ్లీ, డేెవిడ్‌, డివిలియర్స్‌, గంభీర్‌ న్యూఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ భారతీయ క్రికె ట్‌కు మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేయ డానికి బిసిసిఐని మరింత బలోపేతం చేసేందుకు వెలసిన టోర్నీ. ప్రతి ఏటా యువకిశోరాలను టీమిండియాకు పరిచయం చేసిన ఐపిఎల్‌ ఈసారి ఎవరికి ఎలాంటి అవకాశాలు కల్పించింది ? టోర్నీ ద్వారా లాభపడింది ఎవరు? అనే అంశాలను పరిశీలిస్తే ఈ సారి బ్యాటింగ్‌ పరంగా ఐపిఎల్‌లో కొత్త ముఖాలు మెరువలేదు. గత ఏడాది కొన్ని మెరుపులు మెరిపించిన స్టార్‌ ఆటగాళ్ల హోదా సొంతంచేసుకున్న సర్పరాజ్‌ఖాన్‌, సంజూ శాంసన్‌, మనీష్‌ పాండే, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ తదితరులు ఈసారి పేలవమైన ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. అదే సమయంలో స్టార్‌ ఆటగాళ్లు మాత్రం జట్టు యాజమాన్యాలు తమపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 919 పరుగులు చేశాడు. టోర్నీలో బాగా ఆడిన ఆటగాడిగా కోహ్లీ ఆరేంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకోగా, ఐపిఎల్‌లో కోహ్లీ ఆటతీరు అతనని సచిన్‌ సరసకు నిలబెట్టింది. అతని తరువాత స్థానంలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ నిలిచాడు. కాగా డేవిడ్‌ 15 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ ఏడు హాఫ్‌ సెంచరీల సాయంతో 686 పరుగులు చేశాడు. సన్‌ రైజర్స్‌ జట్టు పైనల్‌ చేరి టైటిల్‌ సాధిస్తే గతంలో డక్కన్‌ చార్జెస్‌కు గిల్‌క్రిస్ట్‌ టైటిల్‌ అందించగా పేరు, యాజమాన్యం మారిన జట్టుకు వార్నర్‌ టైటిల్‌ సాధించిన వాడు అవుతాడు.అతని తరు వాత స్థానంలో డివిలియర్స్‌ నిలిచాడు. ఒక సెంచరీ సాయంతో డివిలియర్స్‌ 682 పరుగులు చేశాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫైనల్‌కు చేరిం దంటే దానికి కారణం కేవలం కోహ్లీ, డివిలియర్స్‌ బాగా ఆడటమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తరువాత స్థానంలో 501 పరుగులతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ గంభీర్‌ నిలిచాడు. అతని తరువాత ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 489 పరుగులు, అజింక్యా రహానే 480 పరుగులు,శిఖర్‌ ధావన్‌ 473 పరుగులు, మురళీ విజయ్ 453 పరుగులు, క్వింటస్‌ డికాక్‌ 445 పరుగులు, సురేష్‌ రైనా 398 పరుగులతో వరుసగా నిలిచి ఆకట్టుకున్నారు. వీరిలో కోహ్లీ, డేవిడ్‌ వార్నర్‌,డివిలియర్స్‌, ధావన్‌, రైనా తదితరులు ఇంకామ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా టోర్నీ ముగిసే సరికి అత్యధిక పరుగుల వీరుడిగా కోహ్లీ నిలుస్తారనడంతో సందేహం లేదు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV చెత్త రికార్డ్ ముంగిట శిఖర్ ధావన్..! ఆస్ట్రేలియాతో మొహాలి వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి నాలుగో వన్డే జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో ధావన్ సెంచరీ సాధించలేకపోతే..? కెరీర్‌లోనే అత్యంత పేలవ రికార్డ్‌‌ని సవరించినట్లవుతుంది. Samayam Telugu | Updated: Mar 9, 2019, 06:58PM IST చెత్త రికార్డ్ ముంగిట శిఖర్ ధావన్..! హైలైట్స్ చివరిగా ఆడిన 17 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయిన శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో మొహాలి వేదికగా ఆదివారమే నాలుగో వన్డే ప్రపంచకప్ ముందు టీమిండియ ా ఆడేది రెండు వన్డేలే ఐదేళ్ల క్రితం ఇలానే పేలవ రికార్డ్‌ నెలకొల్పిన ధావన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న శిఖర్ ధావన్ .. కెరీర్‌లో చెత్త రికార్డ్ ముంగిట నిలిచాడు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు ముగియగా.. కేవలం 22 పరుగులే చేసిన ధావన్.. చివరిగా ఆడిన 17 మ్యాచ్‌ల్లో కనీసం ఒక సెంచరీ కూడా సాధించలేకపోయాడు. గడిచిన ఐదేళ్లలో ధావన్ ఇలా వరుసగా ఇన్ని మ్యాచ్‌లు విఫలమవడం ఇదే తొలిసారి. దీంతో.. వన్డే ప్రపంచకప్ ముంగిట ఈ ఓపెనర్ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. 2013 డిసెంబరు నుంచి 2014 అక్టోబరు వరకూ ఇదే తరహాలో వరుసగా 17 ఇన్నింగ్స్‌ల్లో ఫెయిలైన ధావన్ ఆ తర్వాత జోరు అందుకుని రెగ్యులర్ ఓపెనర్‌గా జట్టులో సెటిలయ్యాడు. అయితే.. ఈ ఏడాది మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. ఈ మెగా టోర్నీ కంటే ముందు భారత్ జట్టు కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడే అవకాశం ఉండటంతో.. ఈ సీనియర్ ఓపెనర్ ఫామ్‌పై ఇప్పుడు జట్టులో ఆందోళన మొదలైంది. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ అందుబాటులో ఉన్నప్పటికీ.. కుడి -ఎడమ చేతి వాటం ఓపెనింగ్ జోడీ వరల్డ్‌కప్‌లో టీమిండియాకి లాభిస్తుందని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఆస్ట్రేలియాతో మొహాలి వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి నాలుగో వన్డే జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో ధావన్ సెంచరీ సాధించలేకపోతే..? కెరీర్‌లోనే అత్యంత పేలవ రికార్డ్‌‌ని సవరించినట్లవుతుంది..!!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
May 30,2018 సమ్మోహనంగా మహీంద్రా లాభాలు న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ మహీందా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) మార్చితో ముగిసిన త్రైమాసికానికి మేటి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి మధ్య కాలంలో యుటిలిటీ వాహనాలు, ట్రాక్లర్ల అమ్మకాల్లో మెరుగై విక్రయాలు నమోదైన నేపథ్యంలో కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి సంస్థ నికర లాభం దాదాపు 50 శాతం మేర పెరిగి రూ.1,155 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో సంస్థ రూ.770 కోట్ల లాభాన్ని ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో సంస్థ ఆదాయం, ఇతర ఆదాయం దాదాపు 24 శాతం మేర పెరిగి రూ.13,355 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది సంస్థ ఆదాయం రూ.10,795 కోట్లుగా ఉంది. మార్చితో ముగిసిన మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ నికర లాభం రూ.4,623 కోట్లుగా నిలిచింది. గత ఏడాది రూ.3,924 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 18 శాతం అధికం. ఇదే సమయంలో సంస్థ ఆదాయం 14 శాతం మేర పెరిగి రూ.42,584 కోట్ల నుంచి రూ.48,529 కోట్లకు చేరుకుంది. మార్చి త్రైమాసికంలో సంస్థ యుటిలిటీ వాహనాల విక్రయాల్లో 20%, ట్రాక్టర్ల విక్రయాల్లో 44 శాతం వృద్ధి నమోదు అయింది. గడిచిన రెండు సంవత్సరాలుగా సమృద్ధిగా వర్షాలు కురియడం, వ్యవసాయం, గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుండడం మూలంగా మెరుగైన అమ్మకాలు నమోదు అయినట్టుగా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మెరుగై ఆర్థిక ఫలితాల నేపథ్యంలో వాటాదారులకు బోనస్‌ అనంతరం రూ.5 ముఖ విలువ కలిగిన షేరు ఒక్కింటికి రూ.7.50 తుది డివిడెండ్‌ను ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Vaani Pushpa 104 Views captaincy , RICKY PONTING , STEVE SMITH ricky ponting సిడ్ని. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్‌ మళ్లీ బాధ్యతలు చెపట్టాలని ఆస్ట్రెలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కెప్టెన్‌ టీమ్‌పై బ్యాంటింగ్‌ విఫలమవుతుండడంతో జట్టులో అతడి స్థానంపై ఊహగానాలు వస్తున్నాయి. ఈ సందర్భంగా స్టీవ్‌స్మిత్‌ తిరిగి కెప్టెన్సి భాద్యతలు అందుకోవాలనే అక్కడి అభిమానులు భావిస్తున్నారు. టీమ్‌లో ఎన్ని రోజులు కొనసాగుతాడో అతని ఇష్టం కాని కెప్టెన్సి విషయంలో విఫలమయ్యాడు. వికెట్‌ కీపర్‌గా అత్యుతమ ఆటగాడు కాని కెప్టెన్సి విషయంలో తప్పుకుంటే అతని స్థానంలో స్మిత్‌ చూడాలని ఉందన్నారు. ఆసీస్‌ జట్టుకు అతడే సరైన నాయకుడని అన్నారు. ఈ విషయంపై క్రికెట్‌ ఆస్ట్రేలియా తుదినిర్ణయం తీసుకోవాలని, ఒకవేళ స్మిత్‌ జట్టుపగ్గాలు చేపడితే అది అతడి బ్యాటింగ్‌పై ప్రభావం చూపదని పాంటింగ్‌ అన్నాడు. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/
2sports
Visit Site Recommended byColombia షమీకి యాక్సిడెంట్ కావడంతో.. అతణ్ని కలవాలని అనుకుంటున్నట్లు జహాన్ చెప్పింది. అతడు నాకు చేసిన అన్యాయం పైనే నా పోరాటం. కానీ షమీ నా భర్త, ఇప్పటికీ అతడంటే నాకు ప్రేమ అని షమీ రిపోర్టర్లతో చెప్పింది. ‘షమీ త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తాను. అతణ్ని కలవాలని ఆతురతగా ఎదురు చూస్తున్నా. కానీ తనకు ఫోన్ చేస్తే బదులివ్వడం లేదు. తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నా, కానీ షమీ మాత్రం నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేద’ని జహాన్ ఆవేదన వ్యక్తం చేసింది. షమీ ఎక్కడున్నాడో అతడి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం లేదు. నేను నిస్సహారాయులిని అనిపిస్తోందని హసీన్ చెప్పింది. కాగా షమీకి ఇటీవలే బీసీసీఐ కాంట్రాక్ట్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV అభిమానులూ.. బాటిల్ విసిరితే అరెస్టే..! మైదానంలో ఆటగాళ్లకి సమీపంలో అభిమానులు వాటర్ బాటిల్స్‌ విసిరితే వెంటనే వారిని అరెస్ట్ చేస్తామని TNN | Updated: Aug 30, 2017, 06:51PM IST మైదానంలో ఆటగాళ్లకి సమీపంలో అభిమానులు వాటర్ బాటిల్స్‌ విసిరితే వెంటనే వారిని అరెస్ట్ చేస్తామని శ్రీలంక పోలీసులు బుధవారం హెచ్చరించారు. గత ఆదివారం పల్లెకలె వేదికగా భారత్‌తో ముగిసిన మూడో వన్డేలో శ్రీలంక ఓటమిని జీర్ణించుకోలేక స్టేడియంలోని ప్రేక్షకులు వాటర్ బాటిల్స్‌ని విసిరి మ్యాచ్‌కి అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అభిమానులు ఎంతకీ శాంతించకపోవడంతో వారిని స్టేడియం నుంచి వెలుపలకి తరలించి అధికారులు తిరిగి మ్యాచ్‌ని కొనసాగించారు. దీంతో దాదాపు అరగంట పాటు ఆట నిలిచిపోయింది. గురువారం కొలంబో వేదికగా నాలుగో వన్డే జరగనున్న నేపథ్యంలో అభిమానులకి కొన్ని హెచ్చరికలతో పాటు పలు సూచనల్ని కూడా పోలీసులు చేశారు. ‘అభిమానులు ఎవరైనా ఆందోళనకారుల తరహాలో ఆటగాళ్లకి సమీపంలో వాటర్ బాటిల్స్‌ లేదా తమ వస్తువులను విసిరితే వారిని వెంటనే అరెస్ట్ చేస్తాం’ అని పోలీసులు ప్రకటించారు. 35 వేల సీట్ల సామర్థ్యం ఉన్న కొలంబో స్టేడియంలో భద్రత కోసం అదనంగా మరో వెయ్యి మంది పోలీసుల్ని మొహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్టాండ్స్‌లో ఆందోళనకారుల్ని గుర్తించేందుకు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన శ్రీలంక ఐదు వన్డేల సిరీస్‌లోనూ 0-3తో వెనకబడిన విషయం తెలిసిందే.
2sports
Suresh 106 Views ashok అమ్మకాల్లో అశోక్‌లేలాండ్‌ మందగమనం న్యూఢిల్లీ, జూన్‌ 2: హిందూజాగ్రూప్‌ కీలక కంపెనీ అశోక్‌ లేలాండ్‌ మొత్తం అమ్మకాల్లో 8.14శాతం క్షీణించాయి. మొత్తం అమ్మకాల పరంగా 9071 యూనిట్లను మాత్రమే విక్రయించింది. కంపెనీ 9875 యూనిట్లను గత ఏడాది ఇదేనెలలో విక్రయించింది. మధ్యతరహా, భారీ వాణిజ్యవాహనాల అమ్మ కాలు 17.8శాతం క్షీణించి 6139 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదేనెలలో 7469 యూనిట్లను విక్రయించింది. తేలికపాటి వాణ్యివాహనాలపరంగా చూస్తే అమ్మకాలు 21.86శాతం పెరిగి 2932 యూనిట్లకు చేరాయి. మేనెలలో గత ఏడాది 2406 యూనిట్లుగా ఉన్నాయి.
1entertainment
Visit Site Recommended byColombia 1983లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన బాబాయ్ అబ్బాయ్‌తో ప్రసాద్ సినిమాల్లోకి అడుగు పెట్టారు. తేజ సినిమా ‘నువ్వు నేను’ లో హీరో ఉదయ్ కిరణ్ తండ్రి పాత్రలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. దీంతో ఆయనకు టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. ప్ర‌సాద్ దాదాపు 170కిపైగా సినిమాల్లో నటించారు. భ‌ద్ర‌ సినిమాలో రవితేజకు మేనమామగా.. జై చిరంజీవ మూవీలో భూమిక తండ్రిగా డాక్టర్ పాత్రలో నటించి మెప్పించారు. ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. ఆయన స్వస్థలం వైజాగ్, అందుకే ఆయన్ను సినీ ఇండస్ట్రీలో వైజాగ్ ప్రసాద్‌గా పిలిచేవారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. ఊహా తెలియ‌క ముందే త‌ల్లి చనిపోవడంతో మేన‌మామ ఇంట్లో ఉండి ఎస్‌ఎస్ఎల్‌సీ వరకు చదువుకున్నారు. నాటకాలంటే తెగ ఇష్టపడే ప్రసాద్.. ఆ పిచ్చితోనే ఎంబీబీఎస్ సీటు పోగొట్టుకుని బీఏ చదివారు. ఆయ‌న భార్య పేరు విద్యావ‌తి. వీరికి రత్నప్రభ, రత్నకుమార్ అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డారు. అమ్మాయి అమెరికాలో నివాసం ఉండగా, అబ్బాయి లండన్‌లో ఉంటున్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
దేశీయ పరిణామాలే కీలకం -  మార్కెట్ల అంచనా    ముంబయి : ఆగస్టు 31తో ప్రారంభమయ్యే వారంలో ప్రధానంగా దేశీయ పరిణామాలే స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని అంచనా. అంతర్జాతీయ పరిణామాలకు తోడు డాలర్‌తో రూపాయి మారకం విలువ, చమురు ధరలు కీలకం కానున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) గణంకాలను వచ్చే వారంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించనుంది. వృద్ధి రేటు అంచనాలు, ఊహలు మార్కెట్ల కదలికలను మార్చనున్నాయని బ్రోకర్లు పేర్కొంటున్నారు. ఆటోమొబైల్‌ కంపెనీలు ఆగస్టులో జరిగిన అమ్మకాలను సెప్టెంబర్‌ ఒక్కటో తేది నుంచి ప్రకటించనున్నాయి. ఆయా కంపెనీల వాహన అమ్మకాలను బట్టి వాటి షేర్లు, ఆ రంగం షేర్లు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. అంతర్జాతీయంగా చైనా, అమెరికా, గ్రీసు పరిణాలను మదుపర్లు కీలకంగా తీసుకోనున్నారు. దేశంలో నెలకొన్న వర్షపాతం గణాంక సూచీలు కూడా ప్రధానం కానున్నాయి. చైనా భయాల్లో భారీ నష్టాలు   చైనా వృద్ధిలో స్తబ్దత చోటు చేసుకుందన్న వార్తల నేపథ్యంలో ఆగస్టు 28తో ముగిసిన వారంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలు చవి చూశాయి. ఈ నేపథ్యంలోనే గత ఏడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా క్రితం వారంలో ఒకే రోజు బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 1650 పాయింట్లు కోల్పోయింది. తుదకు 974 పాయింట్లు లేదా 3.6 శాతం తగ్గి 26,392 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 298 పాయింట్లు లేదా 3.6 శాతం నష్టపోయి 8,002 వద్ద నమోదయ్యింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 66.71కు క్షీణించి, రెండేళ్ల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 4.1 శాతం, 5.3 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. ఆగస్టు 24-27 మధ్య విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.12,565.52 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. బ్యాంకింగ్‌, కాపిటల్‌ గూడ్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఆటో షేర్లు అధిక నష్టాలు చవి చూశాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyd Internet 82 Views SEHWAGH SEHWAGH ఢిల్లీః మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌ను మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ ప్ర‌శంస‌ల‌తో ముంచేత్తాడు. రికార్డులు సాధించ‌డానికే సచిన్ పుట్టాడని… అతని రికార్డులు అమోఘమని కొనియాడాడు. సచిన్ రికార్డులకు తాను కనీసం సమీపంలో కూడా లేనని, అందుకే సచిన్ క్రికెట్ గాడ్ గా కొనియాడబడుతున్నాడని తెలిపాడు. ఎవరికైనా దేవుడని పిలిపించుకోవడం ఇష్టంగానే ఉంటుందని… తనకు కూడా గాడ్ అని పిలిపించుకోవాలని ఉందని… అందుకే గతంలో తన పేరును సచిన్ గా మార్చుకుందామని అనుకున్నానని చెప్పాడు. సచిన్ తర్వాత మరో సచిన్ రాడని తాను భావించానని… అయితే తన భావనను కోహ్లీ మార్చేశాడని తెలిపాడు. సచిన్ రికార్డులను కోహ్లీ అధిగమిస్తాడని తాను భావిస్తున్నానని చెప్పాడు. కోహ్లీ రూపంలో ప్రపంచానికి మరో సచిన్ పరిచయం అయ్యాడని తెలిపాడు.
2sports
Hyderabad, First Published 17, Sep 2018, 6:41 PM IST Highlights 'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి' చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో స్టార్ లీగ్ లోకి చేరిపోయాడు. అతడితో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.  'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి' చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో స్టార్ లీగ్ లోకి చేరిపోయాడు. అతడితో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం అతడు నటించిన 'నోటా' సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా కొద్దిరోజులుగా విజయ్ ఓ ఫారెన్ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫొటోల్లో విజయ్ ఏకంగా ఆ అమ్మాయిని ముద్దు పెడుతూ కనిపించడంతో టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ క్లోజ్ గా తీసుకున్న సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్లియర్ గా ఈ జంట సెల్ఫీలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ సన్నిహితులు మాత్రం ఇవి విజయ్ సినిమాలోకి రాకముందు ఫోటోలని, అప్పుడేవో ఫోటో షూట్స్ లో పాల్గొన్నాడని కవర్ చేసే ప్రయత్నం చేశారు. బిజీ బిజీగా గడుపుతోన్న విజయ్ కి ఈ వార్తలపై స్పందించే టైమ్ దొరుకుతుందేమో చూడాలి!  Last Updated 19, Sep 2018, 9:28 AM IST
0business
Hyderabad, First Published 26, Oct 2018, 3:06 PM IST Highlights గత కొద్దిరోజులుగా రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ సినిమాలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. దాదాపు రూ.300 కోట్లు(అంచనా మాత్రమే) బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారట.  గత కొద్దిరోజులుగా రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ సినిమాలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్  తీసుకోబోతున్నారనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. దాదాపు రూ.300 కోట్లు(అంచనా మాత్రమే) బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని  భావిస్తున్నారట. అయితే ఈ సినిమాకు పని చేసే చీఫ్ టెక్నీషియన్స్ కి, నటీనటులకు.. రాజమౌళితో సహా ఎవరికీ రెమ్యునరేషన్ ఇవ్వకుండా లాభాల్లో వాటా తీసుకునేలా ప్లాన్ చేశాడు నిర్మాత డివివి దానయ్య. ఈ లెక్కన హీరోలకి ఎంత వస్తుందనే విషయంపై రూ.30 కోట్లు అని అంటున్నారు. సినిమా బిజినెస్ ని బట్టి చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్ల రెమ్యునరేషన్ అందే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళికి ఎలా లేదన్నా.. 50-60 కోట్లు ఆయన పాకెట్ లోకి చేరతాయని తెలుస్తోంది. సినిమా హక్కులు గనుక ఊహించినదానికంటే ఎక్కువ మొత్తాలకి అమ్ముడైతే అప్పుడు పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉంది. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం చరణ్, బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. వీలైనంత తొందరగా ఆ సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డాడు. మరోపక్క ఎన్టీఆర్ 'అరవింద సమేత' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.  ఇది కూడా చదవండి..
0business
Hyderabad, First Published 10, Aug 2018, 1:38 PM IST Highlights ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఐటి మినిష్టర్ కేటీఆర్, అతడి సోదరి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని స్ఫూర్తిగా నిలిచారు. ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్టార్ హీరోలకు సవాల్ విసిరాడు. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ శ్రీనివాస్ విసిరిన  ఛాలెంజ్ ను స్వీకరించిన తలసాని తాజాగా తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలను నాటారు. అనంతరం సినీ ప్రముఖులు ఎన్టీఆర్, ప్రభాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు లకు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనమని సవాల్ విసిరారు. మానవాళి మనుగడ సజావుగా సాగాలంటే అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.  Last Updated 9, Sep 2018, 12:18 PM IST
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV భారత్‌పై కివీస్ పాఠాలు నేర్వలేదు: బ్రాస్‌వెల్ సొంతగడ్డపై రెండో వన్డేలోనూ టీమ్‌ ఓడిపోవడం కొంచెం నిరాశ కలిగించింది. తొలి వన్డే తర్వాత మాకు కేవలం ఒక ప్రాక్టీస్ సెషన్ మాత్రమే సాధ్యమైంది. దీంతో.. ? -న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ బ్రాస్‌వెల్ Samayam Telugu | Updated: Jan 27, 2019, 12:11PM IST భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు తప్పిదాల నుంచి పాఠాలు నేర్వలేకపోతోందని ఆ జట్టు నయా ఆల్‌రౌండర్ బ్రాస్‌వెల్ అభిప్రాయపడ్డాడు. మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా శనివారం జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ .. ఓపెనర్లు రోహిత్ శర్మ (87: 96 బంతుల్లో 9x4, 3x6), శిఖర్ ధావన్ (66: 67 బంతుల్లో 9x4), మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (48 నాటౌట్: 33 బంతుల్లో 5x4, 1x6) దూకుడుగా ఆడటంతో 324 పరుగులు చేసింది. అనంతరం కుల్దీప్ యాదవ్ (4/45) చెలరేగడంతో న్యూజిలాండ్‌ని 234 పరుగులకే కుప్పకూల్చి ఐదు వన్డేల సిరీస్‌లో 2-0లో ఆధిక్యాన్ని అందుకుంది. ఛేదనలో కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (15), కొలిన్ మున్రో (31)‌తో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (20), రాస్ టేలర్ (22), టామ్ లాథమ్ (34), హెన్రీ నికోలస్ (28), గ్రాండ్ హోమ్ (3) నిరాశపరచగా.. బ్రాస్‌వెల్ (57: 46 బంతుల్లో 5x4, 3x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. భారత్ చేతిలో వరుసగా రెండో వన్డేల్లోనూ న్యూజిలాండ్ ఓడిపోవడంపై బ్రాస్‌వెల్ మాట్లాడుతూ ‘సొంతగడ్డపై రెండో వన్డేలోనూ టీమ్‌ ఓడిపోవడం కొంచెం నిరాశ కలిగించింది. తొలి వన్డే తర్వాత మాకు కేవలం ఒక ప్రాక్టీస్ సెషన్ మాత్రమే సాధ్యమైంది. దీంతో.. తప్పిదాల్ని దిద్దుకోలేకపోయాం. మరోవైపు భారత్ జట్టు మాత్రం.. అదే జోరుని రెండో వన్డేలోనూ కొనసాగించి మా జట్టుని ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైంది’ అని బ్రాస్‌వెల్ వెల్లడించాడు. ఇక మూడో వన్డే సోమవారం ఉదయం 7.30 గంటలకి జరగనుండగా.. మ్యాచ్‌ల మధ్య విరామం ఒక్కరోజే ఉండటంతో ఆ జట్టు ఎలా పుంజుకుంటుందో..? చూడాలి.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV సారీ.. మా వాళ్లు చేసింది తప్పే: బంగ్లా క్రికెట్ బోర్డ్ శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిచాక బంగ్లా పెద్ద రచ్చే చేసింది. ఈ గొడవపై బంగ్లా క్రికెట్ బోర్డు కూడా స్పందించాల్సి వచ్చింది. జరిగిన ఘటనపై బోర్డు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. Samayam Telugu | Updated: Mar 18, 2018, 12:59PM IST శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిచాక బంగ్లా పెద్ద రచ్చే చేసింది. ఈ గొడవపై బంగ్లా క్రికెట్ బోర్డు కూడా స్పందించాల్సి వచ్చింది. జరిగిన ఘటనపై బోర్డు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ క్రికెటర్లే తప్పు చేశారని... అందుకు క్షమాపణలు చెబతున్నామన్నారు. దీనికి సంబంధించి బీసీబీ శ్రీలంక బోర్డుకు ఓ లేఖ రాసింది. తమ ఆటగాళ్ల దూకుడు, వ్యవహారం శైలి వల్ల విధ్వంసం జరిగింందని... ఇతరుల్ని రెచ్చగొట్టే విధంగా గ్రౌండ్‌లో ప్రవర్తించడాన్ని తమతో పాటూ ఎవరూ సమర్థించరన్నారు. తప్పంతా బంగ్లా క్రికెటర్లదేనని... క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించారని చెప్పారు. బంగ్లా ఆటగాళ్ల ప్రవర్తనకు తాము క్షమాపణలు తెలియజేస్తున్నామని శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ పంపింది.
2sports
Read More: రోహిత్ శర్మ 6, 6, 6 వెనుక గొడవే కారణమా..? అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ 534 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం 398 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ.. రెండు సిక్సర్లు బాదడం ద్వారా.. 400 సిక్సర్ల మైలురాయిని అందుకోవడంతో పాటు భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్నాడు. Read More: అప్పట్లో సచిన్.. ఇప్పుడు రోహిత్ అంతే: సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకూ 218 వన్డేలాడిన రోహిత్ శర్మ 232 సిక్సర్లు బాదేశాడు. అలానే 100 టీ20ల్లో 115 సిక్సర్లు, 30 టెస్టుల్లో 51 సిక్సర్లు నమోదు చేశాడు. ఇటీవల వన్డే ప్రపంచకప్ ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పరుగుల వరద పారించిన రోహిత్ శర్మ.. ఈ ఏడాదిలోనే ఏకంగా 66 సిక్సర్లు బాదేయడం విశేషం. Read More: IPL 2020: చెన్నై జట్టులో అదొకటే మార్పు..!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
DHONi టి20లో ధోనీ తొలి హాఫ్‌ సెంచరీ బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని అంత ర్జాతీయ టి20 కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీ నమో దు చేశాడు.కేవలం 32 బంతుల్లో 4 బౌండరీలు,2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు.చిన్నిస్వామి మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ధోని వీరవి హారం చేశాడు.ఈ మ్యాచ్‌ లో టాప్‌ ఆర్డర్‌లో వచ్చిన అతడు ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బాదుడు మొదలు పెట్టాడు.ఈ మ్యాచ్‌లోతక్కువ స్కోరుకే తొలి వికెట్‌ కోల్పో యింది.క్రిస్‌ జోర్డాన వేసిన రెండవ ఓవర్‌లో డిఫెన్స్‌ ఆడిన కోహ్లీ బంతి పిచ్‌ను దాటక ముందే పరుగు కోసం ప్రయత్నించాడు.అయితే మరో ఎం డ్‌లో ఉన్న కెఎల్‌ రాహుల్‌ కొంచెం ముందుకొచ్చి వెనుదిరగడంతో కోహ్లీ మళ్లీ క్రీజులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.ఈ సమయంలో బంతిని అం దుకున్న జోర్డాన్‌ నేరుగా వికెట్లకు విసిరాడు.కేవలం నాలుగు బంతులే ఎదుర్కొన్న కోహ్లీ రెండు పరుగులతో వెనుదిరగాల్సివచ్చింది. సురేష్‌ రైనా మెరుపు హాఫ్‌ సెంచరీ ఇంగ్లండ్‌తో జరగుతున్న మూడవ టి20లో సురేష్‌ రైనా 39 బంతులు ఆడి 2 బౌండరీలు,4 సిక్స ర్లతో 54 పరుగులతో రెచ్చిపోయాడు. దూకుడుగా ఆడుతూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.జట్టు స్కోరు నాలుగు పరుగుల వద్ద కోహ్లీ వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన రైనాభారీ సిక్సర్లు బాదాదు.ఆదిల్‌ రషీద్‌ వేసిన 12వ ఓవర్‌ 5వ బంతిని సిక్సర్‌గా బాది 50పరుగులు పూర్తి చేసుకున్నాడు.12 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 2 వికెట్లకు 99 పరుగులతో ఉంది.టీమిండియా,ఇంగ్లండ్‌ మధ్య ఆఖరి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది.టెస్టు సిరీస్‌ను 4-0తో,వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియాకు తొలి టి20లో షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే.అయితే ఆఖరు ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌తో భారత్‌ రెండవ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసింది.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
ఊరించి.. ఉసూరుమనిపించారు.. - ఉద్యోగ హామీ వెనక్కి తీసుకున్న ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫో చెన్నయ్: విద్యార్థుల జీవితాలతో బడా కంపె నీలు చెలగాట మాడుతు న్నాయి. 'ఇండియన్‌ ఇన్స్‌ట్యూట్‌ మేనేజ్‌మెంట్‌' (ఐఐఎం) విద్యార్థులకు ఉద్యోగ హామీ లేఖలు ఇచ్చి ఆ తర్వాత తూచ్‌ అంటూ వెనక్కి తగ్గిన ఫ్లిప్‌కార్ట్‌ ఉదంతం మరవక ముందే అదే తరహా ప్రకటన మరోకటి వెలుగులోకి వచ్చింది. వివిధ కాలేజీలకు చెందిన దాదాపు 1500 మంది విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్‌ లెటర్లను రద్దు చేస్తున్నట్లుగా ఎల్‌ అండ్‌ టీి ఇన్ఫోటెక్‌ తాజాగా వెల్లడించింది. తొలుత ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు కొన్ని నెలలు గడిచాక ఉద్యోగాలు లేవంటూ తాపీగా ఈ-మెయిల్‌ సందేశాల్ని పంపింది. దీనిపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తూ సోమవారం చెన్నరులో నిరహారదీక్షలకు దిగారు. దీంతో తాము బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌అండ్‌టి ఆఫర్‌ ఇవ్వడంతో ఇంకో కంపెనీలో కూడా చేరలేకపోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తమిళనాడులోని కొన్ని కళాశాలల నుంచి విద్యార్థులను ఎంపిక చేసిన ఎల్‌అండ్‌టి తాజాగా తమకు కావాల్సిన సామర్థ్యం విద్యార్థుల్లో లేకపోవడంతో ఆఫర్‌ లెటర్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV వన్డేల్లో నాటౌట్‌గా ధోనీ ‘నెం.1’ రికార్డు..! భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. TNN | Updated: Aug 31, 2017, 07:59PM IST భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. కెరీర్‌లో 300వ వన్డే ఆడుతున్న ధోనీ అత్యధికంగా 73 సార్లు క్రీజులో అజేయంగా నిలిచాడు. కొలంబో వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో 42 బంతుల్లో ధోనీ 5x4, 1x6 సాయంతో 49 పరుగులు చేసి చివరి వరకూ నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇప్పటి వరకు షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా), చమిందా వాస్ పేరిట ఉన్న 72 సార్లు నాటౌట్ రికార్డును ధోనీ బద్దలుకొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. 2004లో కెరీర్ ఆరంభించిన ధోనీ.. మొదట్లో నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. క్రమంగా హిట్టర్ లేని లోటు తీర్చేందుకు ఆరోస్థానానికి మారిపోయాడు. ఈ క్రమంలోనే చివరి వరకూ క్రీజులో ఉంటూ ఎన్నో మ్యాచ్‌ల్ని విజయాలుగా ముగించి ప్రపంచంలోనే బెస్ట్ మ్యాచ్ ఫినిషర్‌గా కీర్తిగడించాడు. మ్యాచ్ ఉత్కంఠలో ఉన్నా.. ఆఖరి ఓవర్లలో భీకర హిట్టింగ్‌తో లక్ష్యాల్ని ఛేదించడం ధోనీ స్టైల్. అందుకే అతను క్రీజులో ఉంటే భారత్ విజయం పక్కా అనేంతలా ముద్రపడిపోయింది.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Visit Site Recommended byColombia అయితే బాహుబలి ది బిగినింగ్ సినిమా రిలీజ్ అయిన తొలిరోజు సోషల్ మీడియాలో కొంత మంది ఈకలు పీకే బ్యాచ్ ‘ప్రభాస్ శివలింగాన్ని మోసుకుంటూ వెళ్లే ఫొటోను మార్ఫింగ్ చేసి.. శివలింగం ప్లేస్‌లో జండూబామ్ డబ్బా పెట్టి .. సినిమా తలపోటురా బాబు అంటూ ప్రచారానికి తెరలేపడానికి ప్రయత్నించారు. అయితే ఆ సినిమా ఎలాంటి సన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తాజాగా బాహుబలి2 ట్రైలర్2లో క్షమించరాని తప్పు జరిగిపోయిందటూ ప్రచారం మొదలు పెట్టేశారు. ఇంతకీ అదేంటంటే.. ఈ ట్రైలర్‌లో కట్టప్పతో బాహుబలి "నువ్వు నా పక్కన ఉన్నంత వరకు..నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా" అని అంటాడు. అక్కడే భయంకరమైన తప్పుజరిగిపోయిందనేది వీరి వాదన. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ డైలాగ్‌లో వాస్తవానికి వ్యాకరణ దోషం ఉన్న మాట వాస్తవమే. నువ్వు నా పక్కనుండగా అన్నప్పుడు.. నన్ను చంపే మగాడింకా పుట్టలేదని ఎలా అంటారు. అంటే గింటే.. పుట్టబోడని అనాలి లేదా.. పుట్టడు అనాలనేది వీరి వాదన. ‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకు అన్నది వర్తమానం అయితే.. చంపే మగాడు పుట్టలేదు మామ అనేది గడిచి పోయిన భూతకాలం అవుతుంది కదా. అలాంటప్పుడు డైలాగ్ ఉండాల్సింది ‘నన్ను చంపే మగాడు పుట్టబోడు మామ’ అని అనాలికదా అనేది వీరి పాయింట్. నిజానికి వ్యాకరణంలో తప్పు వచ్చిన మాట నిజమే. కాని వ్యాకరణ దోషాన్ని కూడా పట్టి పట్టి చూసే ప్రేకక్షుడిని స్థాయిని అంచనా వేసి డైలాగ్ రాయాలంటే అది జరిగే పని కాదనేది కొందరి వాదన. ఏదేమైనా రాజమౌళి విజువల్‌పై పెట్టిన శ్రద్ధను డైలాగ్‌పై పెట్టలేదని చురకలు వేయడానికి రెడీ అయిపోతున్నారు మూవీ మేధావి సంఘాలు.
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ‘డబ్బు కోసం.. హీరోయిన్లు బట్టలిప్పేస్తారా?’ ‘‘డబ్బు కోసం హీరోయిన్లు బట్టలిప్పేస్తారా? హీరోయిన్లంటే దర్శకుడు ఆడమన్నట్లు ఆడే ఆట బొమ్మాలా?’’ అంటూ నయన, తమన్నాలు ఆ దర్శకుడిపై విరుచుకుపడ్డారు. ఇంతకీ హీరోయిన్లపై అంత చీప్ వాఖ్యలు చేసిందెవరు? వారికి ఎందుకంత కోపం వచ్చింది? TNN | Updated: Dec 26, 2016, 08:25PM IST ‘‘డబ్బు కోసం హీరోయిన్లు బట్టలిప్పేస్తారా? హీరోయిన్లంటే దర్శకుడు ఆడమన్నట్లు ఆడే ఆట బొమ్మాలా?’’ అంటూ నయన్, తమన్నాలు ఆ దర్శకుడిపై విరుచుకుపడ్డారు. ఇంతకీ హీరోయిన్లపై అంత చీప్ వాఖ్యలు చేసిందెవరు? వారికి ఎందుకంత కోపం వచ్చింది? ‘‘హీరోయిన్ చీర కట్టుకుంటే.. లో క్లాస్ ఆడియన్స్‌కు ఇష్టం ఉండదు. అందుకే, నా చిత్రంలో హీరోయిన్ల దుస్తులు విషయంలో చాలా ‘పొదుపు’ పాటిస్తా. కాస్ట్యూమ్ డిజైనర్ హీరోయిన్ డ్రస్‌ను మోకాలు కవర్ చేసేలా కుడితే.. పైకి కత్తిరించాలని చెబుతా. ఈ విషయంలో నేను రాజీపడను. ఆడియాన్స్ డబ్బులిచ్చి సినిమా చూస్తారు. ఆడియన్స్‌కు కావల్సినది చూపించడానికే వారికి కోట్లు చెల్లిస్తున్నాం’’ అని తమిళ దర్శకుడు సూరజ్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆయన మాటలపై నయన తార, తమన్నాలు అంతెత్తున లేచారు. ఇంతకీ ఈ సూరజ్ ఎవరంటే... విశాల్, తమన్నా .. జంటగా తమిళంలో ‘కత్‌థీ సాందై’గా తెలుగులో ‘ఒక్కడొచ్చాడు’గా విడుదలైన చిత్రానికి దర్శకుడు సూరజ్. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇందులో తమన్న పాత్ర గురించి, గ్లామర్ డోస్‌పై మాట్లాడుతూ... హీరోయిన్లపై పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. డబ్బులిస్తున్నాం కాబట్టి ఎలాంటి బట్టలైనా వేసుకోవల్సిందే అన్నాడు. దీనిపై నయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘హీరోయిన్లు అంటే Strippers (పాశ్చాత్య దేశాల్లో బార్లలో బట్టలు విప్పి ఆడేవారు)లా కనిపిస్తున్నారా? డబ్బుల కోసం ఏంతకైనా దిగజారుతామని అనుకుంటున్నాడా? సూరజ్ కామెంట్స్ చాలా చీప్‌గా ఉన్నాయి. అతని కంటే ప్రేక్షకులే చాలా హుందాగా ఉంటారు. పింక్, దంగాల్ వంటి మహిళా సాధికారిక చిత్రాలు వస్తున్న ఈ రోజుల్లో దర్శకుడు ఇంత నీచంగా మాట్లాడటం వెగటు పుట్టిస్తోంది’’ అని అంది. ఫొటోలో: దర్శకుడు సూరజ్‌తో తమన్నా.... ‘దంగాల్’ చిత్రం మధ్యలోనే వెళ్లిపోయిన తమన్నా: తన చిత్ర దర్శకుడు సూరజ్ చేసిన ఈ వ్యాఖ్యలు గురించి తెలుసుకున్న తమన్నా, మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె స్పందిస్తూ.. ‘‘మహిళా సాధికరితపై రూపొందించిన ‘దంగల్’ సినిమా చూస్తున్న సమయంలో ఈ చీప్ వ్యాఖ్యలు నా చెవిన పడ్డాయి. దీంతో, సినిమా మధ్యలో వదిలేసి వచ్చాను. సూరజ్ మాటలు నన్ను ఎంతో బాధించాయి. చాలా కోపం తెప్పించాయి. అతను వెంటనే క్షమాపణలు చెప్పాలి. నాకు మాత్రమే కాదు. మొత్తం పరిశ్రమలోని మహిళలదరినీ క్షమాపణలు కోరాలి. 11 ఏళ్ల సినీ జీవితంలో నాకు కంఫార్ట్‌గా ఉండే దుస్తులనే వేసుకున్నా. స్క్రిప్ట్ డిమాండు చేస్తేనే గ్లామర్‌గా నటిస్తున్నా. అంతేగానీ, డబ్బు కోసం ఎన్నడూ దిగజారలేదు. సూరజ్ చేసిన వ్యాఖ్యలను మొత్తం పరిశ్రమకు ఆపాదించవద్దు’’ అంటూ తమన్నా తన గోడు వెళ్లబుచ్చుకుంది. అయితే, ఈ వివాదం ఇప్పుడు తెలుగు, తమిళ పరిశ్రమల్లో హాట్ టాపిక్‌గా మారింది.
0business
మా కంపెనీ భేష్‌ : గూగుల్‌ ఉద్యోగులు - ర్యాండ్‌స్టడ్‌ సర్వేలో వెల్లడి                న్యూఢిల్లీ : భారత్‌లో అత్యంత అకర్షనీయ కంపెనీగా ఈ సంవత్సరం గూగుల్‌ ఇండియా నిలిచింది. ర్యాండ్‌స్టడ్‌ అవార్డు నిర్వహించిన సర్వేలో గూగుల్‌ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. సోని ఇండియా రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్‌లో ఉద్యోగి ఉండటానికి ఒక్క పే చెక్కులే కారణం కాదనీ, సంస్థలో మంచి పని - జీవిత సమతూకంగా ఉండటం, పదోన్నతులు కూడా కారణాలని సర్వే వెల్లడించింది. కంపెనీని అంటిపెట్టుకుని ఉండటానికి మంచి పనితో పాటు జీవిత సమతూకం కారణాలని 42 శాతం మంది ఉద్యోగులు తెలిపినట్లు వెల్లడైంది. ఎక్కువ మంది ఉద్యోగులు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ లాంటి విభాగాల్లో పనిచేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. జీతంతో పాటు ఉద్యోగికి వర్తించే ప్రయోజనాలు ముఖ్య భూమికను పోషిస్తుందని తెలిపింది. ఉద్యోగి టాలెంట్‌ను బట్టి పదోన్నతులు, దానికి తగ్గట్టు సరైన వేతనం ఇవ్వడం ద్వారా గూగుల్‌ సంస్థ ఉద్యోగుల మన్ననలు పొందుతోందని తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైందని ర్యాండ్‌స్టడ్‌ సిఈఓ మూర్తి ఉప్పలూరి తెలిపారు. దేశంలోని మొత్తం 150 పెద్ద పెద్ద కంపెనీల్లో 8,560 మంది ఉద్యోగులను సర్వే చేసి ఫలితాలను వెల్లడించామని తెలిపారు. 2014 సర్వేలో సరైన వేతనం కోసం వేరే కంపెనీలకు మారటం, ఉద్యోగ భద్రత అంశాలు ఈ సంవత్సర సర్వేలో తేడా చూపించాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్‌ బెస్ట్‌ ఎంప్లాయర్‌కు ఎంపిక కాగా ఈ సంవత్సరం హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sumalatha 239 Views cricket , Lata Mangeshkar , MS Dhoni , retirement Lata Mangeshkar , MS Dhoni హైదరాబాద్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడనే వార్తలపై ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ స్పందించారు. ‘హలో ధోనీ, నీవు రిటైర్ కావాలనుకుంటున్నావనే విషయాన్ని వింటున్నా. దయచేసి ఆ దిశగా ఆలోచించకు. నీ ఆట మన దేశానికి ఎంతో అవసరం. రిటైర్మెంట్ గురించి ఆలోచించవద్దని నేను వ్యక్తిగతంగా కోరుతున్నా’ అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి భారీ ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ… ఆయన నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/business/
2sports
Jun 10,2016 సెయంట్‌లో గ్లోబల్‌ డిజైన్‌ కేంద్రం ముంబయి: హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఐటీ, కన్సల్టెన్సీ సేవల సంస్థ సెయంట్‌ గురువారం బెంగళూరులో 'గ్లోబల్‌ డిజైన్‌ సెంటర్‌'ను ప్రారంభించింది. ప్రధాన ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల కోసం ఉన్నత శ్రేణి కన్సెల్టెన్సీ సేవలను అందించేందుకు గాను ఆస్ట్రేలియాకు చెందిన ఎస్‌ఎంఈసీ సంస్థ కోసం సెయంట్‌ దీనిని తెరిచింది. ఈ కేంద్రం ఎస్‌ఎంఈసీ సంస్థకు ఆస్ట్రేలియా అవతల మొట్టమొదటి డిజైనింగ్‌ కేంద్రం కానుంది. ప్రాథమికంగా ఈ కేంద్రం కంపెనీకి చెందిన గ్లోబల్‌ డిజైన్‌ వర్క్‌ను చేపట్టనుంది. సివిల్‌, స్ట్రక్చరల్‌ ఇన్ఫర్మెషన్‌ బిల్డింగ్‌ మోడలింగ్‌ పనులలో చేయూతనందిచనుంది. బెంగళూరులోని సెయంట్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం జులై నుంచి పూర్తిస్థాయిలో సేవలను అందించనున్నట్లు తెలిపింది. ఏడాది కాలంలోనే ఇక్కడ 100 ఇంజినీర్లతో విస్తరించనున్నారు. క్రమంగా సంస్థను విస్తరించి అత్యధికులకు ఉపాధి అవకాశాలు లభించే చూడనున్నట్లు కంపెనీ తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఐసీఐసీఐ కుంభ‌కోణం: ప్రభుత్వం కీలక చర్య ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణ వివాదంలో ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. ఐసీఐసీఐ బోర్డు నామినీని తొలగించింది. ఈ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించింది. Samayam Telugu | Updated: Apr 8, 2018, 10:31AM IST ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణ వివాదం:వెంట‌వెంట‌నే స్పందిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణ వివాదంలో ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. ఐసీఐసీఐ బోర్డు నామినీని తొలగించింది. ఈ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించింది. బ్యాంకు బోర్డులో ప్రభుత్వ నామినీ డైరెక్టర్‌గా ఉన్న అమిత్‌ అగర్వాల్‌ స్థానంలో లోక్‌ రంజన్‌ను నియమించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం జాయింట్ సెక్రటరీగా ఉన్న రంజన్‌ నియమాకం ఏప్రిల్‌ 5నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకుకు సమాచారం అందించింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణం, ఇతర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మరోవైపు 3,250 కోట్ల రూపాయల స్కాం ఆరోపణలపై రంగంలోకి దిగిన సీబీఐ.. చందా కొచ్చర్‌ భర్త, దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ ధూత్‌పై ప్రాథమిక విచారణ చేపట్టింది. అటు ఈ వివాదంలో అవిస్టా సంస్థపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మూడురోజుల క్రితం ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న దీపక్‌ కొచ్చర్‌ సోదరుడు విజయ్‌ కొచ్చర్‌ను శనివారం కూడా విచారిస్తోంది.
1entertainment
జిఎస్‌టి అమలులోపే స్టాక్స్‌ క్లియర్‌! డిస్కౌంట్లు, ఆఫర్లతో ఇ-కామర్స్‌ సంస్థలు ముంబయి, జూన్‌ 8: వస్తుసేవల పన్ను చట్టం జూలై ఒకటినుంచి అమలులోకి వస్త్నుందున ఇ-కామర్స్‌ సంస్థలు భారత్‌లో తమ వద్ద పేరుకుని ఉన్న స్టాక్స్‌ను క్లియర్‌చేసేందుకు తాపత్రయపడుతున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటిభారీసంస్థలతోపాటు మరికొన్ని ఆన్‌లైన్‌ సంస్థ లు కూడా ఇదే బాటలో ఉన్నాయి. ఇందుకోసం డిస్కౌంట్లు, ఆఫర్లు భారీగా ప్రకటించాయి. కొత్త పన్నుల విధానం వల్ల తమకు నష్టాలు వచ్చే అవ కాశం ఉందన్న భావనతో ముందుగానే స్టాక్స్‌ను క్లియర్‌ చేసుకుంటున్నాయి. ఇ-కామర్స్‌సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటివి ప్రస్తుత నిల్వలను తగ్గించే కృషిలో ఉన్నాయి. ఉత్పత్తిదారులు, డీలర్ల నుంచి విక్రేతలు ఆర్డర్లు ఇస్తున్నారు. నిర్దిష్టవ్యవధి లోను స్టాక్‌ విక్రయాలు పూర్తిచేస్తామన్న హామీతోనే వారు సరుకు సరఫరాచేస్తున్నారు. ఆన్‌లైన్‌లో అయినా ఆఫ్‌లైన్‌లో అయినా విక్రయాలు జరిగేందు కు తోడ్పాటునిస్తానన్నారు. సురక్ష ఇసెల్లర్‌ ప్రెసి డెంట్‌ సంజ§్‌ు ఠాకూర్‌ మాట్లాడుతూ జిఎస్‌టి అమలుకు ముందే అన్ని సంస్థలు మేలుకుంటున్నా యన్నారు. కొత్త జిఎస్‌టి నిబంధనల ప్రకారంచూస్తే విక్రేతలు 60శాతం వరకూ ఇన్‌పుట్ట్‌ఆ్యక్స్‌క్రెడిట్‌ను పొందే అవకాశంఉంది. 18శాతం, 28శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న ఉత్పత్తులకు టాక్స్‌క్రెడిట్‌ పొందుతా యి. 25వేలకుపైబడిన ఉత్పత్తులపై ఎక్సైజ్‌డ్యూటీ స్థానంలో నూరుశాతం పన్నుక్లెయిమ్‌ పొందే అవ కాశం ఉంటుంది. కొత్తజిఎస్‌టి నిబంధన లు ఆకళింపు చేసుకునేలోపుగానే కొంత స్టాక్స్‌ వదిలించుకోవాలని చూస్తున్నారు. పాతస్టాక్స్‌ పై ఇన్‌పుట్‌ ట్యాక్స్‌క్రెడిట్‌ వస్తుందా లేదా అన్న ఆందోళనలోఉన్నారు. కనీసం కొత్తనిబంధనలు ఆక ళింపు చేసుకునేందుకు మూడునెలల వ్యవధి పడు తుందని, అమలు తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు తొలగించుకోవాల్సి ఉంటుందని ఇ-కామర్స్‌ సంస్థ లు అభిప్రాయపడుతున్నాయి. అఖిలభారత ఆన్‌ లైన్‌ వెండార్స్‌ అసోసియేషన్‌ దేశంలో విక్రేతలు సమస్యలు ఎదుర్కొనకతప్పదని అన్నింటిని అధిగ మించేందుకు ముందుగా పేరుకున్న పాతస్టాక్స్‌ వది లించుకోవాలని పేర్కొంటున్నది. జూలై ఒకటవ తేదీ తర్వాత కూడా అమ్మిన పాతస్టాక్‌పై ఇన్‌పుట్‌క్రెడిట్‌ క్లెయించేసుకోగలిగితే తమకు లాభం ఉంటుందని అన్నారు. ఒకసారి జిఎస్‌టి అమలుకు వచ్చినతర్వా త కానీ విక్రేతలు, ఉత్పత్తిదారులు, పంపిణీదారుల కున్న వాస్తవసమస్యలు వెలుగులోకిరావని ఆలిండియా సంఘం ప్రతినిధి కుష్‌ అగర్‌వాల్‌ చెపుతున్నారు.
1entertainment
Suresh 117 Views M S Dhoni M S DHONI పల్లెకలె: కీపింగ్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ అంటే 100 శాతం పర్‌ఫెక్షన్‌కు మారుపేరు. అటువంటిది శ్రీలంకతో జరుగుతోన్న మూడో వన్డేలో మహి రనౌట్‌ చేయడంలో విఫలమయ్యారు. దీంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ చండిమాల్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నారు. అక్షరపటేల్‌ వేసిన 24.5వ బంతిని చండిమాల్‌ ఎదుర్కొన్నారు. బంతి అందుకొని ధోనికి విసిరారు. బంతిని బాగానే ధోనిని వికెట్లను గిరాటేసే ముందు కాస్త స్లిప్‌ కావడంతో బంతి అతడి చేతుల్లో నుంచి జారిపోయింది. అప్పటికీ చండిమాల్‌ ఇంకా క్రీజులోకి రాలేదు.
2sports
internet vaartha 190 Views హైదరాబాద్‌ : దేశంలో అతిపెద్ద మొబైల్‌ పేమెంట్‌కామర్స్‌ వేదిక అయిన పేటిఎం నగదు రహిత లావాదేవీలు విద్యాసంస్థల్లో కూడా ప్రారంభించింది. అందులో భాగంగానే ఢిల్లీ పబ్లిక్‌స్కూల్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ టెక్నాలజీ, లవ్లీ ప్రొఫెషనరల్‌ వర్సిటీ, శారదా వర్సిటీ వంటి 100 పాఠశాలలు కళాశాలలతో ఒప్పందం చేసుకుంది. గణాంకాల ప్రకారం 60శాతం మంది విద్యార్థులు ఇప్పటికే పేటిఎం వినియోగదారులు ఉన్నారు. వినియోగదారులు బడిఫీజులు, ఇతర బకాయిలు, కేఫ్‌ బిల్లులు, యూనిఫామ్స్‌, పుస్తకాలు సరుకుల కొనుగోలుకు పేటిఎం లావాదేవీలు జరుపుతున్నా రు. నగదుతో నేరుగా లావాదేవీలు అవసరంలేకుం డా చేస్తునన ఈ ముందడుగు విద్యార్ధులకు తల్లి తండ్రులకు ఎంతో ఉపకరిస్తుందన్నారు. సినీయర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ కిరణ్‌ వాసిరెడ్డి మాట్లాడుతూ విద్యా ర్ధులకు నగదురహిత లావాదేవీలకు పెద్ద ప్రాధాన్యతా క్రమంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఢిల్లీ లోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సంస్థ క్యాంపస్‌లోని షాపుల్లో పేటిఎంనుంచి లావాదేవీలు జరిపేందుకు అనుమతించింది. కేఫ్‌కాఫీడే, స్టేషనరీ షాప్‌, జూస్‌కార్నర్‌, క్యాంటీన్‌లలో నెలవారీ బిల్లు ల్లిన విద్యార్ధులు విజయవంతంగా చెల్లించడంతో మొదటివిడతలోభాగంగా ఇపుడు పేటిఎం సేవల్ని ఫీజులకుపొండిగించారు. పేటిఎం2014లో ప్రారం భించినప్పటి నుంచి ఇప్పటివరకూ 80 మిలియన్లకు పైగా ఆర్డర్లుపొందినట్లుకిరణ్‌ వాసిరెడ్డి వివరించారు.
1entertainment
జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం Highlights డైనమిక్ లేడీ డైరెక్టర్ బి.జయ దర్శకత్వంలో త్వరలో మూవీ జూన్ నుంచి కొత్త చిత్రం ప్రారంభం ఆర్ జే సినిమాస్ బేనర్ పై చిత్రాన్ని నిర్మించనున్న బిఏరాజు నిర్మాత బిఏరాజు పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రం ప్రకటన డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణ్‌', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ', 'వైశాఖం' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు. జనవరి 7 నిర్మాత బి.ఎ.రాజు పుట్టినరోజు సందర్భంగా తమ ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నట్టు ప్రకటించారు.    ఈ సందర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''మా బేనర్‌లో నిర్మించిన మొదటి సినిమా 'పేమలో పావని కళ్యాణ్‌'. నిర్మాతగా ఎంటర్‌ అయి 15 సంవత్సరాలు పూర్తయింది. మా బేనర్‌లో వచ్చిన 'ప్రేమలో పావని కళ్యాణ్‌', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ', 'వైశాఖం' చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పుడు మా ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌లో జయ దర్శకత్వంలో మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని నిర్మించబోతున్నాం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. జూన్‌లో ఈ సినిమాని స్టార్‌ చేస్తాం. అలాగే మా సూపర్‌హిట్‌ మ్యాగజైన్‌ 24వ సంవత్సరంలోకి సక్సెస్‌ఫుల్‌గా అడుగుపెట్టింది. మా వెబ్‌సైట్‌ ఇండస్ట్రీ హిట్‌ డాట్‌ కామ్‌ మంచి రేటింగ్‌తో నాలుగో సంవత్సరంలోకి ఎంటర్‌ అయింది'' అన్నారు. Last Updated 26, Mar 2018, 12:02 AM IST
0business
రెమ్యునరేషన్ లో తగ్గేది లేదన్నాడు.. తారక్ పై కామెంట్! First Published 19, Mar 2019, 7:09 PM IST సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు ప్రోగ్రాంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. నరసింహుడు ప్లాప్ అవ్వగానే రెమ్యునరేషన్ విషయంలో ఒక సలహా ఇస్తే జూనియర్ అందుకు ఒప్పుకోలేదని వివరణ ఇచ్చారు.   సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు ప్రోగ్రాంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. నరసింహుడు ప్లాప్ అవ్వగానే రెమ్యునరేషన్ విషయంలో ఒక సలహా ఇస్తే జూనియర్ అందుకు ఒప్పుకోలేదని వివరణ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. 2005లో చినరామయ్యతో నరసింహుడు రిలీజ్ అయినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. నిర్మాత ట్యంక్ బండ్ దగ్గర దూకేయడం చాలా బాధగా అనిపించింది. చినరామయ్య ఎలా ఉన్నాడో అని పలకరించడానికి వెళ్లి ఒక సలహా ఇచ్చాను. మీరు ఏడాదికి ఒక ఒకటో రెండో సినిమాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు తీనుకున్న రెమ్యునరేష్ లో నాలుగవ వంతు తీసుకో.. ఆ విధంగా మూడు నెలలకు ఒక సినిమా చేయి.. మొత్తంగా ఒక ఏడాదిలో నాలుగు సినిమాలు చేయి. అది కూడా చలసాని గోపి - అర్జున్ రాజు - త్రివిక్రమ రావ్ - దేవి ప్రసాద్ - అశ్విని దత్ - రామానాయుడు లాంటి మీ తాత గారి నిర్మాతలు 12 మంది ఉన్నారు కాబట్టి అలాంటి వారితోనే చేయి. నువ్ అంత రెమ్యునరేషన్ తీసుకొని చేసుకుంటూ వెళితే ఆ నిర్మాతలు నీ దగ్గరే ఉంటారు. అప్పుడు మిగతా వాళ్ల రెమ్యునరేషన్ కూడా తగ్గుతుంది. అలాగే నీతో సినిమా చేసినవాళ్లకు మొదటి వారంలోనే డబ్బులు వచ్చేస్తాయి ఇక ప్లాప్ అనేది నీ చరిత్రలో ఉండదు. సినిమా ఆడిందా లేదా అనేది తరువాత సంగతి పెట్టిన డబ్బులు నిర్మాతకు వచ్చాయా లేదా అనేదే ముఖ్యం. 'ఒకటి రెండు వారాల్లో డబ్బులు వచ్చేస్తాయి అని తారక్ తో చెబితే ఇలా అన్నాడు' లేదు పెదనాన్న.. ఇది పోటీ యుగం.. ఎక్కడ తలపడాలో అక్కడే తలపడాలి హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఎవరికైతే ఉందొ వారితో పోటీ పడి నేను తీసుకోవాల్సిందే మిగతా వారు ఎంత తీసుకుంటే అంత తీసుకుంటా.. నేను ఇలానే ఉంటా అని తారక్ చెప్పినట్లు పరుచూరి గోపాల కృష్ణ వివరణ ఇచ్చారు. సరే నీ ఇష్టం నానా అంటూ ప్రతి హీరో ఇప్పుడు అలానే ఆలోచిస్తున్నారని ఆ విధంగా హీరోలు అభిమానులకు చాలా ఆలస్యంగా కనిపిస్తున్నట్లు తన వివరణ ఇచ్చారు. Recent Stories
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కెప్టెన్‌గా టెస్టుల్లో ధోనీ ఇంకొంచెం..? వన్డే, టీ20ల్లో కెప్టెన్‌గా భారత్‌కి తిరుగులేని విజయాలు అందించిన మహేంద్రసింగ్ ధోనీ.. టెస్టుల్లో మాత్రం ఆ స్థాయిలో జట్టుని TNN | Updated: Mar 2, 2018, 02:48PM IST కెప్టెన్‌గా టెస్టుల్లో ధోనీ ఇంకొంచెం..? వన్డే, టీ20ల్లో కెప్టెన్‌గా భారత్‌కి తిరుగులేని విజయాలు అందించిన మహేంద్రసింగ్ ధోనీ.. టెస్టుల్లో మాత్రం ఆ స్థాయిలో జట్టుని నడిపించలేకపోయాడని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’ పేరుతో ఇటీవల గంగూలీ తన ఆత్మకథని పుస్తక రూపంలో తీసుకురాగా.. ప్రచారంలో భాగంగా ఓ మీడియా సంస్థకి ఈ మాజీ కెప్టెన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సమయంలోనే ‘క్రికెట్‌ ప్రపంచంలోనే మేటి కెప్టెన్ ఎవరు..?’ అనే ప్రశ్న గంగూలీకి ఎదురవగా.. మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లి కెప్టెన్సీ ఘనతల గురించి మాట్లాడి చివరికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పేరు చెప్పాడు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV భారత బౌలర్లపై ముప్పేట దాడి వ్యూహం..! భారత్ చేతిలో సొంతగడ్డపై వరుస పరాజయాలు చవిచూస్తున్న శ్రీలంక గురువారం జరగనున్న రెండో వన్డేలో వ్యూహం మారుస్తున్నట్లు TNN | Updated: Aug 23, 2017, 06:55PM IST భారత్ చేతిలో సొంతగడ్డపై వరుస పరాజయాలు చవిచూస్తున్న శ్రీలంక గురువారం జరగనున్న రెండో వన్డేలో వ్యూహం మారుస్తున్నట్లు తెలుస్తోంది. జట్టులోని టాప్-4 బ్యాట్స్‌మెన్ తొలుత భారత బౌలర్లపై ముప్పేట దాడి చేయాలని.. అలా అయితేనే జట్టు మెరుగైన స్కోరు చేయగలదని శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ సూచించాడు. తొలి వన్డేలో టీమిండియా బౌలర్ల ధాటికి 216 పరుగులకే శ్రీలంక కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఆదిలోనే శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చెలరేగితే.. భారత బౌలర్లు లయ తప్పుతారనేది తరంగ వ్యూహం కావొచ్చు. ‘జట్టు భారీ స్కోరు చేయాలంటే టాప్ ఆర్డర్‌లోని కనీసం నలుగురు బ్యాట్స్‌మెన్లు చెలరేగాలి. ఇందులో కనీసం ఒకరైనా శతకం సాధించాలి. గత 10-15 ఏళ్లుగా శ్రీలంక జట్టులో ఇదే తరహా దూకుడైన ఆటని చూశాం. బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకున్న తర్వాత.. బ్యాట్ ఝళిపించాలి. తొలి వన్డేని ఉదాహరణగా తీసుకుంటే.. మ్యాచ్‌లోని 25 ఓవర్ల వరకు మెరుగైన స్థితిలోనే ఉన్నాం. కానీ.. తర్వాత చెత్త షాట్లతో వరుసగా వికెట్లు సమర్పించుకున్నాం. కనీసం ఒకరైనా.. మ్యాచ్‌లో వెన్నెముక తరహా ఇన్నింగ్స్ ఆడాలి. అప్పుడే 280-300 స్కోరు చేయగలం’ అని తరంగ వివరించాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV 'బాహుబలి'కే సొంతమైన మరో రికార్డు కలెక్షన్ల రూపంలో సునామి సృష్టించడమేకాకుండా ప్రపంచవ్యాప్తంగానూ ఎంతో పేరు సంపాదించుకున్న తెలుగు సినిమా బాహుబలి... TNN | Updated: Sep 11, 2016, 08:08PM IST కలెక్షన్ల రూపంలో సునామి సృష్టించడమేకాకుండా ప్రపంచవ్యాప్తంగానూ ఎంతో పేరు సంపాదించుకున్న తెలుగు సినిమా బాహుబలి. రిలీజ్‌కి ముందు, రిలీజ్‌కి తర్వాత అనేక రికార్డులు సొంతం చేసుకున్న బాహుబలి సిగలో తాజాగా మరో రికార్డు వచ్చి చేరడం విశేషం. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే, హాలీవుడ్ మనసు పడిన 15 విదేశీ చిత్రాల జాబితాలో బాహుబలి మూవీకి చోటు దక్కడమే. అవును.. హాలీవుడ్‌‌కి చెందిన ఓ వెబ్‌పోర్టల్ రూపొందించిన 15 బిగ్గెస్ట్ ఫారెన్ బ్లాక్ బస్టర్స్ జాబితాలో బాహుబలి సినిమా 12వ స్థానంలో నిలిచింది. హాలీవుడ్ తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో అత్యధిక సినిమాలు, ఇన్వెస్ట్‌మెంట్, ప్రొడక్షన్ కలిగిన బాలీవుడ్ సినిమాలకి దక్కని ఓ అరుదైన గౌరవం ఇది. ఈ రికార్డు కారణంగా.. అంతర్జాతీయ స్థాయిలో సినీప్రముఖుల విమర్శలు అందుకున్న ఆంగ్ బ్యాక్(థాయిలాండ్), ది సిటీ ఆఫ్ గాడ్(బ్రెజిలియన్), అమిలీ (ఫ్రెంచ్), రాన్(జపనీస్) వంటి చిత్రాల సరసన నిలిచింది బాహుబలి సినిమా.
0business
WASIM ఐపిఎల్‌కు వసీం అక్రం దూరం న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ లెజెండరీ పేసర్‌ వసీం అక్రం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌)-2017 సీజన్‌కు దూరమయ్యాడు. కాగా ఐపిఎల్‌లో ప్రాంఛైజీగా ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు వసీం అక్రం బౌలింగ్‌ కోచ్‌,మోంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం కొన్ని కార్యక్రమాలు,బిజి షెడ్యూల్‌ కారణంగా ఐపిఎల్‌ -2017 సీజన్‌కు తాను అందుబాటులో ఉండనని నిర్వహకులకు ఇప్పటికే అక్రం వివ రించాడు.కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టును మిస్స వుతున్నానని, ఈ జట్టు ఎంతో ప్రతిభగలదని జట్టుకు అక్రం శుభాకాంక్షలు తెలిపాడు.కాగా ఈ మేరకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఎండి,సిఇఒ వెంకీ మైసూర్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడిం చాడు.గత కొన్నేళ్లుగా జట్టుకు విశేష సేవలందిం చిన అక్రం సేవలను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు మిస్‌ అవుతుందని పేర్కొన్నాడు.కాగా 2012, 2014లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు టైటిల్‌ గెలిచిందని,ఆ సమయంలో అక్రం జట్టుకు అందించిన సేవలను ఎప్పటికి మరిచిపోలేమని, ఇక అక్రం సైతం తాను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌ని మిస్‌ అవుతున్నట్లు వెల్లడించాడు.ఇదిలా ఉంటే ఐపిఎల్‌ 2017 సీజన్‌ ఏప్రిల్‌ 3 ప్రారంభమై మే 26న ముగియనుంది.టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌ కోల్‌కతా లోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వర్సెస్‌ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్ల మధ్య జరుగనుంది.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV Ind vs NZ T20 Squad: భారత్‌పై టీ20లకి న్యూజిలాండ్ టీమ్‌ ప్రకటన..! టీ20 జట్టులో యువ హిట్టర్ డారీ మిచెల్‌, బ్లెయిర్ టిక్‌నెర్‌ రూపంలో ఇద్దరు కొత్త ఆటగాళ్లకి ఛాన్సిచ్చిన న్యూజిలాండ్ సెలక్టర్లు.. సీనియర్ ఆటగాడు లూకీ ఫర్గూసన్‌‌ని మాత్రం తొలి రెండు టీ20లకి మాత్రమే అవకాశమిచ్చారు. Samayam Telugu | Updated: Jan 30, 2019, 01:57PM IST భారత్‌తో ఫిబ్రవరి 6 నుంచి జరగనున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం న్యూజిలాండ్ సెలక్టర్లు 14 మందితో కూడిన జట్టుని తాజాగా ప్రకటించారు. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు ముగియగా.. భారత్ చేతిలో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్ 0-3తో ప్రస్తుతం వెనకబడి సిరీస్‌ని చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో సీనియర్లతో పాటు యువ క్రికెటర్లకీ టీ20 జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు.. కనీసం ఈ సిరీస్‌లోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని ఆశిస్తున్నారు. భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో వన్డే గురువారం ఉదయం 7.30 నుంచి హామిల్టన్ వేదికగా జరగనుంది.
2sports
Hyderabad, First Published 6, Aug 2019, 4:49 PM IST Highlights ఆర్ఆర్ఆర్ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి అతిపెద్ద మల్టీస్టార్ మూవీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. 2020 జులై 30న విడుదల కాబోయే ఈ చిత్ర విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తి చూపుతున్నారు.    ఆర్ఆర్ఆర్ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి అతిపెద్ద మల్టీస్టార్ మూవీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. 2020 జులై 30న విడుదల కాబోయే ఈ చిత్ర విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తి చూపుతున్నారు.  ఈ చిత్రం స్వాతంత్ర సమర నేపథ్యంలో 1920 కాలంలో ఉంటుందని ఇది వరకే ప్రకటించారు. రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి కథకు సంబంధించిన ఓ విషయం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.  అల్లూరి సీతా రామరాజు 1897లో జన్మించారు. కొమరంభీం 1901లో జన్మించారు. సమకాలీనులైన వీరిద్దరూ యుక్త వయసులో అజ్ఞాతంలోకి వెళతారు. వీరిద్దరికి సంబంధం ఉన్నట్లు చరిత్రలో ఎక్కడా లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన వీరిద్దరూ స్నేహితులుగా మారితే.. అనే అంశంతో ఈ చిత్రం ఉండబోతోంది.  ఎన్టీఆర్, రాంచరణ్ తొలిసారి ఎలా కలిశారు అనే సన్నివేశాన్ని రాజమౌళి అద్భుతమైన ట్విస్ట్ తో తెరక్కిస్తున్నారట. చరణ్, ఎన్టీఆర్ తొలిసారి ఈ చిత్రంలో కలుసుకునే సన్నివేశం ఊహకందని విధంగా ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. రాంచరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీని ఇంకా ఖరారు చేయలేదు.  Last Updated 6, Aug 2019, 4:49 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV అన్‌లిమిటెడ్ 'కూల్' ఆఫర్...! బీఎస్‌ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం కూల్ పేరుతో సరికొత్త ఆఫర్‌‌ను ప్రవేశపెట్టింది. TNN | Updated: Feb 9, 2018, 06:00PM IST ప్రయివేటు టెల్కోల నుంచి వస్తున్న పోటీని ఎదుర్కోవడానికి.. దేశీయ టెలికామ్ సంస్థ బీఎస్‌ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌‌ను ప్రవేశపెట్టింది. 'కూల్' పేరుతో ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద రూ.1,099తో రీఛార్జ్ చేసుకున్న ప్రీపెయిడ్ వినియోగదారులకు 3జీ అన్‌లిమిటెడ్ డేటాతోపాటు, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందించనుంచి. ఈ ప్లాన్‌ కాలపరిమితి 84 రోజులు. రోజుకు రూ.13 చొప్పున వినియోగదారునికి ఖర్చవుతోంది. దేశంలోని అన్ని సర్కిళ్లలో ఈ ఆఫర్ అమల్లో ఉంది. దేశంలో కేరళ సర్కిల్‌లో మాత్రమే బీఎస్‌ఎన్ఎల్ 4జీ సేవలను అందిస్తోంది. మిగతా సర్కిళ్లల్లో 3జీ సేవలనే అందిస్తోంది. కేంద్ర ప్రభత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. కొత్తగా కనెక్షన్ తీసుకున్నవారి కోసం 2 జీబీ ఉచిత మోబైల్ డేటాను బీఎస్‌ఎన్ఎల్ అందిస్తోంది. 129 రోజుల కాలపరిమితితో రూ.666 ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా పొందవచ్చు. బీఎస్‌ఎన్ఎల్ ఇప్పటికే తన ల్యాండ్‌లైన్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టిన 'సండే కాల్స్' ఆఫర్‌ను మరో మూడు నెలల వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV వన్డే సిరీస్ నుంచి కివీస్ స్పిన్నర్ ఔట్ భారత్‌తో కీలకమైన వన్డే సిరీస్‌కి ముందే న్యూజిలాండ్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ టాడ్ ఆస్లే గాయంతో TNN | Updated: Oct 19, 2017, 02:30PM IST భారత్‌తో కీలకమైన వన్డే సిరీస్‌కి ముందే న్యూజిలాండ్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ టాడ్ ఆస్లే గాయంతో జట్టుకి దూరమయ్యాడు. భారత్ బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ వన్డేలో అస్లే గాయపడ్డాడని.. అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ ఇస్‌ సోధీని జట్టులోకి తీసుకుంటున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. ‘ఆస్లే ఇటీవల న్యూజిలాండ్-ఎ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన చేశాడు. వన్డేల్లో భారత్ బ్యాట్స్‌మెన్‌కి అతను సవాల్ విసురుతాడని ఆశించాము. కానీ.. గాయంతో అతను పక్కకి తప్పుకోవడంతో జట్టులోని క్రికెటర్లందరూ నిరాశ వ్యక్తం చేశారు’ అని న్యూజిలాండ్ కోచ్ మైక్ హసన్ వెల్లడించాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య వాంఖడే వేదికగా ఆదివారం తొలి వన్డే జరగనుంది.
2sports
పతంజలీకి పోటీగా హెచ్‌యూఎల్‌ - ఆయూష్‌ పేరుతో మార్కెట్లోకి ఉత్పత్తులు ముంబయి: ఆయుర్వేదిక్‌ ఉత్పత్తులతో మార్కెట్లో దూసుకు పోతున్న బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గ్రూపునకు చెక్‌ పట్టేందుకు బహుళజాతి సంస్థ 'హిందుస్థాన్‌ యూనిలీవర్‌' (హెచ్‌యూఎల్‌) రంగం సిద్దం చేసుకుంటోంది. పతంజలికి దీటుగా టూత్‌పేస్ట్‌, స్కిన్‌ కేర్‌ నుంచి సోప్స్‌, షాంపులు వంటి దాదాపు 20 ఆయుర్వేద ఉత్పత్తులను బ్రాండు ఆయుష్‌ పేరుతో విడుదల చేయాలని నిర్ణయించింది. వీటి ధరలను రూ.30 నుంచి రూ.130గా ఉండేలా కసరత్తు చేస్తోంది. హెచ్‌యూఎల్‌ ప్రీమియం బ్రాండుగా ఆయుష్‌ను 2001లో ప్రారంభించింది. కానీ 2007 నాటికి గుర్తింపును కోల్పోయింది. తిరిగి అయూష్‌ ప్రాభల్యాన్ని పెంచాలని హెచ్‌యుఎల్‌ నిర్ణయించింది. హెచ్‌యూఎల్‌ మార్కెట్లో ఇప్పటికే సౌందర్య ఉత్పత్తుల విభాగంలో సింహ భాగాన్ని కలిగి ఉన్న సంగతి తెలిసిందే. పదేళ్ల కాలంలోనే పతంజలి రూ.5000 కోట్ల టర్నోవర్‌కు చేరింది. 2015-16లో ఈ మొత్తం విలువ చేసే అమ్మకాలు చేసింది. కాగా హెచ్‌యుఎల్‌ రూ.30,000 కోట్ల పైగా రెవెన్యూ కలిగి ఉంది. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలను పడగొట్టి మార్కెట్లో దూసుకుపోవాలని పతంజలి ఎత్తుగడలు వేయడంతో, దానికి కౌంటర్‌ ఇచ్చేందుకు హెచ్‌యూఎల్‌ సిద్ధమైంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 150 Views హరారే : జింబాబ్వేతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ ద్వారా అరంగేట్రంలోనే సెంచరీ చేసిన భారత తొలి ఓపెనర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న రాహుల్‌ మరో మైలురాయిని  నమోదు చేశాడు.కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన రెండవ వన్డేలో రాహుల్‌ 33 పరుగులు చేశాడు. తద్వారా వన్డేల్లో మొదటిసారి ఆడిన ఆటగాడు ఔటయ్యే వరకు చేసిన పరుగుల ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.తొలి వన్డేలో సిక్స్‌తో సెంచరీ చేసిన రాహుల్‌ అజేయంగా నిలువగా ఈ మ్యాచ్‌లో 33 పరుగులు చేశాడు. దీంతో రాహుల్‌ ఔటయ్యే వరకు చేసిన పరుగులు 133. ఇది ఒక భారత ఆటగాడు అరంగేట్రంతో పాటు తొలి ఔటయ్యే వరకు చేసిన అత్యధిక పరుగుల రికార్డుగా నమోదైంది. అంతకు ముందు ఈ రికార్డు పుర్కరీ రామన్‌ పేరటి ఉంది. కాగా రామన్‌ అరంగేట్రం చేసి తొలి ఔటయ్యే వరకు 103 పరుగులు చేశాడు. కాగా 1988లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే ద్వారా రామన్‌ ఆరం గేట్రం చేశాడు. విండీస్‌తో ఏడు వన్డేల సిరీస్లఓ భాగంగా జనవరి 2న మూడవ వన్డే ద్వారా రామన్‌ జట్టులోకి వచ్చాడు. మూడవ వన్డేలో ఎనిమిది పరుగులు చేసి అజేయంగా ఉన్న రామన్‌ ఆ తరువాత వన్డేలో 95 పరుగులు చేశాడు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV మార్కెట్‌లోకి... 'ఇన్వెన్స్' స్మార్ట్‌ఫోన్లు! ఇన్వెన్స్ - డైమండ్ డి2, ఫైటర్ ఎఫ్1, ఫైటర్ ఎఫ్2 మోడల్ స్మార్ట్‌ఫోన్లు... TNN | Updated: Feb 8, 2018, 10:41AM IST చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల సంస్థ 'ఇన్వెన్స్' భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. డైమండ్ డి2 , ఫైటర్ ఎఫ్1 , ఫైటర్ ఎఫ్2 పేరిట మూడు రకాల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను విడుదలచేసింది. వీటి ధరలు వరుసగా రూ.7,490, రూ.8,990, రూ.11,490 గా ఉన్నాయి. ఈ ఫోన్లపై రెండు సంవత్సరాల వారంటీని అందిస్తున్నారు. మహిళల రక్షణ కోసం ఈ ఫోన్లలో ప్రత్యేక యాప్‌ను ఏర్పాటుచేశారు. ఇన్వెన్స్ డైమండ్ డి2 ఫీచర్లు: * 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘స్పైడర్’ టీజర్ టాక్.. మహేశ్ వల లోకి లాగేశాడు! ఎలాంటి డైలాగ్ లేకుండా, సినిమా కాన్సెప్ట్ ఏమిటో, మహేశ్ పాత్ర ఏమిటో TNN | Updated: Jun 1, 2017, 10:54AM IST మహేశ్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న స్పైడర్ టీజర్ రానే వచ్చింది. అనేక కారణాల చేత విడుదల వాయిదా పడుతూ వచ్చిన టీజర్ ను మురగదాస్ ఎట్టకేలకూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గ్లింప్స్ ఆఫ్ స్పైడర్ అంటూ.. కౌంట్ డౌన్ పెట్టి, అభిమానులను అమితంగా ఊరించి.. ఎట్టకేలకూ స్పైడర్ టీజర్ ను గురువారం ఉదయం పదిన్నరకు విడుదల చేశారు. మరెలా ఉంది.. అంటే, టైటిల్ కు న్యాయం చేసేట్టుగా ఉంది. ఒక ఆర్టిఫిషియల్ సాలీడు మహేశ్ మీదకు పాకుతూ.. డిస్ట్రబ్ చేస్తుండగా.. ఫేస్ టర్నింగ్ ఇస్తూ ‘ష్..’ అంటూ అభిమానులను ‘స్పైడర్’ వలలోకి లాగాడు. ఎలాంటి డైలాగ్ లేకుండా, సినిమా కాన్సెప్ట్ ఏమిటో, మహేశ్ పాత్ర ఏమిటో టీజర్ తో కొంత వరకూ క్లారిటీ ఇచ్చాడు మురుగదాస్ . మహేశ్ ఈ సినిమాలో గూఢచారిగా నటిస్తున్నాడనే విషయంపై మరింత స్పష్టతను ఇస్తోంది. — Mahesh Babu (@urstrulyMahesh) June 1, 2017 ఇక ఆర్టిఫిషియల్ స్పైడర్ పుట్టుకురావడం, టీజర్ లో వినిపించే బీజీఎం సినిమా క్వాలిటీకి దర్పణంగా నిలుస్తున్నాయి. వీటన్నింటికీ మించి మహేశ్ స్టైల్, ఫిజిక్ గూఢచారి పాత్రకు నిర్వచనాన్ని ఇస్తున్నట్టుగా ఉన్నాయి. సినిమా లేటవుతున్నా.. ఈ టీజర్ తో అభిమానులకు బోలెడంత భరోసాను ఇస్తున్నాడు మురుగదాస్! ​
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఐపీఎల్ ప్రసారాలను అడ్డుకోనున్న పాకిస్థాన్..! పీఎస్‌ఎల్ సమయంలో భారత్‌కి చెందిన ప్రసార కంపెనీలు, ప్రభుత్వం పాకిస్థాన్‌ క్రికెట్‌పై వివక్ష చూపాయి. ఇప్పుడు మేము ఎందుకు ఐపీఎల్‌ని ఉపేక్షించాలి. మేము రాజకీయాల్ని, క్రికెట్‌ను కలపకూడదని అనుకున్నాం. కానీ.. ? -పాక్ మంత్రి Samayam Telugu | Updated: Mar 21, 2019, 06:36PM IST ఐపీఎల్ ప్రసారాలను అడ్డుకోనున్న పాకిస్థాన్..! హైలైట్స్ పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌లో పీఎస్‌ఎల్ మ్యాచ్‌ ప్రసారాలు నిలిపివేత ఐపీఎల్‌ మ్యాచ్‌ ప్రసారాలను పాక్‌లో అడ్డుకుంటామని పాక్‌ మంత్రి తాజాగా ప్రకటన రాజకీయాలు, క్రీడల్ని తొలుత కలిపింది భారత్ అంటూ ఆరోపణలు పాక్‌ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడుకున్నా.. భారీగా ఆ దేశం నుంచి వీక్షకులు పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) మ్యాచ్‌ ప్రసారాలను డీస్పోర్ట్స్‌ నిలిపివేయగా.. తాజాగా పాకిస్థాన్‌ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. ఈ టోర్నీ మ్యాచ్‌లు పాక్‌లో ప్రసారం చేయడానికి వీల్లేదని ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్ అహ్మద్ చౌదరీ హుకం జారీ చేశాడు. ఐపీఎల్ 2019 సీజన్ పూర్తి షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి..! ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అసువులు బాసిన నేపథ్యంలో ఆ రోజు నుంచి టోర్నీ ముగిసే వరకూ అంటే మార్చి 17 వరకూ పీఎస్‌ఎల్ మ్యాచ్‌లను భారత్‌లో డీస్పోర్ట్స్, ఐఎంజీ రిలయన్స్‌ ప్రసారం చేయలేదు. దీంతో.. అప్పట్లో ఘాటు విమర్శలు గుప్పించిన పాకిస్థాన్‌.. ఇప్పుడు బదులు తీర్చుకోవడానికి సిద్ధపడుతోంది. ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ 2008లో పాకిస్థాన్ క్రికెటర్లను టోర్నీలో ఆడేందుకు అనుమతిచ్చిన భారత్.. ముంబయి దాడుల తర్వాత వారిని ఐపీఎల్‌లోకి అనుమతించడం లేదు. దీంతో.. గత పదేళ్లుగా ఐపీఎల్‌కి దూరంగానే పాక్ క్రికెటర్లు ఉంటున్నారు. ‘పీఎస్‌ఎల్ సమయంలో భారత్‌కి చెందిన ప్రసార కంపెనీలు, ప్రభుత్వం పాకిస్థాన్‌ క్రికెట్‌పై వివక్ష చూపాయి. ఇప్పుడు మేము ఎందుకు ఐపీఎల్‌ని ఉపేక్షించాలి. మేము రాజకీయాల్ని, క్రికెట్‌ను కలపకూడదని అనుకున్నాం. కానీ.. భారత్ జట్టు ఆస్ట్రేలియాపై ఆర్మీ క్యాప్‌లు ధరించి మరీ మ్యాచ్ ఆడింది. దీనిపై ఐసీసీ నుంచి ఎలాంటి చర్యలూ లేవు. ఐపీఎల్‌ను పాకిస్థాన్‌లో ప్రసారం చేయనివ్వకపోతే.. అది కచ్చితంగా భారత క్రికెట్‌కి నష్టం చేకూరుస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్ ఓ సూపర్ పవర్’ అని చౌదరీ వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ కి ఆఫర్ ఇచ్చిన బ‌న్ని Highlights ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగుతున్న డైరెక్ట‌ర్ పేరు సందీప్ వంగా  త‌న మొద‌టి సినిమా అర్జున్ రెడ్డి లో త‌న టాలెంట్ ఎంటో చూపించాడు అర్జున్ రెడ్డి మూవీని స్పెష‌ల్ స్కీనింగ్ వేయించుకుని చూసిన అల్లు అర్జున్  సందీప్ వంగా.ఇప్పుడీ దర్శకుడి పేరు టాలీవుడ్ లో మార్మోగిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అర్జున్ రెడ్డి అంటూ కేవలం ఒక్క సినిమాతోనే తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏంటో చూపించేశాడు. అంతే కాదు.. ప్రొడ్యూసర్స్.. బయ్యర్స్.. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తొలి వీకెండ్ ముగిసేలోపే లాభాలు కళ్లచూశారంటే.. అది కచ్చితంగా సెన్సేషనల్ విక్టరీనే.    ఇంతటి ఘన విజయాన్ని సాధించిన దర్శకుడికి.. పెద్ద హీరోల నుంచి అభినందనలు రావడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. మిగతావారి కాల్స్ కు.. అల్లు అర్జున్ ప్రశంసలకు కాసింత తేడా ఉంటుంది. రీసెంట్ గా అర్జున్ రెడ్డిని స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకుని మరీ చూసిన స్టైలిష్ స్టార్.. మూవీ కంటెంట్.. మేకింగ్ చూసి మెస్మరైజ్ అయ్యాడట.    అంతే కాదు. వెంటనే దర్శకుడు సందీప్ ను పిలిపించి అభినందించాడట కూడా. అంతే కాదు.. తనకు తగిన మంచి స్క్రిప్ట్ తో వస్తే సినిమా చేద్దామని కూడా చెప్పాడట బన్నీ. గతంలో హరీష్ శంకర్ కు ఇలాగే కాల్ ద్వారా పిలుపు అందుకుని.. ఆ తర్వాత డీజే-దువ్వాడ జగన్నాధం తెరకెక్కించాడు.    తర్వాత వక్కంతం వంశీకి కూడా ఇలాగే ఛాన్స్ రాగా.. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న నా పేరు సూర్య రూపొందుతోంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీలో స్టార్ హీరో ఎవరైనా నటిస్తే.. అది అల్లు అర్జున్ కి మాత్రమే సరిపోతుందని ముందే చెప్పిన సందీప్ వంగా.. నేరుగానే బన్నీ నుంచే పిలుపు అందుకోవడం విశేషం.    మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి  https://goo.gl/UR95BM Last Updated 26, Mar 2018, 12:02 AM IST
0business
TRIPATI వెెలుగులోకి మరో యువ క్రికెటర్‌ న్యూఢిల్లీ: ఐపిఎల్‌ పదవ సీజన్‌లో సీనియర్‌్‌ ఆటగాళ్లతో పోలిస్తే యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.తాజాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో యువ ఆటగాడు దుమ్మురేపాడు. తన అద్భుత ప్రదర్శ నతో పుణే జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడే రాహుల్‌ త్రిపాఠి. ధనాధన్‌ బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై విరుచుకుపడ్డాడు. అద్భుతమైన షాట్లు కొడుతూ అలవోకగా బౌండరీలు,సిక్సర్లు బాదేశాడు.అంతర్జాతీయ అనుభవం లేకున్నా ఈ సీజన్‌తోనే వెలుగులోకి వచ్చిన అతడు విధ్వంసక బ్యాటింగ్‌ చేశాడు. రాహుల్‌ ప్రతిఠి పూర్తి పేరు రాహుల్‌ అజ§్‌ు త్రిపాఠి.1991లో మహారాష్ట్రలోని రాంచీలో జన్మించాడు. తండ్రి ఆర్మీలో పనిచేశారు.రాహుల్‌ తండ్రి కూడా ఉత్తరప్రదేశ్‌ జూనియర్‌ లెవల్‌ తరుపున క్రికెట్‌ ఆడారు.అందుచేతనే రాహుల్‌కి చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే మక్కువ.లోకల్‌ క్రికెట్‌లో భాగంగా జరిగిన ఒకటోర్నీలో రాహుల్‌ త్రిపాఠి ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు రెండు సార్లు బాదాడు. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన ఐపిఎల్‌ వేలంలో రాహుల్‌ కనీస ధర 10 లక్షలు.ఇతన్ని పుణే కొనుగోలు చేసింది.ఓవైపు వికెట్లు పడు తున్నా 52 బంతుల్లో 9 బౌండరీలు,7 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసి జట్టుకు ఒంటి చేత్తో విజాయాన్ని అందించాడు.ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో త్రిపాఠి సూపర్‌ షోతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. త్రిపాఠిపై స్మిత్‌ ప్రశంసలు మ్యాచ్‌ అనంతరం త్రిపాఠి ప్రదర్శనతో పుణే కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ సంతోషం వ్యక్తం చేశాడు. త్రిపాఠిని ప్రశంసలతో ముంచెత్తాడు.రాహుల్‌ త్రిపాఠి అంటే ఏమిటో మాకు ఈ మ్యాచ్‌ తెలి సేలా చేసింది. మ్యాచ్‌లో రాను రాను వికెట్‌ స్లోడౌన్‌ అవుతుందని మేం భావించాం.అందుకే పవర్‌ ప్లేలోనే ఎక్కువపరుగులు సాధించేందుకు ప్రయత్నించాం అని స్మిత్‌ పేర్కొన్నాడు.త్రిపాఠి బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. దురదృష్ట వశాత్తు అతను సెంచరీ చేయలేదు.సెంచరీకి అతను ఎంతో అర్హుడు అని స్మిత్‌ వివరించాడు. వరుసగా హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేయ డంపై స్టీవ్‌ స్మిత్‌ హర్షం వ్యక్తం చేశాడు.గడిచిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలువడం ఆనం దంగా ఉందన్నాడు.త్రిపాఠి 52 బంతులు ఆడి 9 బౌండరీలు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేసి తన సత్తా ఏమిటో కనబరిచాడు.
2sports
Umpire పేలవ పిచ్‌పై బిసిసిఐకి జరిమానా లండన్‌: భారత్‌ఆస్ట్రేలియా తొలి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన ఎంసిఎ స్టేడియం పేలవంగా ఉందని ఐసిసి మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ నివేదిక ఇచ్చింది.ఈ నేపథ్యంలో బిసిసిఐకి ఐసిసి సుమారు 19,500 ఆస్ట్రేలియా డాలర్లు జరి మానా విధించినట్లు సమాచారం.బ్రాడ్‌ ఇచ్చిన నివేదిక ఇప్పటికే బిసిసిఐకి అందింది.దీనిపై బిసిసిఐ 14 రోజుల్లో స్పందించాల్సి ఉంటుంది. బిసిసిఐ చీఫ్‌ క్యూరేటర్‌ దల్జిత్‌ సింగ్‌ ఆదేశాల మేరకే పుణే క్యూరేటర్‌ పాండురంగ్‌ పిచ్‌ని తయారు చేసినట్లు మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.రెండు సంవత్సరాల కిందట భారత్‌,దక్షిణాఫ్రికా టెస్టుకు ఆతిథ్యమిచ్చిన నాగ్‌పూర్‌ పిచ్‌ కూడా సరిగా లేదని రిఫరీ నివేదిక ఇవ్వగా అప్పుడు ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది.అప్పుడు కూడా బిసిసిఐ చీఫ్‌ క్యూరేటర్‌గా దల్జిత్‌ సింగ్‌ ఉన్నాడు.బిసిసిఐ స్పందించిన తరువాత పిచ్‌ విషయంలో హెచ్చరించడమా? జరిమాన విధించడమా అన్న దానిపై బిసిసిఐ నిర్ణయం తీసుకోనుంది.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV షూటింగ్‌లో హీరోయిన్ బట్టలు చించేసిన డైరెక్టర్ ! షూటింగ్ జరుగుతుండగానే అందరి మధ్యలో తన బట్టలు చించేశాడంటూ డైరెక్టర్‌పై పోలీసులకి ఫిర్యాదు... TNN | Updated: May 13, 2016, 08:58PM IST షూటింగ్ జరుగుతుండగానే అందరి మధ్యలో తన బట్టలు చించేశాడంటూ మలయాళం డైరెక్టర్ స్నేహజిత్‌పై పోలీసులకి ఫిర్యాదు చేసిందో హీరోయిన్. మనోరమ ఆన్‌లైన్ కథనం ప్రకారం కేరళలోని తోడుఫుఝలో దైవం సాక్షి అనే మలయాళం సినిమా షూటింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. త్రిశూర్‌కి చెందిన ఈ హీరోయిన్ చేసిన ఫిర్యాదు మేరకు తోడుఫుఝ ఉమెన్ సెల్ విభాగంలో కేసు నమోదైంది. అంతకన్నా ముందే ఆమె ఫిర్యాదు మేరకు కలియార్ పోలీసులు సైతం ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టుగా ఈ కథనం పేర్కొంది. తనకి స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ లేదా సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు కానీ ఇలా స్ట్రిప్ సీన్ ఉందనే విషయాన్ని డైరెక్టర్ స్నేహజిత్ తనకి చెప్పలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
0business
Jun 07,2016 ఆంధ్రాబ్యాంక్‌ ఆరోగ్య శిబిరం సక్సెస్‌ నవతెలంగాణ- వాణిజ్య విభాగం: సామాజిక బాధ్యతలో భాగంగా ఆంధ్రాబ్యాంక్‌ విద్యానగర్‌ శాఖలో నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. సోమవారం ఉదయం బ్యాంక్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని బ్యాంక్‌ బ్రాంచి మేనేజర్‌ జి.గణ్‌ష్‌ ప్రారంభించారు. సమాజిక హితం కోరుతూ తాము యశోద హాస్పిటల్స్‌ వారి సౌజన్యంతో ఈ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. సామాజిక బాధ్యతతో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడంతో విద్యానగర్‌ శాఖ ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో దాదాపు 200 మంది ఆరోగ్యదాన్‌ ఖాతాదారులు, బ్రాంచీ ఖాతాదారులు, ఇతరులు ఈ శిబిరంలో తమ పేర్లను నమోదు చేయించుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ind vs ban 1st t20: indian opener shikhar dhawan playing with rohit sharma's daughter samaira సమైరా తాకగానే పడిపోయిన శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. భారత్ జట్టులో పోటీ పతాక స్థాయికి చేరింది. దీంతో.. జట్టులో ఎవరి స్థానానికి భరోసా దక్కడం లేదు. ఫామ్ కోల్పోయిన ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాడు. Samayam Telugu | Updated: Nov 3, 2019, 04:00PM IST Shikhar Dhawan వరల్డ్‌కప్ తర్వాత భారత ఓపెనర్ శిఖర్ ధావన్ నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లో విఫలమైన ధావన్.. ఆదివారం బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న మూడు టీ20 సిరీస్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడటం ద్వారా జట్టులో తన స్థానాన్ని కాపాడుకోవాలని ఆశిస్తున్నాడు. Read More: తొలి టీ20లో భారత్ తుది జట్టు‌పై ఉత్కంఠ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి శిఖర్ ధావన్ టీమిండియా ఇన్నింగ్స్‌ని ఆరంభించనున్నాడు. ఢిల్లీకి చెందిన ధావన్‌కి అరుణ్ జైట్లీ స్టేడియం సొంత మైదానం కావడంతో అతనిపై భారీగా అంచనాలున్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ టీ20 సిరీస్ నుంచి భారత సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.
2sports
Bathukamma Song: మంగ్లీ బత... బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా , దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా ఆల్ రౌండర్ పాత్రను పోషిస్తూ రూపొందుతున్న చిత్రం ' శివాయ్ '. ఈ చిత్రానికి సంబధించిన ట్రైలర్ ను అజయ్ దేవగణ్ విడుదల చేశారు. దేవాదిదేవుడు లయకారుడు పరమ శివుడిని కాన్సెప్ట్ ను తీసుకొని హై ఎండ్ యాక్షన్ -డిస్ట్రాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తెలుగులో 'అఖిల్' సినిమాలో నటించిన సయేషా సైగల్.. అజయ్ దేవగణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దీపావళికి ఈ సినిమా విడుదల చేయనున్నారు.
0business
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV విరుష్క విందు @ముంబై: అనిల్ కుంబ్లే సర్‌ప్రైజ్! ముంబైలో విరుష్క జంట వివాహ విందు ఘనంగా ప్రారంభమైంది. దీని కోసం సెయింట్ రెజిస్‌లోని లోయర్ పారెల్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇటీవలే పెళ్లి బంధం ద్వారా ఒక్కటైన విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ జంట.. మంగళవారం (డిసెంబర్ 26) సాయంత్రం ముంబైలో మరోసారి వివాహ రిసెప్షన్‌ ఏర్పాటు చేసింది. TNN | Updated: Dec 26, 2017, 11:07PM IST ముంబైలో విరుష్క జంట వివాహ విందు ఘనంగా ప్రారంభమైంది. దీని కోసం సెయింట్ రెజిస్‌లోని లోయర్ పారెల్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇటీవలే పెళ్లి బంధం ద్వారా ఒక్కటైన విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ జంట.. మంగళవారం (డిసెంబర్ 26) సాయంత్రం ముంబైలో మరోసారి వివాహ రిసెప్షన్‌ ఏర్పాటు చేసింది. ఢిల్లీలో ఇప్పటికే ఒకసారి వివాహ విందు ఇచ్చిన విరుష్క జోడీ.. క్రికెటర్లు, వివిధ రంగాల ప్రముఖుల కోసం దేశ ఆర్థిక రాజధానిలో మరోసారి విందు ఏర్పాటు చేసింది. అయితే.. ఈ విందుకు టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా హాజరై ఆశ్చర్యపరిచారు.
2sports
Also Read: ‘సైరా’కి చిక్కులు.. అల్లు ‌అరవింద్ ఎంట్రీ! అయితే, హరీష్ శంకర్ ఈ మధ్య సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్‌లు చూస్తే మాత్రం కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. ఆ పోస్టుల్లో చాలా వరకు ‘వాల్మీకి’ సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ గురించే ఉంటున్నాయి. రీసెంట్‌గా కూడా అయనంక బోస్‌తో ఉన్న వర్కింగ్ స్టిల్స్ పోస్ట్ చేసి దానికింద కొన్ని కామెంట్స్ కూడా పెట్టాడు. ‘వాల్మీకి’ సినిమా జర్నీ‌లో ఎదురైన అద్భుతమైన మూమెంట్స్ గురించి చెప్పుకొచ్చాడు. ఆ సినిమా ఔట్‌పుట్ చూసుకున్నాక హారీష్ చాలా హ్యాపీగా ఉన్నాడట. అంతే కాదు బోస్‌కి రుణపడి ఉంటా అంటూ రాసుకొచ్చాడు. https://t.co/3oIua3JZlS — Harish Shankar .S (@harish2you) 1567938728000 అలాగే, ‘వాల్మీకి’ ట్రైలర్ ఫైనల్ కట్ కూడా అయిపోయిందని హరీష్ ట్వీట్ చేశాడు. వరుణ్‌ను గద్దల కొండ గణేష్‌గా పరిచయం చేయబోతున్నట్టు చెప్పాడు. త్వరలోనే ట్రైలర్‌ను షేర్ చేయడం సూపర్ ఎక్సయిటెడ్‌గా ఉందని పేర్కొన్నాడు. దీన్నిబట్టి ‘వాల్మీకి’ సినిమా ఔట్‌పుట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. Just finished the theatrical trailer final Cut...... Introducing @IAmVarunTej as “Gaddala Konda Ganesh” Super ex… https://t.co/ythwkUkk7z — Harish Shankar .S (@harish2you) 1567886129000 ఇదిలా ఉంటే, ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్‌గా మారిన వరుణ్ తేజ్ లుక్ వెనుక బోస్ సజెషన్స్ ఉండే ఉంటాయి. ‘DJ’ సినిమాకి బోస్‌తో కలిసి పనిచేసిన హరీష్‌కు అతనితో వేవ్‌లెంగ్త్ సెట్ అవ్వడంతో ఈ సినిమాకి కూడా మళ్ళీ ఆయన్నే డీఓపీగా తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్‌ని బట్టి ‘వాల్మీకి’ సినిమా ఔట్‌పుట్ ఒక రేంజ్‌లో ఉంటుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది. వరుణ్‌ తేజ్ లుక్ గానీ, ఇప్పటికే రిలీజ్ అయిన ఐటమ్ నెంబర్ కానీ, పూజా హెగ్డే ట్రెడిషనల్ అవతార్‌ గానీ.. ఇలా అన్నీ ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. వాటిలో బోస్ కంట్రిబ్యూషన్ క్రెడిట్ అతనికే ఇస్తున్నాడు హరీష్ శంకర్. ఈ సినిమాకి రెమ్యునరేషన్ కూడా లేకుండా కేవలం బిజినెస్‌లో వాటా అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సూపర్ టాలెంటెడ్ హరీష్‌కి మళ్ళీ ‘గబ్బర్‌సింగ్’ లాంటి హిట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది ‘వాల్మీకి’ సినిమా విజువల్స్ చూసిన వాళ్ళు చెబుతున్న మాట. ఈనెల 20న రిలీజ్ కాబోతుంది ‘వాల్మీకి’. చూద్దాం ఏ రేంజ్‌లో సిల్వర్ స్క్రీన్ షేక్ చేస్తుందో..!
0business
బిగ్ బాస్ హౌస్ లో నందమూరి హీరో? Highlights ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 కు మంచి రేటింగ్స్ రావడంతో ఇప్పుడు సీజన్ 2 ను  ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 కు మంచి రేటింగ్స్ రావడంతో ఇప్పుడు సీజన్ 2 ను మొదలుపెట్టనున్నారు. నేచురల్ స్టార్ నాని ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్న వారి లిస్టు ఇదే అంటూ 16 మంది పేర్లు బయటకు వచ్చాయి.  అందులో హీరో తరుణ్ పేరు ఉంటే అసలు తనకు బిగ్ బాస్ షోపై ఎలాంటి ఇంటరెస్ట్ లేదని చెప్పేశాడు తరుణ్. ఇప్పుడు నందమూరి తారకరత్న ఈ షోలో కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. హీరోగా సక్సెస్ లు రాకపోవడంతో మధ్యలో విలన్ గా ట్రై చేశాడు తారక రత్న. అది కూడా వర్కవుట్ కాకపోవడంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ వస్తుందనే ఆలోచనతో షోలో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.  Last Updated 2, Jun 2018, 6:48 PM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV HDFC Bank కస్టమర్లకు అలర్ట్.. వైరల్ అవుతున్న ఫోటోపై బ్యాంక్ క్లారిటీ! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు ఒక అలర్ట్. బ్యాంక్‌కు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బ్యాంక్ పాస్‌బుక్‌పై డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ స్టాంప్ చేసినట్లు ఉన్న ఫోటో దీనికి కారణం. Samayam Telugu | Updated: Oct 18, 2019, 11:48AM IST HDFC Bank కస్టమర్లకు అలర్ట్.. వైరల్ అవుతున్న ఫోటోపై బ్యాంక్ క్లారిటీ! హైలైట్స్ వార్తల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్యాంక్ పాస్‌బుక్ ఇందుకు కారణం దీనిపై డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ వివరాలు దీంతో పాస్‌బుక్ ఫోటో వైరల్ దేశీ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పాస్‌బుక్ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పాస్‌బుక్‌‌పై డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ స్టంప్ చేసి ఉండటం ఇందుకు ప్రధాన కారణం. బ్యాంక్ ఎందుకు స్టాంప్ వేసిందో తెలియకపోవడంతో డిపాజిటర్లలోనూ కొంత గందరగోళం నెలకొంది. పీఎంసీ బ్యాంక్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరునంలో ఈ పాస్‌బుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగం గమనార్హం.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV థ్యాంక్యూ 20డివిలియర్స్.. వెల్‌కమ్ 20కోహ్లి థాంక్యూ 20డివిలియర్స్, వెల్‌కమ్ 20కోహ్లి..? ఏంటని కన్ఫ్యూజన్ అవుతున్నారా..? ఇది పక్కా క్రికెట్ స్టయిల్లో పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ.. కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పడం అన్నమాట. TNN | Updated: Jan 1, 2018, 12:36PM IST థాంక్యూ 20డివిలియర్స్, వెల్‌కమ్ 20కోహ్లి..? ఏంటని కన్ఫ్యూజన్ అవుతున్నారా..? ఇది పక్కా క్రికెట్ స్టయిల్లో పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ.. కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పడం అన్నమాట. భారత్‌లో క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులు కోట్లలోనే ఉంటారు. వీరికి నేటి జనరేషన్లో కోహ్లి, డివిలియర్స్ అంటే పిచ్చి క్రేజ్. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున ఇద్దరూ కలిసి ఆడుతుండటంతో.. కుర్రాళ్లు కోహ్లితోపాటు డివిలియర్స్ ఆటను చూసి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. క్రికెట్ మీద ప్రేమ, వీరిద్దరంటే అంతులేని అభిమానం ఉన్న ఫ్యాన్స్ ఇలా కొత్త ఏడాదికి స్వాగతం చెబుతున్నారు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV రెజీనా ఆ కండలవీరుడుతో రొమాన్స్! టాలీవుడ్ కండలవీరుడు రానా ఇటీవల 'ఘాజీ' సినిమాతో సక్సెస్ అందుకుని ఇతర భాషల్లో కూడా బిజీ అయ్యాడు. తాజాగా... TNN | Updated: Mar 8, 2017, 06:56PM IST టాలీవుడ్ కండలవీరుడు రానా ఇటీవల 'ఘాజీ' సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా తను నటించిన బాహుబలి, ఘాజీ చిత్రాలు ఇతర బాషల్లో కూడా విడుదలయ్యాయి. ఆరంభం, బెంగళూర్ నాట్కల్ వంటి చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు కూడా రానా దగ్గరయ్యాడు. బాహుబలి సినిమాతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. అయితే ప్రస్తుతం రానా ఓ బైలింగ్యువల్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దర్శకుడు సత్యశివ రూపొందించనున్న ఈ సినిమా కథ రానాకు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రెజీనాను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఈ భామకు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నా.. కోలీవుడ్‌లో మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. స్వాతంత్ర్యం సాధించక ముందు జరిగిన ఓ చారిత్రక కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ పిరియాడికల్ సినిమాకు ‘మడైతిరంద’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. మరి ఈ సినిమా రానా, రెజీనాలకు ఎలాంటి సక్సెస్ ను ఇస్తుందో చూడాలి.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV 'బాహుబలి 2' టీమ్‌ని ఆకాశానికెత్తేసిన ఏ.ఆర్. రెహ్మాన్ బాహుబలి 2 సినిమా రిలీజై నాలుగో వారంలోకి అడుగిడినా ఆ టీమ్‌కి వెల్లువెత్తుతున్న అభినందనలు మాత్రం ఇంకా... | Updated: May 22, 2017, 06:21PM IST AR Rahman బాహుబలి 2 సినిమా రిలీజై నాలుగో వారంలోకి అడుగిడినా ఆ టీమ్‌కి వెల్లువెత్తుతున్న అభినందనలు మాత్రం ఇంకా ఆగడం లేదు. ఒకరి తర్వాత మరొకరిగా నిత్యం ఎవరో ఒక టాప్ సెలబ్రిటీ ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే వున్నాడు. తాజాగా ఫేమస్ కంపోజర్ ఏ.ఆర్. రెహ్మాన్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. రాజమౌళి గారు, కీరవాణి గారు, బాహుబలి 2 టీమ్ అందరినీ ఉద్దేశిస్తూ తన ప్రశంసని మొదలుపెట్టిన ఏ.ఆర్. రెహ్మాన్, 'చెన్నైలో ఇప్పుడే ఈ సినిమా చూశానని.. ప్రపంచవ్యాప్తంగా సౌతిండియన్ సినిమాకు తగిన గుర్తింపు తీసుకొచ్చారు' అని బాహుబలి 2 టీమ్‌ని అభినందించారు రెహ్మాన్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నట్టు రెహ్మాన్ తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. తన ఫేస్‌బుక్ ఎకౌంట్ ద్వారా రెహ్మాన్ చేసిన ఆ పోస్ట్‌పై మీరూ ఓ లుక్కేయండి!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
BPCL యుఎస్‌ ముడిచమురు కొనుగోలుపై బిపిసిఎల్‌ న్యూఢిల్లీ,జూలై 11: భారత్‌పెట్రోలియం కార్పొరేషన్‌ అమెరికా నుంచి మొదటిసారిగా ముడిచమురును కొనుగోలుచేస్తోంది. టెండర్‌ను దాఖలు చేసినట్లు సోమవారం ప్రకటించింది. బిపిసిఎల్‌ కనీసం మిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురు అవసరం అవుతుంది. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 5వ తేదీ లోడ్‌ అవుతుందని, సెప్టెంబరు 26లేదా అక్టోబరు 15 తేదీల మధ్య పంపిణీ అవుతుందని అంచనా. టెండరులో మొదటిభాగం ఈనెల 11వ తేదీన ముగుస్తుంది. రెండోభాగం జూలై 14వ తేదీ ముగుస్తుంది. మొత్తం మీద మొట్టమొదటిసారిగా అమెరికా ఇంధనాన్ని బిపిసిఎల్‌ కొనుగోలు చేస్తోంది.
1entertainment
Dec 24,2015 వాట్సాప్‌లో వీడియో కాలింగ్‌!       న్యూఢిల్లీ: ఇన్‌స్టెంట్‌ మెసేజింగ్‌ విభాగంలో సంచలనం వాట్సప్‌ వినూత్న సేవలతో మరింత విస్తరించాలని యోచిస్తోంది. త్వరలో వీడియో కాలింగ్‌ను సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే పనిలో పడింది. వాట్సప్‌ తాజాగా తీసుకురానున్న ఐఓఎస్‌ వర్షన్‌లో ఈ సదుపాయం కల్పించే యోచనలో ఉన్నామని సంస్థ జర్మన్‌ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఇతర వీడియో మెసెంజర్ల నుంచి పోటీని తట్టుకుని నిలబడేందుకు వీడియో కాలింగ్‌ సదుపాయాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపింది. 2016 మార్చి నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే స్కైప్‌, ఐఎంఓ, గూగుల్‌, హ్యాంగవుట్స్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు వీడియో కాలింగ్‌ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 2015 సెప్టెంబర్‌ ముగింపు నాటికి వాట్సప్‌ విస్తృతి 90 కోట్ల మంది ఖాతాదార్లను చేరిన విషయ విదితమే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
శ్రీనువైట్లకు కాజల్ ఝలక్.. కథ వినకుండానే నో ! Highlights రవితేజ తొలిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్న సినిమా అమర్ అక్బర్ ఆంటోని ఇది హిట్ అయితేనే అతనికి టాలీవుడ్ మళ్లీ మరో అవకాశం దక్కేది ఇది కూడా పాత సినిమాల్లాగే అట్టర్ ఫ్లాప్ అయితే... మూట ముల్లె సర్దుకోవాల్సిందే.      రవితేజ తొలిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్న సినిమా అమర్ అక్బర్ ఆంటోని. ఈ సినిమాను శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా శ్రీను కెరీర్కు చాలా ముఖ్యమైన సినిమా. ఇది హిట్ అయితేనే అతనికి టాలీవుడ్ మళ్లీ మరో అవకాశం దక్కేది. ఇది కూడా పాత సినిమాల్లాగే అట్టర్ ఫ్లాప్ అయితే... మూట ముల్లె సర్దుకోవాల్సిందే.  అమర్ అక్బర్ ఆంటోనీలో రవితేజ ముగ్గురిగా కనిపించబోతున్నాడంటే... హీరోయిన్లు కూడా ముగ్గురుండాలిగా. ప్రస్తుతానికైనా ఇద్దరిని పెడుతున్నట్టు సమాచారం. అందులో ఒక హీరోయిన్ గా అను ఇమ్యాన్యుయేల్ ఓకే అయింది. నిజానికి అను కన్నా ముందు కాజల్ ను పెట్టాలనుకున్నాడు శ్రీను వైట్ల.  ఎందుకంటే  కాజల్ తన సినిమాలో అదృష్టం కలిసివస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు. ఆమెను సంప్రదించాడు కూడా. కాజల్ కథ వినకుండానే నో చెప్పేసిందని తెలుస్తోంది. దానికి కాజల్ చెప్పే కారణాలు కూడా సరైనవేలా కనిపిస్తున్నాయి. శ్రీను వైట్ల సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అలాగే రవితేజ పరిస్థితి అలాగే ఉంది. గతంలో రవితేజతో తాను చేసిన సినిమాలు కూడా ఏమాత్రం ఆడలేదు. మళ్లీ అదే దర్శకుడు... అదే హీరోతో చేస్తే... ఫలితం కూడా అలాగే ఉంటుందేమో అని కాజల్ భావించిందట. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. ఆ నిర్మాణసంస్థ చాలా తక్కువ బడ్జెట్ సినిమాను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉందట. అంటే తాను రెమ్యునరేషన్ పరంగా కూడా చాలా తగ్గించుకోవాలి. అందుకే అసలు ఆ ప్రాజెక్టే చేయకూడదని కాజల్ నిర్ణయించుకుందట. ఇదే విషయాన్ని శ్రీను వైట్లకే నేరుగా చెప్పేసిందని టాక్. దాంతో అను ఇమ్మాన్యుయేల్ ను తీసుకున్నారు. ఇక రెండో హీరోయిన్ గా నివేదా థామస్ ను అనుకుంటోంది చిత్ర యూనిట్.  Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0business
ESSAR1 ఎస్సార్‌స్టీల్‌పై టాటా, పోస్కోల ఆసక్తి! ముంబయి, ఆగస్టు 24: ఎస్సార్‌గ్రూప్‌ తమ ఆస్తులను రష్యాకు చెందిన రాస్‌నెప్ట్‌కు విక్రయ ప్రక్రియను పూర్తిచేసిన తర్వాత వెనువెంటనే రూయా కుటుంబం అధీనంలోని మెటల్‌ బిజినెస్‌ను కూడా కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకువస్తున్నారు. టాటాస్టీల్‌, పోస్కో సంస్థలు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న ఎస్సార్‌ స్టీల్‌ను కొనుగోలుచేసేందుకు మరింతగా ఆసక్తి చూపిస్తున్నాయి. టాటాస్టీల్‌ ప్రాథమికంగా ఆసక్తిని చూపించింది. ఎస్టార్‌స్టీల్‌ ఆసంస్థ ఆస్తులను కొనుగోలుపై దృష్టిపెట్టింది. అంతేకాకుండా అంతర్జా తీయ వ్యూహాత్మకసంస్థలు పోస్కోవంటి భారీ సంస్థలు కూడా ఎస్సార్‌స్టీల్‌న ుకొనుగోలుకు ముందుకు వస్తున్నాయి. టాటాస్టీల్‌ ఇప్పటికే ఎస్సార్‌స్టీల్స్‌ ఐఆర్‌పి అల్వరెజ్‌ అండ్‌మార్షల్‌ ఇండియా వృత్తినిపుణు లను సంప్రదించిందన్న వార్తలువెలువడ్డాయి. ఎస్సార్‌స్టీల్‌కు చెందిన దివాలా చట్టం, దివాలా, దివాలా నియమావళికింద కంపెనీ ఆస్తులను పరిష్కరించేందుకు ఆయన పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నా రు. నేషనల్‌కంపెనీలా ట్రిబ్యునల్‌ ఎస్సార్‌ స్టీల్‌ దివాలాకేసును ఈనెలలోనే పరిష్కరించేందుకు నిర్ణయిం చింది. రిజర్వుబ్యాంకుపై ఎస్సార్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు కొట్టివేసిన తర్వాత కంపెనీపై దివాలా చట్టాలను అమలుచేయాలని సూచించింది. బ్యాంకింగ్‌వ్యవస్థలో భారీగా పేరు కునిపోయిన అతిపెద్ద 12 రానిబాకీల ఖాతాల్లో ఎస్సార్‌ స్టీల్‌ ఒకటి. భారతీయ రిజర్వుబ్యాంకు వీటినుంచి రికవరీలకుమరింతగా చట్టాలకు పదును పెట్టింది. ఎస్సార్‌స్టీల్‌ బ్యాంకర్లకు రూ.45వేల కోట్లకుపైబడి చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు ఇప్పటికే రూ.31,671 కోట్లరుణాలను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించాయి. ఎస్‌బిఐ ఆధ్వర్యంలో 22 బ్యాంకుల కూటమి ఈ బకాయిల్లో 93శాతం వాటా ఉంది.బోర్డు ఆమోదించిన పునర్‌వ్యవస్థీకరణ ప్యాకేజి అమలుకు సిద్ధం అవుతున్నతరునంలో ఆర్‌బిఐ నోటిఫికేసన్‌ జారీచేసిందని ఎస్సార్‌స్టీల్‌ తన పిటిషన్‌లో వాదించింది. గడచిన ఏడాదికాలంలో రూ.3467 కోట్లు చెల్లించామని, 4500 మంది ఉద్యోగులున్నారని, ఎలాంటి చర్యలు తీసుకున్నా కంపెనీ పాలన తీరుతెన్నుల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని వివరించింది. అంతేకాకుండా కంపెనీని మూసివేసే పరిస్థితులు ఎదురవుతాయని కూడా వెల్లడించింది. ఎస్సార్‌స్టీల్‌ సమస్యల్లో ఉన్నప్పటికీ కంపెనీ నిర్వహణ మార్జిన్లు ఇతర కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. ఎస్సార్‌గ్రూప్‌ ఆకర్షిస్తోంది. ఈవారం లోనే ఎస్సార్‌గ్రూప్‌ దీర్ఘకాలంగా జాప్యం జరుగుతూ వస్తున్న ఎస్సార్‌రాస్‌నెఫ్ట్‌ కూటమి 12.9 బిలియన్‌ డాలర్లు అంటే 83 వేల కోట్ల ప్యాకేజిప్రక్రియను పూర్తిచేసింది భారత్‌లోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని అంచనా. దీనితో కంపెనీ గ్రూప్‌ రుణభారం 11 బిలియన్‌ డాలర్లమేర తగ్గించినట్లయింది. అందువల్లనే ఎస్సార్‌ స్టీల్‌పై భారీ ప్రాజెక్టుల దృష్టిసారించాయని చెప్పాలి.
1entertainment
Hyderabad, First Published 11, Mar 2019, 6:43 PM IST Highlights ఎలాంటి పాత్రలో అయినా తనదైన శైలిలో నటించే లేడి సూపర్ స్టార్ అనుష్క మరో సరికొత్త ప్రయోగానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఓ మంచి భక్తిరస చిత్రంలో స్వీట్ నటించనున్నట్లు సమాచారం. ఇండియన్ టాప్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన సంతోష్ శివన్ తెరకెక్కించే బోయే అయ్యప్ప స్వామికి సంబందించిన కథకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.  ఎలాంటి పాత్రలో అయినా తనదైన శైలిలో నటించే లేడి సూపర్ స్టార్ అనుష్క మరో సరికొత్త ప్రయోగానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఓ మంచి భక్తిరస చిత్రంలో స్వీట్ నటించనున్నట్లు సమాచారం. ఇండియన్ టాప్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన సంతోష్ శివన్ తెరకెక్కించే బోయే అయ్యప్ప స్వామికి సంబందించిన కథకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.  ఉరిమి వంటి సినిమాతో దర్శకుడిగాను మంచి గుర్తింపుతెచ్చుకున్న సంతోష్ చాలా రోజుల తరువాత మళ్ళీ ఒక హిస్టారికల్ సినిమాకు శ్రీకారం చూడుతున్నారు. అయితే శబరిమలకు సంబందించిన వివాదాలు ఇటీవల ఏ స్థాయిలో అలజడులను సృష్టించాయో అందరికి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అనుష్క అయ్యప్ప భక్తురాలిగా కనిపించనున్నట్లు టాక్ వస్తుండడంతో ఆ రూమర్ కాస్త వైరల్ అవుతోంది.  అయితే ఇది ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయకుండా భక్తి రస మార్గంలో తెరకెక్కబోయే సినిమా అని కోలీవుడ్ లో మరో టాక్ వస్తోంది. అయ్యప్ప జీవితాన్ని తెరపై చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.     Last Updated 11, Mar 2019, 6:43 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బుమ్రాని ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్‌కి పీడకలలే..! జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ని ఎదుర్కోమని ఏ బ్యాట్స్‌మెన్‌కి చెప్పినా..? అతనికి పీడకలలు రావడం తథ్యం. ఎందుకంటే.. బుమ్రా ఇటీవల కాలంలో చాలా ప్రమాదకరంగా మారాడు. -బ్రాడ్ హడ్జ్ Samayam Telugu | Updated: Jan 1, 2019, 06:26PM IST బుమ్రాని ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్‌కి పీడకలలే..! భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాని ఎదుర్కోవడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హడ్జ్ అభిప్రాయపడ్డాడు. మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా .. భారత్‌కి 137 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందించాడు. టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన ఏడాదిలోనే అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా మెల్‌బోర్న్ టెస్టుతో బుమ్రా రికార్డుల్లో నిలిచాడు. 2018, జనవరిలో భారత టెస్టు జట్టులోకి వచ్చిన ఈ పేసర్.. గత ఏడాది 9 టెస్టులాడి ఏకంగా 48 వికెట్లు పడగొట్టాడు. సిడ్నీ వేదికగా భారత్ , ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఈరోజు బ్రాడ్ హడ్జ్ మీడియాతో మాట్లాడాడు. ‘జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ని ఎదుర్కోమని ఏ బ్యాట్స్‌మెన్‌కి చెప్పినా..? అతనికి పీడకలలు రావడం తథ్యం. ఎందుకంటే.. బుమ్రా ఇటీవల కాలంలో చాలా ప్రమాదకరంగా మారాడు. అతని బౌలింగ్‌లో వేగం, కచ్చితత్వం‌‌ ఉంది. అంతేకాకుండా బంతి నుంచి రెండు వైపులా అతను స్వింగ్ రాబట్టగలుగుతున్నాడు. అత్యుత్తమ టెస్టు బౌలర్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణాలివే..!’ అని బ్రాడ్ హడ్జ్ కితాబిచ్చాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV 99 నాటౌట్.. సెంచరీ వద్దు గెలుపు కావాలి మూడంకెల స్కోరు కంటే జట్టు విజయాలకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు TNN | Updated: Sep 16, 2017, 08:19PM IST మూడంకెల స్కోరు కంటే జట్టు విజయాలకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం తొలి వన్డే ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో కోహ్లి మాట్లాడాడు. ఇప్పటికే వన్డేల్లో 30 శతకాలు చేసి.. సచిన్ తెందుల్కర్‌ (49 శతకాలు) తర్వాత స్థానంలో నిలిచిన కోహ్లి.. తనకి శతకాలపై మోజు లేదన్నాడు. సెంచరీ గురించి అతిగా ఆలోచిస్తే తనపై ఒత్తిడి పెరుగుతుందని ఆ ప్రభావం ఆటపై కూడా పడుతుందని ఈ కెప్టెన్ పేర్కొన్నాడు. ‘నేను ఎప్పుడూ మూడంకెల స్కోరు కోసం పాకులాడలేదు. బహుశా అలా ఆశించే స్థాయిని నేను దాటిపోయానేమో. ఒకవేళ సెంచరీ గురించి నేను అతిగా ఆలోచిస్తే ఒత్తిడి పెరిగి నా ఆట దెబ్బతింటుంది. మైదానంలో దిగితే నా లక్ష్యం జట్టుకి విజయాన్ని అందించడమే తప్ప అంకెలు కాదు. నా వ్యక్తిగత స్కోరు 98 లేదా 99 నాటౌట్‌గా ఉన్నప్పుడు కూడా నేను ఇదే చెప్తాను. ఆ స్థితిలోనే మ్యాచ్ ముగిసిపోయినా నేను హ్యాపీనే. ఎందుకంటే నా లక్ష్యం చివరి వరకూ క్రీజులో నాటౌట్‌గా ఉండి జట్టుకి విజయాన్ని అందించడమే. అంకెలు గురించి అతిగా పట్టించుకోను కాబట్టి నేను ఇంకా శతకాలు చేయగలను’ అని కోహ్లి వివరించాడు.
2sports
GST జిఎస్టీపై ఇన్వెస్టర్ల ఆసక్తి ముంబై, జనవరి 4: ట్రేడింగ్‌ మొత్తం అనిశ్చితితో సాగిన స్టాక్‌ మార్కె ట్లు ఆసాంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూనే కొనసాగాయి. జిఎస్‌టి మండలిసమావేశంలో కేంద్ర రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడంలో విఫలం కావడం, యూరోపియన్‌ మార్కెట్ల ప్రతికూలత అంశాలు దేశీయమార్కెట్లను ప్రభావితంచేసాయి. ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 26,633 పాయింట్ల వద్ద ముగిసింది. పదిపాయింట్లు పతనం అయింది.నిఫ్టీ 50 సూచి రెండు పాయింట్లు దిగువన 8190 పాయింట్ల వద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ 0.1శాతం, స్మాల్‌క్యాప్‌0.4శాతం దిగజారాయి. మార్కెట్లపరంగా మొత్తంగాచూస్తే కొంతమెరుగు పడ్డాయి. బిఎస్‌ఇలో 1558 కంపెనీలు పెరిగితే 1134 కంపెనీలు స్వల్పనష్టాలు చవిచూసాయి. మొత్తంగా 126 కంపెనీల షేర్లు స్థిరంగా నిలి చాయి. దేశీయ సంస్థలు కొనుగోళ్లకు ప్రాధా న్యతనిచ్చాయి. జిఎస్‌టి ప్యానెల్‌ ఏకాభిప్రా యానికి రాకపోవడం మార్కెట్లను దెబ్బతీసిం దనే చెప్పాలి. ఇక ఫెడ్‌రిజర్వు సమావేశం మిని ట్స్‌ వివరాలు ఈరోజే విడుదలకానుండటం కూడా ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచిందని జియో జిత్‌ బిఎన్‌పి పరిభాస్‌ ఫైనాన్షియల్‌ సేవల సంస్థ ముఖ్య మార్కెట్‌ వ్యూహకర్త ఆనంద్‌ జేమ్స్‌ వెల్లడించారు. బిఎస్‌ఇ టెలికాంరంగసూచి 2.4శాతం పెరిగిం ది. సెన్సెక్స్‌లో భారతి ఎయిర్‌టెల్‌ టాప్‌ లాభాలు ఆర్జించినట్లు నమో దయింది. మంగళవారం కొత్త 4జికస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్‌జారీ చేయడమే ఇందుకుకీలకం. బిఎస్‌ఇ రియాల్టీ సూచి రెండుశాతం పెరిగింది. డిఎల్‌ఎప్‌ 5.3శాతం, ఇండియాబుల్స్‌ 5.3శాతం, శోభా 2.4శాతం, యూనిటెక్‌ 1.9శాతం, ఇతర విభాగాల లాభాలసంస్థలు బిఎస్‌ఇఐటి 0.9శాతం, బిఎస్‌ఇ వినియోగరంగసూచి 0.8శాతం పెరి గాయి. వ్యక్తిగతంగాచూస్తే జూబిలియంట్‌లైఫ్‌ సైన్సెస్‌ 12శాతం పెరిగి 714వద్ద ముగిసాయి. డెనిమ్‌ఫాబ్రిక్‌ ఉత్పత్తిసంస్థ నందన్‌ డెనిమ్‌ 10.6శాతంపెరిగి 121కు చేరింది. ఆర్‌బిఐ కంపెనీ విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచడమే ఇందుకుకీలకం. హెచ్‌సిటి టెక్నాలజీస్‌ 2.5 శాతం పెరిగి 856వద్ద నిలిచింది. కంపెనీ బట్లర్‌ అమెరికా ఏరోస్పేస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రక టించింది. ఇక నష్టాల సంస్థల్లో జస్ట్‌డయల్‌ 1.6 శాతం విదేశీ బ్రోకరేజీ సంస్థ స్టాక్‌కు అమ్మకాల రేటింగ్‌ ఇవ్వడమే కీలకం. మార్కెట్‌ విలువలు మంచిగానే ఉన్నా కంపెనీ భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నట్లు విదేశీబ్రోకరేజి సంస్థ అంచనా వేసింది. భారత సేవలరంగంపై పెద్దనోట్ల రద్దు భారీ ప్రభా వం చూపించింది. రెండోనెలలో కూడా కొత్త ఆర్డర్లు లేక సేవలరంగ సూచి దిగజారింది. నిక్కీ ఇండియా సేవలరంగ పిఎంఐ సూచి డిసెంబరులో 46.8 పాయింట్లుగా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ల పరంగా యూరోపియన్‌ మార్కెట్లు క్షీణించాయి. ఇన్వెస్టర్లు తాజా ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి పెట్టారు. యూరోపియన్‌ యూరోస్టాక్‌్‌స 0.13 శాతం దిగజారింది. ఫ్రాన్స్‌ సిఎసి నిలకడగా కొన సాగింది. ఆసియా మార్కెట్లపరంగా జపాన్‌ నికీ 2.5శాతం పెరిగింది. చైనా షాంఘై కాంపోజిట్‌ 0.7శాతం పెరి గింది. హాంకాంగ్‌ హ్యాంగ్‌సెంగ్‌ సూచి మందగమనంతో ముగిసింది.
1entertainment
Hyderabad, First Published 8, Apr 2019, 9:38 AM IST Highlights ఇన్నాళ్లూ ఆర్టిస్ట్ ల  నుంచి అద్భుతమైన నటనను రాబట్టడంలో బిజీగా ఉన్న  రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు తనే నటుడుగా మారుతున్నారు.   ఇన్నాళ్లూ ఆర్టిస్ట్ ల  నుంచి అద్భుతమైన నటనను రాబట్టడంలో బిజీగా ఉన్న  రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు తనే నటుడుగా మారుతున్నారు.   ఆర్జీవి గన్‌షాట్‌ ఫిల్మ్‌ బ్యానర్‌లో వస్తున్న ‘కోబ్రా’తో వర్మ తనలోని  నటుడి సత్తా ఏంటో  పరిచయం  చేయబోతున్నారు. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వర్మ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ఆర్‌ పాత్రలో కనిపిస్తారు. ఓ క్రిమినిల్ పట్టుకోవటానికి ఓ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ చేసే ప్రయత్నాలు...చివరకి ఎలా తుద ముట్టించాడనేది చూపబోతున్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే  ఇందులో సీయం కేసీఆర్‌ పాత్ర కూడా ఉండటం విశేషం. వర్మతో పాటు ఆగస్త్య మంజు దర్శకత్వం వహించనున్నారు. కీరవాణి స్వరకర్త. .. మరి తెలంగాణ లో ఆ మోస్ట్ డేంజరస్ క్రిమినల్ ఎవరో ?? గెస్ చేసారా. ఇక సంచలన చిత్రాలకు మారుపేరుగా నిలుచిన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ. తాజాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తో వెండితెరపై దూమ్మురేపిన విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత వర్మ మంచి హీట్ అందుకున్నాడు. కాగా వర్మ ఈ చిత్రంతో మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటి వరకు వర్మ దర్శకుడిగా, నిర్మాతగా, కథా రచయితగా గాయకుడిగా తనలోని కలలను ప్రేక్షకులకు చూపించిన సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ త్వరలో నటుడిగా మారటంతో ఆయన అభిమానులకు పండగ చేసుకోబోతున్నారు. Last Updated 8, Apr 2019, 9:38 AM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రియోలో మన గురి అదిరింది రియో ఒలింపిక్స్‌ లో మొదటి రోజు నిర్వహించిన పురుషుల ఆర్చరీ వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్లో భారత ఆర్చర్‌ అతానుదాస్‌ ప్రతిభ చాటాడు. TNN | Updated: Aug 6, 2016, 12:17AM IST రియో ఒలింపిక్స్‌ లో మొదటి రోజు నిర్వహించిన పురుషుల ఆర్చరీ వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్లో భారత ఆర్చర్‌ అతానుదాస్‌ ప్రతిభ చాటాడు. 12 రౌండ్లు జరిగిన ఈ పోటీలో 683 పాయింట్లు సాధించి 58/60 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచాడు. కొరియా ఆర్చర్‌ కిమ్‌ వూజింగ్‌ 700 పాయింట్లతో ప్రపంచ, ఒలింపిక్‌ రికార్డులు బద్దలు కొట్టి తొలి స్థానంలో నిలిచాడు.
2sports
Hyderabad, First Published 2, Apr 2019, 8:09 PM IST Highlights బాహుబలి తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం తీరిక లేకుండా సినిమా షూటింగ్ లతో గడుపుతున్నాడు. మినిమమ్ రెండు సినిమాలను వీలైనంత త్వరగా అభిమానులకు అందించాలని చూస్తున్నాడు. సాహోకి  ఇప్పటికే ఎండింగ్ టచ్ ఇచ్చాడు.  బాహుబలి తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం తీరిక లేకుండా సినిమా షూటింగ్ లతో గడుపుతున్నాడు. మినిమమ్ రెండు సినిమాలను వీలైనంత త్వరగా అభిమానులకు అందించాలని చూస్తున్నాడు. సాహోకి  ఇప్పటికే ఎండింగ్ టచ్ ఇచ్చాడు.  ఇక రాధాకృష్ణ లవ్ స్టోరీని కూడా ఫాస్ట్ గా ఫినిష్ చేసేందుకు షెడ్యూల్ ని సెట్ చేసుకున్నాడు. ఒక షెడ్యూల్ ని కూడా ఫినిష్ చేశాడు. ఫైనల్ గా ఆరునెలల గ్యాప్ లోనే రెండు సినిమాలను మార్కెట్ లోకి వదలాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాహో ఆగష్టు లో రానున్న సంగతి తెలిసిందే. ఇక రాధాకృష్ణతో చేస్తోన్న సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట.   పూజ హెగ్డే ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో ప్రభాస్ ని దర్శకుడు రెండు డిఫరెంట్ షేడ్స్ లలో చూపించనున్నట్లు టాక్.  Last Updated 2, Apr 2019, 8:09 PM IST
0business
Hyderabad, First Published 10, Oct 2018, 3:45 PM IST Highlights మొన్నటి దాకా సినీ సెలబ్రెటీల బాగోతాలే బయటపడగా... ఇప్పుడు క్రీడాకారుల బాగోతాలు కూడా బయటపడుతున్నాయి.  బాలీవుడ్ లో తనుశ్రీదత్తా, నానాపటేకర్ ల వివాదంతో మీటూ ఉద్యమం ఉదృతంగా మారింది. లైంగిక వేధింపులు అనుభవించిన  బాధితులు ఒక్కొక్కరిగా బయటకి వస్తూ తము ఎదుర్కొన్న చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. మొన్నటి దాకా సినీ సెలబ్రెటీల బాగోతాలే బయటపడగా.. .. ఇప్పుడు క్రీడాకారుల బాగోతాలు కూడా బయటపడుతున్నాయి.  శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ.. తనను లైంగికంగా వేధించాడంటూ ఓ ఎయిర్ హోస్టెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘ముంబైలోని హోటల్‌ జూహు సెంటర్‌ ఎలివేటర్‌లో ఇండియన్‌, శ్రీలంక క్రికెటర్లు ఉన్నారని తెలిసి నా స్నేహితురాలు ఆటోగ్రాఫ్‌ తీసుకోవడానికి వెళ్దామని పట్టుపట్టింది. అలా ఆమెతో పాటుగా నేను కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ కాసేపటి తర్వాత తను స్విమ్మింగ్‌పూల్‌ వైపుగా పరిగెత్తింది. నేను కూడా తనని అనుసరించాను. తర్వాత తను మాయమైపోయింది. అయితే అప్పుడే హోటల్‌ రూం నుంచి బయటికి వచ్చిన రణతుంగ స్విమ్మింగ్‌పూల్‌ దగ్గర నిలబడి ఉన్నాడు. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేను కూడా విష్‌ చేశాను. కానీ అంతలోనే నాకు అతి సమీపంగా వచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. వికృత చేష్టలతో నన్ను చుట్టేశాడు. నాకు చాలా భయం వేసింది. కానీ వెంటనే తేరుకుని అతడిని వదిలించుకునేందుకు గట్టిగా తన్నడం మొదలుపెట్టాను. నీ పాస్‌పోర్టు క్యాన్సిల్‌ చేయిస్తా, పోలీసులకు చెబుతా అంటూ అరిచాను. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకుని హోటల్‌ రిసెప్షన్‌లో కంప్లైంట్‌ చేశాను. కానీ ఇది మీ ప్రైవేట్‌ మ్యాటర్‌. మేమేం చేయలేమంటూ సిబ్బంది చేతులెత్తేశారు’ అంటూ అర్జున రణతుంగ తనతో ప్రవర్తించిన తీరును #రణతుంగ పేరిట ఇండియన్‌ ఎయిర్‌హోస్టెస్‌ బహిర్గతం చేశారు. కాగా శ్రీలంకకు వరల్డ్‌ కప్‌(1996) అందించిన కెప్టెన్‌గా రికార్డుకెక్కిన అర్జున రణతుంగ ప్రస్తుతం ఆ దేశ పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.
2sports
- జూబ్లిహిల్స్‌లో భారీ కార్పొరేట్‌ మోసొం ఆకస్మిక దాడులలో గుర్తించిన అధికారులు - వెలుగులోకి కోట్లలో నల్లధనం మార్పిడి!  - మరో ఆరుచోట్లా ఇదే తరహా మోసాలు - రాష్ట్రంలోని పలువురు బడాబాబులకు సంబంధాలు! నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్‌ నగరం కార్పొరేట్‌ మోసాలకు అడ్డాగా మారుతోంది. తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ బుధవారం జూబ్లిహిల్స్‌ ప్రాంతంలో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో నివ్వెరపొయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీ అంటే భారీ కార్యాలయం, సిబ్బంది, బోర్డ్‌ రూమ్‌ ఇలాంటి హంగామాను ఎవరైనా ఊహించుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా జూబ్లీహిల్స్‌లోని ఒక మాల్‌లోని ఒక చిన్న గదిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 114 కంపెనీలు నడుస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇక్కడి కొందరు వ్యక్తులు వందల సంఖ్యలో బినామీ కంపెనీలను సృష్టించి భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. వాస్తవానికి తాము వ్యవసాయ భూమల రికార్డులను, ఫైల్‌ రిటర్న్స్‌ వంటి వాటిని నిర్వహిస్తుంటామని ఇక్కడి సిబ్బంది చెబుతున్నప్పటికీ.. చాలా పక్కా ప్రణాళిక ప్రకారం ఇక్కడ డొల్ల కంపెనీల నిర్వహణ జరుగుతూ వందల కోట్లలో నల్లధనం సక్రమమె వ్యవస్థలోకి అడ్డదారిగా వచ్చిచేరుతున్నట్టుగా అధికారులకు లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఒకే చిరునామాతో హైదరాబాద్‌లో దాదాపు ఆరు చోట్ల ఇలా 25 కంటే ఎక్కువ కంపెనీల నిర్వహణ జరుగుతున్నట్టుగా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ గుర్తించింది. ఇందులో ఒక్కో చిరునామాలో 28 నుంచి మొదలు కొని 48 వరకు కంపెనీలు నడుస్తున్నట్టుగా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖకు సమాచారం అందించింది. వీటిపై కూడా దశల వారీగా దాడులు నిర్వహించనున్నట్టుగా అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో దాడులు.. తెలంగాణ రాజధాని కేంద్రంగా కార్పొరేట్‌ మోసాలు జరగుతున్నట్టు, భారీగా నల్లధన మార్పిడీ ఇక్కడ చోటు చేసుకుంటున్నట్టుగా ఢిల్లీలోని నిఘా, విచారణ సంస్థల ద్వారా హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ వ్యవహరాల శాఖ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీనిలో నిజాలను నిగ్గు తేల్చేందుకు గాను ఎనిమిది మంది అధికారులు రెండు బృందాలుగా విడిపోయి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36లోని ఫార్చూన్‌ మోనార్క్‌ మాల్‌లోని మూడో అంతస్తులో ఉన్న 306వ ప్లాట్‌లోనిఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో సోదా అధికారులకు నివ్వెరపొయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. డొల్ల కంపెనీల పేరుతో వందల కోట్ల రూపాయల మేర లావాదేవీలు నిర్వహించి నల్లధనాన్ని మారుస్తున్నట్టుగా ఇక్కడి లభించిన సమాచారం మేరుకు తెలుస్తోంది. ఒకే చిరునామాతో 114 సూట్‌ కేస్‌ కంపెనీలు ఆదాయం లేకున్నా ఈ కార్యాలయం నుంచి కోట్లలో జీతాలు చెల్లిస్తున్నట్టు, ఉద్యోగులను ఆయా సంస్థల డైరెక్టర్లుగా చూపిస్తూ రూ.లక్షల్లో జీతాలు ఇస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఆ కంపెనీల పేరు మీద బాలన్స్‌ షీట్లు, వాటికి డైరక్టర్లు, వారికి జీతాలు ఇలా అన్ని నకిలీవి సృష్టించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆయా సంస్థలు పూర్తిగా షెల్‌ కంపెనీలేనని అధికారులు భావిస్తున్నారు. 'కార్పొరేట్‌' స్కాన్‌లోకి బడా కంపెనీలు.. ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ సంస్థ కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ అధికారులు గుర్తించిన దాదాపు 114 కంపెనీలతో పాటు పలు సంస్థలకు అకౌంటింగ్‌ సంస్థగా వ్యవహరిస్తోంది. ఇందులో సత్యం రామలింగరాజు కుమారుడు స్థాపించిన హిల్‌కౌంటీ (పాతపేరు: మేటాస్‌) ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను అధికారులు గుర్తించినట్టుగా అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ అడ్వైజరీ వద్ద నగరంలోని చాలమంది బడా బాబులకు చెందిన పలు సంస్థల 'లెక్క పత్రాలు' లభించడంతో షెల్‌ కంపెనీలతో ఆయా కంపెనీలకు సంబంధాలుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వాస్తవాలను వెల్లడించనప్పటికీ ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి తదుపరి విచారణ నిమిత్తం వాటిని పంపించినట్టుగా తెలుస్తోంది. కాగితాల్లోనే లావాదేవీలన్నీ.. అశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 114 కంపెనీల్లో దాదాపు 50 కంపెనీలు ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడంలేదని అధికారులు గుర్తించారు. మిగతా కంపెనీలు కూడా రూ.8 నుంచి రూ.15 కోట్ల వరకు నష్టాలను చూపుతూ వ్యాపార కార్యకలాపాలను నమోదు చేసినట్టుగా సమాచారం అందుతోంది. మరికొన్ని నష్టాల్లో ఉన్నట్టుగా రికార్డులలో చూపారు. ఆ కంపెనీలు వాటిలో వాటికే డబ్బులను అప్పుగా ఇచ్చుకుంటున్నాయి. అవి వ్యవసాయ భూములను ఆస్తులుగా చూపించుకుంటున్నట్టుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా వీటికి ఇక్కడి నిర్వాహకులు రిటర్న్స్‌ కూడా దాఖలు చేయడం విశేషం. ఆ సంస్థలో పని చేస్తున్నవారు డైరక్టర్లుగా జీతాలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు 25 నుంచి 30 కంపెనీల్లో డైరక్టర్లుగా వ్యవహరిస్తున్నట్టుగా రికార్డులు చెబుతున్నాయి. మనదేశంలో అమలులో ఉన్న చట్టాల మేరకు ఒక వ్యక్తి 20 కంటే ఎక్కువ కంపెనీలకు డైరక్టర్‌గా వ్యవహరించడానికి వీలులేదు. ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే తాము కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలించనున్నట్టుగా అధికారులు తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Jan 13,2016 అత్యంత పేలవం పడకేసిన పారిశ్రామికోత్పత్తి        న్యూఢిల్లీ : క్రితం నాలుగేళ్లలో ఎప్పుడూ లేని విధంగా క్రితం నవంబర్‌లో భారత పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) అత్యంత పేలవంగా నమోదయ్యింది. 2014 నవంబర్‌లో ఐఐపి వృద్ధి ఏకంగా మైనస్‌ 3.2 శాతానికి దిగజారిందని కేంద్ర గణంకాల శాఖ మంగళవారం ఒక్క నివేదికలో వెల్లడించింది. ఇంతక్రితం మాసంలో ఇది ఏకంగా 9.9 శాతం వృద్ధిని సాధించింది. ప్రధానమైన తయారీ రంగం ఉత్పత్తి నవంబర్‌లో ఏకంగా మైనస్‌ 4.4 శాతానికి పడిపోయింది. అక్టోబర్‌లో ఈ రంగం ఏకంగా 10.6 శాతం వృద్ధిని కనబర్చింది. గతేడాది ఇదే మాసంలో ఈ రంగం ఏకంగా 4.7 శాతం వృద్ధిని కనబర్చింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ కాలంలో ఐఐపి 3.9 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. క్రితం నవంబర్‌లో గనుల రంగం 2.3 శాతం వృద్ధిని కనబర్చగా, గతేడాది ఇదే మాసంలో ఈ రంగం ఏకంగా 4 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. వాతం, విద్యుత్‌ ఉత్పత్తి 0.7 శాతం చొప్పున పెరిగింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఆటనే ఆడాలా.. మిమ్మిల్ని నమ్మించాలా..? నా సర్టిఫికేట్స్ ఒరిజనలే: హర్మన్ ప్రీత్ Highlights ప్రభుత్వానికి నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇచ్చి మోసం చేశారనే ఆరోపణలపై భారత మహిళా టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ డీఎస్పీ హోదా నుంచి పంజాబ్ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వివాదంపై హర్మన్ ప్రీత్ తొలిసారిగా స్పందించారు..  ప్రభుత్వానికి నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇచ్చి మోసం చేశారనే ఆరోపణలపై భారత మహిళా టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ డీఎస్పీ హోదా నుంచి పంజాబ్ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వివాదంపై హర్మన్ ప్రీత్ తొలిసారిగా స్పందించారు.. అవి నకిలీ సర్టిఫికేట్స్ కాదని తాను పరీక్షల్లో పాసై సంపాదించినవేనని స్పష్టం చేశారు.. కేవలం డిగ్రీ పూర్తి చేయాలనే చదివాను.. అన్ని సబ్జెక్ట్‌ల్లో పాస్ అయ్యాను.. ఢిల్లీలో పీరీక్షలు రాశా.. సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ తన సబ్జెక్టులని ఆమె తెలిపారు. అందరిలా తాను హెడ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ.. నా ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌తో సర్టిఫికేట్లను రుజువుచేయలేనని.. ఎందుకంటే తాను క్రికెటర్‌నని.. నా దృష్టంతా ఎప్పుడూ ఆటపైనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. గతేడాది జరిగిన మహిళ వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో సెంచరీతో చేలరేగిన హర్మన్ ప్రీత్ భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చారు.. ఈ ప్రదర్శనను ప్రశంసించిన పంజాబ్ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేతుల మీదుగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో తన విద్యార్హతల ధ్రువీకరణ కింద డిగ్రీ సర్టిఫికేట్స్ సమర్పించారు హర్మన్. ఇవి నకిలీ సర్టిఫికేట్స్ అని ఆరోపణలు రావడంతో పోలీస్ శాఖ విచారణ జరిపింది. వారి దర్యాప్తులో అవి నకిలీవేనని తేలడంతో ఆమెను డీఎస్పీ ఉద్యోగం నుంచి తప్పించారు. ఆమె భవిష్యత్తు దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం హర్మన్‌పై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. Last Updated 14, Jul 2018, 1:40 PM IST
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV తెరచుకోనున్న... కాగజ్‌నగర్ పేపర్‌మిల్లు! కొమరంభీం జిల్లాలోని.. సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్‌మిల్లుకు మళ్లీ జవసత్వాలు రానున్నాయి. గతంలో నష్టాల ఊబిలో కూరుకుపోయి... మూతపడ్డ ఈ పేపర్‌మిల్లు మళ్లీ ప్రారంభం కానుంది. దీంతో గతంలో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ... దాదాపు నాలుగు వేల మంది కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. TNN | Updated: Mar 22, 2018, 02:44PM IST * ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కొమరంభీం జిల్లాలోని.. సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్‌మిల్లుకు మళ్లీ జవసత్వాలు రానున్నాయి. గతంలో నష్టాల ఊబిలో కూరుకుపోయి... మూతపడ్డ ఈ పేపర్‌మిల్లు మళ్లీ ప్రారంభం కానుంది. దీంతో గతంలో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ... దాదాపు నాలుగు వేల మంది కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. మిల్లు పునరుద్ధరణకు ఒడిశాకు చెందిన జేకే మిల్స్ లిమిటుడ్ సంస్థ... కాగజ్‌నగర్ మిల్లు పునరుద్ధరణకు ముందుకు వచ్చింది. దీంతో కార్మిక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ కూడా... జేకే మిల్స్ సంస్థ యాజమాన్యం వినతి మేరకు ముడిసరుకుతో పాటు ఆర్థిక లావాదేవీల్లో... చేయూతనిచ్చేందుకు అంగీకరించింది. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్... రాయితీలు, మినహాయింపులతో ఉత్తర్వులు (జీవో నెం.18) జారీ చేశారు. జేకే సంస్థ పేపర్‌మిల్లును తెర్చేందుకు 628 కోట్ల పెట్టుబడికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది. కార్మికులకు చెల్లించాల్సిన వేతన బకాయిలు తదితర ఆర్థికపరమైన అంశాలపై యాజమాన్యం మార్చి 23న ముంబయిలో ఐడీబీఐ, ఇతర బ్యాంకు అధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. ఐడీబీఐ, ఇతర ఏడు జాతీయ బ్యాంకుల నుండి గతంలో తీసుకున్న రూ.350 కోట్ల అప్పును చెల్లించకపోవడంతో.. 2014 సెప్టెంబర్ 27న కాగితమిల్లు మూతపడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పులు భారం వడ్డీతో కలిసి రూ.420 కోట్లకు చేరుకుంది.
1entertainment