news
stringlengths
299
12.4k
class
class label
3 classes
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
పోల్ బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలేలో రాహుల్ తల్లిదండ్రులు, సోదరి పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ టైటిల్‌ను అందుకున్నప్పుడు ఆయన తల్లిదండ్రులు పక్కనే ఉన్నారు. ఆ తరవాత వారు నేరుగా మెహదీపట్నంలోని ఇంటికి వెళ్లిపోయారట. అక్కడ రాహుల్‌కు ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారట. పువ్వులు, కేకులు, స్వీట్లు సిద్ధం చేశారట. కానీ, రాహుల్ మాత్రం అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వచ్చిన తరవాత ర్యాలీగా మెహదీపట్నంలోని ఆయన మావయ్య ఇంటికి వెళ్లిపోయారని సమాచారం. మావయ్య ఇంటిలోనే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు రాహుల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఆ తరవాత కూడా ఆయన తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేదట. సోమవారం ఉదయం ఫ్రెండ్స్‌తో కలిసి రాహుల్ ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లారని తెలిసింది. అక్కడే ఫ్రెండ్స్‌తో భారీ పార్టీ చేసుకున్నారట. ఈరోజంతా అక్కడే గడిపారని సమాచారం. టైటిల్ గెలిచిన కుమారుడు ఇంటికి వస్తే అతనితో ఒక స్వీట్ తినిపించి సంబరాలు చేసుకుందామని భావించిన తల్లిదండ్రులను రాహుల్ నిరాశపరిచారని మీడియాలో వినిపిస్తున్న వార్త. వాస్తవానికి సోమవారం రాహుల్ ఇంటర్వ్యూల కోసం చాలా మంది మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. కానీ, ఆయన అందుబాటులో లేడు. ఫోన్ కాల్స్‌కు కూడా స్పందించడంలేదు. బహుశా ఈ దావత్‌లు అన్నీ అయిపోయాక రాహుల్ ఇంటికి వెళ్తారనుకుంటా. ఆ తరవాతే ఇంటర్వ్యూలు, చిట్ చాట్‌లు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
విదేశీ కరెన్సీ రాబడులపై ఒత్తిడి తప్పదు ముంబై, అక్టోబరు 10: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టిసిఎస్‌ తన రెండోత్రైమాసికంలో లాభాలు మందకొడిగా ఉండవచ్చని అంచనావేసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా రంగాలకు సంబంధిం చిన ప్రాజెక్టుల్లో జాప్యం, హెల్త్‌కేర్‌రంగపరంగా మంద గమనమే ఇందుకు కీలకమని చెపుతోంది. ముందు తాము ఈనెల 13వ తేదీ ఫలితాలను విడు దల చేస్తామని, తదనంతరం కంపెనీ ధోరణులను పరిశీలి స్తామని టిసిఎస్‌ బిఎస్‌ఇకి నివేదిక ఇచ్చింది. తమ కంపెనీ ఆర్థిక ఫలితాలే దేశీయ ఐటిరంగానికి దిక్సూచి అవుతాయని భావిస్తోంది. రెండో త్రైమా సికంలో డాలర్‌ రాబడులు 2.5 నుంచి 2.8శాతంగా ఉంటాయని, మార్జిన్‌ కూడా స్వల్పస్థాయిలోనే మెరుగు పడుతుందని కంపెనీ వివరించింది. గడచిన మూడు త్రైమాసికాలతో పోలిస్తే ఈసారి డాలర్‌ రాబడుల్లో స్వల్పంగా మాత్రమే వృద్ధి ఉంటుందని కంపెనీ వివరించింది. రెండో త్రైమాసికంలో క్రమా నుగతమైన వృద్ధిరేటుతో టిసిఎస్‌ 3.9శాతం, 4.6శాతంగా ఉంది. బ్రిటిష్‌పౌండ్‌ దెబ్బతినడం కూడా టిసిఎస్‌ రాబడులపై ప్రభావం చూపుతుందని, వీటికితోడు డాలర్‌రూపాయి, జపాన్‌యెన్‌ మారకం విలువలు కూడా కొంత కంపెనీపై ఒత్తిడి పెంచుతాయని అంచనా. వీటికి సంబంధించి 45 బేసిస్‌ పాయింట్లు మాత్రమే ఈ త్రైమాసికంలో మెరుగుదల కనిపిస్తుందని వీటికితోడు సహజంగానే వచ్చే వేతన పెంపు కూడా కొంత ఒత్తిడి పెంచుతుందని స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కుప్పకూలిన లంక.. భారత టార్గెట్ 239 సొంతగడ్డపై చివరి వన్డేలోనూ లంకేయులు చతికిలపడ్డారు. కొలంబో వేదికగా ఆదివారం జరుగుతున్న చివరి వన్డేలో TNN | Updated: Sep 3, 2017, 07:13PM IST సొంతగడ్డపై చివరి వన్డేలోనూ లంకేయులు చతికిలపడ్డారు. కొలంబో వేదికగా ఆదివారం జరుగుతున్న చివరి వన్డేలో భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (5/42) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.4 ఓవర్లలో 238 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో లాహిరు తిరుమానె (67: 102 బంతుల్లో 3x4, 1x6), మాథ్యూస్ (55: 98 బంతుల్లో 4x4), కెప్టెన్ ఉపుల్ తరంగ (48: 34 బంతుల్లో 9x4) నిలకడగా ఆడినా.. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. భువీతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా రెండు, కుల్దీప్ యాదవ్, చాహల్ చెరో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 4-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు వన్డేల సస్పెన్షన్‌కి గురై ఈ వన్డేతో పునరాగమనం చేసిన శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ డిక్వెల్లా (2), మునవీర (4) ఆదిలోనే నిరాశపరిచినా.. ఉపుల్ తరంగ దూకుడైన ఆటతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. అయితే జట్టు స్కోరు 60 వద్ద ఈ కెప్టెన్ ఔటవగా.. అనంతరం వచ్చిన మాథ్యూస్‌తో కలిసి తిరుమానె కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కి అబేధ్యంగా 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో శ్రీలంక మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. వీరిద్దరి ఔట్ అనంతరం ఏ దశలోనూ భారత్ బౌలర్ల ధాటికి లంకేయులు నిలవలేకపోయారు. ఒకానొక సమయంలో 185/4తో ఉన్న ఆ జట్టు.. చివరికి 238కే పరిమితమైంది.
2sports
మెగా అభిమానులకు ఉపాసన క్లాస్ Highlights ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన ఉపాసన టీచర్స్ డే సందర్భంగా స్పెషల్ ట్వీట్ పోస్ట్ చేసిన ఉపాసన అభిమానులకు హెల్తీ లైఫ్ స్టైల్ గురించి బోధించే ప్రయత్నం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అభిమానులకు క్లాస్ తీసుకున్నారు. అంత పెద్ద తప్పు అభిమానులు ఏమి చేసారా.. అని అనుకుంటున్నారా.. అది తిడుతూ తీసుకున్న క్లాస్ కాదండి.. ఆరోగ్యానికి సంబంధించి. అసలు విషయానికి వస్తే.. ఉపాసన ఇటీవల ఒక వీడియో పోస్టు చేశారు.  అభిమానులను బాగా ఆకట్టుకంటున్న ఆ వీడియోలో రామ్ చరణ్ తన కుక్కపిల్లలతో కలిసి వాకింగ్ చేస్తూ కనిపించారు.ఈ వీడియో ద్వారా అభిమానులకు హెల్తీ లైఫ్ స్టైల్ గురించి బోధించే ప్రయత్నం చేశారు ఉపాసన.   ఉపాసన తన భర్తను ముద్దుగా మిస్టర్ సి అని పిలుస్తుందనే విషయం తెలిసిందే. టీచర్స్ డే సందర్భంగా ఉపాసన ఈ పోస్టు చేశారు. రామ్ చరణ్ నుండి అభిమానులు నేర్చుకోవాల్సిన అంశాలను ప్రస్తావించారు. ఈ వీడియో పోస్టు చేసిన ఆమె.... ‘మిస్టర్ సి తనకు ఇష్టమైన వాటితో నడచివెళ్తున్నారు. హెల్తీ లైఫ్ స్టైల్‌కు కావాల్సిన లక్ష్యాలను మనకు నేర్పుతున్నారు. మన జీవనశైలిలో బద్ధకంగా ఉండటం ఓ వ్యాధి లాంటిదే. కాబట్టి, నడవండి' అని ఆమె పోస్టు చేశారు.   రామ్ చరణ్‌ను పెళ్లాడిన సమయంలో కాస్త లావుగా ఉన్న ఉపాసన... తర్వాత చాలా మారింది. చెర్రీని చూసి ఇనిస్పైర్ అయి ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అపోలో ఆసుపత్రి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాసన.... ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్‌నెస్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తోంది. ఫిట్‌నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో రోజూ శిక్షణ తీసుకుంటోంది.   ఉపాసన సోషల్ మీడయా ద్వారా యాక్టివ్‍‌గా ఉంటూ తనకు, చెర్రీకి సంబంధించి ముఖ్య విషయాలను అభిమానులతో పంచుకుంటూ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ను మోటివేట్ చేస్తున్నారు. Last Updated 25, Mar 2018, 11:56 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV అరే.. విలియమ్స్‌ సిస్టర్స్‌కి ఏమైంది! ఒలింపిక్స్ టెన్నిస్ డబుల్స్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన విలియమ్స్ సిస్టర్స్ జోడి తొలిసారిగా ఓటమిపాలైంది. కారణమేంటో తెలుసా? TNN | Updated: Aug 8, 2016, 11:15AM IST వీనస్ విలియమ్స్- సెరెనా విలియమ్స్.. టెన్నిస్ గురించి కొద్దో గొప్పో తెలిసిన ప్రతి ఒక్కరికీ పరిచయం ఉన్న పేర్లివి. అమెరికాకు చెందిన ఈ అక్కాచెల్లెళ్లు ఒలింపిక్స్ డబుల్స్‌లో మూడుసార్లు స్వర్ణపతకాలు సాధించారు. అలాంటి ఈ జోడి రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన లూసీ సఫరోవా, బార్బొరా స్ట్రకోవా జోడి 6-3 6-4 తేడాతో వీరిని ఓడించింది. 16 ఒలింపిక్ మ్యాచ్‌ల్లో విలియమ్స్ సిస్టర్స్‌కి తొలి ఓటమి కావడం విశేషం. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్‌లో, 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో, 2012లో లండన్ ఒలింపిక్స్‌లోనూ టెన్నిస్ డబుల్స్‌లో వీరు స్వర్ణం సాధించారు. 2004లో సెరెనాకు గాయమవడంతో వీరు ఏథెన్స్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగలేదు. రియోలో సింగిల్స్‌లోనూ వీనస్ తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. బెల్జియంకు చెందిన కిర్‌స్టన్ ప్లిప్‌కెన్స్ చేతిలో వీనస్ పరాజయం చవి చూసింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో టెన్నిస్ సింగిల్స్‌లో పసిడి పతకం సాధించిన వీనస్ విలియమ్స్ అనారోగ్య కారణాల వల్ల రియోలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయిందని ఆమె కోచ్ తెలిపారు. కాగా, సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియాకు చెందిన డారియా గావ్రిలోవాను తొలి రౌండ్లో ఓడించి ముందడుగేసింది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో రెండు పసిడి పతకాలు సాధించిన సెరెనా తాజా ఫాంను చూస్తే ఈ ఒలింపిక్స్‌లోనూ కచ్చితంగా పతకం సాధించే అవకాశాలున్నాయి.
2sports
విలీన‌మ‌వుతున్న విజేత‌లు - రెండు లక్షల కోట్ల రూపాయలతో అక్టేలియన్‌ను కొనుగోలు చేసిన జే అండ్‌ జే - కీలక ఔషధాల ఉత్పత్తిని మరింత పెంచుకోవడమే లక్ష్యం ! - సక్సెస్‌ ఫుల్‌ కంపెనీలను కొంటున్న బడా సంస్థలు - వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి కొన్నైతే, పోటీని తట్టుకోలేక మరికొన్ని .. - పదిహేనేండ్లలో జరిగిన ప్రముఖ విలీనాలన్నీ ఆ బాపతువే ! ప్రపంచంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా బిజినెస్‌, టెక్నాలజీ రంగాల్లో పెద్ద కంపెనీలు తమ పరిధిలను మరింతగా విస్తరించుకొని తద్వారా తమ వ్యాపార సామ్రాజ్యం అన్ని రంగాల్లో వేళ్ళూనుకునేలా ఉండుటకు మిగతా కంపెనీలతో కలిసి విలీనం బాట పడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ పంథా మరీ ఎక్కువయిందనే చెప్పాలి. తాజాగా, ఆరోగ్య సంరక్షణ దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ ప్రముఖ బయో ఫార్మా సంస్థ అక్టేలియన్‌ ను దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడం బిజినెస్‌ సర్కిళ్లలో చర్చకు దారి తీస్తుంది. ఈ సందర్భంగా చరిత్రలో వివిధ కంపెనీల మధ్య జరిగిన కొన్ని విలీన ఒప్పందాలపై 'నవ తెలంగాణ' ప్రత్యేక కథనం . . జై కీలక ఔషధాల ఉత్పత్తికి జాన్సన్‌, అక్టేలియన్‌ లు కలిశాయి అమెరికా హెల్త్‌కేర్‌ దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ .. ఐరోపాలో అతిపెద్ద బయో ఫార్మాస్యూటికల్‌ కంపెనీగా ప్రసిద్ధి చెంది స్విట్జర్లాండ్‌ వేదికగా కార్యకలాపాలను సాగిస్తున్న బయో ఫార్మాస్యూటికల్‌ కంపెనీ అక్టేలియన్‌ ను సుమారు. రూ.2 లక్షల కోట్లకు చేజిక్కించుకుంది. ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో వినియోగించే కీలక ఔషధాలను ఉత్పత్తి చేసే అక్టేవియన్‌ను కొనుగోలు చేయడం ద్వారా జాన్సన్‌ తన ఔషధ సామ్రాజ్య వింగ్‌ ను మరింతగా విస్తరించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. లింక్డ్‌ ఇన్‌, స్కైప్‌, నోకియాను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌ వేర్‌ ప్రొవైడర్‌ గా , విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా అందరికీ సుపరిచితమై టాప్‌ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలలో మొదటి వరుసలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ సంస్థ.. ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫాం లింక్డ్‌ ఇన్‌ను సుమారు రూ.1.75 లక్షల కోట్లను వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.2016 లో జరిగిన ఈ డీల్‌ మైక్రోసాఫ్ట్‌ చరిత్రలో అతిపెద్ద డీల్‌ గా రికార్డులకెక్కడం విశేషం. లింక్డ్‌ ఇన్‌ కి ఉన్న వనరులను ఉపయోగించుకొని మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ 365 టూల్‌ ను మరింతగా వ ద్ధి చేసేందుకు సదరు సంస్థ ఈ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే, వాయిస్‌, వీడియో కాల్స్‌ తో ప్రపంచం ద ష్టిని ఆకర్షించిన స్కైప్‌ను 8.5 బిలియన్‌ డాలర్లతో, మొబైల్స్‌ రంగంలో ఓ వెలుగు వెలిగిన నోకియాను 7.5 బిలియన్‌ డాలర్లకు మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసిన విషయం కూడా తెలిసిందే! సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఈఎంసీని చేజిక్కించుకున్న డెల్‌ ! ప్రపంచంలో మూడో అతిపెద్ద కంప్యూటర్ల తయారీ సంస్థగా ప్రఖ్యాతి గాంచిన డెల్‌ డాటా స్టోరేజీ సంస్థ.. ఈఏంసీ స్వ్కేర్‌ కార్పొరేషన్‌ను 6700 కోట్ల డాలర్ల మేర చెల్లించి కోనుగులు చేసింది. 2015 సంవత్సరంలో జరిగిన ఈ డీల్‌ ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనాన్ని స ష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత కంప్యూటర్లకు డిమాండ్‌ క్రమక్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సంప్రదాయక వ్యాపార రంగం నుంచి వివిధ సాంకేతిక రంగాలలో విస్త తిని పెంచుకొనే వ్యూహాత్మక ప్రక్రియలో భాగంగానే డెల్‌ సంస్థ ఈ విలీనానికి ముందుకు వచ్చినట్లు కార్పోరేట్‌ వర్గాలు అప్పట్లో అభిప్రాయపడ్డాయి. వాట్సాప్‌ స ష్టించిన సంచలనాలకు ఫిదా అయిన ఫేస్‌బుక్‌ వాట్సాప్‌ గురించి తెలియని యువత ఉండరంటే అతిశయోక్తి కాదు. 2009లో ప్రారంభించబడిన ఈ సంస్థ అతి కొద్ది రోజుల్లోనే అందరి ద ష్టిని ఆకర్షించింది. ప్రారంభించిన నాలుగేండ్లలోనే వాట్సాప్‌ యాక్టివ్‌ యూజర్స్‌ 450 మిలియన్లకు చేరుకోవడంతో ఎలాగైనా వాట్సాప్‌ ను తన సంస్థగా మార్చుకోవాలనుకున్న ఫేస్‌బుక్‌ 2014లో దాదాపు 19 బిలియన్‌ డాలర్లను వెచ్చించి సొంతం చేసుకుంది. టెక్నాలజీ కోసం .. ఒకటైన ఒరాకిల్‌, సన్‌ మైక్రోసిస్టమ్స్‌ :కంప్యూటర్‌లు, కంప్యూటర్‌ పరికరాలు, వివిధ సాఫ్ట్‌ వేర్‌లను అమ్మే సన్‌ మైక్రోసిస్టమ్స్‌ ను ఒరాకిల్‌ సంస్థ 2010లో కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ సుమారు 7.4 బిలియన్‌ డాలర్లుగా ఉందని తెలుస్తుంది. ఒరాకిల్‌ కు సన్‌ సంస్థ పోటీనిస్తుండటంతో పాటు మై ఎస్క్యూఎల్‌ సాఫ్ట్‌ వేర్‌ ను సన్‌ మైక్రోసిస్టమ్స్‌ టెక్నాలజీ సాయంతో వ ద్ది చేయాలని భావించిన ఒరాకిల్‌ ఈ ఒప్పందానికి పూనుకుందని టెక్‌ పండితులు తెలిపారు. భవిష్యత్తును అంచనా వేసి యూట్యూబ్‌ను పట్టిన గూగుల్‌ ఏ సినిమా అయినా, మరే ప్రోగ్రాం అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే వీలు యూట్యూబ్‌ గ్లోబల్‌ వీడియో షేరింగ్‌ వెబ్‌సైట్‌ కల్పిస్తుంది. ఫిబ్రవరి 14, 2005లో ప్రారంభమైన ఈ సంస్థ ఒక్క యేడాది తిరక్కుండానే సంచలనాలకు నెలవైంది. యూట్యూబ్‌కు వస్తున్న స్పందనను గమనించిన గూగుల్‌ సంస్థ . . అనుకున్నదే తడవుగా 2006 నవంబర్‌లో 1.65 బిలియన్‌ డాలర్లకు యూట్యూబ్‌ ను కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వీడియో షేరింగ్‌ కు అమోఘమైన భవిష్యత్‌ ఉండటం వల్లే ఈ డీల్‌ పై గూగుల్‌ మక్కువ చూపిందని వేరే చెప్పాలా ?! పోటీ వద్దనుకొని .. కంపాక్‌, ఆటోనమీని కలుపుకున్న హెచ్‌పీ 1982లో ప్రారంభమైన కంపాక్‌ కంప్యూటర్‌ కార్పొరేషన్‌.. కంప్యూటర్‌ అమ్మకాల్లో హెచ్‌పీని అధిగమించే స్థాయికి వెళ్ళింది. వెంటనే తేరుకున్న హెచ్‌పీ సంస్థ.. పీసీల విక్రయాలను మరింతగా విస్త తి చేసుకోవాలంటే కాంపాక్‌ సంస్థను కొనడమే మంచిదని 2002 సంవత్సరంలో సుమారు 25 బిలియన్‌ డాలర్లను చెల్లించి సదరు సంస్థను సొంతం చేసుకుంది. అలాగే, అతి తక్కువ కాలంలోనే అతిపెద్ద సాఫ్ట్‌ వేర్‌ సంస్థగా అవతరిస్తున్న యూకేకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ సంస్థ అటోనమీని సొంతం చేసుకుంటే వ్యాపారానికి వీలుగా ఉంటుందని తలచిన హెచ్‌పీ 2011లో 10.3 బిలియన్‌ డాలర్లకు పెట్టి అటోనమీని కూడా తనలో విలీనం చేసుకుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
BSE దిగివచ్చిన రిటైల్‌ ద్రవ్యోల్బణం న్యూఢిల్లీ, జనవరి 15: రిటైల్‌ద్రవ్యోల్బణానికి పెద్ద నోట్లసెగ తగిలింది. డిసెంబరునెలలో 3.41శాతం గా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నగదు సంక్షోభం డిమాండ్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచిందని అంచనా. దీనివల్ల వచ్చే ఫిబ్రవరిలో రిజర్వు బ్యాంకు మానిటరీపాలసీ కమిటీ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనా. వడ్డీరేట్లకు కీలకప్రామాణికంగా భావించే రిటైల్‌ద్రవ్యోల్బణం 3.4శాతంగా నిలిచింది. అంతకుముందు నెల లో 3.6శాతంగా నమోదయింది. ఆహారద్రవ్యో ల్బణంపరంగా 15నెలల కనిష్టస్థాయిలో అంటే 1.34శాతంగా నమోదయింది. గతనెలలో 2.03 శాతంగా ఉంది. రైతులవద్దనుంచి కొనుగోళ్లకు పెద్ద నోట్ల రద్దు ఎక్కువ విఘాతం కలిగించింది. ఆహా రేతర ఉత్పత్తులు దుస్తులు, హౌసింగ్‌ ఇతరత్రా ఐదుశాతంగా ఉన్నాయి. గతనెలలోనే రిజర్వుబ్యాం కు వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.25శాతానికి తెచ్చింది. పప్పుదినుసుల్లో కూడా తగ్గుదల నమోదయింది. ఇంధన ధరలపరంగా 3.77శాతంగా ఉంది. ఇక దుస్తులు, పాద రక్షలధరలపరంగా 4.88శాతం, 4.98 శాతం తగ్గినట్లు నిపుణులు అంచనావేస్తు న్నారు. 2010 నుంచి 2012వ సంవత్స రానికి ప్రామాణిక సంవత్సరంగా గుర్తిస్తూ అర్ధగణాంకశాఖ సవరణలు తెచ్చినతర్వాత రిటైల్‌ద్రవ్యోల్బణం వరుసగా తగ్గుతూ వస్తోంది. 2014 నవంబరులో 4.38శాతం ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆ తర్వాత ఆరు శాతానికి పెరిగింది. క్రమేపీ తగ్గుతూ డిసెంబరు నాటికి 3.40శాతానికి దిగివచ్చిందని అంచనా. =====
1entertainment
Hyderabad, First Published 21, Aug 2018, 6:20 PM IST Highlights సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. గడ్డంతో ఉన్న మహేష్ బాబు లుక్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద కూడా కనిపించబోతుందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ కి తల్లి పాత్రలో జయప్రద దర్శనమివ్వబోతుందని వినికిడి. ఆమె పాత్ర తెరపై ఎక్కువసేపు కనిపించకపోయినా.. ఆ ఇంపాక్ట్ మాత్రం ఉండేలా దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన జయప్రద రాజకీయాల్లో బిజీ అవ్వడంతో సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు నటిగా బిజీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ ధారావాహికలో నటించడానికి అంగీకరించారు. ఇక ఇప్పుడు మహేష్ సినిమాతో టాలీవుడ్ లో బిజీ అవ్వాలనుకుంటోంది! Last Updated 9, Sep 2018, 12:35 PM IST
0business
May 11,2017 తెలంగాణలో 25 'టౌన్‌హౌస్‌'లు: ఓయో నవతెలంగాణ, వాణిజ్య విభాగం : ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థ ఓయో ఈ ఏడాది ముగింపు నాటికి తెలంగాణలో కొత్తగా 25 'టౌన్‌ హౌస్‌' హోటళ్లను అందు బాటులోకి తేనున్నట్టుగా ప్రకటిం చింది. తెలంగాణలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ఇందులో భాగంగా జూబ్లిహిల్స్‌లో ఏర్పాటు చేసిన తొలి 'టౌన్‌హౌస్‌' హోటల్‌ను బుధవారం ప్రారంభించింది. 'స్నేహపూర్వక పొరుగు ఆతిథ్యం' అనే కాన్సెప్టుతో సంస్థ ఈ హోటళ్లను రూపొందిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో రితీష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ఏడాది చివరి నాటికి దక్షిణ భారత దేశంలోని మొత్తం ఏడు నగరాల్లో 60 టౌన్‌హౌస్‌ హోటళ్లను అందుబాటులోకి తేను న్నట్టుగా వివరించారు. ప్రైమ్‌ ఏరియాలో అందుబాటు ధరల్లో హోటల్‌ రూములను అందించాలనే ఉద్దేశంతోనే ఈ వినూత్న కాన్సెప్ట్‌ను ఎంచుకున్నట్టుగా ఆయన వివరించారు. హోటల్‌, ఇళ్లు, మర్చండైజ్‌ స్టోర్‌, కేఫ్‌ల వినూత్న మేళవింపుతో ఈ హోటళ్లు స్థానికులకు సేవలందించ నున్నట్టుగా తెలిపారు. సంస్థ దాదాపు 200 నగరాల్లో 70,000 రూముల సామర్థ్యంతో సేవలందిస్తోందని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 8, Aug 2019, 8:33 PM IST Highlights త్వరలో హీరో మంచు విష్ణు సతీమణి విరోనికా నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం తమ భార్య గర్భవతిగా ఉన్న ఫోటోలని విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.    త్వరలో హీరో మంచు విష్ణు సతీమణి విరోనికా నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం తమ భార్య గర్భవతిగా ఉన్న ఫోటోలని విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉండగా విష్ణు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. తన భార్య డెలివరీ గురించి మాట్లాడాడు. అందాల చందమామ కాజల్ అగర్వాల్ తో తన భార్య డెలివరీ గురించి మాట్లాడగా ఆమె క్రేజీగా ఓ ఐడియా ఇచ్చినట్లు విష్ణు తెలిపాడు. తన భార్య నాల్గో కాన్పుని సోషల్ మీడియాలో లైవ్ ఇవ్వాలని కాజల్ కోరినట్లు మంచు విష్ణు తెలిపాడు.  మంచు విష్ణు ట్వీట్ పై విరోనికా కూడా అంతే సరదాగా స్పందించింది. అలా చేస్తే నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తా అని కామెంట్ పెట్టింది. అంత వైలెంట్ డెసిషన్ తీసుకుంటే వెనక్కి తగ్గక తప్పదు. ఎందుకంటే విరోనికకు తన తండ్రి మోహన్ బాబు సపోర్ట్ ఉందని విష్ణు తెలిపాడు.  Last Updated 8, Aug 2019, 8:57 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రహానెని మళ్లీ వెతుక్కుంటూ వచ్చిన కెప్టెన్సీ తాజా సీజన్ ఆరంభంలో రహానె కెప్టెన్సీలో 8 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ జట్టు ఏకంగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో.. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి స్మిత్‌కి పగ్గాలప్పగించగా.. అతను నాలుగు మ్యాచ్‌ల్లో ఏకంగా మూడింట్లో టీమ్‌ని గెలిపించాడు. Samayam Telugu | Updated: May 4, 2019, 02:08PM IST రహానెని మళ్లీ వెతుక్కుంటూ వచ్చిన కెప్టెన్సీ హైలైట్స్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్సీ మళ్లీ మార్పు సీజన్ మధ్యలో రహానెని తప్పించి స్టీవ్‌స్మిత్ చేతికి పగ్గాలు తాజాగా ప్రపంచకప్ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన స్టీవ్‌స్మిత్ మళ్లీ రహానెకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన రాజస్థాన్ ఈరోజు ఢిల్లీతో మ్యాచ్‌.. గెలిస్తేనే ప్లేఆఫ్ రేసులో ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రెండోసారి కెప్టెన్‌ని మార్చింది. సీజన్ ఆరంభంలో టీమ్ వరుస ఓటములకి రహానెని బాధ్యుడ్ని చేస్తూ మధ్యలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన రాజస్థాన్.. స్టీవ్‌స్మిత్‌కి జట్టు పగ్గాలు అప్పగించింది. తాజాగా.. ప్రపంచకప్ నేపథ్యంలో స్టీవ్‌స్మిత్ (ఆస్ట్రేలియా) స్వదేశానికి వెళ్లిపోవడంతో మళ్లీ రహానెని కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా సీజన్‌లో ఇప్పటికే 13 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ జట్టు ఐదు విజయాలు సాధించి, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో 11 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి. టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన జోస్ బట్లర్, జోప్రా ఆర్చర్, బెన్‌స్టోక్స్, స్టీవ్‌స్మిత్ ప్రస్తుతం జట్టుని వీడటంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి పోటీనివ్వడం రాజస్థాన్‌కి కత్తిమీద సామే..! తాజా సీజన్ ఆరంభంలో రహానె కెప్టెన్సీలో 8 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ జట్టు ఏకంగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో.. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి స్మిత్‌కి పగ్గాలప్పగించగా.. అతను నాలుగు మ్యాచ్‌ల్లో ఏకంగా మూడింట్లో టీమ్‌ని గెలిపించాడు. దీంతో మళ్లీ రహానెకి కెప్టెన్సీ ఇచ్చేందుకు రాజస్థాన్ ఫ్రాంఛైజీ మొగ్గుచూపదని అంతా భావించారు. కానీ.. ప్రత్యామ్నాయం లేకపోవడంతో.. తప్పలేదు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
14 ఏళ్ల తర్వాత సిడ్నీలో పలు రికార్డులు నమోదు   సిడ్నీ: పలు రికార్డులు సాధించేందుకు సిడ్నీ వేదికగా మారింది.ఆస్ట్రేలియా,పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో చాలా రికార్డులు నమోదైయ్యాయి. మంగళవారం ప్రారంభమైన మూడవ టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 88 ఓవర్లను గాను మూడు వికెట్లు నష్టపోయి 365 పరుగులు చేసింది.మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో గెలుచిన ఆస్ట్రేలియా మూడవ టెస్టులో కూడా చెలరేగి ఆడుతుంది.సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రెన్‌ షా 167 పరుగులతో బ్యాటింగ్‌,డేవిడ్‌ వార్నర్‌ 113 పరుగులతో సెంచరీ చేశారు.సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎస్‌సిజి) లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించడం 14 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. చివరి సారిగా 2002లో జస్టిస్‌ లాంగర్‌,మాథ్యూ హెడెన్‌ లు ఇదే మైదానంలో ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. వార్నర్‌,రెన్‌ షాల ఘనత ఎస్‌సిజిలో మళ్లీ ఇప్పుడు వార్నర్‌,రెన్‌ షాలు ఆ ఘనతను సాధించారు.మూడవ టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెన్‌ షా 167 పరుగులతో నాటౌట్‌గా,హ్యాండ్‌ స్కాంబ్‌ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇక ఈ టెస్టులో డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనతను సాధించాడు. 87 సంవత్సరాల తరువాత సెంచరీ టెస్టుమ్యాచ్‌ ఓపెనింగ్‌ సెషన్‌లో 87 సంవత్సరాల తరు వాత సెంచరీ నమోదు చేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్‌ మెన్‌గా చరిత్ర సృష్టించాడు.లంచ్‌ విరామ సమయానికి ముందు అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన డేవిడ్‌ వార్నర్‌ 78 బంతుల్లోనే సెంచరీ చేశాడు.టెస్టుల్లోవార్నర్‌కు ఇది 18వ టెస్టుసెంచరీ కాగా పాకిస్థాన్‌ పై మూడవ సెంచరీ కావడం విశేషం.మూడవ టెస్టు లంచ్‌ విరామసమయానికి ముందు 117నిముషాల్లో 17బౌండరీలతో వార్నర్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో వార్నర్‌కు ఇదిరెండవ సెంచరీ కావ డంవిశేషం.1930లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డాన్‌ బ్రాడ్‌మెన్‌ లంచ్‌ విరామ సమయానికి ముందు 105 పరు గులతో సెంచరీ నమోదు చేశాడు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Steve Smith, వార్నర్‌లను పక్కనపెట్టిన ఆస్ట్రేలియా..! ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్‌ మొదలుకానుండటంతో స్మిత్, వార్నర్‌ల పునరాగమనం కోసం ఆస్ట్రేలియా జట్టు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. కానీ.. ? Samayam Telugu | Updated: Mar 8, 2019, 12:08PM IST Steve Smith, వార్నర్‌లను పక్కనపెట్టిన ఆస్ట్రేలియా..! హైలైట్స్ మార్చి 28న ముగియనున్న వార్నర్, స్మిత్‌ల నిషేధం మార్చి 29 నుంచి పాకిస్థాన్‌తో రెండు వన్డేలు ఆడనున్న ఆస్ట్రేలియా ఈ రెండు వన్డేల్లోనూ వార్నర్‌, స్మిత్‌లకి దక్కని చోటు మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌‌లో ఆడించేందుకేనా..? ఆస్ట్రేలియా జట్టులోకి పునరాగమనం కోసం ఏడాదికాలంగా ఎదురుచూస్తున్న మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ , ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ల నిరీక్షణ మరికొన్ని రోజులు కొనసాగనుంది. గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ టాంపరింగ్‌కి పాల్పడిన ఈ ఇద్దరిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే.. వీరిపై ఉన్న నిషేధం మార్చి 28న ముగియనుంది. కానీ.. మార్చి 29, మార్చి 31న పాకిస్థాన్‌తో జరగనున్న చివరి రెండు వన్డేలకీ స్మిత్, వార్నర్‌‌లకు ఆస్ట్రేలియా అవకాశమివ్వలేదు. మార్చి 22 నుంచి పాకిస్థాన్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌ కోసం తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా జట్టుని ప్రకటించింది. Aussie ODI squad for UAE tour: Aaron Finch (c), Pat Cummins (vc), Alex Carey (vc), Jason Behrendorff, Nathan Coulte… https://t.co/Wibnnlts0T — cricket.com.au (@cricketcomau) 1552016019000 ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్‌ మొదలుకానుండటంతో స్మిత్, వార్నర్‌ల పునరాగమనం కోసం ఆస్ట్రేలియా జట్టు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. కానీ.. ఈ మెగా టోర్నీకి ముందే వారిని అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడించే అవకాశం లభించినా.. క్రికెట్ ఆస్ట్రేలియా వారిని పక్కనపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
2sports
internet vaartha 132 Views కాన్పూర్‌ : టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌ వెలకట్ట లేని క్రికెటర్‌ అని టెస్ట్‌ కెప్టెన్‌ కోహ్లీ కొని యాడాడు. కాగా టీమిండియా ఆడిన ప్రతి ష్టాత్మక 500వ టెస్టులో న్యూజిలాండ్‌పై విజయం సాధించేందుకు అతడు బంతి,బ్యాట్‌తో సత్తాచాటాడని పేర్కొన్నాడు.మ్యాచ్‌లో అశ్విన్‌ 10 వికెట్లు పడగొట్టడమే కాకుండా  తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో 40 పరుగులు చేశాడు.క్రికెట్‌పై ప్రభావం చూపే ప్రపంచ ఆట గాళ్లందరిలో అశ్విన్‌ టాప్‌-3ల ఉంటాడు. కొన్నేళ్లుగా అతను బౌలింగ్‌లో దూసుకుపోతున్నా డనడంతో సందేహం లేదు. అశ్విన్‌ చాలా తెలివైన క్రికెటర్‌. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేస్తాడు.జట్టులో అలాంటి క్రికెటర్‌ ఉండటం వెలకట్టలేనిదని పేర్కొన్నాడు.కివీస్‌ 20 వికెట్లకు 16వికెట్లు అశ్విన్‌, జడేజాలే పడగొ ట్టారని, అదే మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు దోహదం చేసిందన్నాడు.పుజారా బ్యాటింగ్‌ కూడా బాగుందని కోహ్లీ కొనియాడాడు. జవాన్ల కుటుంబాలకు సానుభూతి కశ్మీర్‌లోని ఉరీలో జరిగిన ఉగ్రదాడిలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు కోహ్లీ సానుభూతి వ్యక్తం చేశాడు.అలాంటి పిరికి పంద చర్యలు దేశంలోని ప్రతి పౌరుడి బాధపెడతాయనిఇ,అంతరాయం కలిగిస్తాయన్నాడు. ఇలాంటి పెద్ద పెద్ద ఘటనలు చోటు చేసుకుంటే బాదేస్తుంది. కాగా మనకే ఇలా అనిపిస్తుంటే ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది? మనందరినీ ఇది కష్టపెడుతుంది అని ఉరీ ఘటనపై కోహ్లీ స్పందించాడు. ఇలాంటి ఘోర సంఘటనలపై తాను స్పందిస్తానని అయితే క్షేత్రస్థాయి స్థితిపై ఏమీ తెలియకుండా  పరిష్కారం గురించి వ్యాఖ్యానించలేనని కోహ్లీ పేర్కొన్నాడు.అమర జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలియ జేస్తున్నట్లు న్యూజిలాండ్‌పై 197 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తరువాత విలేకరుల సమావేశంలో వివరించాడు.ఉరీ ఘటనలో 18 మంది వీర జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Kane Williamson: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి బూస్ట్‌.. గాయపడిన కెప్టెన్ మళ్లీ టీమ్‌లోకి..! శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో ఢీకొననుంది. Samayam Telugu | Updated: Mar 21, 2019, 05:33PM IST Kane Williamson: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి బూస్ట్‌.. గాయపడిన కెప్టెన్ మళ్లీ టీమ... హైలైట్స్ గాయం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కి కేన్‌ విలియమ్సన్‌ దూరంకానున్నట్లు ఇటీవల వార్తలు ఫిట్‌నెస్ సాధించి శుక్రవారమే జట్టుతో చేరబోతున్నట్లు తాజాగా సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ప్రకటన గత ఏడాది కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విలియమ్సన్ ఈ ఏడాది వార్నర్ మళ్లీ జట్టులోకి వచ్చినా.. విలియమ్సన్‌కే జట్టు పగ్గాలు ఐపీఎల్ 2019 సీజన్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఉత్సాహానిచ్చే వార్త. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతూ గాయపడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఫిట్‌నెస్ సాధించి మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఫీల్డింగ్ చేస్తుండగా.. విలియమ్సన్ భుజానికి గాయమవడంతో అతను కనీసం సరిగా బ్యాటింగ్‌ కూడా చేయలేకపోయాడు. దీంతో.. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విలియమ్సన్‌.. ప్రస్తుతం పూర్తిగా ఫిట్‌నెస్ సాధించాడని.. శుక్రవారమే అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరబోతున్నట్లు ఫ్రాంఛైజీ ప్రకటించింది. ఐపీఎల్ 2019 సీజన్ పూర్తి షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి..! బాల్ టాంపరింగ్ ఉదంతంతో గత ఏడాది నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పగ్గాలు అందుకున్న కేన్ విలియమ్సన్.. బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుని ఏకంగా ఫైనల్‌కి చేర్చాడు. దీంతో.. ఈ ఏడాది వార్నర్‌ మళ్లీ జట్టులోకి వచ్చినా.. విలియమ్సన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ మొగ్గు చూపింది. దీంతో.. ఓపెనర్‌గా మాత్రమే వార్నర్‌ టీమ్‌లో కొనసాగనున్నాడు. శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో ఢీకొననుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV IND vs BAN: ఆఖరి టీ20కి గాయంతో ఇద్దరు ఔట్ మూడు టీ20ల సిరీస్ 1-1తో ఇప్పటికే సమమవగా.. ఆదివారం రాత్రి ఆఖరి టీ20లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది. ఈ నేపథ్యంలో.. రెండు జట్లూ సిరీస్‌పై కన్నేసి అమితుమీ తేల్చుకోనున్నాయి. Samayam Telugu | Updated: Nov 10, 2019, 03:40PM IST IND vs BAN: ఆఖరి టీ20కి గాయంతో ఇద్దరు ఔట్ భారత్‌తో విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20కి ముందు బంగ్లాదేశ్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి మూడో టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌కి గాయం కారణంగా ఆల్‌రౌండర్ మసదేక్ హుస్సేన్, ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గురువారం రాజ్‌కోట్‌లో జరిగిన రెండో టీ20 సమయంలో గాయపడిన ఈ ఇద్దరూ శనివారం బంగ్లాదేశ్ ప్రాక్టీస్ సెషన్‌కి హాజరుకాలేదు. నవంబరు 14 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఈ ఇద్దరికీ విశ్రాంతినివ్వాలని బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ENG vs NZ T20 Super Over: కివీస్‌కి మళ్లీ నిరాశ.. ఇంగ్లాండ్‌దే సిరీస్ స్పిన్ ఆల్‌రౌండర్ హుస్సేన్ రెండో టీ20లో పేలవ బౌలింగ్‌తో నిరాశపరిచాడు. లయ తప్పిన అతని బౌలింగ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఉతికారేశాడు. అతను వేసిన తొలి ఓవర్‌లో ఫస్ట్ మూడు బంతుల్నీ సిక్సర్లుగా మలిచిన రోహిత్ శర్మ.. మొత్తంగా ఆ ఓవర్‌లో 21 పరుగులు రాబట్టాడు. ముస్తాఫిజుర్ కూడా సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ కనబర్చలేదు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉన్నా.. ముస్తాఫిజుర్ మాత్రం ధారాళంగా పరుగులిచ్చేశాడు. Read More: మూడో టీ20పై ట్వీట్‌తో చిక్కుల్లో పడిన గంగూలీ ఇప్పటికే నిషేధం కారణంగా షకీబ్ అల్ హసన్ సేవల్ని కోల్పోయిన బంగ్లాదేశ్.. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ కూడా టూర్‌కి హ్యాండ్ ఇవ్వడంతో బలహీనంగా కనిపిస్తోంది. అయినప్పటికీ.. తొలి టీ20లో ముష్ఫికర్ రహీమ్ మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో గెలిచిన ఆ జట్టు.. రెండో టీ20లో రోహిత్ శర్మ జోరుతో పరాజయాన్ని చవిచూసింది. దీంతో.. సిరీస్ 1-1తో సమమైన నేపథ్యంలో.. ఈరోజు మూడో టీ20లో గెలిచి సిరీస్ గెలవాలని ఆశిస్తోంది. కానీ.. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు జట్టుకి దూరమవడం ఆ జట్టుపై ప్రభావం చూపనుంది. Read More: రోహిత్ శర్మ 6, 6, 6 వెనుక ఆ గొడవే కారణమా..?   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 5, Mar 2019, 4:28 PM IST Highlights దర్శకనిర్మాత మహేష్ భట్ రెండో కూతురు అలియా భట్ నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలను నిర్మించాలని అనుకుంటోంది.  దర్శకనిర్మాత మహేష్ భట్ రెండో కూతురు అలియా భట్ నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలను నిర్మించాలని అనుకుంటోంది. ఇప్పటికే అలియా భట్ సోదరి పూజా భట్ నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు సోదరి బాటలో అలియా కూడా నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది. సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టింది. దాని పేరు 'ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్'. తాజాగా దీనికి సంబంధించిన అధికార ప్రకటన చేసింది అలియా. ఈ బ్యానర్ పై మంచి సినిమాలు తీయలనుకుంటున్నట్లు వెల్లడించింది. దీన్ని బలమైన నిర్మాణ సంస్థగా మారుస్తానని నమ్మకంగా చెబుతోంది. ఒక ఆడియన్ గా తాను ఎలాంటి సినిమాలు తెరపై చూడాలని అనుకుంటుందో అటువంటి సినిమాలే నిర్మిస్తానని అలియా తెలిపింది. హీరోయిన్ గా బాలీవుడ్ లో తన క్రేజ్ చాటుతోన్న ఈ బ్యూటీ నిర్మాతగా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి! Last Updated 5, Mar 2019, 4:28 PM IST
0business
gautam gambhir bats for ms dhoni, says credit should be given where due ధోనీకి మద్దతుగా నిలిచిన గంభీర్..! న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమైన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి .. వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. మైదానంలో, TNN | Updated: Nov 9, 2017, 03:32PM IST న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమైన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి .. వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. మైదానంలో, వెలుపల ధోనీ చాలా సరదాగా ఉంటాడని.. అతని కెప్టెన్సీలో తాను బాగా ఎంజాయ్ చేసినట్లు గంభీర్ చెప్పుకొచ్చాడు. గత కొన్నేళ్లుగా ధోనీ, గంభీర్ మధ్య మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ.. గత ఏడాది ఐపీఎల్ సమయంలో ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. అతనికి టెస్టు తరహా ఫీల్డింగ్‌ని గంభీర్ సెట్ చేశాడు. తాజాగా కివీస్‌‌తో ముగిసిన రెండో టీ20లో ధోనీ పేలవ బ్యాటింగ్ కారణంగానే భారత్ ఓడిపోయిందని.. అతని స్థానంలో యువ క్రికెటర్లకి అవకాశం ఇవ్వాలంటూ మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అగార్కర్ గళం విప్పుతున్న విషయం తెలిసిందే. ‘సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో నేను ఆడాను. అయితే.. ధోనీ నాయకత్వంలోనే నేను ఎక్కువగా ఆటని ఆస్వాదించగలిగాను. మా ఇద్దరి మధ్య చాలా సరదా వాతావరణం ఉండేది. అతని వ్యూహాలన్నీ చాలా సింపుల్‌గా ఉండేవి. కానీ.. వాటి ఫలితాలు మాత్రం ఎవరి ఊహకి అందేవి కావు. అప్పట్లో ధోనీ కెప్టెన్సీని అందరూ విమర్శించారు. కానీ.. సంధి దశలో అతను భారత్ జట్టు పునరుద్ధరణ కోసం చాలా కష్టపడ్డాడు. పరాజయాలు ఎదరైనా.. తన భావోద్వేగాలను అదుపులోకి ఉంచుకుని జట్టుని ముందుకు నడిపించాడు. ప్రస్తుతం జట్టు విజయాలే దానికి నిదర్శనం. ఇంతచేసినా.. ధోనీని పదే పదే ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని గంభీర్ వివరించాడు.
2sports
UAE, First Published 3, Nov 2018, 4:05 PM IST Highlights భారత సంతతికి చెందిన ఓ ఆటగాడు క్రికెట్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు. డబుల్ సెంచరీ అంటే ఒకప్పుడు టెస్టుల్లోనే చూసేవాళ్లం. అయితే సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ వంటి క్రికెటర్ల అద్భుత ఆటతీరు కారణంగా వన్డేల్లో కూడా డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. అయితే టీ20 ల్లో ఇప్పడప్పుడే డబుల్ సెంచరీ నమోదవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ టీ20 రికార్డులను బద్దలుగొడుతూ ఓ భారత సంతతి క్రీడాకారుడు డబుల్ సెంచరీ బాదాడు.  భారత సంతతికి చెందిన ఓ ఆటగాడు క్రికెట్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు. డబుల్ సెంచరీ అంటే ఒకప్పుడు టెస్టుల్లోనే చూసేవాళ్లం. అయితే సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ వంటి క్రికెటర్ల అద్భుత ఆటతీరు కారణంగా వన్డేల్లో కూడా డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. అయితే టీ20 ల్లో ఇప్పడప్పుడే డబుల్ సెంచరీ నమోదవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ టీ20 రికార్డులను బద్దలుగొడుతూ ఓ భారత సంతతి క్రీడాకారుడు డబుల్ సెంచరీ బాదాడు.  భారత్‌కు చెందిన 19 ఏళ్ల కేవీ హరికృష్ణన్‌ యూఏఈ అండర్‌-19 జట్టులో సభ్యుడు. అయితే ఇతడు క్లబ్ క్రికెట్ టోర్నీలో భాగంగా  స్పోర్టింగ్ టీమ్ తరపున బరిలోకి దిగిన అద్భుతాన్ని సృష్టించాడు. మాచోస్‌ జట్టుతో టీ20 మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగిన హరికృష్ణన్‌ కేవలం 78 బంతుల్లోనే 208 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఇతడు ఆరంభంనుండి బౌండరీలతో రెచ్చిపోతూ ఏకంగా 22 ఫోర్లు, 14 సిక్సర్లు బాదాడు.  హరికృష్ణన్‌ ద్విశతకం సాధించడంతో స్పోర్టింగ్‌ క్లబ్‌ జట్టు 20 ఓవర్లలో 250 పరుగులు చేసింది. భారీ స్కోరును సాధించినప్పటికి బౌలర్లు విఫలమవడంతో హరికృష్ణన్ సెంచరీ వృధా అయ్యింది.  ప్రత్యర్థి మాచోస్‌ జట్టు బ్యాట్ మెన్స్ కూడా చెలరేగి ఆడి కేవలం 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు. అయితే టీ20 లో డబుల్ సెంచరీతో రికార్డును నెలకొల్పిన హరికృష్ణన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.
2sports
Ashes 2017: Stuart Broad Sees David Warner as Danger Man యాషెస్‌లో ఫస్ట్ టార్గెట్ డేవిడ్ వార్నర్..! ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎక్కువ ప్రమాదకర ఆటగాడని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్‌ బ్రాడ్ TNN | Updated: Nov 9, 2017, 01:45PM IST ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎక్కువ ప్రమాదకర ఆటగాడని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్‌ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. నవంబరు 23 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ టోర్నీని యుద్ధంతో పోల్చి.. డేవిడ్ వార్నర్ ఇంగ్లాండ్ బౌలర్లకి హెచ్చరికలు పంపాడు. గొడవ కేసు కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ జట్టుకి దూరమవడంతో ప్రస్తుతం ఇంగ్లాండ్‌ కూడా కొంచెం ఒత్తిడిలోనే సిరీస్‌‌కి సిద్ధమవుతోంది. ‘డేవిడ్ వార్నర్‌లాంటి దూకుడైన బ్యాట్స్‌మెన్‌కి ఆరంభంలోనే కొత్తబంతితో సాధ్యమైన ఎక్కువ బంతులు విసరాలి. అలా అయితేనే.. అతను క్రీజులో కుదురుకోకముందే ఔట్ చేయగలం. ఒకవేళ ఈ వ్యూహం విఫలమైతే.. ప్లాన్‌ బి కూడా మన దగ్గర ఉన్నప్పుడే వార్నర్‌ని కట్టడి చేయగలుగుతాం. అతను కాసేపు క్రీజులో నిలవగలిగితే చాలు.. జట్టు భారాన్నంతా ఒక్కడే మోస్తూ స్కోరు బోర్డుని ముందుకు తీసుకెళ్లగలడు. అతనికి బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నదే.. కానీ.. అలాంటి బ్యాట్స్‌మెన్ మన జట్టులో ఉంటే మాత్రం బాగా ఆస్వాదించవచ్చు’ అని స్టువర్ట్‌ బ్రాడ్ వివరించాడు.
2sports
Visit Site Recommended byColombia రైల్వే బాండ్ సమస్యని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ దృష్టికి హర్మన్‌ప్రీత్ కౌర్ తీసుకెళ్లగా.. ఆయన రైల్వే మంత్రికి లేఖ రాసి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. సీఎం లేఖకి స్పందించి రైల్వే శాఖ ఈ క్రికెటర్‌ని ఇటీవల విడుదల చేయడంతో.. తాజాగా ఆమె పోలీస్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, డీజీపీ సురేశ్ అరోరా .. హర్మన్‌ప్రీత్ కౌర్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సమయంలో.. ఆమె దుస్తులకి ఉన్న నక్షత్రాలను స్వయంగా అమర్చడం విశేషం. హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత టీ20 జట్టు ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుపై 3-1తేడాతో టీ20 సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ట్రాన్స్ జెండర్‌లా తయారైన క్రికెటర్ గంభీర్.. సమాజంలో లింగ భేదం ఉండకూడదు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలని గంభీర్ అన్నారు. Samayam Telugu | Updated: Sep 14, 2018, 07:10PM IST టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ విచిత్రమైన వేషధారణలో కనిపించాడు. పెద్దబొట్టు, దుప్పట్ట కొంగు ధరించి ట్రాన్స్‌జెండర్ తరహాలో ఓ కార్యక్రమానికి హాజరు కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొన్నేళ్లుగా వివాదాస్పద అంశంగా మారిన 377 సెక్షన్ పై సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వడం ఇందుకు కారణమై ఉండవచ్చు. స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్స్‌ కమిటీ హెచ్ఐవీ/ఎయిడ్స్ సంబంధిత సంస్థ మంగళవారం నిర్వహించిన హిజ్రా హబ్బా వార్షిక వేడుకలకు గంభీర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇలాగే పుట్టాం.. ఇలాగే ఉంటాం అనేది ఈవెంట్ ముఖ్య ఉద్దేశం. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొనాలంటే మగవారు నుదుట బొట్టు, చీర ధరించాలి. ఆడవారైతే మీసాలు పెట్టుకుని రావాలి. ట్రాన్స్ జెండర్స్ సాయం తీసుకుని వారిలా గంభీర్ కనిపించడంతో కెమెరాలు క్లిక్ మన్నాయి. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కార్యక్రమంలో గంభీర్ మాట్లాడుతూ.. సమాజంలో లింగ భేదం ఉండకూడదు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలి. అందరూ వారికి తగిన రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి. ఎక్కడో ఓ చోట ముందడుగు పడాలి. అందులో భాగంగా నా వంతుకు సహకారం అందిస్తున్నానని’ గంభీర్ చెప్పాడు. ‘మీరు మంచిపని చేశారు.. గంభీర్ తన విలక్షణతను మరోసారి చాటుకున్నారు. మంచి చేయడంలో ముందడుగు వేసేవాళ్లలో గంభీర్ ఉంటారని అందరికీ తెలిసిందే..’ అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల రక్షా బంధన్‌ సందర్భంగా ట్రాన్స్‌జెండర్లతో రాఖీ కట్టించుకుని సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఆడా, మగా అనే లింగభేదం ఎందుకు. మనం మనుషులం అని తెలుసుకుంటే మంచిది. నా చేతికి కట్టిన రాఖీలు ఎప్పుడూ గుర్తుంటాయి’అని ట్రాన్స్ జెండర్లతో రాఖీలు కట్టించుకున్ అనంతరం ట్విటర్‌లో గంభీర్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
2sports
Hyderabad, First Published 24, Oct 2018, 6:11 PM IST Highlights సీనియర్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇటీవల ధఢఖ్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు గాని జాన్వికి మాత్రం క్రేజ్ పెరిగిందనే చెప్పాలి.  సీనియర్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇటీవల ధఢఖ్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు గాని జాన్వికి మాత్రం క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. అమ్మడి గ్లామర్ అలాగే యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి.  అయితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపిస్తేనే హిట్టయినట్లు లెక్క. మొదటి నుంచి జాన్వీ కెరీర్ కు గాడ్ ఫాదర్ లా వ్యవహరిస్తున్నాడు కరణ్ జోహార్. ఆమె కెరీర్ తన బాధ్యత అని శ్రీదేవి బ్రతికుండగానే ఆమెకు మాట కూడా ఇచ్చాడు. అయితే ధఢఖ్ మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. దీంతో జాన్వీ కెరీర్ పై కరణ్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఎందుకంటే ఇదివరకే ఒక సినిమాకు జాన్విని ఫైనల్ చేసిన కరణ్ ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో థ్రిల్లర్ కథకు కూడా ఈ బ్యూటీని ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకు ధఢఖ్ డైరెక్టర్ శశాంక్ ఖైతన్ దర్శకత్వం వహించనున్నాడు. మొత్తానికి కరణ్ జోహార్ జాన్వి కపూర్ ని స్టార్ హీరోయిన్ గా మార్చే వరకు వదిలేలా లేడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. Last Updated 24, Oct 2018, 6:11 PM IST
0business
పవన్ రిలీజ్ చేసిన చల్ మోహన రంగ టీజర్ Highlights తన ట్విట్టర్ ద్వారా నితిన్ టీజర్ రిలీజ్ చేసిన పవన్ ఛల్ మోహన్ రంగా.. గత రెండు వారాలుగా ఈ సినిమా గురించి తెగ బజ్ పెరిగిపోయింది. కారణం ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ కో-ప్రొడ్యూస్ చేస్తూ.. త్రివిక్రమ్ సారధ్యంలో సమర్పణలో నిర్మితమైన సినిమా అంటే ఆ మాత్రం అంచనాలు ఉంటాయిగా. అదేనండీ.. లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య డైరక్షన్లో నితిన్ హీరోగా ''ఛల్ మోహన్ రంగ'' సినిమా వస్తోందిగా.. దాని గురించే ఈ హంగామా అంతా. పదండి వేలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ సినిమా టీజర్ ఎలా ఉందో చూద్దాం.  ఇష్క్ సినిమా తరువాత నుండి నితిన్ అసలు ప్రేమకథలను టచ్ చేస్తే చాలు.. అవి బాగా వర్కవుట్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో కనిపిస్తోంది. ''మేం వర్షం కాలంలో కలసి.. శీతాకాలంలో ప్రేమించుకుని.. వేసవి కాలంలో విడిపోయాం'' అంటూ తన క్యుట్ కథను చెబుతుంటాడు నితిన్. ''అంటే మీరిద్దరూ వెదర్ రిపోర్టర్లా భయ్యా?'' అంటూ పక్కనుండి ఒక పంచ్. చూస్తుంటే ఇదో రొమాంటిక్ కామెడీ అని అర్ధమవుతోంది. అలాగే నితిన్ పక్కనే హీరోయిన్ మేఘా ఆకాష్.. వారిద్దరి కెమిస్ర్టీ.. అదిరిపోయాయ్. చూడ్డానికి ఇద్దరూ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నారు.  ఇకపోతే ఈ సినిమాకు పవన్.. త్రివిక్రమ్ వంటి పెద్ద పెద్ద పేర్లు.. నితిన్ అండ్ కృష్ణ చైతన్య వంటి టాలెంట్లు ఉన్నాక.. మరి మ్యూజిక్ ఎట్టా ఉండాలా? అందుకే తమన్ బాబు చంపేశాడు. మరోసారి తాను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు రారాజు అని ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాపై కొత్త హోప్స్ ను తెచ్చేశారు అందరూ కలసి. ఏప్రియల్ 5న విడుదలకాబోతున్న ఈ సినిమా ట్రైలర్ త్వరలోనే విడుదల కాబోతోంది.
0business
నాగ్ కు సుచీలీక్స్ సెగ... ఇక లీకయ్యేది సమంత, సిద్ధార్థ్ లవే Highlights సమంతను భయపెడుతున్న సుచీలీక్స్ నాగార్జునకు మళ్లీ తలనొప్పిగా మారిన కుమారుని పెళ్లి ఇప్పటికే అఖిల్ పెళ్లి వ్యవహారంతో తలపట్టుకున్న నాగ్   దక్షిణాది సినీ తారల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న తాజా అంశం సుచీ లీక్స్. సింగర్ సుచిత్ర ట్విట్ర ఎకౌంట్ నుంచి లీకవుతున్న అనేక మంది ఫోటోలు, వీడియోలు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సుచీ లీక్స్లో మరో సంచలనం జరగబోతోందట. పలువురు, హీరోలు, హీరోయిన్లను సుచీలీక్స్ ఉచ్చులోకి లాగిన సుచిత్ర.. తాజాగా, సమంతనూ ఇందులోకి లాగిందట.   త్వరలో సమంత, సిద్ధార్థ వ్యక్తిగత వీడియోలను కూడా లీక్ చేస్తానంటూ బెదిరిస్తోందట. సిద్ధార్థ, సమంతలు లవ్ చేసుకున్నారని, బ్రేకప్ చెప్పేసుకున్నారన్న వార్తలు అప్పట్లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుచీలీక్స్‌లో వచ్చిన ఈ బెదిరింపు టాలీవుడ్‌కు షాక్ కలిగిస్తోంది. వాస్తవానికి సుచిత్ర.. తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని చెబుతున్న నేపథ్యంలో ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు.   ఇప్పటికే సుచీలీక్స్ పేరిట వచ్చిన పలు పోస్టులు, వీడియోలను డెలీట్ చేసేశారు. మరోవైపు.. సుచీలీక్స్ అని టైప్ చేయగానే ఎన్నో ఫేక్ అకౌంట్లు వస్తున్న నేపథ్యంలో సమంత-సిద్ధూల వీడియోను లీక్ చేస్తారన్న బెదిరింపులు ఎంత వరకు నిజమై ఉంటాయని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ బెదిరింపు వచ్చిన అకౌంట్ ఫేక్‌దేనని, కావాలనే ఇలా రచ్చ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కొందరు అంటున్నారు.   కాగా అఖిల్ పెళ్లి వ్యవహారంతో గత కొద్ది రోజులుగా సతమతమవుతూ... ఓ రెండ్రోజులుగా తిరిగి తనదైన జీవితం గడుపుతున్న నాగార్జునకు ఈ వార్త మరో షాక్ నిస్తోంది. సమంత గతంలో సిద్ధార్థ్ తో డేటింగ్ చేస్తోందని రూమర్స్ వచ్చాయి. అయితే... ఆ రూమర్స్ అన్నీ మాయమై... తాజాగా అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ కూడా పూర్తి చేసుకుని పెళ్లికి సిద్ధమవుతున్న సమంతపై సుచీలీక్స్ లో ఇలాంటి ట్వీట్ రావడం టెన్షన్ పెడుతోంది. Last Updated 25, Mar 2018, 11:55 PM IST
0business
Series: ICC Champions Trophy, 2017 పాక్‌తో ఢీకొనే భారత్ తుదిజట్టు..? పేస్ వికెట్ కావడంతో కేదార్ జాదవ్, అశ్విన్‌కి మధ్య కూడా పోటీ కొనసాగుతోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరికే ఛాన్స్. ఐదుగురు బౌలర్లతో TNN | Updated: Jun 4, 2017, 09:41AM IST ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యంత ఆసక్తికరమైన పోరుకి మరికొద్ది గంటల్లోనే తెరలేవనుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్- పాకిస్థాన్ ఢీకొంటున్నాయి. ఇటీవల న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో ముగిసిన వార్మప్ మ్యాచ్‌ల్లో సమష్టిగా రాణించిన భారత్ ఉత్సాహంగానే బరిలోకి దిగుతోంది. అయితే తుది జట్టుపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా రెండు వార్మప్ మ్యాచ్‌లకి దూరమైన యువరాజ్ సింగ్ పాక్‌తో మ్యాచ్‌లో మైదానంలోకి దిగుతాడో లేదో తెలియడం లేదు. మరోవైపు గాయపడిన మనీశ్ పాండే స్థానంలో జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ బంగ్లాదేశ్‌పై 94 పరుగులు చేసి ఫామ్ చాటుకున్నాడు. దీంతో యువీ ఫిటెనెస్ సాధించకపోతే దినేశ్ కార్తీక్‌కి చోటు ఖాయంగా కనిపిస్తుంది.
2sports
నేడు బీసీసీఐ ఏజీఎం Oct 23, 2019, 02:38 IST ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నేడు జరుగుతుంది. అనంతరం ఎన్నికయిన నూతన కార్యవర్గం బోర్డులో పూర్తిస్థాయి పాలన పగ్గాలు చేపడుతుంది. దీంతో సుప్రీం కోర్టు నియమించిన పరిపాలక కమిటీ (సీఓఏ)కి నేటితో శుభం కార్డు పడుతుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన వివాదాస్పదం కాకుండా సజావుగానే ముగిసింది. మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా కార్యదర్శి పదవికి నామినేషన్‌ వేశారు. మరోవైపు ఇన్నాళ్లు భారత క్రికెట్‌ వ్యవహరాలు చూసిన సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీలకు 33 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ. 3.5 కోట్లు చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించింది. Read latest Sports News and Telugu News | Follow us on FaceBook , Twitter Tags:
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ‘తొలిప్రేమ’ జంట.. ‘లుక్స్’ అదుర్స్! ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా లుక్స్‌లో వరుణ్ భిన్న రూపాల్లో దర్శనమిస్తున్నాడు. దీంతో, ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. TNN | Updated: Jan 1, 2018, 01:20PM IST ‘తొలిప్రేమ’తో వస్తున్న వరుణ్ తేజ్.. ఇప్పటివరకు తన ఫస్ట్, సెకండ్ లుక్స్‌లో ఒంటరిగానే కనిపించాడు. అయితే, ఈసారి కొత్త సంవత్సరం పురస్కరించుకుని రాశీ ఖన్నాతో జంటగా ఉన్న మరో సరికొత్త లుక్‌తో ముందుకొచ్చాడు. వరుణ్, రాశీఖన్నా జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా లుక్స్‌లో వరుణ్ భిన్న రూపాల్లో దర్శనమిస్తున్నాడు. దీంతో, ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. వరుణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా ‘తొలిప్రేమ’ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి, బాబాయ్ బాటలో నడుస్తున్న వరుణ్‌ను ఆ స్థాయి విజయం వరిస్తుందో లేదో చూడాలి. ప్రేమికుల సీజన్(ఫిబ్రవరి 14)కు కొద్ది రోజులు ముందుగా.. ఫిబ్రవరి 9న విడుదల కానున్న నేపథ్యంలో యూత్‌కు పండగే!! Can’t wait to share this journey of love with you this new year! May your hearts be filled with peace, joy and love.. Here’s wishing you a very happy new year! #tholiprema @IAmVarunTej @george_dop @dirvenky_atluri @SVCCofficial pic.twitter.com/q1d4aNO1UN
0business
internet vaartha 167 Views కొత్త ట్రక్‌ బ్లేజో విడుదలలో ఎండిసిఇఒ నళిన్‌ మెహతా హైదరాబాద్ : మహీంద్రట్రక్‌ అండ్‌ బస్‌డివిజన్‌ తన మార్కెట్‌ వాటాను మరింత విస్తృతంచేసుకుంటున్నది. భారీ వాణిజ్య వాహనాల సెగ్మెంట్‌లో వచ్చే రెండేళ్లలో మార్కెట్‌ వాటాను రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యంతో కంపెనీ ముందుకు వెళుతున్నదని కంపెనీ ఎండి సిఇఒ నళిన్‌ మెహతా వెల్లడించారు. బుధవారం కంపెనీ కొత్తగా ఉత్పత్తిచేసిన బ్లాజో హచ్‌సివి ట్రక్కును ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్లకు విడుదలచేసారు.అనంతరం మీడియాతో మాట్లా డుతూ ప్రస్తుతంకంపెనీకి 3.7శాతం మార్కెట్‌ వాటా ఉందని, వచ్చే రెండేళ్లలోనే రెట్టింపు మార్కెట్‌ వాటా సాధించుకోగలమని చెప్పారు. ఈ ఏడాది దేశంలో ట్రక్కుల వ్యాపారం పటిష్ట మైన వృద్ధిని సాధించిందన్నారు. గత ఏడాది 35శాతం నుంచి ఈ ఏడాది 40శాతానికి రావచ్చ న్నారు. ట్రక్‌ పరిశ్రమలో సుదీర్ఘకాలం పాటు నడిచిన మాంద్యం అనంతరం ఇపుడిపుడే ఈ రంగం కోలుకుంటున్నదని నళిన్‌ మెహతా వెల్ల డించారు. మౌలికవనరులరంగంలో భారీ ఎత్తున ప్రాజెక్టుటు వచ్చి కదలిక పెరుగుతున్నందున భారీ వాహనాలకు డిమాండ్‌ ఉంటుందన్నారు. రోడ్లు, గనులు వంటిమౌలికవనరుల రంగంలో కదలిక ఉంటే భారీ వాణిజ్యవాహనాలకు పటిష్టమైన రెండంకెల గ్రపతి కనిపిస్తుందన్నారు. మొత్తంగా చూస్తే తమ మార్కెట్‌ వాటా మరింత పరుగుతుందన్నారు. ఈ ఏడాది భారీ వాహ నాలు దేశంలో లక్షా 78 వేలకు ఉంటాయని గత ఏడాదితో పోలిస్తే 35శాతంగా ఉందన్నారు. ఈ మార్కెట్‌లో మహీంద్ర 3.7శాతంగా ఉంటుం దని, మరిన్ని కేటగిరీల్లో ట్రక్కులు, టిప్పర్లు విడుదలచేయడంతో మరింత వాటా ఉంటుంద న్నారు. మధ్యతరహా కేటగిరీలో తేలికపాటి వాహనాలు బస్సుల విబాగం పరంగా తమ కంపెనీ రూ.700 కోట్లు పెట్టుబడులు పెడుతోం దన్నారు ట్రక్కులు, వాణిజ్యవాహనాల విభాగం పరంగా ఈ కొత్తమోడళ్లు వచ్చే రెండేళ్లలో మార్కెట్‌కు రావచ్చని ధీమా వ్యక్తంచేసారు. మొ త్తం ఫిబ్రవరిలో భారీ వాహనాలు 12 వేలయూ నిట్లు విక్రయిస్తే వాటిలో 10శాతం ఎగుమతులు జరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రా ల్లో ఒకటిశాతం వాటాను రెండుశాతానికి పెంచు కోగలమన్నారు. ఇప్పటికే ఈ బ్లాజో విడుదలపై 6500మందికిపైగా వివరాలు కోరారని అనూహ్య స్పందన లభించిందన్నారు. బిఎస్‌4 ప్రామాణికా లతో బ్లాజో మార్కెట్‌కు వస్నుత్నదన్నారు. 25 టన్నులనుంచి 49టన్నుల సామర్ధ్యం కలిగిన బ్లాజో ట్రక్కులు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయ న్నారు. ఈ సిరీస్‌లోనే 40 నుంచి 55శాతం వేరియంట్లు విడుదలచేస్నుత్నట్లు తెలిపారు రోడ్లు, లోడ్‌ స్థితిగతుల ఆధారంగా ట్రక్‌ మార్కెట్‌ ఏడునుంచి ఎనిమిదిశాతం వృద్ధి చెందుతోంద న్నారు. ఎగుమతులపరంగా ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోని కొన్ని ప్రాంతాలకు జరుగుతున్నా యన్నారు. తేలికపాటి మధ్యతరహా వాహనాల్లో కొత్త వెర్షన్లను వచ్చే రెండున్నరేళ్లలో మార్కెట్‌కు తీసుకురాగలమని మెహతా ప్రకటించారు. బ్లాజో సిరీస్‌కు ప్రచారకర్తగా బాలివుడ్‌నటుడు అజ§్‌ ుదేవగన్‌ను నియమించామన్నారు హెచ్‌సివి ట్రక్కుల్లో ట్రక్సో మల్టీయాక్సిల్‌ ట్రక్స్‌, టోర్రో టిప్ప ర్లు, ట్రాకో ట్రాక్టరు ట్రైలర్లు కూడా లభిస్తాయ న్నారు  అమ్మకం తర్వాత కూడా 48 గంటల్లో సేవలు అందించని పక్షంలో ప్రతిరోజు వెయ్యి రూపాయలు చొప్పున కస్టమరుకు చెల్లిస్తామని, అలాగే మరే ఇతర హెచ్‌సివి అయినా మహీంద్ర బ్లాజో కంటే ఇంధనం ఆదా చేస్తే కొనుగోలుచేసిన కస్టమర్లకు పూర్తిసొమ్ము వాపసు చేస్తామని మహీంద్ర సవాల్‌ చేస్తోంది. ఇంధన స్మార్ట్‌ టెక్నాలజీ ఆధారంగా మల్టీడ్రైవ్‌మోడ్‌ ఫీచర్లతో సిఆర్‌డిఇ ఇంజన్‌ ఈ ట్రక్కులకు ఏర్పాటుచేసారు. మొత్తం 90 అధీకృత సేవా కేంద్రాలు, 2900 రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ సేవా పాయింట్లు, రిటైల్‌ స్పేర్స్‌ నెట్‌వర్క్‌ 1777ఔట్‌లెట్లు ఉన్నాయన్నారు.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊర‌ట‌ కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం కుమారుడు కార్తీకి సుప్రీంకోర్టులో ఊర‌ట క‌లిగింది. ఆయ‌న విదేశాల‌కు వెళ్లేందుకు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి లభించింది. Samayam Telugu | Updated: May 20, 2018, 12:01PM IST కార్తీచిదంబ‌రం కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం కుమారుడు కార్తీకి సుప్రీంకోర్టులో ఊర‌ట క‌లిగింది. ఆయ‌న విదేశాల‌కు వెళ్లేందుకు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి లభించింది. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వ‌ర‌కూ బ్రిట‌న్, జ‌ర్మ‌నీ, స్పెయిన్‌లో ప‌ర్య‌టించేందుకు అనుమ‌తిస్తూ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. విదేశాల్లో కొత్త బ్యాంకు ఖాతాలు తెర‌వ‌డం, ప్ర‌స్తుతం ఉన్న ఖాతాల‌ను మూసివేయ‌డం చేయ‌కూడ‌ద‌ని.. ఆస్తుల‌కు సంబంధించిన లావాదేవీల‌ను నిర్వ‌హించ‌రాద‌ని స్ప‌ష్టం చేసింది. కార్తీచిదంబ‌రం
1entertainment
Hyderabad, First Published 10, Aug 2019, 6:44 PM IST Highlights కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి డివైడ్ టాక్ వస్తోంది. ఫిలిం క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రివ్యూలు ఇస్తున్నారు. నాగార్జున ఐకానిక్ చిత్రం మన్మథుడు టైటిల్ తో వచ్చిన మన్మథుడు 2 నిరాశపరిచే చిత్రంగా మిగిలిపోనుంది.  కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి డివైడ్ టాక్ వస్తోంది. ఫిలిం క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రివ్యూలు ఇస్తున్నారు. నాగార్జున ఐకానిక్ చిత్రం మన్మథుడు టైటిల్ తో వచ్చిన మన్మథుడు 2 నిరాశపరిచే చిత్రంగా మిగిలిపోనుంది.  ఈ చిత్రంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అడల్ట్ కామెడీ, రొమాన్స్ కు ప్రాధాన్యత ఇచ్చి కథని పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మన్మథుడు 2 చిత్రంతో రాహుల్ రవీంద్రన్ సతీమణి చిన్మయిపై తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. చిన్మయి తరచుగా సోషల్ మీడియాలో మహిళలకు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరైనా మహిళలని కించపరిచే విధంగా మాట్లాడితే వెంటనే చిన్మయి వారికి కౌంటర్ ఇస్తుంది.  ఇటీవల అర్జున్ రెడ్డి దర్శకుడు చేసిన వ్యాఖ్యలపై చిన్మయి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. మన్మథుడు 2 చిత్రంపై చిన్మయి ఎందుకు స్పందించడం లేదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ స్మోకింగ్ సీన్స్, నటి ఝాన్సీ తో లిప్ లాక్ సన్నివేశం, అడల్ట్ డైలాగ్స్ హాట్ టాపిక్ గా మారాయి.  వీటిపై చిన్మయి తన భర్తని ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. చిన్మయిని ట్రోల్ చేస్తూ అనేక పోస్ట్స్ సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. చిన్మయి తన ఫ్యామిలి పట్ల ఒకలా, ఇతరులపై మరోలా ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  Last Updated 10, Aug 2019, 6:44 PM IST
0business
bse  సవాళ్లు ఎన్ని ఎదురైనా 4500% రిటర్నులు! న్యూఢిల్లీ, నవంబరు 28: మార్కెట్లలో అనిశ్చితి, నోట్లరద్దు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఎన్నిక, ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్ల పెంపుసంకేతాలు మార్కెట్లకు ప్రతిబంధకం అయనప్పటికీ స్టాక్‌ మార్కెట్లలో కొన్ని కంపెనీల స్టాక్స్‌ గడచిన ఐదేళ్లలో 4500శాతం రిటర్నులు ఇచ్చాయి. బిఎస్‌ఇలోని ఎగ్రూప్‌ స్టాక్స్‌లో లక్ష రూపాయలు పెట్టుబడులు పెటిడే ఐదేళ్లు గడిచేసరికి 46 లక్షల రూపాయలకు చేరాయి. అంజంతా ఫార్మాలో 2011 డిసెంబరు 30వ తేదీ లక్ష రూపాయలు పెట్టుబడులు పెడితే ఐదేళ్లు గడిచేసరికి నేటికి 46 లక్షలు అవుతాయని దీనివల్ల స్టాక్స్‌ రాబడులు 4500శాతంపెరిగినట్లు ఇన్వెస్టర్లు అంచనాలు వేస్తున్నారు. అదే తరహాలో మార్క్‌సన్స్‌ఫార్మా,అలెంబిక్‌ ఫార్మా, అరబిందోఫార్మా, వక్రంగీ, సియట్‌ కంపెనీలు 2397.11శాతం, 1727.08శాతం, 1637.87శాతం, 1561.23శాతం, 1478.59శాతం చొప్పున ఈఐదేళ్లలో పెరిగాయి. ఇతర సంస్థ ల పరంగా చూస్తే అతుల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐషర్‌మోటార్స్‌, ఫినోలెక్స్‌కేబుల్స్‌, నాట్కో ఫార్మా వంటివి వెయ్యిశాతం రిటర్నులు ఇచ్చా యి. 2011డిసెంబరు 30వ తేదీ నుంచి 2016 నవంబరు 25 కాలం మధ్యలో ఈ కంపెనీల స్టాక్స్‌ మంచి ఫలితాలిచ్చాయి. ఐఐ ఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూ షన్స్‌, ఎస్‌ ఆర్‌ఎఫ్‌, బ్రిటానియా, టివిస్‌ మోటార్‌, బజాజ్‌ ఫిన్‌సెర్వ్‌, టాటా ఎలిక్స, మదర్‌సన్‌సుమి, పివిఆర్‌ ఇండస్ట్రీస్‌, అమర్‌ రాజా బ్యాటరీస్‌, ఫినోలెక్స్‌ కేబుల్స్‌, కజారి యా సిరమిక్స్‌, జెకెలక్ష్మి, సిమంఎట్‌ వంటివి 500శాతంనుంచి 900శాతం రిటర్నులు ఇచ్చినట్లు ధృవపడింది. ఇతరత్రాచూస్తే ఎంఎంటిసి, జైప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, జైప్రకాష్‌ అసోసియేట్స్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, జేపీ ఇన్‌ఫ్రా టెక్‌, అదాని ఎంటర్‌ప్రైజస్‌;యూనిటెక్‌ కంపెనీ లు 70 నుంచి 92శాతం మార్కెట్‌ విలువల్లో పతనం అయ్యాయి. అంటే ఈ ఐదేళ్లలోను రాబడులు దిగజారాయి. టెలికాం మేజర్‌ సంస్థలు భారతి ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులర్‌, రిలయన్స్‌ కమ్యూ నికేషన్స్‌ 10.18శాతం, 12.26శాతం, 49.82శాతం దిగజారాయి. టాటాగ్రూప్‌ కంపెనీల స్టాక్స్‌ మాత్రం సానుకూల రిటర్నులు ఇచ్చాయి. ఈ ఐదేళ్లకాలంలో టాటా ఎలిక్స, వోల్టాస్‌, టాటా కమ్యూ నికేషన్‌ సర్వీసెస్‌, టాటామోటార్స్‌ వంటివి 610.40శాతం, 308.57శాతం, 201.51శాతం, 156.78 శాతం ఈ ఐదేళ్లకాలంలో వృద్ధిని నమోదు చేసినట్లు విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.
1entertainment
హోమ్ క్రీడలు వన్డే సిరీస్‌ ని గెలుచుకున్న టీమిండియా వన్డే సిరీస్‌ ని గెలుచుకున్న టీమిండియా August 15, 2019,   10:24 AM IST Share on: వెస్టిండీస్ తో  జరుగుతున్న వన్డే సిరీస్‌ని కూడా టీం ఇండియా  క్లీన్ స్వీప్ చేసింది. బుధవారం విండీస్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టుకు ఓపెనర్లు క్రిస్ గేల్(72), లూయిస్(43) అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ సునామీలా విరుచుకుపడడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. అయితే ఆట మధ్యలో వర్షం రావడంతో మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. వెస్టిండీస్‌ 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 255 పరుగులుగా నిర్ధేశించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(10) లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(36) పర్వాలేదనిపించగా.. పంత్‌(0) మరోసారి నిరాశపర్చాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ(114 నాటౌట్) శతకంతో మెరవగా, యువ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(65) అర్ధశతకంతో చెలరేగడంతో భారత్ 32.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.
2sports
Vaani Pushpa 100 Views cricket , dhoni dhoni ముంబయి: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ సెలక్షన్‌ కమిటీకి నవంబర్‌ వరకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌ పర్యటనకు దూరమైన అతడు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో లేడు. ఇటీవల ధోనీ గురించి భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పోస్టు చేసిన ట్విట్‌ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. 2016లో టి 20 ప్రపంచకప్‌ సందర్భంగా ఆస్ట్రేలియాతో తలపడ్డ మ్యాచ్‌లో ఓ సన్నివేశాన్ని కోహ్లీ పోస్ట్‌ చేశాడు. ‘నేను ఎన్నటికీ మరిచిపోలేని మ్యాచ్‌ ఇది. ప్రత్యేకమైన రోజది. ఫిట్‌నెస్‌ పరీక్షలో పరిగెత్తించినట్టు ధోనీ నన్ను పరుగులు పెట్టించాడు అని ట్విట్‌ చేశాడు. దీంతో ధోనీ వీడ్కోలు గురించి పరోక్షగా కోహ్లీ పోస్ట్‌ చేశాడని ఊహాగానాలు పెద్దఎత్తున వెల్లువెత్తాయి. ధోనీ భవితవ్యంపై మాజీలు స్పందిస్తూనే ఉన్నారు. ధోనీ తన నిర్ణయాన్ని సెలక్షన్‌ కమిటీకి తెలియజేయాలని సూచిస్తున్నారు. తాజా క్రీడావార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/
2sports
‘స్పైడర్’ స్పెషల్ షో: వాళ్లకు మాత్రమే! TNN| Sep 20, 2017, 07.17 PM IST మహేష్ బాబు నటించిన 'స్పైడర్' సినిమాను ఈ నెల 27న తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలతో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ వర్క్ చురుకుగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమాను విడుదలకు ముందే ఓ స్పెషల్ షో వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తన కుటుంబ సభ్యులందరితో కలిసి చూడాలని మహేష్ బాబు భావిస్తున్నారట. ఈ స్పెషల్ షోకి హీరో కృష్ణ, విజయనిర్మలతో పాటు ఘట్టమనేని కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ స్పెషల్ షోకి హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఈ శని, ఆదివారాల్లో షోను వేయబోతున్నట్లు సమాచారం. ఇక తమిళంలో కూడా ఈ సినిమా విడుదలకు ముందు ఓ స్పెషల్ షోను ఏర్పాటు చేసి అక్కడ ప్రముఖులను ఆహ్వానించనున్నారని సమాచారం. రెండు గంటల 25 నిమిషాల నిడివి గల ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తాయని అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ సినిమా స్థాయిని పెంచుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV లవ్, ఎమోషన్, సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యకావ్యం పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై, శ్రీమంతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో ప్రొడక్షన్ నెం.3గా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం దృశ్యకావ్యం. TNN | Updated: Jan 23, 2016, 03:53PM IST లవ్, ఎమోషన్, సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యకావ్యం పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై, శ్రీమంతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో ప్రొడక్షన్ నెం.3గా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం దృశ్యకావ్యం. ఈ చిత్రం సరికొత్త కథాంశంతో, ఆద్యంతం ఉత్కంఠ భరితంగా లవ్, ఎమోషన్, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ఈ చిత్రం ద్వారా బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... దృశ్యకావ్యం చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత అటు బిజినెస్ పరంగాను... ఇటు ఇండస్ట్రీ వర్గాల ద్వారా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. దర్శకుడు రామకృష్ణారెడ్డి ఓ మంచి పాయింట్ తో లవ్, ఎమోషన్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని జోడించి రూపొందించారు. కథ, కథనం కొత్తగా ఉంటాయి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కొత్త దర్శకుడైనా... అనుభవమున్న దర్శకుల చిత్రాల్లో కనిపించే స్క్రీన్ ప్లే ఈ చిత్రంలో చూపించాడు. ప్రాణం కమలాకర్ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి మెలొడీ పాటలు అందించడంలో ఆయనకు ప్ర్తత్యేక గుర్తింపు ఉంది. దృశ్యకావ్యం కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధతో మంచి పాటలందించారు. ఆడియోకు అద్భుతమైన స్పందన తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం. పాటలు ఈ చిత్రానికి ప్రాధాన ఎస్సెట్. హీరో కార్తిక్ , హీరోయిన్ కాశ్మీరా మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఎంటర్ టైన్ మెంట్ కు స్కోప్ ఉన్న చిత్రం కాబట్టి అన్ని వర్గాల్ని తప్పకుండా అలరిస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అని అన్నారు. కార్తిక్, కాశ్మీరా కులకర్ణి (నూతన పరిచయం), డా.ఆలి , పృథ్వీ రాజ్, జీవ, సత్యం రాజేష్, శాని, మధునందన్, బేబి హాసిని, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, రచ్చ రవి, రాకేష్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో అలరించనున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
internet vaartha 156 Views హైదరాబాద్‌ : రిలయన్స్‌రిటైల్‌లో కొత్తగా ఆర్‌జియో ఆధ్వర్యంలో వస్తున్న లైఫ్‌ ఎర్త్‌2ను విడుదలచేసింది. లైఫ్‌శ్రేణి లో స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను ఒక్కొక్కటిగా విడుదలచేస్తోంది. తొలుత ముంబై రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌లో విడుదలచేసింది. ప్రఖ్యాత సినీదర్శకుడు పునీత్‌ మల్హోత్రా లైఫ్‌ఎర్త్‌2టివిసి ప్రివ్యూను విడుదల చేసారు. రిలయన్స్‌రిటైల్‌ డివైజెస్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌దత్‌ మాట్లాడుతూ లైఫ్‌ స్మార్ట్‌ఫోన్‌ప్లస్‌ అనేది అమితంగా అన్నివర్గాలను ఆకట్టుకుంటుందని, ఎర్త్‌2 బ్రాండలో అధునాతన ఫీచర్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విడుదలకార్యక్రమంతోపాటు టివిసిని దేశంలోని 900 నగరాల్లో 20 వేల మంది రిటైలర్లు, పంపిణీదారులకు చేరుకునే ఏర్పాట్లు చేసింది. 13ఎంపి ముందుకెమేరా లేజర్‌ ఆటోఫోకస్‌ కెమేరాలు అమర్చింది. ఐదు అంగుళాల స్క్రీన్‌తో 445 పిపిఐ డిస్‌ప్లే 178 డిగ్రీ వ్యూయింగ్‌ యాంగిల్‌ వంటివి స్పష్టమై న వీడియో వీక్షణాన్ని అందిస్తాయని సునీల్‌దత్‌ వెల్లడించారు నలుపు తెలుపు, ఆకుపచ్చ బంగారం రంగుల్లో లభిస్తుంది. గొరిల్లా గ్లాస్‌3 ఫ్రంట్‌ ప్యానెల్‌ దీని స్క్రీన్‌పై గీతలుపడకుండా నిరోధిస్తుంది. మూడు సెక్యూరిటీఫీచర్లు కూడా ఉన్నాయి. పిన్‌ రెటీనా అన్‌లాక్‌, ఫాస్ట్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, సాంప్రదాయక లాకింగ్‌ విధానాలు మూడు ఉన్నాయి. 3జిబి రామ్‌, 32జిబి అంతర్గత మెమరీ, అసలైన 4జి అనుభూతిని అందించేందుకు దోహదం చేస్తుంది. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, హ్‌డిక్వాలిటీ వాయిస్‌, మల్టీ పార్టీ వాయిస్‌, వీడియోకాన్ఫరెర్సింగ్‌ లాంటికి అండగా ఉండేందుకు 2500 ఎంఎహెచ్‌ బ్యాటరీతో ఉంది.
1entertainment
Hyderabad, First Published 6, Aug 2019, 10:06 AM IST Highlights దేశీయంగా విక్రయించే బంగారం అంతా దిగుమతి చేసుకుని విక్రయించేదే. అందువల్ల అంతర్జాతీయ విపణి ఆధారంగా, ధరలు మారుతుంటాయి. డాలర్‌-రూపాయి మారకపు విలువలు కూడా బంగారం ధరపై ప్రభావం చూపిస్తున్నాయి.  బంగారం ధర రోజు రోజుకీ పైపైకి పోతోంది. ఆరేళ్ల గరిష్ట స్థాయికి బంగారం ధర చేరుకుంది. కాగా.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయ బులియన్ విపణిలో సోమవారం రాత్రి 11గంటల సమయానికి పదిగ్రాముల మేలిమి బంగారం ధర రూ.37వేలు ఉంది.  ఈ ధర ఆధారంగానే ఆభరణాల కొనుగోళ్లు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనాలంటేనే సామాన్య ప్రజలు భయపడిపోతున్నారు.  దేశీయంగా విక్రయించే బంగారం అంతా దిగుమతి చేసుకుని విక్రయించేదే. అందువల్ల అంతర్జాతీయ విపణి ఆధారంగా, ధరలు మారుతుంటాయి. డాలర్‌-రూపాయి మారకపు విలువలు కూడా బంగారం ధరపై ప్రభావం చూపిస్తున్నాయి.  బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.44,530 వద్ద నిలకడగా కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.  గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 0.14 శాతం తగ్గుదలతో 1,474 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.27 శాతం పెరుగుదలతో 16.43 డాలర్లకు చేరింది.  ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరుగుదలతో రూ.36,540కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.450 పెరుగుదలతో రూ.35,350కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. రూ.44,530 వద్ద నిలకడగా కొనసాగుతోంది.  Last Updated 6, Aug 2019, 10:23 AM IST
1entertainment
Hyderabad, First Published 10, Apr 2019, 8:14 PM IST Highlights   జాన్వీ కపూర్ మొదటి సినిమా అంతగా ఆడకపోయినా అవకాశాలను మాత్రం బాగానే అందుకుంటోంది. ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కూడా తన కెరీర్ పై ఒక నిర్ణయం తీసుకుందట. టాలీవుడ్ - బాలీవుడ్ అని తేడా లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఒక చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి తన కూతుళ్లను వెండితెరపై చుసుకుకోవాలని ఎంతగానో ఆశపడింది. పెద్ద కూతురు జాన్వీ ఆమె సమక్షంలోనే మొదటి సినిమా స్టార్ట్ చేసినప్పటికీ శ్రీదేవి ఆ సినిమా చూడకుండానే కనుమూసింది.  జాన్వీ కపూర్ మొదటి సినిమా అంతగా ఆడకపోయినా అవకాశాలను మాత్రం బాగానే అందుకుంటోంది. ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కూడా తన కెరీర్ పై ఒక నిర్ణయం తీసుకుందట. మొదట ఖుషి మోడలింగ్ బిజినెస్ లో బిజీ అవ్వాలని అనుకుంది. కానీ మనసులో నటనపై కూడా ఇష్టం ఉండడంతో తరచు ఎటువైపు వెళ్లాలో తెలియక కాస్త ఆందోళన చెందిందట.  ఈ విషయాన్నీ జాన్వీ కపూర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక ఫైనల్ గా ఖుషి యాక్టింగ్ వైపు వెళ్ళడానికి సిద్దమవుతున్నట్లు కపూర్ ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చేసింది. అలాగే అమెరికాలో స్పెషల్ గా యాక్టింగ్ పై శిక్షణ తీసుకోవడానికి ఖుషి రెడీ అయినట్లు జాన్వీ వివరణ ఇచ్చింది. ఇక ఖుషిని బాలీవుడ్ కి పరిచయం చేసే బాధ్యతలను కరణ్ జోహార్ తీసుకున్నట్లు తెలుస్తోంది.   Last Updated 10, Apr 2019, 8:14 PM IST
0business
Feb 28,2018 10వేల అవుట్‌లెట్లకు విస్తరణ: అజాఫ్రాన్‌ నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రానున్న ఏడాది కాలంలో దేశ వ్యాప్తంగా దాదాపు 10,000 రిటైల్‌ అవుట్‌లెట్లకు విస్తరించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా సేంద్రీయ సమీకృత చర్మ సంరక్షణ ఉత్పత్తుల సంస్థ అజాఫ్రాన్‌ ఇన్నోవే షన్స్‌ వెల్లడించింది. దేశంలో 20 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న అన్ని పట్టణాలు, నగరాలు, మెట్రోల్లోని అన్ని కీలక అవుట్‌లెట్లలో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నట్టుగా కంపెనీ వ్యాపార విభాగం అధినేత టి.ఆర్‌. సురేష్‌ తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఏఎస్‌ఐ కుమార్తెను చదివిస్తా.. గంభీర్ దాతృత్వం భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని TNN | Updated: Sep 5, 2017, 02:57PM IST భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో వారం క్రితం ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన ఏఎస్ఐ అబ్దుల్ రషీద్‌ కుమార్తె జోహ్రా చదువు బాధ్యతలను తాను తీసుకుంటానని ప్రకటించారు. గత సోమవారం మెహందీ కాదల్ వద్ద నిరాయుధుడిగా విధుల్లో ఉన్న రషీద్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రషీద్ ఆసుపత్రితో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ సమయంలో అతని కుమార్తె జోహ్రా రోదన అందర్నీ కలచివేసింది. ‘జోహ్రా లాలిపాట పాడి నిన్ను నేను నిద్రపుచ్చలేను. కానీ.. నీ కలల్ని నిజం చేసుకునేందుకు నేను సాయం చేస్తాను. జీవితాంతం నీ చదువు ఖర్చు నేను భరిస్తా. జోహ్రా నువ్వు కన్నీరు కార్చొద్దు.. బాధతో వచ్చే నీ కన్నీరుని ఈ భూమి కూడా మోయలేదు. దేశం కోసం ప్రాణాలర్పించిన మీ తండ్రి ఏఎస్ఐ అబ్దుల్ రషీద్‌కి సెల్యూట్’ అంటూ గంభీర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. భారత్ జట్టుకి దూరమై ఐపీఎల్, రంజీ క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్న గంభీర్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో ‘మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్’ రూపంలో వచ్చిన ప్రైజ్ మనీని నక్సలైట్ల దాడిలో మృతి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకి అందజేసిన విషయం తెలిసిందే.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV నవంబర్ 11న కాళరాత్రి నవంబర్ నెలలో 15 రోజుల పాటు చీకటిగా ఉంటుందని నాసా నుంచి ప్రకటన వెలువడినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే నంబర్ 11న కాళరాత్రి రాబోతుంది... TNN | Updated: Oct 28, 2016, 12:16PM IST నవంబర్ నెలలో 15 రోజుల పాటు చీకటిగా ఉంటుందని నాసా నుంచి ప్రకటన వెలువడినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నంబర్ 11న కాళరాత్రి రాబోతుంది. కానీ నాసా ప్రకటనకు ఈ కాళరాత్రికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తావన 'కాళరాత్రి' అనే సినిమా గురించి. నవంబర్ 11న కాళరాత్రి సినిమా రాబోతుంది. ఆడోరకం ఈడోరకం , స్పీడున్నోడు , జాదూగాడు లాంటి చిత్రాలలో నటించిన సోనారిక ప్రధాన పాత్రలో 'కాళరాత్రి' అనే చిత్రం తెరకెక్కింది . లక్ష్మి టాకీస్ సమర్పణలో సూర్యదేవ్ ఫిలిమ్ కార్పొరేషన్ పతాకంపై గుడి వంశీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు . 'దెయ్యాలు రేప్ చేస్తాయా ...? అనే విచిత్రమైన కాన్సెప్ట్ తో దర్శకుడు రాజీవ్ ఈ సినిమా తెరకెక్కించాడు. ఇప్పటి వరకు వచ్చిన హర్రర్ చిత్రాలకు భిన్నంగా ఈ 'కాళరాత్రి' ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. నవంబర్ 11న ఈ సినిమా విడుదల కాబోతుంది.
0business
Mar 04,2017 ఆంధ్రాబ్యాంక్‌కు రెండు అవార్డులు నవతెలంగాణ - వాణిజ్య విభాగం : ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకుకు రెండు టెక్నలాజీ అవార్డులు దక్కాయి. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబిఎ) ముంబయిలో నిర్వహించిన 12వ వార్షికోత్సవ బ్యాంకింగ్‌ టెక్నలాజీ అవార్డు కార్యక్రమంలో 'మధ్యస్థ బ్యాంకుల బెస్ట్‌ ఫైనాన్సీయల్‌ ఇన్‌క్లూజన్‌ ఇన్షియేటివ్‌' కేటగిరీలో ఆంధ్రా బ్యాంకుకు అవార్డు లభించింది. అదే విధంగా రెండో అవార్డు 'బెస్ట్‌ ఐటి రిస్క్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ ఇన్షీయేటివ్‌'ను దక్కించుకుంది. ఈ అవార్డును ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ వి ఆచార్యా ఆంధ్రా బ్యాంకు ఎండి, సిఇఒ సురేష్‌ ఎన్‌ పటేల్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ జ్యూరీ ఆర్‌కె మషెల్కర్‌, ఐసిఐసిఐ బ్యాంకు సిఇఒ చందా కొచ్చర్‌, ఆంధ్రా బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎకె రత్‌, జనరల్‌ మేనేజర్‌ ఎంఎన్‌ సుధాకర్‌, డిజిఎం కెటి వేణు మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఆ చెత్త సినిమాను ఆస్కార్స్‌కు పంపుతారా? దక్షిణాది సినిమాలు పనికిరావా అంటూ నెటిజన్ల గుర్రు బాలీవుడ్ చిత్రం ‘గల్లీ బాయ్’ ఆస్కా్ర్స్‌కు నామినేషన్ కానున్న సినిమాల జాబితాలో చోటుదక్కించుకుంది. అయితే గల్లీబాయ్ కంటే బాగా ఆడిన దక్షిణాది సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని సెలెక్ట్ చేయనందుకు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Samayam Telugu | Updated: Sep 23, 2019, 03:38PM IST ఆ చెత్త సినిమాను ఆస్కార్స్‌కు పంపుతారా? దక్షిణాది సినిమాలు పనికిరావా అంటూ నెటి... బాలీవుడ్ నటులు రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘గల్లీ బాయ్’. జోయా అఖ్తర్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్‌కి అఫీషియల్ ఎంట్రీగా నామినేట్ అయ్యింది. ముంబయిలోని ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అప్ కమింగ్ ర్యాపర్ తన కలలను ఎలా సాకారం చేసుకున్నాడు? అన్న కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం క్యాటగిరీలో నామినేట్ అయినందుకు పలువరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గల్లీ బాయ్ సినిమాను ఎనిమిది హాలీవుడ్ సినిమాల కాన్సె్ప్ట్‌లను తీసుకుని తెరకెక్కించారని పలువురు ఆరోపిస్తున్నారు. IMDB For #Vadachennai - 8.6 For #GullyBoy - 8.3 Don't Know What Things National Awards & #Oscars2020 Expecting… https://t.co/twNwICZg6Y — Pettaikaran Memes ᴬˢᵘʳᵃⁿ (@PettaikaranMeme) 1569084445000 READ ALSO: Naga Babu: గెటప్ శ్రీనుని ఉపయోగించుకోకపోతే ఇండస్ట్రీకే నష్టం ఆస్కార్స్‌కు రీమేక్ సినిమాలను తీసుకోరు. చక్కటి ఒరిజినల్ కంటెంట్‌ ఉన్న సినిమాలనే తీసుకుంటారు. అలాంటప్పుడు గల్లీ బాయ్‌ని ఏం చూసి తీసుకున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 92వ ఆస్కార్ వేడుకలకు మొత్తం 27 భారతీయ సినిమాలను ఎంపిక చేసి అందులో ఒక దానిని అఫీషియల్ ఎంట్రీగా నామినేట్ చేయాలనుకున్నారు. అలా అన్ని సినిమాల్లో బెస్ట్ గల్లీ బాయ్ అని భావించి దీనిని నామినేట్ చేశారు. అయితే గల్లీ బాయ్ కంటే ‘వడచెన్నై’, ‘సూపర్ డీలక్స్’ సినిమాలు బెటర్ అని అసలు గల్లీ బాయ్‌కి ఆస్కార్ వచ్చేంత సీన్ లేదని నెటిజన్లు అంటున్నారు. ఈ మేరకు ఆస్కార్ అకాడమీని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరోవిషయం ఏంటంటే.. ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) రేటింగ్ ప్రకారం గల్లీ బాయ్ కంటే వడచెన్నై సినిమాకు ఎక్కువ రేటింగ్ వచ్చింది. @seriousfunnyguy @Nilima_W @AzmiShabana @Javedakhtarjadu Lal bhadur Shastri was and is unfortunate This time Who Ki… https://t.co/F2bmkmQNyj — PRIYA BAID HALDIYA (@phaldiya) 1569229698000 పైగా వడచెన్నై ఒరిజినల్ కంటెంట్‌తో తెరకెక్కిన సినిమా. అలాంటప్పుడు గల్లీ బాయ్‌ని ఎంపిక చేయడం వెనక ఉన్న కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు భారతీయ సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యి ఐదో కేటగిరీలోనే ఆగిపోయినవి ఉన్నాయే తప్ప అవార్డును అందుకున్నది లేదు. కానీ ఇండియా నుంచి పలు డాక్యుమెంటరీలకు ఆస్కార్ లభించింది. అయితే భారతీయ సినిమాలకు ఆస్కార్ ఎందుకు రావడంలేదు అన్న విషయంపై అకాడమీ ప్రెసిడెంట్ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు ఆస్కార్ అకాడమీ ప్రెసిడెంట్ జాన్ బెయిలీ. #GullyBoy won't win the #Oscars2020. It's a rule that adaptations and remakes won't be accepted. (Gully boy was ins… https://t.co/s5DnBDXjNa — Arya Suresh (@thecuriouself) 1569083701000 ‘నా అభిప్రాయంలో భారతీయ సినిమా ప్రపంచంలోనే గొప్పది. కానీ మాకు బాలీవుడ్ నుంచి విడుదలయ్యే మ్యూజికల్ సినిమాల ద్వారానే ఇండియన్ ఫిలింస్ గురించి తెలిసింది. కానీ వాటిలో భారతీయ సంప్రదాయాలు, విలువల గురించి తెలిపే అంశాలేమీ కనిపించేదు. ఒక్కమాటలో చెప్పాలంటే మాకు భారతీయ సినిమాల గురించి ఏమీ తెలీదు. అందులో మా తప్పేమీ లేదు. ఎందుకంటే.. ప్రపంచానికి మీ విలువను తెలియజేసేలా సినిమాలను తెరకెక్కించాల్సిన బాధ్యత ఇండియన్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌దే. అంతేకానీ మాకు ఇండియన్ సినిమాలపై కోపం లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఆస్కార్ కేవలం హాలీవుడ్‌కే పరిమితం కాదు’ అని పేర్కొన్నారు. #GullyBoy entry to #Oscars2020 - Really? Some other regional language movies could have been better choices. — Anant Kumar Ganesh (@AnantKumarGanes) 1569068641000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
India's global IT business increases మన ఐటీకి ఈ ఏడాది పండగే పండగ! భారత ఐటి రంగం ప్రపంచ వ్యాప్తంగా తన పట్టును పెంచుకుంటోంది. TNN | Updated: Aug 20, 2015, 04:46PM IST భారత ఐటి రంగం ప్రపంచ వ్యాప్తంగా తన పట్టును పెంచుకుంటోంది. ప్రపంచంలోని వివిధ దేశాలతో ఆయా ఐటీ రంగ ఔట్ సోర్సింగ్ ఒప్పందాల్లో ఇతర దేశాల కన్నా మన ఐటీ కంపెనీలే ముందున్నాయి. ఈ ఏడాది మొదటి అర్థంలో దేశీయ ఐటీ కంపెనీలు చెప్పుకోదగిన రీతిలో పలు ఒప్పందాల్లో విజయం సాధించాయి. Visit Site Recommended byColombia జనవరి-జూన్ సమయంలలో మన ఐటీ కంపెనీల విదేశీ ఒప్పందాల శాతం 27.1 కావడం విశేషం. గత ఏడాది తొలి అంకంలో సరిగ్గా ఇది 23.6 శాతంగా ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో , టెక్ మహీంద్ర సంస్థలు ఈ విషయంలో దేశీయ కంపెనీల్లో ముందున్నాయి. ఈ సంస్థలు కుదుర్చుకున్న ఒక్కొక్క ఒప్పందం విలువ 25 మిలియన్ డాలర్లకు మించిపోయింది. ఈ విషయంలో యూరోపియన్ సంస్థలు చాలా వెనకబడిపోయాయి. ప్రపంచ ఔట్ సోర్సింగ్ లావాదేవీల్లో వాటి వాటా 16.4 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఇది 22.3 శాతం కావడం గమనార్హం. ఇక అమెరికా ఐటీ కంపెనీల పరిస్థితి గుడ్డిలో మెల్ల అని చెప్పుకోవచ్చు. వాటి వాటా గతంలో 16.1 శాతం ఉండగా, ఈ ఏడాది అది కాస్త పెరిగి 18.1 శాతానికి చేరింది. ఈ వివరాలను ప్రముఖ ఔట్ సోర్సింగ్ సలహా సంస్థ ఐఎస్జీ నమోదు చేసింది.
1entertainment
సూపర్ స్టార్ రజినీ బర్త్ డే స్పెషల్.. వైరల్ సాంగ్ అదిరింది Highlights ఇవాళ సూపర్ స్టార్ రజినీ పుట్టినరోజు రజినీ పుట్టిన  రోజు సందర్భంగా పలు చోట్ల సంబరాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా రజినీ బర్త్ డే కోసం ఎస్.ఆర్.రామ్ రూపొందించిన సాంగ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రజినీ అభిమానులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తలైవా రజినీ రహస్య ప్రదేశంలో వున్నా... అభిమానులు మాత్రం పుట్టినరోడు వేడుకలు జరుపుకుని సంబరాల్లో మునిగితేలారు. ఇక ఈ సంబరాల్లో ప్ర‌ముఖ మ్యుజీషియ‌న్ ఎస్.ఆర్ రామ్ త‌లైవా ర‌జినీకాంత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ సాంగ్‌ రూపొందించారు. వా వా వా తలైవా అంటూ సాగే పాట ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది. రజినీకాంత్ భార్య ల‌తా ర‌జ‌నీకాంత్ చేతుల మీదుగా ఈ పాట విడుద‌లయింది. బాలాజీ, శ్రీదేవి పాట పాడ‌గా, శిబిరాజా డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. మ‌రి ఎస్ఆర్ రామ్ సంగీతంలో రూపొందిన స్పెష‌ల్ సాంగ్‌ మీరు కూడా చూసేయండి
0business
May 18,2018 స్టెరిలైట్‌ పవర్‌కు అతిపెద్ద ఆర్డర్‌ హైదరాబాద్‌: స్టెరిలైట్‌ పవర్‌ సంస్థకు అత్యధిక సామర్థ్యం కలిగిని కండక్టర్ల (ఏసీసీసీ) సరఫరాకు సంబంధించి జీఎస్‌ ఎస్‌ కొరియా నుంచి నుంచి అతిపెద్ద ఆర్డరు లభించింది. ఈ ఆర్డరు విలువ 4.7 కోట్ల డాలర్లని సంస్థకు చెందిన సొల్యూషన్‌ బిజినెస్‌ సీఈవో మనీష్‌ అగర్వాల్‌ తెలిపారు. ఏసీసీసీల విభాగంలో ఒక సంస్థకు ఇంత భారీ అర్డరు లభించడం ఇదే తొలిసారని మనీష్‌ వివరించారు. బంగ్లాదేశ్‌ పవర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్‌నందు ఉపయోగించేందుకు గాను జీఎస్‌ ఎస్‌ కొరియా సంస్థ ఈ ఏసీసీసీలను తమ సంస్థ నుంచి కొనుగోలు చేస్తున్నట్టుగా ఆయన వివరించారు. రానున్న ఆరు నెలల వరకు తమ ఆర్డర్‌ బుక్‌ ఫుల్‌గా ఉందని ఆయన తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
CA తప్పులు తేలితే సిఎలకు రూ.10వేల జరిమానా న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుచేయడంలో తప్పులు దొర్లినా అందుకు బాధ్యులైన ఛార్టెడ్‌ అకౌంటెంట్లపై రూ.10వేల రూపాయల జరిమానా విధించాలని సిబిడిటి ఛైర్మన్‌ సుశీల్‌చంద్ర వెల్లడించారు. ఆదాయపు పన్ను చట్టం 271కె ప్రకారం చార్టెడ్‌ అకౌంటెంట్లకు, వాల్యు యర్స్‌, మర్చంట్‌ బ్యాంకర్లకు ఈ రిటర్నులు ఆడిట్‌ చేసి దాఖలుచేసే బాధ్యతలు అప్పగించామని, విలు వల నివేదికలు, ఇతర విషయాలకు సంబంధించి వారే సరిచూడాల్సి ఉంటుందన్నారు. వారుఏమైన తప్పుడు సమాచారం రిటర్నుల్లో పొందుపరిచినట్లు తేలితే ప్రభుత్వపరంగా రూ.10వేల రూపాయల జరిమానా తప్పదని వివరించారు. ఛార్టెడ్‌ అకౌం టెంట్లపై ఉన్న విశ్వాసంతోనే ఈ వ్యవస్థనడుస్తుం దని, సిఎలు, అస్సెస్సీలు దాఖలుచేసే నివేదికలే కీలకం కానున్నందున వారే అత్యంత బాధ్యతాయు తంగా ఉండాలని ఆయన అన్నారు. తప్పులు చేసి నట్లు తేలితే చట్టంలో వివిధ సెక్షన్ల ప్రకారం వారిపై జరిమానాలు విధిస్తామన్నారు. ఇందుకు సంబంధిం చి కొత్త సెక్షన్‌ను కూడా తీసుకువస్తున్నారు. 271జె సెక్షన్‌ను జోడించారు. అకౌంటెంట్‌ లేదా ఒక బ్యాం కర్లు లేదా రిజిష్టరు అయిన వాల్యుయర్‌ తప్పుడు సమాచారం ఇచ్చిన పక్షంలోను, అదే సమాచారాన్ని ధృవీకరిస్తూ జారీచేసిన సర్టిఫికేట్‌అయినా అసెస్‌ మెంట్‌ అధికారి లేదా కమిషనర్‌ వెంటనే రూ.10 వేల రూపాయలు ప్రతిఒక్క నివేదికపైనా జరిమా నాగా వసూలుచేసేందుకు వీలుంది. బడ్జెట్‌ ప్రధాన లక్ష్యం పన్నుపరిధిలోకి అర్హులైన అందరినీ తీసుకు రావడమేనని తేలింది. పన్నులు చెల్లించేవారు తక్కు వ, చెల్లించని వారు ఎక్కువగాను, పన్నులు ఎగ వేస్తున్నవారు కూడా ఎక్కువగానే ఉన్నట్లు ఐటిశాఖ గుర్తించింది. నల్లధనం నివేదికలు, పనామా పేపర్లు లీక్‌ వంటి అంశాలతో పన్నుల ఎగవేతదారులు అత్యధికంగా ఉన్నారు. పన్నులు ఎగవేసే ధోరణులు ఎక్కువగా ఉన్నాయని వీటిని కట్టడిచేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్యాచరణ అమలుచేయక తప్పదని అప్పుడేకట్టడి అవుతుంద న్నారు. బడ్జెట్‌ అనంతరం పిహెచ్‌డి ఛాంబర్‌ నిర్వ హించిన సదస్సులో సుశీల్‌చంద్ర మాట్లా డుతూ దీర్ఘకాలిక మూలధన లబ్ధిపై పన్ను విధింపును కూడా సమర్ధించారు. పన్నుల్లో ఉన్న లీకులను అరికట్టేందుకు ప్రభుత్వం తనవంతు కృషిచేస్తోందన్నా రు. గడచిన కొన్నేళ్లలో పన్నులశాఖ 80 వేలకోట్లు అవకతవకలు జరిగినట్లు తేలిం దని సిబిడిటి గుర్తించింది. ఈ మొత్తం నల్ల ధనాన్ని చట్టబద్ధం చేసుకునేందుకే వినియో గించారే కాని పన్నులపరంగా 80వేలకోట్లు నష్టపోయినట్లు తేలింది. మూలధన లబ్ధిపై పన్నువిధానం సవరించలేదని, ఏ చట్టాన్ని కూడా సవరించలేదన్నారు. ఇఎస్‌ఒపి, ఐపిఒ, ఎఫ్‌పిఒల రూపంలో ఏవిధమైన మూలధన లబ్ధిపొందినా పన్నులు చెల్లించా ల్సి ఉంటుందని, దుర్వినియోగం అయితే తప్పఎలాంటి మార్పులు ఉండవని ఆయ న అన్నారు. అయినప్పటికీ అవకతవకలు కట్టడికి కఠిన ఆంక్షలు ప్రవేశపెట్టడం, సంక్లిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నట్లు సుశీల్‌ చంద్ర వివరించారు.
1entertainment
New Delhi, First Published 14, Mar 2019, 3:56 PM IST Highlights దేశంలోకెల్లా మూడో అతిపెద్ద ఐటీ దిగ్గజం ‘విప్రో’ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అభినవ దాన కర్ణుడే అయ్యారు. తన గ్రూప్ సంస్థలోని 34 శాతం షేర్లను అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించారు. వీటి విలువ అక్షరాల రూ.52,750 కోట్లు.. తద్వారా దాతృత్వంలోనూ తన గొప్పతనాన్ని చాటుకున్నారు అజీమ్ ప్రేమ్ జీ. న్యూఢిల్లీ: విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. విప్రోలో తన 34 శాతం షేర్లను అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించారు. ఆయన నియంత్రణలో ఉన్న పలు సంస్థల వద్ద ఉన్న షేర్లు ఇవి.  విప్రో సంస్థలో అజీమ్ ప్రేమ్ జీ నియంత్రణలో ఉన్న ఈ షేర్ల విలువ దాదాపు రూ.52,750 కోట్లు వరకు ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. దాతృత్వ కార్యకలాపాలు నిర్వహించే అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు ఆయనే ఛైర్మన్‌గా ఉన్నారు. దాతృత్వ కార్యక్రమాలకు ఆయన గతంలోనే భారీ కేటాయింపులు జరపగా, తాజాగా వీటిని మరింత పెంచారు. పెంచిన నిధులతో అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ కు అజీం ప్రేమ్ జీ కేటాయించిన విరాళాల మొత్తం 21 బిలియన్ల డాలర్లు.  అజీం ప్రేమ్ జీ ప్రకటించిన తాజా విరాళంతో ప్రపంచంలోకెల్లా అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్‌ను అతిపెద్ద రెండో సంస్థగా నిలిపింది. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ 40 బిలియన్ల డాలర్లు, ఫోర్డ్ ఫౌండేషన్ కేవలం 12 బిలియన్ల డాలర్లు దాత్రుత్వానికి ఖర్చుచేస్తోంది.  అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ కార్యకలాపాల కోసం ఉపయోగించే దాతృత్వ నిధికి ప్రేమ్‌జీ గతంలో కూడా షేర్లు, ఆస్తుల రూపంలో కొంత మొత్తాన్ని కేటాయిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా కేటాయించిన రూ.52,750 కోట్లతో కలిపితే ఆ విలువ రూ.1.45 లక్షల కోట్లకు చేరింది. ఇందులో విప్రోలోని 67 శాతం వాటాలపై ఆర్థిక యాజమాన్య హక్కులు కూడా ఉన్నాయి. ఈ షేర్లు, ఆస్తులపై వచ్చే ఆర్థిక ప్రయోజనాలతో ఫౌండేషన్‌ దాతృత్వ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రధానంగా దేశంలో విద్యారంగంపై పని చేస్తోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కర్ణాటక, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరి, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో ఫౌండేషన్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నడుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే కొన్నేళ్లలో ఫౌండేషన్‌ కార్యకలాపాల్ని విస్తరించడంతోపాటు ఈశాన్య ప్రాంతంలోనూ ఓ విశ్వవిద్యాలయం నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగు కోసం ఇనిస్టిట్యూషన్లను ఏర్పాటు చేస్తోంది. బెంగళూరులో అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసింది. వచ్చే కొన్నేళ్లలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్టు ఫౌండేషన్‌ తెలిపింది. సమానత, మానవతతో కూడిన స్థిరమైన సమాజం కోసం అన్నది ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ లక్ష్యం. 150 సంస్థలకు అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ సాయమందిస్తోంది. పౌష్టికాహార లోపం, గ్రుహ హింసకు గురైన మహిళలు, మనుష్యుల అక్రమ రవాణా అంశాలకు వ్యతిరేకంగా ఫౌండేషన్ పని చేస్తోంది.  దేశీయ ఐటీ రంగంలో మూడో అతిపెద్ద సంస్థగా వెలుగొందుతున్న విప్రో లిమిటెడ్‌లో గతేడాది డిసెంబర్ నాటికి అజీమ్ ప్రేమ్‌జీకి 74.3 శాతం వాటా ఉన్నది. ఇందులో ప్రేమ్ జీ తనయులు రిషాద్ ప్రేమ్ జీ, తారిక్ ప్రేమ్ జీలకు కూడా వాటా ఉంది. అయితే వారికి ఆర్థిక ప్రయోజనాల కోసం గరిష్ఠంగా ఏడు శాతం వరకు వాడుకోవచ్చు. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. ఐటీతోపాటు పలు ఇతర వ్యాపార రంగాల్లోనూ ఉన్నది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా ఉన్న అజీమ్ ప్రేమ్‌జీ.. విప్రో చైర్మన్‌గాను ఉన్న సంగతి విదితమే. ఉత్తర భారతంలోనే తమ సంస్థలను విస్తరిస్తామని అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రకటించింది. Last Updated 14, Mar 2019, 3:56 PM IST
1entertainment
Suresh 150 Views మరిన్ని విజయాలు సాధించాలి హైదరాబాద్‌:: క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌ అన్నారు. రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చి పతకాలు సాధఙంచిన క్రీడాకారులకు ఆయన అభినందలు తెలిపారు. ఆదివారం ఇక్కడి జరిగిన కార్యక్రమంలో సింధు, సాక్షి మాలికక్‌, దీపా కర్మాకర్‌లు చక్కగా రాణించారని ఆయన ప్రశంసించారు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ద్రవిడ్ 12వ స్థానంలో బ్యాటింగ్‌కి వస్తావా..? ఆస్ట్రేలియాతో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన 2001 చరిత్రాత్మక టెస్టు మ్యాచ్‌ని ఏ భారత్ అభిమానీ TNN | Updated: Dec 17, 2017, 04:19PM IST ద్రవిడ్ 12వ స్థానంలో బ్యాటింగ్‌కి వస్తావా..? ఆస్ట్రేలియాతో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన 2001 చరిత్రాత్మక టెస్టు మ్యాచ్‌ని ఏ భారత్ అభిమానీ మరిచిపోలేడేమో..? ఆ మ్యాచ్‌లో ఓటమి అంచున నిలిచిన భారత్ జట్టుని వీవీఎస్ లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (180) భారీ స్కోరుతో గెలుపు బాట పట్టించి కంగారు‌లకి బుద్ధిచెప్పారు. మ్యాచ్‌లో హేళనగా స్లెడ్జింగ్ చేయడంతోనే తాను పట్టుదలతో బ్యాటింగ్ చేసి భారీ శతకం బాదినట్లు రాహుల్ ద్రవిడ్ తాజాగా వెల్లడించారు. ఔత్సాహిక క్రీడాకారుల కోసం బెంగళూరులో షూటర్ అభినవ్ బింద్రా ప్రారంభించిన ‘టార్గెటింగ్ పర్‌ఫార్మెన్స్ సెంటర్’ ఆరంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ద్రవిడ్ అక్కడ స్లెడ్జింగ్‌ విషయాన్ని బహిర్గతం చేశాడు. ‘కోల్‌కతా టెస్టులో భారత్ జట్టు తొలి మూడు రోజులు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. ఫామ్‌ కోల్పోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన నేను 25 పరుగులకే ఔటవగా.. భారత్ 171కే కుప్పకూలిపోయింది. దీంతో టీమ్‌ మేనేజ్‌మెంట్ నన్ను రెండో ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లాలని నిర్ణయించింది. 232 వద్ద నాలుగో వికెట్ పడగా.. నేను క్రీజులోకి వెళ్తుండగా.. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా నన్ను ఎగతాళి చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ద్రవిడ్ ఈ ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు.. ఇక తర్వాత ఇన్నింగ్స్‌లో 12వ స్థానంలో వస్తాడేమో..? అంటూ స్లెడ్జింగ్ చేశాడు. ఆ మాటలపై నేను ఏమీ అప్పుడు స్పందించలేదు. మొదటి బంతిని ఎదుర్కొంటే చాలు.. మరొక బంతిని ఎదుర్కొంటే చాలు అనుకుంటూ ఓపికగా ఇన్నింగ్స్‌లో మొత్తం 353 బంతులెదుర్కొని 20 ఫోర్లతో 180 పరుగులు చేయగలిగాను’ అని ద్రవిడ్ వివరించాడు. ఈ మ్యాచ్‌లో 274 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ని ఆరంభించిన భారత్.. చివరికి 383 పరుగుల‌ లక్ష్యాన్ని కంగారూల‌కి నిర్దేశించగా.. స్పిన్నర్ హర్భజన్ సింగ్ (6/73) ధాటికి ఆ జట్టు 212కే కుప్పకూలిపోయి భారత్‌కి చిరస్మరణీయమైన విజయాన్ని కట్టబెట్టింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Visit Site Recommended byColombia ‘హసీన్‌కి గతంలో వివాహమైన విషయం పెళ్లికి ముందు నాకు తెలియదు. ఇద్దరు కూతుళ్లని తన అక్క పిల్లలుగా నాకు పరిచయం చేసింది. ఆ తర్వాత హసీన్ మొదటి వివాహం గురించి నాకు తెలిసింది. అయినప్పటికీ తనని నేను చాలా బాగా చూసుకున్నా. కానీ.. తనెప్పుడూ అభద్రతాభావంలోనే ఉండేది. ఆమె నాపై చేసిన ఫిక్సింగ్ ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ఇంత గొడవ జరిగినా.. ఇప్పటికీ ఆమెతో నేను రాజీపడేందుకు సిద్ధంగానే ఉన్నా. ఇందులో భాగంగానే ఆమెకి ఫోన్ చేస్తుంటే.. వేధిస్తున్నాడంటూ మీడియాతో చెప్తోంది. ఇప్పుడు నా కూతురి భవిష్యత్ నాకు ముఖ్యం’ అని మహ్మద్ షమీ ఉద్వేగంగా వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
నటి అరెస్ట్.. పదిరోజుల తరువాత బెయిల్ పై బయటకి! Highlights తమిళనాడులో స్టెరిలైట్ కర్మాగార వ్యతిరేక ఆందోళనలో పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన  తమిళనాడులో స్టెరిలైట్ కర్మాగార వ్యతిరేక ఆందోళనలో పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తూత్తుకుడిలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు. ప్రముఖ టీవీ నటి నిలానీ కూడా ఈ విషయంపై స్పందించింది. ఆరోజు ఆమె పోలీస్ డ్రెస్ ధరించి షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతో అదే డ్రెస్ లో ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆమె పోలీసు డ్రెస్ తో నటిస్తున్నందుకు సిగ్గు పడుతున్నాను అంటూ తూత్తుకుడిలో జరిగిన సంఘటనపై పోలీసులను విమర్శించారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి ఈ నెల 19న అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె సైదాపేట కోర్టులో బెయిలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని షరతుల మీద ఆమెకు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.  Last Updated 29, Jun 2018, 12:06 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV పాలసీలపై మీ అభిప్రాయాలు చెప్పండి: పవన్ కల్యాణ్ ఈ పేజీ ద్వారా జనం వివిధ అంశాలు, పాలసీలపై తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని పవన్ కల్యాణ్... | Updated: Mar 15, 2017, 06:32PM IST జనసేన పార్టీ ఏర్పాటై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న ఆ పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ పార్టీ అధికారిక వెబ్‌సైట్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచే ట్విటర్‌లో ట్రెండ్ అవుతోన్న ఈ వెబ్‌సైట్ గురించి పవన్ ఇవాళ ట్వీట్ చేశారు. వెబ్‌సైట్‌లో వున్న ' జనస్వరం ' అనే పేజీ ద్వారా జనం వివిధ అంశాలు, పాలసీలపై తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని పవన్ ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. — Pawan Kalyan (@PawanKalyan) March 15, 2017 అలాగే, విదేశాల్లో వున్న వారిని కూడా ఇందులో భాగస్వాములని చేయడానికి ఏర్పాటు చేసిందే ఎన్ఆర్ఐ కనెక్ట్ అనే లింక్ అని పవన్ తన ట్వీట్ లో తెలిపారు. మరి ఇంకేం.. పవన్ ని నేరుగా కలిసి చెప్పలేని అంశాలు ఏమైనా వుంటే, మీరు వాటిని ఇక్కడ జనసేనానితో పంచుకోవచ్చన్నమాట! పవన్ చేస్తున్న ఈ మంచి ప్రయత్నం పార్టీకి ఏమేరకు సత్ఫలితాలని అందివ్వనుందో వేచిచూడాల్సిందే!
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పవన్ తనయుడి పేరు.. వర్మ సెటైర్లు! వెబ్ మీడియాలో ఈ మేరకు ప్రచారం జరుగుతోంది. పవన్ ఫ్యాన్స్ మధ్య ఈ పేరు గురించి చర్చ జరుగోతంది. మరోవైపు ఆర్జీవీ ఈ పేరుపై సెటైర్లు గుప్పించేశాడు! TNN | Updated: Nov 2, 2017, 08:11AM IST ​మార్క్ శంకర్ పవనోవిచ్.. ఇదేదో టంగ్ ట్విస్టర్ కాదు. పవన్ కల్యాణ్ చిన్నకుమారుడి పేరు అట ఇది. వెబ్ మీడియాలో ఈ మేరకు ప్రచారం జరుగుతోంది. పవన్ ఫ్యాన్స్ మధ్య ఈ పేరు గురించి చర్చ జరుగోతంది. మరోవైపు ఆర్జీవీ ఈ పేరుపై సెటైర్లు గుప్పించేశాడు! పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా ఇటీవలే ఒక బాబును ప్రసవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి పేరేంటి.. అనేది చర్చలోకి వచ్చింది. మొన్నంతా కుశాల్ బాబు అనే పేరును కొంతమంది ప్రచారంలోకి తీసుకురాగా ఇప్పుడు ఈ మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. వివిధ దేశాల, వివిధ మతాల కలయికలా ఉంది ఈ పేరు. అటు జర్మన్, ఇటు రష్యాన్, ఇంకోవైపు ఇండియన్.. ఇటు క్రిస్టియానిటీ, ఇటు హిందూ మతం.. ఇవన్నీ ధ్వనిస్తున్నాయి ఈ పేరులో. అయితే ఇది నిజంగా పవన్ కల్యాణ్ చిన్న తనయుడి పేరేనా.. అనేది ఇంకా అధికారికంగా ధ్రువీకరణ కావాల్సి ఉంది. ఒకవేళ ఇదే పవన్ తనయుడి పేరైతే.. అభిమానుల పాలిట ఇదో టంగ్ ట్విస్టర్ అవుతుందని వేరే చెప్పనక్కర్లేదు.
0business
ప్రభాస్ ను దూరంపెడుతున్న కరణ్ జోహార్ Highlights  బాహుబలి భారీ విజయం వెనుక కరణ్ జోహార్ కరణ్ మూలంగా దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన బాహుబలి తాజాగా సాహో సినిమాకు మాత్రం మొఖం చాటేస్తున్న కరణ్ ‘బాహుబలి’ చిత్రం ఘన విజయం వెనుక బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వున్నారనేది జగమెరిగిన సత్యం. కరణ్ జోహార్ మూలాంగా బాహుబలి కోసం అక్కడి ప్రమోషన్స్ ఒక రేంజిలో పనిచేసాయి. కరణ్ జోహార్ సహాయం లేకుండా ‘బాహుబలి’ ఈ రేంజ్ హిట్ అందుకోలేకపోయేది. అయితే ‘బాహుబలి’ సంచలన విజయం వెనుక తన శక్తి వంచన లేకుండా కృషిచేసిన కరణ్ ఆ మూవీ తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమా విషయంలో పెద్దగా ఆసక్తికనపరచడం లేదని తెలుస్తోంది.   సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘సాహో’ బాలీవుడ్ లో కూడ విడుదల చేసి అక్కడ కూడ ఘన విజయం సాధించాలని ‘సాహో’ నిర్మాతలు భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈమూవీ ప్రమోషన్ తో పాటు బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాన్ని కూడ కరణ్ జోహార్ కు అప్పచెప్పాలని చేస్తున్న ప్రయత్నాలు పెద్దగ ముందుకు సాగడంలేదు అని ఫిలింనగర్ టాక్.    ఇది ఇలా ఉండగా ఈమూవీలో ప్రభాస్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయినే వుండాలని పట్టుబట్టి మరీ సాధించుకున్నారు ఈసినిమా నిర్మాతలు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ ఇందులో హీరోయిన్‌ గా నటించినందుకు కాను దాదాపు ఎనిమిది కోట్ల భారీ పారితోషికం కూడ ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.     అయితే ఈ నిర్ణయం పట్ల ప్రభాస్ అభిమానులు ఆనందంగా లేరు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం శ్రద్ధ బాలీవుడ్ లో బి గ్రేడ్‌ హీరోయిన్‌ అన్న భావం ప్రభాస్ అభిమానులలో ఉంది. దీనికితోడు ఈమధ్య ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి అన్న సెంటిమెంట్ కూడ ప్రభాస్ అభిమానులను వెంటాడుతున్నట్లు టాక్.  శ్రద్ధ కపూర్ వల్ల అటు బాలీవుడ్‌లో అడ్వాంటేజ్‌ రాకపోగా ఇటు తెలుగులో కూడా హీరోయిన్‌ వీక్‌ అనిపించుకునే అవకాశముంది అని ప్రభాస్ అభిమానులు కలవర పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.     దీంతో ‘సాహో’ టీమ్‌ బాలీవుడ్‌ నుంచి టాప్‌ యాక్టర్లని రంగంలోకి దింపలేకపోయిందని విలన్‌గా నీల్‌ నితిన్‌ ముఖేష్‌ నటిస్తూ ఉన్నా  ఈ చిత్రానికి ఇక ప్రభాసే సర్వం కాబట్టి కేవలం ప్రభాస్ మ్యానియా ‘సాహో’ ను ఎంతవరకు కాపాడుతుంది అన్న భయాలు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ను భయపడుతున్నట్లు తెలుస్తోంది..  Last Updated 25, Mar 2018, 11:38 PM IST
0business
శ్రీదేవి పోస్టుమార్టం రిపోర్ట్స్ లో ఏం తేలింది.? Highlights అందాల నటి శ్రీదేవి హఠాన్మరణం యావత్ భారత దేశాన్ని కలచి వేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కి పంపడం జరిగింది.​ అందాల నటి శ్రీదేవి హఠాన్మరణం యావత్ భారత దేశాన్ని కలచి వేసింది. మొన్నటిదాకా మన మధ్యే ఉంది ఇంత అకస్మాత్తుగా ఆమె మరణించడం ఎవరు సహించలేకపోతున్నారు. కానీ ఇంత సడన్ గా ఆమె ఎందుకు మరణించినట్టు? ఆమెది సహజ మరణమేనా? ఇందులో లూప్ హోల్స్ ఏమన్నా ఉన్నాయా అంటూ సందేహాలు వినిపిస్తున్నాయి.  నిన్ననే ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కి పంపడం జరిగింది. రిపోర్ట్స్ కోసం అందరూ ఎదురు చూస్తుండగా ఇవాళ కాసేపటి క్రితం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఆమె మరణం హార్ట్ ఎటాక్ వల్లనే సంభవించింది అని నిరూపితమైంది. రిపోర్ట్స్ రావడానికి కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ లో చాలా రుమర్లకు తావిచ్చినట్టైంది. కానీ ఒక వ్యక్తి హాస్పిటల్ లో చనిపోతేనే రిపోర్ట్స్ త్వరగా బయటకి వస్తాయి బయట చనిపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి - డెత్ రిజిస్టర్ చేసి - అన్నిటిని పరీక్షించి రిపోర్ట్స్ తయారీకి కొంత ఎక్కువ సమయం పడుతుంది అని ఒక గల్ఫ్ జర్నలిస్ట్ చెప్పారు.  బాడీ ని మోర్చరీ లో పెట్టి - ఫోరెన్సిక్ రిపోర్ట్స్ తయారు చేసి - ఆటోప్సీ రిపోర్ట్ ను పోలీసులకు అందచేసి క్లియరెన్స్ పొందటం జరిగింది. ఆ తరువాత వీసా చెక్ చేసి - ఆ పాస్ పోర్ట్ క్యాన్సల్ చేసి డెత్ సర్టిఫికెట్ అలాగే నో ఓబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తారు. ఇది మాములుగా జరిగే ప్రొసీజర్. శ్రీదేవి మరణం తరువాత కూడా ఈ ప్రొసీజర్ కే చాలా సమయం పట్టింది తప్ప ఆమె చావులో అనుమానాస్పదంగా ఏది లేదు అంటూ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం తేలింది.  Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
Hyderabad, First Published 4, Sep 2018, 2:50 PM IST Highlights బిగ్ బాస్ సీజన్2 చివరి దశకు చేరుకుంటుంది. అయితే మొదటినుండి కూడా ఈ షోపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అవి మరి కాస్త ఎక్కువయ్యాయనే చెప్పాలి బిగ్ బాస్ సీజన్2 చివరి దశకు చేరుకుంటుంది. అయితే మొదటినుండి కూడా ఈ షోపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అవి మరి కాస్త ఎక్కువయ్యాయనే చెప్పాలి. హోస్ట్ నానిపై కూడా సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నాని హౌస్ లో కొందరితో మాత్రమే సఖ్యతగా ఉంటున్నాడని, పక్షపాతం చూపిస్తున్నాడనే మాటలు ఎక్కువయ్యాయి. ఇది స్క్రిప్టెడ్ గేమ్ అని.. తమకు నచ్చిన వారినే బిగ్ బాస్ విజేతగా ప్రకటించనున్నారని దానికి హోస్ట్ నాని కూడా సపోర్ట్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించాడు నాని. బిగ్ బాస్ కి సంబంధించి కొన్ని కామెంట్స్ చూశాను. నేను మీకు స్పందించాల్సిన అవసరం లేదని బిగ్ బాస్ బృందం నాకు చెప్పినప్పటికీ రిప్లయ్ ఇవ్వకుండా ఎలా ఉండగలను. ఇదే షోకి సంబంధించి నా చివరి ప్రకటన అంటూ ఓ పోస్ట్ పెట్టాడు నాని. ''షో విషయంలో మీలో కొందరు నా వల్ల బాధపడి ఉంటే క్షమించండి. కానీ మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. మీకు ఇష్టమైన హౌస్ మేట్ ని ఎప్పుడు ప్రత్యేకంగా చూసుకోవాలని భావిస్తున్నారు. కానీ హోస్ట్ గా నేను మీలా ఆలోచించలేను. నా వైపు నుండి అందరికీ సమానమైన అవకాశం ఇవ్వాలి. మీరు హౌస్ లో ఒకరికి అభిమాని అయి ఉండొచ్చు అయితే నేను హౌస్ లో అందరికీ సమానంగా ఛాన్స్ ఇస్తున్నప్పుడు మీకు నేను పక్షపాతం చూపిస్తున్నానని అనిపించొచ్చు. కానీ నన్ను నమ్మండి నాకు హౌస్ లో అందరూ సమానమే. మీ ఆదరణతోనే హౌస్ లో ఉత్తమ వ్యక్తి విజయం సాధిస్తారు. ఓటింగ్, ఎలిమినేషన్ విషయాలని నేను చూసుకుంటున్నాని మీరు అనుకుంటున్నారు. నిజంగా అందులో నా ప్రమేయం ఉంటుందనే భావిస్తున్నారా..? ఇక ఆ విషయాన్ని మీకే వదిలేస్తున్నాను. నటుడిగా, వ్యాఖ్యాతగా మీకు బెస్ట్ ఇవ్వాలనేది నా ఆలోచన. నన్ను ప్రేమించినా, ద్వేషించినా మీ అందరూ నా కుటుంబ సభ్యులే. మీరు నన్ను అపార్ధం చేసుకుంటే ఆ ఇంపాక్ట్ నాపై అట్నుండి. కానీ అది నన్ను కింద పడేస్తుందా..? లేదు.. ఇంకా బెటర్ గా చేయడానికి ప్రయత్నిస్తాను'' అంటూ రాసుకొచ్చాడు.
0business
London, First Published 9, Sep 2018, 9:38 PM IST Highlights ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత్ పరువు నిలబెట్టాడు. 156 బంతుల్లో 1 సిక్స్, 11 ఫోర్ల సాయంతో జడేడా 86 పరుగులు చేశాడు. దాంతో విహారీ కూడా అర్థ సెంచరీ చేయడంతో భారత్ ఇంగ్లాండుపై జరిగిన ఐదో టెస్టు మ్యాచులో 292 పరుగులు చేసింది. లండన్: ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత్ పరువు నిలబెట్టాడు. 156 బంతుల్లో 1 సిక్స్, 11 ఫోర్ల సాయంతో జడేడా 86 పరుగులు చేశాడు. దాంతో విహారీ కూడా అర్థ సెంచరీ చేయడంతో భారత్ ఇంగ్లాండుపై జరిగిన ఐదో టెస్టు మ్యాచులో 292 పరుగులు చేసింది.    జడేజా చెలరేగిపోయి స్కోరు బోర్డును పెంచాడు. టాప్ ఆర్డర్ తడబాటుకు గురైన స్థితిలో హనుమ విహారీతో కలిసి జడేజా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే 56 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విహారీ పెవిలియన్ చేరాడు.  జడేజా 113 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. ఆ తర్వాత మైదానంలో తన ఫేమస్ స్వార్ట్ సెలబ్రేషన్ చేశాడు. డ్రెస్సింగ్ రూం నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లు జడేజా ఇన్నింగ్స్‌ని కరతాళ ధ్వనులతో అభినందించారు.   భారత్ బ్యాటింగ్‌లో జడేజా 86, హనుమ విహారీ 56, విరాట్ కోహ్లీ 49, కెఎల్ రాహుల్ 37 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలింగ్‌లో ఆండర్‌సన్, స్టోక్స్, అలీ తలో రెండు, బ్రాడ్, కర్రన్, రషీద్ తలో వికెట్ తీశారు.  ఈ వార్తాకథనాలు చదవండి
2sports
3r test అశ్విన్‌ ఔట్‌ మొహాలి: ఇంగ్లాండ్‌: భారత్‌ జట్ల మధ్య జరుగుతున్నమూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాడు అశ్విన్‌ (72) పరుగుల వద్ద స్టోక్స బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 46పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.. దీంతో భారత్‌ 95 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. అశ్విన్‌ స్థానంలో జయంత్‌ యాదవ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు.
2sports
విజయం దిశగా భారత్‌   విశాఖపట్నం, నవంబర్‌ 20, ప్రభాతవార్త : విశాఖ వేదికగా జరుగుతున్న భారత్‌-ఇంగ్లాండ్‌ జట్టు మధ్య రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ పట్టు సాధిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించే అవకాశాలు అధికంగా కనపడుతు న్నాయి. ఎసిఎ విడిసిఎ మైదానంలో జరుగు తున్న రెండోఇన్నింగ్‌ ఇంగ్లాండ్‌ 255 పరుగులకే కుప్పకూలింది. విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు నాల్గొవ రోజు ఆటలో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ నిలకడగా చేస్తోంది. ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌(50.172 బంతుల్లో4+4) క్లాస్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్‌ హాసీబ్‌ హామీద ్‌(25,144 బంతుల్లో 3+4) చక్కని డిఫెన్స్‌తో ఆడారు. ఇంగ్లాండ్‌ జట్టు 405 పరుగుల లక్ష్యం విధించింది. జట్టు స్కోర్‌ 75 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ హామీద్‌ వికెట్‌ కొల్పొయింది. 51వ ఓవర్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ అతడిని ఎల్బీ చేశారు. ప్రమాదకరంగా మారిన అలిస్టర్‌ కుక్‌ను ఓట్‌ చేసేందుకు బారత్‌ తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో రెండుడిఆర్‌ఎస్‌లను కోల్పోయింది. రవీంద్ర జడేజా వేసి 60.2 వ బంతికి కుక్‌ ఎల్బీ రూపంలో వెనుకదిరగడంతో నాల్గోవరోజు ఆట ముగిసింది. జోరూట్‌ (5బ్యాటింగ్‌, 23 బంతుల్లో) క్రీజులో వున్నాడు. చివరిరోజు సోమ వారం పిచ్‌ స్పిన్నర్లుకు అనుకూలించి వికెట్లు తీయగలిగితే కోహ్లీ సేనను విజయం వరిస్తుంది. ఇంకా 318 పరుగుల లక్ష్యం చేధించేందుకు ఇంగ్లాండ్‌కు మరో 8 వికెట్లు ఉండడంతో ఫలితం తారు మారయ్యే అవకాశాలు వున్నాయి. విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(81,109 బంతుల్లో 8+4) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఒవర్‌నైట్‌ స్కొర్‌ 98/3తో నాల్గోవ రోజు, ఆదివారం బరిలోకి భారత్‌ 204 పరుగులకు ఆలౌట్‌ అయింది. కోహ్లి మరో 25 పరుగులు మాత్రమే జత చేయగా ఆజింక్య రహానే(26.65 బంతుల్లో 2+4) 4 పరుగులకు చేసి బ్రాడ్‌ బౌలింగ్‌లో కుక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు. ఆ తర్వాత భారత్‌ వెంట వెంటనే వికెట్లు కొల్పొయింది. జయంత్‌ యాదవ్‌(27 నాటౌట్‌. 59 బంతుల్లో 4+4) మాత్రమే కాస్త ఆకట్టుకున్నాడు. బ్యాట్‌ మెన్‌ తమ పని పూర్తి చేశారు. ఇక మిలిగింది బౌలర్ల వంతు,ఆఖరి రోజు బంతితో ఇంగ్లాండ్‌ను తిప్పేస్తే విజయం కోహ్లీసేనను వరిస్తుంది. ఇంగ్లాష్‌ బ్యాట్స్‌మెన్‌ నిలబడితే మాత్రం ఫలితం తారు మారయ్యే అవకాశాలు వున్నాయి. పట్టుబిగ్తున్న టీమిండియా టెస్టు మ్యాచ్‌పై ఇంగ్ల్లాండ్‌ పల్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌట్‌ కావడంతో ప్రత్యర్ధి ఇంగ్లాండ్‌కు 405 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది.రెండో ఇన్నింగ్‌లో 98/3తో నాల్గోవ రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తడబడింది. కెప్టెన్‌ కోహ్లీ (91) ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 26 పరుగుల జోడించి పెవిలి యన్‌కు చేరాడు.అనంతరం ఇంగ్లాండ బౌలర్లు చేలరేడంతో వరుసగా వికెట్లు కొల్పొయి 204 పరుగులకు ఆలౌటైంది. పిచ్‌ క్రమంగా బౌలింగ్‌కు అనుకూలంగా మారడంతో భారీ లక్ష్యాన్ని సాధించడం ఇంగ్లాండ్‌ ప్రయత్నాలు చేస్తోంది. బారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 544 పరుగులు చేయగా బదులుగా ఇంగ్లాండ్‌ 255 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్‌ కోహ్లీ సేన 204 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 405 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఒపెనర్లు అలిస్టర్‌కుక్‌ను ఔట్‌ చేసే క్రమంలో భారత రెండో డిఆర్‌ఎస్‌ అవకాశాలను కొల్పొయింది. అయితే ఇంగ్లాంగ్‌ 75 పరుగుల వద్ద హాసీబ్‌ హామీద్‌ (25,144 బంతుల్లో 3+4) వికెట్‌ కొల్పోయింది. అశ్విన్‌ వేసిన 51వ ఓవర్‌లో హామీద్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. 54 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 80/1 పరుగులతో ఉంది.
2sports
BSNL   భారత్‌ 71వ స్వాతంత్య్రాన్ని పురష్కరించుకోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు ఇండిపెండెన్స్‌ డే ఆఫర్లను అందిస్తోంది. నేషనల్‌ రోమింగ్‌ సేవల్లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి ప్రత్యేక రిచార్జీల ద్వారా లభించే రాయితీలో ఈ సేవలను అందించనుంది. కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను అందించేందుకు నిర్ణయించామని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 15,2017 నుండి జాతీయ రోమింగ్‌పై వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌ లేదా స్పెషల్‌ టారిఫ్‌ ఓచర్స్‌(ఎస్టీవి), కాంబో ఓచర్ల ద్వారా అదనపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించనున్నట్లు పేర్కొంది. ప్రధానంగా సాయుధదళ సిబ్బంది, నిపుణులు, వాపారస్తులు, విద్యార్థులు, ఈ పథకం ద్వారా అధిక ప్రయోజనం పొందుతారని బీఎస్‌ఎన్‌ఎల్‌ బోర్డు కన్స్యూమర్‌ మొబిలిటి డైరక్టర్‌ ఆర్‌.కె.మిట్టల్‌ చెప్పారు. ఇతర దేశాలు లేదా వేరొక టెలికాం సర్కిల్‌కు ప్రయాణీస్తున్నప్పుడు వినియోగదారుడు ఈ లాభాలను పొందలేరని బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పష్టం చేసింది.
1entertainment
ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ First Published 24, Oct 2017, 3:47 PM IST ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ ఆక్సిజ‌న్‌ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ Recent Stories
0business
ప్రగతి మైదాన్‌లో ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన PNR| Last Modified మంగళవారం, 5 ఫిబ్రవరి 2008 (18:06 IST) ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈనెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కాంపోనెక్స్ నెప్కాన్ పేరుతో ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన జరుగనుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 25 దేశాలకు చెందిన 50 మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. 25 వేల మంది వ్యాపారులు ఈ ప్రదర్శనను సందర్శించ వచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. దీనిపై రీడి ఎగ్జిబిషన్స్ ఇండియా ఎండీ మణ్‌దీప్ సింగ్ మాట్లాడుతూ వివిధ దేశాల్లో నిక్ఫాన్ పేరుతో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కోసం ప్రదర్శనలను కంపెనీ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. చెన్నై నగరంలో కూడా గత జూలైలో ఇదేతరహా ప్రదర్శనను నిర్వహించామని, అలాగే ఔషధ పరిశ్రమలకు కేంద్రమైన హైదరాబాదు నగరంలో కూడా వచ్చే ఆగస్టులో ఔషధ యంత్ర పరికరాలపై ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత వార్తలు
1entertainment
Aus ఆస్ట్రేలియా క్రికెటర్‌ సంచలన వ్యాఖ్య ముంబై: వందకుపైగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ వన్డేలు,టి20లు ఆడినా తనకు చిరకాలవాంఛ మాత్రం అలాగే ఉండి పోయిందని ఆస్ట్రేలియా టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఆరోస్‌ పించ్‌ ఆందోళన వ్య క్తం చేస్తున్నాడు.ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ హస్సీ గతే తనకు ఎదు రవుతుందోమోనని సంచనల వ్యాఖ్యలు చేశాడు.హస్సీ 108 మ్యాచ్‌లు వన్డేలు, టి20లు ఆడినా టెస్టుల్లో మాత్రం అరంగేట్రం చేయలేకపోయాడు.మరోవైపు ఫించ్‌ ఇప్పటి వరకు 79 వన్డేలు,28 టి20మ్యాచ్‌లలో ఆసీస్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.ఇప్పటికీ తనకు టెస్టుల్లో బ్యాగీ గ్రీన్‌ క్యాప్‌ ధరించే అవకా శం రాలేదని నిరాశ చెందుతున్నాడు.ఆటతీరు ఎంత మెరుగైనా,పరుగులతో సత్తా చాటుతున్నా అవకాశం దక్కడం లేదం టున్నాడు.కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే తన టాలెంట్‌ పరిమితం కావడంతో తాను ఏ మాత్రం హ్యాపీగా లేనిని స్పష్టం చేశాడు ఫించ్‌. బోర్డర్‌- గవా స్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌,ఆసీస్‌ జట్ల మధ్య జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఈనెల 23న పూణేలో ప్రారంభం కానుంది.ఇందులో అతడు ఎంపిక కాలేదు.ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో గత మూడు సంవత్సరాల ల్లో 54.53 సగటుతో దూసుకుపోతున్నాడు.అయితే ఓవరాల్‌గా చూస్తే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అతడి సగటు 27.47గా ఉంది. విక్టోరియా జట్టు తరుపున మూడవ స్థానంలో బ్యాటింగ్‌ చాన్స్‌ రావడంతో ఆట తీరు ఎంతో మెరుగైంది.ఆసీస్‌ జాతీయ జట్టులో అరంగేట్రం చేసి నాలుగు సంవత్సరాలు గడిచినా టెస్టుల్లో మాత్రం ఇంకా తనకు చాన్స్‌ రాలేదని దిగులు చెందుతున్నాడు.
2sports
kingfisherhouses కింగ్‌ఫిషర్‌ ఆస్తుల వేలానికి బిడ్డర్ల కరువు ముంబై: కింగఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ చైర్మన్‌ విజయమాల్యా కు గోవాలో ఉన్న విలాసవంతమైన భవనానికి బిడ్డర్లే కరువయ్యారు.బుధవారం నిర్వహించిన ఇ వేలంలో ఒక్కరు కూడ ముందుకురావకపోవటం ఆశ్చర్యం కల్గిస్తోంది. ఇప్పటికే పలు పర్యాయాలు ఈ భవనాన్ని వేలం వేసేందుకు ఎస్‌బిఐ కేపిటల్‌ ప్రయత్నాలు చేసి విపలం అయ్యింది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV వాఘా బోర్డర్‌లో పాక్ క్రికెటర్ ఓవరాక్షన్ మరో పాక్ క్రికెటర్ భారత్‌పై విషం కక్కాడు. ఏకంగా వాఘా బోర్డర్‌లో భారత సైన్యం ముందు హంగామా చేశాడు. రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తూ ఊగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. Samayam Telugu | Updated: Apr 22, 2018, 03:23PM IST వాఘా బోర్డర్‌లో పాక్ క్రికెటర్ ఓవరాక్షన్ మరో పాక్ క్రికెటర్ భారత్‌పై విషం కక్కాడు. ఏకంగా వాఘా బోర్డర్‌లో భారత సైన్యం ముందు హంగామా చేశాడు. రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తూ ఊగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ప్రతి రోజూ వాఘా బోర్డర్‌లో ఇరు దేశాల సైన్యం కవాతు చేస్తుంది. దీన్ని చూసేందుకు ఇరు దేశాల ప్రజలు వస్తుంటారు. అయితే పాక్ క్రికెటర్ హసన్ అలీ కూడా బోర్డర్‌కు వచ్చాడు. జనాలతో పాటూ గ్యాలరీలో కూర్చొన్నాడు. కొద్దిసేపటికి ఇరు దేశాల సైన్యాలు... అక్కడి గేట్లను తీసి కవాతు చేయడం ప్రారంభించాయి. కవాతు మధ్యలో హసన్ అలీ గేట్లవైపు పరుగు తీశాడు. అక్కడే నిలబడి సైన్యాన్ని, అక్కడే గ్యాలరీలో ఉన్న భారతీయుల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. తన చేష్టలతో పిచ్చి, పిచ్చి వేషాలు వేస్తూ రెచ్చిపోయాడు. ఇంత జరుగుతున్నా ఎవరూ కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ వ్యవహరాన్ని భారత సైన్యం సీరియస్‌గా తీసుకుంది. కవాతు జరిగే సమయంలో ఇలా ప్రవర్తించడ ఏంటంటూ మండిపింది. హసన్‌తో క్షమాపణలు చెప్పించి... ఘటనపై విచారణ జరిపించి, వివరణ ఇవ్వాలని పాక్ సైన్యానికి లేఖ రాయాలని కూడా సైన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినా పాక్ ఆర్మీ మాత్రం స్పందించలేదు. అంతేకాక హసన్ ఏదో గొప్ప పని చేసినట్లు... ఓ పత్రిక అతడ్ని పొగడ్తలతో ముంచెత్తుతూ కథనాన్ని రాసింది. Hasan Ali being Hasan Ali during the flag-lowering ceremony at the Wagah border https://t.co/sQuiwthVLb — ESPNcricinfo (@ESPNcricinfo) 1524321306000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
AUROBINDO Company పోర్చుగల్‌ కంపెనీని కొనుగోలుచేసిన అరబిందో న్యూఢిల్లీ, జనవరి 8: అరబిందోఫార్మా పోర్చుగల్‌కు చెందిన జెనరిస్‌ ఫార్మాక్యూటికా కంపెనీని మ్యాగ్న మ్‌ కేపిటల్‌ పార్టనర్స్‌నుంచి కొనుగోలుచేస్తోంది. సుమారు 969కోట్లుగా ఈ కొనుగోలు విలువ ఉం టుందని అంచనా. నెదర్లాండ్స్‌లోని ఏగైల్‌ఫార్మాబి వి అరబిందోకు పూర్తి అనుబంధంగా పనిచేస్తోంది కంపెనీ ఈ అనుబంధ సంస్థద్వారా కొనుగోలు ఒప్పందం చేసుకుంది. జెనరిస్‌ మందుల ఉత్పత్తి, మార్కెటింగ్‌ను పోర్చుగల్‌దేశంలో నిర్వహిస్తోంది. జెనరిస్‌ కొనుగోలుతో అరబిందో మార్కెట్‌, ఉత్ప త్తిని మరింత విస్తరించినట్లవుతుందని అంచనా. పోర్చుగీస్‌ మార్కెట్‌లో అరవిందదో జనరిస్‌ద్వారా మరింత పటిష్టం అవుతుందని సీనియర్‌ వైస్‌ప్రెసి డెంట్‌ వి.మురళీధరన్‌ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో అన్ని మేజర్‌ సూక్ష్మ వనరులపైనా పనిచేస్తుంది. యూరోపియన్‌ మార్కెట్లలో తమ కంపెనీ వృద్ధికి ఈ కొనుగోళ్లు ఉపకరిస్తాయని మురళీధరన్‌ వెల్లడిం చారు. జనరిస్‌ప్రస్తుతం పోర్చుగల్‌లోని అమాడోరా లో ఉత్పత్తికేంద్రం కలిగిఉంది.సాలీనా 1.2 బిలి యన్‌ మాత్రలు, గుళికలు, సాచెట్లను ఉత్పత్తిచేసే సామర్ధ్యం ఉంది. జనరిస్‌ సిఇఒ పాలో లిలేయా మాట్లాడుతూ కంపెనీ అరబిందోతో ఒప్పందంచేసు కోవడం వల్ల పటిష్టమైన ఉత్పత్తులను రూపొందించే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా అర బిందోకు పోర్చుగల్‌లోని మార్కెట్‌ పునరేకీకరణకు దోహదంచేస్తుందని అంచనావేసారు. తాజా కొను గోలుతో మొత్తం యూరోపియన్‌ దేశంలో271 ఉత్ప త్తులను అరబిందో కొనసాగిస్తోంది. 2006నుంచే యూరోపియన్‌ దేశాల్లో అరబిందో ఉనికిని చాటు కున్నది. పశ్చిమ యూరోపియన్‌ దేశాల్లో ఆక్టావిస్‌ వాణిజ్యకార్యకలాపాలను కూడా కొనుగోలు చేసింది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ప్రకాష్ రాజ్ మళ్లీ తండ్రయ్యాడు సినిమాల్లో హీరోయిన్లకు, హీరోలకు తండ్రి పాత్రలు వేసే ప్రకాష్ రాజ్ తన నిజజీవితంలో మళ్లీ తండ్రయ్యాడు. TNN | Updated: Feb 3, 2016, 03:00PM IST ప్రకాష్ రాజ్ మళ్లీ తండ్రయ్యాడు సినిమాల్లో హీరోయిన్లకు, హీరోలకు తండ్రి పాత్రలు వేసే ప్రకాష్ రాజ్ తన నిజజీవితంలో మళ్లీ తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య పోనీ వర్మ బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపారు. ఇప్పుడు ఆయన వయసు 50ఏళ్లు. పోనీ వర్మ వయసు 30 ఏళ్లు. ప్రకాష్ రాజ్ 1994లో మొదటిభార్య లలిత కుమారిని పెళ్లాడారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు పుట్టారు. అయితే కొడుకు సిద్ధూ 2004లో అయిదేళ్ల వయసులో గాలిపటం ఎగరేస్తూ ఎత్తు నుంచి కింద పడి చనిపోయాడు. అనంతరం భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి 2009లో విడిపోయారు. ఆ తరువాత కొరియోగ్రాఫర్ పోనివర్మతో కొన్ని నెలలు డేటింగ్ చేశాక 2010 ఆగస్టులో పెళ్లిచేసుకున్నాడు ప్రకాష్ రాజ్.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 21, Apr 2019, 5:03 PM IST Highlights 2013 లో వచ్చిన 'కామసూత్ర 3డి' చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన నటి సైరా ఖాన్ గుండెపోటుతో మృతి చెందారు.  2013 లో వచ్చిన 'కామసూత్ర 3డి' చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన నటి సైరా ఖాన్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయంపై కామసూత్ర దర్శకుడు రూపేష్ పాల్ విచారం వ్యక్తం చేశారు. సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం వల్ల సైరా ఖాన్ కి 'కామసూత్ర 3డి' చిత్రం సైన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు.  అలాంటి బోల్డ్ ఫిలిం తో బాలీవుడ్ లో అడుగుపెట్టడం ఆమెకి సవాల్ గా మారిందని, కొన్ని నెలల తరువాత ఆమె ప్రయత్నం ఫలించిందని అన్నారు. ఆమెలా ఎవరూ నటించి ఉండేవారు కాదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆమె మరణ వార్త గురించి మీడియాలో ఎలాంటి వార్తలు రాకపోవడంపై రూపేష్ పాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధ్బుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆమెని ఎవరూ గుర్తించకపోవడం బాధాకరమని ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు.   Last Updated 21, Apr 2019, 5:03 PM IST
0business
Hyderabad, First Published 14, Mar 2019, 10:45 AM IST Highlights టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత సినిమాలతో పాటు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటుంది.  తాజాగా ఆమె కుర్ కురే స్నాక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.  టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత సినిమాలతో పాటు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటుంది.  తాజాగా ఆమె కుర్ కురే స్నాక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ క్రమంలో కుర్ కురే ప్యాకెట్ పట్టుకొని ఫోటోకి ఫోజిచ్చి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. డబ్బు కోసం ఇలాంటి అనారోగ్యమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తావా..? అంటూ ఆమెపై మండిపడ్డారు. ఓ నెటిజన్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే నువ్వు ఇలా హాని కలిగించే ఫుడ్ తినమని ప్రచారం చేయడం ఏం బాగాలేదు అంటూ ట్వీట్ చేసింది. అది చూసిన సమంత.. ''నా సండే మీల్స్ ఫోటోని మీకు పంపిస్తా.. అవును.. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాను. అలాగే చీట్ డేస్ లో ఓ సామాన్యురాలిగా ఇలాంటి స్నాక్స్ తీసుకోవడం ఇష్టం. ఈ బ్రాండ్ స్నాక్స్ తో పాటు మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతుంది'' అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం సమంత నటించిన 'మజిలీ' సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అలానే నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ.. ఎంత సక్కగున్నావే' అనే సినిమాలో నటిస్తోంది.     Yes I did.I’ll make sure to send you a pic of my Sunday meals . Yes I eat healthy but look forward to my cheat days and love snacks like Kurkure just as much as any other normal person does . And @KurkureSnacks has answered every query that has been put to them (including mine ) https://t.co/e5EIsXYspy — Samantha Akkineni (@Samanthaprabhu2) March 13, 2019 Last Updated 14, Mar 2019, 10:45 AM IST
0business
- ప్రభుత్వరంగ సంస్థల అమ్మకానికి కేంద్రం ప్రణాళిక - క్యాబినెట్‌ ముందుకు 'దీపం' నివేదిక - 2019-20లో రూ.90 వేలకోట్ల ఉపసంహరణ లక్ష్యం న్యూఢిల్లీ:పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా 35 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను(సీపీఎస్‌ఈ) అమ్మడానికి ఆర్థికశాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నిటి ఆయోగ్‌ ఇటీవలే సీపీఎస్‌ఈల్లోని లాభాలతో ఉన్న, నష్టాలతో ఉన్న సంస్థల ఐదో జాబితాను పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగానికి(దీపంకు) సమర్పించింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను దృష్టిలో ఉంచుకొని అమ్మకాల ప్రక్రియను సులభతరం చేయడం కూడా ఎంతో ముఖ్యమని తాము భావిస్తున్నట్టు దీపం కార్యదర్శి అతాన్‌ చక్రవర్తి తెలిపారు. 35 కంపెనీల అమ్మకాల విషయంలో క్యాబినెట్‌ ఆమోదం పొందాల్సి ఉన్నదని ఆయన తెలిపారు. ప్రస్తుతం 57 సీపీఎస్‌ఈలు స్టాక్‌ మార్కెట్‌లో నమోదై ఉన్నాయి. వీటి మొత్తం మార్కెట్‌ విలువ రూ.13 లక్షల కోట్లు.         వ్యూహాత్మక అమ్మకానికి తయారైన వడబోత జాబితాలో ఎయిర్‌ ఇండియా, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, బీఈఎంఎల్‌, స్కూటర్స్‌ ఇండియా, భారత్‌ పంప్స్‌ కాంప్రెసర్స్‌, సెయిల్‌కు చెందిన సాలెం, దుర్గాపూర్‌ యూనిట్లు, హిందుస్తాన్‌ ఫ్లోరోకార్బన్‌, హిందుస్తాన్‌ న్యూస్‌ప్రింట్‌, సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌, సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఐటీడీసీ ఉన్నాయి. పవన్‌హాన్స్‌ అమ్మకం విషయం పురోగతిలో ఉన్నట్టు అతాన్‌ చక్రవర్తి తెలిపారు. పవన్‌హాన్స్‌లో ప్రస్తుతం కేంద్రంతోపాటు ఓఎన్‌జీసీకి 51 శాతం, 49 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ సంస్థ కింద 46 చాపర్లు(హెలికాప్టర్లు)న్నాయి.         తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల లోక్‌సభకు సమర్పించిన బడ్జెట్‌లో ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణపై వివరాలు వెల్లడించారు. 2019-20లో రూ.90,000 కోట్ల విలువైన సీపీఎస్‌ఈల వాటాలు విక్రయించాలనేది లక్ష్యంగా తెలిపారు. 2018-19లో రూ.80,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, రూ.35,100 కోట్లు ఇప్పటికే సమీకరించినట్టు తెలిపారు. మిగతా రూ.44,000 కోట్లను కూడా వచ్చే రెండు నెలల్లో సమీకరించనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. 2017-18లో సీపీఎస్‌ఈల్లోని వాటాలు విక్రయిండం ద్వారా కేంద్రం రూ.లక్ష కోట్లు సమీకరించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
1% దిగజారిన మార్కెట్లు అంతర్జాతీయ ధోరణులే కీలకం ముంబై : బెంచ్‌ మార్క్‌ స్టాక్‌మార్కెట్‌ సూచీలు ఒకటిశాతం దిగువన ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులు కీలకంగా పనిచేసాయి. ఆర్థికరంగ కంపెనీలు ఎక్కువ క్షీణించాయి. ఇన్వెస్టర్ల ఫోకస్‌ మొత్తం అమెరికా అధ్యక్ష ఎన్నికల రాజకీయాలపైనే ఎక్కువ ఉంది. అమెరికా అధ్యక్ష పదపై జరుగుతున్నచర్చలతో ఇన్వెస్టర్లదృష్టి మొత్తం అటు మళ్లింది. దేశీయ మార్కెట్లు ఈవారం మొత్తం అనిశ్చితంగానే నడిచాయి. ఫ్యూచర్స్‌ ఆప్షన్స్‌ కాం ట్రాక్టుల పరిధి అక్టోబరు సిరీస్‌కు మారుతున్నది. గురువారం ఈ సిరీస్‌ గడువు ముగుస్తుండటంతో మార్కెట్లు ఆసాంతం అనిశ్చితంగా ముగిసాయి. ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 374 పాయింట్లు దిగ జారి 28,294 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50సూచి కూడా 109 పాయింట్లు క్షీణించి 8723 పాయింట్లవద్ద నిలిచింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ స్మాల్‌ క్యాప్‌సూచీలు 0.5శాతం చొప్పున క్షిణించాయి. ఆసియా మార్కెట్లు ప్రారంభంనుంచే మందగమనం తో ఉన్నాయి. వాల్‌స్ట్రీట్‌ మార్కెట్ల నష్టాల ఆధా రంగా నడిచాయి. ఇన్వెస్టర్ల మొత్తం ఆసక్తి అంతా సెంట్రల్‌ బ్యాంకులు, అమెరికా రాజకీయాలపై ఎక్కువ దృష్టిపడింది. అమెరికాలో సగం మంది ఓటర్లు అధ్యక్ష ఎన్నికలపరంగా రిపబ్లికన్‌ అభ్యర్ధి డొనాల్డ్‌ట్రంప్‌, డొమక్రాట్‌ హిల్లరీ క్లింటన్‌ల నవం బరు 8వ తేదీ ఎన్నికలపైనే ఎక్కువ చర్చనడుస్తోం ది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని జపాన్‌ బయటి మార్కెట్లషేర్లు నష్టాల్లో ముగిసాయి. ఇక యూరోపి యన్‌ మార్కెట్లు ఒత్తిడితో ముగిసాయి. ఫ్రాన్స్‌ సిఎసి, జర్మనీ డాక్స్‌, లండన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ వంటివి 1-2శాతం ముగిసాయి. ఇక దేశీయ మార్కెట్ల పరంగాచూస్తే ఆర్థికరంగ షేర్లు ఆటోరంగ షేర్లు ఎక్కువ వెనుకంజలో ఉన్నాయి. వడ్డీరేట్ల ఆధారిత రంగాలు ఎక్కువ ఆర్‌బిఐ సమీక్షపైనే గురిపెట్టాయి. మార్చితో ముగిసే ఆర్థికసంవత్సరంలో నాలుగో ద్వైమాసిక ఆర్థికనివేదికను వచ్చేనెల నాల్గవ తేదీ విడుదల చేయనున్నది. సెన్సెక్స్‌పరంగా ఒఎన్‌జిసి, ఎన్‌టిపిసి, టాటామోటార్స్‌, ఐసిఐసిఐ బ్యాంకు, గెయిల్‌ వంటివి 3-4శాతం దిగజారాయి. ఎన్‌టిపిసివిదేశీ మార్కెట్ల నుంచి 700మిలియన్‌ డాలర్ల రూపాయి బాండ్లను జారీచేస్తామని ప్రక టించింది. స్వరగుర్తింపు వ్యవస్థపరిధిలోనికి 32 లక్షల కస్టమర్లను తెచ్చామని ఐసిఐసిఐబ్యాంకు ప్రక టించింది. 50 లక్షల లావాదేవీలను ఈ వ్యవస్థలో నిర్వహి స్తామని వెల్లడించింది. జిఎన్‌ఎ యాక్సిల్స్‌ 252ధర వద్ద జాబితాఅయింది. మార్కెట్‌ధర 207 కంటే ప్రీమియం ధరకు రిజిష్టరుఏసింది. జాబి తా తర్వాత రూ.262గా షేర్‌ధరలు నడిచాయి. యాడ్‌ లాబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 12శాతం పెరిగింది. మార్క్‌ సన్స్‌ఫార్మా 11శాతం పెరిగింది. కంపెనీ అమెరికా ఎఫ్‌డిఎ అనుమతులు సాధించినట్లు ప్రక టించింది. లోరాటడైన్‌ లిక్విడ్‌గుళికలకు ఎఫ్‌డిఎ అనుమతించిం ది. కాప్రిగ్లోబల్‌ కేపిటల్‌ 16శాతం పెరిగింది. 25 శాతం రెండురోజుల ర్యాలీని కొనసాగించింది. నిధుల సమీకరణ కోసం కంపెనీ షేర్లను విభజించాలని నిర్ణ యించింది. బిపిఎల్‌ 20శాతం ఎగువన ముగి సింది. బిఎస్‌ఇలో 91.30 రూపాయలవద్ద స్థిర పడింది. మిండా కార్పొరేషన్‌ ఐదుశాతం ముగిసిం ది. మొత్తం ఈక్విటీపరంగా చూస్తే కంపెనీ విభిన్న సంఖ్యలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపినట్లు తేలింది.
1entertainment
6వ వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌   విశాఖ: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 6వ వికెట్‌ కోల్పోయింది.. బెయిర్‌స్టో 55 పరుగులు చేసిన అనంతరం ఉమేష్‌యచాదవ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ దారిపట్టారు.. 103 పరుగులకు 5 వికెట్లు కోల్పయి ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఈ రోజు ఉదయం బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ మెన్‌స్టోక్స్‌ బెయిర్‌ స్టోలునిలకడగా ఆడారు. లంచ్‌ విరామసమయానికి ఇంగ్లాలండ్‌ 6 వికెట్ల నష్టానికి 191 పరుగులుచేసింది.
2sports
Suresh 120 Views Manoj Tiwari Manoj Tiwari న్యూఢిల్లీ: డోపింగ్‌ పరీక్షలో విఫలమై నిషేధానికి గురైన టీమిండియా యువ ఆటగాడు పృథ్వీషాకి సీనియర్‌ ఆటగాడు మనోజ్‌ తివారీ మద్ధతిచ్చాడు. తన విషయంలో జరిగిన ఈఘటన నుంచి షా మరిన్ని పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఈ మేరకు దీనిపై ట్వీట్‌ చేశాడు. షా రాసిన లేఖను పోస్టు చేశాడు. ఈవిధంగా నీ పొరపాటును నువ్వు గుర్తించడం మంచిదే. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా క్రీడా రంగంలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరింత ఏకాగ్రతతో, ధృడంగా నువ్వు మళ్లీ తిరిగి వస్తావని అనుకుంటున్నాను. నీకు నా అభినందనలు ఎప్పుడూ ఉంటాయని షాను ఉద్ధేశించి ట్వీట్‌ చేశాడు. సయ్యద్‌ ముస్తాఖ్‌ అలీ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో మ్యాచ్‌ ఆడుతుండగా అతడికి డోపింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ముంబయి క్రికెట్‌ సంఘం అనుబంధ ఆటగాడైన షా నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలింది. షా మాత్రం నమూనాల్లో ‘టర్బుటలైన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ​నయనతార ప్రేమకథ.. ఆమె నో కామెంట్! నయనతార ప్రేమ కథపై కామెంట్ చేయడానికి నో.. అనేసింది TNN | Updated: Aug 16, 2017, 11:21AM IST నయనతార ప్రేమ కథపై కామెంట్ చేయడానికి నో.. అనేసింది కీర్తీ సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో యమ బిజీగా ఉన్న తారల్లో కీర్తీ సురేష్ ఒకరు. ఎంతలా బిజీ అంటే.. ఉన్న ఫలంగా రెండు కోట్ల రూపాయల పై స్థాయి పారితోషకాన్ని అడిగేస్తోందట కీర్తి. అయినప్పటికీ ఈమెను అవకాశాలు వరించి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సూర్య సరసన ఒక సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఈమె వద్ద నయనతార ప్రేమ ప్రస్తావన తెచ్చింది మీడియా. మరి ఆ ప్రస్తావన కీర్తి వద్ద ఎందుకు? అంటే.. సూర్య హీరోగా, కీర్తి హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు దర్శకుడు విఘ్నేష్ శివన్. ఈ డైరెక్టర్ మరెవరో కాదు.. నయనతార బాయ్ ఫ్రెండే. ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ లు ప్రేమలో ఉన్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. వీరిద్దరూ కలిసి ఫొటోలు దిగుతూ, వాటిని సోషల్ మీడియాలో పెడుతూ ప్రేమను ధ్రువీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విఘ్నేష్ పై కీర్తి అభిప్రాయాన్ని అడిగింది మీడియా. అతడు చాలా టాలెంటెడ్ అని, చక్కగా డైలాగులు రాస్తాడని, అవి కూడా సహజంగా ఉండేలా చూసుకుంటాడు.. అని కీర్తి చెప్పుకొచ్చింది. మరి ఇదే సందర్భంలో నయనతార ప్రస్తావన వచ్చింది. నయనతార- విఘ్నేష్ ల బంధం గురించి కీర్తి వద్ద ప్రస్తావించగా, ఆమె హడలిపోయినట్టుగా రియాక్ట్ అయ్యింది. దానిపై కామెంట్ చేయడానికి నిరాకరించింది. ‘నాకూ ఆ వ్యవహరంతో సంబంధం లేదు. నాకు దాని గురించి ఏం తెలీదు..’ అని తేల్చి చెప్పింది. ఈ మాటలతో కీర్తీ సురేష్ భయం స్పష్టం అయిపోయింది. నయనతార, విఘ్నేష్ ల బంధం గురించి ఏం కామెంట్ చేస్తే, ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. అని నో కామెంట్ అంటూ తప్పించేసుకుంది. తెలివైన పిల్లే!
0business
డబుల్స్‌లో అగ్రస్థానంలో సానియా ద్వితీయ స్థానంలో హింగీస్‌ న్యూఢిల్లీ : భారత స్టార్‌ క్రీడాకారిణి సానియా మీర్జా డబుల్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుంది.కాగా డబ్ల్యూటిఎ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 9730 పాయింట్లతో సానియా ప్రథమ స్థానంలో నిలిచింది.స్విట్లర్లాండ్‌కు చెందిన మార్టినా హింగీస్‌ రెండవ స్థానంలో నిలిచింది. వీరిద్దరి మధ్య కేవలం 5 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.ఇటీవల చెక్‌ భామ స్ట్రికావోతో జోడీ కట్టిన సానియా తాజాగా టోరో పాన్‌ పసిపిక్‌ ఓపెన్‌ను గెలుచుకుంది.కాగా ఈ జోడీకి ఇది రెండవ టైటిల్‌. భారత ఆటగాడు సాకేత్‌ మైనేని తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు చేరుకోగలిగాడు. సింగిల్స్‌ విభాగంలో యుఎస్‌ ఓపెన్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించిన మైనేని 138వ స్థానంలో నిలిచాడు.మరో ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ 229,యుకి బాంబ్రీ 282వ స్థానంలో నిలిచారు.పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న 18వ స్థానంలో లియాండర్‌ పేస్‌ 60వ స్థానంలో కొనసాగుతున్నాడు.
2sports
sandhya 404 Views jason holder , West Indies Team , WI vs IND , World Cup 2019 West Indies team మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో టీమిండియాకు గట్టిపోటీ ఇవ్వాలని వెస్టిండీస్‌ సారథి జేసన్‌ హోల్డర్‌ ఆ జట్టు ఆటగాళ్లను కోరాడు. తమ సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చాడు. మాంచెస్టర్‌ వేదికగా గురువారం వెస్టిండీస్‌, భారత్‌ల మధ్య పోరు జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్‌పై గెలిచి సెమీస్‌ ఆశలు నిలుపుకోవాలని విండీస్‌ పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌ గెలిచి సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవాలని కోహ్లిసేన ఆశిస్తుంది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV హనుమ విహారి ఓపెనర్‌గా ఫెయిలైతే..? ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టుల్లోనూ అతను ఓపెనర్‌గా విఫలమైనా.. తర్వాత సిరీస్‌లో మిడిలార్డర్‌లో అవకాశాలిస్తాం’ - ఎమ్మెస్కే ప్రసాద్ Samayam Telugu | Updated: Dec 25, 2018, 03:42PM IST హనుమ విహారి ఓపెనర్‌గా ఫెయిలైతే..? ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా బుధవారం నుంచి జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌‌లో హనుమ విహారి ఓపెనర్‌గా ఫెయిలైనా.. అతనికి మిడిలార్డర్‌లో అవకాశాలిస్తామని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. మెల్‌బోర్న్ టెస్టు కోసం 11 మందితో కూడిన భారత్ జట్టుని ఈరోజు బీసీసీఐ ప్రకటించగా.. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌పై వేటు పడిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో జట్టులోకి ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్ , రవీంద్ర జడేజారాగా.. రెండో ఓపెనర్‌గా హనుమ విహారిని ఆడించాలని టీమిండియా మేనేజ్‌‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టెస్టు మ్యాచ్‌తో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన హనుమ విహారి.. కెరీర్‌లో ఇప్పటి వరకు రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. అది కూడా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. కానీ.. మెల్‌బోర్న్ టెస్టులో అతడ్ని ఓపెనర్‌గా పంపితే రాణిస్తాడా..? అనే అనుమానాలు ఇప్పుడు నెలకొన్నాయి. ఒకవేళ అతను ఫెయిలైతే.. మళ్లీ మిడిలార్డర్‌లోకి మారుస్తారా..? అని ఎమ్మెస్కే ప్రసాద్‌ని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చారు. ‘ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టుల్లోనూ అతను ఓపెనర్‌గా విఫలమైనా.. తర్వాత సిరీస్‌లో మిడిలార్డర్‌లో అవకాశాలిస్తాం’ అని ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో టీమ్‌లో ప్రత్యామ్నాయ ఓపెనర్‌కి అవకాశం లేకపోయింది. దీంతో.. రహానె, రోహిత్ శర్మ పేర్లు ఓపెనింగ్ స్థానం కోసం చర్చకి వచ్చినా.. ఆఖరికి తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి‌కి ఆ అవకాశం దక్కింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఒకప్పుడు శ్రీదేవి నాన్నకు భార్య మాత్రమే.. కానీ నేడు? శ్రీదేవితో మీ అనుబంధం ఏంటని మూడేళ్ల క్రితం మీడియా ప్రశ్నించగా.. ఆమె మా నాన్నకు భార్య మాత్రమే అని బదులిచ్చిన అర్జున్ కపూర్ ఇప్పుడు ఏమని స్పందించాడు? TNN | Updated: Feb 27, 2018, 01:49PM IST శ్రీదేవికి బోనీ కపూర్‌తో పెళ్లి కాకముందు మోనా శౌరేతో పెళ్లయిన సంగతి తెలిసిందే. వారి కుమారుడు అర్జున్ కపూర్‌కు శ్రీదేవితో అంతగా సంబంధాలు లేవు. తను హీరోగా ఎదిగినప్పటికీ.. ఎప్పుడూ తన సవతి తల్లితో ఎదురుగా కూర్చోని మాట్లాడలేదని మూడేళ్ల క్రితం అర్జున్ చెప్పాడు. శ్రీదేవితో సహృద్భావ సంబంధాలు ఉన్నాయని చెప్పినప్పటికీ.. ఆమెతో ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదని చెప్పాడు. శ్రీదేవిని తన తండ్రి భార్యగా మాత్రమే చెప్పిన ఆయన.. తండ్రి జీవిత భాగస్వామిగా తనను గౌరవిస్తానని చెప్పాడు. కానీ శ్రీదేవి మరణం వార్త తెలుసుకున్న అర్జున్ కపూర్ తన చిత్రం ‘నమస్తే ఇంగ్లాండ్’ షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకుని వెంటనే ముంబై చేరుకున్నాడు. శుక్రవారం అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం పంజాబ్‌లో అర్జున్ కపూర్ షూటింగ్ ప్రారంభించాడు. శ్రీదేవి మరణం వార్త తెలియగానే విషణ్ణ వదనంతో ముంబైలోని అనిల్ కపూర్ నివాసానికి చేరుకున్నాడు. కానీ శ్రీదేవి మరణించారు కదా.. మీ రియాక్షన్ ఏంటని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. స్పందించడానికి ఆయన నిరాకరించాడు.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV భారత్‌పై షోయబ్ మాలిక్ హాఫ్ సెంచరీ..! ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాహల్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదినా.. ఆ తర్వాత మళ్లీ ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమవుతూ కెరీర్‌లో 43వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. Samayam Telugu | Updated: Sep 23, 2018, 07:28PM IST ఆసియా కప్‌లో భారత్ , పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆరంభంలోనే ఆ జట్టుని 58/3తో భారత్‌ ఒత్తిడిలోకి నెట్టింది. కానీ.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ (52 నాటౌట్: 67 బంతుల్లో 3x4,1x6) పట్టుదలతో అర్ధశతకం బాది పాక్‌‌ని మళ్లీ మ్యాచ్‌లోకి తెచ్చాడు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (38 నాటౌట్: 60 బంతుల్లో 2x4)తో కలిసి మాలిక్ నాలుగో వికెట్‌కి అభేద్యంగా 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 36 ఓవర్లు ముగిసే సమయానికి పాక్ 146/3తో నిలిచింది. అంతకముందు పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (10), బాబర్ అజామ్ (9) నిరాశపరిచినా.. ఫకార్ జమాన్ (31: 44 బంతుల్లో 1x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. జమాన్ ఔటవడంతో జట్టు స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకున్న మాలిక్.. సహనంతో భారత బౌలర్లని ఎదుర్కొన్నాడు. మధ్యలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాహల్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదినా.. ఆ తర్వాత మళ్లీ ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమవుతూ కెరీర్‌లో 43వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి కూడా అఫ్గానిస్థాన్‌పై అజేయ అర్ధశతకంతో పాక్ జట్టుని చివరి ఓవర్‌లో షోయబ్ మాలిక్‌ గెలిపించిన విషయం తెలిసిందే.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ అరుదైన రికార్డ్..! ఇంగ్లాండ్‌ జట్టు ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో టెస్టులో Samayam Telugu | Updated: Apr 3, 2018, 01:29PM IST ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ అరుదైన రికార్డ్..! ఇంగ్లాండ్‌ జట్టు ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో టెస్టులో మొత్తం 5 వికెట్లు పడగొట్టిన అండర్సన్ జట్టుకి మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. కివీస్ బ్యాట్స్‌మెన్ ఇస్ సోధి (56 నాటౌట్: 168 బంతుల్లో 9x4), వాగ్నర్ (7: 103 బంతుల్లో 1x4) చివరి రోజు ఆఖర్లో అసాధారణంగా పోరాడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. Visit Site Recommended byColombia సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో 136 మ్యాచ్‌లాడిన అండర్సన్ మొత్తం 30,074 బంతులు విసిరి.. టెస్టు ఫార్మాట్‌లో ఎక్కువ బంతులు విసిరిన ‘ఫాస్ట్‌ బౌలర్‌’గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు వెస్టిండీస్ పేసర్ వాల్ష్ 132 మ్యాచ్‌ల్లో 30,019 బంతులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా అండర్సన్‌ ఆ రికార్డుని కనుమరుగు చేశాడు. వాల్ష్‌ కెరీర్‌లో మొత్తం 519 వికెట్ల తీయగా.. అండర్సన్ ఇప్పటికే 531 వికెట్లతో కొనసాగుతుండటం విశేషం. మొత్తంగా టెస్టుల్లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్నర్ మురళీ ధరన్ 133 మ్యాచ్‌ల్లో 44,039 బంతులతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 132 మ్యాచ్‌ల్లో 40,850, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్‌వార్న్ 145 మ్యాచ్‌ల్లో 40,705 ఉన్నారు. మొత్తంగా ఈ జాబితాలో అండర్సన్‌ది నాలుగో స్థానం కాగా.. పేసర్ల జాబితాలో మాత్రం అగ్రస్థానం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
RS 50 ఫ్లోరోసెంట్‌ బ్లూ బ్లూకలర్‌ రూ.50నోట్లు ముంబయి,ఆగస్టు 20: చిల్లర కష్టాలనుంచి ప్రజ లను గట్టెక్కించేందుకురిజర్వుబ్యాంకుకొత్త రూ.50 నోటును తెస్తోంది. నోట్లరద్దు తర్వాత వచ్చిన రెండువేల రూపాయలు, 500రూపాయల నోట్లతో జనం చిల్లర లభించక ఇబ్బందులు చవిచూస్తు న్నారు. వీటినికట్టడిచేసేందుకు ఆర్‌బిఐ త్వరలోనే కొత్తరూ50 నోటుతో ముందుకు వస్తోంది. ఫ్లోరో సెంట్‌ బ్లూకలర్‌లో మహాత్మాగాంధీ సిరీస్‌తో వస్తు న్న రూ.50నోటు ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లకంటే కొంతచిన్నవిగా ఉంటాయి. వీటిపై ఒక వైపు హంపీ రథం, స్వఛ్‌ భారత్‌లోగో, మరోవైపు మహాత్మాగాంధీ ఫోటో, అశోకస్తంభం చిహ్నం ఉం టాయి.కొత్తనోట్లుమార్కెట్‌కు వచ్చినాపాత రూ.50 నోట్లు చెల్లుతాయని ఆర్‌బిఐ వివరించింది. గడచిన కొన్ని రోజులుగా ఆర్‌బిఐ కొత్తగా రూ.200 నోటు ను మార్కెట్‌కు తెస్తుందన్న ప్రచారం ఊపందు కుంటున్నననేపథ్యంలోఆర్‌బిఐ ఇంకాఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే బ్యాంకుల్లోనే అందుబాటులో ఉండేఈ రూ.50నోట్లు ఎటిఎంలనుంచి పొందేం తుకు మరికొంతవ్యవధి పడుతుందని చెపుతున్నారు. కాస్పెరస్కీ నుంచి టోటల్‌ సెక్యూరిటీ ముంబయి,ఆగస్టు 19: ప్రపంచంలో అగ్రగామి సైబర్‌ సెక్యూరిటీబ్రాండ్‌ అయిన కాస్పర్‌స్కైలాబ్‌ తన తాజా శ్రేణి ఉత్పత్తులను ప్రకటించింది. వాటి కొనుగోలుదారులు వివిధరకాల ఉపకరణా లకు అత్యుత్తమభద్రతను అందిస్తుందని చెపుతు న్నారు. ఇటలీలోని మరాన్లెలోని ఫెర్రా§్‌ు ఫ్యాక్టరీని సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు కాస్పరెస్కీ వివరించింది. సాఫ్ట్‌వేర్‌ వైరస్‌ కట్టడి సంస్థ కాస్పరెస్కీ యాంటివైరస్‌, ఇంటర్నెట్‌ సెక్యూ రిటీ, టోటల్‌ సెక్యూరిటీ వంటి ఉత్పత్తులు ఈ ఆఫర్‌లో ఉంటాయి. మొత్తం ఆసియా పసిఫిక్‌ప్రాం తం నుంచి ఆరుగురు విజేతలను ఎంపికచేసి వారు గెలుచుకునేందుకు వీలుగా మినియేచర్‌కార్‌, కీచెయి న్‌, క్యాప్‌ ఫ్యాషనబుల్‌ బ్యాగ్‌ వంటి ఫెర్రా§్‌ు యాక్సెసరీస్‌ అందిస్తుంది. సంస్థ దక్షిణాసియా ఎండి అల్తాఫ్‌ హాల్దీ మాట్లాడుతూ కస్టమర్లను మరింత సురక్షితంగా కొనసాగించలాన్న లక్ష్యంతో ఈ ఉత్పత్తులు ప్రవేశపెట్టామన్నారు. టోటల్‌ సెక్యూరిటీ ఫీచర్‌ అత్యాధునిక నియంత్రణ ఫీచర్లు అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV సచిన్‌ సూచన.. తుది జట్టులో 14 మంది భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ క్రికెట్‌కి సంబంధించి ఇచ్చే సూచనలకి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఎందుకంటే.. TNN | Updated: Oct 26, 2017, 07:20PM IST భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ క్రికెట్‌కి సంబంధించి ఇచ్చే సూచనలకి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఎందుకంటే.. అతను ఏం చెప్పినా.. అది ఆటకి ఉపయోగపడే విధంగా ఉంటుందని అందరి విశ్వాసం. దీనికి నిదర్శనమే పాఠశాల స్థాయి క్రికెట్‌ తుది జట్టులో 14 మంది ఆటగాళ్లకి చోటు కల్పించాలనే సూచన. గత ఏడాది సచిన్ సూచించిన ఈ వినూత్న పద్ధతిని ముంబయి క్రికెట్ అసోసియేషన్ తాజాగా తమ పరిధిలో జరిగే టోర్నీల్లో అమలు చేసేందుకు రెడీ అయ్యింది. సాధారణంగా తుది జట్టులో 11 మంది ఆటగాళ్లకి మాత్రమే చోటు దక్కుతుంది. అలా కాకుండా.. జట్టులోకి 14 మందిని ఎంపిక చేసుకుంటే.. అదనంగా ముగ్గురు క్రికెటర్లకి ఛాన్స్ దొరుకుతుందని సచిన్ ఆలోచన. జట్టు బ్యాటింగ్ బలహీనంగా ఉంటే.. అదనంగా ముగ్గరిని టాప్ ఆర్డర్‌లోకి చేర్చుకోవచ్చు. వారు బ్యాటింగ్ మాత్రమే చేసి.. కూర్చుంటారు. ఫీల్డింగ్‌కి రారు. ఒకవేళ బౌలింగ్ బలహీనంగా ఉంటే.. అంతకముందు బ్యాటింగ్ చేసిన ముగ్గురు టాప్ ఆర్డర్ ఆటగాళ్లని కూర్చోబెట్టి వారి స్థానంలో ముగ్గురు బౌలర్లని మైదానంలోకి తీసుకోవచ్చు. జట్టు అవసరానికి తగినట్లుగా ముగ్గురు బ్యాట్స్‌మెన్ లేదా ముగ్గురు బౌలర్లని మార్చుకునే సదుపాయం ఈ మార్పు వల్ల లభిస్తుంది.
2sports
Oct 28,2018 హైదరాబాద్‌లో కామిల అల్బేన్‌ సేవలు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌: అమెరికా, ఐరోపా దేశాల్లో ఫ్యాషన్‌ ప్రియులను అలరిస్తోన్న కామి కామిల్లే అల్బేన్‌ భారత విపణిలోకి అందుబాటులోకి వచ్చింది. పారిస్‌కు చెందిన ఈ సెలూన్‌ 1994 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన సేవలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్‌ ప్రియులైన హైదరబాదీల కోసం మన నగరానికి అరంగేట్రం చేసింది. కామిల్లే అల్బేన్‌ సెలూన్‌ను హైదరాబాద్‌లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 8 కామిల్లే అల్బేన్పారిస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకురాలు ప్రీతిఅడుసుమిల్లి మాట్లాడుతూ తన ఆర్గానిక్‌, సహజసిద్ధమైన ఉత్పత్తుల ద్వారా అందించే సేవలతో పాటుగా పారిస్‌ ఫ్యాషన్‌ కాన్సెస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు కూడా ఈ సంస్థ సేవలు అందించిందన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ రవి, నటులు అజరు, ఆదిత్‌ ఈశ్వరన్‌, నటి సుఫీఖాన్‌, అహ్మద్‌ఖాన్‌ తదితరులు ఆలరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఆ నగ్న వీడియో తనది కాదన్న హీరోయిన్.. ఆ వీడియో లో నగ్నంగా కనిపించేది హీరోయిన్ సంచితా షెట్టి అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పందించింది సంచిత. TNN | Updated: Mar 4, 2017, 03:01PM IST సింగర్ సుచిత్ర ట్విటర్ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన నగ్న వీడియోలో ఉన్నది తాను కాదు అని స్పష్టం చేసింది సంచితా షెట్టి. దానికీ తనకూ ఎలాంటి సంబంధం లేదని స్ఫష్టం చేసింది. వివాదాస్పద ట్వీట్లు పోస్టు అవుతున్న సుచిత్ర ట్విటర్ అకౌంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళ సినీ స్టార్లు ధనుష్, త్రిష, హన్సికలతో పాటు.. తెలుగు హీరో రాణాకు సంబంధించిన ఫొటోలు కూడా సుచిత్ర ట్విటర్ నుంచి పోస్టు అయ్యాయి. సినీ నటులు సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు అవన్నీ. తన ట్విటర్ అకౌంట్ హ్యాక్ కు గురి అయ్యిందని సుచిత్ర ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద వీడియో ఒకటి ఆ అకౌంట్ ద్వారా పోస్టు అయ్యింది. ఆ వీడియో లో నగ్నంగా కనిపించేది హీరోయిన్ సంచితా షెట్టి అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పందించింది సంచిత . వీడియోపై తన వివరణ ఇచ్చింది.
0business
2018 నాటికి బ్యాంకుల విలీనం - 25% మార్కెట్‌ వాటా సొంతం - వేతన సమస్యలుండవు - గ్లోబల్‌గా టాప్‌ 50 బ్యాంకుల్లో ఒక్కటిగా : ఎస్‌బీఐ చైర్మెన్‌ వెల్లడి ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ అయినా స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో అసోసియేట్‌ బ్యాంకుల విలీనం 2018 మార్చి కల్లా పూర్తి కానుందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ అరుంధతి భట్టచార్య అన్నారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ముగింపు నాటికి విలీనం పూర్తి చేసే యోచన లేదన్నారు. 2017-18 మార్చి కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఈ విలీన ప్రక్రియ ద్వారా ప్రపంచ స్థాయి బ్యాంకుల ర్యాంకుల సరసన ఎస్‌బీఐ చేరనుందని పేర్కొంది. విలీనం తర్వాత గ్లోబల్‌గా టాప్‌ 50 బ్యాంకుల్లో ఒక్కటిగా ఎస్‌బీఐ నిలువనుందన్నారు. ఇదే సమయంలో దేశీయంగా డిపాజిట్లు, రుణాల పరంగా 25 శాతం మార్కెట్‌ వాటాను కైవసం చేసుకోనుందన్నారు. ఐదు అసోసియేట్‌ స్టేట్‌ బ్యాంకులతో పాటు భారతీయ మహిళ బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా గత నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. తుది విలీనాన్ని ప్రభుత్వం గుర్తించిన తర్వాత అసోసియేట్‌ బ్యాంకులకు ఈక్విటీలను కేటాయిస్తామని భట్టచార్య తెలిపారు. తొలుత 2017 మార్చి కల్లా విలీన ప్రక్రియ పూర్తి చేయాలని భావించామని, కాని నోట్ల రద్దు ప్రక్రియ వల్ల ఇది వాయిదా పడిందన్నారు. విలీన ప్రక్రియకు పెద్ద వ్యయం కూడా కాదన్నారు. అలాగే వేతన సంబంధిత సమస్యలు ఏవి లేవని భట్టచార్య పేర్కొన్నారు. ప్రస్తుతం సిబ్బంది ఏ ప్యాకేజీ అయితే పొందుతున్నారో అదే అందిస్తామన్నారు. కాగా ఇప్పుడు పొందుతున్న వేతనాల తరహాలోనే కావాలనుకుంటే అలాగే అమలు చేస్తామని, లేదంటే ఎస్‌బీఐ విధానాన్ని అంగీకరిస్తే కొత్త జీతాలను అందిస్తామన్నారు. ఎస్‌బీఐ అయిదు అనుబంధ బ్యాంకుల విలీనానికి బుధవారం కేంద్ర క్యాబినెట్‌ సూత్రప్రాయ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా భారతీయ మహిళా బ్యాంకు విలీనంపై మాత్రం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఆయా బ్యాంకుల బోర్డులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటూనే క్యాబినెట్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. విలీనం కారణంగా బ్యాంకుల్లోని ఏ ఒక్క ఉద్యోగిపైనా ప్రభావం చూపకుండా తగిన చర్యలు తీసుకోనున్నామన్నారు. అనుబంధ బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎస్‌బీఐ ఇప్పటికే విలీన ప్రణాళికను సిద్ధం చేసి ఉంచింది. దీనికి బ్యాంకు బోర్డు ఆమోదం కూడా తెలిపింది. అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం తరువాత ఎస్‌బీఐ బ్యాంకు ఆస్తుల విలువ రూ.37 లక్షల కోట్లకు చేరనుంది. ఖాతాదారుల సంఖ్య 50 కోట్లకు, బ్యాంకు బ్రాంచీల సంఖ్య 22,500లకు చేరుతుంది. ఇక మొత్తం 58,000 ఎటీఎంలు ఎస్‌బీఐ గొడుగు కిందకు రానున్నాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ 16,500 శాఖలు, 191 విదేశీ శాఖలతో 36 దేశాలలో విస్తరించి ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Hardik Pandya: హార్దిక్, రాహుల్‌‌ కామెంట్స్‌పై పెదవి విప్పిన కోహ్లీ భారత్ జట్టుకి మేము ఆడుతున్నాం. కాబట్టి.. హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. అయితే.. ఇటీవల ‘టాక్ షో’‌లో హార్దిక్, రాహుల్‌ వ్యక్తపరిచిన అభిప్రాయాలతో మేము ఏకీభవించడం లేదు -విరాట్ కోహ్లీ Samayam Telugu | Updated: Jan 11, 2019, 11:01AM IST Hardik Pandya: హార్దిక్, రాహుల్‌‌ కామెంట్స్‌పై పెదవి విప్పిన కోహ్లీ భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య , కేఎల్ రాహుల్‌ చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా స్పందించాడు. ఆస్ట్రేలియాతో శనివారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ మొదలుకానుండగా.. ఈరోజు మీడియాతో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ఆ సమయంలో హార్దిక్, రాహుల్ ఇటీవల ప్రసారమైన ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో చేసిన కామెంట్స్‌ గురించి ప్రస్తావన వచ్చింది. దీంతో.. ఆ కామెంట్స్‌పై తొలిసారి పెదవి విప్పిన విరాట్ కోహ్లీ.. బీసీసీఐ పాలకుల కమిటీ తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు. ‘భారత్ జట్టుకి మేము ఆడుతున్నాం. కాబట్టి.. హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. అయితే.. ఇటీవల ‘టాక్ షో’‌లో హార్దిక్, రాహుల్‌ వ్యక్తపరిచిన అభిప్రాయాలతో మేము ఏకీభవించడం లేదు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుతం బీసీసీఐ తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. శనివారం ఉదయం సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ప్రారంభంకానుంది. అసలు ఏం జరిగిందంటే..? బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న‘కాఫీ విత్ కరణ్’ షోకి హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ వెళ్లారు. అక్కడ సరదా ప్రశ్నల్లో భాగంగా.. అమ్మాయిలు, డేటింగ్ గురించి చర్చ వచ్చింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన హార్దిక్ పాండ్య.. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు’ అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. ఈ షో ఇటీవల ప్రసారంకాగా.. పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. టీమిండియాకి ఆడుతూ హుందాగా వ్యవహరించాల్సిన ఇద్దరు క్రికెటర్లు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలపై హార్దిక్ పాండ్య ఇప్పటికే ట్విటర్ ద్వారా క్షమాపణ కోరగా.. కేఎల్ రాహుల్ ఇంకా స్పందించలేదు. టాక్ షో‌లో అసభ్యకరంగా మాట్లాడిన హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌పై రెండు వన్డేల నిషేధం విధించాలని తాను ప్రతిపాదించినట్లు బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ ఇప్పటికే స్పష్టం చేయగా.. కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జి అభిప్రాయం తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది. క్రికెటర్లపై వేటు విషయంలో న్యాయ సలహా కూడా బీసీసీఐ తీసుకుంటున్నట్లు సమాచారం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
internet vaartha 174 Views న్యూఢిల్లీ : చైనాతోపాటు ఇతర యూరోపియన్‌ దేశాల నుంచి కారుచౌక ఉక్కు ఉత్పత్తులను భారీ ఎత్తున దిగుమతిచేసుకోవడంపై కేంద్రం దర్యాప్తునకు ఆదేశించింది. ఎస్సార్‌ స్టీల్‌ ఇండియా, జెఎస్‌ డబ్ల్యు స్టీల్‌ కంపెనీలు చేసిన ఫిర్యాదులపై యాంటిడంపింగ్‌, ఇతర సుంకాల డైరెక్టరేట్‌ జనరల్‌ ఈ దర్యాప్తును చేపట్టింది. కలర్‌ కోటింగ్‌ చేసి ముందుగా పెయింట్‌చేసిన ఫ్లాట్‌ ఉక్కు ఉత్పత్తులను, ఆల్లా§్‌ు, నాన్‌ అల్లా§్‌ు స్టీల్‌ను భారీగా చైనా, ఇయుదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ఈ కంపెనీలు ఫిర్యాదులు చేశాయి. డిజిఎడి కూడా ఈ ఫిర్యాదులకు ప్రాథమిక ఆధారాలున్నాయని ప్రకటించింది. దేశీయ పరిశ్రమకు విఘాతం కలిగిస్తున్నందున ఈ భారీ దిగుమతులను డంపింగ్‌పై విచారణ చేపట్టాలని నిర్ణయించింది. వీటిని కట్టడిచేసేందుకు యాంటీ డంపింగ్‌ సుంకం భారీగా పెంచితే దిగుమతులు కట్టడి అవుతాయని డిజిఎడి ఒక నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. దేశీయ పరిశ్రమకు విఘాతం కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. 2015 ఏప్రిల్‌ డిసెంబరు నెలల మధ్య జరిగి న దిగుమతులపై విచారణ చేస్తుంది. అలాగే 2012- 2014 మధ్యకాలంలో జరిగిన లావాదేవీలను కూడా డిజిఎడి విచారణ చేస్తుంది. భారత్‌లోకి భారీ ఎత్తున వస్తున్న ఉత్పత్తుల నాణ్యతకు ధీటుగా భారత ఉత్ప త్తులు ఉంటున్నాయని ఈ కంపెనీలు వాదించాయి. యాంటిడంపింగ్‌ సుంకాన్ని పాతకాలంనుంచి అమలుచేయాలని కోరాయి. నిర్మాణరంగం, పైకప్పుల నిర్మాణం, గోడల ఏర్పాటు, ప్యానెళ్లు, ఆటోమో టివ్‌, వైట్‌గూడ్స్‌ ఇతర గృహోపకరణాలకు వినియోగిస్తారు. ఇప్పటికే డిజిఎడి అనేక ఉత్పత్తులపై యాంటిడంపింగ్‌ సుంకాన్నిపెంచింది. వీటిలో చైనాతోపాటు మరికొన్ని దేశాలున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నివేదిక ప్రకారం అమెరికా, భారత్‌, బ్రెజిల్‌ దేశాలు యాంటిడంపింగ్‌ విచారణలను మరింత ముమ్మరం చేసాయి. దేశీయ ఉక్కు పరిశ్రమ సంక్షోభంలో ఉండటటంతో భారత్‌ ఇప్పటికే అనేక డంపింగ్‌ కేసులను విచారణ జరిపి సుంకాలు విదించింది. వీటిలో హాట్‌, కోల్డ్‌ రోల్డ్‌ ఉక్కు ఉత్పత్తులు ఉన్నాయి.
1entertainment
england won 1 t 20 తొలి టి20లో ఇంగ్లండ్‌ విజయం ఇంగ్లండ్‌, భారత్‌ల మధ్య జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. టాస్‌గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ భారత్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులకు కట్టడి చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 18.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
2sports
మహేష్ బాక్స్ ఆఫీస్ కెరీర్.. లాభనష్టాలు! First Published 6, Mar 2019, 4:20 PM IST   మహేష్ బాబు కెరీర్ లో ప్రతి సినిమా డిఫరెంట్ గా తెరకెక్కినదే. ఒక్కడు తరువాత మహేష్ కెరీర్ చాలా మారిపోయింది. 8 కోట్ల నుంచి మొదలైన సూపర్ స్టార్ సినిమా బడ్జెట్ 100 కోట్ల వరకు వచ్చింది. ఆయన కెరీర్ లో బాగా హైప్ క్రియేట్ చేసిన సినిమాలు.. వాటి లాభ నష్టాలు..    మహేష్ బాబు కెరీర్ లో ప్రతి సినిమా డిఫరెంట్ గా తెరకెక్కినదే. ఒక్కడు తరువాత మహేష్ కెరీర్ చాలా మారిపోయింది. 8 కోట్ల నుంచి మొదలైన సూపర్ స్టార్ సినిమా బడ్జెట్ 100 కోట్ల వరకు వచ్చింది. ఆయన కెరీర్ లో బాగా హైప్ క్రియేట్ చేసిన సినిమాలు.. వాటి లాభ నష్టాలు.. శ్రీమంతుడు - 200 గ్రాస్ కలెక్షన్స్ తో మహేష్ కెరీర్ లోనే అత్యధికంగా 87 కోట్ల షేర్స్ ను అందించిన చిత్రం. బడ్జెట్ - 60 కోట్లు దూకుడు - 36 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 56 కోట్ల షేర్స్ ను అందించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: మొదటిసారి వెంకీతో నటించి.. మల్టీస్టారర్ సినిమాలకు మళ్ళీ ఉపిరిపోసిన మహేష్ ఈ సినిమాతో 55 కోట్ల షేర్స్ ను అందించాడు. బడ్జెట్ - 50 కోట్లు 1 నేనొక్కడినే: ఓవర్సీస్ లో మంచి లాభాలను అందించిన ఈ సినిమా ఇండియాలో మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఓపెనింగ్స్ గట్టిగా రావడంతో 58 కోట్ల వరకు షేర్స్ దాటాయి. బడ్జెట్ 70 కోట్లు బ్రహ్మోత్సవం:బడ్జెట్ 70 కోట్లు.. షేర్స్ 47 కోట్లు ఆగడు బడ్జెట్ 65 కోట్లు .. షేర్స్ 36 కోట్లు బిజినెస్ మేన్ - బడ్జెట్ 40 కోట్లు.. షేర్స్ 45 కోట్లు పోకిరి: బడ్జెట్ 12 కోట్లు.. షేర్స్ 60 కోట్లు.. ఇండస్ట్రీ హిట్ ఖలేజా: బడ్జెట్ 22 కోట్లు.. షేర్స్ 23 కోట్లు ఒక్కడు: బడ్జెట్ 8 కోట్లు... షేర్స్ 22 కోట్లు స్పైడర్: బడ్జెట్ 120 కోట్లు.. షేర్స్ 49 కోట్లు భరత్ అనే నేను - బడ్జెట్ 65 కోట్లు.. షేర్స్ 92 కోట్లు Recent Stories
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV Income Tax Slabs: ఉద్యోగులకు భారీ ఊరట.. పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు 2017 బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.2,50,001 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారి పన్ను శ్లాబ్‌పై రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీని వల్ల పన్ను చెల్లింపుదారుడికి ప్రతి ఏడాది రూ.12,500 ఆదా అయ్యింది. Samayam Telugu | Updated: Feb 1, 2019, 01:56PM IST హైలైట్స్ పన్ను మినహాయింపు పరిమితి రూ.5 లక్షలకు పెంపు అలాగే 80 సీ కింద స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి కూడా అప్ కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటించింది. వేతన జీవులకు పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసింది. ఆదాయపు పన్ను పరిమితి పెంపును రూ.5లక్షల వరకు పెంచింది. ప్రస్తుతం పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉన్న విషయం తెలిసిందే. పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు వల్ల ఉద్యోగులకు రూ.12,500 వరకు భారం తగ్గుతుంది. సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల ఇన్వెస్ట్‌మెంట్లు, రూ.5 లక్షల పన్ను మినహాయింపు కలుపుకుంటే మొత్తంగా రూ.6.5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. దీని వల్ల 3 కోట్ల ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది.
1entertainment
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ First Published 20, May 2017, 5:46 PM IST రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ Recent Stories
0business
స్వీడన్- స్విట్జర్లాండ్ మ్యాచ్ హైలెట్స్ Highlights స్వీడన్- స్విట్జర్లాండ్ మ్యాచ్ హైలెట్స్ * 1994 తర్వాత స్వీడన్ ఈ మెగా ఈవెంట్‌లో మళ్లీ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. * ఫిఫా వరల్డ్‌కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం 1958 తర్వాత స్వీడిష్ జట్టుకు ఇదే తొలిసారి. 1958 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్‌లో నెగ్గి            స్వీడన్ ఫైనల్‌కు చేరింది. * చివరి ఏడు ప్రపంచకప్‌లలో స్విట్లర్లాండ్ నాకౌట్ దశలోనే పరాజయం పాలైంది.. వీటిలో 16 మ్యాచ్‌ల్లో నాలుగో రౌండ్‌లోనే  నిష్క్రమించింది. * ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో స్వీడన్ కొట్టిన 8 గోల్స్‌లో ఏడింటిని ద్వితీయార్ధంలోనే సాధించడం విశేషం. "
2sports
AP Tyapsi Chairman Ravindra Modi విద్యుత్‌ పరికరాల మార్కెట్‌ 30బిలియన్‌ డాలర్లు హైదరాబాద్‌, జనవరి 6: భారత్‌లో ఎలక్ట్రిక్‌ యంత్రపరికరాల మార్కెట్‌ వచ్చే ఐదేళ్లలో 25నుంచి 30 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని ఆర్థికరంగ నిపు ణులు చెపుతున్నారు. ప్రభుత్వపరంగా కూడా విద్యుత్‌ఉత్పత్తి 78 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెంచాలన్న లక్ష్యం నిర్ణయించడంతో దేశంలో విద్యు త్‌ యంత్రపరికరాలకు భారీ డిమాండ్‌ ఉంటుందని ఎఫ్‌ట్యాప్సీ ఛైర్మన్‌ రవీంద్రమోడీ ఇతర నిపుణులు పేర్కొన్నారు. హైటెక్స్‌లో విద్యుత్‌ఎక్స్‌పోను మైహోమ్స్‌ ఎండి జూపల్లి రామేశ్వరరావు ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో విద్యుత్‌రంగ నిపుణులు మాట్లాడుతూ విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో ట్రాన్స్‌మిషన్‌ పంపిణీ రంగంలోనే పెట్టుబడులు 85 బిలియన్‌ డాలర్ల వరకూ అవసరం అవుతాయని, ట్రాన్స్‌మిషన్‌రంగంలో 45 బిలియన్‌ డాలర్లు, పంపి ణీరంగంలో 70 బిలియన్‌ డాలర్లకు ఈ పెట్టుబడులు పెరుగతాయని అంచనా ఉందని అన్నారు. 2022 నాటికి ట్రాన్స్‌మిషన్‌ పంపిణీ రంగం టర్నోవర్‌ 70 నుంచి 75 బిలియన్‌ డాలర్లకు పెరిగే అవకాశం ఉంద ని నిపుణులు వెల్లడించారు. 2021 నాటికి భారత్‌లో విద్యుత్‌ వినియోగం 1300 టెరావాట్లుగా ఉండగల దని అంచనా ఉంది. 12వ పంచవర్ష ప్రణాళిక అంచనాలనుచూస్తే సాలీనా ఆరుశాతంపెరిగి 100 గిగావాట్లకు పెరుగుతుందని ఈ రంగ నిపుణులు చెపుతున్నారు. ఎఫ్‌ట్యాప్సీ అధ్యక్షుడు రవీంద్రమోడీ, మైహోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డా.రామేశ్వరరావుజూపల్లి, సైనర్జీ ఇన్‌ఫ్రా సిఇఒ వి.శ్రీనివాస్‌ ఇతర ప్రము ఖులు పాల్గొన్న ఈ ఎక్స్‌పోమూడురోజులపాటు కొనసాగుతుంది. ఫైన్‌క్యాబ్‌, పాల్లీక్యాబ్‌, ఎల్‌అండ్‌టి, సుధాకర్‌ పైప్స్‌, బిసిహెచ్‌, హెచ్‌పిఎల్‌, ఫిలిప్స్‌, హ్యావెల్స్‌, విప్రో, ఫినోలెక్స్‌ వంటి మెగా కంపెనీలు ఈప్రదర్శనలో ఉత్పత్తుల తో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెద్దనోట్ల రద్దుప్రభావం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఎక్కువశాతం పంపిణీ, ట్రాన్స్‌మిషన్‌, కేబుల్‌, వైరింగ్‌ ఉత్పత్తులు, స్విచ్చింగ్‌ ఉత్పత్తులు, ఫిట్టింగ్‌, ఆటోమేటిక్‌ మెషినరీ, ఆటోమేషన్‌ సిస్టమ్స్‌ రోబోటిక్స్‌, విద్యుత్‌ సామగ్రి ఏర్పాటు యంత్రపరికరాలు, వోల్టేజి స్టెబిలైజర్లు, గృహాలు, భవనాల్లో విద్యుదీకరణ యంత్రా లు, లిప్టులు, ఎస్కలేటర్లు, ఎయిర్‌కండి షనింగ్‌ వ్యవస్థలు మొత్తం ప్రదర్శనలో ఉంచారు. విద్యుత్‌ కాంట్రాక్టర్లు, విద్యుత్‌ చట్టసంస్థల అధికారులు, ఇంజనీర్లు, ఇపి ఎస్‌ కాంట్రాక్టర్లు, పారిశ్రామికరంగ నిపుణు లు, మెటీరియల్‌ సప్లయర్లు, ఎస్కోస్‌, పవర్‌ట్రేడింగ్‌ కంపెనీలు, విద్యుత్‌ బోర్డులు వంటివి ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు విద్యుత్‌లోటు కీలకంగ ఆమారిందని, పీక్‌ సమయాల్లో విద్యుత్‌ కోతలు సగటున 11శాతం, 12శాతంగా ఉన్నాయని నిపుణులు వెల్ల డించారు. మౌలికవనరులరంగం వృద్ధికి విద్యుత్‌ కొరత తీవ్ర విఘాతంగా మారిందని నిపుణుల అంచనా. దేశంలోని మొత్తం విద్యుత్‌ ఉత్పత్తులన్నిం టినీ ఒకేవేదికపైకి తెచ్చి కొనుగోలుదారులు, ఉత్పత్తిదారుల్లో అవగాహన పెంచేందుకు ఈ ఎక్స్‌పో ఎంతో ఉపకరిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.
1entertainment
నిన్ను చెప్పుతో కొట్టాలి: కత్తి మహేష్ పై మాధవీలత ఫైర్ Highlights  'కత్తి మహేష్ నిన్ను నేను చెప్పుతో కొడతా' అని హెచ్చరించింది కూడా. ఇంకేం కామెంట్స్ చేసిందంటే.. 'సీతమ్మ రావణుడితో ఉంటే సంతోషంగా ఉండేదని చెప్పడానికి నీకేం అర్హత ఉంది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఇతర మతాల వారిపై చేసి ఉంటే పరిణామాలు మరోరకంగా ఉండేవి.  హిందువులు దైవంగా ఆరాధించే రాముడిపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సినీ-రాజకీయ ప్రముఖులు అయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామీ కూడా కత్తి మహేష్ పై మండిపడ్డారు. తాజాగా నటి మాధవీలత కూడా కత్తిపై ఫైర్ అయింది. వ్యక్తిగతంగా కూడా ఆయనపై విమర్శలు గుప్పించింది. 'కత్తి మహేష్ నిన్ను నేను చెప్పుతో కొడతా' అని హెచ్చరించింది కూడా. ఇంకేం కామెంట్స్ చేసిందంటే.. 'సీతమ్మ రావణుడితో ఉంటే సంతోషంగా ఉండేదని చెప్పడానికి నీకేం అర్హత ఉంది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఇతర మతాల వారిపై చేసి ఉంటే పరిణామాలు మరోరకంగా ఉండేవి. హిందూ మతంలో ఉండే స్వేచ్చను అడ్డం పెట్టుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావ్.. రామాయణం ఒక కథ అని నీకు అనిపిస్తే.. సైలెంట్ గా ఉండాలి అంతేకానీ ఇలా బహిరంగంగా ఏది మాట్లాడితే అది మాట్లాడకూడదు' అంటూ కామెంట్ చేసిన మాధవీలత.. కత్తి మహేష్ పెట్టే టార్చర్ భరించలేకే అతడి భార్య వదిలేసి వెళ్ళిపోయిందని.. మహిళల పట్ల అతడి అసలు మర్యాదే ఉండదని అన్నారు. అతడు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడనే కారణంతోనే అతడి భార్య కనీసం విడాకులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందని చెప్పుకొచ్చారు.  Last Updated 7, Jul 2018, 5:00 PM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV త‌రుణ్ ల‌వ్ స్టోరీ ఇటీవ‌లే సెకండ్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన త‌రుణ్ ప్ర‌స్తుతం ఓ ప్రేమ‌క‌థా చిత్రంలో హీరోగా న‌టిస్తున్నారు. TNN | Updated: Jan 6, 2016, 04:18PM IST Tarun నువ్వేకావాలి, నువ్వేనువ్వే , ప్రియ‌మైన నీకు చిత్రాల‌తో చ‌క్క‌టి క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాల్ని సొంతం చేసుకున్నాడు త‌రుణ్‌ . ఈ సినిమాలు ఆయ‌న‌కి స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. అయితే ఈ స‌క్సెస్‌ల‌ను క్యాష్ చేసుకోవ‌డం త‌రుణ్ విఫ‌ల‌మ‌య్యాడు. క‌థ‌ల ఎంపిక‌లో చేసిన పొర‌పాట్ల వ‌ల్ల అత‌డు న‌టించిన చిత్రాల‌న్ని ప‌రాజ‌యాలుగా నిల‌వ‌డంతో కొద్ది రోజుల్లోనే అవ‌కాశాలు దూర‌మైయ్యారు. ఇటీవ‌లే సెకండ్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన త‌రుణ్ ప్ర‌స్తుతం ఓ ప్రేమ‌క‌థా చిత్రంలో హీరోగా న‌టిస్తున్నారు. రామ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఎస్‌.వి. ప్ర‌కాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌మేష్ గోపీ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న ఈ సినిమాకు ఇది నా ల‌వ్ స్టోరీ అనే పేరును ఖ‌రారు చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వినూత్న ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంతో మ‌ళ్లీ పూర్వ వైభ‌వాన్ని అందుకోవాల‌ని త‌రుణ్ ఆశాభావంతో ఉన్నారు. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ఓ చిత్రానికి రీమేక్‌గా దీనిని తెర‌కెక్కిస్తున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business