news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బీజేపీ నాకు ఇచ్చిన ఇంటి తాళాలు కావాలి: సింగర్ Chinmayi Sripada
తనకు జరిగిన అన్యాయం గురించి దాదాపు ఏడాదిగా పోరాడుతూనే ఉన్నారు గాయని చిన్మయి శ్రీపాద. ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరాముత్తు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు.
Samayam Telugu | Updated:
Nov 14, 2019, 02:43PM IST
చిన్మయి శ్రీపాద
దాదాపు ఏడాదిగా న్యాయం కోసం ధైర్యంగా పోరాడుతున్నారు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద . తమిళ లిరిసిస్ట్ వైరాముత్తు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని గతేడాది చిన్మయి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాన్సర్ట్ టూర్లో భాగంగా వైరాముత్తుతో పాటు వెళ్లిన చిన్మయిని ఆయన ఒంటరిగా తన గదిలోకి రమ్మన్నాడట. ఈ విషయాన్ని చిన్మయి సోషల్ మీడియా ద్వారా బయటపెట్టడంతో కోలీవుడ్ దద్దరిల్లింది. అయితే దీని ఫలితంగా చిన్మయిని వెంటనే డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించేశారు. వైరాముత్తును ఎవ్వరూ నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు.
READ ALSO: భయంకరమైన రేప్ సన్నివేశాలు, ఈ ట్రైలర్ చూస్తే వణుకుపుడుతుంది
పైగా వైరాముత్తుని అవమానించాలని బీజేపీ చిన్మయిని రెచ్చగొట్టిందట. ఇలా చేస్తే ఇల్లు కూడా ఇస్తామని చెప్పినట్లు ప్రముఖ తమిళ మ్యాగజైన్ నఖీరన్ ఓసారి వార్త రాసింది. దీనిపై తాజాగా చిన్మయి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘గతేడాది నఖీరన్ మ్యాగజైన్ నా గురించి నోటి కొచ్చినట్లు రాసేసింది. వైరాముత్తును అవమానిస్తే బెంగళూరులో ఇల్లు ఇస్తామని బీజేపీ నాతో ఒప్పందం కుదుర్చుకుందట. అందుకే నేను ఆయనపై లైంగిక ఆరోపణలు చేశానట. నాకు ఇంతవరకు ఆ ఇంటి తాళాలు చేతికి రాలేదు. నకీరణ్ మ్యాగజైన్ ఆ ఇంటి ఫొటోలు కూడా ప్రచురించింది. అడ్రెస్ కూడా తెలిసే ఉంటుంది. వైరాముత్తుపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఏడాది అవుతోంది. నన్ను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించి ఏడాది అవుతోంది. ఏడాది నుంచి విచారణ జరుగుతూనే ఉంది’ అని వెల్లడించారు.
READ ALSO: ఈ ప్రపంచంలో నా ప్రేయసే గొప్ప అందగత్తె: సింగర్
ఈ ట్వీట్ చదివిన ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘మరి ఇన్నాళ్లూ ఎందుకు మ్యాగజైన్పై పరువు నష్టం దావా వేయలేదు’ అని అడిగాడు. ఇందుకు చిన్మయి స్పందిస్తూ.. ‘నకీరణ్ మ్యాగజైన్కు చాలా మంది జర్నలిస్ట్ల నుంచి సపోర్ట్ ఉంది. నేను కేసు వేసినా కూడా ఎంతైనా చెల్లించగల డబ్బు కూడా ఉంది. కానీ నా వద్ద లేదు’ అని తెలిపారు. ఇటీవల బాలచందర్ విగ్రహావిష్కరణకు కమల్ హాసన్, రజనీకాంత్తో పాటు వైరాముత్తు కూడా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వైరాముత్తు ఎలాంటివాడో తెలిసీ కమల్, రజనీ ఆయనతో మాట్లాడటం తనకు ఏమాత్రం నచ్చలేదని తెలిపింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
టాలీవుడ్ దర్శకుల జీతాలు ఎంతో తెలుసా?
First Published 7, Mar 2019, 4:32 PM IST
ఈ రోజుల్లో హీరోలతో సమానంగా దర్శకులు కూడా గట్టి రెమ్యునరేషన్ ని లాగేస్తున్నారు. కాకపోతే వారికి కథలను సెట్ చేసుకోవడానికి మినిమమ్ రెండేళ్లు పడుతోంది. అందుకే మినిమమ్ గ్యారెంటీ కథలతో వస్తున్నారు. ఇక ప్రస్తుతం మన దర్శకుల వేతనం ఈ లెవెల్లో ఉందని ఒక అంచనా.... అయితే అది ప్రతి సినిమాకు మారుతూ వస్తోంది.
ఈ రోజుల్లో హీరోలతో సమానంగా దర్శకులు కూడా గట్టి రెమ్యునరేషన్ ని లాగేస్తున్నారు. కాకపోతే వారికి కథలను సెట్ చేసుకోవడానికి మినిమమ్ రెండేళ్లు పడుతోంది. అందుకే మినిమమ్ గ్యారెంటీ కథలతో వస్తున్నారు. ఇక ప్రస్తుతం మన దర్శకుల వేతనం ఈ లెవెల్లో ఉందని ఒక అంచనా.... అయితే అది ప్రతి సినిమాకు మారుతూ వస్తోంది.
ఎస్ఎస్. రాజమౌళి: బాహుబలికి ముందు 20కోట్లకు పైగా తీసుకున్న జక్కన్న బాహుబలి రెండు భాగాలకు కలిపి 50 కోట్లకు పైగానే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక RRR అది కాస్తా డబుల్ అయినట్లు టాక్.
త్రివిక్రమ్: అత్తరింటికి దారేది సినిమాతో త్రివిక్రమ్ పేమెంట్ 20 కోట్లకు పెరిగింది. ఆ తరువాత కూడా సేఫ్ జోన్ లో అదే నెంబర్ ను మెయింటైన్ చేస్తున్నారు.
పూరి జగన్నాథ్: 2000వ సంవత్సరంలో సినిమాలను స్టార్ట్ చేసిన ఈ దర్శకుడు ఇప్పటివరకు ఒక్క ఏడాది కూడా ఖాళీగా లేడు. టెంపర్ వరకు మినిమమ్ 12 కోట్ల పారితోషికంతో కెరీర్ ను నెట్టుకొచ్చిన పూరి ఇప్పుడు 10 లోపే తీసుకుంటున్నట్లు సమాచారం.
బోయపాటి శ్రీను: సరైనోడు సినిమాతో తాను కూడా 100 కోట్ల బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగలనని నిరూపించిన బోయపాటి 10 నుంచి 14 కోట్ల వరకు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
వివి.వినాయక్: ఠాగూర్ హిట్ తరువాత అప్పట్లో సౌత్ లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న దర్శకుల్లో వినాయక్ ఒకరు. అఖిల్ - ఖైదీ నెంబర్ 150వరకు కూడా 12 కోట్ల వరకు ఫీజు తీసుకున్న వినాయక్ ఇంటిలిజెంట్ సినిమాతో సైలెంట్ అయిపోయారు. తన సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతే ఆదుకోవడంలో ఈ దర్శకుడు ముందుంటాడు.
సుకుమార్: రంగస్థలం సినిమాతో 200 కోట్ల బిజినెస్ ను చూపించిన సుకుమార్ రేట్ 15 కోట్లకు పెరిగిందని టాక్.
కొరటాల శివ: వరుస సక్సెస్ లతో మంచి ఉపుమీదున్న కొరటాల నెక్స్ట్ మెగాస్టార్ తో చేయబోయే సినిమాకు 15 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నాడు.
F2 అనిల్ రావిపూడి: వరుస సక్సెస్ లు అందుకుంటున్న ఈ దర్శకుడిని దిల్ రాజు వదలడం లేదు. 3 కోట్లకు పైగా మొన్నటివరకు అందుకున్న ఈ దర్శకుడికి F2 సక్సెస్ అనంతరం బయటి నిర్మాతలు 5 - 7 కోట్లవరకు అఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పరశురామ్: గీతగోవిందం సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చిన ఈ దర్శకుడికి అంతకు ముందు వరకు కోటి కూడా ఇవ్వలేదు. కానీ ఆ సినిమా అనంతరం 7 కోట్లకు పైగా బడా నిర్మాతలు అఫర్ చేస్తున్నారు.
క్రిష్: కంచె - గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలతో ఇదివరకు బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న క్రిష్ కంగనా నటించిన మణికర్ణిక సినిమాకు 10 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే చివరలో ఆ సినిమా నుంచి ఆయన తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ బయోపిక్ కి రెండు భాగాలకు కలిపి అదే రేంజ్ లో వేతనాన్ని అందుకున్న క్రిష్ ఇప్పుడు తగ్గించినట్లు సమాచారం.
శ్రీను వైట్ల:ఆగడు సినిమాతో ప్లాప్ అందుకున్న శ్రీను వైట్ల అప్పటివరకు 10 కోట్ల రేంజ్ తో వచ్చారు. కానీ ఆ తరువాత వరుస డిజాస్టర్స్ తో ఇటీవల వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాకు రెమ్యునరేషన్ 70% వరకు తగ్గించినట్లు రూమర్స్ వచ్చాయి.
సురేందర్ రెడ్డి: సైరా కోసం ఈ దర్శకుడు 10 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నట్లు సమాచారం.
హరీష్ శంకర్: మినిమమ్ గ్యారెంటీ హిట్స్ అందుకునే ఈ దర్శకుడు గబ్బర్ సింగ్ తరువాత 5 కోట్లకు పెంచేసి అప్పటి నుంచి రేట్ తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు.
శేఖర్ కమ్ముల: ఫిదా సినిమా ముందు వరకు ఈ దర్శకుడు సొంత ప్రొడక్షన్ లోనే సినిమాలు చేసి మినిమమ్ లాభాలను అందుకున్నారు. ఇక ఫిదా సినిమాకు 2 కోట్ల లోపే అందుకున్నట్లు టాక్. నెక్స్ట్ సినిమాకు 5 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం.
వంశీ పైడిపల్లి: ఊపిరి సినిమాతో సక్సెస్ కొట్టిన ఈ దర్శకుడు మహేష్ 25వ సినిమా మహర్షికి 8కోట్ల వరకు వేతనాన్ని అందుకుంటున్నట్లు టాక్.
బాబీ(KS.రవీంద్ర): జై లవకుశ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు నెక్స్ట్ చైతు - వెంకీలను కలిపి మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు 3 నుంచి 4 కోట్ల వరకు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
సందీప్ వంగ: మొదటి సినిమా అర్జున్ రెడ్డితో 30 కోట్ల లాభాలను అందించిన సందీప్ కు నిర్మాతల నుంచి ఒకేసారి 3- 5 కొట్ల వరకు ఆఫర్స్ వచ్చాయి. బాలీవుడ్ లో చేస్తోన్న అర్జున్ రెడ్డి రీమేక్ కు 3 కోట్లు అందుకుంటున్నాడట.
సంకల్ప్ రెడ్డి: మొదటి సినిమా ఘాజి సినిమాకు పెద్దగా పారితోషికాన్ని తీసుకొని సంకల్ప్ నెక్స్ట్ సినిమా అంతరిక్షంకు మాత్రం 2 కోట్లు తీసుకున్నాడట. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు.
Recent Stories
| 0business
|
Hyderabad, First Published 16, Aug 2019, 11:43 AM IST
Highlights
సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ, యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గురించి ఊహించని విధంగా కామెంట్స్ చేశారు. ఇటీవల తిరుమల కొండకు వచ్చిన రాజేంద్రప్రసాద్ రాజకీయాల గురించి స్పందించిన సంగతి తెలిసిందే.
సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ, యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గురించి ఊహించని విధంగా కామెంట్స్ చేశారు. ఇటీవల తిరుమల కొండకు వచ్చిన రాజేంద్రప్రసాద్ రాజకీయాల గురించి స్పందించిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయితే కలవాలా? సినిమావాళ్లు ఏమైనా వ్యాపారస్తులా అని ఆయన చేసిన కామెంట్స్ కు పృథ్వీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
టీటీడీ అనుబంధ సంస్థ ఎస్వీబీసీ చైర్మన్ గా కొనసాగుతున్న పృథ్వీ ఆ బాధ్యత దక్కడం తన పూర్వ జన్మ సుకృతం అని చెప్పారు. అలాగే కొండపై ఉన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయాలు మాట్లాడకూడదని ఇటీవల రాజేంద్ర ప్రసాద్ రాజకీయాల గురించి ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. శ్రీవారికి కోట్లాది మంది భక్తులు ఉన్నారు. అందులో నేను ఒకడిని. ఒక బాధ్యత తీసుకొని కొండ మెట్లు ఎక్కినప్పుడే రాజకీయాలు మాట్లాడనని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
గతంలో చంద్రబాబును కలిసినప్పుడు సినీ పరిశ్రమకు ఏమి గుర్తురాలేదా? అని ప్రశ్నిస్తూ.. సీఎం జగన్ పై అనవసర వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. అలాగే చంద్రబాబు 30 ఏళ్ల పాలనలో చేయలేని అభివృద్ధి 30రోజుల్లో జగన్ చేశారని అన్నారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్థాపించిన ఎస్వీబిసి టీడీపీ హయాంలో పలు అవినతి జరిగిందని విజిలెన్స్ అధికారులు చట్ట ప్రకారం విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
Last Updated 16, Aug 2019, 11:45 AM IST
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీ ఆడలేకపోతే.. మేము మూర్ఖులమా..?
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పాతికేళ్ల కుర్రాళ్లతో పోటీపడుతూ అద్భుతంగా క్రికెట్ ఆడుతున్నాడని జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి
TNN | Updated:
Dec 25, 2017, 02:20PM IST
ధోనీ ఆడలేకపోతే.. మేము మూర్ఖులమా..?
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పాతికేళ్ల కుర్రాళ్లతో పోటీపడుతూ అద్భుతంగా క్రికెట్ ఆడుతున్నాడని జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. శ్రీలంకతో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరిగిన చివరి టీ20 మ్యాచ్‌‌లో భారత్ జట్టు గెలుపు లాంఛనాన్ని బౌండరీతో ధోనీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌‌లో లంకేయుల్ని టీమిండియా క్లీన్‌స్వీప్ చేసేసింది. మ్యాచ్ అనంతరం ధోనీ ఆటతీరు గురించి మీడియాతో రవిశాస్త్రి మాట్లాడాడు. శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌ల్లో వికెట్‌కీపర్‌గా ధోనీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో 2019 ప్రపంచకప్‌ వరకూ జట్టులో అతని స్థానానికి ఢోకాలేందంటూ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 36 ఏళ్ల ధోనీని జట్టులో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు..? యువకులకి అవకాశం ఇవ్వడంటూ గత కొంతకాలంగా మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రి ఘాటుగా స్పందించాడు.
| 2sports
|
Visit Site
Recommended byColombia
ఈ సినిమాలో రజినీకాంత్ సరసన హీరోయిన్గా అమలాపాల్, నయనతార ఇలా చాలా పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్‌గా త్రిషను హీరోయిన్‌గా ఎంపిక చేసారని తెలుస్తోంది. ప్రస్తుతం త్రిషకు తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంది. రీసెంట్‌గా ఆమె ధనుష్ సరసన నటించిన 'కోడి' సినిమా తమిళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ధనుష్కి పోటీపడి మరి త్రిష నటించింది. ఆమె నటనకు ఫిదా అయిన ధనుష్ తను నిర్మిస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. మొత్తానికి ఈ చెన్నై బ్యూటీ రజినీకాంత్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
నాలుగు రోజుల పాటు స్మిత్ ఏడుస్తూనే ఉండిపోయాడు
Highlights
బాల్ టాంపరింగ్ వ్యవహారంలో పట్టుబడిన ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నాలుగు రోజులు ఏడ్చేశాడట.
సిడ్నీ: బాల్ టాంపరింగ్ వ్యవహారంలో పట్టుబడిన ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నాలుగు రోజులు ఏడ్చేశాడట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పాడు. బాల్ టాంపరింగ్ లో పట్టుబడిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి మీడియా సమావేశంలో అతను బోరున విలపించిన విషయం తెలిసిందే.
బాల్ టాంపరింగ్ వ్యవహారంలో డేవిడ్ వార్నర్ తో పాటు స్టీవ్ స్మిత్ ను ఏడాది క్రికెట్ నుంచి నిషేధించారు. శిక్షలో సామాజిక సేవ కూడా భాగం కావడంతో సిడ్నీ బాలుర పాఠశాల కార్యక్రమానికి సోమవారం హాజరయ్యాడు.
నిజాయితీగా చెప్పాలంటే తాను నాలుగు రోజుల పాటు ఏడుస్తూనే ఉండిపోయానని అతను పిల్లలతో చెప్పాడు. మానసికంగా తాను చాలా దెబ్బ తిన్నానని, తనకు అది అతి కష్టమైన సందర్భమని అన్నాడు.
తనకు కుటుంబసభ్యులు, మిత్రులు మద్దతు పలకడం తన అదృష్టమని అననాడు. ఉద్వేగాలను బయటపెట్టుకోవడం అవసరమని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.
Last Updated 5, Jun 2018, 10:52 AM IST
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IND vs AUS: భారత్లో ఆసీస్ పర్యటన ఖరారు.. షెడ్యూల్
ఆస్ట్రేలియా గడ్డపై ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్కి సిద్ధమవుతున్న భారత్ జట్టు.. ఈనెల 18న ఆఖరి వన్డేతో పర్యటనని ముగించనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లి.. ?
Samayam Telugu | Updated:
Jan 10, 2019, 04:37PM IST
IND vs AUS: భారత్లో ఆసీస్ పర్యటన ఖరారు.. షెడ్యూల్
భారత్ గడ్డపై ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటన ఖరారైంది. ఐపీఎల్ 2019 సీజన్కి ముందు భారత్లో పర్యటించనున్న కంగారూలు.. ఇక్కడ రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ని ఆడనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈరోజు షెడ్యూల్ని విడుదల చేసింది. ఫిబ్రవరి 24న తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. మార్చి 13న ఆఖరి వన్డేతో పర్యటన ముగియనుంది. ఆ తర్వాత మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 2017లో మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు ఆఖరిసారి భారత్లో పర్యటించింది.
ఆస్ట్రేలియా గడ్డపై ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్కి సిద్ధమవుతున్న భారత్ జట్టు.. ఈనెల 18న ఆఖరి వన్డేతో పర్యటనని ముగించనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లి.. అక్కడ ఈనెల 23 నుంచి ఫిబ్రవరి 10 వరకూ ఐదు వన్డేలు, మూడు టీ20లను ఆడనుంది. ఆ తర్వాతే ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతుంది.
తొలి టీ20 బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 24న, రెండో టీ20 విశాఖపట్నం వేదికగా 27న, తొలి వన్డే హైదరాబాద్ వేదికగా మార్చి 2న, రెండో వన్డే నాగ్పూర్ వేదికగా మార్చి 5న, మూడో వన్డే రాంచీ వేదికగా మార్చి 8న, నాలుగో వన్డే మొహాలి వేదికగా మార్చి 10న, ఐదో వన్డే ఢిల్లీ వేదికగా మార్చి 13న జరగనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
రెండేండ్లపాటు రద్దు ప్రభావం..!
- వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ 6-6.5% వృద్ధి
- సర్కారు త్వరలోనే తప్పు తెలుసుకుంటుంది
- అనూహ్య వ్యక్తి అమెరికా అధ్యక్షుడయ్యాడు
- ప్రపంచ వృద్ధిలోనూ పురోగతిని ఆశించలేం : చిదంబరం
పుణె: పెద్దనోట్ల రద్దు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6-6.5 శాతానికే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా ఆర్థిక మంత్రి చిదంబరం పునరుద్ఘాటించారు. గతంలో అంచనా కట్టినదాని కంటే కూడా ఇది దాదాపు 1 శాతం మేర తక్కువ అని ఆయన అన్నారు. జీడీపీపై దీని ప్రభావం రూ.1.5 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని ఆయన అన్నారు. పెద్దనోట్ల రద్దు ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా రానున్న మరో రెండేండ్ల కాలంలో కనిపించే అవకాశం ఉన్నట్టుగా వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18) కూడా ఈ వృద్ధి రేటు 6-6.5 శాతానికి మధ్య నమోదు కావచ్చని అన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలోనూ మన వృద్ధి దాదాపు ఇదే స్థాయికి పరిమితం కావచ్చని అన్నారు. ఆమెరికా అధ్యక్ష పీటాన్ని అనూహ్యమైన వ్యక్తి అధిష్టించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్దగా పురోగతిని ఆశించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కూడా కనిపించకమానదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరానికి కూడా వృద్ధి రేటులో అద్భుతాలను ఆశించలేమని అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంలోని ముర్ఖత్వాన్ని త్వరలోనే ప్రభుత్వం గుర్తెరుగుతుందని వివరించారు. రద్దు విషయంలో సర్కారు ముందు జాగ్రత్తగా వ్యవహరించలేదని అన్నారు. ముందుచూపు లేకుండా పెద్దనోట్లను రద్దు చేసి ఆ తరువాత నెమ్మదిగా వాటి స్థానంలో కొత్తవాటిని ముద్రించడం ఏమిటని సర్కారును ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో రద్దు చేసిన వాటి స్థానంలో పూర్తిస్థాయిలో కొత్తనోట్లను తీసుకువచ్చేందుకు గాను జూన్ వరకు సమయం పట్టవచ్చని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు ప్రయివేటు పెట్టుబడులు, ప్రయివేటు వినియోగం, ఎగుమతులు, ప్రభుత్వ వ్యయాలు అనేవి నాలుగు చోదక శక్తులని అన్నారు. ఇందులో ప్రస్తుతం చివరిది మాత్రమే పని చేస్తోందని ఆయన ఎద్దేవ చేశారు. గత ఏడాదిన్నర కాలంలో ప్రయివేటు పెట్టుబడులు పూర్తిగా స్తంభించినట్టు తెలిపారు. ప్రయివేటు వినిమయం కొంత బాగానే అనిపించినప్పటికీ నోట్ల రద్దు దెబ్బకు ఇది పూర్తిగా ప్రభావితం అయినట్టు చిదంబరం తెలిపారు. ఎగుమతులు మూడేండ్ల కనిష్టానికి జారిపోయినట్టుగా వివరించారు. పరోక్ష పన్నుల భారాన్ని తగ్గించాలని ఆయన కోరారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
ఇంతకంటే బాగా చేస్తారా..!
- ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద 'బదలాయింపు' ఇది..
- వ్యవస్థలో అత్యధిక కరెన్సీని మార్చుతున్నాం...
- నోట్ల రద్దును సామాన్యులు ఆహ్వానిస్తున్నారు..ొఅందుకే ఎక్కడా అశాంతి, ఆందోళనలు లేవు: జైట్లీ
న్యూఢిల్లీ: దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీలో దాదాపు 86 శాతం నోట్లను కొత్త వాటితో మార్పిడీ చేసుకొనే ప్రక్రియ దేశ వ్యాప్తంగా బాగా జరుగుతోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ ప్రక్రియను ఇంతకంటే బాగా ఎవరూ చేయలేరని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద కరెన్సీ నోట్ల బదలాయింపుగా ఆయన పెద్దనోట్ల రద్దును అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను సంచలనంగా తాము తీసుకున్న నిర్ణయం మూలంగా బ్యాంకులకు నగదు లభ్యత పెరుగుతుందని వ్యాపారాలకు, వ్యవసాయానికి, వాణిజ్యానికి, మౌలికవసతుల కల్పనకు తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజాయితీగా బతుకుతూ సంపాదించుకొనే వారికి ఎలాంటి ప్రభావం చూపడం లేదని ఆయన అన్నారు. అక్రమంగా సంపాదించి నల్లధనం పోగుచేసుకున్న వారికే కష్టాలని ఆయన వివరించారు. ప్రజలు తమ నిర్ణయాన్ని ఆహ్వనిస్తున్నారని మంత్రి అన్నారు. అందుకే దేశంలో ఎక్కుడ పెద్దనోట్ల రద్దు పట్ల ఆందోళనలు, అశాంతి కారక చర్యలు చోటు చేసుకోవడం లేదని ఆయన అన్నారు. కరెన్సీ నోట్ల బదలాయింపు వల్ల తొలినాళ్లలో ప్రజలకు కొంత అసౌకర్యం కలిగిన మాట నిజమేనని ఆయన అన్నారు. అయితే రానురాను పరిస్థితులు కుదురుకుంటున్నట్టుగా జైట్లీ తెలిపారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలైన్లు తగ్గుతుండడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. మరో 1-2 వారాల్లో గ్రామీణ ప్రాంతాలకు కూడా కొత్త కరెన్సీ లభ్యత మరింతగా పెరిగేలా చర్యలు తీసుకోనున్నట్టుగా ఆయన తెలిపారు. తాము తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వ్యవస్థలో కొంత ఒడుదొడుకులు ఏర్పడినప్పటికీ అందరూ నిజాయితీ వ్యవస్థలోకి మారేందుకు దోహదం చేస్తుందని అన్నారు.
| 1entertainment
|
sandhya 130 Views Founder and chairman of Apollo Group of Hospitals , PRATAP C REDDY
Pratap C. Reddy
ముంబయి: అపోలో ఆసుప్రతి కుటుంబం ఇపుడు ఇన్వెస్టర్లకోసం చూస్తోంది. స్థిరాసి ్త విక్రయాలతో కానీ లేదా కొత్త పెట్టుబడిదారులను చేర్చుకుని ప్రస్తుతం ఉన్న రుణభారాన్ని తగ్గించుకోవాలనిచూస్తోంది. మొత్తం 13 నర్సింగ్ రెండు వైద్యకళాశాలలను సొంతంగానిర్వహిస్తోంది. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ కొంతమేర ఆస్తులను తగ్గించి బైటి ఇన్వెస్టర్లను చేర్చుకోవడంద్వారా తమ హోల్డింగ్కంపెనీ రుణభారం తగ్గించేందుకు నిర్ణయించింది. అపోలో షేర్లను బ్యాంకర్లకు కుదువుపెట్టింది. ఈ వాటాను తగ్గించాలని అంచనా. అంతేకాకుండా 20శాతం తగ్గిస్తే ప్రస్తుతం ఉన్న ప్రమోటర్ల వాటా 78 శాతంనుంచి తగ్గుతుందని అంచనా.
అపోలో గ్రూప్ఛైర్మన్ ప్రతాప్సిరెడ్డి నలుగురు కుమార్తెలు ఈ వ్యాపారాల్లోనే స్థిరపడ్డారు. రెడ్డి కుటుంబం అపోలో స్టాక్స్లో 34శాతం కలిగి ఉంది. అపోలో వాటాదారులశ్రేయస్సుదృష్ట్యానే ఈనిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం చెపుతోంది. ఫిబ్రవరిలో ఈ లావాదేవీలు కొలిక్కిరాగలవని అంచనా. రుణసమస్యతోనే అపోలో తన వాటాధరలు క్షీణిస్తుండటాన్ని గమనించి ముందుగానే మేల్కొంది. భారత్లో అత్యధికశాతం కంట్రోలింగ్ వాటాదారులు భారీ మొత్తం షేర్లను కుదువపెట్టినట్లు తెలుస్తోంది. వీటిని ఇపుడు గంపగుత్తగా విక్రయించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. సుభాష్చంద్ర ఎస్సెల్గ్రూప్, అనిల్ అంబాని ఆధ్వర్యంలోని సంస్థలు కూడా కొంతమేర ఇన్వెస్టర్ల ఆందోళననుచవిచూసాయి. ఇపుడు అపోలో ఇందుకు భిన్నంగా ఉంటుంది.
ఈ ఏడాది పదిశాతం లాభపడిందనే చెప్పాలి. రెడ్డి కుటుంబం హెల్త్ బీమావెంచర్లో తన వాటాను విక్రయించింది. మ్యునిచ్ ఆర్ఇ గ్రూప్తో ఉన్న హెల్త్ బీమాను విక్రయించింది. దీనివల్ల తాము తనఖాపెట్టిన షేర్ల నిష్పత్తి సెప్టెంబరునాటికి తగ్గుతుందని అంచనా. అపోలో హోల్డింగ్కంపెనీ కుదువపెట్టిన వాటాలనుసైతం 20శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. వీటితోపాటు ఈ కుటుంబం ఇపుడు 13 నర్సింగ్కళాశాలల్లోకానీ రెండు మెడికల్ కళాశాలల్లో ఒకటికానీ విక్రయించే ప్రతిపాదనలను కూడా పరిశీలస్తున్నట్లు కార్పొరేట్ వర్గాలు చెపుతున్నాయి.
ఇప్పటివరకూ ఈ విద్యావెంచర్ను అభివృద్ధిచేసేందుకు అపోలో 300 కోట్లకుపైగా ఖర్చుచేసింది. వచ్చే ఏడాదికి ఈ వెంచర్పూర్తిస్థాయి లాభాలకు మళ్లుతుంది. అంతేకాకుండా తన హోల్డింగ్కంపెనీలోనికి ఇన్వెస్టర్ను నేరుగా తీసుకోవాలని చూస్తోంది. అయితే ఎలాంటి ఇన్వెస్టర్లు తమకు అవసరం అన్న దాన్నిబట్టి కంపెనీ పరిశీలనచేస్తోంది. హెల్త్కేర్రంగంపై పూర్తి అవగాహన ఉన్నవారిని మాత్రమే ఆహ్వానించాలనినిర్ణయించారు.
తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/
| 1entertainment
|
బాలుడికు పునర్జన్మనిచ్చి ఆశీర్వదించిన మెగా పపవర్ స్టార్ రామ్ చరణ్
Highlights
రంగ స్థలం షూటింగ్ తో పాటు తన మనసు వెన్న అని చాటుకున్న చెర్రీ
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ధనుష్ అనే బాలుడికి రామ్ చరణ్ సాయం
ఆపరేషన్ చేయించి ఆరోగ్యంగా మారేలా చేసిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇమేజ్ కు తగ్గ విధంగానే తన విశాల హృదయాన్ని చాటాడు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం1985 చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. ఆ సమయంలో అక్కడి ఓ గ్రామానికి చెందిన ధనుష్ అనే కుర్రాడి కుటుంబం రామ్చరణ్ను కలిసింది. ధనుష్ మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు రామ్చరణ్ కు తమ పరిస్థితిని వివరించారు. దీంతో చికిత్సకు ఏర్పాట్లు చేయమని చరణ్ తన అనుచరులకు సూచించారు.
రామ్ చరణ్ ఆదేశాలతో అతడి టీమ్ మెంబర్స్ బాలుడికి చికిత్స చేయించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ధనుష్కు చికిత్స జరిగింది. దీనికి అయ్యే ఖర్చునంతా భరించారు రామ్ చరణ్. ఇప్పుడు ధనుష్ ఆరోగ్యంగా ఉన్నాడు. అలా మూడేళ్ల ధనుష్ ప్రాణం కాపాడారు హీరో రామ్చరణ్. అతడి చికిత్సకు సాయం చేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని దీవించారు ఆయన.
వేసవి సందర్భంగా ఎండలకు తట్టుకోలేక రంగస్థలం టీం అంతా విరామం తీసుకున్నారు. ఇక మాన్ సూన్ ప్రవేశించడంతో తిరిగి మళ్లీ ‘రంగస్థలం’ షూటింగ్ రాజమహేంద్రవరం పరిసరాల్లోనే జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడికి ధనుష్ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి చరణ్కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ధనుష్ చెర్రీకి ముద్దు పెట్టి, ‘మగధీర’లోని డైలాగ్ చెప్పి అందరిని ఆశ్చర్య పరిచాడట. ధనుష్ ఆరోగ్యంగా ఉండటం తనకు ఆనందంగా ఉందని చెప్పాడు రామ్చరణ్. ఇలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మనసు విశాలమైందని మరోసారి చాటుకున్నాడు.
Last Updated 25, Mar 2018, 11:40 PM IST
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
జై ప్రకాష్ అసోసియేట్స్కు గట్టి ఎదురు దెబ్బ
కోర్టు తీర్పులో ఇంకా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రీఫండ్ కోరే ఇంటి కొనుగోలుదారులపై తమవైన డిమాండ్లను డెవలపర్లు ఉంచలేరని తెలిపింది. గృహ కొనుగోలుదార్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకు గాను వారి తరపున సమావేశాల్లో ఎవరు పాల్గొంటారన్న అంశాన్ని సైతం అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది.
TNN | Updated:
Mar 22, 2018, 03:06PM IST
* మే 10 లోపు 200 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం
తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న రియల్టీ సంస్థ జైప్రకాష్ అసోసియేట్స్ను రెండు విడతల్లో మొత్తం రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఏప్రిల్ 6లోపు రూ.100 కోట్లు, మే 10లోపు మరో రూ.100 కోట్లను జమ చేయాలని కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ నిర్వహించింది. రిఫండ్ (తాము చెల్లించిన డబ్బుల్ని వెనక్కి తీసుకోవడం) ఎంచుకున్న కస్టమర్లకు ఈఎంఐ బకాయి ఉంటే నోటీసులు పంపొద్దని ఆదేశించింది. ప్రాజెక్టుల వారీగా రీఫండ్ ఎంచుకున్న వారి వివరాలను సమర్పించాలని కోరింది.
<p> రూ.200 కోట్ల డబ్బు డిపాజిట్ చేయాలని జై ప్రకాష్ అసోసియేట్స్కు సుప్రీం ఆదేశం<br></p>
ప్రస్తుతానికి డబ్బులు తిరిగి చెల్లించేదాపైనే తమ ఆందోళన అని, కొనుగోలుదారులకు ఫ్లాట్ల అందజేసే అంశంపై తర్వాత దృష్టి సారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. 31,000 మంది గృహ కొనుగోలుదారుల్లో కేవలం 8 శాతం మంది రీఫండ్ ఆప్షన్ ఎంచుకున్నట్టు, మిగిలిన వారు ఫ్లాట్ల కోసం ఎదురు చూస్తున్నట్టు జై ప్రకాష్ అసోసియేట్స్ కోర్టుకు తెలియజేసింది. 13,500 ఫ్లాట్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను అందుకున్నట్టు తెలిపింది. గృహ కొనుగోలుదారుల ప్రయోజనాల రీత్యా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ సంస్థ జనవరిలో రూ.125 కోట్లను జమ చేసిన విషయం తెలిసిందే.
కోర్టు తీర్పులో ఇంకా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రీఫండ్ కోరే ఇంటి కొనుగోలుదారులపై తమవైన డిమాండ్లను డెవలపర్లు ఉంచలేరని తెలిపింది. గృహ కొనుగోలుదార్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకు గాను వారి తరపున సమావేశాల్లో ఎవరు పాల్గొంటారన్న అంశాన్ని సైతం అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది.
| 1entertainment
|
Oct 21,2015
తెలంగాణలో బోర్డాక్స్ సేవలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్: తెలంగాణలో ఐటీ ఎరోనాటికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ రంగాల్లో ఫ్రాన్స్కు చెందిన బోర్డాక్స్ సంస్థ తెలంగాణతో కలిసి పనిచేయనుంది. ఇందుకు సంబంధించి 'బోర్డాక్స్ మెట్రోపోలీస్'తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఒప్పంద పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, బోర్డాక్స్ ఉపాధ్యక్షులు మైఖెల్ వర్నిజోల్లు సంతకం చేశారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు ఫ్రాన్స్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బోర్డాక్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఐటీ, బయోటెక్ రంగాలలో ఉమ్మడిగా పని చేయాలని బోర్డాక్స్ మెట్రోపోలీస్కు సూచించారు. ఈ మేరకు బోర్డాక్స్ ప్రతినిధులు మార్గదర్శకాలు కూడా ఖరారు చేశారు. సాంకేతిక రంగాలతో పాటు హైదరాబాద్లోని మూసీ నదీ ప్రక్షాళన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధిలోను బోర్డాక్స్ పని చేయనుంది. ఈ సందర్భంగాఎరో క్యాంపస్ క్యూటైన్ సబీనా టెక్నిక్ ప్రతినిధులతోను సిఎస్ భేటీ అయ్యారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 10, Apr 2019, 4:59 PM IST
Highlights
తమిళ సీనియర్ నటుడు రాధారవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తమిళ సీనియర్ నటుడు రాధారవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం నయనతార సినిమా ఫంక్షన్ కి అతిథిగా వెళ్లిన రాధారవి ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సినీ పరిశ్రమలో వివాదాస్పదంగా మారింది.
దీంతో అప్పుడు రాధారవి తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించమని కోరారు. అయితే ఇప్పుడు మాత్రం నేనెందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ లఘు చిత్రానికి సంబంధించిన కార్యక్రమానికి రాధారవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ''నేను తప్పుగా మాట్లాడి ఉంటే నా మాటలను వెనక్కి తీసుకుంటానని గతంలో చెప్పాను కానీ నేనెవరికీ క్షమాపణలు చెప్పలేదని'' అన్నారు. క్షమాపణలు చెప్పడం తన రక్తంలోనే లేదని.. అసలు నయనతార ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. నేనేమైనా క్షమించరాని నేరం చేశానా..? అంటూ ఫైర్ అయ్యారు.
''ఈరోజు నేను మాట్లాడుతుంటే ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. ఆరోజు నయనతార గురించి మాట్లాడినప్పుడు కూడా ఇదే విధంగా చప్పట్లు కొట్టి అభినందించారు'' అంటూ చెప్పుకొచ్చాడు. నిజం మాట్లాడితే ప్రజలు తనకే మద్దతు పలుకుతారని అన్నారు.
సినిమాల్లో నటించనని చాలామంది తనను బెదిరిస్తున్నారని.. తననెవరూ ఆపలేరని, సినిమాలు లేకపోతే నాటకాల్లో నటిస్తానని.. ఇదో పెద్ద సమస్యగా తనకు అనిపించడం లేదని అన్నారు.
| 0business
|
Hyderabad, First Published 29, Sep 2018, 4:41 PM IST
Highlights
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం 'ఖైదీ'. ఆ సినిమాకు సీక్వెల్ చేద్దామని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని సంప్రదించిన నిర్మాతలెందరో.. కానీ చరణ్ మాత్రం ఆ రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. తన తండ్రి వెండితెరపై క్రియేట్ చేసిన సెన్సేషన్ ని రీక్రియేట్ చేసే విషయంలో చరణ్ వెనుకడుగు వేశాడు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం 'ఖైదీ'. ఆ సినిమాకు సీక్వెల్ చేద్దామని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని సంప్రదించిన నిర్మాతలెందరో.. కానీ చరణ్ మాత్రం ఆ రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. తన తండ్రి వెండితెరపై క్రియేట్ చేసిన సెన్సేషన్ ని రీక్రియేట్ చేసే విషయంలో చరణ్ వెనుకడుగు వేశాడు.
అయితే ఇప్పుడు అదే టైటిల్ తో కమెడియన్ షకలక శంకర్ సినిమా చేస్తూ మెగాస్టార్ ఇన్సల్ట్ చేస్తున్నారు. జబర్దస్త్ షోతో పాపులర్ అయిన శంకర్ ఆ తరువాత హీరోగా మారి సినిమా చేశాడు. ఇప్పుడు హీరోగా తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నంలో హనుమాన్ కృష్ణ అనే నూతన దర్శకుడితో కలిసి పని చేయబోతున్నాడు.
ఈ సినిమాకి 'ఖైదీ' అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నారు. దసరా నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది. చిరంజీవిని తగ్గించే విధంగా ఈ సినిమా ఉండదని మేకర్స్ చెబుతున్నప్పటికీ హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ మాత్రం ఇది చిరంజీవికి పెద్ద అవమానమంటూ శంకర్ పై విమర్శలు చేస్తున్నారు.
శంకర్ హీరోగా పరిచయమైన 'డ్రైవర్ రాముడు' అనే సినిమాతోనే.. దివంగత ఎన్టీఆర్ నటించిన సినిమాలలో 'డ్రైవర్ రాముడు' ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మొదటి సినిమాకు ఎన్టీఆర్ టైటిల్ పెట్టుకున్న శంకర్ ఈసారి చిరంజీవి టైటిల్ మీద పడ్డాడు.
Last Updated 29, Sep 2018, 4:41 PM IST
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఫ్లిప్కార్ట్కు పోటీగా..అమెజాన్ సమ్మర్ సేల్!
ఈకామర్స్ దిగ్గజాల మధ్య పోటీ మరింత తీవ్రమైంది. దేశీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇప్పటికే 'బిగ్ షాపింగ్ డేస్' పేరుతో మే 13 నుంచి 16 వరకు నాలుగురోజులపాటు మెగాసేల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి పోటీగా అమెజాన్ ఇండియా 'సమ్మర్ సేల్' పేరుతో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లకు తెరతీసింది. అదికూడా ఫ్లిప్కార్ట్ ప్రకటించిన రోజుల్లోనే కావడం విశేషం.
TNN | Updated:
May 9, 2018, 06:56PM IST
ఫ్లిప్కార్ట్కు పోటీగా..అమెజాన్ సమ్మర్ సేల్!
ఈకామర్స్ దిగ్గజాల మధ్య పోటీ మరింత తీవ్రమైంది. దేశీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇప్పటికే 'బిగ్ షాపింగ్ డేస్' పేరుతో మే 13 నుంచి 16 వరకు నాలుగురోజులపాటు మెగాసేల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి పోటీగా అమెజాన్ ఇండియా 'సమ్మర్ సేల్' పేరుతో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లకు తెరతీసింది. అదికూడా ఫ్లిప్కార్ట్ ప్రకటించిన రోజుల్లోనే కావడం విశేషం. అమెజాన్ కూడా మే 13 నుంచి 16 వరకు 'సమ్మర్ సేల్' ఆఫర్లను వినియోగదారులకు అందించనుంది. ఈ సేల్లో భాగంగా అన్నిరకాల వస్తువులపై పలు ఆఫర్లను అందించనుంది. క్యాష్బ్యాక్లు, నో-కాస్ట్ ఈఎంఐలు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను అమెజాన్ అందించనుంది. ఈ సేల్లో 1000కి పైగా బ్రాండ్లలో, 40వేల డీల్స్ను అందుబాటులో ఉంచనున్నట్లు అమెజాన్ సంస్థ ప్రకటించింది. స్మార్ట్ఫోన్లపై 35 శాతం వరకు డిస్కౌంట్లను అమెజాన్ ఆఫర్ చేస్తోంది.
| 1entertainment
|
మెగాస్టార్ ఉయ్యాలవాడ కోసం రంగంలోకి లైకా ప్రొడక్షన్స్
Highlights
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా క్యాంప్
ఇండస్ట్రీ హిట్ కోసం టార్గెట్ చేసిన మెగా టీమ్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
రిచ్ గా వచ్చేలా చిత్రంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భాగస్వామ్యం
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ముందుగా ఈ సినిమాను 70 నుంచి 80 కోట్ల మధ్యలో నిర్మించాలని చరణ్ అనుకున్నాడు. కానీ భారీ స్థాయిలో క్వాలిటీగా గ్రాఫిక్స్ చేయించవలసి ఉండటంతో, బడ్జెట్ ను 125 కోట్లకి పెంచారు.
ఖర్చు పెరగడం వలన మరో భాగస్వామి వుంటే బాగుంటుందని భావించి, లైకా ప్రొడక్షన్స్ వారిని సంప్రదిస్తున్నారట. 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి కూడా వాళ్లు పెట్టుబడి పెట్టారు కనుక, ఈ సినిమా నిర్మాణ భాగస్వాములుగా ఉండటానికి వాళ్లు అంగీకరించే ఛాన్స్ ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు. చిరూ పుట్టినరోజు సందర్బంగా ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
Last Updated 25, Mar 2018, 11:55 PM IST
| 0business
|
అమెరికా సెక్స్ రాకెట్: రెజీనా ఏం చెప్పిందంటే..
Highlights
అమెరికా సెక్స్ రాకెట్ విషయంలో హీరో రెజీనా పేరుని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. ఈ విషయం ఆమె వరకు వెళ్లడంతో కాస్త ఘాటుగానే స్పందించింది ఈ బ్యూటీ. తనపై వస్తున్న వార్తలన్నీ రూమర్లేనని.. నిజాలు తెలుసుకొని మాట్లాడితే బెటర్ అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది.
అమెరికా సెక్స్ రాకెట్ విషయంలో హీరోయిన్ రెజీనా పేరుని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. ఈ విషయం ఆమె వరకు వెళ్లడంతో కాస్త ఘాటుగానే స్పందించింది ఈ బ్యూటీ. తనపై వస్తున్న వార్తలన్నీ రూమర్లేనని.. నిజాలు తెలుసుకొని మాట్లాడితే బెటర్ అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయాలపై స్పందించడం తనకు ఇష్టం లేదని అంటూనే కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది.
'అమెరికా సెక్స్ రాకెట్ తో నాకు సంబంధం లేకుండానే ఏదేదో ప్రచారం చేస్తున్నారు. నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేప్పుడు అందులో వాస్తవం ఏంటో తెలుసుకొని బాధ్యతగా వ్యవహరించాలి. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే దేని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ పరిశ్రమలో అయినా సమస్యలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ ఒక్కటే చెడ్డది అనడం సరికాదు. కార్పోరేట్ కంపనీలలో కూడా సమస్యలు ఉంటాయి. కానీ మేము కెమెరా ముందు ఉంటాం కాబట్టి తొందరగా టార్గెట్ అవుతున్నాం.
ఇలాంటి వివాదాల గురించి మాట్లాడకపోవడమే మంచిది. మాట్లాడితే మళ్లీ నన్నే కార్నర్ చేస్తారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాల గురించి మాట్లాడతాను. అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను' అంటూ చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ కు చెందిన తారలను అమెరికా తీసుకొని వెళ్లి అక్కడ వారితో వ్యభిచారం చేయిస్తున్నారనే కేసులో కిషన్, అతడి భార్య చంద్రకళను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అలా వ్యభిచారం చేస్తోన్న తారలు వీళ్లే అంటూ ఓ లిస్టు బయటకు వచ్చింది. అందులో రెజీనా పేరు కూడా ఉందనే ఆరోపణలు రావడంతో ఆమె ఈ విధంగా స్పందించింది.
Last Updated 9, Jul 2018, 12:45 PM IST
| 0business
|
హోమ్ క్రీడలు మరో అరుదైన రికార్డుకి చేరువలో కోహ్లీ ...
మరో అరుదైన రికార్డుకి చేరువలో కోహ్లీ ...
August 21, 2019, 4:11 PM IST
Share on:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని చేరువయ్యాడు. రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా నార్త్ సౌండ్లో సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంలో విండిస్తో గురువారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీని సాధిస్తే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ రికీ పాంటింగ్(19) సమం చేస్తాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 18 సెంచరీలతో పాంటింగ్ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(25) తొలి స్థానంలో ఉన్నాడు.ఇక, కోహ్లీ విషయానికి వస్తే టెస్టుల్లో మొత్తం 25 సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో కెప్టెన్గా 18 సెంచరీ సాధించాడు.
ఇక విండిస్తో జరిగే రెండు టెస్టుల సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా ధోని రికార్డును విరాట్ కోహ్లి బద్దలు కొడతాడు. కోహ్లీ 46 టెస్టులకు కెప్టెన్సీ వహించగా 26 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది.ధోని కెప్టెన్సీలో 60 టెస్టుల్లో 27 విజయాలు నమోదు చేసింది. ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్ను 3-0తో కైవసం చేసుకున్న కోహ్లీసేన.... అనంతరం జరిగిన వన్డే సిరిస్ను 2-0తో సొంతం చేసుకుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా... మిగిలిన రెండు వన్డేల్లో కోహ్లీసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మూడు వన్డేల సిరిస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 234 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు ఒక దశాబ్దంలో 20,000 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్మన్గా చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు విండిస్పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
సంబంధిత వార్తలు
| 2sports
|
internet vaartha 162 Views
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా తన ఉత్పత్తులను విరకయిస్తున్న జియోని భారత్మ ఆర్కెట్ కోసం తొలి విఒఎల్టిఇ సదుపాయంతో ఉన్న స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. జియోనిఎస్6 స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అల్ట్రాసిమ్ డిజైన్ల కంటే మెరుగైన అనుభూతిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. 4జి ఎల్టివి, వోల్టే కనెక్టివిడీతో వేగ వంతమైన ఇంటర్నెట్ సేవలు అందుతాయని కంపెనీ ప్రకటించింది. ఆండ్రాయిడ్ 5.1ఆధారిత అమిగో 3.1 ఆపరేటింగ్ వ్యవస్థ, 1.3గిగాహెట్జ్, 64బిట్ ఆక్టాకోర్ప్రాసెసర్ ఎస్6 సొంతంగా ఉందన్నారు. వీటితోపాటు 3జిబిరామ్, 32 జిబి ఇంటర్నెట్ మెమరీ అదనంగా 128 గిగాబైట్ల వరకూ పొడిగించుకునే సదుపాయం ఉంది. ఫ్లిప్కార్ట్పై ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. జియోని స్మార్ట్ఫోన్లలో 89శాతం పూర్తి మెటల్బాడీతో వోల్టే సౌకర్యంతో లభిస్తునన తొలిఫోన్ ఎస్6 అని ఇండియా జనరల్ మేనేజర్ తిమిర్బారన్ ఆచార్య వెల్లడించారు ఇండియాలో జియోనీ ఎస్ధర రూ.19999లుగా ఆయన పేర్కొన్నారు.
| 1entertainment
|
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కోడిగుడ్లు ధరలు
PNR| Last Updated: శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (10:22 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో శుక్రవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వంద కోడిగుడ్లు ధర రూ.340 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.80గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్లో రూ.344, విశాఖపట్నంలో రూ.357, విజయవాడ రూ.336, చిత్తూరులో రూ.375, ఉభయగోదావరి మార్కెట్లో రూ.336 రూపాయలుగా ఉంది.
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.368 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్లో రూ.340 రూపాయలుగా, బెంగుళూరులో 360 రూపాయలు పలుకుతోంది.
సంబంధిత వార్తలు
| 1entertainment
|
gold
స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు
న్యూఢిల్లీ,జూన్ 11: బంగారం ధరలు వరుసగా మూడోరోజు దిగజారాయి. పదిగ్రాముల బంగా రం ధరలు రూ.55 క్షీణించి రూ.29,370లకు చేరాయి. బులియన్ మార్కెట్లలో జ్యుయెలర్లు, స్థానిక రిటైలర్లు కొనుగోళ్లు తగ్గించడమే ఇందుకు కీలకం. స్పాట్ మార్కెట్లో కొనుగోళ్ల సెంటి మెంట్ను ప్రభావితంచేసింది. బంగారంతోపాటే వెండి కూడా కిలోకు 225 తగ్గి 39,900కు చేరింది. పారిశ్రామికయూనిట్లు,నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ తగ్గడమేనని తెలు స్తోంది. విదేశీ మార్కెట్లలో ట్రేడర్ల సెంటిమెంట్ కొంతమేర ప్రభావితం చేసింది. సవర్లలో చూస్తే ధరలు ఎనిమిది గ్రాములకు 100 రూపాయలు తగ్గి 24,400గా ఉన్నాయి. బంగారంతోపాటే వెండిధరలు కూడా 225 రూపాయలు తగ్గి 39,900లుగా ఉన్నాయి. వారంవారం పంపిణీకింద రూ.300తగ్గి 39,615రూపాయలకు చేరింది. వెండి నాణేల పరంగా చూస్తే ప్రతి వంద నాణేలకు రూ.73వేలు, విక్రయాలకు రూ.74వేల ధరలు పలుకుతున్నాయి.
| 1entertainment
|
Hyderabad, First Published 7, Mar 2019, 4:37 PM IST
Highlights
ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్న మహేష్ తన తదుపరి సినిమా ఎవరితో చేస్తాడనేది అందరిలో ఆసక్తికరమైన అంశంగా డిస్కషన్ గా మారింది. సుకుమార్ తో సినిమా అనుకుంటే ఊహించని విధంగా ఆయన ప్రక్కకు వెళ్లి...సీన్ లోకి అనీల్ రావిపూడి వచ్చారు.
ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్న మహేష్ తన తదుపరి సినిమా ఎవరితో చేస్తాడనేది అందరిలో ఆసక్తికరమైన అంశంగా డిస్కషన్ గా మారింది. సుకుమార్ తో సినిమా అనుకుంటే ఊహించని విధంగా ఆయన ప్రక్కకు వెళ్లి...సీన్ లోకి అనీల్ రావిపూడి వచ్చారు.
పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 ఇలా వరుస హిట్స్ తో దూసుకెళుతున్న అనీల్ రావిపూడి రీసెంట్ గా మహేష్ని కలిసి ఓ స్టోరీ లైన్ వినిపించగా, అది మహేష్కి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ చేద్దామని మాట ఇచ్చాడట. దిల్ రాజు, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారని టాక్. హీరోయిన్స్ ఎంపిక కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలో దర్శకుడు అనీల్ రావిపూడికు ఎంత రెమ్యునేషన్ ఇవ్వబోతున్నారనే విషయం చర్చకు వస్తోంది.
అందుతున్న సమాచారం మేరకు పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి ఈ హిట్ తో తన రెమ్యునరేషన్ కూడా పెంచాడని తెలుస్తుంది. మొన్నటిదాకా సినిమాకు మూడు కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకునే అనీల్ రావిపుడి ఎఫ్-2 హిట్ తో 5 కోట్లు చేశాడట. దానికి తోడు మహేష్ సినిమా కావటంతో ఈ మొత్తాన్ని ఆయనకు ఇస్తున్నారట.
అనీల్ రావిపూడి చేసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు దిల్ రాజు నిర్మాణంలో వచ్చాయి. తన తర్వాత సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని ఉంది. అదే బయిట బ్యానర్ లో చేస్తే ఇంకా ఎక్కువ రెమ్యునేషన్ ఉండే అవకాసం ఉంది. కానీ దిల్ రాజు బ్యానర్ కావటంతో కాస్త కంట్రోలులోనే ఉంటుంది.
Last Updated 7, Mar 2019, 4:37 PM IST
| 0business
|
internet vaartha 109 Views
హైదరాబాద్ : దక్షిణభారత మార్కెట్లో విస్తరించాల ని సూర్యరోశ్ని హిందూపూర్లో కొత్త స్టీల్పైప్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇఐ పైప్ ఉత్పత్తిపరంగా భారత్లోనే అతిపెద్ద కంపెనీ గా ఉన్న సూర్యరోష్ని, ప్రకాష్ సూర్య అనే ఉత్తమబ్రాండ్నేమ్తో 40 ఏళ్లుగా పైపులు ఉత్పత్తిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో అత్యాధునిక ఉక్కుపైప్ ప్లాంట్ నెలకొల్పేదిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. కొత్త ప్లాంట్ ప్రతి ఏటా లక్ష మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఉంటుందని కంపెనీ ఎండి బి.రాజు వెల్లడించారు. సంస్థకు కర్నాటక ఆంధ్రప్రదేశ్లలో సొంత శాఖలున్నాయని, డీలర్లు, రిటైలర్ల నెట్వర్క్పరిధి విస్తృతం చేసామన్నారు. సూర్య గ్రూప్ పతి ఏటా ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిసామర్ధ్యంతో అర అంగు ళం నుంచి 16 అంగుళాల జిఐపైపులు, ఎని మిది అంగుళాలనుంచి 104అంగుళాల స్పైరల్ పైపులను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం గ్రూప్ టర్నోవర్ రూ.4200 క ఓటుల్గఆ ఉందన్నారు. సంస్థ అభివృద్ధిచేసిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా రెండులక్షలమంది డీలర్లు, రిటైలర్లు విక్రయిస్తున్నారన్నారు. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, మధ్య తూర్పుదేశాలతోపాటు ప్రపంచంలోని 40దేశా లకు సూర్య ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయని అన్నిరకాల సూర్య ఉత్పత్తులు నాణ్యతకు తీసిపోని విధంగా హాల్మార్క్తో ఉంటాని రాజు వెల్లడించారు.
| 1entertainment
|
internet vaartha 131 Views
న్యూఢిల్లీ : వాణిజ్య ఎగుమతులు గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే 1.27శాతం పెరిగాయి. జూన్ నెలలో 22.57 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. గత ఏడాది ఇదే నెలలో 22.28 బిలిన్ డాలర్లు ఎగుమతులు జరిగాయి. 204 నవంబరులో మాత్రమే ఎగుమతులు 7.27శాతం వృద్ధిని నమోదుచేశాయి. అప్పటినుంచి ఎగుమతులు క్షీణిస్తూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మందగమనం ఉన్నప్పటికీ ఉత్పత్తులధరల్లో భారీ పతనం చోటుచేసుకోవడం, చైనా ఆర్ధిక సంక్షోభం వంటివి భారత్ ఎగుమతులను వెంటాడాయి. ఇతరత్రాచూఐస్తే 2008-09 సంవత్సరంలో ఆర్ధిక సంక్షోభం తొమ్మిదినెలల పాటు ప్రభావంచూపించింది. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ఎగుమతులు ఏప్రిల్ జూన్నెలల మధ్యకాలంలో 65.31 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది 66.69 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇటీవలే వాణిజ్యమంత్రి నిర్మలాసీతారామన్ ఎగుమతులు అత్యంతక నిష్టస్థాయికి చేరాయని, అయితే ఇపుడిపుడే వృద్ధిని సాధి స్తున్నట్లు వెల్లడించారు. దిగుమతులపరంగాచూస్తే 7,33శాతం క్షీణించి 30.86 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో 33.11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం ఏడాది దిగుమతులు 84.54 బిలిన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాది చూస్తే దిగుమతులు 98.91 బిలియన్ డాలర్లుగా నెలకొన్నాయి. వాణిజ్యలోటు 8.11బిలియన్ డాలర్లుగా నిలిచింది.
| 1entertainment
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
| 1entertainment
|
మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన సర్ ప్రైజ్ గిఫ్ట్
Highlights
మెగా కోడలిగా అభిమానుల మెప్పు పొందిన ఉపాసన
రామ్ చరణ్ అంటే మెగాస్టార్ తనకిచ్చిన గిఫ్ట్ అంటున్న ఉపాసన
మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుందట
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ లు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సంవత్సరాలుగా ఆయన పుట్టిన రోజు అంటే ఆయన అభిమానులకి పండగ రోజే.
అలాంటి చిరంజీవి కి ఆయన కోడలు ఉపాసన సూపర్ డూపర్ గిఫ్ట్ ఇవ్వబోతోంది అని తెలుస్తోంది. ఈ పుట్టిన రోజు సందర్భంగా కామినేని ఉపాసన ఆయనకి ఒక గిఫ్ట్ ప్రామిస్ చేసారట. చిరంజీవి తనకు ఇచ్చిన అతిపెద్ద బహుమతి రామ్ చరణ్ అని, అతనితో పాటు కుటుంబాన్నంతటినీ ఎల్లవేళలా సంతోషంగా ఉంచడానికి తాను ప్రయత్నిస్తానని మామయ్యకు ప్రామిస్ చేసినట్లు ఉపాసన తెలిపారు.
ఈ ప్రామిస్ను నిలుపుకోవడం ఒక అందమైన బాధ్యత అని ఆమె అన్నారు. " చిరంజీవి అంటే నాకు చాలా నమ్మకం. నేను చేసే ప్రతీ పనిలో ఆయన సపోర్ట్ తో పాటు పొగడ్త ఉంటుంది. ఆ పని ఇంకా బాగా చెయ్యాలి అనే ఉత్సాహం ఆయన నుంచి నేను పొందుతూ ఉంటాను. " అన్నారు ఆమె. అలాగే రామ్ చరణ్కి కూడా నాన్నంటే ఎంతో ప్రేమ అని, చిరంజీవి మాస్టర్ అయితే చరణ్ స్టార్ శిష్యుడని ఆమె అన్నారు.
Last Updated 26, Mar 2018, 12:04 AM IST
| 0business
|
వాల్మార్ట్ రాకతో చిన్న వ్యాపారాలు ఛిధ్రమే..!
- ఆన్లైన్ పేరుతో.. ఆఫ్లైన్లో విస్తరణే లక్ష్యం
- అందుకే ఫ్లిప్కార్టులో బడా వాటా కొనుగోలు
- 'కిరాణా' లక్ష్యంగా భారత్లో పాగాకు వ్యూహం
- దొడ్డిదారిన విస్తరించడమే అసలు మెగా ప్లాన్
- రోడ్డున పడనున్న నాలుగు కోట్ల మంది ఉపాధి చిన్న వ్యాపారులు, మారు వర్తకులు, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, హమాలీలు, లాజిస్టిక్స్ సంస్థల కుటుంబాలు
- దేశ ఆర్థిక వ్యవస్థకూ పెను ముప్పు
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
భారత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో కీలక వాటాను చేజిక్కించుకొనే ప్రయత్నాలు కొలిక్కి రావడంతో.. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ భారత మార్కెట్లో తన పూర్తిస్థాయి ఉనికిని పెంచుకొనేందుకు మార్గం సగమమైంది. భారత రిటైల్ రంగంలో ఉన్న ఆంక్షల కారణంగా ఇప్పుటి వరకు వాల్మార్ట్ సంస్థ భారత్లో కొన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనే తన బీ2బీ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కొనుగోలు ద్వారా ఆ సంస్థ దొడ్డిదారిన భారత మార్కెట్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టినట్టయింది. ప్రపంచంలోని అతిపెద్ద రిటైల్ మార్కెట్లలో ఒకటైన భారత్పై తన పట్టు సాధించేందుకు గాను వాల్మార్ట్ సంస్థ దాదాపు 18 సంవత్సరాలుగా వివిధ రూపాల్లో ప్రయత్నిస్తూనే ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తనదైన లాబీయింగ్తో భారత్లో అడుగుపెట్టేందుకు పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది. స్థానిక ఆందోళనలు, వర్తకులు, చిన్న వ్యాపారుల నుంచి తీవ్ర నిరసనల నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు విదేశీ వాల్మార్ట్ లాంటి రిటైల్ సంస్థలను దేశంలోకి పూర్తిస్థాయిలో అనుమతించేందుకు సాహసం చేయలేకపోయాయి. కొన్ని పరిమితులతో కూడిన అనుమతులను మాత్రమే జారీ చేశాయి. దేశంలో అమలులో ఉన్న రిటైల్ నియంత్రణ చట్టాల ప్రకారం గ్రాసెరీ, ఫిజికల్ రిటైలింగ్ విభాగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలోనే పరిమిత అనుమతులతో వాల్మార్ట్ సంస్థ ఇప్పటికే భారత్లో బీ2బీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 21 బెస్ట్ప్రైస్ షాప్ల ద్వారా సంస్థ భారత్లో వ్యాపారం చేస్తోంది.
కిరాణా వ్యాపారమే లక్ష్యంగా వ్యూహం..
వాల్మార్ట సంస్థ ప్రధానంగా భారత రిటైల్ మార్కెట్లకు ఆయువుపట్టులాంటి కిరాణా దుకాణాలను లక్ష్యంగా చేసుకొని తన వ్యూహాన్ని ముందుకు తీసుకుపోతోంది. ఇందుకు కారణం దేశంలోని ఈ-రిటైల్ విభాగంలో కిరాణా సామాన్ల విభాగం ప్రతీ సంవత్సరం చాలా వేగంగా 65-70 శాతం మేర విస్తరిస్తోంది. 2020 నాటికి ఈ విభాగం దాదాపు రూ.10,000 కోట్లకు చేరువ కానుంది. దీంతో ఈ విభాగం నుంచి తన విజయ పరంపరను మొదలు పెట్టాలని వాల్మార్ట్ భావిస్తోంది. గత కొన్ని రోజులుగా వాల్మార్ట్ సీఈవో మాటలు వింటుంటే కూడా ఇదే విషయం అవగతమవుతోంది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తం గా కిరాణా షాపుల యాజమానులతో జట్టుకడుతామని.. వారి వ్యాపార సరళిలో మార్పులు వచ్చేలా వారికి డిజిటల్ ట్రాన్సాక్షన్ టెక్నాలజీని కూడా అందించనున్నట్టుగా వాల్మార్ట్ అధినేత ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఈ స్టేట్మెంట్ను క్షుణ్ణంగా విశ్లేషించుకొని.. వాల్మార్ట్ గత చరిత్రను తోడి చూస్తే ఈ మాట ల్లో ఎంత లోతు దాగిఉందో అర్థమవుతోంది. వాల్మార్ట్ సంస్థ రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా 50-60 లక్షల కిరాణా దుకాణా ల వారితో ఒప్పందం చేసుకొనుంది. ఇందుకోసం సంస్థ తాజాగా మరో 2బిలియన్ డాలర్లు (రూ.14,000 కోట్లు) ఖర్చు చేయ నునంది. అంటే ఒక ఊర్లో నాలుగైదు కిరాణా షాపులు ఉంటే అందులో ప్రధానమైనవి.. మంచి విస్తీర్ణం కిలిగిన ఒకటి లేదా రెండు దుకాణాలతో ఒప్పందం చేసుకొని.. వారి ద్వారా కిరాణా సామాన్లను ప్రజలకు సప్లయి చేయాలన్నది సంస్థ వ్యూహం. అంటే కొత్తగా మౌలిక వసతులన ఏర్పాటు చేసుకొనే కంటే ఉన్న వసతులను వాడుకొని ఎదగడమే ఇక్కడ సంస్థ లక్ష్యం.
దెబ్బతిననున్న సప్లరు వ్యవస్థ..
వాల్మార్ట్ నేరుగా కిరాణా సామాన్లను రైతుల నుంచి పెద్ద మొత్తంలో సమీకరించిన సప్లరు చేస్తుండడంతో దళారీ వ్యవస్థ లేక తక్కువ ధరకే సమాన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా మిగతా కిరాణా షాపులు మూసుకోక తప్పని పరిస్థితి. సంప్రదాయక విధానంలో సాగే మన దేశ కిరాణా సామాన్ల వ్యవస్థలో మూడు నుంచి నాలుగు దశల దళారీల వ్యవస్థ కనిపిస్తుంది. అంటే రైతు నుంచి ఉత్పత్తులను కొనడం దగ్గర నుంచి మొదలు పెడితే.. వాటిని వినియోగదారుల వద్దకు చేర్చే క్రమంలో ముగ్గురు లేదా నలుగురు చిన్న వ్యాపారులు కొంత లాభంతో సామాన్లను మార్కెట్ చేస్తుండడం కనిపిస్తుంది. ఇప్పుడు వాల్మార్ట్ రాకతో ఈ వ్యవస్థలో సమూలంగా నాశనమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. వాల్మార్ట్ నేరుగా రైతుల నుంచి సరకును కొనుగోలు చేసి తన నెట్వర్క్ ద్వారా వాటికి కిరాణా షాపులకు చేరవేస్తుంది. అక్కడ వ్యాపారికి కస్టమర్లను కూడా వాల్మార్ట్ సంస్థ ఆన్లైన్ రూపంలో అందించనుంది. దీంతో మారు వర్తకులు, చిన్న వ్యాపారుల వ్యవస్థకు తెరపడనుంది. దీంతో వ్యాపార వ్యవస్థపై ఆధార పడి జీవిస్తున్న చిన్న వ్యాపారులు, మారు వర్తకులు, సరుకు రవాణా సంస్థలు, డ్రైవర్లు, హమాలీలతో పాటు అనుబంధ విభాగాల్లోని జీతగాళ్ల జీవితాలు ఛిద్రం కానున్నాయి. ఫలితంగా చాలా కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. అయితే వినియోగదారులకు మాత్రం చౌకగా వస్తువులు లభించనున్నాయి. ఇక కిరాణా షాపుల్లో కియోస్కీ మెషిన్లను ఉంచి ఫిప్కార్ట్ వేదికగా వస్తువులను ఆర్డర్ చేయించి.. ఆ వెంటనే వస్తువులను ఇంటికి డెలివరీ చేసేలా వ్యవస్థను రూపొందించనున్నట్లు సమాచారం. అంటే అన్లైన్ సంస్థ కాబట్టి ఆర్డర్ ఆన్లైన్లో తీసుకొని ఆఫ్లైన్లో సరుకుల డెలివరీ చేసేలా వాల్మార్ట్ వ్యూహాన్ని రూపొందించనట్టుగా సమాచారం. దేశంలోని టెలికాం విప్లవాన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వానికి టోకరా ఇస్తూ భారత మార్కెట్లోకి అడుగుపెట్టాలన్న వ్యూహాన్ని వాల్మార్ట్ పక్కాగా అమలు చేస్తోంది. ఫ్లిప్కార్ట్ కొనుగోలు అనేది ఈ వ్యూహంలో భాగమే.
రెండేండ్లుగా దొడ్డిదారి ప్రయత్నాలు..
సంప్రదాయక మార్కెటింగ్ వ్యవస్థ బలంగా ఉండడంతో నేరుగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టి విస్తరించడం అసాధ్యమని తెలుసుకున్న వాల్మార్ట్ సంస్థ దొడ్డిదారిలో భారత్లో విస్తరించాలని 2016లోనే నిర్ణయించుకుంది. నేరుగా కాకపోయినా ఈ-కామర్స్ వేదికగా రిటైల్ వ్యాపారాన్ని దేశంలో విస్తరించాలని ప్రణాళిక రచించింది. ఇందుకుగాను భారత ఈ-కామర్స్ విపణిలో దిగ్గజంగా ఎదిగిన ఫిప్కార్ట్ను చేజిక్కించుకొంటే భారత మార్కెట్లో పరోక్షంగానైనా పాగా వేయోచ్చన్నది ఆ సంస్థ వ్యూహం. ఇందులో భాగంగా రెండేండ్లుగా ఫిప్కార్ట్ భాగస్వాములతో మంతనాలు జరుపుతూ వచ్చింది. దాదాపు రేండేండ్ల బేరసారాల తరువాత రూ.1,05,000 కోట్లకు ఫిప్కార్ట్లో ప్రధాన వాటాను హస్తగతం చేసుకొనే విషయంలో విజయం సాధించింది. వాల్మార్ట్ సంస్థ ఫ్లిప్కార్ట్లో ప్రధాన వాటాను సొంతం చేసుకోవడం వెనుక బాడా ప్లాన్ కనిపిస్తోంది. ఫిప్కార్ట్కు దేశ వ్యాప్తంగా బలమైన సప్లరు చైన్ ఉంది. ఇదే అంశం వాల్మార్ట్ను బాగా ఆకర్షించింది. పేరుకు ఆన్లైన్ వర్తక సంస్థగా అడుగుపెట్టినా.. ఈ సప్లరు చైన్ ఆధారంగా భారత్లో నలుమూలలా ఆఫ్లైన్ వ్యాపారం నిర్వహించవచ్చన్నది ఆ సంస్థ అసలు ప్లాన్గా తెలుస్తోంది.
బాడా ప్లాన్తోనే భారత్పై దృష్టి..
వాల్మార్ట్ సంస్థ ఫ్లిప్కార్ట్లో ప్రధాన వాటాను సొంతం చేసుకోవడం వెనుక బాడా ప్లాన్ కనిపిస్తోంది. ఫిప్కార్ట్కు దేశ వ్యాప్తంగా బలమైన సప్లరు చైన్ ఉంది. ఇదే అంశం వాల్మార్ట్ను బాగా ఆకర్షించింది. పేరుకు ఆన్లైన్ వర్తక సంస్థగా అడుగుపెట్టినా.. ఈ సప్లరు చైన్ ఆధారంగా భారత్లో నలుమూలలా ఆఫ్లైన్ వ్యాపారం నిర్వహించవచ్చన్నది ఆ సంస్థ అసలు ప్లాన్గా తెలుస్తోంది.
ఆర్థిక వ్యవస్థకు తీరని దెబ్బ..
దొంగ మార్గంలో వాల్మార్ట్ భారత్లో విస్తరించడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని లోటు కలిగే ప్రమాదం కనిపిస్తోంది. దాదాపు 125 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో రిటైల్ మార్కెట్ విలువ దాదాపు 600 బిలివాల్మార్ట్ రాకతో చిన్న వ్యాపారాలు ఛిధ్రమే..!
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Suresh 83 Views ussen bolt
ussen bolt
న్యూఢిల్లీ: జమైకా చిరుత ఉసేన్ బోల్ట్కి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే. లండన్లో జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్
ఛాంపియన్షిప్ పోటీల అనంతరం బోల్ట్ తన పరుగుకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా బోల్ట్ ఓ క్రీడా ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో
ఇష్టమైన క్రికెట్ జట్టు ఏదని అడగ్గా.. పాకిస్థాన్ అని చెప్పాడు. మైదానంలో పాకిస్థాన్ జట్టు ఫీల్డింగ్ చేస్తుండగా చూడటమంటే మరీ
ఇష్టమని.. పాక్ దిగ్గజ ఆటగాడు వాకార్ యూనిస్కి తాను వీరాభిమాని అని బోల్ట్ తెలిపాడు. ఈ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
విజేతగా నిలవడంతో పాకిస్థాన్ జట్టుకి ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు.
| 2sports
|
హోమ్ క్రీడలు టీం ఇండియాతో సిరిస్ నుంచి తప్పుకున్న విండిస్ కీలక ఆటగాడు
టీం ఇండియాతో సిరిస్ నుంచి తప్పుకున్న విండిస్ కీలక ఆటగాడు
August 03, 2019, 11:07 AM IST
Share on:
టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందే వెస్టిండిస్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా అమెరికాలోని ప్లోరిడాలో జరిగే మొదటి రెండు టీ20లకు ఆల్రౌండర్ రసెల్ దూరమయ్యాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్లో రసెల్ గాయపడిన సంగతి తెలిసిందే.అయినా టీమిండియాతో టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల కోసం ప్రకటించిన జట్టులో విండిస్ సెలక్టర్లు రస్సెల్కు చోటు కల్పించారు. అయితే, గాయం ఇంకా అలాగే ఇబ్బంది పెడుతుండటంతో రస్సెల్ తనంతట తానుగా ఈ పర్యటన నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో జేసన్ మహ్మద్ను ఎంపిక చేసినట్లు కోచ్ ఫ్లాయిడ్ తెలిపాడు.
సంబంధిత వార్తలు
| 2sports
|
భారత మార్కెట్లోకి డెల్ ఉత్పత్తుల ప్రవేశం
Hanumantha Reddy| Last Modified బుధవారం, 5 మార్చి 2008 (17:27 IST)
అమెరికా ఆధారిత ప్రముఖ కాస్మొటిక్ సంస్థ డెల్ లేబొరేటరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి షాలీ హన్సెన్ పేరుతో ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న తమ సంస్థకు చెందిన 400 స్టోర్లలో ఈ కొత్త ఉత్పత్తులు లభ్యమవనున్నట్లు తెలిపింది.
కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఈ ఏడాదిలో సుమరు రూ.200 కోట్లకు పైగా లాభాలు వచ్చే అవకాశాలున్నాయని కంపెనీ అంచనా వేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. డెల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ బ్లూత్ మాట్లాడుతూ ఐదు బిలియన్ డాలర్లుగా ఉన్న తమ కంపెనీ లాభాలు ఈ కొత్త ఉత్పత్తుల చేరికతో ఈ ఏడాది లాభాల శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాము ప్రవేశపెట్టిన ఉత్పత్తుల్లో లిప్స్టిక్ను లిఫ్ట్ ట్రీట్మెంట్ పేరుతో అందిస్తుండగా, నెయిల్ పెయింట్ను నెయిల్ గ్రోత్ పేరుతో అందిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. వినియోగదారులకు వీలుగా ఉండే ధరల్లోనే ఈ ఉత్పత్తులు లభ్యం అవుతాయని... రూ.375 నుంచి 700 మధ్య ధరల్లో ఉంటాయని వివరించారు.
సంబంధిత వార్తలు
| 1entertainment
|
sandhya 298 Views Brian Lara , chest pain , mumbai , west indies ex cricketer
Brian Lara
ముంబై: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పి రావడంతో ఆయనను ముంబైలోని పరేల్ ప్రాంతంలో గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఓ హోటల్లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన లారా..మధ్యలో అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. దీనికి సబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telengana/
| 2sports
|
May 22,2018
మార్కెట్లను ముంచిన కర్నాటకం!
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారమూ నష్టాల పాలయ్యాయి. కర్నాటక రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సర్కారుకు వచ్చే సాధారణ ఎన్నికల్లో భంగపాటు కలుగనుందని, సంస్కరణలు నిలిచిపోనున్నాయన్న అంచనాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీనికి తోడు చమురు ధరలు చుక్కలనంటడం, పేలవమైన మార్చి త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో వారు సోమవారం అమ్మకాల వైపే మొగ్గు చూపారు. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో సోమవారం ఉదయం సూచీలు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 70 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ కూడా 10,600పైన ట్రేడింగ్ను ఆరంభించింది. అయితే మార్కెట్లు ఆ లాభాలను ఎంతోసేపు నిలబెట్టుకోలేకపోయాయి. ట్రేడింగ్ ఆరంభమైన కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీలు తిరిగి ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఫలితంగా మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 232 పాయింట్లు నష్టపోయి 34,616 పాయింట్ల వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 10,516 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో వరుసగా నాలుగో సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసినట్టయింది. మార్కెట్ల పతనాన్ని మించి చిన్న షేర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్సులు 2 శాతం స్థాయిలో తిరోగమించాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 300 పాయింట్లకు పైగా జారింది. అటు మార్చి త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బంగ్లాదేశ్ని చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
బంగ్లాదేశ్ గడ్డపై తొలి టెస్టులో ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా పుంజుకుని రెండో టెస్టులో ఘన విజయంతో సిరీస్ని ముగించింది
TNN | Updated:
Sep 7, 2017, 06:13PM IST
బంగ్లాదేశ్ గడ్డపై తొలి టెస్టులో ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా పుంజుకుని రెండో టెస్టులో ఘన విజయంతో సిరీస్‌ని ముగించింది. చిట్టిగాంగ్ వేదికగా గురువారం ముగిసిన ఈ టెస్టులో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని రెండు టెస్టు ఈ సిరీస్‌ని 1-1తో సమం చేసింది. సోమవారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఓపెనర్ డేవిడ్ వార్నర్ (123) శతకం బాదడంతో ఆస్ట్రేలియా కూడా 377 పరుగులతో ఆతిథ్య జట్టుకి దీటుగా బదులిచ్చింది.
తొలి ఇన్నింగ్స్‌లో 72 పరుగులు వెనకబడిన బంగ్లాదేశ్.. ఒత్తిడిలోనే రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ (6/60) ధాటికి ఆ జట్టు వరుసగా వికెట్లు చేజార్చుకుని 157 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 85 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే గెలుపొందింది. తొలి టెస్టులో 20 పరుగుల తేడాతో గెలుపొంది.. అందర్నీ ఆశ్చర్యపరిచిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో మాత్రం నిరాశపరిచింది. సెప్టెంబరు 17 నుంచి ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది.
| 2sports
|
Visit Site
Recommended byColombia
ఈ స్కీమ్ అమలులోకి వస్తే.. నల్ల ధనాన్ని అరికట్టేందుకు మోదీ సర్కార్ తీసుకున్న రెండో అతిపెద్ద నిర్ణయం ఇదే అవుతుంది. 2016 డీమోనిటైజేషన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. రశీదులేని బంగారం వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే రేటు ప్రకారం దీనికి పన్ను చెల్లించాలి.
Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండిదీ ఇదే దారి!
గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆమ్నెస్టీ స్కీమ్ మాదిరిగా ఇప్పుడు గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్ కూడా నిర్దేశిత కాలం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ కాలంలో బంగారం వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో జరిమానాతో బయటపడొచ్చు. అదే స్కీమ్ కాలం ముగిసిన తర్వాత రశీదులేని బంగారం మీ వద్ద బయటపడితే కఠిన చర్యలు ఉండొచ్చనే అంచనాలున్నాయి.
Also Read: నవంబర్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే!
ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో బంగారానికి ఒక నిర్దిష్టమైన పాలసీని తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే నీతి ఆయోగ్తోనూ కలిసి ముందుకు వెళ్తోంది. సమగ్రమైన గోల్డ్ పాలసీలో భాగంగానే ఇప్పుడు మోదీ సర్కార్ గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్ను ప్రకటించనుందని జాతీయా మీడియా పేర్కొంటోంది.
Also Read: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓటీపీ చెబితే ట్రైన్ టికెట్ డబ్బులు వెనక్కి!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
sumalatha 176 Views amazon , prime , Uber Eats
Amazon
హైదరాబాద్: ఆన్లైన్ రీటైల్ రంగ దిగ్గజం అమెజాన్ ఆహార సరఫరా వ్యాపారంలోకి అడుగుపెట్టే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఉబర్ అనుబంధ సంస్థ ఉబర్ ఈట్స్ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీని కొనగోలు చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయి. ఇది సాధ్యం కాని పక్షంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా ఏర్పర్చుకొనే అవకాశం ఉంది. దీనిపై మాట్లాడేందుకు ఉబర్ నిరాకరించింది.
అమెజాన్ ఇండియా విభాగం ఫుడ్డెలివరీ వ్యాపారంపై చాలా అసక్తిగా ఉంది. అమెజాన్ అందించే సేవల్లోకి ఇది కూడా చేరితే బాగుంటుందని భావిస్తోంది.
తాజా సినిమా వీడియోస్ కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/
| 1entertainment
|
i love to watch to rohit batting from other end: kohli
రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే.. చూస్తుండిపోతా: కోహ్లి
రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా. అతడు ఆడుతుంటే అలాగే చూస్తుండి పోతా...
TNN | Updated:
Oct 30, 2017, 03:05PM IST
కివీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి శతకాలతో చెలరేగారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 230 పరుగులు జోడించారు. కీలక మ్యాచ్‌లో వీరిద్దరూ రాణించడం, బుమ్రా ఆఖరి ఓవర్లలో మెరవడంతో భారత్ కివీస్‌పై చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. రోహిత్, కోహ్లి జోడి వన్డేల్లో 200కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మ్యాచ్ అనంతరం వీరిద్దరూ సరదాగా ముచ్చటించారు.
ఓపెనర్‌గా జట్టుకు మంచి స్కోరు అందించడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పిన రోహిత్.. విరాట్ దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో రనౌట్ అయ్యే ప్రమాదం తప్పాక ఇద్దరం బాగా బ్యాటింగ్ చేశామని చెప్పాడు. కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం బావుంటుందని చెప్పాడు.
రోహిత్ కలిసి బ్యాటింగ్ చేసేటప్పుడు పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండా తమ భాగస్వామ్యం కొనసాగుతుందని కోహ్లి చెప్పాడు. ఇద్దరం పరిస్థితిని అర్థం చేసుకొని ఆడతామని చెప్పాడు. ఈ స్టయిలిష్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం కంఫర్ట్‌గా ఉంటుందని కెప్టెన్ చెప్పుకొచ్చాడు. రోహిత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తానని, అతడు షాట్లు కొడుతుంటే.. అవతలి ఎండ్ నుంచి చూసేందుకు ఇష్టపడతానని విరాట్ తెలిపాడు.
భారత బౌలర్లపై రోహిత్, విరాట్ ప్రశంసలు గుప్పించారు. బౌలర్లు నిలకడగా రాణిస్తూ.. కీలక సమయాల్లో వికెట్లు తీసి మ్యాచ్‌ను గెలిపిస్తున్నారని చెప్పారు. వారి పోరాట స్ఫూర్తి అద్భుతమన్నారు.
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
యువరాజ్ ఇక జట్టులోకి రాలేడేమో..!
భారత్ జట్టు సీనియర్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ని సెలక్టర్లు కావాలనే పక్కన పెట్టినట్లు తనకి అనిపిస్తోందని
TNN | Updated:
Aug 21, 2017, 03:16PM IST
భారత్ జట్టు సీనియర్ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్‌ని సెలక్టర్లు కావాలనే పక్కన పెట్టినట్లు తనకి అనిపిస్తోందని వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల శ్రీలంకతో వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో ధోనీకి స్థానం కల్పించిన సెలక్టర్లు.. యువరాజ్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్‌లను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు చెలరేగడంతో యువీపై వేటు వేయలేదని.. కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చామని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చుకున్నారు. 2019 ప్రపంచకప్‌ కోసం జట్టు వేట ఈ శ్రీలంక పర్యటనతోనే ఆరంభమవుతుందని చీఫ్ సెలక్టర్‌ హోదాలో ఆయనే ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో యువరాజ్‌‌ పునరాగమనం కష్టమేనని గంభీర్ పేర్కొన్నాడు.
‘యువరాజ్‌కి విశ్రాంతి ఇచ్చామనే మాట ఇక్కడ సరికాదు. ఎందుకంటే అతను టెస్టు జట్టులో లేనందున ఇప్పుడేమీ ఎక్కువ క్రికెట్ ఆడటం లేదు. మ్యాచ్‌ల కోసం యువీ ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మనం ఒకవేళ అతడ్ని 2019 ప్రపంచకప్‌లో చూడాలనుకుంటే వీలైనన్ని ఎక్కువ అవకాశాలివ్వాలి. ఎందుకంటే యువరాజ్ లాంటి బ్యాట్స్‌మెన్ మెరుగ్గా రాణించాలంటే క్రమం తప్పకుండా క్రికెట్ ఆడుతూ రిథమ్‌లో ఉండాలి. అలా కాకుండా ఒక సిరీస్‌కి అవకాశమిచ్చి.. మరొకదాంట్లో విశ్రాంతినిస్తే ఫామ్ కష్టం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే యువరాజ్ మళ్లీ భారత్ జట్టులోకి పునరాగమనం చేయడం కష్టమేనని నాకు అనిపిస్తోంది. అయితే.. అతను జట్టులో మళ్లీ స్థానం సంపాదించినా ఆశ్చర్యపోలేం. ఎందుకంటే క్రికెట్‌లో అతనో గొప్ప ఆటగాడు’ అని గంభీర్ వివరించాడు.
| 2sports
|
లక్ష మందిని నియమించటానికి చైనా ప్రణాళికలు
Hanumantha Reddy|
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు 2015 వరకు ఉపాధి కల్పన భాగంగా దేశ మూల రంగాల్లో పనిచేయటానికి లక్ష మంది గ్రాడ్యుయేట్లను నియమించనుంది. చైనా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యా, వ్యవసాయం, మెడికల్ రంగం వంటి రంగాల్లో ఈ నియామకాలు ఉంటాయని ప్రభుత్వం ఒక అధికార ప్రకటనలో తెలిపింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం 20,000 మంది గ్యాడుయేట్లను నియమిస్తారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జరిగే నియమించబడే వారికి ఉద్యోగ భద్రతతో పాటు పదవీ విరమణ అనంతరం లభించే అన్ని సదుపాయాలు లభిస్తాయని ఆ ప్రకటనలో చైనా ప్రభుత్వం వెల్లడించింది.
సంబంధిత వార్తలు
| 1entertainment
|
Hyderabad, First Published 6, Aug 2019, 4:37 PM IST
Highlights
తన సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా అన్నారు. ఒకనాకొక సమయంలో తన దగ్గర కనీస అవసరాలకు కూడా డబ్బు లేకుండా పోయిందని జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాయని చెప్పారు. ఒకానొక సమయంలో తన దగ్గర కనీస అవసరాలకు కూడా డబ్బు లేక ఎంతో ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ 2014 నుండి 2015 మధ్య కాలంలో తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు చెప్పింది.
తను నటించిన 'దావత్-ఎ-ఇష్క్', 'కిల్ దిల్' సినిమాలు సరిగ్గా ఆడలేదని.. అది తన జీవితంలో కఠినమైన సమయమని.. ఒక్కసారిగా అవకాశాలు తగ్గి చేతుల్లో డబ్బు లేని పరిస్థితి నెలకొందని తెలిపింది. కొత్తగా ఇల్లు కొనడంతో పాటు, పెద్ద సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతో ఉన్న డబ్బు కూడా అయిపోయిందని.. సమయానికి ఒక్కరూపాయి కూడా అందలేదని.. తన జీవితంలో అదొక పెద్ద కుదుపు అంటూ చెప్పుకొచ్చింది.
రోజుకి పదిసార్లు గుక్కపెట్టి, గుండెపగిలేలా ఏడ్చేదాన్ని అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండేదాన్ని అని తెలిపింది. ఓ గదిలో తనను తను బంధించుకొని.. వారాల కొద్దీ ఎవరినీ కలవకుండా ఒంటరిగా బ్రతికేదట.
ఆ సమయంలో తన సోదరుడు సహజ్, తన స్టైలిస్ట్ సంజనా బాత్రా తనపై శ్రద్ధ తీసుకొని.. డిప్రెషన్ లో ఉన్న తనను బయటపడేలా చేశారని.. వారి కారణంగా మామూలు మనిషి అయ్యానని చెప్పుకొచ్చింది. డిప్రెషన్కు మనిషి ప్రాణాలు తీసే శక్తి ఉంటుందని.. కాబట్టి మన వాళ్లు ఎవరైనా అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్లయితే నిరంతరం వారిని గమనిస్తూ..కాపాడుకోవాలని చెప్పారు.
Last Updated 6, Aug 2019, 4:37 PM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'దువ్వాడ జగన్నాథం' కొత్త రిలీజ్ డేట్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్ డేట్...
TNN | Updated:
Apr 10, 2017, 07:51PM IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్ డేట్ మారినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఈ సినిమాను జులై 7వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని యూనిట్ వర్గాలు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. మొదట్లో ఈ సినిమాని మే 19న రిలీజ్ చేయాలని భావించారు. కానీ కొన్ని అనుకోని కారణాలతో షెడ్యూల్స్ కాస్త ఆలస్యమవడంతో ఈ సినిమా విడుదల సైతం అదేవిధంగా ఆలస్యం కానుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇదిలావుంటే, షెడ్యూల్స్ ఆలస్యం కావడానికి అల్లు అర్జున్ కొంత అనారోగ్యంతో బాధపడుతుండటం కూడా ఓ కారణమనే టాక్ వినిపిస్తోంది. కానీ అసలు సమస్య ఏంటనేదానిపై మాత్రం ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ సరసన పూజా హెగ్డే జంటగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ సైతం రికార్డ్ స్థాయిలో 12 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. దిల్ రాజు నిర్మిస్తున్న దువ్వాడ జగన్నాథం మూవీకి డీఎస్పీ మ్యూజిక్ అందిస్తున్నాడు.
| 0business
|
- 5-1తో అమెరికా ఘన విజయం
- టోక్యో ఒలింపిక్స్ బెర్త్ లాంఛనమే
భువనేశ్వర్ (ఒడిశా) : అమ్మాయిలు అదరగొట్టారు. టోక్యో ఒలింపిక్స్ తలుపు తట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సొంతగడ్డపై జరుగుతున్న ఒలింపిక్ క్వాలిఫయర్స్ తొలి మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు తిరుగులేని ప్రదర్శన చేసింది. 5-1తో అమెరికాపై ఎదురులేని విజయం సాధించింది. అమెరికాపై భారత మహిళలకు ఇది కేవలం ఐదో విజయం. అయినా, ఈ ఒక్క విజయంతో అమెరికా ఒలింపిక్స్ స్వప్నం టీమ్ ఇండియా చెదరగొట్టింది!. శుక్రవారం భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో విశేష అభిమానుల నడుమ హాకీ అమ్మాయిలు అదిరే ప్రదర్శన చేశారు. నాలుగు క్వార్టర్ల మ్యాచ్లో రాణి రాంపాల్ సేన రెండు భిన్న వ్యూహలతో చెలరేగింది. ప్రథమార్థం ముగిసే సమయానికి భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయినా తొలి రెండు క్వార్టర్స్ మ్యాచ్ జోరుగా సాగలేదు. 40వ నిమిషంలో మొదలైన గోల్స్ వర్షం ఆఖరు వరకూ కొనసాగింది. 29వ నిమిషంలో లిలిమా మింజ్ గోల్తో భారత్ ఖాతా తెరిచింది. 40వ నిమిషంలో షర్మిలా దేవి, 42వ నిమిషంలో గుర్జీత్ కౌర్, 46వ నిమిషంలో నవనీత్ కౌర్, 51వ నిమిషంలో మళ్లీ గుర్జీత్ కౌర్ గోల్స్ కొట్టారు. అమెరికాకు 53వ నిమిషంలో ఎరిన్ మాట్సన్ ఊరట గోల్ను అందించింది. నాలుగు గోల్స్ తేడాతో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా.. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ లాంఛనం చేసుకుంది. ఒలింపిక్స్ అర్హతకు అమెరికా రెండో మ్యాచ్లో భారత్పై ఐదు గోల్స్ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. భారీ విజయంతో హాకీ అమ్మాయిలు, అభిమానులు ముందస్తు ఒలింపిక్ సంబురాలు చేసుకున్నారు.
అబ్బాయిలూ నెగ్గారు : ఒలింపిక్ క్వాలిఫయర్లో మెన్స్ జట్టూ శుభారంభం చేసింది. రష్యాపై 4-2తో సూపర్ విజయం సాధించింది. కెప్టెన్ మన్దీప్ సింగ్ 24, 53వ నిమిషాల్లో గోల్స్ కొట్టగా.. నీలకంఠ సాయంతో సునీల్ 48వ నిమిషంలో గోల్ కొట్టాడు. ఐదో నిమిషంలోనే హర్మన్ప్రీత్ సింగ్ భారత్కు ఆధిక్యం అందించాడు. ప్రథమార్థంలో ఓ గోల్ కొట్టిన రష్యా.. చివరి నిమిషంలో మరో గోల్ సాధించి ఓటమి అంతరాన్ని తగ్గించుకుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 2sports
|
Visit Site
Recommended byColombia
ఈ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘ఈరోజు బ్యాడ్ న్యూస్తో లేచాను. అక్కినేని ఫ్యామిలీకి, నాన్న గారికి ఆయన అత్యంత సన్నిహితుడు శివప్రసాద్ రెడ్డి గారిని కోల్పోయాం. తాత ఏఎన్నార్, నాన్న నాగార్జునతో పాటు, మా కుటుంబానికి చెందిన అందరికి సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. మీరు అభిమానులు కాదు. అక్కినేని వారి ఫ్యామిలీకి కుటుంబసభ్యులు. అభిమానులకే అభిమానులు మా అక్కినేని అభిమానులు.
చదవండి: కీరవాణి నాకు గోల్డెన్ హ్యాండ్: సునీత
దర్శకుడు చందూ సినిమాకు ప్రాణం పెట్టాడు. ప్రేమమ్ లవ్ స్టోరితో తెలుగు ప్రేక్షకులను ఎంత ఎంటర్ టైన్ చేశాడో.. సవ్యసాచి లాంటి కమర్షియల్ హిట్తో వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నాం. సంగీత దర్శకుడు కీరవాణిగారు తాతతో, నాన్నగారితో చేశారు. కీరవాణితో పనిచేస్తే ఎలా ఉంటుంతో నాన్నగారు ఎప్పుడూ చెప్పేశారు. సవ్యసాచి మూవీ టైటిల్ సాంగ్ కీరవాణి పవర్ తెలుపుతుందని’ చైతూ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి నిధి అగర్వాల్, చిత్ర దర్శకుడు చందు మొండేటి, ఎం.ఎం.కీరవాణి, కెమెరామెన్ యువరాజు, నిర్మాతలు నవీన్, రవిశంకర్, మోహన్ తదితరులు హాజరయ్యారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మలింగ @300.. కెప్టెన్ కోహ్లి ఔట్..!
శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ లసిత్ మలింగ తన కెరీర్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. భారత్తో గురువారం కొలంబో వేదికగా జరుగుతున్న
TNN | Updated:
Aug 31, 2017, 04:53PM IST
శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ లసిత్ మలింగ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. భారత్‌తో గురువారం కొలంబో వేదికగా జరుగుతున్న నాలుగో వన్డే‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ తీసిన మలింగ కెరీర్‌లో 300వ వన్డే వికెట్‌‌ని ఖాతాలో వేసుకున్నాడు. 2004, జులై 17న వన్డే క్రికెట్‌‌లోకి అరంగేట్రం చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ అనతికాలంలోనే జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. తాజాగా అతను 203వ వన్డే ఆడుతున్నాడు.
యార్కర్‌ రూపంలో విసిరిన బంతిని విరాట్ కోహ్లి (131: 96 బంతుల్లో 17x4, 2x6) కవర్స్ దిశగా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే.. ఫీల్డర్ మునవీర దిల్షాన్ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విషయాన్ని కోహ్లి గుర్తించలేకపోయినట్లు తెలుస్తోంది. అప్పటికే ఆ ప్రదేశంలో రెండు.. మూడు బౌండరీలు బాదిన కోహ్లి.. మరో బౌండరీ కోసం ప్రయత్నిస్తూ అతని చేతికి చిక్కిపోయాడు. దిల్షాన్ క్యాచ్ అందుకునేందుకు నిల్చొన్న చోట నుంచి ఎక్కడికీ కదలాల్సిన అవసరం లేకపోయింది. దీనిబట్టి మలింగ వ్యూహం ప్రకారమే.. కోహ్లిని బుట్టలో వేసినట్లు తెలుస్తోంది. అప్పటికి భారత్ స్కోరు 29.3 ఓవర్లలో 225/2.
| 2sports
|
Aug 17,2015
బ్యాగులు, ప్యూరిఫైయర్ల పంపిణీ..
బెంగళూరు: కెనరా బ్యాంకు బెంగళూరు మెట్రో సర్కిల్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో అధికారులు 'ఖాతాదారుల సమావేశం' నిర్వహించారు. బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరిదీష్ కుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి హాజరైన వారితో ఆయన ఇష్టాగోష్టి నిర్వహించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఆయన స్థానిక స్కూలు పిల్లలకు బ్యాగ్లను అందజేశారు. ప్రత్యేక సంరక్షణ అవసరమైన వారి కోసం కృషి చేస్తున్న సమర్థనం ట్రస్టుకు ఆయన వాటర్ ప్యూరిఫైయర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు చీఫ్్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ బీఎన్ఆర్ రత్నాకర్, కెనరా బ్యాంకు స్థానిక శాఖ జీఎం రవీంద్ర బండారీతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కాటమరాయుడుకి కొత్త తలనొప్పి!
పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ నెల 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈరోజు గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరగుతోంది.
TNN | Updated:
Mar 18, 2017, 08:14PM IST
పవన్ కల్యాణ్ నటిస్తోన్న ' కాటమరాయుడు ' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ నెల 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈరోజు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరగుతోంది. అభిమానులంతా పవన్ సినిమా అనుకున్న సమయానికి థియేటర్‌కు వస్తుందని ఆనందంలో ఉంటే ఇప్పుడు కాటమరాయుడుకి కొత్త తలనొప్పి మొదలైంది.
'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా వల్ల నష్టపోయిన కొందరు బయ్యర్లకు కాటమరాయుడు సినిమా రైట్స్ ఇస్తామని మాటిచ్చారు. కానీ వాస్తవానికి అలా జరగలేదు. దీంతో కొందరు బయ్యర్లు కాటమరాయుడు సినిమా రిలీజ్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెంసిన సంపత్ కుమార్ అనే పంపిణీదారుడు నిర్మాత శరత్ మరార్, పవన్ మ్యానేజర్ కలిసి తనకు 'కాటమరాయుడు' సినిమా రైట్స్ రాకుండా చేశారని ఆందోళనకు దిగారు.
రెండు రోజుల నుండి నిరాహారదీక్ష కూడా చేస్తున్నాడు. తనకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తానని చెబుతున్నాడు. ఒకవేళ ఇదే గనుక జరిగితే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా గనుక జరిగితే పవన్‌కు పంచ్ పడడం ఖాయం. ఈ విషయంలో పవన్ స్వయంగా కల్పించుకొని సమస్యను పరిష్కరిస్తే మంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘లవ్ చెయ్యాలా... వద్దా...’
ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ ఫేమ్ కార్తీక్, శ్వేతావర్మ హీరో హీరోయిన్లుగా జి.కె.సినిమాస్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం ‘లవ్ చెయ్యాలా...వద్దా.
TNN | Updated:
Jan 19, 2016, 06:13PM IST
ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ ఫేమ్ కార్తీక్ , శ్వేతావర్మ హీరో హీరోయిన్లుగా జి.కె.సినిమాస్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం ‘లవ్ చెయ్యాలా...వద్దా...’. ఎస్.నౌషద్ దర్శకత్వంలో జి.వి.రమణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం వైజాగ్ లో జరిగింది. సోగ్గాడే చిన్నినాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. చిత్ర నిర్మాత జి.వి.రమణ మాట్లాడుతూ - ''సినిమా మంచి రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్. మంచి లోకేషన్స్లో సినిమా షూటింగ్ చేశాం. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. కార్తీక్, శ్వేతావర్మ చక్కగా నటించారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తాం'' అన్నారు. కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ - ‘’రషెష్ చూశాను. చాలా సినిమా బాగా వచ్చింది. యూనిట్ సభ్యులందరికీ అబినందనలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. కార్తీక్, శ్వేతావర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో మ్యూజిక్ః గౌతమ్ ధ్యాని, కెమెరాః ప్రవీణ్, ఎడిటింగ్ః ఉద్ధవ్, నిర్మాతః జి.వి.రమణ, దర్శకత్వం: ఎస్.నౌషద్.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
First Published 5, Mar 2018, 3:57 PM IST
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
శ్రీదేవి సంతాప సభ ఫోటోస్
Recent Stories
| 0business
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ
| 2sports
|
Recommended byColombia
1. యంగ్ టైగర్ ఎన్టీఆర్
‘మచ్చల పులి ముఖంపై గాండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా? వేట కొడవలి చేతపట్టి యంగ్ టైగర్ శత్రువుల్ని ఊచకోత కోస్తూ ‘కంటపడితే కనికరిస్తానేమో.. ఎంటపట్టానా నరికేస్తా’ అని ఎన్టీఆర్ గాండ్రిస్తుంటే మాస్ ఆడియన్స్ కుర్చీల్లో కుర్చోవడం కష్టమే. ‘జై లవకుశ’ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించిన ఎన్టీఆర్ స్మాల్ గ్యాప్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఫ్యాక్షన్ నేపథ్యంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్లో అరవింద సమేతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘ఆది’ సినిమాలో ఆదికేశవరెడ్డిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ ఆ తరహా పాత్రలో చాలా ఏళ్ల తరువాత కనిపిస్తున్నారు. వీరరాఘవుడిగా సిక్స్ ప్యాక్లో దర్శనం ఇచ్చి ఫస్ట్లుక్తోటే సర్ ప్రైజ్ చేశాడు ఎన్టీఆర్.
2. త్రివిక్రమ్ శ్రీనివాస్
టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చానాళ్ల పాటు ముందు వరుసలోనే ఉన్నారు. అయితే ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత బాగా డౌన్ అయ్యారు త్రివిక్రమ్. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథ, మాటలు అందించి దర్శకుడిగా.. అతడు, జులాయి, అత్తారింటికి దారేది, అ..ఆ, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలతో సత్తా చాటారు. ఇక స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్తో సినిమా తీసేందుకు చాలా ఏళ్లు సమయం తీసుకుని ఎన్టీఆర్ కోసం కసితో తన శైలికి భిన్నంగా ‘అరవింద సమేత’ కథను తయారు చేశారు త్రివిక్రమ్. తన సినిమాల్లో రక్తపాతం, హింసలకు దూరంగా ఉండే త్రివిక్రమ్ ‘అరవింద సమేత’లో రక్తపుటేరులు పారిస్తున్నారు. టీజర్, ట్రైలర్లలో ఎన్టీఆర్తో ఊచకోత కోయిస్తూ.. అసలు సిసలు సీమ ఫ్యాక్షనిజం ఎలా ఉంటుందో శాంపిల్ చూపించాడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి మొదటిసారి పనిచేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
3. తమన్
నిన్న మొన్నటి వరకూ తమన్ మ్యూజిక్పై చాలా మందికి సందేహాలు ఉండేవి. అయితే ‘అరవింద సమేత’ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చి విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాడు తమన్. ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలు మ్యూజికల్ హిట్గా నిలిచాయి. ‘పెనిమిటి’,‘అనగనగనగా’, ‘ఏడపోయినాడో’, ‘రెడ్డి ఇక్కడ సూడు’ సాంగ్స్ సంగీత ప్రియల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. వీటిలో ‘రెడ్డి ఇక్కడ సూడు’ సాంగ్ మినహా.. మిగిలిన మూడు పాటలు కథలో భాగంగా ఎమోషన్స్ని క్యారీ చేసేలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు తమన్. ఇక తమన్ పాటకు ఎన్టీఆర్ ఆట తోడైతే రెడ్డిని చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు.
Also Read: Aravinda Sametha First Review
4. పూజా హెగ్డే
ఒక లైలా కోసం, ముకుందా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజా హెగ్డే.. దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో తనలోని గ్లామర్ యాంగిల్ని బయటపెట్టింది. ఈ చిత్రం హిట్ కావడంతో అమ్మడుకి ఎన్టీఆర్తో జోడీ కట్టే అవకాశం వచ్చింది. ఇక ‘అరవింద సమేత వీర రాఘవ’ టైటిల్ని బట్టి ఆమె రోల్కి ఉన్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీలో అరవిందగా కనువిందు చేసింది పూజా.
5. సునీల్ రీ ఎంట్రీ
కమెడియన్ నుండి హీరోగా ప్రమోట్ అయిన సునీల్ ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నీలాంబరి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కమెడియన్గా ఓ వెలుగు వెలిగిన సునీల్.. హీరోగా టర్న్ తీసుకున్న తరువాత ఒకటి రెండు హిట్లతో సరిపెట్టేశాడు. ఆ తరువాత వరుస ప్లాప్లు ఎదురు కావడంతో తన మిత్రుడు త్రివిక్రమ్ ద్వారా తిరిగి కమెడియన్గా ‘అరవింద సమేత’లో సందడి చేశారు.
ఈ ఐదు అంశాలతో పాటు.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో నిర్మించారు. ఈషా రెబ్బా అదనపు ఆకర్షణ కానుండగా.. ప్రతి నాయకుడిగా జగపతి బాబు, ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నాగబాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీఎస్ వినూద్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్, రామ్ లక్ష్మణ్ స్టంట్స్ ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి.
Aravindha Sametha: ‘అరవింద సమేత’ థియేట్రికల్ ట్రైలర్
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
రేప్ చేస్తామంటు బన్నీ ఫ్యాన్స్ ఆమెకు హెచ్చరికలు
Highlights
రేప్ చేస్తామంటు బన్నీ ఫ్యాన్స్ ఆమెకు హెచ్చరికలు
నా పేరు సూర్య మూవీ మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. మహానటి దెబ్బకు నా పేరు సూర్య కలెక్షన్లకు దెబ్బతిన్నాయి. తెలుగుతో పాటు అల్లు అర్జున్ కు మళయాలంలో కూడా మంచి క్రేజ్ ఉంది. నా పేరు సూర్య ఇక్కడి మాదిరిగానే యావరేజ్ రివ్యూలే వచ్చాయి.అపర్ణ ప్రశాంతి అనే ఓ జర్నలిస్ట్ రాసిన నెగిటివ్ రివ్యూ కారణంగా.. అక్కడి అభిమానులు అనేక మంది ఆమెను బెదిరిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టడం మొదలుపెట్టారు. రేప్ చేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
దీనిపై ప్రశాంతి ఇప్పటికే సైబర్ సెల్ కు కూడా ఫిర్యాదు చేసింది. నిజానికి కేరళలో దాదాపు అందరు రివ్యూ రైటర్ల మాదిరిగానే ఈమె రివ్యూ కూడా ఉంది. కానీ మహిళ కావడంతోనే ఈమెపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీన్ని హీరోలు కూడా ఖండించాల్సిన అవసరం కనిపిస్తోంది. నిజానికి రివ్యూలు ఓ వ్యక్తి అభిప్రాయం మాత్రమే. అవి సినిమా జయాపజయాలను నిర్ణయించలేవనే విషయం గతంలోనే నిరూపితం అయింది.
| 0business
|
Aug 13,2017
వడ్డీ రేట్లు తగ్గించిన ఇండియన్ బ్యాంకు
న్యూఢిల్లీ: పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను తగ్గించే విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు వరుస కడుతున్నాయ. భారతీయ స్టేట్ బ్యాంకుతో మొదలైన ఈ ప్రక్రియను తాజాగా ఇండియన్ బ్యాంక్ కూడా ఎత్తుకుంది. పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ఖాతాలో రూ. 50 లక్షల కంటే తక్కువ నగదు ఉంటే వడ్డీరేటును 4శాతం నుంచి 3.5శాతానికి తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది. 'పొదుపు ఖాతాల వడ్డీ రేట్లలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెడుతున్నాం.. సదరు ఖాతాల్లో రూ. 50లక్షల వరకు నగదు ఉంటే వడ్డీ రేటును 3.5 శాతానికి తగ్గిస్తున్నాం. రూ. 50లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే ఆ ఖాతాలకు వడ్డీరేటు యథావిథిగా 4 శాతం వడ్డీ ఉంటుంది' అని ఇండియన్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త వడ్డీరేట్లు ఈ నెల 16 నుంచి అమల్లోకొస్తాయని ఇండియన్ బ్యాంక్ పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
‘పరిమితి పెంపు
న్యూఢిల్లీ, నవంబరు 14: వేతనాల చెల్లింపులు, వ్యాపార లావా దేవీలు సజావుగా సాగేందుకుప్రభుత్వం తాజాగా కరెంటుఖాతా దారులకు కొన్ని సడలింపులు ప్రకటించింది. గతవారం పెద్ద నోట్ల చెలామణి రద్దును ప్రకటించిన ప్రభుత్వ నిర్ణయం వల్ల వ్యాపారరంగాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఎక్కువ శాతం ప్రభుత్వం కొత్తగా మైక్రో క్యాష్ మెషిన్లను దేశవ్యాప్తంగా ఏర్పా టుచేయాలని భావిస్తోంది. అంతేకాకుండా బ్యాంకులను లావా దేవీలు వినియోగఛార్జీను రద్దుచేయాలని ఆదేశించింది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులపై ఛార్జీలు వసూలు చేయవద్దని ఆదేశిం చినట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ మీడియాకు తెలిపారు. మూడునెలలకుపైగా కొనసాగుతున్న కరెంటుఖాతా లకు వారానికి గరిష్టంగా రూ.50వేలవరకూ విత్డ్రాచేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి ఇదేవిషయ మై లెక్కకు మించిన అభ్యర్ధనలు, విజ్ఞప్తులు వచ్చాయి. కార్మికులు ఉద్యోగులకు వేతనాలు పంపిణీచేయడం కూడా కష్టం అవుతోందని, చిల్లరఖర్చులకు కూడా విత్డ్రా సౌకర్యం లేదని అనేక ఉత్పత్తిసంస్థలు, వాణిజ్యసంస్థల నుంచి ఫిర్యాదు లు అందాయి. కరెంటుఖాతాలు ఉన్న బిజినెస్ సంస్థలకు వారంలో రూ.50వేల వరకూ విత్డ్రా చేసుకునేందుకు వీలు కల్పించామని దాస్వివరించారు. వాణిజ్యరంగాలు, పారిశ్రామిక రంగాల్లోనే ఎక్కువగా వాడకం ఖాతా (కరెంటుఖాతా)ను విని యోగిస్తారు. దీనిపై లావాదేవీలకు పరిమితులు ఉండవు. రోజు లో ఎన్ని లావాదేవీలైనాసరే నిర్వహించుకునే సదుపాయం ఉం టుంది. ముందురోజే ప్రభుత్వం విత్డ్రా పరిమితిని రెండువేల నుంచి 2500కు పెంచింది. వారంలో 20 వేల రూపాయల వరకూ గరిష్టపరిమితిని రూ.24వేలకు పొడిగించింది.
రోజు వారి బ్యాంకు ఖాతాల నుంచి పదివేల రూపాయలు విత్డ్రా అనేది తొలగించింది. ఎటిఎం విత్డ్రా పరిమితులు పెంచడంతో కొంత అలజడి తగ్గుతుందని అంచనా. పాతనోట్ల మార్పిడి విధానంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అత్యధికంగా భారతీయ స్టేట్బ్యాంకులో జమ అయ్యాయి. ఇప్పటివకూ బ్యాంకులో దేశవ్ప్తాంగా 75వేల 945 కోట్ల రూపాయలు పాతనోట్లు జమ అయినట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ఇవన్నీ కూడా కేవలం రూ.500నోట్లు, రూ.1000నోట్లు మాత్రమే. 165.78 లక్షల లావాదేవీల్లో ఈ మొత్తం జమఅయింది. అంతేకాకుండా బ్యాంకు పాతనోట్ల మార్పిడిద్వారా 3753 కోట్ల నోట్లు మార్పిడి చేసిందని వివరించారు. క్యాష్ విత్డ్రాలు కూడా 7705 కోట్లు గాఉన్నాయి.
103.09లక్షల లావాదేవీలు జరిగినట్లు అంచనా. మరో విచిత్రం ఏమంటే బ్యాంకులు ఎటిఎం లావాదేవీలను మెరుగుపరిచాయి. ఎటిఎంలలో కూడా రూ.2000నోట్లు సోమ వారం నుంచే పంపిణీచేస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా బ్యాంకింగ్ కరస్సాండెంట్లు కూడా నగదును రెట్టింపు సార్లు విత్డ్రా చేసుకోవచ్చు. 50 వేల వరకూ నగదును తమ వద్ద ఉంచుకునే వెసులుబాటును కల్పించారు. ఇప్పటివరకూ బ్యాం కుల్లో 18 కోట్ల లావాదేవీలు జరిగినట్లు కూడా ప్రకటించింది. మైక్రో ఏటిఎంల ఏర్పాటుద్వారా నగదు సమస్యను కొంత వరకూ తీర్చవచ్చని భావించినప్రభుత్వం రిజర్వుబ్యాంకు, జాతీ య చెల్లింపులసంస్థల సౌజన్యంతోదేశవ్యాప్తంగా మైక్రో ఏటిఎం లు ఏర్పాటుచేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు విభాగాలు, కేంద్రప్రభుత్వరంగ సంస్థలు కేవలం ఇ-పేమెంట్ విధానంలో మాత్రమే కొనసాగాలి. సోమవారం కొన్నిప్రాంతాల్లో గురునానక్ జయంతికారణంగా మూతపడ్డాయి.
ఎటిఎంలు మాత్రం పనిచేస్తు న్నాయి. పాతనోట్ల మార్పిడి, క్యాష్ డిపాజిట్కు, ఎటిఎంల ద్వారా డిపాజిట్, విత్డ్రాలకు బ్యాంకుల్లో ప్రత్యేకక్యూలు ఏర్పాటుఏసారు. సీనియర్ సిటిజన్లు, వికలాంగులైన వారికి ప్రత్యేక సేవలు అందిం చాలని ముందే మార్గదర్శకాలున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మైక్రో ఎటిఎంలు అంటే..! మైక్రో ఎటిఎంలు ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం చెపుతున్న ఈ కొత్త పరికరాలపై సర్వత్రా ఉత్కంఠనెలకొంటున్నది. ప్రస్తుతం నగదు సమస్యను తీర్చేందుకు మైక్రో ఎటిఎంలు ఏర్పాటు చేస్తా మని చెపుతున్నారు. గ్రామీణ, పట్టణప్రాంతాల్లోని ప్రజలకు ఈ సమస్య కొంతవరకూ తీరిపోతుంది. మైక్రో ఎటిఎంలులంటే పాయిట్ ఆఫ్ సేల్ పరికరాల కిందకే వస్తాయి. వాటిని ఎక్క డికైనా తీసుకెళ్లవచ్చు.
ఏబ్యాంకులో ఖాతా ఉన్నప్పటికీ కస్ట మర్లు ఈ పాయింట్ ఆఫ్ సేల్ సాయంతో డిపాజిట్లు, విత్డ్రా లు చేసుకోవచ్చు. అయితే మైక్రో ఎటిఎంలకు బయోమెట్రిక్ గుర్తింప ఉంటుంది. వయా ఆధార్ కార్డుసాయంతోనే నిర్వహిం చుకోవాలి. డెబిట్కార్డులు, రూపేకార్డులు, మొబైల్ఫోన్ నంబరు వంటివి కీలకం అవుతాయి. డిపాజిట్లు, విత్ డ్రాయల్స్, నిధుల బదిలీ వంటివి చేసుకోవచ్చు. ఇ-కెవైసి ఆధారంతో మైక్రోఏటిఎం విస్తృత సేవలందిస్తుందని బ్యాంకర్లు కూడా చెపుతున్నారు. ఇందుకు ప్రత్యేక మౌలికవనరులు ఏమి అవసరం లేదు. బ్యాంకింగ్ కరస్పాండెంట్, లేదా కిరాణా వాలాతో ఈ లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంటుంది.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
జనసేనకు జనసేనాని మాతృమూర్తి విరాళం
హైదరాబాద్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి సందర్శించి.. రూ. 4 లక్షల చెక్ను పార్టీ ఫండ్గా పవన్కు అందించారు.
| Updated:
Oct 30, 2018, 06:10PM IST
జనసేనకు జనసేనాని మాతృమూర్తి విరాళం
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి మంగళవారం నాడు తన కొడుకును చూడటానికి హైదరాబాద్లోని జనసేన కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా తన తల్లిని ఆప్యాయంగా పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. తల్లి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. కష్టసుఖాలను తల్లితో పంచుకున్నారు. పార్టీకోసం నూతనంగా ప్రారంభించిన పార్టీ కార్యాలయాన్ని చూపించారు పవన్. ఆప్యాయంగా తల్లితో మాట్లాడుతూ.. ఆనందంగా గడిపారు పవన్.
అనంతరం కొడుకు యోగ క్షేమాలను అడిగితెలుసుకున్న అంజనాదేవి.. జనసేన పార్టీ ఫండ్గా రూ. 4 లక్షల చెక్ను పవన్కు అందచేశారు. తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆనందంతో పొంగిపోయారు పవన్ కళ్యాణ్. ఆ చెక్ను పక్కనే ఉన్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కి చూపించి మురిసిపోయారు. ఇది తనకు, తన పార్టీకి చాలా విలువైన కానుక అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. చాలాసేపు తల్లితో ముచ్చటించిన తరువాత పవన్.. దగ్గరే ఉండే తన తల్లిని కారు ఎక్కించి ఇంటికి పంపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ‘మీ తల్లి అలనాటి అంజనాదేవి ఆనాడు ఆంజనేయుడిని కన్నది ఈనాడు ఆంజనేయుడి లాంటి ముగ్గురు బిడ్డలు కన్నది ఆ ముగ్గురూ చిరంజీవులే’ అంటే జనసైనికులు ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
| 0business
|
May 17,2018
కొత్తగా 500 కొలువులు: నెస్ డిజిటల్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: నెస్ డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థ హైదరాబాద్లో తమ సరికొత్త ప్రాంగణాన్ని ప్రారంభించింది. సమీకృత డిజిటల్ వేదికలను, ఎంటర్ప్రైజెస్ సాఫ్ట్వేర్ను అందించే నెస్ డిజిటల్ సంస్థ ఈ సంవత్సరం కొత్తగా 500 మందిని కొలువుల్లోకి తీసుకోనుందని ఆ సంస్థ అధ్యక్షుడు వినరు రాజ్యాధ్యక్ష తెలిపారు. గ్లోబల్ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ కోసం ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంలో 350 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని.. ఈ సంఖ్యను డిసెంబరు ముగింపు నాటికి రూ.850కి చేర్చనున్నట్టుగా ఆయన వివరించారు. తమకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 16 డెవలప్మెంట్ సెంటర్లు ఉండగా.. అందులో నాలుగు భారత్లోనే ఉన్నట్టుగా ఆయన వివరించారు. మంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో కలిపి మొత్తం 1800 ఉద్యోగులు సంస్థలో పని చేస్తున్నట్టుగా ఆయన వివరించారు. హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలోని డెవలప్మెంట్ సెంటర్లోకొత్తగా అందుబాటులోకి వస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్సీ, రోబోటిక్స్, ఎంఎల్ తదితర ప్లాట్ఫాంలపై అప్లికేషన్ డెవలప్మెంట్ కార్యకలాపాలు నిర్వహించనున్నట్టుగా ఆయన తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
DHONI
కీపర్గా ధోనీ ఘనత
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ధోని ఒకడు.వికెట్ల వెనుకాల పాదరసం కంటే అత్యంతవేగంగా కదలగలడు.అలాంటి ధోని ఓ అరుదైన రికార్డుని అందుకున్నాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో వంద మందిని ఔట్ చేసిన వికెట్ కీపర్గా అరుదైన ఘనత పొందాడు.ఫిరోజ్ షా కోట్ల వేదికగాఢిల్లీ డేర్ డెవిల్స్తో మ్యాచ్ జరిగింది.ఉనాద్కత్ బౌలింగ్లో శ్రేయాస్ అయ్యర్ను ఔట్ చేయడం ద్వారా ధోని ఈ ఘనత సాధించాడు.శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ పట్టిన అనంతరం ధోఇ వంద వికెట్లు సాధించినట్లైంది.35 సంవత్సరాల ధోని 156 ఐపిఎల్ మ్యాచ్ల్లో 71 మ్యాచ్లు,29 స్టంపింగ్స్ చేశాడు.ఇదిలా ఉంటే ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ధోని మరోసారి తన సత్తా కనబరిచాడు.
డేనియల్ క్రిస్టియన్ బౌలింగ్లో మర్లోస్శామ్యూల్స్ ఆడిన బంతిని ఒంటి చేతితో ధోని అందుకున్నాడు.దీంతో దూకుడుగా ఆడుతున్న శామ్యూల్స్ 14వ ఓవర్లో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాలుగవ వికెట్గా పెవిలియన్కు చేరాడు. ఆ తరువాత కొద్దిసేపటికి కోరే అండర్సన్ను రెప్పపాటులో స్టంపౌట్ చేసి పెవిలియన్కు పంపాడు.వాష్టింగ్టన్ సుందర్ బౌలింగ్లో కొంత ముందుకొచ్చి ఆడిన అండర్సన్,క్రీజులో కాలు మోపే లోపే ధోని వికట్లను పడగొట్టాడు.దీంతో థర్డ్ అంపైర్ రివ్యూలో ఔట్ అని తేల్చడంతో అందర్సన్ నిరాశ గా వెనుదిరిగాడు.ఐపిఎల్లో వంద మందిని ఔట్ చేసిన ఘనత ధోని కంటే ముందు ప్రస్తుతం గుజరాత్ లయన్స్ జట్టు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సాధించాడు.
ఐపిఎల్లో ఒక్క చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున ధోని 129 మ్యాచ్లాడాడు.గత సీజన్ నుంచి పుణే రైజింగ్ సూపర్ జెయింట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.స్పాట్ ఫిక్సింగ్ ఆరో పణల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్తో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండు సంవ త్సరాల పాటు నిషేదం విధించిన సంగతి తెలిసిందే.
| 2sports
|
Bangalore, First Published 6, Sep 2019, 8:53 PM IST
Highlights
ప్రో కబడ్డీ లీగ్ 2019 లో పాట్నా పైరేట్స్ మరో ఓటమిని చవిచూసింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టడియంలో జరిగిన మ్యాచ్ లో యూపి యోదాస్ ఘన విజయం సాధించింది.
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో పాట్నా పైరేట్స్ మరో ఓటమిని చవిచూసింది. యూపీ యోదాస్ తో జరిగిన మ్యాచ్ లో పైరేట్స్ 12 పాయింట్ల తేడాతో పరాజయం పాలయ్యింది. పైరేట్స్ స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో రాణించినా జట్టును గెలిపించుకోలేకపోయాడు. ఇలా అతడి ఒంటరి పోరాటం వృధా అయ్యింది. యూపీ ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో విజయం సాధ్యమయ్యింది.
ఈ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతూ పైరేట్స్ జట్టు పాయింట్స్ టేబుల్ చివరన నిలిచింది. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో అయినా ఆ జట్టుకు కలిసొస్తుందనుకుంటే అలా కూడా జరగలేదు. ఆ జట్టులోని ఆటగాళ్లు సమిష్టిగా పోరాడకుండా ఏ ఒక్కరికో ఆ బాధ్యతను అప్పగిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ప్రదీప్ నర్వాల్ ఆ ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.
పైరేట్స్ జట్టు రైడింగ్ లో 19, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 2 ఇలా కేవలం 29 పాయింట్లు మాత్రమే సాధించింది. ఆటగాళ్లలో ప్రదీప్ నర్వాల ఒక్కడే 14 పాయింట్లతో చెలరేగగా వికాస్ 3, మను3, హదీ 3 పాయింట్లు సాధించారు. మిగతా ఆటగాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు.
మ్యాచ్ విన్నర్ యూపీ యోదాస్ విషయానికి వస్తే శ్రీకాంత్ జాదవ్ 10, సురేందర్ గిల్ 7, నితేశ్ 5, అంకుశ్ 4 పాయింట్లతో ఆకట్టుకున్నారు. అలాగే అశు 3, అమిత్ 2, రిశాంక్ 2 పాయింట్లతో యూపీ గెలుపుతో తమవంతు పాత్ర పోషించారు. ఇలా యూపీ రైడింగ్ లో 20, ట్యాకిల్స్ లో 14, ఆలౌట్ల ద్వారా 6, ఎక్స్ట్రాల రూపంలో 1 ఇలా మొత్తం 41 పాయింట్లను అందుకుంది. మొత్తంగా 41-29 పాయింట్ల తేడాతో యోదాస్ టీం పైరేట్స్ ని మట్టికరిపించింది.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆసీస్ గడ్డపై ‘సిరీస్’ భారత్కి అందని ద్రాక్ష..!
1999-2000లో మూడు టెస్టుల సిరీస్ ఆడిన భారత్ జట్టు 0-3 తేడాతో క్లీన్స్వీప్నకి గురైంది. ఆ తర్వాత 2003-04లో నాలుగు టెస్టుల సిరీస్ని 1-1తో డ్రాగా ముగించింది.
Samayam Telugu | Updated:
Dec 5, 2018, 04:48PM IST
ఆస్ట్రేలియా గడ్డపై సుదీర్ఘకాలంగా పర్యటిస్తున్న భారత్ జట్టుకి ‘టెస్టు సిరీస్’ ఓ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఇప్పటి వరకు ఆ గడ్డపై 11 సార్లు పర్యటించిన టీమిండియా.. కనీసం ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 2014-15లో విరాట్ కోహ్లి అసాధారణరీతిలో చెలరేగి 4 శతకాలు బాదడంతో పాటు 692 పరుగులు చేసినా.. భారత్ జట్టుకి నాలుగు టెస్టుల సిరీస్లో 0-2 తేడాతో ఓటమి తప్పలేదు. దీంతో.. కనీసం తాజా పర్యటనలోనైనా ఆ నిరీక్షణకి తెరదించాలని భారత్ ఆశిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం ఉదయం 5.30 గంటల నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు దశాబ్దాలుగా భారత్ పర్యటన చరిత్ర, ఫలితాలను ఓసారి పరిశీలిస్తే..! 1999-2000లో మూడు టెస్టుల సిరీస్ ఆడిన భారత్ జట్టు 0-3 తేడాతో క్లీన్స్వీప్నకి గురైంది. ఆ తర్వాత 2003-04లో నాలుగు టెస్టుల సిరీస్ని 1-1తో డ్రాగా ముగించింది. అనంతరం 2007-08లో నాలుగు టెస్టుల సిరీస్లో తలపడి.. 1-2తో ఓడింది. ఇక 20011-12లో అయితే మరీ ఘోరంగా పరాజయాల్ని చవిచూసింది. నాలుగు టెస్టుల ఆ సిరీస్లో 0-4తో వైట్వాష్కి గురైంది. ఆఖరిగా 2014-15లో రెండు మ్యాచ్ల్ని డ్రాగా ముగించినా.. 0-2తో ఓటమి మాత్రం తప్పలేదు.
| 2sports
|
Mar 15,2017
మూడేండ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ) మూడేండ్ల గరిష్టానికి ఎగిసింది. ఈ ఏడాది జనవరిలో 5.25శాతం నమోదు కాగా ఫిబ్రవరిలో 6.55 శాతానికి చేరింది. ఆహార పదార్థాలు, అయిల్ ధరలు అంతకంతకు పెరగడంతో ద్రవ్యోల్బణ్యానికి ఆజ్యం పోశాయి. దీనికితోడు తయారీ ఉత్పత్తులలో క్షీణత చోటు చేసుకుంది. ఫిబ్రవరి నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5శాతానికి ఎగబాకింది. కాగా జనవరి నెలలో ఇది 1.3శాతంగా ఉంది. ఫలితంగా పండ్లు, డ్రైప్రుట్స్ ప్రియం అయ్యాయి. కూరగాయలు ధరలు వరుసగా పడిపోయాయి. ఫిబ్రవరి నెలకు కూరగాయల ధరలు దిగిరావడంతో 32.3శాతం నుంచి 8శాతానికి చేరింది. పప్పు ధాన్యాలు 0.8శాతం తగ్గి 6.2శాతంగా నమోదు అయ్యింది. ఆహారేతర వస్తువులు ద్రవ్యోల్బణం 2శాతం నుంచి 6.5శాతంగా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ మంగళవారం గణాంకాలు విడుదల చేసింది. ఇక అయిల్ ధరలు జనవరిలో 18.1శాతం ఉండగా, ఫిబ్రవరిలో 21శాతానికి ఎగిసింది. తయారీ ఉత్పత్తులు ద్రవ్యోల్బణం 3.66శాతం నుంచి 3.99శాతానికి పడింది. ఫిబ్రవరిలో డాలరుతో మారకంలో రూపాయి మరింత బలపడడమే టోకు ద్రవ్యోల్బణం సూచీ 39 నెలల గరిష్టానికి చేరడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేశారు.
నాలుగు నెలల గరిష్టానికి రిటైల్ ...
ఫిబ్రవరి నెలకు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు భారీగా పెరిగింది. కాగా ఫిబ్రవరి నెలకు గానూ 3.65శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 3.17శాతంగా ఉంది. ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరి మాసానికిగాను 2.01శాతంగా నిలిచింది. గత నెలలో ఇది 0.61శాతంగా నమోదు అయ్యింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
3 కోట్ల మంది విద్యార్థులకు ఉచిత వైఫై!
- సర్కారు ముందు రిలయన్స్ జియో ప్రతిపాదన
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో వీలైనంత గరిష్ట స్థాయిలో తన విస్తృతిని పెంచుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా సంస్థ ఇటీవలే తక్కువ ఆదాయ వర్గాల వారికి దగ్గరయ్యేందుకు గాను 4జీ ఆధారిత ఫీచర్ ఫోన్ను అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. తాజాగా ఆ సంస్థ విద్యార్థి లోకాన్ని టార్గెట్గా చేసుకొని యువతలో విస్తరించాలని యోచిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ సంస్థ దేశ వ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మంది విద్యార్థులకు ఉచితంగా వై-ఫై సేవలను దగ్గర చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి రిలయన్స్ జియో సంస్థ ఇప్పటికే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు (హెచ్ఆర్డీ) ఒక ప్రతిపాదన పంపినట్టుగా హిందుస్థాన్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. దేశ వ్యాప్తంగా దాదాపు 38,000 కళాశాలల్లో వై-ఫై సేవలను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్టుగా సంస్థ సర్కారు వర్గాలకు తెలియ జేసింది. అయితే ఈ సేవలను ఉచితంగానే అందించేందుకు రిలయన్స్ జియో సంస్థ ముందుకు వచ్చినప్పటికీ.. ఇతర పోటీ సంస్థలకు కూడా తగిన అవకాశం కల్పించకుండా తాము అంబానీ సంస్థ ప్రతిపాదనకు జైకొట్టే ఆలోచనలో లేమని ప్రభుత్వ వర్గాలకు చెందిన అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో మరింత పారదర్శకత కోసం టెండర్లను పిలవనున్నట్టుగా అధికారులు చెబుతున్నట్టు సమాచారం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
రేపటి నుంచి గోల్డన్ జూబ్లీ వేడుకలు..
- ఐసీఏఐ సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ వెల్లడి
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఆర్సీ ఆఫ్ ఐసీఏఐ) గోల్డెన్ జూబ్లీ వేడుకలు రేపటి నుంచి (31వ తేదీ నుంచి) మూడు రోజుల పాటు హైదరాబాద్లో జరుగనున్నాయి. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐఆర్సీ చైర్మెన్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, హైదరాబాద్ బ్రాంచ్ చైర్మెన్ మండవ సునిల్ కుమార్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో గోల్డెన్ జూబ్లీ వేడుకల విశేషాలను వివరించారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. 31వ తేదీ ప్రారంభ వేడుకలలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీలు పాల్గొననున్నట్టుగా వివరించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)అధ్యక్షులు సీఏ నవీన్ గుప్తా అధ్యక్షతన జరిగే వేడుకల్లో అధ్యయన పేరిట పలు సదస్సులు నిర్వహించనున్నట్టుగా వారు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 3500 మంది ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరు కానున్నట్టుగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఐ కార్యదర్శి చిన మస్తాన్ తలకాయల, సభ్యులు రితే మిట్టల్, మండవ సునిల్ కుమార్, మేనేజింగ్ కమిటీ సభ్యులు సీఏ కట్టా రామచంద్రారెడ్డి, ఎస్ఐఆర్సీ టెక్నికల్ జాయింట్ డైరెక్టర్ టి. పరమ శివన్ పాల్గొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyd Internet 94 Views sachin and brett lee
sachin and brett lee
త్రివేండ్రంః మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై తనకున్న అభిమానాన్ని ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టర్ బ్రెట్ లీ మరోసారి బయటపెట్టాడు. సచిన్, తాను కలసి ఎన్నో మ్యాచుల్లో ఆడామని… తన బౌలింగ్ లో సచిన్ టెండూల్కర్ బౌల్డ్ అయ్యే సమయంలో బంతి వికెట్లకు తగిలే శబ్దం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఆ శబ్దాన్ని తాను ఎంతో ఆస్వాదించేవాడినని తెలిపాడు. సచిన్ ఓ అద్భుతమైన క్రికెటర్ అని కొనియాడాడు. వినికిడి లోపం గల పిల్లల కోసం కేరళ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పిల్లల్ని ఉత్సాహపరిచేలా బ్రెట్ లీ మాట్లాడాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ కు బ్రెట్ లీ వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో 310, వన్డేల్లో 380 వికెట్లను లీ పడగొట్టాడు.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
400 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు ఆదిలోనే నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు చైనా దిగుమతులపై సుంకాలు విధించేందుకు నిర్ణయించడంతో భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది
TNN | Updated:
Mar 23, 2018, 11:50AM IST
* యూఎస్-చైనా ట్రేడ్ వారే కారణం!
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు ఆదిలోనే నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు చైనా దిగుమతులపై సుంకాలు విధించేందుకు నిర్ణయించడంతో భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ప్రారంభంలోనే సెన్సెక్స్ 400 పాయింట్లు నష్టపోయింది. మరో వైపు నిఫ్టీ సైతం 10వేల దిగువ స్థాయికి దిగజారింది. 2018 సంవత్సరంలో నిఫ్టీ సూచి 10వేల కంటే తక్కువకు పడిపోవడం ఇదే తొలిసారి.
భారీగా నష్టపోయిన మార్కెట్లు
10.22 గంటలకు సెన్సెక్స్ 406 పాయింట్లు కోల్పోయి 32,600 వద్ద ట్రేడవుతుండగా, మరో సూచీ నిఫ్టీ 129 పాయింట్లు దిగజారి 9986 వద్ద స్థిరపడింది.
| 1entertainment
|
Suresh 190 Views
లాభాలతో ప్రారంభం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభ అయ్యాయ. సెన్సెక్స్200 పాయింట్లు, నిఫ్టీ: 50 పాయింట్లుకు పైగా లాభాల్లా ట్రేడింగ్ జరుగుతోందిముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభ అయ్యాయ. సెన్సెక్స్200 పాయింట్లు, నిఫ్టీ: 50 పాయింట్లుకు పైగా లాభాల్లా ట్రేడింగ్ జరుగుతోంది
| 1entertainment
|
Feb 21,2018
రుణ ఎగవేతలు పెరిగాయి
న్యూఢిల్లీ : గత నాలుగేండ్ల కాలంలో ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాల్ని ఎగవేయటం పెరిగిపోయింది. ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకునే తీసుకుంటే, 8 నెలల కాలంలో ఉద్దేశకపూర్వక భారీ రుణ ఎగవేతలు (రూ.25లక్షలకుపైన రుణం తీసుకున్న కేసులు) రూ.11,400 కోట్ల నుంచి 14,593కోట్లకు పెరిగింది. కేవలం 8నెలల కాలంలో 23 శాతం రుణాల ఎగవేత పెరిగింది. ఈ నాలుగేండ్లలో పీఎన్బీ రుణ ఎగవేతలు 95 శాతం వృద్ధి చెందాయి. మొత్తం జాతీయ బ్యాంకుల్లో ఉద్దేశపూర్వక ఎగవేతల మొత్తం ప్రతీ ఏటా 41 శాతం వృద్ధి చెందుతోంది. 'సిబిల్' విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ప్రతీ ఏటా బ్యాంకింగ్ రంగంలోని ఆర్థిక మోసాల్ని ఇది ప్రతిబింబింస్తోంది. బడా రుణ ఎగవేతదారుల దెబ్బకు జాతీయ బ్యాంకులు విలవిల్లాడుతున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రంలోని మోడీ సర్కార్కు చీమ కుట్టినట్టయినా లేదు.
ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాల్ని ఎగవేయటం పెరుగుతోందన్న విషయం పాలకుల్ని ఏమాత్రమూ ఆందోళనకు గురిచేయటం లేదు. కాబట్టే నియంత్రణగానీ, అడ్డుకునే చర్యలుగానీ చేపట్టడం లేదు. 'నీరవ్ మోడీ' ఉదంతం తర్వాత ప్రభుత్వ బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఒక కుట్రపూరిత ఆలోచనతో కావాలనే (ఉద్దేశపూర్వక ఎగవేతలు) బ్యాంకు రుణాలు ఎగ్గొట్టడం పెరిగిపోయింది.
నోటీసులు జారీ చేశారు..అయితే ఏంటి ?
భారత ఆర్థిక వ్యవస్థ ఎంతవేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతేవేగంగా ఆర్థిక మోసాలూ పెరుగుతున్నాయి. బ్యాంకుల వద్ద 2013, సెప్టెంబర్నాటికి ఉద్దేశపూర్వక ఎగవేతలు రూ.28,416 కోట్లు ఉంటే, 2017, సెప్టెంబర్ నాటికి రుణ ఎగవేతలు రూ.లక్షా 11వేల కోట్లకు చేరుకుంది. రూ.25లక్షలకు పైన రుణాలు పొంది ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన ఖాతాల్ని 'సిబిల్' పరిగణలోకి తీసుకొని ఈ గణాంకాల్ని విడుదల చేసింది. వీటన్నింటిపైనా బ్యాంకులు న్యాయపరమైన చర్యల్ని చేపట్టాయని సిబిల్ తెలిపింది. సంబధిత రుణ ఎగవేతదారులకు నోటీసులు జారీ చేశారు. కానీ ఏం లాభం, రుణాల్ని బ్యాంకులు వసూలు చేసుకోలేకపోతున్నాయి. గత నాలుగేండ్లలో అన్ని జాతీయ బ్యాంకుల్లోని రుణ ఎగవేతల ఖాతాల సంఖ్య 58.7 శాతానికి పెరిగిందని సిబిల్ హెచ్చరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), దాని అనుబంధ బ్యాంకుల్లో రుణ ఎగవేతలు ప్రతి ఏటా 25.07 శాతం పెరిగాయి. అదే ప్రైవేట్ బ్యాంకుల విషయంలో 25.67 శాతం నమోదైంది. ఇక దేశంలోని విదేశీ బ్యాంకులకు రుణాల ఎగవేత బెడద పెద్దగా లేదనే చెప్పాలి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 2, Oct 2019, 4:54 PM IST
Highlights
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి, మ్యానేజర్ రంగోలీ తనపై జరిగిన యాసిడ్ దాడి గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. యాసిడ్ దాడి జరగక ముందు ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే షాకవ్వాల్సిందే.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్ గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇండస్ట్రీ వారసత్వం మీద తన చెల్లెలితో కలిసి కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఎవరైనా తన జోలికి కానీ తన చెల్లెలి జోలికి కానీ వస్తే అసలు ఊరుకోదు. మంగళవారం నాడు తన చిన్ననాటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు రంగోలీ.
దానికి నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా రంగోలీ వారికి థాంక్స్ చెబుతూ తాను కాలేజ్ లో దిగిన ఫోటోని కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె ఎంతో అందంగా ఉంది. దీంతో నెటిజన్లు ఎన్నో కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన జీవితంలో చోటుచేసుకున్న ఓ సంఘటన గురించి రంగోలీ నెటిజన్లతో పంచుకున్నారు.
డెహ్రాడూన్ లో ఉత్తరాంచల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో ప్రేమ పేరుతో ఒక వ్యక్తి తనను టార్చర్ చేసి.. లీటర్ యాసిడ్ తనపై పోశాడని.. దీంతో తన ఎడమ వైపు ముఖం, చెవి, బ్రెస్ట్ మొత్తం కాలిపోయాయని చెప్పింది. ఐదేళ్ల పాటు 54 సర్జరీలు చేయించుకున్న తర్వాత తన ముఖం ఇలా మారిందని.. అదే సమయంలో తన సోదరి కంగనను కూడా చావగొట్టారని తనని చంపేసేవారని ఆవేదన వ్యక్తం చేసింది.
తన తల్లిదండ్రులు అందమైన, తెలివైన ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వడమే దీనికి కారణమని ఎమోషనల్ అయింది. ఇప్పటికీ ప్రపంచం ఆడపిల్ల పుట్టుకతో సంతోషంగా లేదుని.. అలాంటి ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాడి మన ఆడపిల్లలను కాపాడుకునే సమయం వచ్చిందని.. తనపై యాసిడ్ దాడి జరిగాక జీవితంపై ఆశలు వదులుకున్నానని చెప్పింది. ఆ సమయంలో తన స్నేహితుడు గాయాలను శుభ్రం చేసి ఐదేళ్ల పాటు తనకు సర్జరీలు జరిగిన ప్రతీసారి ఆపరేషన్ థియేటర్ బయటే పడిగాపులు కాసాడని.. అతనే ఇప్పుడు తన భర్త అని చెప్పింది.
తన భర్త, సోదరి, తల్లిదండ్రులు మరోసారి తన జీవితానికి ప్రాణం పోశారని చెప్పింది. ఇప్పటికీ తను ఈ యాసిడ్ దాడి కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పింది. బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. తనపై ఈ దాడి చేసినవాడికి శిక్ష పడేలా చేయాలని అనుకున్నట్లు కానీ తన సోదరి కంగనా అవేవీ పట్టించుకోవద్దని చెప్పి తనను మార్చే ప్రయత్నం చేసిందని చెప్పింది.
Last Updated 2, Oct 2019, 4:54 PM IST
| 0business
|
పోల్
అంతేకాదు.. తాను ఎలిమినేట్ అయ్యానని క్రుంగిపోవడం లేదని.. అసలు ఆట ఇప్పుడు మొదలైందంటోంది. ‘హిమజతో బిగ్ బాస్ గేమ్ అయ్యిందంటే.. నాతో నా జీవితం అనే గేమ్ ఆగలేదు. బిగ్ బాస్ హౌస్లో ఎంటరైనప్పుడు హిమజ వేరు.. ఇప్పుడు వెళ్తున్న హిమజ వేరు’ అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది హిమజ. ఇక బిగ్ బాస్ షోని ప్రసారం చేస్తున్న తీరుపైన, ఇంటి సభ్యులపైన ఓటింగ్ విధానంపైన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు హిమజ. ‘బిగ్ బాస్ హౌస్ జైలు లాంటిది కాదు.. జైలే. ఫోన్ లేకుండా.. ఎవరితో కాన్టాక్ట్ లేకుండా ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉంటానని అనుకోలేదు. నేను ఇన్ని రోజులు ఉండటమే గ్రేట్.
Read Also: బిగ్ బాస్ అన్ని ఎపిసోడ్లు.. ఇంట్రస్టింగ్ కథనాలు ఒక్క క్లిక్తో..
హిమజ బిగ్ బాస్
హీరో అవ్వాలన్నా.. విలన్ అవ్వాలనే స్క్రీన్ ప్లే అనేది కీ రోల్. బిగ్ బాస్ హౌస్లో వాళ్లు చూపించడాన్ని బట్టే ఎవరు హీరో.. ఎవరు విలన్ అనేది తేలిపోతుంది. వాస్తవం వేరు. అక్కడ ఏం జరుగుతుందో అదే చూపిస్తున్నారు కాని.. హిమజ సెల్ఫిష్ అని ముద్ర వేసేవాళ్లను కెమెరాలకు చూపించారు. మహేష్ ఎలిమినేషన్ అప్పుడు కూడా నేను కావాలని చేయలేదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో క్లారిటీ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది.
గ్రూప్లు ఫామ్ అయిపోయి బిగ్ బాస్నే ఆటాడిస్తున్నారు..
బిగ్ బాస్ హౌస్లో గ్రూప్లు ఉన్నాయి. కొంతమంది గ్రూప్లుగా ఉండి.. నామినేషన్ అప్పుడు మూకుమ్మడిగా తమకు ఇష్టం లేనివాళ్లను బయటకు పంపిస్తున్నారు. నేను రిజర్వ్డ్గానే ఉన్నాను.
బిగ్ బాస్ వాళ్లకు ముందే కండిషన్ పెట్టా..
బిగ్ బాస్ సీజన్ 3 ఒక్కటే కాదు.. సీజన్ 1, సీజన్ 2లకు కూడా నన్ను రమ్మని పిలిచారు. కాని నేను పెట్టిన ఒకే ఒక్క కండిషన్. ఫుడ్ విషయంలో నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారా అని. ఒక్కొక్కరికీ ఒక్కో వీక్ నెస్ ఉంటుంది. నాకు ఫుడ్ సరిగా లేకపోతే ఉండలేను. అలాగని ఒకేసారి ఎక్కువగా తినేయలేను. మీరు గమనిస్తే నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్లినప్పటికంటే ఇప్పుడు బాగా తగ్గిపోయా. అంటే సరైన ఫుడ్ లేదు. ఎట్లా ఉన్నాలన్నా తినాలి.
హిమజ
నాలుగే కూరగాయలతో రెండు నెలలు..
బిగ్ బాస్ హౌస్కి మహా అయితే నాలుగు రకాల కూరగాయలు పంపిస్తారు. ఈ రెండు నెలలు పప్పు, బంగాళదుంపలే. ప్రతిరోజు అవే కూరలంటే చచ్చిపోయేవాళ్లం. ఏదో కడుపు నిండాలి కాబట్టి తినేవాళ్లం. మధ్య మధ్యలో ఇలా నేను ‘గుడ్డులో బెడ్డు’, ‘గోదుమ అట్లు’ ట్రై చేసేదాన్ని.
శ్రీముఖితో మొదట్లో బాగానే ఉన్నా..
హౌస్లో ఉన్న వాళ్లలో అందరూ స్క్రీన్ కోసం నటించేవాళ్లు. వాళ్లలో జ్యోతి, శ్రీముఖి కాస్త బెటర్. అందుకే వాళ్లతో ఉండేదాన్ని. కిచెన్లో శ్రీముఖితో ఉండేదాన్ని. మూడ్ స్వింగ్స్ అందరికీ ఉంటుంది. కాకపోతే బిగ్ బాస్ చేస్తున్న స్క్రీన్ ప్లే మాయతో మూడ్ స్వింగ్స్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు.
ఎవర్ని సేవ్ చేయాలి? ఎవర్ని నామినేట్ డిసైడ్ చేసేది బిగ్ బాస్..
కంటెస్టెంట్స్లో ఎవర్ని సేవ్ చేయాలి? ఎవర్ని నామినేట్ చేయాలి అన్నది బిగ్ బాస్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటున్నాయి. బిగ్ బాస్ వాళ్లు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో అది ఎవరిదగ్గర ఉందో వాళ్లను సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. నాకోసం కూడా చేశారు. అది కాదనను.
బిగ్ బాస్ మాతో ఆడలాడు.. ఆడియన్స్తో కాదు
బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులు గేమ్లో ఇన్వాల్వ్ అయ్యి.. నా ఫేవరేట్ కంటెస్టెంట్కి ఓటు వేయడం మరిచిపోతానేమో అని తపనతో ఓట్లు వేస్తున్నారు. కాని బిగ్ బాస్ ఆడియన్స్తో గేమ్స్ ఆడుతున్నారు. కొంతమందిని నామినేషన్స్కి రాకుండానే సేవ్ చేసి కాపాడుతున్నారు బిగ్ బాస్.
Read Also: ‘బిగ్ బాస్’ బోసిపోతోంది.. ఆటాడే వాళ్లు బయటకు, నెట్టికొచ్చేవాళ్లు ఇంట్లోనే!
రమ్యక్రిష్ణ హోస్ట్గా వచ్చిన వీక్లో నామినేషన్ చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. బురదను నెత్తిపై నుండి వేసుకోవాలన్నారు. మళ్లీ అందులో ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకోవచ్చన్నారు. ఆరుగును నామినేట్ అయితే అందులో ముగ్గుర్ని సేవ్ చేసేశారు. అది బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి. సరే ముగ్గురికి సీక్రెట్ టాస్క్లు ఇచ్చారు. ఇంతా ప్రాసెస్ చేసి.. ముగ్గురు నామినేషన్లో ఉన్నట్టుగా ప్రకటించి సోమవారం నాడు ఓటింగ్ ప్రాసెస్ మొదలుపెట్టేశారు.
దీంతో జనాలు పిచ్చిగా ఓట్లు వేయడం మొదలు పెట్టేశారు. తీరా అంతా కష్టపడి ఆడియన్స్ ఓట్లు వేస్తే.. రమ్యక్రిష్ణ వచ్చిన వీక్లో నో ఎలిమినేషన్ అనేశారు. ఆ వారం నేను, పునర్నవి, మహేష్లు నామినేషన్లో ఉన్నాం. బిగ్ బాస్ గేమ్లు ఆడితే మాతో ఆడాలి. జనాల ఎమోషన్లో ఎందుకు ఆడాలి. మీరు నామినేషన్ ప్రక్రియ అంతా చేసి చివర్లో నో నామినేషన్ అంటే మరి ఓట్లు వేసిన జనం ఏమవ్వాలి? వాళ్ల ఎమోషన్స్లో ఎందుకు ఆడుకోవాలి? నిజంగానే ఆవారం నామినేషన్ ఉండదని నిర్ణయించుకున్నప్పుడు ఓటింగ్ క్లోజ్ చేసేయాలి కదా.. వారం మొత్తం ఓట్లు వేయించుకుని చివర్లో నో ఎలిమినేషన్ అంటే షో చూసే ఆడియన్స్ అభిప్రాయానికి విలువ ఇచ్చినట్టు అవుతుందా? వాళ్లు విసుగు చెంది ఓట్లు వేయడం మానేస్తే ఏం కావాలి? ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకూడదని నా అభిప్రాయం.
బిగ్ బాస్ ఫెయిర్గా లేదు..
బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తరువాత నాకు మళ్లీ అక్కడకు వెళ్లే అవకాశం ఇచ్చినా వెళ్లను అని చెప్పేశా. కనిపించే కంటెస్టెంట్తో ఆట ఆడొచ్చు.. కనిపించని బిగ్ బాస్తో నేను ఆట ఆడలేను. ఆయన్ని ఓడించి ఎన్నిరోజులు ఉండగలం. తీరా గేమ్లో ఇన్వాల్వ్ అయిన తరువాత హౌస్లో ఉంచాలా? ఎలిమినేట్ చేయాలా అన్నది ఆయన ఇష్టమే. ఓటింగ్ లెక్కేలేదు. నామినేషన్ ఎవర్ని తీసుకురావాలన్నది కూడా బిగ్ బాస్దే ఫైనల్ నిర్ణయం. మనం ఎంత ఫెయిర్గా గేమ్ ఆడినా.. అసలు ఆట బిగ్ బాస్ ఆట ఆడేస్తున్నాడు.
హిమజ
| 0business
|
Hyderabad, First Published 9, Sep 2019, 3:44 PM IST
Highlights
విజయ్ దేవరకొండ, కియారా అడ్వాణీ బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మేబాజ్కు విజయ్, కియరా ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆ క్రేజ్ ని చాలా కంపనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. విజయ్ దేవరకొండని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొని తమ కంపనీ ఉత్పత్తులను సేల్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విజయ్ కొన్ని బ్రాండ్ లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో ఫ్యాషన్ బ్రాండ్ అతడి ఖాతాలోకి చేరింది.
అదే మేబాజ్ బట్టల బ్రాండ్. దీనికి విజయ్ తో పాటు కియారా అద్వానీ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. దీని యాడ్ షూట్ కోసం విజయ్ ముంబై వెళ్లాడు. అక్కడ ఈ జంటపై యాడ్ ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ జంటని చూసిన ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వీరి జంట చూడడానికి ముచ్చటగా ఉందని.. ఇద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలనుందంటూ తమ కోరికలను తెలియబరుస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నటించకపోయినా.. రీమేక్ల రూపంలో వీరి సినిమాలు వచ్చాయి. విజయ్ నటించిన 'అర్జు్న్రెడ్డి' సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్తో తెరకెక్కించారు.
ఇందులో కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించింది. మరి వచ్చే ఏడాదిలోనైనా వీరిద్దరూ కలిసి నటిస్తారేమో చూడాలి. ప్రస్తుతం విజయ్.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అలానే పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా.. కియారా బాలీవుడ్ లో 'లక్ష్మీ బాంబ్' అనే సినిమాలో నటిస్తోంది. అలానే ‘గుడ్ న్యూస్’, ‘షేర్షా’, ‘ఇందూ కీ జవానీ’ వంటి చిత్రాలలో నటిస్తోంది.
Last Updated 9, Sep 2019, 3:44 PM IST
| 0business
|
internet vaartha 174 Views
న్యూఢిల్లీ : టాటాపవర్, తోషిబా, కార్గిల్ కంపెనీలు సంయుక్తంగా కొత్త విద్యుత్ సబ్స్టేషన్లను రూపొందించాయి. అతిచిన్నసైజులో, స్థలాభావం సమస్య లేకుండా ప్యాడ్పై అమర్చే విధంగా ఉన్న ఈ సబ్స్టేషన్ ఖర్చుపరంగాకూడా ఎంతోఆదాచేస్తుందని టాటాపవర్ ప్రకటించింది. పర్యావరణ సమతుల్యత ను కాపాడుతూ 70శాతం స్థలసమస్యను పొదుపుచేస్తుందని టాటా ప్రకటించింది. తోషిబా అండ్ కార్గిల్ కంపనీలు సంయుక్తంగా వీటిని డిజైన్ చేశాయి. భారత్లో మొట్టమొదటిసారి పోర్టబుల్ సిఎన్ఇ ఆధారిత ప్యాడ్మౌంట్ సబ్ స్టేషన్ను రూపొందించగలిగినట్లు మూడు కంపెనీలు సంయుక్తంగా ప్రకటించాయి.టాటాపవర్ ఎండి అనిల్సర్దానామాట్లాడుతూ టెక్నా లజీ సామర్ధ్యంపైఎంతో గర్వంగా ఉందని, విద్యుత్ రంగంలోని పంపిణీ ట్రాన్స్మిషన్ విభాగాల నిపుణుల సరికొత్తపరిశోధనలు అభివృద్ధి ఈకొత్త అతిచిన్న సబ్ స్టేషన్ తయారీకి నాంది పలికా యన్నారు. తోషిబా విద్యుత్ విభాగం సిఎండి డా.కత్సుతోషి తోడా మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞ్ఞానంతో అత్యాధునిక పోకడ లతో తోషిబా ఎల్లవేళలా ముందుంటుందన్నారు టాటాపవర్తో కలిసి పని చేయడంతో మరింత అధు నాతన సాంకేతిక ఉత్పత్తులు అందించగలుగుతామన్నారు. కార్గిల్ ఇండియా ఛైర్మన్ సిరాజ్ చౌదరి మాట్లాడుతూ పాడ్మౌంట్ సబ్స్టేషన్లు ఎక్కువగా అమెరికాలో వినియోగంలో ఉన్నాయని తెలిపారు టాటాపవర్ తాజాగా ఈకొత్త పోకడలను అమలుచేస్తోందని, సబ్స్టేషన్లలో స్థలసమస్యను అధిగమిం చేందుకు టాటా ఈకాంపాక్ట్ సబ్స్టేషన్ వినియోగిస్తుందన్నారు. టాటాపవర్, తోషిబా, కార్గిల్ ఎఫ్ఆర్3 సహజ ఈస్టర్ ఫ్లూయిడ్ టెక్నాలజీ ఈ కొత్తతరం సబ్స్టేషన్ల తయారీకి ఎంతో మేలుచేస్తుందన్నారు.
| 1entertainment
|
South Africa Team
దక్షిణాఫ్రికా భారీ విజయం
కేప్టౌన్: శ్రీలంకతో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా 282 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 507 పరుగలు టార్గెట్ను చేధించలేక 224 పరుగులకే ఆలౌటైంది.దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 392 పరుగులు చేయగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 110 పరుగులకే కుప్పకూలింది.రెండవ ఇన్నింగ్స్లో 224 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసి శ్రీలంక ముందు 507 పరుగుల టార్గెట్ను ఉంచింది.భారీ టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక 224 పరుగులకే ఆలౌటైంది.దక్షిణాఫ్రికా బౌలర్ రబడ మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు,రెండవ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్లో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది.మూడువ టెస్టు జనవరి 12 జోహన్నెస్బర్గ్లో ప్రారంభం కానుంది.
| 2sports
|
అమెజాన్ వెబ్సేవలు తెలంగాణలోనే..
-ఐటీ మంత్రి కేటీఆర్ ఆశాభావం
- త్వరలోనే రాష్ట్రానికి కంపెనీ బృందం
- పాలమూరులో సంస్థ గోదాములకు శంకుస్థాపన
కొత్తూరు (పాలమూరు): అమెజాన్ సంస్థ త్వరలోనే తమ క్లౌడ్ కంప్యూటింగ్ వెబ్ సేవలను తెలంగాణకు తీసుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) అన్నారు. సంస్థ హైదరాబాద్లో ఇప్పటికే డాటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పటిక,ీ తమ ఏడబ్ల్యూఎస్ సేవలను కూడా ఇక్కడ విస్తరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే తాము అమెజాన్ సంస్థకు పలు వినతులను పంపినట్లు ఆయన వివరించారు. బుధవారం ఇక్కడి అయిదేకరాల స్థలంలో నిర్మించనున్న అమెజాన్ సంస్థ గిడ్డంగుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అమెజాన్ సంస్థ ఇక్కడ క్లౌడ్ వెబ్ సేవల ఏర్పాటు విషయాన్ని అధ్యయనం చేసేందుకు గాను త్వరలోనే అమెరికా నుంచి ఒక ఉన్నత స్థాయి బృందం ఇక్కడికి రానున్నట్లు ఆయన వివరించారు. ఈ బృందం సెంటర్ ఏర్పాటు గురించి తప్పక ఒక మంచి వార్తను అందించగలదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కంపెనీ ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ అఖిల్ సక్సేనా మాట్లాడుతూ అమెరికా ఆవల హైదరాబాద్లో నిర్మించ తలపెట్టిన అతిపెద్ద క్యాంపస్ నిర్మాణపనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 10 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. అమెజాన్ సంస్థ దేశంలోనే అతిపెద్ద గిడ్డంగి సదుపాయాన్ని పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేయనుంది. దాదాపు 2.80 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నారు. దీంతో అమెజాన్ సంస్థకు భారత్లో మొత్తం 11 గిడ్డంగి సదుపాయాలు ఉన్నట్లు అవుతుందని కంపెనీ తెలిపింది.
చిన్న, మధ్య తరహా వ్యాపారులకు చేయూత..
తాము ఇక్కడ ఏర్పాటు చేస్తున్న గిడ్డంగి సదుపాయం మూలంగా స్థానిక చిన్న, మధ్య తరహా వ్యాపారులతో పాటు ఇక్కడి వ్యవసాయదారులకు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి మంచి వేదిక లభించినట్లు అవుతుందని సక్సేనా తెలిపారు. వెబ్లో వ్యాపార అవకాశాల గురించి వివరించేందుకు సంస్థ ఇక్కడి వారికి శిక్షణ తరగతులను కూడా నిర్వహించనుందని ఆయన వివరించారు.
త్వరలో హైదరాబాద్లో మొబైల్ ఫోన్ల తయారీ..
మైక్రోమాక్స్, చైనా మొబైల్స్ ఇక్విప్మెంట్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్లు నగర శివరా ప్రాంతాలలో తమ ప్లాంటులను తెరిచేందుకు గాను త్వరలోనే తమ ప్రతిపాదనలను అందజేయనున్నట్లు ఐటీ మంత్రి కేటీఆర్ ఇక్కడ వెల్లడించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
GST
20లక్షల బిజినెస్ సంస్థలు జిఎస్టి చెల్లింపు!
న్యూఢిల్లీ, ఆగస్టు 25: జిఎస్టి చట్టం అమలయిన తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 20 లక్షలకు పైగా బిజినెస్ సంస్థలు పన్నులు ఆన్లైన్లో చెలించినట్లు తేలింది. మరో 30ల్లకు పైగా సంస్థలు శుక్రవారం నాటి గడువులోపు చెల్లించే అవకాశం ఉందని జిఎస్టిఎన్ ఉన్నత అధికారి ఒకరు వెల్ల డించారు. జిఎస్టి నెట్వర్క్ కంపెనీ ట్యాక్స్్ రిట ర్నుల దాఖలు వ్యవస్థను పర్యవేక్షిస్తోంది ఐటి నెట్వర్క్ను రద్దీకి అనుగుణంగా మారుస్తున్నట్లు ఛైర్మన్నవీన్కుమార్ వెల్లడించారు. చివరినిమిషంలో రద్దీవల్ల జిఎస్టిఎన్ పోర్టల్ క్రాష్ అయింది. దీని వల్ల పన్ను రిటర్నులు దాఖలుకు గడువును మరో ఐదురోజులు పొడిగించింది.
మొత్తం 48 లక్షల పన్ను చెల్లింపుదారులు పోర్టల్లో విక్రయాల గణాం కాలను నిక్షిప్తంచేసారు. వీరిలో 20లక్షమందికిపైగా రిటర్నులు దాఖలుచేసి పనునలు చెల్లించినట్లు కుమార్ వెల్లడించారు. ఈనెల 21వ తేదీవరకూ 42వేల కోట్ల రూపాయల వరకూ పన్నులరూపంలో పదిలక్షల బిజినెస్ సంస్థలనుంచి వచ్చింది. సెంట్రల్ జిఎస్టి, స్టేట్ జిఎస్టి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి విలాసవంతమైన, ఉత్ప్రేరక వస్తువులపై సుంకం వంటివి ఈ జమ అయిన వాటిలో ఉన్నాయి. ఇప్పటివరకూ రోజుకు 20లక్షల మందివరకూ పన్నులు, రిటర్నులు దాఖలుచేస్తున్నట్లు తేలింది. వచ్చే రెండురోజుల్లో రిజిస్టరు అయిన 28 లక్షల మంది పన్నుచెల్లింపుదారులు తమతమ రిటర్నులు దాఖలుచేసి పన్నులు చెల్లిస్తారని చెపుతున్నారు. జిఎస్టిఆర్ 3బి విధానంలో డేటాను అప్లోడ్చేసి పన్నులు చెల్లించాలి. అలాగే నగదుచిట్టాను రూపొం దించాలి.
28లక్షలకుపైగా ఇప్పటికే డేటాను అప్ లోడ్ చేసినట్లు వివరించారు. ప్రభుత్వం ఈనెల 19వ తేదీ గడువును పొడిగించి 25వరకూ చేర్చిం ది. జిఎస్టి పోర్టల్లో ఎదురయిన సాంకేతిక లోపాలే ఇందుకుకారణం అయింది. అయినప్ప టికీ ప్రతిరోజూ ఒక చిన్నచిన్న సాంకేతిక సమస్య లు ఎదురవుతున్నాయి. ఇదంతా కేవలం జిఎస్టిఎన్కు ఎదురవుతున్న రద్దీయేనని తెలుస్తోంది. 19వ తేదీనాటికి 2.7 లక్షల రిట ర్నులు దాఖలయ్యాయి. పరోక్షపన్నుల్లో 72 లక్షల మదింపుదారులున్న వ్యవస్థలో జిఎస్టి నెట్వర్క్కు 50 లక్షల మంది వరకూ బదిలీ అయ్యారని జిఎస్టిఎన్ ఛైర్మన్ కుమార్ వెల్లడించారు. మొత్తం 15 లక్షల కొత్త రిజిస్ట్రేషన్లలో పదిలక్షలు వరకూ ఉన్నవి జూలై రిటర్నులు దాఖలు చేసినట్లు తేలింది. మొత్తం 60 లక్షల బిజినెస్లు దాఖలుచేసి జూలై నెల పన్నులు చెల్లించాయి.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కుప్పకూలిన లంక.. భారత టార్గెట్ 239
సొంతగడ్డపై చివరి వన్డేలోనూ లంకేయులు చతికిలపడ్డారు. కొలంబో వేదికగా ఆదివారం జరుగుతున్న చివరి వన్డేలో
TNN | Updated:
Sep 3, 2017, 07:13PM IST
సొంతగడ్డపై చివరి వన్డేలోనూ లంకేయులు చతికిలపడ్డారు. కొలంబో వేదికగా ఆదివారం జరుగుతున్న చివరి వన్డేలో భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (5/42) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.4 ఓవర్లలో 238 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో లాహిరు తిరుమానె (67: 102 బంతుల్లో 3x4, 1x6), మాథ్యూస్ (55: 98 బంతుల్లో 4x4), కెప్టెన్ ఉపుల్ తరంగ (48: 34 బంతుల్లో 9x4) నిలకడగా ఆడినా.. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. భువీతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా రెండు, కుల్దీప్ యాదవ్, చాహల్ చెరో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 4-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు వన్డేల సస్పెన్షన్‌కి గురై ఈ వన్డేతో పునరాగమనం చేసిన శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ డిక్వెల్లా (2), మునవీర (4) ఆదిలోనే నిరాశపరిచినా.. ఉపుల్ తరంగ దూకుడైన ఆటతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. అయితే జట్టు స్కోరు 60 వద్ద ఈ కెప్టెన్ ఔటవగా.. అనంతరం వచ్చిన మాథ్యూస్‌తో కలిసి తిరుమానె కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కి అబేధ్యంగా 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో శ్రీలంక మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. వీరిద్దరి ఔట్ అనంతరం ఏ దశలోనూ భారత్ బౌలర్ల ధాటికి లంకేయులు నిలవలేకపోయారు. ఒకానొక సమయంలో 185/4తో ఉన్న ఆ జట్టు.. చివరికి 238కే పరిమితమైంది.
| 2sports
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
ఏపీవైలో అత్యుత్తమ బ్యాంక్గా ఆంధ్రాబ్యాంక్
Sat 29 Apr 06:13:12.250649 2017
నవతెలంగాణ, వాణి జ్య విభాగం: కేంద్ర ప్రభు త్వం అందు బాటులోకి తెచ్చి న 'అటల్ పెన్షన్ యోజన' (ఏపీవై) అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబరి చినందుకు గాను ఆంధ్రా బ్యాంక్కు 'బెస్ట్
డొకోమో కేసులో టాటా సన్స్కు ఊరట
Sat 29 Apr 06:13:18.073443 2017
న్యూఢిల్లీ: ఎన్టీటీి డొకోమోతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు టాటా సన్స్కు చెందిన టాటా టెలికామ్కు అనుమతినిచ్చింది. మధ్యవర్తిత్వంను సమర్ధించడం ద్వారా ఈ
ఎస్ చాంద్ ఐపీవోకు అపూర్వ స్పందన
Sat 29 Apr 06:13:23.941683 2017
ముంబయి: పాఠ్యపుస్తకాల ప్రచురణ సంస్థ ఎస్ చాంద్ అండ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు ప్రాథమిక మార్కెట్లో అనూహ్యమైన స్పందన లభించింది. ఇష్యూకు చివరి రోజైన శుక్రవారం నాటికి ఇష్యూకు
30,000 దిగువకు సెన్సెక్స్
Sat 29 Apr 06:13:31.612164 2017
ముంబయి: మార్కెట్ సూచీలు ఆల్టైమ్ గరిష్ట స్థాయిలను చేరిన నేపథ్యంలో శుక్రవారం మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి
పన్ను ఎగవేతలు రూ.15,047 కోట్లు
Sat 29 Apr 01:39:29.670867 2017
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (2015-16లో) దాదాపు రూ.15,047 కోట్ల విలువైన సేవా పన్ను, ఎక్సైజ్ డ్యూటీలను అర్హులైన చెల్లింపుదారులు ఎగవేసినట్టుగా ఆర్థిక శాఖ
సామాన్యులకు రెక్కలు
Fri 28 Apr 07:07:56.942529 2017
న్యూఢిల్లీ: విమానయాన రంగం అభివృద్ధికి చొదక శక్తిగా మారనుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ వైమానిక అనుసంధానతను పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా
రాజన్ హయాంలోనే 'రద్దు' చర్చలు
Fri 28 Apr 07:07:48.47488 2017
న్యూఢిల్లీ: దేశంలో పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ గత ఏడాది మొదట్లోనే ప్రారంభమైనట్టు 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) గవర్నర్ ఊర్జిత్ పటేల్
మూడు రోజుల జోష్కు బ్రేక్!
Fri 28 Apr 07:08:09.690782 2017
ముంబయి: గత మూడు రోజులుగా పరుగులు పెట్టిన మార్కెట్ జోష్కు గురువారం బ్రేక్ పడింది. సూచీలు ఆలైటైమ్ గరిష్ట స్థాయిని చేరడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీనికి తోడు ఏ
వివో నుంచి మరో అత్యాధునిక సెల్ఫీఫోన్
Fri 28 Apr 07:08:20.8429 2017
న్యూఢిల్లీ: సెల్ఫీ కెమేరాల స్మార్ట్ ఫోన్లకు కెరాఫ్ అడ్రస్గా సంచలనం సృష్టి స్తున్న వివో మరో అడుగు ముం దుకేసింది. ఈసారి ఏకంగా 20 మెగా పిక్సెల్ (ఎంపీ) సెల్ఫీ కెమేరా ఫోన్
మార్కెట్లోకి 'డాక్టర్ కాపర్' బాటిళ్లు
Fri 28 Apr 07:08:29.033401 2017
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ సీసాల స్థానంలో మేటి ప్రజారోగ్యం కోసం ఎంఎస్ఆర్ ఇండియా సంస్థ మార్కెట్లోకి 'డాక్టర్ కాపర్' పేరుతో రాగి
రూపాయికే బంగారం: పేటీఎం
Fri 28 Apr 07:08:37.926646 2017
బెంగళూరు: ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ సంస్థ తమ వినియోగదా రులకు ఆక్షయ తృతీయ సందర్భంగా రూపాయికే బంగారాన్ని అందించనుం ది. ఇందుకుగానూ 'డిజిటల్ గోల్డ్' పథకాన్ని
లాభాల్లో దూసుకుపోయిన మారుతీ
Fri 28 Apr 07:03:23.297302 2017
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి మధ్య కాలంలో సంస్థ నికర లాభాల
సెన్సెక్స్ @30,000
Thu 27 Apr 06:50:51.704122 2017
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండు రోజూ రికార్డుల మోత మోగింది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల పవనాల నేపథ్యంలో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ఉరకలు
నిరాశపరచిన యాక్సిస్ బ్యాంక్ ఫలితాలు
Thu 27 Apr 06:50:58.459944 2017
ముంబయి: ప్రయివేటు రంగ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి మధ్య కాలంలో బ్యాంకు నికర
వ్యవసాయాదాయంపై పన్ను యోచన లేదు
Thu 27 Apr 06:51:07.784334 2017
న్యూఢిల్లీ: వ్యవసాయ ఆదాయంపై పన్ను వేసే యోచనేదీ తమ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. వ్యవసాయం వల్ల లభించే ఆదాయంపై పన్ను విధించే అ
మార్కెట్లలో ఏకీకృత లైసెన్స్ విధానం
Thu 27 Apr 06:51:14.790679 2017
ముంబయి: స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిర్వహించే బ్రోకర్లకు ఇకపై ఏకీకృత లైసెన్స్లను జారీ చేయాలని 'మార్కెట్ నియంత్రణ' సంస్థ సెబీ నిర్ణయించింది. బుధవారం ఇక్కడ సమావేశమైన
మూడేండ్లలో ప్లయింగ్ క్యాబ్లు: ఉబేర్
Thu 27 Apr 06:51:34.383939 2017
న్యూయార్క్: అంత ర్జాతీయంగా క్యాబ్ సేవలను విస్తరిస్తూ దూసుకుపోతున్న ఉబేర్ సంస్థ రానున్న రోజుల్లో ఎగిరే కార్లతో క్యాబ్ సేవలను అందించాలని యోచిస్తోంది. ఈ దిశగా కంపెనీ కార
బ్యాంకులు సర్కారుపై ఆధారపడొద్దు!
Wed 26 Apr 05:05:27.083661 2017
న్యూయార్క్, నవతెలంగాణ-వాణిజ్య విభాగం: భారత్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీల) విలీనం వల్ల దేశంలో బ్యాంకింగ్ రంగానికి మేలు జరుగుతుందని 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్బ
మార్కెట్లోకి వోక్స్వ్యాగన్ 'పోలో జీటీ స్పోర్ట్'
Wed 26 Apr 05:05:35.009366 2017
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ మార్కెట్లోకి మరో హ్యచ్బ్యాక్ వేరియంట్ను అందుబాటులోకి తెచ్చింది. 'పోలో జీటీ స్పోర్ట్' పేరుతో ఈ కొ
వాటాదారులకు 1:1 బోనస్: విప్రో
Wed 26 Apr 05:05:49.414393 2017
న్యూఢిల్లీ: దేశంలో మూడో అతిపెద్ద సాఫ్ట్వేర్ ఉత్పత్తుల సంస్థ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. మార్చితో ముగిసిన మూ
మెప్పించిన ఇండియన్ బ్యాంక్ ఫలితాలు
Wed 26 Apr 05:06:15.538085 2017
న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాంక్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి మధ్య కాలంలో ఇండియన్ బ్యాంకు నికర లాభం అనూహ్యంగా 2
ఆల్టైం గరిష్టానికి నిఫ్టీ..
Wed 26 Apr 05:06:40.091346 2017
ముంబయి: జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాల నేపథ్యంలో మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. 'నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ' (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ అయితే గతంలో
అందుబాటులోకి టీసీఎస్ 'మర్చంట్ పే'
Wed 26 Apr 05:06:51.83064 2017
ముంబయి: దేశంలో అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్థ 'టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్' (టీసీఎస్) మంగళవారం ఆధార్ ఆధారిత 'మర్చంట్ పే' సేవలను అందుబాటులోకి తెచ్చింది. 'మర్చంట్ పే' ఈ-వ్
మార్కెట్లో 'హెరిటేజ్'కు కొత్త రూపాలు
Tue 25 Apr 06:18:12.88439 2017
హెరిటేజ్ ఫుడ్స్ రానున్న అయిదేండ్ల కాలంలో తన రెవెన్యూను మూడు రెట్ల వృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ రజతోత్సవాల సందర్బంగా సోమవారం హైదరాబాద్లో పాల ఉత్పత్త
ఆరోపణలు అవాస్తవం
Tue 25 Apr 06:18:07.046635 2017
న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలు అత్యధికంగా హెచ్-1బీ వీసాలను చేజిక్కించుకొనేందుకు అక్రమాలకు పాల్పడ్డాయని.. తక్కువ మొత్తం చెల్లించి తెచ్చిన నిపుణులతో స్థానికుల ఉపాధికి గండి
రిలయన్స్ లాభాల్లో 12 % వృద్ధి
Tue 25 Apr 06:18:19.252317 2017
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండిస్టీస్ (రిల్) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి 12.3 శాతం వృద్ధితో రూ.8,053 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. ప్రధానం
లాభాల్లో కదలాడిన మార్కెట్లు
Tue 25 Apr 06:18:25.235166 2017
ముంబయి: ఆర్థిక మంత్రి అనుకూల ప్రకటనలు, కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ట్రేడింగ్ వారా
అల్ట్రాటెక్ సిమెంట్ లాభాల్లో క్షీణత
Tue 25 Apr 06:18:32.243727 2017
న్యూఢిల్లీ: అధిక వ్యయాల కారణంగా మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ నికర లాభాలు 11.31 శాతం క్షీణించి రూ.725.90 కోట్లుగా నమోదయ్యింది. ఆదిత్
పతంజలి ఆమ్ల జూస్పై అభ్యంతరాలు
Tue 25 Apr 06:18:38.73954 2017
న్యూఢిల్లీ: పతంజలి ఆమ్ల జ్యూస్పై కోల్కతా లాబోరేటరీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ సంస్థ ఇబ్బందుల్లో పడింది. ఈ అభ్యంతరాల నేపథ్యంలో భారత రిటైలింగ్ వేదికపై ఆమ్ల జ్యూస్ అమ్మక
బేగంపేట్లో విమానాల మరమ్మతుల కేంద్రం
Mon 24 Apr 06:56:50.543851 2017
న్యూఢిల్లీ: తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనుంది. సికింద్రాబాద్ సమీపంలోని బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సంస్థతో కలిసి బ్రెజిల్ సంస్
ఈ వారమూ ఊగిసలాటేనా..!
Mon 24 Apr 06:56:58.169922 2017
నవతెలంగాణ-వాణిజ్య విభాగం దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి (ఏప్రిల్ 24) నుంచి ప్రారంభం కానున్న వారంలో తీవ్ర ఒడిదుడుకులకు గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ, అంతర్జాత
ఎన్ఎస్ఈ నుంచి 'డెక్కన్ క్రానికల్' అవుట్!
Mon 24 Apr 06:57:09.42615 2017
న్యూఢిల్లీ : హైదరాబాద్కు చెందిన డెక్కన్ క్రానికల్తో సహా మరో 19 సంస్థలను 'నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ' (ఎన్ఎస్ఈ) నుంచి డీలిస్ట్ చేయనున్న ట్టుగా ఎన్ఎస్ఈ వెల్లడించింద
నియామకాల్లో రూటు మార్చిన టీసీఎస్!
Mon 24 Apr 06:57:26.467285 2017
న్యూఢిల్లీ : వీసా సంబంధిత సవాళ్లను ఎదుర్కొనేందుకు గాను దేశీయ ఐటీ దిగ్గజం 'టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్' (టీసీఎస్) రూటు మార్చింది. వీదేశీ మార్కెట్లలో వీసా సమస్యలను ఎదుర్
'నైపుణ్య భారత్'లో ఊడుతున్న ఉద్యోగాలు!
Sun 23 Apr 06:26:02.341081 2017
స్వచ్ఛభారత్ పథకంతో స్వచ్చమైన భారతాన్ని రూపొందిస్తామని మేకిన్ ఇండియా, నైపుణ్య భారత్ పథకాలతో దేశ ప్రజల ఉపాధి అవకాశాలను పెంచుతామని, డిజిటల్ ఇండియా పథకం ద్వారా క్యాష్ లె
జీఎస్టీతో భారత వృద్ధి రేటు పెరుగొచ్చు
Sun 23 Apr 06:26:10.805228 2017
న్యూఢిల్లీ: 'వస్తు సేవల పన్ను' (జీఎస్టీ) అమల్లోకి వస్తే భారత జీడీపీ వృద్ధి రేటు పెరుగొచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వు వెల్లడించింది. జీఎస్టీతో వచ్చే జులై నుంచి దేశమంతా ఏక
జియోకు దీటుగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్లు
Sun 23 Apr 06:26:17.677465 2017
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకు దీటుగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వరుసగా పోటీ ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ ముచ్చటగా మూడు ఆఫర్లను ప్రకటిం
దివీస్కు ఎఫ్డీఏ 'హెచ్చరిక' లేఖ
Sun 23 Apr 06:26:25.938222 2017
హైదరాబాద్: విశాఖపట్నంలోని తమ ఔషధ తయారీ యూనిట్కు సంబంధించి 'అమెరికా ఆహార మరియు ఔషధ నియంత్రణ సంస్థ' (యూఎస్ఎఫ్డీఏ) 'హెచ్చరిక లేఖ'ను జారీ చేసినట్లుగా ప్రముఖ మందుల తయారీ క
ఇక బహుముఖ సంస్కరణలు..
Sun 23 Apr 06:26:32.323013 2017
వాషింగ్టన్: ప్రపంచ వృద్ధికి భారత్ ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రస్తుత కాలంలో అభివృద్ధి చెందుతున్న దేశాలే ప్రపంచ వృద్ధిలో ప్రధ
కొలువులు కొల్లగొట్టలేదు.. సృష్టించాం
Sun 23 Apr 06:26:49.740425 2017
బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా భారత ఐటీ కంపెనీలు ఎక్కడ అడుగుపెట్టినా స్థానికంగా ఉద్యోగాలను సృష్టించడం తప్ప.. కొలువులను కొల్లగొట్టడమనేది లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఎంతో సేవ చేస్తున్నారు..
Sat 22 Apr 05:57:33.905594 2017
వాషింగ్టన్ : అమెరికా హెచ్1-బీ వీసా వివాదం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా నిద్రలేచింది. అమెరికా చర్యలను నిలువరించేలా మంత్రులు రం గంలోకి ద
కొత్త పరిశ్రమలకు దన్నుగా నిలుస్తాం..
Sat 22 Apr 05:57:41.200396 2017
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం : తెలంగాణలోకి కొత్తగా అడుగుపెట్టే కంపెనీలు నిలదొక్కుకొని పటిష్టమై య్యేందుకు 'భారత పరిశ్రమల సమాఖ్య' (సీఐఐ) తనవంతు సహకారాన్ని అందిస్తుందని సీఐఐ తెలం
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫలితాలు అదుర్స్!
Sat 22 Apr 05:57:47.950166 2017
ముంబయి : దేశంలోని రెండో అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్చితో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూ
వారాంతంలోనూ నష్టాలే..
Sat 22 Apr 05:57:55.846734 2017
ముంబయి : ప్రతికూల ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాల్లో ముగిశాయి. ఎఫ్ఎమ్సీజీ, వైద్య రంగ స్టాక్స్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లు కుంగడంలో ప్రధాన
నిరుత్సాహపరిచిన ఏసీసీ ఫలితాలు
Sat 22 Apr 05:58:03.17897 2017
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తి సంస్థ ఏసీసీ 2017 మార్చితో ముగిసిన తొలి త్రైమాసికానికి నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసిక కాలంలో
వైర్లు, కేబుళ్ల రంగంలోకి సుధాకర్ గ్రూపు
Sat 22 Apr 05:58:55.434281 2017
నవతెలంగాణ-వాణిజ్య విభాగం సుధాకర్ గ్రూప్ తాజాగా విద్యుత్ వైర్లు, కేబుళ్ల తయారీ విభాగంలోకీ ప్రవేశించింది. ఈ విభాగంలో తొలి ఏడాది రూ.100 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకు
మార్కెట్లోకి రెండు కొత్తతరం ఎక్సకవేటర్లు
Sat 22 Apr 05:29:58.80304 2017
నవతెలంగాణ, వాణిజ్య విభాగం జపాన్కు చెందిన ప్రముఖ నిర్మాణ యంత్రాలు, పొక్లెయినర్ల తయారీదారు కొబెల్కో భారత్లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచనున్నట్లు తెలిపింది. శుక్ర
ఉద్యోగాలేమైనా ఉన్నాయా!
Fri 21 Apr 04:19:57.172818 2017
కామారెడ్డికి చెందిన సంతోష్ కష్టపడి ఇంజినీరింగ్ చేసి దిగ్గజ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతనిలో ప్రతిభను గుర్తించిన కంపెనీ హెచ్1-బీ వీసాపై సంతోష్ను అమెరికాక
Fri 21 Apr 04:20:02.445357 2017
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ తన మిడ్ సైజ్ సెడాన్ కారు సన్నీ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
28న అంతర్జాతీయ పాలిమర్ సదస్సు
Fri 21 Apr 04:20:07.661651 2017
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ తయారీదారుల సంఘం (టాప్మా) ఈ నెల 28న హైదరాబాద్లో 'అంతర్జాతీయ పాలిమర్ సదస్సు-2017'ను నిర్వహించనుంది. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు
హ్యుందారు నుంచి సరికొత్త ఎక్సెంట్
Fri 21 Apr 04:20:13.394354 2017
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందారు భారత మార్కెట్లోకి కొత్త హంగులతో ఎక్సెంట్ నూతన వర్షన్ కారును విడుదల చేసింది. కంపెనీ దీని ధరను రూ. 5.38లక్షల నుంచి రూ.8.41 లక్షలుగా ని
| 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
Visit Site
Recommended byColombia
ఇదిలా ఉంటే, ఈ బాలీవుడ్ జంట ఇండియాలో రెండు రిసెప్షన్లను ఏర్పాటుచేయనుంది. నవంబర్ 21న బెంగళూరులో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు రిసెప్షన్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ముంబైలో నవంబర్ 28న వీరి రిసెప్షన్ జరగనుందని సమాచారం. కాగా, దీపిక-రణ్వీర్ వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. వీరి పెళ్లి ఫొటోల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తు్న్నారు.
ఈ వివాహ వేడుక కోసం అత్యంత ఖరీదైన విల్లా డెల్ బాల్బినెల్లాను సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివాహ అతిథుల కోసం లేక్ కోమో తూర్పు ప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్టును బుక్ చేశారు. వారం రోజుల పాటు దీపిక, రణవీర్ ఫ్యామిలీ సభ్యులు ఇక్కడే స్టే చేయనున్నట్లు సమాచారం. ఇందులో మొత్తం 75 గదులకు గానూ రూ. 1.73 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఒక్కో రూముకి రోజుకి రూ.35 వేలు చెల్లిస్తున్నారని తెలుస్తోంది. బార్లు, రెస్టారెంట్టు, ఇండోర్ స్మిమ్మింగ్ ఫూల్ తదితర అధునాతన సదుపాయాలు ఈ రిసార్టులో ఉన్నాయి. ఇక స్విట్జర్లాండ్ నుంచి చెఫ్లను, ఫ్లోరెన్స్ నుంచి ఫ్లవర్ డెకరేషన్ నిపుణుల్ని రప్పించారు.
దీపిక-రణ్వీర్ వివాహం జరిగిన విల్లా డెల్ బాల్బినెల్లో ఇదే..
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Visit Site
Recommended byColombia
తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘అరవింద సమేత’ యు/ఏ సర్టిఫికేట్ను అందుకుని సెన్సార్ సభ్యుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ను రాబట్టింది. అయితే ఈ మూవీ రన్ టైమ్ కాస్త టెన్షన్కు గురిచేస్తుంది. ఈ మూవీ నిడివి రెండు గంటల 41 నిమిషాల 30 నెకన్లు.. మొత్తంగా 162 నిమిషాలు. నిజానికి సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు ఏ మాత్రం బోర్ ఫీల్ కాకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందోనన్న ఆసక్తితో సినిమాలో లీనం అయిపోతాడు. అయితే యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రాల్లో రన్ టైమ్ ఎక్కువైతే బోర్ ఫీల్ అయ్యే అవకాశం లేకపోలేదు. అందుకే సాధారణంగా రెండున్నర గంటలకు మించకుండా దర్శకులు, ఎడిటర్లు సినిమాను ట్రిమ్ చేస్తుంటారు. అయితే ఇటీవల వచ్చిన 'అర్జున్ రెడ్డి', 'రంగస్థలం' , ‘మహానటి’, ‘భరత్ అనే నేను’ ఆ భావనను పటాపంచలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి.
ఇదిలాఉంటే.. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన గత చిత్రం 'అజ్ఞాతవాసి' 2 గంటల 40 నిమిషాలు నిడివితో విడుదలైంది.. ఈ సినిమాకి ఎడిటింగ్ కూడా మైనస్ కావడంతో డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత వచ్చిన అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ రన్ టైమ్ 2 గంటల 48 నిమిషాలు.. ఇందులో అక్కర్లేని సీన్లు చాలా ఉండటంతో ప్రేక్షకులకు బోర్ కొట్టింది. అయితే ‘అరవింద సమేత’ ఎక్కువ నిడివితో పెద్దగా కట్స్ లేకుండా రిలీజ్ చేయడం అనేది సాహసం అనే చెప్పాలి. అందులోని ‘రంగస్థలం’, ‘తొలిప్రేమ’ హిట్ చిత్రాలకు పనిచేసిన సీనియర్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పనిచేయడంతో ప్రేక్షకులకు ఏది అవసరమో లెక్కలేసుకునే కత్తెరేశారని యూనిట్ చెబుతోంది. అయినా సినిమాకి హిట్ టాక్ వస్తే.. నిడివి ఎంత? ఏ సర్టిఫికేట్ వచ్చింది? అనేవి ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోడు. మొత్తానికి విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ‘అరవింద సమేత’ బాక్సాఫీస్ వద్ద సత్తా చూపడం ఖాయం గానే కనిపిస్తుంది.
ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, ఈషా రెబ్బాలు హీరోయిన్స్గా నటించారు. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందించగా.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల కాబోతోంది ‘అరవింద సమేత వీర రాఘవ’.
Aravindha Sametha: ‘అరవింద సమేత’ థియేట్రికల్ ట్రైలర్
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
హీరో నుంచి ఎలక్ట్రికల్ రిక్షాలు
- రాజధానిలో ఆవిష్కరించిన సంస్థ
- ఒక్క ఛార్జింగ్తో 90 కిలోమీటర్లు
- ధర దాదాపు రూ.1.10 లక్షలు
న్యూఢిల్లీ: 'రక్తంతో నడుపుతాము రిక్షాను.. మా రక్తమే.. మా రిక్షాకు పెట్రోలు' అన్న పాటతో స్ఫూర్తి పొందారో.. లేక శ్రమజీవిగా రిక్షావాలా పడే కష్టాన్ని చూడలేకపోయారో గాని.. ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రికల్ గురువారం ఎలక్ట్రికల్ రిక్షా 'రాహీ'ని మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా హీరో ఎలక్ట్రిక్ సంస్థ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ పేదలకు, రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఉపశమనంగా ఉండేందుకు తాము 'రాహీ' ఎలక్ట్రికల్ రిక్షాను తీసుకువచ్చినట్లు తెలిపారు. కొత్త ఆవిష్కరణ తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఆయన వివరించారు. దీని ధరను సంస్థ రూ.1.10 లక్షలుగా నిర్ణయించింది (న్యూఢిల్లీలో ఆన్రోడ్ ధర). ఈ-రిక్షాలో ప్రయాణించే ప్రయాణికులకు 'ఈ' వాహనాన్ని నడిపే చోదకులకు చాలా సౌక్యంగా ఉండేలా హీరో సంస్థ కొత్త రిక్షాను రూపొందించింది. ఈ వాహనానికి ఆటోమోటివ్ రీసెర్చ్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) ధ్రువీకరణ లభించిందని సంస్థ తెలిపింది. ఈ రిక్షా 1000 వాట్ల మోటారుతో పని చేస్తుంది. దీనిని ఒక్కమారు ఛార్జింగ్ చేస్తే సుమారు 90 కిలో మీటర్ల వరకు పని చేస్తుంది. దీనితో పాటు రాత్రి పూట కూడా ప్రయాణం సాఫీగా సాగేలా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. రోడ్డు క్లియరెన్స్ కూడా బాగా ఉండేలా ఇందులో లైట్లను ఏర్పాట్లు చేసింది హీరో సంస్థ. మొబైల్ ఫోన్ల వాడకాన్ని గుర్తించిన సంస్థ ఇందులో యూఎస్బీ ఆధారిత ఛార్జర్ను కూడా ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌఖర్యం కోసం మంచి బ్యాక్ సపోర్ట్తో పాటు రోడ్డు మీద దుమ్ముదూళి పడకుండా తెరలను వేసుకొనే సౌకర్యం కూడా ఇందులో ఉంది. దేశంలోని మొత్తం 120 డీలర్ల ద్వారా త్వరలోనే తాము వీటి ఆమ్మకాలను మొదలు పెట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ఫ్రదేశ్, డిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాలలో ఈ రిక్షాల అమ్మకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది. దీనికి తోడు దక్షిణ భారతంలో కూడా వీటి అమ్మకాలను పెంచేందుకు సంస్థ యోచిస్తోంది. 'రాహీ'ని అధునికీకరించేందుకు సంస్థ్థ మరింతగా కృషి చేస్తోంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
రిలయన్స్ తొలి మహిళా డైరక్టర్గా నీతా అంబానీ!
PNR| Last Updated: గురువారం, 19 జూన్ 2014 (12:36 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఆ కంపెనీ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని సమర్థవంతంగా నడిపి మంచి వ్యాపారవేత్తగా పేరుగాంచిన నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో తొలి మహిళా డైరెక్టర్ కావడం విశేషం.
ముంబైలో బుధవారం జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ షేర్ హోల్డర్లు కంపెనీ డైరెక్టర్గా నీతా అంబానీ నియామకానికి ఆమోదముద్ర వేశారు. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీగా పేరుగాంచిన రిలయన్స్లో నీతా అంబానీ డైరెక్టర్ గా మరిన్ని సంస్కరణలు తెస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు
| 1entertainment
|
Srikanth
ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్కు శ్రీకాంత్
సిడ్నీ: సంచలనాకు మారుపేరుగా నిలిచిన భారత అగ్రశేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వరుసగా రెండో సూపర్ సిరీస్ పైనల్కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో భారత యువ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. వారం క్రితం ఇండోనేషియా సూపర్ సిరీస్ విజేతగా నిలిచిన శ్రీకాంత్ తాజాగా మరో టైటిల్కి చేరువయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్లో భాగంగా శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్లో నాలుగో సీడ్ చైనా క్రీడాకారుడు షైయుకిపై 21-10, 21-14తో అలోవోక విజయం సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి యుకిపై శ్రీకాంత్దే ఆధిపత్యం కొనసాగింది. తొలి సెట్ని 21-10తో చేజిక్కించుకున్న కిదాంబి..
రెండో సెట్లోనూ అదే జోరును కొనసాగించి 21-14తో విజయాన్ని అందుకున్నాడు. కిదాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియా ఓపెన్ మొదటి రౌండ్లో తైవాన్ క్రీడాకారుడు చావో యు కాన్పై 21-13, 21-16తో విజయం ఫ్రీక్వార్టర్లోకి అడుగుపెట్టాడు. ఫ్రీక్వార్టర్లో ప్రపంచ నంబర్ వన్ దక్షిణా కొరియా క్రీడాకారుడు సన్ వాన్ హోపై 15-21, 21-13, 21-13తో గెలుపొంది క్వార్టర్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్స్లో శ్రీకాంత్ శుక్రవారం భారత క్రీడాకారుడు సాయి ప్రణీత్పై 25-23, 21-17తో గెలుపొంది సెమీఫైనల్లోని ప్రవేశించాడు. సెమీస్లో యుకిపై విజయం సాధించి ఫైనల్కు చేరుకున్నాడు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇండోనేషియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీసుల్లో వరుసగా రెండు సార్లు ప్రపంచ నంబర్ వన్ని షాకిచ్చిన కిదాంబి అదే ఫామ్ను ఫైనల్లోనూ కొనసాగిస్తే టైటిల్ గెలవడం ఖాయం. కొద్దిరోజుల క్రితం సింగపూర్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన ఈ యువ షట్లర్…అనంతరం ఇండోనేషియా టైటిల్ గెలవడం, తాజాగా మరో సూపర్ సిరీస్ ఫైనల్ చేరడం విశేషం. ఇలా వరుసగా మూడు సూపర్ సిరీసుల్లో ఒక భారత పురుష షట్లర్ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి.
| 2sports
|
మెగాస్టార్ ఎక్కువ సీన్లు చేయలేకపోతున్నారట!
Highlights
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ అధ్యయనాన్ని లిఖించుకున్నాడు మెగాస్టార్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ అధ్యయనాన్ని లిఖించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కోట్లాది మంది అభిమానులు ఆరాధించే చిరంజీవి కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న 'సై.. రా' లాంటి భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.
అయితే ఈ వయసులో ఆయనకు ఇటువంటి సినిమాలో నటించడం కష్టంగా మారిందని అంటున్నారు. వ్యాయామాలు చేస్తూ ఆయన తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకున్నప్పటికీ రోజులో మాత్రం ఎక్కువ సీన్లు చేయలేక ఇబ్బంది పడుతున్నారని సమాచారం. ఒక సీన్ చేసిన వెంటనే అలిసిపోయి విశ్రాంతి తీసుకొని మరో సీన్ కు వెళ్తున్నారని చెబుతున్నారు. అందుకే షూటింగ్ సమయంలో ఎక్కువగా గ్యాప్ తీసుకుంటున్నారట. దీంతో మధ్యలో దర్శకుడు వేరే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యన ఆయన లుక్ కూడా మారినట్లు అనిపిస్తోంది.
సినిమా ప్రారంభించే ముందు ఉన్న కల ఇప్పుడు ఆయన ముఖంలో కనిపించడం లేదు. రీసెంట్ గా తేజ్ సినిమా ఆడియో ఫంక్షన్ లో కూడా ఆయన ముఖం ఉబ్బినట్లుగా కనిపించింది. చిరంజీవి మాత్రం ఈ ఏడాదిలోనే సైరాలో తన పార్ట్ పూర్తి చేసి కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Last Updated 13, Jun 2018, 1:31 PM IST
| 0business
|
BSE
డిమార్ట్ రూ.1800 కోట్ల ఐపిఒ
ముంబై: స్టాక్ మార్కెట్లలో ఇపుడు ఐపిఒ జోరు కొనసాగుతోంది. డిమార్ట్ ప్రమోటింగ్సంస్థ అవెన్యూ సూపర్మార్ట్స్ వచ్చేనెల 8వతేదీ ఇష్యూకు రాబోతోంది. శుక్రవారం అప్లోడ్చేసిన డిఆర్హెచ్పిలో ఈ సమాచారం డిమార్ట్ సంస్థ వెల్లడించింది. బ్యాంకర్లనుంచి వస్తున్న సమాచారం ప్రకారం అవెన్యూ సూపర్మార్ట్స్ ఐపిఒ ప్రైస్ధరలు 290-325మధ్య ఉంటుందని అంచనా.
ఈ ఐపిఒ ద్వారా సుమారు 1800 కోట్ల విలువైన షేర్లను విక్ర యిస్తోంది. ఈ ఏడాదిలో బిఎస్ఇ తర్వాత ఐపిఒకు వచ్ని రెండోసంస్థ డిమార్ట్ అవెన్యూ సూపర్మార్ట్స్, ఐపిఒ ద్వారా సమీకరించిన మొత్తాన్ని కొత్తశాఖల నిర్మాణం సరుకులతోపాటు కొద్దిగా రుణాలు తీర్చేం దుకు కూడా వినియోగిస్తారు. రిటైలింగ్ విలువల్లో ఉన్న ఈ సంస్త ఐపిఒ తర్వాత రూ.18వేల కోట్లకు ఉంటుందని అంచనా. కోటక్ మహీంద్ర క్యాపిటల్, యాక్సిస్ కేపిటల్, ఎడిల్విసిస్ ఫైనాన్షియల్స్తో సహా మరో ఆరుగురు మర్చంట్ బ్యాంకర్స్గా వ్యవహరి స్తున్నారు. మార్చి 8వ తేదీ నుంచి పదోతేదీతో ఇష్యూ ముగుస్తుంది. డిమార్ట్కు 45 నగరాల్లో 120 రిటైల్స్టోర్లు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఈ సంస్థకు మంచి పట్టుంది. 2016 మార్చి 31వ తేదీ నాటికి అవెన్యూ సూపర్మార్ట్ సంస్థ 8600 కోట్ల ఆదాయం, 320 కోట్ల నికరలాభాన్ని ఆర్జిం చింది. గడచిన నాలుగేళ్ల నుంచి రాబడులపరంగా 40శాతం, నికరలాభం పరంగా 52శాతం వృద్ధిని ఈ సంస్థ నమోదుచేస్తోంది. రిటర్న్ ఆఫ్ ఈక్విటీ, రిటర్న్ ఆఫ్ కేపిటల్ 24శాతంగా ఉంది. లాంగ్ టర్మ్ డెట్ ఈక్విటీ రేషియో 0.7శాతంగా ఉంది. గ్రేమార్కెట్లో అప్పుడు డిమార్ట్ ఐపిఒ ఎక్కడలేని క్రేజ్ వచ్చిపడుతోంది. అక్కడ 25-30శాతం వరకూ కనీస ప్రీమియం రావొచ్చని ఆశిస్తున్నారు.
| 1entertainment
|
ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హీరో అయ్యాడు.. గుర్తు పట్టారా..
Highlights
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంద్ర, చూడాలనివుంది సహా 50 చిత్రాల్లో నటించిన తేజ
ఇప్పుడు తేజ హీరోగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ
హరి దర్శకత్వంలో తేజ హీరోగా బెక్కెం గోపి చిత్రం
`చూడాలని ఉంది`, `ఇంద్ర`, `యువరాజు`తో పాటుగా దాదాపు 50 సినిమాల్లో బాలనటుడిగా తెరపై కనువిందు చేసిన ఘనత మాస్టర్ తేజ సొంతం. మాస్టర్ తేజ ఇప్పుడు తేజగా మారి హీరోగా పరిచయమవుతున్నారు. ఈ లాంచింగ్ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్ (గోపి) నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సంస్థలో దర్శకత్వ విభాగంలో దాదాపు ఎనిమిదేళ్లు పనిచేసిన హరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
నిర్మాత గోపి మాట్లాడుతూ `` కథ అద్భుతంగా కుదిరింది. విలేజ్ బ్యాక్డ్రాప్ లో జరిగే యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది. కుటుంబసమేతంగా చూసేలా ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. `ఉయ్యాల జంపాల`, `స్వామిరారా` చిత్రాలకు స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకుడు సన్నీ ఎం.ఆర్. మా సినిమాకు బాణీలిస్తున్నారు. ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తాం`` అని అన్నారు.
Last Updated 25, Mar 2018, 11:51 PM IST
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సావన్, ఆర్ఐఎల్ చేతికి
స్ట్రీమింగ్ సేవల ప్రొవైడర్ సావన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 676 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దేశీయ డిజిటల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ మార్కెట్లో పట్టుకోసం ఆర్ఐఎల్ పావులు కదుపుతోంది
TNN | Updated:
Mar 24, 2018, 03:37PM IST
స్ట్రీమింగ్ సేవల ప్రొవైడర్ సావన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 676 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దేశీయ డిజిటల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ మార్కెట్లో పట్టుకోసం ఆర్ఐఎల్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా టైగర్గ్లోబల్ మేనేజ్మెంట్, లిబర్టీ మీడియా, బెర్టెల్సెమన్నుంచి సావన్ వాటాలను కొనుగోలు చేసింది. భవిష్యత్లో మరో 130 కోట్ల రూపాయలను సావన్పై వెచ్చిస్తామని ఆర్ఐఎల్ వెల్లడించింది. తద్వారా ప్రపంచంలోనే దీన్ని అతిపెద్ద స్ట్రీమింగ్ సేవల ప్రొవైడర్గా మారుస్తామని తెలిపింది. సావన్ వ్యవస్థాపక త్రయం సింగ్, రిషి, వినోద్ ఇకపై కూడా సావన్ను ముందుకు తీసుకెళతామని చెప్పారు.
దేశీయ డిజిటల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ మార్కెట్లో పట్టుకోసం ఆర్ఐఎల్ పావులు
తమ ఆధీనంలోని జియో మ్యూజిక్ను సావన్లో విలీనం చేస్తామని వెల్లడించింది. దీంతో సావన్ విలువ దాదాపు రూ. 6500 కోట్లకు చేరనుంది. వచ్చే జూన్ 30 నాటికి ఈ డీల్ ముగియనుంది. కొనుగోలు అనంతరం సావన్లో ఆర్ఐఎల్ వాటా 81.7 శాతానికి చేరనుంది. జియో విలీనానంతరం మరో 520 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని ఆర్ఐఎల్ తెలిపింది. దేశీయంగా ఆన్లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ వినియోగదారుల సంఖ్య 2015నుంచి గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 2015తో పోలిస్తే ఈ వినియోగదారుల సంఖ్య మూడురెట్లు పెరిగిందని ఈవై నివేదిక తెలిపింది. డేటా స్పీడ్, వినియోగం పెరుగుతున్న వేళ ఈ సంఖ్య మరింత పెరగనుందని అంచనా వేసింది. అంతేకాక ఈ స్రీమింగ్ మాధ్యమం త్వరలో అతిపెద్ద మొబైల్ అడ్వర్టైజింగ్ మీడియంగా మారుతుందని తెలిపింది. ఇటీవల కాలంలో ఎంటర్టైన్మెంట్, న్యూస్ విభాగంలో ఆర్ఐఎల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే.
| 1entertainment
|
Jet Airways
ఫిజీ ఎయిర్వేస్తో జెట్ఎయిర్వేస్ టైఅప్
న్యూఢిల్లీ, నవంబరు 14: జెట్ఎయిర్లైన్స్ తాజాగా ఫిజిఎయిర్వేస్తో టైఅప్చేసుకుంది. ఫిజి ఎయిర ్వేస్, చైనా ఈస్ట్రరన్ ఎయిర్లైన్స్తో కలిసి చేసు కున్న ఒప్పందం ప్రకారం ఫిజికి, షాంఘై నగరా లకు సైతం సర్వీసులు నడిపేందుకు వీలవుతుంది. నరేష్ గోయల్ అధీనంలోని జెట్ఎయిరవేస్ ఈ టైఅప్తో ఈరెండుదేశాలకు సర్వీసులు పెంచు తుందని అర్ధం అవుతోంది. అంతేకాకుండా విదేశీ సంస్థలతో టైఅప్ల వల్ల సేవలు మరింత విస్తృతం చేసే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ గల్ఫ్ఎయిర్లైన్ ఎతిహాద్కు 24శాతం వాటాను ఇచ్చింది. 19 అంతర్జాతీయ ఎయిర్లైన్స్తో కోడ్ షేర్ ఒప్పందాలు కలిగి ఉంది. ఇవికాకుండామరో 100కుపైగా అంతర్గతంగా భాగస్వాములున్నట్లు కంపెనీ తెలిపింది. కోడ్షేర్ వల్ల తమ టికెట్లను ఇతర క్యారియర్లలో కూడా బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నిరంతరం ప్రయాణాలకు వెసులుబాటు ఇచ్చినట్లవుతుంది. ప్రస్తుతం హాం కాంగ్ నాడిరూట్లో ఫిజిఎయిర్వేస్ సర్వీసులు ప్రారంభించింది. అంతేకాకుండా ఫిజీనుంచి షాంఘైకు నేరుగా విమానసర్వీసులు నడిపే యోచనలో జెట్ ఎయిర్వేస్ ఉంది. అలాగే కొత్త ఢిల్లీనుంచి షాంఘైలోని పుడాంగ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి నేరుగా సర్వీసులు తిప్పేందుకు కసరత్తులు చేస్తోంది. నాడికేంద్రంగా ఫిజిఎయిర్ వేస్ కార్యకలాపాలు సాగిస్తోంది. దేశీయ రాకపోక లతో పాటు పది దేశాలకు విస్తరించింది. ఓష నియా, అమెరికా, హాంకాంగ్ మరో 17 నగరా లకు సర్వీసులు నడుపుతోంది. ముంబై కేంద్రంగా సేవలందిస్తున్న జెట్ఎయిర్వేస్ తాజాగాఈ త్రైమా సికంలో 85 కోట్ల నికరలాభం ప్రకటిం చింది. కోడ్షేర్ట్రాఫిక్లో 15శాతం వృద్ధినిసాధిం చినట్లు ప్రకటించింది. కోడ్షేర్ ప్రయాణీకులు 15శాతం పెరిగి 117 మిలియన్లకు చేరారని అంత కు ముందు ఏడాది 1.02 మిలియన్ల నుంచి 15 శాతం పెరిగినట్లు జెట్ ఎయిర్వేస్ వివరించింది.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పింఛను కోసం డిజిటల్ లైప్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు
జీవన్ ప్రమాణ్ లేదా డిజిటల్ లైప్ సర్టిఫికెట్ను ఇవ్వకపోవడం వల్ల పింఛను కోల్పోతామేమోనని భయపడుతున్నారా! అయితే మీకోసమే ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తీపికబురు వెల్లడించింది.
TNN | Updated:
Mar 27, 2018, 02:21PM IST
జీవన్ ప్రమాణ్ లేదా డిజిటల్ లైప్ సర్టిఫికెట్ను ఇవ్వకపోవడం వల్ల పింఛను కోల్పోతామేమోనని భయపడుతున్నారా! అయితే మీకోసమే ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్’వో) తీపికబురు వెల్లడించింది. అనివార్య కారణాల వల్ల లైఫ్ సర్టిపికెట్ సమర్పించని వారికి పింఛను ఇవ్వకపోవడాన్ని నిలిపివేయాలని మార్చి 23వ తేదీ ఈపీఎఫ్ఓ ఉత్తర్వులను జారీ చేసింది. ఏవైనా కారణాల వల్ల లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని వారి ధరఖాస్తులను తిరస్కరిస్తే వాటిని మరోసారి పరిశీలించి అందులో సహేతుక కారణాలున్న వారికి పింఛను చెల్లించేలా ఆ నోటీసులో పేర్కొంది.
ఉద్యోగ పింఛను పథకం-1995 క్రింద నమోదైన చందాదారులు ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా సమర్పించాలని గతేడాది నవంబర్ 8 న ఈపీఎఫ్ఓ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వేళ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించలేని వారు రెండు రకాలుగా భౌతికంగానైనా జీవన పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది.
పింఛనుదారులు అంతకుముందు ఒకసారి ఆధార్ అనుసంధాన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పిస్తే వారు తర్వాత భౌతికంగానైనా జీవన పత్రాన్ని సమర్పించవచ్చు.
పింఛనుదారులకు ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరేం కాదు
| 1entertainment
|
శ్రీజా.. నువ్వే నా బలం- శ్రీజ భర్త కల్యాణ్ దేవ్
Highlights
భర్త నుంచి పొగడ్తలు రావటం ఏ భార్యకైనా ఆనందమే..
మెగాస్టార్ చిరంజీవి రెండో తనయ రెండో వివాహం కల్యాణ్ దేవ్ తో జరిగిన సంగతి తెలిసిందే. వాళ్ల రెండో వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఆయన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో కళ్యాణ్, శ్రీజతో పాటు నివృతి (శ్రీజ మొదటి భర్త కూతురు) కూడా ఉంది. ‘నువ్వే నా బలం. హ్యాపీ యానివర్సరీ’ అని కళ్యాణ్ తన పోస్ట్లో పేర్కొన్నాడు. మరోవైపు వీరి వివాహబంధానికి రెండేళ్లు పూర్తికావడంతో మెగా అభిమానులు, శ్రేయోభిలాషులు వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
శ్రీజ వివాహం కళ్యాణ్ దేవ్తో 2016 మార్చి 28న బెంగళూరులో జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, కుటంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో శ్రీజ, కళ్యాణ్ల రిసెప్షన్ జరిగింది. ఇదిలా ఉంటే, మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ చాలా దగ్గరగా ఉంటారు. చిరంజీవి ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలో కళ్యాణ్ పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సినిమాలంటే ఆసక్తి ఉందని కళ్యాణ్.. చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన పచ్చజెండా ఊపడంతో కళ్యాణ్ హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు.
రాకేశ్ శశి దర్శకత్వంలో కళ్యాణ్ సినిమా చేస్తున్నారు. కాలేజ్ నేపథ్యంలో కొనసాగే ఈ ప్రేమకథా చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్కు జోడీగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ మాళవిక నాయర్ నటిస్తుంది. తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కె.కె.సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
Last Updated 28, Mar 2018, 7:33 PM IST
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold prices: రూ.32 వేల దిగువకు బంగారం
బులియన్ మార్కెట్ నేటి ట్రేడింగ్లో బంగారం ధరలు తగ్గాయి. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 32,000 దిగువకు చేరుకుంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి.
Samayam Telugu | Updated:
Dec 19, 2018, 07:17PM IST
Gold prices: రూ.32 వేల దిగువకు బంగారం
హైలైట్స్
నేటి ట్రేడింగ్లో తగ్గిన బంగారం ధరలు
అంతర్జాతీయంగా పుంజుకున్న పుత్తడి
బంగారం బాటలోనే వెండి ధరలు
నిన్న బంగారం ధరలు స్వల్పంగా పెరిగినా బులియన్ మార్కెట్లో నేటి (డిసెంబర్ 19న) ట్రేడింగ్లో తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. పెళ్లిళ్ల సీజన్ ముగుస్తుండటం, అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో బులియన్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 210 తగ్గింది. దీంతో రాజధాని ఢిల్లీలో సోమవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 32 వేల దిగువకు పడిపోయి రూ. 31,850కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగాధరం ధర రూ. 31,700 అయింది.
| 1entertainment
|
STEWE
స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు
మెల్బోర్న్: పాకిస్థాన్ మెల్బోర్న్లో జరుగుతున్న రెండవ టెస్టులో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.కాగా ఈ ఏడాది టెస్టుల్లో వెయ్యి పరుగులు చేసి వరుసగా ఆ ఘనతను మూడుసార్లు సాధించిన నాలుగవ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.పాకిస్థాన్తో మెల్బోర్న్లో జరుగుతున్న రెండవ టెస్టులో 168 బంతులను ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్ 17 బౌండరీలు,1 సిక్సర్ సాయంతో సెంచరీని నమోదు చేశాడు.తద్వారా 2016లో టెస్టుల్లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.కాగా 2014,2015లలో కూడా స్మిత్ టెస్టుల్లో 1000 పైగా పరుగులు సాధించాడు. 3 సార్లు వెయ్యికి పైగా పరుగులు గతంలో వెస్టిండీస్కు చెందిన బ్రియాన్ లారా,ఇంగ్లండ్కు చెందిన ఆటగాళ్లు కెవిస్ పీటర్సన్,ట్రెస్కోథిక్ మాత్రమే వరుసగా మూడుసార్లు వెయ్యికి పైగా పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.కాగా మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్ అయిదు కేలండర్ ఇయర్లలో వరుసగా వెయ్యి పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు.రెండు బాక్సింగ్ డే టెస్టుల్లో 410 పరుగులు ఇదిలా ఉంటే 2014లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్పై 192,14 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్,2015లో వెస్టిండీస్పై 134,70 పరుగులు చేశాడు.తద్వారా రెండు బాక్సింగ్ డే టెస్టుల కలిపి స్మిత్ 410 పరుగులు చేయడం విశేషం.వర్షం కారణంగా రెండవ టెస్టుకి పలుమార్లు అంతరాయం ఏర్పడింది.కాగా రెండవ టెస్టులో పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్లకు 443 వద్ద డిక్లేర్ చేసింది.పాకిస్థాన్ ఇన్నింగ్స్లో అజహర్ అలీ డబుల్ సెంచరీ చేయగా,సోహైల్ ఖాన్,అసద్ షఫీఖ్ హాఫ్ సెంచరీలను నమోదు చేశారు.కాగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అజహర్ అలీ డబుల్ సెంచరీ సాధించడంతో ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి పాక్ క్రికెటర్గాను రికార్డు నెలకొల్పాడు.ఆస్ట్రేలియా 6 వికెట్లకు 465 పరుగులు స్కోరు వద్ద ఉండగా వర్షం పడింది.దీంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ 144 పరుగులతో సెంచరీ చేయగా,ఆ తరువాత స్టీవ్ స్మిత్ క్రీజులో ఉన్నాడు.మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో దూసుకుపోతుంది.
| 2sports
|
Hyderabad, First Published 2, Sep 2019, 2:52 PM IST
Highlights
టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచినా అర్జున్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే ఫ్లోలో బాలీవుడ్ లోకి వెళ్లిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ మరో రికార్డును క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా విడుదలై అత్యధిక లాభాలను అందించిన సినిమాల లిస్ట్ లో చేరింది.
టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచినా అర్జున్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే ఫ్లోలో బాలీవుడ్ లోకి వెళ్లిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ మరో రికార్డును క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా విడుదలై అత్యధిక లాభాలను అందించిన సినిమాల లిస్ట్ లో చేరింది.
ఇక ఇప్పుడు అదే తరహాలో కోలీవుడ్ లో కూడా అర్జున్ రెడ్డి కథతో సక్సెస్ కొట్టడానికి ధృవ్ రెడీ అయ్యాడు. విక్రమ్ తనయుడు ఈ సినిమాతో కోలీవుడ్ కి హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ పై గత కొన్నాళ్లుగా వస్తున్న పుకార్లకు చిత్ర యూనిట్ ఎట్టకేలకు చెక్ పెట్టింది. ఆదిత్య వర్మ నవంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు ఎనౌన్స్ చేశారు.
అర్జున్ రెడ్డి సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన గిరిషయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నాడు. మొదట సినిమాను బాల తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సినిమా అనుకున్నట్లుగా రాకపోవడంతో ఆయన తప్పుకోవడంతో విక్రమ్ అర్జున్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం ఇచ్చి రీ షూట్ చేశారు. ప్రస్తుతం సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఫైనల్ అవుట్ ఫుట్ పై విక్రమ్ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Last Updated 2, Sep 2019, 2:52 PM IST
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సుప్రీంకోర్టులో టీమిండియా కెప్టెన్ ధోనీకి ఊరట
విష్ణుమూర్తి ప్రకటన వివాదం నుంచి మహేందర్ సింగ్ ధోనీ బయటపడ్డాడు.
TNN | Updated:
Sep 5, 2016, 03:54PM IST
ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విష్ణుమూర్తి రూపంలో ధోనీ దర్శనమిచ్చిన కేసును సోమవారం విచారణ జరిపిన కోర్టు...ధోనీ ఏ ఒక్కరి సెంటిమెంట్లను దెబ్బతీయలేదని అభిప్రాయపడుతూ ఈ కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పును వెలువరించింది. గత కొన్ని రోజుల క్రితం ఓ ఆంగ్ల మ్యాగజైన్ కవర్ పేజీపై విష్ణుమూర్తి రూపంలో కనిపించిన మహేందర్ సింగ్ ధోనీ విదాదంలో చిక్కు కున్న విషయం తెలిసిందే. దీంతో ఓ వర్గానికి చెందిన వారు ..ధోనీ తమ మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ అతనిపై అనంతరపురం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారణ జరిపిన అనంత కోర్టు .. ఆ ప్రకటనను తప్పుబడుతూ ధోనీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత ఈ కేసులోనే ధోనీపై కర్నాటక హైకోర్టు క్రిమినల్ కేసుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తాను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఆలోచన తనకు లేదని.. అది ప్రకటన మాత్రమేనని అత్యున్నత ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ..సోమవారం తుది తీర్పును వెలువరించింది.
| 2sports
|
పవన్ కళ్యాణ్ తో గొడవ పై స్పందించిన ఆలీ
Highlights
పవన్ హీరో కాకముందు నుంచే నాకు స్నేహితుడు
ఆయన ఫస్టుమూవీలో కూడా నేను లేను
మా మధ్య ఎలాంటి గొడవలు లేవు
పవన్ కల్యాణ్ .. అలీ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే పవన్ సినిమాల్లో అలీకి తప్పకుండా ఒక పాత్ర ఉంటుంది. అయితే ఇటీవల వచ్చిన 'అజ్ఞాతవాసి' సినిమాలో అలీ నటించలేదు. దాంతో పవన్ . . అలీ మధ్య మనస్పర్థలు వచ్చాయనీ .. అందువల్లనే ఆ సినిమాను అలీ చేయలేదనే ప్రచారం జోరుగా జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రశ్న అలీకి తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది.
అందుకాయన స్పందిస్తూ .. " పవన్ హీరో కాకముందు నుంచే మా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆయన తొలి సినిమాలో నేను చేయలేదు .. అలాగే 'అజ్ఞాతవాసి'లోను చేయలేదు. మిగతా అన్ని సినిమాల్లో నేను ఉన్నప్పటికీ మా ఇద్దరి మధ్య గొడవైందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. నిజమే మా ఇద్దరికీ గొడవైంది .. అదీ 'ఇవాంకా ట్రంప్' విషయంలో అంటూ నవ్వేశారు. అసలు పవన్ తో నాకు గొడవేముంటుంది? మొన్న జరిగిన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కూడా ఆయన నన్ను పిలిచారు.. నేను వెళ్లాను" అంటూ ఈ విషయంలో జోరుగా జరుగుతోన్న ప్రచారానికి ఆయన అడ్డుకట్ట వేశారు.
Last Updated 25, Mar 2018, 11:55 PM IST
| 0business
|
రూ.4.42 లక్షల కోట్లకు డీల్ ఓకే!
- మోన్శాంటో కొనుగోలు ప్రక్రియ కొలిక్కి : బేయర్
- అతిపెద్ద కొనుగోలు వ్యవహారంగా రికార్డు
- విత్తన మార్కెట్లో 25% పైగా వాటా బేయర్ చేతికి
న్యూయార్క్: జర్మనీకి చెందిన రసాయనాల తయారీ సంస్థ బేయర్, అమెరికాకు చెందిన విత్తనాలు, క్రిమి సంహారకాల తయారీ సంస్థ మోన్శాంటోను కొనుగోలు చేసే వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. విత్తనాలు, క్రిమిసంహారకాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బహుళజాతి సంస్థ మోన్శాంటోకు చెందిన షేరు ఒక్కింటికి 128 డాలర్ల మేర చెల్లించేందుకు ఇచ్చినకొనుగోలు ప్రతిపాదనకు డీల్ కుదిరినట్లుగా బేయర్ కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయి. డీల్ మొత్తం విలువ 66 బిలియన్ డాలర్లుగా (రూ.4.42 లక్షల కోట్లుగా) ఉంటుందని సంస్థ వెల్లడించింది.
పలు ప్రతిపాదనల తరువాత...
కొంత కాలంగా మోన్శాంటోను చేజిక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్న బేయర్ సంస్థ ఒక్కో షేరుకు 122 డాలర్లను చెల్లిస్తామంటూ మొదట ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు మోన్శాంటో నుంచి సుముఖత వ్యక్తం కాలేదు. ఆ తరువాత సంస్థ షేరుకు 127.50 డాలర్లను చెల్లించేందుకు కూడా ముందుకు వచ్చింది. దీనికీ మోన్శాంటో అంగీకరించని సంగతి తెలిసిందే. అయితే తాజాగా షేరుకు 128 డాలర్ల ప్రతిపాదనకు మోన్శాంటో అంగీకరించినట్లుగా బేయర్ తెలిపింది. ఈ మొత్తం వ్యవహారం నగదు రూపంలోనే ఉంటుందని సంస్థ తెలిపింది. ఇది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద నగదు విలీన కొనుగోలు ప్రక్రియ అన్ని సంస్థ తెలిపింది. దీంతో ప్రపంచంలోని మొత్తం విత్తనాలు, క్రిమి సంహారకాల మార్కెట్లో బేయర్ మార్కెట్ వాటా పావు భాగం (25 శాతం) కంటే కూడా ఎక్కువకు పెరగనుంది.ఈ కొనుగోలు ప్రతిపాదనకు నియంత్రణ సంస్థల సమ్మతి లభించాల్సి ఉంది.
బేయర్ వాటాదారుల్లో అసంతృప్తి..
పలు అనుమతులతో సహా అనేక రకాల రిస్కులతో కూడుకున్న మోన్శాంటో సంస్థ కొనుగోలు ప్రక్రియ పట్ల బేయర్ వాటాదారులు తీవ అసంతృప్తిగా ఉన్నట్లుగా సమాచారం. కంపెనీ ప్రధాన వ్యాపారమైన ఔషధ వ్యాపారాన్ని వదిలి మోన్శాంటోకు ఎక్కువ మొత్తంలో నగదును వెచ్చించేందుకు సంస్థ ముందుకు రావడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. తాజా పరిణామాల పట్ల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది (2017) ముగింపు నాటికి ఈ కొనుగోలు వ్యవహారం పూర్తవుతుందని బేయర్ వర్గాలు అంచనా కడుతున్నాయి. మే 9 చేసిన ప్రతిపాదన కంటే కూడా ఒక్కో షేరుకు 44 శాతం ప్రిమియంతో తాజా ప్రతిపాదన చేసినట్లు బేయర్ తెలిపింది. కన్వెర్టబుల్ బాండ్లను మార్చడం, కొత్త షేర్ల జారీలో జరుగుతున్న జాప్య కారణంగా తాజాగా 19 బిలియన్ డాలర్లను మార్కెట్ల నుంచి సమీకరించాలని బేయర్ యోచిస్తోంది. మరో 57 బిలియన్ డాలర్లను సర్దేందుకు బ్యాంకులు కూడా ముందుకు వచ్చినట్లుగా బేయర్ వెల్లడించింది. తాజా డీల్ వార్తలతో ప్రీమార్కెట్ ట్రేడ్లో బేయర్ వాటాలు 2.2 శాతం, మోన్శాంటో స్టాక్లు 0.2 శాతం మేర పెరిగాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘అరవింద సమేత’ క్లైమాక్స్ సీన్ క్రెడిట్ వాళ్లదే: త్రివిక్రమ్
‘అరవింద సమేత’ విజయోత్సవంలో భాగంగా గురువారం నాడు సక్సెస్ మీట్ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో పాటు నటుడు సునీల్, నైజాం డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్, నవీన్ చంద్ర, పీఆర్ఓలు తదితరులు హాజరయ్యారు.
Samayam Telugu | Updated:
Oct 12, 2018, 11:52AM IST
‘అరవింద సమేత’ క్లైమాక్స్ సీన్ క్రెడిట్ వాళ్లదే: త్రివిక్రమ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో గురువారం నాడు (అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజు రికార్డ్ కలెక్షన్స్తో నాన్ బాహుబలి రికార్డ్స్ను తుడిచిపెట్టేసింది. ఈ మూవీ విజయోత్సవంలో భాగంగా గురువారం నాడు సక్సెస్ మీట్ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో పాటు నటుడు సునీల్, నైజాం డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్, నవీన్ చంద్ర, పీఆర్ఓలు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులు ధన్యవాదాలు. నిజానికి నా సినిమాలకు హిట్ టాక్ వచ్చిందంటే నేను ఈజీగా నమ్మను. కాని అరవింద సమేత విషయంలో తొందరగా నమ్మాల్సి వచ్చింది. తొలి షో నుండి హిట్ టాక్ వచ్చింది. నాకంటే ఎక్కువగా ఎన్టీఆర్ ఈ కథను నమ్మారు. అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఎన్టీఆర్ నుండి ఆయన ఫ్యాన్స్ ఆశించినంతగా ఈ సినిమాలో సాంగ్స్, డాన్స్ మిగిలిన హంగులు లేవని మదనపడే సందర్భంలో మనం నమ్మాల్సింది కథను మిగిలినవి పట్టించుకోవల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఆ నమ్మకమే ఇప్పుడు ఈ సినిమాను నిలబెట్టింది.
| 0business
|
Hyderabad, First Published 17, Oct 2018, 4:14 PM IST
Highlights
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేత ఫస్ట్ వీకెండ్ కెలక్షన్స్ సాలిడ్ గా అందాయి. తారక్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా ఈ చిత్రం నిలిచింది.
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేత ఫస్ట్ వీకెండ్ కెలక్షన్స్ సాలిడ్ గా అందాయి. తారక్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అయితే ఊహించని విధంగా మొదటివారం అనంతరం చిత్రం యొక్క కలెక్షన్స్ సడన్ గా డ్రాప్ అయ్యాయి. సోమవారం నుంచి డల్ అయినట్లుగా తెలుస్తోంది.
మంగళవారం లెక్కలతో కలెక్షన్స్ పై ఓ క్లారిటీ వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అరవింద రిలీజై ఆరు రోజులవుతోంది. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.55 కోట్లు అందుకోగా మంగళవారం అంతకంటే తక్కువగా 2.9 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ చిత్రం 90కోట్ల థ్రియేటికల్ రైట్స్ కు అమ్ముడుపోయింది. ఆ స్థాయి వరకు షేర్స్ అందుకోవాలి అంటే కలెక్షన్స్ నెంబర్స్ పెరగాలి.
దసరా సెలవులు కాస్త ఉపయోగపడతాయి అనుకున్న మరో రెండు సినిమాలు పోటీకి దిగనున్నాయి. విశాల్ మాస్ ఎంటర్టైనర్ పందెం కోడి 2 - రామ్ కామెడీ అండ్ లవ్ ఎంటరైనర్ హలో గురు ప్రేమ కోసమే గురువారం రిలీజ్ కానున్నాయి. ఈ చిత్రాలకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన ఆడియెన్స్ ను పూర్తిగా ఆకర్షించే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో అరవింద సమేత కలెక్షన్స్ ఎంతవరకు రాబడుతుందో చూడాలి.
అరవింద సమేత ఆరు రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం - 15.90 cr
| 0business
|
ఆ రోజు సావిత్రి మా ఇంటికి తాగొచ్చింది : జమున
Highlights
ఆ రోజు సావిత్రి మా ఇంటికి తాగొచ్చింది : జమున
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జమున సావిత్రి గురించి మాట్లాడుతూ, సావిత్రితో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. " మా అబ్బాయిని ఉయ్యాలలో వేసే రోజున సావిత్రి బాగా తాగేసి వచ్చింది. బాబును ఎత్తుకుని ఆడించి తిరిగి ఉయ్యాలలో వేసింది. ఆ తరువాత రూములోకి వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకుని పెద్దగా ఏడ్చేసింది.
"నువు అదృష్టవంతురాలివి చెల్లి .. మంచి భర్త .. బంగారంలాంటి కొడుకు లభించారు అంది. జెమినీ అట్లా చేశాడు .. ఇట్లా చేశాడు అంటూ ఏడ్చేసింది. అప్పుడు సావిత్రి కళ్లు తుడిచి పక్కనే కూర్చోబెట్టుకున్నాను. జెమినీని చేసుకోవద్దని అందరూ నీతో చెప్పారు .. మోసపోతావని అన్నారు. అయినా వినిపించుకోకుండా బుట్టలో పడ్డావు. కష్టమో .. నష్టమో .. జరిగిందేదో జరిగిపోయింది. నీకు ఇద్దరు పిల్లలు వున్నారు .. ఇక నీ జీవితానికి వాళ్లే సంతోషాన్ని ఇస్తారు అని ఓదార్చాను .. ధైర్యం చెప్పాను" అన్నారు.
Last Updated 17, May 2018, 1:53 PM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
లారెన్స్ ‘శివలింగ’ టీజర్ విడుదల
యాక్టర్, డాన్సర్, డైరెక్టర్గా మల్టీ టాలెంట్తో దూసుకుపోతోన్న రాఘవ లారెన్స్ ‘శివ లింగ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
TNN | Updated:
Jan 7, 2017, 03:59PM IST
యాక్టర్‌, డాన్సర్, డైరెక్టర్‌గా మల్టీ టాలెంట్‌తో దూసుకుపోతోన్న రాఘవ లారెన్స్ ‘శివ లింగ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్ ఫ్యాన్స్‌లో ఫుల్ క్రేజ్‌ని తీసుకొచ్చాయి. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన శివలింగ తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్ర టీజర్‌ని తాజాగా విడుదల చేశారు.
లారెన్స్‌కి హరర్ జానర్‌లో సినిమాలను తెరకెక్కించడం అంటే వెన్నతో పెట్టిన విద్య అని అతడి గత సినిమాలను బట్టి తెలుస్తోంది. ఇప్పుడు అదే జోనర్‌ని రిపీట్ చేయబోతున్నాడు లారెన్స్. చిత్ర షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకోగా వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసి జనవరి నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్ లో ఉంది చిత్ర బృందం.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
భారత్తో సిరీస్ కోసం లంక జట్టు ప్రకటన
భారత్ చేతిలో 0-3 తేడాతో టెస్టు సిరీస్ చేజార్చుకున్న శ్రీలంక కనీసం వన్డే సిరీస్లోనైనా గట్టిపోటీనివ్వాలని ఆశిస్తోంది.
TNN | Updated:
Aug 16, 2017, 09:55AM IST
భారత్ చేతిలో 0-3 తేడాతో టెస్టు సిరీస్‌ చేజార్చుకున్న శ్రీలంక కనీసం వన్డే సిరీస్‌లోనైనా గట్టిపోటీనివ్వాలని ఆశిస్తోంది. ఆగస్టు 20 నుంచి ఐదు వన్డేలు , ఒక టీ20 మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో తాజాగా శ్రీలంక వన్డే జట్టుని ప్రకటించింది. ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో 2-3 తేడాతో సిరీస్ ఓటమికి బాధ్యత వహిస్తూ వన్డే కెప్టెన్సీ నుంచి మాథ్యూస్ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఉపుల్ తరంగకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన శ్రీలంక 15 మందితో కూడిన జట్టుని ప్రకటించింది.
ఈ జట్టులోకి సీనియర్ పేసర్ మలింగకి ఛాన్స్ ఇచ్చిన సెలక్టర్లు.. అనూహ్యంగా టెస్టు కెప్టెన్ దినేశ్ చండిమాల్‌ని విశ్రాంతి పేరుతో పక్కన పెట్టారు. యువ క్రికెటర్ విశ్వ వన్డేల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. భారత్‌తో టెస్టుల్లో ఆశించిన మేర రాణింలేకపోయినా.. యువ క్రికెటర్లకి మరో అవకాశమివ్వాలనే ఆలోచనతో సెలక్టర్లు కొంతమందిని వన్డే జట్టులోనూ కొనసాగించారు.
వన్డే జట్టు: ఉపుల్ తరంగ , మాథ్యూస్, డిక్వెల్లా, గుణతిలక, మెండిస్, కపుగెదర, మిలింద, పుష్పకుమార, ధనంజయ, సండకన్, తిసార పెరీరా, హసరంగ, లసిత్ మలింగ, చమీరా, విశ్వ
| 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.