news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Hyderabad, First Published 27, Jun 2019, 9:44 AM IST Highlights ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీలోనే పని చేస్తున్నారు.  ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీలోనే పని చేస్తున్నారు. కాలభైరవ సింగర్ గా రాణిస్తుంటే.. మరో కుమారుడు శ్రీసింహా సహాయ దర్శకుడిగా పని చేస్తున్నాడు. సుకుమార్ తెరకెక్కించిన 'రంగస్థలం' సినిమాకి శ్రీసింహా సహాయదర్శకుడిగా పని చేశారు. ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ సంస్థ ఇప్పుడు శ్రీసింహాని హీరోగా పరిచయం చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం శ్రీసింహా కోసం కొత్త కథలను ఎంపిక చేసే పనిలో పడింది. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడు. శ్రీసింహా దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు నటుడిగా ఛాన్స్ రావడంతో హీరోగా తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. కసరత్తులు కూడా మొదలెట్టాడు. మొత్తానికి మెగాఫోన్ పట్టాలనుకున్న శ్రీసింహా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు చిన్న సినిమాలపై దృష్టి పెట్టింది. టాలెంట్ ఉన్న యువ దర్శకులను గుర్తించి వాళ్లతో కథలను సిద్ధం చేయిస్తోంది. అందులో ఓ కథలో శ్రీసింహా హీరోగా కనిపించబోతున్నాడు.
0business
Hyderabad, First Published 6, Jul 2019, 12:38 PM IST Highlights టాలీవుడ్ ముద్దుగుమ్మ అక్కినేని సమంత పెళ్లి తరువాత సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.  టాలీవుడ్ ముద్దుగుమ్మ అక్కినేని సమంత పెళ్లి తరువాత సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కమర్షియల్ సినిమాలకు పక్కన పెట్టి కథా బలమున్న లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుంటోంది. నటిగా తన స్థాయిని మరింత పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే ప్రశంసలకు మాత్రం లోటు లేదు. తాజాగా ఆమె నటించిన 'ఓ బేబీ' సినిమాకి కూడా హిట్ టాక్ రావడంతో ఇకపై తనే ప్రధాన పాత్రల్లో నటించే సినిమాలను ఎంపిక చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ క్రమంలో నయనతార చేయాల్సిన ఓ సినిమా వైపు సమంత మొగ్గు చూపుతోందట. గతంలో తమిళంలో వచ్చిన 'అరమ్' సినిమా సీక్వెల్ లో సమంతనటించబోతుందని సమాచారం. ఈ సినిమా తెలుగులో 'కర్తవ్యం' పేరుతో రిలీజైంది. ఆ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు.  మొదట నయనతారే అందులో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సమంతకు ఆ ఛాన్స్ దక్కబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార ఓ పక్క కమర్షియల్ సినిమాలతో పాటు మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఈ నేపధ్యంలో సమంత నుండి ఆమె గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  Last Updated 6, Jul 2019, 12:38 PM IST
0business
Hyderabad, First Published 6, Aug 2019, 10:13 AM IST Highlights నెటిజన్లు తమన్నా సింహాద్రి అఫీషియల్ ప్రొఫైల్ దొరకక హీరోయిన్ తమన్నా అఫీషియల్ ఐడీని లింక్ చేసి ట్వీట్ చేస్తున్నారు. దీంతో గత పదిరోజులుగా తమన్నాకి ట్విట్టర్ ఓపెన్ చేయడం ఇబ్బందిగా మారింది.  బిగ్ బాస్ మూడో సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వెళ్లిన తమన్నా సింహాద్రి ఇప్పుడు హౌస్ లో చేస్తోన్న రచ్చ గురించి తెలిసిందే. హౌస్ లో ఆమె ప్రవర్తన కారణంగా అటు కంటెస్టంట్స్ తో పాటు ఇటు ప్రేక్షకులు కూడా విసిగిపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేయాలనుకున్న నెటిజన్లు తమన్నా సింహాద్రి అఫీషియల్ ప్రొఫైల్  దొరకక హీరోయిన్ తమన్నా అఫీషియల్ ఐడీని లింక్ చేసి ట్వీట్ చేస్తున్నారు. దీంతో గత పదిరోజులుగా తమన్నాకి ట్విట్టర్ ఓపెన్ చేయడం ఇబ్బందిగా మారింది. రోజుకి వేల కొద్ది వస్తోన్న ట్వీట్లతో తమన్నా నోటిఫికేషన్స్ బార్ నిండిపోయి ఉండాలి. హౌస్ లో తమన్నా ఏం చేసినా కానీ హీరోయిన్ తమన్నాని కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేయడాన్ని ట్రోలర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తమన్నా హేటర్స్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ పేరు మరొకరు రిపీట్ చేసుకోరు. దాని వలన పెద్దగా వారికి ఇబ్బందులు కలగవు. కానీ ఈ కేస్ లో మాత్రం హీరోయిన్ తమన్నా బలవుతోంది. పైగా ఈ షోలో వరుణ్ సందేశ్ ఉండడం, గతంలో హీరోయిన్ తమన్నా అతడితో కలిసి 'హ్యాపీ డేస్' సినిమా చేసి ఉండడంతో మరింత ఎక్కువగా తమన్నాని ట్యాగ్ చేస్తున్నారు. కొందరైతే తమన్నా సింహాద్రి సోషల్ మీడియా లింక్స్ తెలియక అసలు తమన్నానే డైరెక్ట్ గా తిట్టి పోస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో తమన్నా ఉన్నంతకాలం తమన్నాకి ఈ ట్వీట్ల గోల, తిట్ల దండకం తప్పేలా లేదు!
0business
R Dravid టీమిండియా విజయాల వెనుక కోహ్లీ,కుంబ్లే న్యూఢిల్లీ: టీమిండియా ఇటీవల వరుస విజయాలు వెనుక ఇద్దరి పాత్ర అమోఘమని వారి చొరవతోనే ప్రస్తుతం యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారంటూ భారత జూనియర్‌ క్రికెట్‌ కోచ్‌ ద్రావిడ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.. కాగా తాజాగా బిసిసిఐ ఛానల్‌తో ద్రావిడ్‌ మాట్లాడారు.. భారత్‌ ఎ జట్టులో ఆడిన కరుణ్‌నాయర్‌, జయంత్‌ యాదవ్‌లాంటి యువ క్రికెటర్లు జాతీయజట్టులో మెరుగైన ప్రదర్శన చేయటం తనకు కోచ్‌గా చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఘనత మాత్రం నిస్సందేహంగా కోహ్లీ, టీమిండియా కోచ్‌కుంబ్లేలకు మాత్రమే దక్కుతుందన్నారు.
2sports
US Dollar కార్పొరేట్‌ రంగంలో 46 బిలియన్‌ డాలర్ల విలువైన విలీనాలు కొనుగోళ్లు న్యూఢిల్లీ, అక్టోబరు 10: భారత్‌ కార్పొరేట్‌ రంగంలో విలీనాలు, కొనుగోళ్ల విలువ ఈ ఏడాది 46 బిలి యన్‌ డాలర్లకుచేరింది. జనవరి నుంచి సెప్టెంబరు నెల వరకూ చూస్తే విలువలపరంగా గత ఏడాదితో పోలిస్తే 36శాతం పెరిగింది. మెర్జర్‌మార్కెట్‌ నివే దికలను చూస్తే మొత్తం 278 లావాదేవీలు జరి గాయి. వీటి విలువ 46 బిలియన్‌ డాలర్లుగా ఉం టుందని ప్రకటించింది. 2015లో చూస్తే 33.8 బిలియన్‌ డాలర్ల విలువైన 419 డీల్స్‌ జరిగినట్లు అంచనా. జులై సెప్టెంబరుత్రైమాసికంలో కడూఆ 27.7 బిలియన్‌ డాలర్ల విలువైన 98 ఒప్పందాలు లావాదేవీలు జరిగినట్లుమెర్జర్‌ మార్కెట్‌ వివరించిం ది. అత్యధికస్థాయిలోగ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ఆదిత్యబిర్లా నువోను 8 బిలియన్‌ డాలర్లకు కొనుగోలుచేసింది. ఇక టెలికమ్యూనికేషన్స్‌ రంగంలో ఐదుడీల్స్‌ జరి గాయి. వీటి విలువ 16 బిలియన్‌ డాలర్లవరకూ ఉంటుందని అంచనా. టెలికాంరంగంలో గత ఏడాది కంటే ఈ ఏడాదిజరిగిన కొనుగోళ్లు, విలీనం ఒప్పందాలే ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కొత్త విధానాలే ఎంఅండ్‌ఎ రంగంలో పునరేకీకరణకు మద్దతునిస్తున్నట్లు మెర్జర్‌మార్కెట్‌ ప్రతినిధులు వివరించారు. 2015తోపోలిస్తే 2016 లో ఇప్పటివరకూ 485బిలియన్‌ డాలర్ల విలువైన2 557డీల్స్‌ జరిగాయి. గతఏడాది జనవరి సెప్టెం బరుతో పోలిస్తే 18.3శాతం తగ్గాయి. గత ఏడాది మొత్తం 593.9 బిలియన్‌డాలర్ల విలువైన 2717 డీల్స్‌జరిగాయి. ఆసియా డీల్స్‌ప్రతినిధులే అంతర్జా తీయ మార్కెట్‌లోఎక్కువవాటాతోఉన్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగినవిలీనం, కొనుగోళ్లు ఒప్పం దాలపరంగా 22శాతం వాటా ఉన్నట్లు అంచనా. జపాన్‌ బయటిప్రాంత ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో 166.9బిలియన్‌డాలర్లవిలువైన 434 డీల్స్‌జరిగాయి. చైనా కార్యకలాపాలతో మరింత పెరిగాయి. 141.2 బిలియన్‌ డాలర్ల విలువైన 201 డీల్స్‌ చైనాపరంగానే ఉన్నాయి. మొత్తం మీద గతఏడాది ఇదేకాలంతో పోలిస్తే కొంతమేర తగ్గినా రెండో అర్ధభాగంలో ఊపం దుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
1entertainment
29 లక్షల డెబిట్‌ కార్డులే మాల్‌వేర్‌కు గురి .. -  ఆర్థిక సహాయమంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ న్యూఢిల్లీ : గతేడాది జరిగిన మాల్‌వేర్‌ అటాక్‌లో మొత్తం 29 లక్షల డెబిట్‌ కార్డుల సమాచారం మాత్రమే తస్కరణకు గరైనట్టు ఆర్థిక సహాయమంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ వెల్లడించారు. అయితే ఈ సంఘటన హిటాచి పేమెంట్‌ సర్వీసెస్‌ అనుసంధానిత ఏటీఎంలలో చోటుచేసుకుందని శుక్రవారం లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించింది. ఫలితంగా దేశంలోని బ్యాంకింగ్‌ చెల్లింపుల వ్యవస్థలోని భద్రతకు సవాలు విసురుతూ.. అప్పట్లో ఈ సంఘటన పెను సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంట్లో తమ తప్పిదం ఉందని జపాన్‌కు చెందిన హిటాచి పేమెంట్‌ సర్వీసెస్‌ సంస్థ ఎట్టకేలకూ అంగీకరించింది. హిటాచి నిర్వహిస్తున్న ఏటీఎంలలో..దాదాపు 29 లక్షల కార్డులు అత్యాధునిక మాల్‌వేర్‌ అటాక్‌ గురైనట్టు ఆర్థిక సహాయ మంత్రి లోక్‌సభకు లిఖితపూర్వక సమధానంలో చెప్పారు. ఈ విషయంలో కేవలం 3,291 కార్డులే దుర్వినియోగానికి పరిమితం చేసినట్టు బ్యాంకులు ఆర్‌బీఐకి నివేదించినట్టు మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో పేమెంట్లు, ఇన్‌ఫర్‌మేషన్‌ సెక్యూరిటీ ఆడిట్‌ సంస్థ 'సిసా ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ'కి ఈ కేసు విచారణకు ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ సంస్థ తన తుది నివేదికలో 2016 మే 21 నుంచి జులై 11 మధ్య కాలంలో ఈ ఉల్లంఘన జరిగినట్టుగా గుర్తించింది. కానీ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌)లో ఎలాంటి ఇబ్బంది లేదని నివేదించిందని పేర్కొన్నారు. పేర్కొంది. ఇక డెబిట్‌ కార్డుల డేటా బయటకు పొక్కిన నేపథ్యంలో సైబర్‌ దాడుల పట్ల తమ ఖాతాదారులకు అవగహన కల్పించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించిందని ఆయన తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Kane Williamson: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి బూస్ట్‌.. గాయపడిన కెప్టెన్ మళ్లీ టీమ్‌లోకి..! శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో ఢీకొననుంది. Samayam Telugu | Updated: Mar 21, 2019, 05:33PM IST Kane Williamson: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి బూస్ట్‌.. గాయపడిన కెప్టెన్ మళ్లీ టీమ... హైలైట్స్ గాయం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కి కేన్‌ విలియమ్సన్‌ దూరంకానున్నట్లు ఇటీవల వార్తలు ఫిట్‌నెస్ సాధించి శుక్రవారమే జట్టుతో చేరబోతున్నట్లు తాజాగా సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ప్రకటన గత ఏడాది కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విలియమ్సన్ ఈ ఏడాది వార్నర్ మళ్లీ జట్టులోకి వచ్చినా.. విలియమ్సన్‌కే జట్టు పగ్గాలు ఐపీఎల్ 2019 సీజన్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఉత్సాహానిచ్చే వార్త. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతూ గాయపడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఫిట్‌నెస్ సాధించి మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఫీల్డింగ్ చేస్తుండగా.. విలియమ్సన్ భుజానికి గాయమవడంతో అతను కనీసం సరిగా బ్యాటింగ్‌ కూడా చేయలేకపోయాడు. దీంతో.. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విలియమ్సన్‌.. ప్రస్తుతం పూర్తిగా ఫిట్‌నెస్ సాధించాడని.. శుక్రవారమే అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరబోతున్నట్లు ఫ్రాంఛైజీ ప్రకటించింది.
2sports
Hyderabad, First Published 3, Mar 2019, 12:27 PM IST Highlights నిర్మాతగా మొన్నటివరకు సొంతంగా సినిమాలను నిర్మించుకున్న నందమూరి హీరో కల్యాణరామ్ ఇప్పుడిపుడే ఇతర ప్రొడక్షన్ హౌస్ లకు దగ్గరవుతున్నాడు. రీసెంట్ గా విడుదలయిన 118 సినిమాకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించినట్లు టాక్. నిర్మాతగా మొన్నటివరకు సొంతంగా సినిమాలను నిర్మించుకున్న నందమూరి హీరో కల్యాణరామ్ ఇప్పుడిపుడే ఇతర ప్రొడక్షన్ హౌస్ లకు దగ్గరవుతున్నాడు. రీసెంట్ గా విడుదలయిన 118 సినిమాకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించినట్లు టాక్. అది ఎంతవరకు నిజం అనే విషయాన్నీ పక్కనపెడితే ఇంతకుముందు వచ్చిన నా నువ్వే.. సినిమా దారుణంగా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు 118 సినిమా కూడా అదే ప్రొడక్షన్ హౌస్ లో  చేశాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో అయితే ఓపెనింగ్స్ ను అందుకోలేకపోయింది. మొదటి కోటిన్నర షేర్స్ తో డీసెంట్ గా కలెక్షన్స్ స్టార్ట్ అయ్యాయి.  టాక్ పరవాలేదు అనే విధంగా వస్తున్నప్పటికీ సినిమా మాస్ ఆడియెన్స్ ని అంతగా ఎట్రాక్ట్ చేయడం లేదు. ఇక ఇప్పటివరకు 4 కోట్ల షేర్స్ కూడా రాలేవని సమాచారం. 11 కోట్ల ప్రీ రిలీజ్ తో సిద్దమైన ఈ సినిమా ఇంకా 10 కోట్ల వరకు షేర్స్ అందుకుంటేనే బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయినట్లు.  సోమవారం శివరాత్రి సెలవు కావడంతో కొంత లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తరువాత రోజులు కూడా అదే తరహాలో కలెక్షన్స్ కంటిన్యూ అవ్వడం సందేహంగానే ఉంది. పరీక్షా సమయంలో 118 ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.  Last Updated 3, Mar 2019, 12:27 PM IST
0business
INDIA జాంటీ రోడ్స్‌ కుమార్తె ‘ఇండియా కోహ్లీ అభిమాని న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ అంటే మన భారతీయులకే కాదు,ఇండియాకు కూడా ఇష్టమే. ఇక్కడి ఇండియా అంటే మన భారతదేశం కాదు.ప్రముఖ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌,ముంబయి ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌ కుమార్తె ఇండియా రోడ్స్‌.జాంటీ తన చిట్టితల్లిని ఒక రోజు సరదాగా బయటికి తీసుకెళ్లాడు.అక్కడ కోహ్లీ వ్యూమా కోసం చేసిన యాడ్‌ పోస్టర్‌ ఒకటి కన్పించింది.అది చూసి ఇండియా రోడ్స్‌ కోహ్లీ పోటో పట్టుకుని తెగ మురిసిపోయింది.వెంటనే జాంటీ ఇండియా పోటో తీసి ట్విటర్‌లో పోస్టు చేశాడు. కోహ్లీకి మరో అభిమాని దొరికనట్లుంది అని ట్వీట్‌ చేశాడు. ఇందుకు కోహ్లీ స్పందిస్తూ ఎంత ముద్దుగా ఉందో, ఇంతకీ ఇండియా తగిలించుకున్న బుల్లి బ్యాగ్‌లో ఏముందో అంటూ సరదాగా ట్వీట్‌ చేశాడు. వ్యూమాబ్రాండ్‌కి ప్రచార కర్తగా కోహ్లీ వ్యవరిస్తున్న సంగతి తెలిసిందే.
2sports
- వరల్డ్‌ నం.3పై సాత్విక్‌ జంట విజయం - చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఫుజౌ (చైనా) : భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకీ రెడ్డి, చిరాగ్‌ శెట్టిలు చైనా ఓపెన్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. సూపర్‌ ప్రదర్శనతో స్టార్‌ షట్లర్లను నిలకడగా మట్టికరిపిస్తున్న సాత్విక్‌, చిరాగ్‌ జోడీ శుక్రవారం జరిగిన మెన్స్‌ డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ నం.3 చైనా జోడిని ఓడించారు. 21-19, 21-15తో వరుస గేముల్లో లి జన్‌ హురు, లి యు చెన్‌లపై సాత్విక్‌, చిరాగ్‌ అలవోక విజయం సాధించారు. 43 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో 2018 వరల్డ్‌ చాంపియన్స్‌ను భారత జోడీ ఇంటికి సాగనంపింది. చైనా జోడీపై సాత్విక్‌, చిరాగ్‌లకు ఇది వరుసగా రెండో విజయం కావటం విశేషం. నేడు సెమీఫైనల్లో వరల్డ్‌ నం.1 మార్కస్‌ ఫెర్నాల్డి, కెవిన్‌ సంజయ (ఇండోనేషియా)లతో సాత్విక్‌, చిరాగ్‌ పోటీపడనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV కార్ల ధ‌ర‌ల‌ను పెంచేసిన ఆటోమొబైల్ కంపెనీ ఒక వైపున పెట్రో, డీజిల్‌ అమాంతం పెరుగుతున్న వేల ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా తమ కార్ల ధరలను పెంచాలని నిర్ణయించడం గమనార్హం. హ్యుందారు మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) తన కార్ల ధరలను పెంచేసింది Samayam Telugu | Updated: May 23, 2018, 05:36PM IST హ్యుందాయ్ హ్యుందాయ్ కార్ల ధ‌ర‌లు పెరిగాయ్ ఒక వైపున పెట్రో, డీజిల్‌ అమాంతం పెరుగుతున్న వేల ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా తమ కార్ల ధరలను పెంచాలని నిర్ణయించడం గమనార్హం. హ్యుందారు మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) తన కార్ల ధరలను పెంచేసింది. జూన్‌ నుంచి 2 శాతం మేర పెంచుతున్నట్టు ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన ఎస్‌యువి క్రెటా 2018 మినహా అన్ని వాహన ధరలు పెంచాలని నిర్ణయించింది. ముడి సరుకుల ధరల్లో పెరుగుదల, ఇంధన ధరల పెంపు, పన్నుల భారంతో తమ వాహన ధరలు పెంచాలని నిర్ణయించామని ఆ కంపెనీ డైరెక్టర్‌ రాకేష్‌ శ్రీవాత్సవ తెలిపారు. దేశంలో అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి కూడా వచ్చే నెల నుంచి తమ వాహన ధరలను పెంచనుందని సమాచారం. మ‌రో వైపు హ్యుందాయ్ స‌రికొత్త మోడ‌ళ్ల‌ను రిలీజ్ చేసింది. అందులో ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్ బాక్ కారును ఆటోమేటిక్ ట్రాన్స్ మిష‌న్ ఫీచ‌ర్‌తో విడుద‌ల చేసింది. భార‌త్‌లో హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏఎమ్‌టి ప్రారంభ ధ‌ర(ఎక్స్ షోరూం) రూ. 7.04 ల‌క్ష‌లుగా ఉండ‌నుంది. 2018 హ్యుందాయ్ క్రెటా వెర్ష‌న్ భార‌త‌దేశ మార్కెట్లోకి వ‌చ్చేసింది. ఇందులో ఫేస్ లిఫ్ట్ వెర్ష‌న్ క్రెటా ఎస్‌యూవీని విడుద‌ల చేసింది. 2018 హ్యుందాయ్ క్రెటా ప్రారంభ మోడ‌ల్ ధ‌ర(ఎక్స్ షోరూం) రూ.9.43లక్ష‌లుగా ఉంది. 2018 హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజన్ ఆప్షన్‌లలో ఐదు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. 2018 హ్యుందాయ్ క్రెటా ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.43 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 15.03 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
internet vaartha 195 Views ఐఎంఎఫ్‌ అంచనా న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్త (ఐఎంఎఫ్‌) భారత్‌ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలో 7.3శాతంగా ఉంటుందని వచ్చే ఏడా ది 7.5శాతంగా కొనసాగుతుందని అంచనా వేసింది. 2016లో ప్రపంచ ఆర్థిక వృద్ధి కూడా 3.4శాతంగా ఉంటుందని అంచనా. ప్రపంచ ఆర్థిక ముఖచిత్రనివేదికలో ఐఎంఎఫ్‌ చైనా ఆర్థికవృద్ధిని తగ్గించి 6.3శాతంగా నిర్ణయించింది. అలాగే 2017లో ఆరుశాతంగా ఉంటుందని ప్రకటించింది. ఆసియాలో మిగిలిన దేవౄలతో పోలిస్తే భారత్‌ వృద్ధి శరవేగంగా ఉంటుందని, చైనా ఆర్థిక సంక్షోభంతో కొన్ని దేశాలు నీరసిం చాయని అయితే భారత్‌ చైనా ఆర్థిక సమతు ల్యతను పరిగణనలోకి తీసుకుని ప్రపంచ ఉత్పత్తి రంగ క్షీణతను కూడా ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళుతుందని ప్రకటించింది. ప్రపంచ వృద్ధి ప్రకారంచూస్తే ఐఎంఎఫ్‌ 3.4శాతంగా ఉంది. 2017లో 3.6శాతం ఉంటుందని అంచనా. ఇక భారత్‌పరంగా ప్రస్తుత సంవత్సరంలో 7.3శాతంగా ఈ ఉంటుందని, 2018 నాటికి 7.5శాతంగా ఉం టుందని అంచనా. అయితే ఎదురయ్యే కీలక సవాళ్లు అధిగమించలేని పక్షంలో ప్రపంచ వృద్ధి కూడా కొంతమేర దిగజారుతుందని ఐఎంఎఫ్‌ ంచనా వేసింది. అంతర్జాతీయంగా కార్యకలాపాలు అక్టోబరునాటి కంటే కొంత మెరుగుపడతాయని ప్రత్యేకించి వర్ధమాన మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరింతగా కనిపిస్తుందని అంచనా వేసింది. గత నివేదికలో ఐఎంఎఫ్‌ అక్టోబరులో విడుదలచేసిన నివేదికలో భారత్‌ ఆర్థికవృద్ధిని 7.3శాతంగానిర్ణయించింది. తర్వా త సంవత్సరంలో 7.5శాతంగా ఉంటుందని న్రపకటించింది ప్రపంచ ఆర్థిక వృద్ధి 3.6శాతం ఉంటుందని, 2017లో 3.8శాతం ఉంటుందని ప్రకటించింది. వర్ధమానమార్కెట్లపరంగా చూస్తే ప్రపంచ ఆర్థికవృద్ధిలో 70శాతం వాటాతో ఉం టుందని అంచనా వేసింది. తక్కువ ఉత్పత్తి ధరలు, అమెరికా ఫెడ్‌రిజర్వు ఫండ్‌రేట్స్‌ను క్రమేపీ పెంచడం, చైనా ఆర్థిక సంక్షోభం, కరెన్సీ విలువల తగ్గింపు, ముడిచమురుధరల పతనం వంటి వాటి నుంచి అధిగమిస్తే వర్ధమాన దేశాల భవిష్యత్తు మరిం త మెరుగుపడుతుందని ఐఎంఎఫ్‌ విశ్లేషించింది.
1entertainment
TS MInister Ktr డిజిటల్‌ హబ్‌గా తెలంగాణ హైదరాబాద్‌, మే 16: డిజిటల్‌ తెలంగాణకు ప్రాధాన్యతనిస్తూ పారిశ్రామిక రంగ వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర ఐటి మున్సిపల్‌ పరిశ్రమలశాఖ మంత్రి కెటిరామారావు వెల్లడించారు. ఐసిటి 4డి జాతీయ సదస్సును ఆయన ప్రారంభించి అనంతరం సభలో ప్రసంగించారు. స్టార్‌అప్‌, వృత్తి నైపుణ్యం, ప్రజలకు ఇంటర్నెట్‌ను మరింతచేరువచేయ డం వంటి లక్ష్యాల్లో తమ ప్రభుత్వం ముందుందని అన్నారు. భారత్‌లోనే ఐసిడి 4డి సదస్సు జరగడం ఇదే పథమంఅని ఆయన అన్నారు. వివిధ విభాగాల నిపుణులు మేధావులు తమతమ ప్రసంగాలు, ఆలోచ నలతో సదస్సులో ఎక్కువ మందిని ఆకట్టుకున్నారు. మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఏకైకరాష్ట్రం గా ఇంక్యుబేటర్‌ ఏర్పాట్లు కీలకంగా నిలిచిందని అన్నా రు. సదస్సుకు సుమారు వెయ్యిమందికిపైగా ప్రతి నిధులు హాజరయ్యారు. హెచ్‌ఐసిసిలో జరిగిన ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వరంగం, ప్రైవేటురంగాల నుంచి మెగా నిపుణులు హాజర య్యారు. టెక్నాలజీరంగ మేధావివిభాగం కూడా హాజరై భావితరం ఆలోచన లను పంచుకున్నారు. ఐటిరంగపరంగా తెలంగాణ టిహబ్‌ ఎంతో విజయవం తం అయిందని కెటిఆర్‌ వివరించారు. హైఫై ప్రోగ్రామ్‌ కింద నగరంలో మొట్ట మొదటి వైఫై నగరంగా రికార్డు సాధించింద న్నారు. తెలంగాణ కూడా ఫైబర్‌గ్రిడ్‌ టిఫైబర్‌ ను ఏర్పాటుచేసి ప్రతి కుటుంబానికి నెట్‌ను చేరువచేసే లక్ష్యంతో ఉందన్నారు. డిజిటల్‌ తెలంగాణ బ్యానర్‌ కింద ఐసిడి 4డి సదస్సు జరగడం ముదావహమన ఇనిరాఈ్వహకులను అభినందించారు. ఐటిశాఖప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ సుస్థిర అభి వృద్ధి లక్ష్యాలకు తెలంగాణ ముందుంటుందని అన్నారు. డిజిటల్‌ ప్రభావకూటమి సాయంతో డిజిటల్‌ తెలంగాణ మరింతముందుకు వెళు తుందని చెప్పారు. కేథలిక్‌ రిలీఫ్‌ సేవలపరం గా ష్కైలర్‌ థ్రోప్‌ మాట్లాడుతూ డిజిటల్‌ సృజనాత్మకతలో భారత్‌ అగ్రస్థానంలో నిలుస్తోం దని ప్రశంసించారు. సదసుసలో డా.షాన్‌ ఫెర్రిస్‌, ప్రశాంత్‌ గుప్తా, సైయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బివిఆర్‌మోహన్‌రెడ్డి, జియోగ్రాఫిక్‌ సేవలసంస్థ ఎండి అజ§్‌ు విజ్‌ వంటి ప్రముఖులు భారత్‌లో ఐసిటి విధివిధానాలను వివరించారు.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV దీపిక 20వ స్థానంలో.. భారత్ ఏడో స్థానంలో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం మొదలయ్యేది మన కాలమాన ప్రకారం శనివారం తెల్లవారు జామునే అయినా భారత ఆర్చరీ జట్టు విశ్వక్రీడల పోరాటం శుక్రవారమే ప్రారంభించింది. BCCL | Updated: Aug 6, 2016, 01:31AM IST రియో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం మొదలయ్యేది మన కాలమాన ప్రకారం శనివారం తెల్లవారు జామునే అయినా భారత ఆర్చరీ జట్టు విశ్వక్రీడల పోరాటం శుక్రవారమే ప్రారంభించింది. రాత్రి 9.30 గంటలకు మొదలైన మహిళల ఆర్చరీ టీమ్ వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌లో దీపికా కుమారి, బొంబ్యాల దేవి, లక్ష్మీరాణి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో దీపికా కుమారి 640 పాయింట్లు సాధించి 20వ స్థానంలో నిలవగా.. బాంబేలా దేవి 638 పాయింట్లతో 24వ స్థానంలో నిలిచింది. లక్ష్మీరాణి 614 పాయింట్లతో 43వ స్థానంతో సరిపెట్టుకుంది. టీమ్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో భారత్‌ మొత్తం 1892 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌కి అర్హత సాధించింది. కాగా దక్షిణ కొరియాకు చెందిన ముగ్గురు ఆర్చర్లు మొదటి మూడు స్థానాల్లో నిలవడం విశేషం. అంతకుమందు సాయంత్రం ఐదు గంటలకు మొదలైన పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌లో భారత ఆర్చర్‌ అతాను దాస్‌ 683 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.
2sports
ఎన్టీఆర్ రెండో కొడుకుని చూశారా? Highlights పుట్టి ఒక్కరోజు మాత్రమే అయిన ఈ నందమూరి వారసుడి ఫోటో అప్పుడే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది.  యంగ్ టైగర్ ఎన్టీఅర్ కు ఇప్పటికే అభయ్ రామ్ అనే తనయుడు ఉన్నాడు. ఇప్పుడు మరోసారి అతడు తండ్రయ్యారు. ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా అభిమానులతో పంచుకున్నాడు ఎన్టీఆర్. అతడి భార్య ప్రణతి గురువారం మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టి ఒక్కరోజు మాత్రమే అయిన ఈ నందమూరి వారసుడి ఫోటో అప్పుడే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. ఈ ఫోటోను అభిమానులు షేర్ చేస్తూ అచ్చం ఎన్టీఆర్ లానే ఉన్నాడంటూ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత.. వీర రాఘవ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  Last Updated 14, Jun 2018, 11:43 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV యాపిల్ వాచ్‌లు వాడొద్దు.. పాక్ క్రికెటర్లకు ఐసీసీ ఆదేశం! మైదానంలో ఉన్నప్పుడు చేతికి యాపిల్ స్మార్ట్ వాచ్‌లు పెట్టుకోవడానికి వీల్లేదని పాకిస్థాన్ క్రికెటర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆదేశించింది. Samayam Telugu | Updated: May 25, 2018, 06:26PM IST యాపిల్ వాచ్‌లు వాడొద్దు.. పాక్ క్రికెటర్లకు ఐసీసీ ఆదేశం! మైదానంలో ఉన్నప్పుడు చేతికి యాపిల్ స్మార్ట్ వాచ్‌లు పెట్టుకోవడానికి వీల్లేదని పాకిస్థాన్ క్రికెటర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆదేశించింది. పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం లార్డ్స్ మైదానంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే తొలిరోజు పాకిస్థాన్ ఆటగాళ్లు కొందరు చేతికి యాపిల్ వాచ్‌లు పెట్టుకున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అసద్ షఫిక్, బాబర్ అజామ్ చేతికున్న యాపిల్ వాచ్‌ను చూస్తున్నట్లు కనిపించారు. ఇది కాస్త చర్చనీయాంశమై ఐసీసీ అవినీతి నిరోధకశాఖ దృష్టికి వెళ్లింది. దీంతో మైదానంలో యాపిల్ వాచ్‌లు వాడటానికి వీళ్లేదని ఐసీసీ అవినీతి నిరోధకశాఖకు చెందిన ఒక అధికారి పాక్ జట్టుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రెండో రోజు ఆటలో పాక్ క్రికెటర్లు యాపిల్ వాచ్‌లను పెట్టుకోలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లకు చెందిన వ్యక్తిగత గ్యాడ్జెట్లను మైదానంలోకి అనుమతించరు. క్రికెటర్లు బస్సు దిగుతున్నప్పుడే వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు ఇతర కమ్యూనికేషన్ గ్యాడ్జెట్లను తీసేసుకుంటారు. అయితే ఈ యాపిల్ వాచ్‌లు కూడా కమ్యూనికేషన్ గ్యాడ్జెట్ల కిందికే వస్తాయని ఐసీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. యాపిల్ వాచ్‌లను ఫోన్, వైఫై డివైజ్‌లకు కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చని, మెసేజ్‌లు రిసీవ్ చేసుకోవచ్చని చెప్పారు. కాబట్టి దీన్ని కూడా కమ్యూనికేషన్ గ్యాడ్జెట్‌గా పరిగణించి మైదానంలో వాడకూడదని ఆదేశించినట్లు వెల్లడించారు. వాస్తవానికి స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కున్న మహమ్మద్ అమీర్ ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు.
2sports
Hyderabad, First Published 9, Jul 2019, 7:41 AM IST Highlights విశాల్‌ హీరోగా తమిళంలో రూపొందిన చిత్రం ‘అయోగ్య’. తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది. ఏ.ఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌ మోహన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశాల్‌ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. ‘ఠాగూర్‌’ మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సార్థక్‌ మూవీస్‌ అధినేత ప్రశాంత్‌ గౌడ్‌ సొంతం చేసుకున్నారు. విశాల్‌ హీరోగా తమిళంలో రూపొందిన చిత్రం ‘అయోగ్య’. తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది. ఏ.ఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌ మోహన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశాల్‌ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. ‘ఠాగూర్‌’ మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సార్థక్‌ మూవీస్‌ అధినేత ప్రశాంత్‌ గౌడ్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 27న సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రేజీగా రిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రశాంత్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘అయోగ్య’ తమిళంలో ఘనవిజయం సాధించింది. అక్కడా బాక్సాఫీస్‌ వద్ద చక్కని వసూళ్లను రాబట్టింది. తమిళ క్రిటిక్స్‌ సైతం ఈ చిత్రానికి 3.5 రేటింగులు ఇచ్చి ప్రశంసలు కురిపించారు. విశాల్‌ ఎనర్జీ లెవల్‌ని పదింతలు చూపించిన సినిమా ఇది. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్‌ సినిమాకే హైలైట్‌.  తమిళనాడులో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా క్లైమాక్స్ సీన్స్ ని  దర్శకుడు తీర్చిదిద్దారు. తమిళంలో హిట్టయిన ఈ చిత్రాన్ని తెలుగులో మా సార్థక్‌ మూవీస్‌ ద్వారా రిలీజ్‌ చేస్తుండడం ఆనందాన్నిస్తోంది. తెలుగులో విశాల్‌ నటించిన సినిమాలన్నీ వరుసగా విజయాలు అందుకుంటున్నాయి. ఆ కోవలోనే ‘అయోగ్య’ ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఈనెల 27న ఏపీ, నైజాంలో రిలీజ్‌ చేస్తున్నామని తెలిపారు.  Last Updated 9, Jul 2019, 7:41 AM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV నన్ను, ధనుష్‌ను టార్చర్ చేశారు: అమలాపాల్ మలయాళం బ్యూటీ అమలాపాల్, ధనుష్‌తో కలిసి 'విఐపి2' సినిమాలో నటించింది. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. TNN | Updated: Aug 7, 2017, 08:22PM IST మలయాళం బ్యూటీ అమలాపాల్, ధనుష్‌తో కలిసి 'విఐపి2' సినిమాలో నటించింది. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న అమలాపాల్ ధనుష్‌తో తనకున్న బంధం గురించి అలానే సుచిలీక్స్‌పై స్పందించింది. '' ధనుష్ తో కలిసి వర్క్ చేయడం నాకిష్టం. సినిమాల పట్ల అంత ఫ్యాషన్ తో ఉంటారు. నాకు మంచి స్నేహితుడు కూడా. కానీ లేనిపోని వదంతులతో నన్ను, ధనుష్‌ను టార్చర్ చేశారు. సుచిలీక్స్‌లో ధనుష్‌కు నాకు మధ్య ఉందంటూ ప్రచారం జరిగింది. వాస్తవానికి సుచిలీక్స్‌తో సుచిత్రకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో ఆమె పేరును కావాలని ఉపయోగించుకొని అదంతా చేశారు. వ్యక్తిగంతగా సుచిత్ర నాకు మంచి ఫ్రెండ్'' అంటూ సుచిత్రకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. అలానే తన భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం నాకు మరోపెళ్లి చేసుకునే ఆలోచన లేదు. చేతిలో ఉన్న సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నా.. ధనుష్ నటిస్తోన్న తదుపరి సినిమా 'వడచెన్నై' కూడా నాకు అవకాశం వచ్చింది. కానీ నాకున్న కమిట్మెంట్స్ కారణంగా ఆ సినిమా చేయలేకపోతున్నాను అని స్పష్టం చేశారు.
0business
sumalatha 130 Views bse , NSE , stock market Sensex ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా నమోదవుతున్నాయి. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 34 పాయింట్లు నష్టపోయి 36,530 వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 10,784 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.85 వద్ద కొనసాగుతుంది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
1entertainment
Flipkart ఫ్లిప్‌కార్ట్‌లో తాజా పెట్టుబడులు 100 కోట్ల డాలర్లు ముంబై: ఇబే, టెన్సెంట్‌ కంపెనీలు ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వందకోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించాయి. ఆన్‌లైన్‌ రిటైల్‌ రంగంలో మరింత వృద్ధి ఎక్కువవుతు న్నందున ఫ్లిప్‌కార్ట్‌లో తమ పెట్టుబడులు ఉంటా యని చెపుతున్నాయి. తాజా ఫండింగ్‌ విలువల ప్రకారం బెంగళూరు కేంద్రంగా ఉన్న ఫ్లిప్‌కార్ట్‌ విలు వలు 11బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంతకు ముందు 15.2 బిలియన్‌ డాలర్ల విలువల నుంచి తగ్గాయి. అయితే మ్యూచువల్‌ఫండ్‌ ఇన్వెస్టర్లు, మోర్గాన్‌ స్టాన్లీ వంటి కంపెనీలు ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌ విలువలు ఒకదశలో 5.39 బిలియన్‌ డాలర్లుగా అంచనావేసాయి. వీటితో పెట్టుబడులకు కొన్ని సంస్థలు ముందుకురాలేదు. తాజాగా విదేశీ సంస్థ లు టెన్సెంట్‌, దేశీయంగా ఉన్న ఇబే సంస్థలు పెట్టు బడులు పెడుతున్నాయి. కొన్ని నెలలుగా ఫ్లిప్‌కార్ట్‌ నిధులసమీకరణకు కసరత్తులు చేస్తోంది. చైనా ఆలీబాబా, యుఎస్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ వంటివి కూడా ఒకదశలో సంప్రదింపులు జరి పాయి. అయితే ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌ విలువలు 12 బిలియన్‌ డాలర్లు ఉండకపోవచ్చన్న సందేహాలతో వెనకడగు వేసాయి. టైగర్‌గ్లోబల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అతి పెద్ద ఇన్వెస్టరుగా కొనసాగుతోంది. కనీసం వంద కోట్లడాలర్ల పెట్టుబడులున్నట్లు అంచనా. ఫ్లిప్‌కార్ట్‌ సిఇఒ కళ్యాన్‌కృష్ణమూర్తి గతంలో ఇబే ఎగ్జిక్యూటివ్‌ గా ఉన్నారు. అమెజాన్‌ నుంచి గట్టిపోటీ వస్తుం డటంతో కొందరు ఇన్వెస్టర్లు పెట్టుబడులకుసైతం సుముఖంగా లేరు. మూడేళ్ల వ్యవధిలోనే అమెజాన్‌ అతిపెద్ద ఆన్‌లైన్‌ దిగ్గజంగా నిలిచింది. తాజాగా వచ్చిన వందకోట్ల డాలర్ల నగదు నిల్వలతో కూడా ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంటింగ్‌ పెంచుకోలేదని అంచనా. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువభాగం మార్కెటింగ్‌ ఉన్న విభా గాలను ఇప్పటికే అమెజాన్‌ సేకరిస్తోంది. అందు వల్లనే ఫ్లిప్‌కార్ట్‌కు అమెజాన్‌నుంచే గట్టిపోటీ ఎదు రవుతున్నది. సిఇఒ కళ్యాణ్‌కృష్ణమూర్తి అనుసరించే వ్యూహంపైనే ఫ్లిప్‌కార్ట్‌ భవిష్యత్‌ పెట్టుబడులు ఆధా రపడి ఉంటాయన్నది మార్కెట్‌ నిపుణుల అంచనా. ========================
1entertainment
Dec 08,2015 ఇండియన్‌ బ్యాంక్‌ శాఖలు ప్రారంభం హైదరాబాద్‌: ఇండియన్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌లో మరో రెండు కొత్త శాఖలను తెరిచింది. ఫిర్జాదీగూడ, మౌలాలీల్లో ఏర్పాటు చేసిన కొత్త శాఖలను బ్యాంకు సోమవారం ప్రారంబి óంచింది. ఫిర్జాదీగూడా శాఖను వ్యవసాయశాఖ మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ ఎ.శరత్‌, మౌలాలీ శాఖను యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌లు ప్రారంభించారు. ఇండియన్‌ బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌, జోనల్‌ మేనేజర్‌ లక్ష్మీపతి రెడ్డి, హైదరాబాద్‌ జోన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ కుమార్‌లు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్త బ్యాంకుల రాకతో హైదరాబాద్‌లో ఇండియన్‌ బ్యాంక్‌ శాఖలు 48కి చేరాయి. ఈ సందర్భంగా లక్ష్మీపతిరెడ్డి బ్యాంకు అందిస్తున్న పలు సేవలు, సౌకర్యాలు, పథకాలను గురించి వినియోగదారులకు వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ టైటిల్ "తొలి ప్రేమ" Highlights పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ తొలి ప్రేమ  హీరో వరుణ్ తేజ్ ఫిదా తో తన కెరీర్లోనే ది బెస్ట్ సక్సెస్ అందుకున్నాడు  వరుణ్ తన నెక్ట్స్ మూవీ టైటిల్  తొలి ప్రేమ అని తెలుస్తుంది   మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ 'ఫిదా'తో తన కెరీర్లోనే ది బెస్ట్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఫిదా తర్వాత వరుణ్ రొమాంటిక్ ఎంటర్టెనర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు వెంకీ ఆట్లూరి దర్శకత్వం వహిస్తారట.   ఈ చిత్రానికి  తొలి ప్రేమ అనే టైటిల్ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇదే టైటిల్ పెడతారా? లేక మారుస్తారా? అనేది ఫైనల్ కావాల్సి ఉంది. వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ 1998లో చేసిన 'తొలి ప్రేమ' చిత్రానికి, వరుణ్ తేజ్ చేయబోయే చిత్ర కథకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తొలి ప్రేమ'. వరుణ్ తేజ్ సినిమాకు ఈ టైటిల్ పెట్టడం ద్వారా పబ్లిసిటీ పరంగా బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు.వరుణ్ తేజ్ చేయబోయే సినిమా స్టోరీ ఒక సెన్సబుల్ లవ్ స్టోరీగా ఉంటుందని, కథ ప్రకారం ఫస్ట్ లవ్ నేపథ్యంలో ఉంటుందని. ఈ కథకు తొలిప్రేమ అనే టైటిల్ అయితేనే బావుంటుందని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించి లండన్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 35 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ చేయనున్నారు. వచ్చే చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లే అవకాశం ఉంది.ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్‌‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్రం ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. జ్యోతిర్మ‌యి గ్రూప్స్ చిత్ర స‌మ‌ర్ప‌కులు. Last Updated 25, Mar 2018, 11:53 PM IST
0business
చిన్న చిన్న అంతరాలను పూరిస్తాం -  ఓఆర్‌ఓపిపై పారిక్కర్‌   న్యూఢిల్లీ : ఎన్నో ఏళ్లుగా మాజీ సైనికులు చేస్తున్న వన్‌ ర్యాంక్‌, వన్‌ పెన్షన్‌ (ఓఆర్‌ఓపి) సమస్య పరిష్కారంలో ప్రధాన మంత్రి కార్యాలయం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందని రక్షణ మంత్రి మనోహర్‌ పారిక్కర్‌ అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉందన్నారు. 'ఇప్పుడు చిన్న చిన్న అంతరాలను పరిష్కరిస్తాము. ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 15న దీనికి ఆమోదముద్ర వేశారు. ఇపుడు ప్రధాని కార్యాలయం ప్రత్యక్ష జోక్యం ఉంది. సమస్య పరిష్కారానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి' అని పారిక్కర్‌ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఓఆర్‌ఓపి అమలుకు సంబంధించి కీలక అంశాల పరిష్కారానికి ఆందోళన చేస్తున్న మాజీ సైనికులు, ప్రభుత్వం మధ్య గురువారం జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Paramesh Bandari 101 Views Badminton , carolina , CHINA OPEN , Worlds badminton championship చైనా ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్న కరోలినా మూడు సార్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న స్పానిష్ బాడ్మింటన్ క్రీడాకారిణి 8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు చైనా ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. కెరీర్ ను దూరం చేసే గాయాలనుంచి బయటపడి ఇప్పుడు టైటిల్ ను సొంతం చేసుకున్నందున ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. 56నిముషాల అవిశ్రాంత ఆటలో గెలిచి ఒక్కసారిగా కుప్పకూలి “నేను ఊహించలేదు నేను కోలుకున్న తర్వాత మళ్ళీ గెలుస్తానని ” అని కన్నీటి పర్యంతమయ్యారు కరోలినా .
2sports
Andhra Bank వడ్డీరేట్లు తగ్గించిన ఆంధ్రాబ్యాంకు హైదరాబాద్‌, జనవరి 3: వ్యయ ఆధారిత వడ్డీరేట్ల నియంత్రణకు శ్రీకా రం చుట్టిన ప్రభుత్వరంగ బ్యాంకులు ఒక్కొక్కటిగా వడ్డీ రేట్లను తగ్గి స్తున్నాయి. ఎంసిఎల్‌ఆర్‌గా భావించే ఈ వడ్డీరేట్లను ప్రభుత్వ రంగం లోని ఆంధ్రాబ్యాంకు 80బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. నెల రోజు లు, మూడునెలలు, ఆరునెలలు, ఏడాది కాలపరిమితిగల ఆర్థిక ఉత్ప త్తులపై వడ్డీరేట్లను తగ్గించింది. ఏడాదికాలానికి వ్యయ ఆధారిత వడ్డీరేట్‌ను 8.65శాతంగా నిర్ణయిం చింది. ప్రస్తుతం 9.45శాతంగా మాత్రమే వడ్డీ అమలుచేస్తున్న ఆంధ్రాబ్యాంకు గణనీయంగా తగ్గించిం ది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోనికి వస్తాయని ఆంధ్రాబ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ వివరించారు.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఆ టీచర్‌‌ను నిజాయతీగా ప్రేమించాను- బాలీవుడ్ హీరో చిన్నప్పుడు తన క్లాస్ టీచర్‌ను నిజాయతీగా ప్రేమించానని అంటున్నారు సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఆయన నటించిన ‘చిచ్చోరే’ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఓ ప్రెస్ మీట్‌లో సుశాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. Samayam Telugu | Updated: Sep 28, 2019, 03:12PM IST సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అమ్మాయిల సంగతి ఎలా ఉన్నా.. అబ్బాయిలకు మాత్రం ఫస్ట్ క్రష్ కానీ ఫస్ట్ లవ్ కానీ స్కూల్ టీచర్‌పై ఉండి ఉంటుంది. ఫలానా టీచర్ అందంగా కనిపిస్తే చాలు ఆమె కోసమైనా ఒక్క రోజు కూడా క్లాస్ ఎగ్గొట్టకుండా వెళ్లిన విద్యార్థులు ఉండకపోరు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా ఈ కోవకు చెందిన కుర్రాడేనట. ఆయన కెరీర్ మొదలుపెట్టిన ఆరేళ్లలో సారా అలీ ఖాన్, కృతి సనన్, రియా చక్రవర్తిలతో డేటింగ్‌ చేశాడని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ తాను మాత్రం వారెవ్వరినీ ప్రేమించలేదని ఇండియా టుడే మైండ్ రాక్స్ దిల్లీ అనే ఈవెంట్‌లో వెల్లడించారు. ‘నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడే నిజమైన ప్రేమను చూశాను. ఓ టీచర్‌‌ను చాలా నిజాయతీగా ప్రేమించాను. కానీ నేను ఆమెకు ఆ విషయాన్ని చెప్పలేకపోయాను. ఎందుకంటే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతానేమోనని భయం. ఆ తర్వాత పరీక్షలు పూర్తయ్యాక కూడా ఈ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోయాను. అంతేకాదు నేను నా జీవితంలో ఇప్పటివరకు ఎవ్వరికీ ఐ లవ్యూ అని చెప్పింది లేదు. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు నాకు ఫస్ట్ ప్రపోజల్ వచ్చింది. ఆ తర్వాత కాలేజ్‌కి వెళ్లాక నా ఇంజినీరింగ్ ఫ్రెండ్స్‌కి క్లాసెస్ చెప్పేవాడిని. వారి నుంచి డబ్బులు కూడా తీసుకునేవాడిని. వచ్చిన డబ్బుతో బైక్ కొనుక్కున్నాను. ఆ తర్వాత ఒక అమ్మాయితో డేట్‌కి వెళ్లాను. తనను నా బైక్ ఎక్కించుకుని పరోటాలు తినిపించడానికి తీసుకువెళ్లాను’ అని వెల్లడించారు సుశాంత్. READ ALSO: ‘ఆ దర్శకుడు ముగ్గుర్ని లైంగికంగా వేధించాడు, నిర్దోషి అని ప్రూవైతే...’ అయితే ఇక్కడ ఒక విషయంలో సుశాంత్ దొరికిపోయాడు. ఆయన తన కెరీర్‌లో ‘పవిత్ర రిష్తా’ అనే హిందీ సీరియల్‌తో ప్రారంభించారు. ఇందులో బాలీవుడ్ నటి అంకితా లోఖాండే ఆయనకు భార్య పాత్రను పోషించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టి కొంతకాలం డేటింగ్ చేశారు. తాను ప్రేమలో ఉన్నానని సుశాంత్ కూడా అప్పట్లో ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత సుశాంత్ సినిమాల్లోకి వచ్చేశాడు. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అయితే అంకితతో ప్రేమలో ఉన్నానని చెప్పిన సుశాంత్ తన జీవితంలో ఎవ్వరికీ ఐ లవ్యూ చెప్పలేదని అంటున్నారు. ఐ లవ్యూ చెప్పకుండా అంకితతో ఎలా డేటింగ్ చేశారో ఆయనకే తెలియాలి. సుశాంత్ నటించిన ‘చిచ్ఛోరే’ చిత్రం ఇటీవల విడులైంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. మరోపక్క సుశాంత్ నటించిన ‘డ్రైవ్’ సినిమా థియేటర్‌లో విడుదలకు నోచుకోవడంలేదు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Visit Site Recommended byColombia దేవదాసు: సెల్యూలాయిడ్‌పై ప్రాణం పోసుకున్న ఎన్నో ప్రేమకథల్లో ఓ అద్భుతమైన దృశ్య కావ్యం లాంటిది ఈ సినిమా. 'దేవదాస్' పేరిట ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు తెరకెక్కినప్పటికీ... ఏఎన్నార్ నటించిన దేవదాసు మాత్రం అన్నింటిల్లోకెల్లా ప్రత్యేకమైనదిగా సినీ విమర్శకులు చెబుతుంటారు. ఎన్నో ప్రేమకథలకి రాయని నిఘంటువులా మారిందీ చిత్రం. దేవదాసు ప్రేమ విఫలమైనా... సినిమా మాత్రం ఘన విజయం సాధించింది. ప్రేమాభిషేకం : టాలీవుడ్‌లో లవ్ స్టోరీలకి కొత్త ట్రెండ్ నేర్పిన సినిమా ప్రేమాభిషేకం అయితే, ఈ తరహా లవ్ స్టోరీలు చేసి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు ఏఎన్నార్. ఆయనకి రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చిపెట్టింది కూడా ఇటువంటి సినిమాలే. కొన్ని థియేటర్లలో 365రోజులకిపైగా విజయవంతంగా నడిచిన సినిమా ఇది. మరోచరిత్ర : తెలుగు, తమిళ సినిమాకి కొత్త నడకలు నేర్పించిన దర్శకుడు కే బాలచందర్ తెరకెక్కించిన కదిలే బొమ్మల కథే ఈ మరోచరిత్ర. టైటిల్‌కి తగినట్టే, సినీ ప్రపంచంలో మరోచరిత్ర సృష్టించిందీ సినిమా. కమల్ హాసన్, సరిత జంటగా నటించిన ఈ మూవీ అప్పటికీ.. ఇప్పటికీ.. ఇంకెప్పటికీ మర్చిపోలేనన్ని జ్ఞాపకాల్ని అందించింది. తెలుగు భాష తెలియని ఒక తమిళ కుర్రాడు... తమిళం భాష రాని ఓ తెలుగమ్మాయి మధ్య పుట్టిన ప్రేమ ఎన్ని హోయలు పోయింది, ఎన్ని బాధలు అనుభవించింది... చివరకి ఎలా ముగిసింది అనేదే ఈ 'మరోచరిత్ర'. సీతాకోకచిలుక : హిందూ మతానికి చెందిన ఓ యువకుడు, క్రిష్టియన్ యువతికి మధ్య చిగురించిన ప్రేమే ఈ సీతాకోకచిలుక. రెండు వేర్వేరు మతాలకి చెందిన ఈ ప్రేమజంట కథ సుఖాంతం అవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి ? ఆ ఇబ్బందులన్నింటినీ ఆ జంట ఎలా అధిగమించగలిగింది అనేదే ఈ సినిమా కథనం. ఈ లవ్ స్టోరీకి వెన్నెముక కథే అయినప్పటికీ... ప్రాణం పోసింది మాత్రం మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతమే. గీతాంజలి : తెలుగు సినిమాలన్నింటిల్లోకెల్లా ఆల్ టైమ్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఈ గీతాంజలి సినిమా అని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అనారోగ్యంబారినపడి ఇంకొద్ది రోజులకి మించి బతకలేని పరిస్థితుల్లో వున్న ఓ యువజంట మధ్య అనుకోకుండా ఏర్పడిన పరిచయం అంతేవేగంగా ప్రేమగా మారడం.. ఆ తర్వాత ఒకరికోసం మరొకరు తపించిపోవడాన్ని అంత హృద్యంగా తెరకెక్కించడం ఆ సినిమా డైరెక్టర్ మణిరత్నంకే చెల్లిందేమో! వ్యక్తిగతంగా దర్శకుడు మణిరత్నం, కంపోజర్ ఇళయరాజాల ప్రతిభకి ఈ సినిమా ఎప్పటికీ ఓ ఎగ్జాంపుల్‌గా నిలిచిపోయింది. అందుక్ ఆల్ టైమ్ సూపర్ హిట్ లవ్ స్టోరీ అయ్యింది. అభినందన : ఎంతో గాఢంగా ప్రేమించుకున్న ఓ ప్రేమ జంట కొన్ని అనుకోని కారణాలతో దూరమైపోవడం.. తిరిగి కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఒక్క చోటికి చేరడం.. అనంతరం తనకి తెలియకుండానే ఆ ఇద్దరూ విడిపోవడానికి కారణమైన వ్యక్తే మళ్లీ ఆ ఇద్దరినీ కలపడం కోసం ప్రాణత్యాగం చేయడమే ఈ అభినందన కథాంశం. ఈ రొమాంటిక్, శాడ్ లవ్ స్టోరీని మెలోడియస్‌గా మలిచాడు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా. ప్రేమ : వెంకటేష్, రేవతి జంటగా నటించిన ఈ సినిమా అంతకు ముందు వచ్చిన ఎన్నో ప్రేమకథల్లాంటిదే. కానీ ఆడియెన్స్ హృదయాల్లో మాత్రం వాటన్నింటికన్నా ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుందీ సినిమా. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎన్నో ప్రేమ కథలకి తనదైన సంగీతంతో ప్రాణం పోసిన ఇళయరాజానే ఈ ప్రేమని కూడా ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ చేయడం. తొలిప్రేమ : పవన్ కళ్యాణ్‌కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించిపెట్టిన ఈ సినిమా ఆ తర్వాత వచ్చిన మరెన్నో లవ్ స్టోరీలకి ఓ ప్రామాణికంగా మారింది. లవ్ స్టోరీ అంటే ఇలాగే వుండాలి.. హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలంటే ఇలాగే తెరకెక్కించాలనేంత గొప్పగా 'తొలిప్రేమ'ని మలిచాడు దర్శకుడు కరుణాకరన్. నేటి తరం తెలుగు సినిమాలో ఎవర్ గ్రీన్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఈ 'తొలిప్రేమ'. ఆర్య : లవ్ అనే పదానికి ఓ కొత్త నిర్వచనం చెప్పిన సినిమా ఆర్య. తాను ప్రేమించిన అమ్మాయి సుఖం కోసం, కేవలం ఆమె సౌఖ్యం కోసం తన ప్రేమని త్యాగం చేయడానికి సిద్ధపడే ఓ యువకుడి లవ్ స్టోరీ ఇది. ప్రియురాలి సౌఖ్యం కోసం తన ప్రేమనే త్యాగం చేయడమేంటని ఈ స్టోరీ లైన్‌పై అప్పట్లోనే కొన్ని విమర్శలు వినిపించాయి. కానీ దర్శకుడు సుకుమార్ 'ఆర్య'ని రూపొందించిన విధానం మాత్రం అతడిని మొట్టమొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్స్ జాబితాలో చేర్చింది. లవ్ ఫెయిల్ అయినంత మాత్రాన్నే దేవదాసుగా మారక్కర్లేదనే సందేశాన్ని కూడా యువతకి అందించిందీ సినిమా. మగధీర : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ తెలుగు సినిమా స్థాయిని పెంచింది. లవ్ స్టోరీ అంటే ఎంతసేపూ కేవలం ప్రస్తుతం, ఫ్లాష్ బ్యాక్‌లే కాదు.. గత జన్మని, పునర్జన్మని కనెక్ట్ చేస్తూ కూడా ఓ అందమైన లవ్ స్టోరీని అల్లుకోవచ్చని నిరూపించాడు రాజమౌళి. 400 ఏళ్ల క్రితం ప్రేమ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఓ ప్రేమ జంట 400 ఏళ్ల తర్వాత తిరిగి పుడితే ఎలా వుంటుదనేదే మగధీర. గతంలో కూడా పునర్జన్మ కాన్సెప్ట్‌తో లవ్ స్టోరీలు తెరకెక్కినప్పటికీ.. అవేవీ ఇంత ఘన విజయాన్ని అందుకోలేదు. కమెర్షియల్‌గా కలెక్షన్లలో టాలీవుడ్ రికార్డులు తిరగరాసిన ఈ లవ్ స్టోరీ రాంచరణ్‌కి కెరీర్ తొలినాళ్లలోనే బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించిందీ సినిమా. తెలుగు సినిమాల్లో ఈ మిలీనియంలో వచ్చిన మొట్టమొదటి విజువల్ వండర్ కూడా మగధీరనే అనుకోవచ్చు. ప్రేమ నేపథ్యంలో వచ్చిన ఇంకెన్నో సినిమాలు ఆడియెన్స్ మనసు దోచుకున్నాయి... సూపర్ హిట్ అయ్యాయి. సినిమా ఎంత పాతదయినా.. ఎన్నిసార్లు చూసినా.. చూసిన ప్రతీసారి ఏదో కొత్తదనం కనిపించడమే ఈ లవ్ స్టోరీల ప్రత్యేకత. అటువంటి మచ్చు తునకల్నే కొన్నింటిని ఇక్కడ మచ్చుకు ప్రస్తావించుకోవడం జరిగింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ద్రవిడ్ సలహా విజయ్ శంకర్ కెరీర్‌ను మలుపు తిప్పింది ఇటీవలే టీమిండియాకు ఎంపికైన తమిళనాడు క్రికెటర్ విజయ్ శంకర్ కెరీర్‌ను ద్రవిడ్ సలహా మలుపు తిప్పింది. TNN | Updated: Nov 22, 2017, 01:07PM IST తమిళనాడు క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడుతున్న విజయ్ శంకర్‌కు టీమిండియా నుంచి పిలుపొచ్చింది. భారత జట్టులో చోటు దక్కడం పట్ల ఈ ఆల్‌రౌండర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆనందంలో ఓ క్షణం పాటు మైండ్ బ్లాంక్ అయ్యిందని తెలిపాడు. విజయ్ శంకర్ గతంలో ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసేవాడు. ఓసారి తన ఆరాధ్య క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు బౌలింగ్ చేసే అవకాశం లభించింది. చెపాక్‌లో రాహుల్‌కు బౌలింగ్ చేయడం విజయ్‌కు కాస్త బెరుకుగా అనిపించింది. బంతిని సరిగా విసరలేకపోయాడు. అతడి ఇబ్బందిని గమనించిన ద్రవిడ్ బంతిని అందిస్తూ.. భయపడకు, నీ బౌలింగ్ యాక్షన్ నాకు నచ్చింది. లెంగ్త్ బాగుంది. కానీ కొంచెం అదనపు వేగంతో విసురు అని సలహా ఇచ్చాడు. బ్యాటింగ్‌లోనూ ద్రవిడ్ విజయ్‌కు కిటుకులు నేర్పాడు.
2sports
Hyderabad, First Published 7, Sep 2019, 9:37 AM IST Highlights అక్షయ్ కుమార్ తన స్కూల్ ఫ్రెండ్ అని మళ్ళీ అతనితో కలిసి పని చేస్తానని ఊహించలేదని అన్నారు. చిచ్చోరే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన సాజిద్ ఎవరికి తెలియని విషయాన్ని బయటపెట్టాడు.  కాలం ఎంత విచిత్రంగా ఉంటుందో అప్పుడప్పుడు కొన్ని ఘటనలు ఉదాహరణగా నిలుస్తాయి. ఒకప్పుడు ఒకే క్లాస్ రూమ్ లో పక్కపక్కనే కూర్చున్న వ్యక్తులు అనుకోకుండా ఒకే రంగంలో ఎదురుపడితే ఆ అనుభవం వర్ణనాతీతం.  బాలీవుడ్ ప్రముఖ నిర్మాత దర్శకుడు అయిన సాజిద్ నదియద్వాల కూడా అలాంటి అనుభవాన్నే రుచి చూశాడు.అక్షయ్ కుమార్ తన స్కూల్ ఫ్రెండ్ అని మళ్ళీ అతనితో కలిసి పని చేస్తానని ఊహించలేదని అన్నారు. చిచ్చోరే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన సాజిద్ ఎవరికి తెలియని విషయాన్ని బయటపెట్టాడు.  అక్షయ్ తో చిన్నప్పుడు డాన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నట్లు చెప్పిన సాజిద్ ఇద్దరం ఒకే క్లాస్ లో సేమ్ బెంచ్ లో కూర్చునేవాళ్ళమని తెలిపారు. సినీ ఫీల్డ్ లోకి వచ్చిన తరువాత 1993లో మొదటిసారి అక్షయ్ తో వక్త్ హామరా అనే సినిమాను నిర్మించినట్లు చెబుతూ.. కాలం మళ్ళీ మమ్మల్ని అలా కలుపుతుందని తాము ఉహించలేదని అన్నారు. Last Updated 7, Sep 2019, 9:46 AM IST
0business
Suresh 174 Views మెల్‌బోర్న్‌: అమెరికా నల్లకలువ సెరీనా విలియమ్స్‌, రష్యా అందాల సుందరి షరపోవా ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ క్వార్టర్‌్‌ ఫైనల్స్‌లో తలపడనున్నారు.గత ఏడాది ఈ ఇద్దరూ ఫైనల్స్‌లో పోటీపడగా,, ఈ ఏడాది క్వార్టర్‌్‌ ఫైనల్స్‌లో ఆమీతూమీ తేల్చుకోనున్నారు. అయితే గత ఏడాది ఫైనల్స్‌లో విజేతగా సెరీనా నిలిచిన విషయం విదితమే. ఇదిలా ఉండగా శనివారం ఇక్కడ జరిగిన నాలుగో రౌండ్‌:లో సెరీనా 6-2, 6-1 స్కోరుతో రష్యాకు చెందిన గాస్ప్‌ర్‌ఎస్‌పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు షరపోవా 7-5, 7-5 తేడాతో స్వీడన్‌కు చెందిన బెనిక్‌ను వరుసెట్లలో ఓడించి. క్వార్ట్టర్‌ ఫైనల్స్‌లో సెరీనాతో తలపడనుంది.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV శరణ్యకు పెళ్లి విలేజ్ లో వినాయకుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి శరణ్యా మోహన్. TNN | Updated: Jul 14, 2015, 02:51PM IST విలేజ్ లో వినాయకుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి శరణ్యా మోహన్ . ఎక్కడా గ్లామర్, ఎక్స్ పోజింగ్ కు తావివ్వకుండా, కట్టూ బొట్టూ విషయంలో చాలా కఠినంగా ఉండే కథానాయిక శరణ్య. అందుకే హీరోయిన్ తరవాత చెల్లెలి పాత్రలతో సరిపెట్టుకుంది. ఇప్పడు తను పెళ్లి కూతురు కాబోతోంది. ఈ కేరళ కుట్టికి ఈమెకు దంత వైద్యుడిగా పనిచేస్తున్న అరవింద్ కృష్ణన్ తో నిశ్చితార్థమైంది. త్వరలో వివాహం. ఈ విషయాన్ని తనే స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించింది. తన జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుందాం.
0business
10 best dialogues of super star rajinikanth that made him superstar సింహం సింగిల్‌గా వస్తుంది.. రజినీకాంత్ పవర్‌ఫుల్ డైలాగ్స్ ఇవిగో! నేడు తలైవా పుట్టినరోజును పురష్కరించుకుని ఆయన సినిమాల్లోని కొన్ని పవర్‌ఫుల్ డైలాగులను మీకోసం అందిస్తున్నాం. Samayam Telugu | Updated: Dec 12, 2018, 06:37PM IST సూపర్ స్టార్ రజినీకాంత్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఆయన స్టైల్, పంచ్ డైలాగులు. పేరుకు ఆయన తమిళ తలైవానే అయినా తెలుగులోనూ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. అందుకే ఆయన ప్రతి తమిళ సినిమా తెలుగులోకి అనువాదమవుతుంది. నేడు రజినీకాంత్ పుట్టినరోజు. నేటితో ఆయన 68వ ఏట అడుగుపెట్టారు. అయినప్పటికీ ఇంకా యంగ్ హీరోల్లా ఇరగదీస్తున్నారు. అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. ఇటీవల విడుదలైన ‘2.0’ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. రజినీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘పేటా’ టీజర్ యూట్యూబ్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే, నేడు తలైవా పుట్టినరోజును పురష్కరించుకుని ఆయన సినిమాల్లోని కొన్ని పవర్‌ఫుల్ డైలాగులను మీకోసం అందిస్తున్నాం. ✦ ఏరా నీతిలేని కుక్క. మనకింద పనిచేసే వాళ్లకి తిండి బట్టా ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది, నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్నవాళ్ల పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. - పెదరాయుడు ✦ బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావాల్సింది.. నాకు కావాల్సింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం.. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. - పెదరాయుడు ✦ ఇచ్చిన మాట, చేసిన వాగ్ధానం తిరిగి తీసుకునే అలవాటు మా వంశ పారంపర్యంలోనే లేదు. - ముత్తు
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కీర్తి డబ్బింగ్ కష్టాలు... నవ్వు ఆపుకోలేరు... వీడియో వైరల్ Highlights కీర్తి డబ్బింగ్ కష్టాలు... నవ్వు ఆపుకోలేరు... వీడియో వైరల్ సావిత్రి లాంటి మహానటిని మ్యాచ్ చేయడమంటే మాటలు కాదు. సావిత్రి లాంటి రూపం ఒక్కటి ఉంటే సరిపోదు. ఆమెలా అభినయించాలి. ఆమెలా హావభావాలు పలికించాలి. ఆమెలా నడవాలి. ఆమెలా మాట్లాడాలి. ఐతే ఈ విషయాలన్నింటిలో కీర్తి మంచి మార్కులే కొట్టేసింది. ‘మహానటి’లో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐతే తెలుగు భాష నేర్చుకుని.. సావిత్రి పాత్ర చేస్తూ స్పష్టంగా డైలాగులు చెప్పడమంటే అంత సులువైన విషయం కాదు. ‘మహానటి’ టీం. డబ్బింగ్ స్టూడియోలో కీర్తి పాట్లన్నింటినీ ఇందులో చూపించారు. ఒక్క చిన్న డైలాగ్ కోసం ఎన్ని టేకులు తీసుకుందో ఇందులో చూడొచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV కళ్యాణ్ రామ్.. ‘ఎంత మంచివాడవురా!’ ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ ఇచ్చారు. తాను చాలా మంచివాడిని అనిపించుకున్నానని చెబుతున్నారు. Samayam Telugu | Updated: Jul 5, 2019, 10:29AM IST కళ్యాణ్ రామ్.. ‘ఎంత మంచివాడవురా!’ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పటికే ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనిపించుకున్నారు. ఇప్పుడు ‘ఎంత మంచివాడవురా!’ అనిపించుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ ఇటీవల తన 17వ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘శతమానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్. గోపీసుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ అధినేత ఉమేష్ గుప్త సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు (జులై 5న) కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. Title Poster of #EnthaManchivaadavuraa Link: https://t.co/q4JG3R49G8 #HBDKalyanRam @nandamurikalyan… https://t.co/QlweZNogAJ — Aditya Music (@adityamusic) 1562296230000 ఈ సినిమాకి ‘ఎంత మంచివాడవురా!’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్ అయితే అదిరింది. మరి సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. ‘శతమానం భవతి’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వేగేశ్న సతీష్. వాస్తవానికి ‘దొంగల బండి’ సినిమాతో తన డైరెక్షన్ కెరీర్‌ను సతీష్ మొదులుపెట్టారు. 1999లో రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సతీష్.. రచయితగా మంచి హిట్ సినిమాలు చేశారు. ముప్పలనేని శివ, ఈవీవీ సత్యనారాయణతో కలిసి పనిచేశారు. అయితే, డైరెక్టర్‌గా నిలదొక్కుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. ‘రామయ్యా వస్తావయ్యా’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలకు రచయితగా పనిచేసినప్పుడు సతీష్‌లోని దర్శకుడిని చూసిన దిల్ రాజు ‘శతమానం భవతి’తో అవకాశం ఇచ్చారు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఉప్పల్‌‌లో కోహ్లిసేన ఆసీస్ భరతం పడుతుందా? ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడే జట్టుతోనే ప్రపంచకప్‌ బరిలోకి దిగుతామని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు సారథి విరాట్ కోహ్లి సంకేతాలిచ్చిన నేపథ్యంలో అందరూ కన్ను ఈ సిరీస్‌పై పడింది. Samayam Telugu | Updated: Mar 2, 2019, 11:03AM IST ఉప్పల్‌‌లో కోహ్లిసేన ఆసీస్ భరతం పడుతుందా? హైలైట్స్ ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఈరోజు తొలి వన్డే జరగనుంది. ప్రపంచకప్ సన్నాహకంగా ఈ సిరీస్‌ను భావిస్తోంది టీమిండియా. స్వదేశంలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సన్నద్ధమైంది. ఆసీస్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌ను ప్రపంచకప్‌కు సన్నాహకంగా భారత్ భావిస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనల్లో అద్భుత విజయాలు సాధించిన కోహ్లి సేన... విదేశాల్లోనూ తాము పులలమేనని నిరూపించింది. అయితే సొంత గడ్డపై ఆసీస్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను కోల్పోవడంతో జట్టు నిరాశలో ఉంది. అయితే జరగనున్నది వన్డే ప్రపంచకప్ కావడంతో తాజా సిరీస్‌లో సత్తా చాటి ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టాలని భారత్ భావిస్తోంది. ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడే జట్టుతోనే ప్రపంచకప్‌ బరిలోకి దిగుతామని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు సారథి విరాట్ కోహ్లి సంకేతాలిచ్చిన నేపథ్యంలో అందరూ కన్ను ఈ సిరీస్‌పై పడింది. టీ20 సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఆసీస్ వన్డే సిరీస్‌కు సిద్ధమవుతుంటే.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా ప్లాన్ వేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తిరుగులేకపోవడంతో పాటు స్వదేశంలో సిరీస్ జరుగుతుండటం భారత్ బలంగా కనిపిస్తోంది. తొలి వన్డే జరుగుతున్న ఉప్పల్ స్టేడియంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ ఆసీస్‌తో జరిగి రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడిపోవడం గమనార్హం. టీమిండియా ప్రస్తుత ఫామ్‌ను లెక్కలోకి తీసుకుంటే గత రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. భారత్ ఉప్పల్‌లో చివరిసారిగా 2014లో వన్డే మ్యాచ్ ఆడింది. ప్రపంచకప్‌‌కు ముందు భారత్ కేవలం ఐదు వన్డేలు(ఆసీస్ సిరీస్) మాత్రమే ఆడనుంది. దీంతో ఈ సిరీస్‌లో ఎలాగైనా సత్తా చాటాలని ఆశిస్తోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
sumalatha 104 Views British-Airways , pilots-strike British Airways లండన్: బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు మొట్టమొదటిసారి సమ్మె సెగ తాకింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన దాదాపు 4,300కి పైగా పైలట్లు సోమవారం ప్రపంచవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. దీంతో సుమారు 3 లక్షల మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకునే పరిస్థితి తలెత్తింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో వేతనాల పెంపుపై తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న వివాదం చివరకు పైలట్ల సమ్మెకు దారితీసింది. బ్రిటిష్ ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ గత నెల మూడు రోజుల సమ్మెకు నోటీసు ఇచ్చింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ పైలట్లు సమ్మెకు దిగడం చరిత్రంలో ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 9, 10 తేదీలతోపాటు సెప్టెంబర్ 27న మూడు రోజులు సమ్మె చేపట్టనున్నట్లు పైలట్ల సంఘం తమ నోటీసులో పేర్కొంది. సమ్మెను నివారించడానికి ఉభయ పక్షాలతో చర్చలు జరిపేందుకు బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం గత శుక్రవారం ప్రతిపాదించింది. కాగా, సమ్మెకు దిగితే పైలట్లకు, వారి కుటుంబాలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని రద్దు చేస్తామని బ్రిటిష్ ఎయిర్‌వేస్ హెచ్చరించింది. ఇదిలా ఉంటే, పైలట్లకు మూడేళ్ల కాలానికి 11.5 శాతం వేతన పెంపును పైలట్ల సంఘం వ్యతిరేకిస్తోంది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘దంగల్’ ట్రైలర్ తెలుగులో.. బాలీవుడ్ లోనే కాక భారతీయ సినీ పరిశ్రమలో ప్రయోగాలకు, కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే అమీర్ తాజాగా చేస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘దంగల్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘యుద్ధం’ పేరుతో రిలీజ్ చేయనున్నారు. TNN | Updated: Dec 22, 2016, 04:43PM IST బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌కి మిస్టర్ ఫర్ ఫెక్ట్‌గా ప్రత్యేకమైన స్థానం ఉంది. వైవిధ్యభరిత పాత్రలకోసం నిరంతర శ్రామికుడిగా పనిచేసే అమీర్ ప్రతి చిత్రమూ ఓ సన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బాలీవుడ్ లోనే కాక భారతీయ సినీ పరిశ్రమలో ప్రయోగాలకు, కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే అమీర్ మరో ప్రయోగాత్మక చిత్రం ‘దంగల్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘యుద్ధం’ పేరుతో రిలీజ్ చేయనున్నారు. మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ చిత్రం డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ మరో ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. మూడున్నర నిమిషాల నిడివిగల ట్రైలర్‌లో డైరెక్టర్ నితీష్ తివారీ ఆమీర్‌ని భిన్న కోణాల్లో చూపించాడు. తొలుత ఆటగాడిగా, ఆ తర్వాత ఆడపిల్లల తండ్రిగా, చివరకు కోచ్‌గా కూడా దర్శనమిచ్చాడు. కొడుకు కన్నా కూతురు ఏమాత్రం తీసిపోదని ట్రైలర్ ద్వారా మరోసారి గుర్తుచేశాడు. గోల్డ్ మెడల్స్ కష్టపడితేనే వస్తాయని చెట్లకు కాయవంటున్నాడు అమీర్.
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ధావన్ గాయంపై బీసీసీఐ స్పందన.. వదులుకోవడం ఇష్టం లేకే ఇలానా? శిఖర్ ధావన్ బొటన వేలు గాయంపై మీడియాలో రకరరకాల కథనాలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం మంగళవారం రాత్రి స్పందించింది. ధావన్ ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. Samayam Telugu | Updated: Jun 11, 2019, 09:35PM IST హైలైట్స్ శిఖర్ ధావన్ బొటన వేలు గాయంపై మీడియాలో రకరరకాల కథనాలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం మంగళవారం రాత్రి స్పందించింది. ధావన్ ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. శిఖర్ ధావన్ గాయం విషయమై బీసీసీఐ ఎట్టకేలకు స్పందించింది. ధావన్‌ ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నట్టు బోర్డు స్పష్టం చేసింది. శిఖర్ ఇంగ్లాండ్‌లో ఉండేందుకు వైద్యుల బృందం అనుమతిచ్చిన బీసీసీఐ తెలిపింది. అతడు కోలుకుంటున్న తీరును పర్యవేక్షిస్తామని బోర్డు ట్వీట్ చేసింది. కాగా, ధావన్‌ను వారం రోజులపాటు అబ్జర్వేషన్లో ఉంచనున్నట్టు తెలుస్తోంది. శిఖర్ గాయాన్ని వారం రోజుల తర్వాత చివరిగా పర్యవేక్షించిన తర్వాతే.. అతడికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించాలనే యోచనలో బీసీసీఐ ఉంది. ధావన్ బొటన వేలికి అయిన గాయాన్ని హెయిర్‌లైన్ ఫ్రాక్చర్‌గా నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటే ధావన్ సేవలను వరల్డ్ కప్‌లో కోల్పోవద్దని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే అతడిని వెంటనే ఇంటికి పంపేయడానికి ఇష్టపడటం లేదు. వారం రోజుల్లో అతడు కోలుకుంటున్నట్టు గుర్తిస్తే.. పూర్తిగా కోలుకున్నాక జట్టులోకి తీసుకుంటారు. లేదంటే అతడికి ప్రత్యామ్నాయంగా రిషబ్ పంత్‌ను ఇంగ్లాండ్ పంపిస్తారు. Team India opening batsman Mr Shikhar Dhawan is presently under the observation of the BCCI medical team. The team… https://t.co/XKSCPgvxoY — BCCI (@BCCI) 1560265541000 గాయం కారణంగా న్యూజిలాండ్‌తో గురువారం జరగబోయే మ్యాచ్‌తోపాటు ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా ధావన్ దూరం కానున్నాడు. వారంలోగా ఫిట్‌నెస్ నిరూపించుకుంటే.. అప్ఘాన్‌తో జూన్ 22న జరగబోయే మ్యాచ్‌కి అతడు అందుబాటులో ఉంటాడు. ఆదివారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 109 బంతుల్లో 117 పరుగులు చేసిన శిఖర్ సత్తా చాటిన సంగతి తెలిసిందే.
2sports
Apr 08,2016 పులిపిర్లకు అనూస్‌లో అత్యాధునిక చికిత్స హైదరాబాద్‌: శరీరంలో హార్మోను మార్పు, కాలుష్యం, దుమ్ము, చెమట, టెన్షన్‌, స్ట్రెస్‌ మొదలైన కారణాల వల్ల వచ్చే పులిపిర్లతో (వార్ట్స్‌తో) బాధపడుతున్న వారికి శుభవార్త. పులిపిర్లకు అనూస్‌లో అత్యాధునిక చికిత్స అందుబాటులోకి వచ్చింది. అనూస్‌లో అందించే 'వార్ట్స్‌ రిమూవల్‌ ట్రీట్‌మెంట్‌'తో ఎలాంటి నొప్పి, మచ్చలు లేకుండా పులిపిర్లు రాలిపోతాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పులిపిర్లకు ప్రారంభ దశలోనే మెరుగైన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే వాటిని పూర్తిగా నివారించవచ్చని అనూస్‌ ఒక ప్రకటనలో వివరించింది. ఒకటి లేదా రెండు సిట్టింగ్‌లలో వీటిని తొలగించవచ్చుని తెలిపింది. చిన్న చిన్న పులిపిర్లను సైతం మెగ్నిఫయింగ్‌ లెన్స్‌ ద్వారా అనూస్‌లో తొలగించే వెసులుబాటు ఉన్నట్లు సంస్థ వివరించింది. అనూస్‌లో లభ్యమయ్యే అడ్వాన్స్‌డ్‌ స్కిన్‌ ట్రీట్‌మెంట్స్‌లో భాగంగా పింపుల్‌ అండ్‌ స్కార్స్‌ రిడక్షన్‌, యాంటీ ఏజింగ్‌ ఫేస్‌ లిఫ్ట్‌, అండర్‌ ఐ అండర్‌ ఆర్మ్‌ డార్క్‌నెస్‌ రిడక్షన్‌, కాంప్లెక్షన్‌ ఇంప్రూవ్‌మెంట్‌ కోసం అనూస్‌ ఆర్గానిక్‌ ట్రీట్‌మెంట్స్‌, పిగ్మెంటేషన్‌ రిడక్షన్‌, అడ్వాన్స్డ్‌ వైటెనింగ్‌ ఫేషియల్స్‌, ఓట్‌మీల్‌ ఫేషియల్‌, వీట్‌ డౌ ఫేషియల్‌ మొదలైన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని సంస్థ వివరించింది. మంచి ముఖవర్చస్సు కోసం 100 శాతం నేచురల్‌ హోమ్‌ కేర్‌ ప్రాడక్ట్స్‌ సంస్థ వారు సూచించనున్నారు. వీటిని www.anoos.com ; e-mail: anoos@anoos.com అనూస్‌ సైట్‌ ద్వారా కూడా పొందవచ్చని సంస్థ తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘కథనం’ మోషన్ పోస్టర్.. అనసూయ పవర్‌ఫుల్ లుక్ అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కథనం’. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. Samayam Telugu | Updated: Oct 18, 2018, 07:12PM IST ‘కథనం’ మోషన్ పోస్టర్.. అనసూయ పవర్‌ఫుల్ లుక్ బుల్లితెర యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోనూ మెరుస్తోంది. ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో నాగార్జున మరదలు పాత్రలో మెప్పించిన అనసూయ.. ‘క్షణం’లో ఏసీపీ జయగా పవర్‌ఫుల్‌గా నటించింది. ఈ ఏడాది వచ్చిన ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకుంది. ఇప్పుడు మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో అనసూయ నటిస్తోంది. Visit Site Recommended byColombia అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కథనం’. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో గాయత్రి ఫిలింస్ బ్యానర్‌పై బట్టిపాటి నరేంద్రరెడ్డి, సర్మా చుక్క నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, ధనరాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ ముఖ్య పాత్రలు పోసిస్తున్నారు. దసరా పండుగను పురష్కరించుకుని ఈ చిత్రంలోని అనసూయ ఫస్ట్‌లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అనసూయ లుక్ అదిరిపోయింది. పుస్తకంపై అనసూయ రాస్తుండటం, సినిమా టైటిల్ కథనం అని పెట్టడం చూస్తుంటే ఈ చిత్రంలో ఆమె జర్నలిస్టు లేదా రచయితగా కనిపించినున్నట్లు అర్థమవుతోంది. అనసూయ లుక్‌పై ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మరి అనసూయ ఈసారి ఏం మాయ చేయబోతుందో చూడాలి. అనసూయ ‘కథనం’ మోషన్ పోస్టర్ X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ఆరో సెషన్‌లోనూ ఆకాశం వైపే.. -  సెన్సెక్స్‌ 200 పాయింట్లు ర్యాలీ - నిఫ్టీలో 50 పాయింట్ల వృది ముంబయి : మార్కెట్లు వరుసగా ఆరో సెషన్‌లోనూ లాభాలలోనే నడిచాయి. సాధారణ స్థాయిని మించి వర్షాలు కురుస్తుండడం, ఆర్థిక వ్యవస్థ గణాంకాలు కొంత ప్రోత్సాహకరంగా నిలవడం, ఉత్తేజ పరిచిన ఫెడ్‌ నిర్ణయాలు, ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచే చర్యల్లో భాగంగా కేంద్రం పలు వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరను పెంచడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. వర్షాలు బాగా పడుతుడడంతో ఇక భవిష్యత్తులో ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు కూడా మదుపరులలో విశ్వాసాన్ని పెంచింది. ఫలితంగా మార్కెట్లు లాభాలలో నడిచాయి. డిసెంబరు నుంచి రిలయన్స్‌ జియో సంస్థ 4జీ టెలికాం సేవలను ప్రారంభించనుందన్న వార్తల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాలు మార్కెట్లలో మెరుగైన ప్రదర్శనను కనబరిచాయి. ఆర్‌ఐఎల్‌ షేర్లు ముందుండి మరీ సూచీలను పరుగులు పెట్టించాయి. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 200 పాయింట్ల మేర పెరిగి 27,317 వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ కూడా 50 పాయింట్ల మేర ఎగిసి 8225 పాయింట్ల వద్ద ముగిసింది. ఎక్కువ విస్తృతి కనిపించిన మార్కెట్లో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ.. దిగ్గజ సూచీలకు దీటగా 0.5% మేర పెరిగింది. స్మాల్‌ క్యాప్‌ సూచీ మాత్రం 0.3% తక్కువ ప్రదర్శనను కనబరిచింది. బీఎస్‌ఈలో 1,434 షేర్లు లాభాలలో నడిచాయి. 1230 స్క్రిప్‌లు కుంగాయి. విద్యుత్తు, మన్నికైన వినియోగదారు వస్తువులు, స్థిరాస్తి, చమురు, ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజీ సూచీలు లాభాలలో నిడిచాయి. వర్షాలు బాగా పడుతుండడం ట్రాక్టర్ల అమ్మకాలు పెరిగాయన్న వార్తలతో ఎం అండ్‌ ఎం వాటాలు 4 శాతం మేర ఎగిశాయి. మరోవైపు హీరో మాటార్‌ కార్ప్‌, మారుతీ, బజాజ్‌ సంస్థల షేర్లు కూడా 0.5-2 శాతం మేర పెరిగాయి. నాస్‌డాక్‌ రికార్డు గరిష్ఠ స్థాయిని తాకిన నేపథ్యంలో ఐటీ స్టాక్‌లలో ఆకర్షణీయమైన ర్యాలీ నమోదు అయింది. వడ్డీరేట్లను నెమ్మదిగా పెంచనున్నట్లు ఫెడ్‌ చేసిన ప్రకటనలతో టీసీఎస్‌, విప్రో, మాస్‌టెక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రాలు 0.5-3% మేర ఎగిశాయి. ఒడిశాలోని సెజ్‌లో కొత్త ప్లాంటును పెట్టనుందన్న వార్తలతో టాటా స్టీల్‌ లాభాలలో నడిచింది. 'డీబీ స్కైపార్క్‌' నిర్మాణ కోసం ఈసీసీ, కోణార్క్‌ సంస్థలతో డీబీ రియాల్టీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఆ సంస్థ షేరు దాదాపు 6 శాతం మేర పెరిగింది. సన్‌ టీవీ నెట్‌వర్క్‌కు సెక్యూరిటీ క్లియరెన్సులు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అటార్నీ జనరల్‌ సమ్మతి తెలిపిందన్న వార్తల నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు ఎనిమిది శాతం పెరిగడం విశేషం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
విడాకులు తీసుకున్న స్టార్ హీరో.. మరోసారి భార్యతో పెళ్లికి రెడీ? Highlights సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, బ్రేకప్ లు కామన్. కొంతమంది పెళ్లి వరకు వెళ్లినా.. ఒకవేళ తమ పార్ట్నర్ తో ఏమైనా విబేధాలు వస్తే అంతే ఈజీగా విడాకులు కూడా తీసుకుంటారు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, బ్రేకప్ లు కామన్. కొంతమంది పెళ్లి వరకు వెళ్లినా.. ఒకవేళ తమ పార్ట్నర్ తో ఏమైనా విబేధాలు వస్తే అంతే ఈజీగా విడాకులు కూడా తీసుకుంటారు. స్టార్ హీరో హ్రితిక్ రోషన్ తన చిన్ననాటి స్నేహితురాలు సుసానే ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దశబ్దానికి పైగానే ఈ జంట కలిసి జీవించింది. వీరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ జంట విడాకులు తీసుకుంది. అయినప్పటికీ తమ పిల్లల కోసం ఇద్దరూ తరచూ కలుస్తుంటారు. టూర్లకు కూడా కలిసి వెళ్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. పిల్లల అవసరాల కోసమే ఈ జంట కలిసి సమయం గడుపుతున్నారని, తల్లితండ్రుల నుండి వారి పిల్లలు అంతులేని ప్రేమ పొందుతూ ఆనందంగా గడుపుతున్నారని వెల్లడించారు. హ్రితిక్, సుసానే ఇద్దరూ కూడా స్వతంత్ర ఆలోచనలు గలవారు. ఒకవేళ వారిద్దరూ తిరిగి కలవాలనుకుంటే ఆ విషయాన్ని బహిరంగంగా వెల్లడిస్తారని అన్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం ఈ జంట తమ వివాహబంధాన్ని చట్టపరంగా రద్దు చేసుకుంది. అయినా ఇప్పటికీ స్నేహితుల్లా కలిసి గడుపుతున్నారు. భార్యభర్తలుగా విడిపోయినా.. తల్లితండ్రులుగా కలిసి ఉంటూ సంతోషంగా గడుపుతున్నారు.  Last Updated 30, Jul 2018, 4:52 PM IST
0business
Hyd Internet 78 Views HONDA CAR HONDA CAR ముంబయి,సెప్టెంబరు 14: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా వివిధ మోడళ్ల కార్ల  ధరలను భారీగా పెంచింది.కేంద్రం కార్లపై జిఎస్‌టి సుంకం 2-7 శాతం పెంచడంతో కొన్ని మోడళ్ల ధరలు పెంచక తప్పలేదని హోండా కార్స్‌్‌ ఇండియా లిమిటెడ్‌(హెచ్‌సిఐఎల్‌)  ఒక ప్రకటనలో పేర్కొంది.పెరిగిన ధరలు సెప్టెంబరు 11 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.తాజా నిర్ణయంతో హోండా సెడాన్‌ కారు ధర 7,003-18700 మధ్య  అదనంగా పెరిగింది.బిఆర్‌-వి ఎస్‌యువి ధర 12,490-18,242 సిఆర్‌-వి ఎస్‌యువి  ధర 75,304-89.069 అదనంగా పెరిగినట్లు హోండా తెలిపింది.మరో ప్రముఖ కార్ల సంస్థ టయోటా వివిధ మోడళ్ల ధరలు పెంచుతున్నట్లు గతవారం ప్రకటించిన సంగతి  తెలిసిందే.సంస్థ నిర్ణయంతో ఇన్నోవా క్రిస్టా,ఎస్‌యువి ఫార్చునర్‌ కార్ల ధరలు13000-1,60,000 మధ్య అదనంగా పెరిగాయి.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Maate Vinadhuga Song: వైరల్ సాంగ్: ‘మాటే వినదుగా’.. 2 మిలియన్ క్లబ్‌లో ‘ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ మ్యూజిక్ లవర్స్‌కి ఈఏడాది వినసొంపైన పాటను అందించిన విజయ్ దేవకొండ మళ్లీ ‘మాటే వినదుగ’ అనే పాటతో మెస్మరైజ్ చేస్తున్నాడు. Samayam Telugu | Updated: Oct 31, 2018, 12:58PM IST Maate Vinadhuga Song: వైరల్ సాంగ్: ‘మాటే వినదుగా’.. 2 మిలియన్ క్లబ్‌లో విజయ్ దేవరకొండ నటించిన ‘గీతా గోవిందం’ చిత్రంలోని ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడిదే ఊపును కొనసాగిస్తుంది మరో పాట. ‘మాటే వినదుగా’.. అంటూ సాగే ఈ పాట ‘టాక్సీవాలా’ చిత్రంలోనిది. ఇటీవల ఈ సాంగ్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ రాబట్టడంతో బుధవారం నాడు ఈ సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను విడుదల చేసిన కొన్ని గంటల్లోని 2 మిలియన్ క్లబ్‌లో చేరింది. Read Also: ‘మాటే వినదుగ’ సాంగ్ తెలుగు లిరిక్స్ మీకోసం.. ముఖ్యంగా ఈ పాటలోని మెలోడీ టచ్ మ్యూజిక్ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. సిడ్ శ్రీరామ్ తన గొంతుతో మరోసారి మ్యాజిక్ చేశాడు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. జేక్స్ అద్భుతమైన రొమాంటిక్ మెలోసాంగ్ అందించాడు. ముఖ్యంగా యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్న ఈ పాట సినిమాలో కీలకమైంది. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా....రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ వర్క్ శరవేగంగా జ‌రుపుకుంటోంది. విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. Maate Vinadhuga Video Song: మాటే వినదుగ వీడియో సాంగ్ X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
పోల్ ఈ తరుణంలో శ్రీముఖి, రాహుల్ సపోర్టర్స్ రెండు గ్రూపులుగా విడిపోయి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే గతంలో మాదిరి ఆర్మీల హడావిడి లేదు కాని.. ప్రచారం అయితే గట్టిగానే నిర్వహిస్తున్నారు. కాగా... సీజన్ తొలి నుండి శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ అంటూ ప్రచారం ఎక్కువగానే ఉంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ పాటు చాలా మంది ఆడియన్స్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఇక రీసెంట్‌గా శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ అందుకున్నట్టుగా ఓ ఫేక్ ఫొటో వైరల్ అవుతోంది. Read Also: బిగ్ బాస్ విజేతగా రాహుల్.. ఒక్కశాతం ఓట్లతో టైటిల్ కైవసం! బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ అందుకున్న శ్రీముఖి.. నాగార్జునను గట్టిగా కౌగిలించుకుని ఫుల్ ఖుషీలో ఉంది. ఈ ఫోటోని శ్రీముఖి ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తూ.. ఓట్లను రాబట్టే పనిలో వ్యూహాలకు పదునుపెట్టారు. అయితే ఆ ఫొటో మార్ఫింగ్ చేసిందని, శ్రీముఖి బిగ్ బాస్ ఎంట్రీ అప్పటి ఫొటోని ఇలా మార్చారని అసలు ఫొటోసహా బయటపడింది. Read Also: బిగ్ బాస్ ఫైనల్ ఓటింగ్ రిజల్ట్: లీస్ట్‌లో అలీ.. ఫస్ట్? అయితే రాహుల్ ఫ్యాన్స్ సైతం ఇలాంటి జిమ్మిక్కులు మాకూ వచ్చు అనుకున్నారో ఏమో కాని.. ‘రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు.. మాతో కలిసి సంబరాల్లో కూడా పాల్గొన్నాడు. విన్నర్ మావాడే. కావాలంటే ఈ వీడియో చూడండి’.. అంటూ రాహుల్ కొంత మంది కుర్రకారుతో కలిసి తీన్మార్ స్టెప్పుల్ని వేస్తున్న వీడియోను వదిలారు. Read Also: రాహుల్‌కి కలిసొచ్చిన ‘11’ సెంటిమెంట్, ప్చ్! శ్రీముఖీ! అంతేకాకుండా ఆ వీడియోకు కంగ్రాట్స్ రాహుల్.. బిగ్ బాస్ విన్నర్ అంటూ ట్యాగ్ లైన్స్ తగిలించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విన్నర్‌ని ఎవరో మరో కొన్ని గంటల్లో తేలిపోతుంది. అయినా విన్నర్‌ని ప్రకటించిన తరువాత.. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తరువాత మాత్రమే కంటెస్టెంట్స్ బయటకు వస్తారు. గత రెండు సీజన్లకు ఇలాగే జరిగింది. సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాకుండానే రాహుల్ బయటకు వచ్చి తీన్మార్ దరువుకు స్టెప్పులేస్తున్నాడా? కాస్తా వెయిట్ చేస్తే విన్నర్ ఎవరో తేలిపోతుంది. ఈలోపు ఈ చీప్ ట్రిక్ దేనికని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV మణికట్టు స్పిన్నర్లే కాదు.. మేమూ తిప్పగలం మణికట్టు స్పిన్నర్లు మ్యాజికల్‌గా బౌలింగ్ చేస్తారు. అయితే.. చేతివేళ్లతో బంతిని తిప్పే ఆఫ్ స్పిన్నర్లు కూడా వారిలానే మెరుగ్గా బౌలింగ్ చేయగలరు. Samayam Telugu | Updated: Mar 20, 2018, 01:13PM IST మణికట్టు స్పిన్నర్లే కాదు.. మేమూ తిప్పగలం భారత వన్డే, టీ20 జట్టులో గత ఏడాదికాలంగా మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ హవా నడుస్తోంది. దీంతో సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా‌లు సైతం టెస్టులకే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే.. గత ఆదివారం కొలంబో వేదికగా ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన ద్వారా.. చేతివేళ్లతో బంతిని తిప్పే స్పిన్నర్లకి ఇంకా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భవితవ్వం ఉందని యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ నిరూపించాడు. టోర్నీలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన సుందర్ 5.70 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టి.. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో కుల్దీప్ యాదవ్ గాయపడగా.. అతని స్థానంలో సుందర్‌కి సెలక్టర్లు ఈ టోర్నీకి అవకాశం కల్పించారు. ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్‌ జట్టు విజేతగా నిలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాషింగ్టన్ సుందర్ తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించాడు. Visit Site Recommended byColombia ‘భారత్‌ గడ్డపై గత ఏడాది చివర్లో శ్రీలంకతో జరిగిన టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో.. నాకు మళ్లీ అవకాశం దక్కుతుందనే నమ్మకంతోనే ఉన్నా. టోర్నీలో కూడా మానసికంగా అన్నింటికీ సిద్ధమయ్యే ఉన్నా(తుది జట్టులో అవకాశం లేదా వేటు పడటం లాంటివి). కానీ.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌ దక్కుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేసిన తర్వాత.. దాన్ని టోర్నీ మొత్తం కొనసాగించాలని నిర్ణయించుకున్నా. ఇక జట్టులో పోటీ అంటారా..? మణికట్టు స్పిన్నర్లు మ్యాజికల్‌గా బౌలింగ్ చేస్తారు. అయితే.. చేతివేళ్లతో బంతిని తిప్పే ఆఫ్ స్పిన్నర్లు కూడా వారిలానే మెరుగ్గా బౌలింగ్ చేయగలరు. కానీ.. చాలా జట్లు ఎడమచేతి వాటం స్పిన్నర్లు లేదా లెగ్ స్పిన్నర్లకి మాత్రమే ప్రాధాన్యమిస్తారు. దీనికి కారణం టీ20 ఫార్మాట్‌లో ఆఫ్ స్పిన్నర్లు వేసే కొన్ని బంతులు.. బ్యాట్స్‌మెన్‌ హిట్టింగ్ చేసేందుకు అనుకూలంగా మారుతుంటాయి. కాబట్టి.. ఆ బంతులపై ప్రతి మ్యాచ్‌కి ముందు ఆఫ్ స్పిన్నర్లు ప్రాక్టీస్ చేస్తే సరి..!’ అని వాషింగ్టన్ సుందర్ సూచించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Virat Kohliలా ఆడటం నేర్చుకో.. బాబర్‌ అజామ్‌కి క్లాస్ విరాట్‌ కోహ్లీ తనకి ఆదర్శమని బాబర్ అజామ్ చెప్పడాన్ని నేను ఏమీ తప్పుబట్టడం లేదు. కానీ.. అతనిలా ఆడటం నేర్చుకోవాలి కదా..? క్లిష్ట పరిస్థితుల్లోనూ విరాట్ కోహ్లీ పరుగులు చేయగలడు. -షోయబ్ అక్తర్ Samayam Telugu | Updated: Jun 24, 2019, 04:43PM IST హైలైట్స్ విరాట్ కోహ్లీ తనకి ఆదర్శమని ఇటీవల చెప్పిన బాబర్ అజామ్ రెండేళ్లుగా పాక్ టీమ్‌లో నిలకడగా రాణిస్తున్న బాబర్ దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో నెమ్మది బ్యాటింగ్‌తో విమర్శలు కోహ్లీని చూసి ఆడటం ఎలాగో నేర్చుకోవాలని అక్తర్ హితవు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదర్శమని అస్తమానం చెప్పడం కాదు.. అతనిలా ఆడటం నేర్చుకోవాలని పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్‌కి ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ హితవు పలికాడు. విరాట్ కోహ్లీ తరహాలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే బాబర్ అజామ్.. గత రెండేళ్లుగా నిలకడగా ఆడుతూ ప్రశంసలు అందుకుంటున్నాడు. బాబర్ బ్యాటింగ్‌ టెక్నిక్‌ని గమనించిన పాక్ మాజీ క్రికెటర్లు కోహ్లీతో పోలికలు తెస్తుండగా.. బాబర్ కూడా తనకి విరాట్‌లా ఎదగాలని ఉందంటూ ఇటీవల వెల్లడించాడు. కానీ.. తాజాగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి వరుస అర్ధశతకాలతో చెలరేగుతుండగా.. బాబర్ టీమ్‌ని గెలిపించే ప్రదర్శన ఒక్కటీ చేయలేకపోతున్నాడు. దీంతో.. పాక్‌ స్కోరుబోర్డు మిడిల్ ఓవర్లలో నెమ్మదిస్తోంది.
2sports
Visit Site Recommended byColombia అయితే ఖైదీ చిత్రంకంటే ముందే మెగాస్టార్ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథతో సినిమా చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆ కథను డీల్ చేయాలంటే కాస్ట్ అండ్ క్రూ కీలకం కావడంతో చిరు చిరకాల స్వప్నం వాయిదా పడుతూ వచ్చింది. అయితే చిరు కలను రామ్ చరణ్ భుజాలపై వేసుకుని ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రాన్ని పట్టాలిక్కించాడు. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా టైటిల్‌ లోగోను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను జాతీయస్థాయిలో తెరకెక్కించేందుకు రామ్ చరణ్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆయా ప్రాంతాలకు సంబంధించిన స్టార్ నటులు ‘సైరా’ మూవీలో నటిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ను ఈ మూవీతో రంగంలోకి దింపడంతో ఈ చిత్రం ఏ స్థాయిలో వుండబోతుందనే దానికి హింట్‌ ‘సైరా’ మోషన్‌ పోస్టర్‌‌తో దొరికేసింది. — Pavan Tej (@iPavanTej) August 22, 2017 అమితాబ్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి, కన్నడస్టార్ సుధీప్, జగపతిబాబు, నయనతారా లాంటి స్టార్స్‌తో పాటు సాంకేతిక విభాగంలో సుప్రసిద్ధులైన లెజెండ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఈమూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. రవివర్మ ఛాయాగ్రహణం సమకూర్చుతున్నారు. రాజీవన్‌ కళాదర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రచన సహకారం పరుచూరి సోదరులు అందిస్తుండగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వ బాధ్యతను చూస్తున్నారు. భారీ కాస్ట్ అండ్ క్రూ‌తో రంగంలోకి దిగుతున్న ‘సైరా’ నరసింహారెడ్డి సుమారు రెండు వందలకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అయితే ఈస్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన బాహుబలి చిత్రం అదే రేంజ్‌లో మిగతాభాషల్లోనూ సేల్ అయ్యి భారీగా వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ ఇండియన్ హిట్ మూవీ లిస్ట్‌లో చేరింది. మరి అదే రేంజ్‌లో ‘సైరా’ సేల్ అవుతుందా అన్నది ప్రశ్న అభిమానులను తొలిచేస్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో మెగా స్టామినాను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నది బహిరంగ రహస్యమే. అయితే మిగతా రాష్ట్రాలు తమిళనాడు,కన్నడలలోనూ మెగాఫ్యాన్స్ బాగానే ఉండటంతో పాటు కన్నడ హీరో సుధీప్ ఈ మూవీలో నటిస్తుండటంతో ఒక రకంగా ప్లస్ అనే చెప్పాలి. అయితే సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ‘సైరా’ బాహుబలి స్థాయిలో హైస్సా రుద్రస్సా హేసరభద్ర సముద్రస్సా అనాలనే టార్గెట్ చాలా పెద్దదే అనేది మార్కెట్ పండితుల అంచనా.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Pak batting 20ఓవర్లలో పాకిస్థాన్‌ 111-4 చాంపియన్స్‌ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది.. 74 పరుగుల వద్ద ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ ఫఖర్‌ జమాన్‌ (50) పెవిలియన్‌ చేరాడు. అనంతరం బాబర్‌ అజమ్‌ (10), హఫీజ్‌(1), పెవిలియన్‌ చేశారు.. 110 పరుగుల వద్ద అబర్‌ ఆలీ (34), మెండిస్‌ చేతికి చిక్కాడు.. ప్రసుతతం సోయబ్‌ మాలిక్‌ (6), సర్పరాజ్‌ క్రీజ్‌లోఉన్నారు.. పాకిస్థాన్‌ విజయం సాధించటాని 30 ఓవర్లలో 126 పరుగులు చేయాల్సి ఉంది.
2sports
Hyderabad, First Published 27, Oct 2018, 3:26 PM IST Highlights ధోనిని పక్కకు పెట్టడం ఏంటని అతని అభిమానులు సెలక్షన్‌ కమిటీని నిలదీస్తున్నారు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారని, ఈ నిర్ణయానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు.    టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్.. చాలా హీట్ మీద ఉన్నారు. టీం ఇండియాకు తొలి టీ20 వరల్డ్ కప్ అందించిన ధోనీని  వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20 సిరీస్‌లకు ఎంపిక చేయకపోవడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శుక్రవారం రాత్రి ఆలస్యంగా నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.  విండీస్‌, ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లకు ధోనిని ఎంపికచేయలేదు. ఇది అతని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెల్లగక్కుతున్నారు. ఇక భారత్‌ టీ20లు ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ధోని కేవలం 11 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడలేదు.  అలాంటి ధోనిని పక్కకు పెట్టడం ఏంటని అతని అభిమానులు సెలక్షన్‌ కమిటీని నిలదీస్తున్నారు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారని, ఈ నిర్ణయానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు.  ‘విండీస్‌, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20ల్లో ధోని ఆడబోవడం లేదు. మేము రెండో వికెట్‌ కీపర్‌ను పరీక్షించే ప్రయత్నంలో ఉన్నాం. ఈ విషయంలో పంత్, కార్తీక్‌ పోటీ పడతారు. అయితే టి20ల్లో ధోని కెరీర్‌ ముగిసిందని మాత్రం చెప్పలేను’ అని ఎమ్మెస్కే వివరణ ఇచ్చారు.   దీంతో ఎమ్మెస్కేపై సైతం ధోని అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. కనీసం కెరీర్‌లో మూడు, నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడని ఎమ్మెస్కే..ధోని లాంటి దిగ్గజ బ్యాట్స్‌మన్‌ గురించి నిర్ణయం తీసుకోవడం తమ కర్మని మండిపడుతున్నారు. మరికొందరు ధోని లేని లోటు ఎంటో వారికే తెలుసోస్తుందని కామెంట్‌ చేస్తున్నారు.  Last Updated 27, Oct 2018, 3:26 PM IST
2sports
Suresh 112 Views రూ.11వేల కోట్ల నిధుల సమీకరణలో ఎస్‌బిఐ ముంబై, ఆగస్టు 24: భారతీయ స్టేట్‌బ్యాంకు మార్కెట్ల నుంచి అదనపు టైర్‌వన్‌ మూలధన నిధులు సేకరిం చేందుకు నిర్ణయించింది. సుమారు 11,100 కోట్ల నిధులు బేసెల్‌ 3 నిబంధనలను అనుసరించి నిధులు సేకరించేందుకు డైరెక్టర్లబోర్డుఆమోదించినట్లు బ్యాంకు ప్రకటించింది. డాలర్లలోను, భారతీయ కరెన్సీలో కూడా ఈనిధుల సేకరణ జరుపుతుంది. బిఎస్‌ఇకి ఈ మేరకు ఎస్‌బిఐ సమాచారం ఇచ్చింది. ఈ నిధుల సేకరణ ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌లో ఉంటుంది. విదేశీ, దేశీయ ఇన్వెస్టర్లకు ఇదేవిధానం అమలవుతుంది. నిధుల సమీకరణకు జారీచేసే సమయంలోనే ఎన్నివిడతలుగా జారీచేయాలి, కూపన్‌రేట్లు వంటి వాటిపై నిర్ణయాలను వెల్లడిస్తుంది. క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనాల ప్రకారం రిస్క్‌కవరేజి ఎక్కువేనని అంచనా వేసింది. డిపాజిట్లకంటే ఎటి1 విధానానికి రిస్క్‌ఎక్కువేనని అంచనా వేసింది. ఎటివన్‌ ఉత్పత్తు లు రద్దుచేయడం లేదా ఈక్విటీలోనికి బదలాయించుకోవడం అనేది కామన్‌ ఈక్విటీ టైర్‌1 నిర్ధిష్టమైన స్థాయికి దిగువన ఉంటుందని ప్రకటించింది. అయితే ఓపక్కవిలీనం ప్రక్రియను ముమ్మరంచేస్తూనే భార తీయ స్టేట్‌బ్యాంకు తనమూలధన విస్తరణ బేస్‌ను పెంచుకునేందుకు మార్కెట్ల నుంచి నిధులు సేకరిస్తోంది.
1entertainment
ఓవరైంది.. జబర్దస్త్ అనాథల వివాదంపై అనసూయ రియాక్షన్ Highlights తెలుగు టీవీ షో జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ పై విమర్శలు అనాథలను అవమాన పరిచేలా స్కిట్ వేశారంటూ హెచార్సీలో ఫిర్యాదు కేసు నమోదు చేసి వివాదం చేయటంపై స్పందించిన యాంకర్ అనసూయ జబర్దస్త్ పై కొంచెం ఓవర్ చేస్తున్నారని, భుజాలు తడుముకోవద్దని అనసూయ హితవు జబర్దస్‌ కామెడీషో పై వస్తోన్న తాజా ఆరోపణల కాంట్రవర్శిపై యాంకర్ అనసూయ స్పందించింది. తాజాగా హైపర్ ఆది చేసిన స్కిట్ అనాథలను కించపరిచేలా ఉందంటూ.. అనాథలు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆ షోకి యాంకర్‌గా వ్యవహరించిన అనసూయ క్షమాపణ చెప్పాలంటూ అనాథ యువతులు డిమాండ్ చేశారు. కాగా ఈ వివాదంపై ఫేస్‌బుక్‌ లైవ్‌లో స్పందిస్తూ.. జబర్దస్త్ షోపై ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారని అంటోంది అనసూయ. ఆది చేసిన స్కిట్‌లో తప్పేం ఉందో తనకు అర్థం కావడంలేదని ఆ స్కిట్‌ లో ఉన్న పాత్రను ఉద్దేశించి సందర్భానుసారం జోక్ చేసిందే తప్ప అందులో వివాదం చేయాల్సినంత సీన్ ఏం లేదన్నారు. మిమ్మల్ని నవ్వించే వాళ్లని ఏడిపిస్తారా? అనవసర లాజిక్‌లు లాగకుండా జస్ట్ చూసి వదిలేయండి. ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయ్. సమాజానికి ఉపయోగపడే విషయాలు గురించి చర్చిస్తే మంచిది.     ఓవరాల్ ఇండియాలో సింగిల్ సీజన్‌లో ఇంతిలా పాపులర్ అయిన షో జబర్దస్త్ ఒక్కటే. దీన్ని చూసి మనం తెలుగు ప్రేక్షకులు గర్వపడాలని.. వెండి తెరపై బాహుబలికి ఉన్నంత క్రేజ్ బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకు ఉందన్నారామె. అనవసర రాద్దాంతం చేసి క్రియేటివిటీని తొక్కేయొద్దు.   స్కిట్‌ను స్కిట్‌లా చూడకుండా వీళ్లను అన్నారని.., వాళ్లను అన్నారని.., మీరెందుకు గుమ్మాడికాయ దొంగల్లా భుజాలు తడుముకుంటారు. ఆ స్కిట్ చూసి నవ్వుకోండి. మిమ్మల్ని నవ్వించే వాళ్లని ఏడిపిస్తారా? అనవసర లాజిక్‌లు లాగకుండా జస్ట్ చూసి వదిలేయండి లేదా  నచ్చకుంటే చూడకండి అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది జబర్దస్త్ యాంకర్ అనసూయ. Last Updated 25, Mar 2018, 11:40 PM IST
0business
ఆ దొంగను పట్టుకొని సావిత్రికి అప్పజెప్పాను : షావుకారు జానకి Highlights సావిత్రిని ఎంతోమంది మోసం చేసారు : షావుకారు జానకి సావిత్రి .. 'షావుకారు' జానకి కలిసి చాలా సినిమాల్లో నటించారు. అందువలన వాళ్లిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉండేది. తాజా ఇంటర్వ్యూలో  'షావుకారు' జానకి మాట్లాడుతూ .. "చెన్నైలో సావిత్రి ఇంటికి దగ్గరలోనే మా ఇల్లు ఉండేది. వివిధ రకాల డిజైన్లలో నగలు చేయించుకోవడం సావిత్రికి సరదా. అందువలన తంజావూరు నుంచో .. కుంభకోణం నుంచో 'రంగస్వామి అయ్యంగార్' అనే నగల తయారీదారుడిని జెమినీ గణేశన్ ప్రత్యేకంగా పిలిపించేవారు. ఆ వ్యక్తి మా ఇంట్లోనే ఉంటూ నగలు తయారు చేసేవాడు"  "సావిత్రితో పాటు నేను కూడా అలాంటి నగలే చేయించుకునేదానిని. సావిత్రి మంచితనం కారణంగా ఆమెను చాలామంది మోసం చేశారు. ఒకసారి నేను చెన్నైలోని ఒక నగల షాపుకి ఏవో వెండి సామాను కొందామని వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తి  షాపు అతనికి బంగారు గాజులు అమ్మడం చూశాను .. అవి అచ్చం నా గాజుల మాదిరిగానే వున్నాయి. నేను .. సావిత్రి కలిసి చేయించుకున్నామనే విషయం గుర్తొచ్చి నిలదీశాను. అతను సావిత్రి ఇంటి పనివాడనీ .. దొంగతనం చేశాడని తెలిసింది. ఆ నగలు తిరిగి సావిత్రికి చేరేలా చేయగలిగాను. ఇలా సావిత్రి అజాగ్రత్తను .. మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఎంతోమంది మోసం చేశారు" అని చెప్పుకొచ్చారు.        Last Updated 9, May 2018, 6:58 PM IST
0business
Hyderabad, First Published 9, Mar 2019, 10:22 AM IST Highlights చిరంజీవి అభిమానులకే కాదు... తెలుగు సినీ ప్రేమికులందరికీ ఇష్టమైన టైటిల్  'ఖైదీ' . 1983 లో వచ్చిన ఈ చిత్రం మెగా హిట్టై చిరంజీవి ఎన్నో మెట్లు కెరీర్ పరంగా ఒక్కసారిగా ఎక్కించింది. దాంతో ఆ టైటిల్ తో సినిమా చేసే ధైర్యం రామ్ చరణ్ సైతం చెయ్యలేకపోయారు. కానీ ఇప్పుడు తమిళ హీరో కార్తి తన తాజా చిత్రానికి ఇదే టైటిల్ పెట్టి ప్రాజెక్టుకు  క్రేజ్ తెచ్చే పనిలో పడ్డారు.  చిరంజీవి అభిమానులకే కాదు... తెలుగు సినీ ప్రేమికులందరికీ ఇష్టమైన టైటిల్  'ఖైదీ' . 1983 లో వచ్చిన ఈ చిత్రం మెగా హిట్టై చిరంజీవి ఎన్నో మెట్లు కెరీర్ పరంగా ఒక్కసారిగా ఎక్కించింది. దాంతో ఆ టైటిల్ తో సినిమా చేసే ధైర్యం రామ్ చరణ్ సైతం చెయ్యలేకపోయారు. కానీ ఇప్పుడు తమిళ హీరో కార్తి తన తాజా చిత్రానికి ఇదే టైటిల్ పెట్టి ప్రాజెక్టుకు  క్రేజ్ తెచ్చే పనిలో పడ్డారు.  కార్తి హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రం రూపొందుతోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఖైదీ అనే పేరును ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదలచేసింది. రక్తంతో నిండిన జైలు ఊచల వెనుక కార్తి ముఖంతో కూడిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇదని,హై స్టాండర్డ్స్ ఉన్న టెక్నీషియన్స్ , నటీనటులతో ఈ సినిమా కోసం కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని కార్తి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. వందశాతం యాక్షన్ గ్యారెంటీ ఉన్న సినిమా ఇదని నిర్మాత ఎస్.ఆర్. ప్రభు తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్ వుండదని సమాచారం. ఇదో థ్రిల్లర్.  Last Updated 9, Mar 2019, 10:22 AM IST
0business
Hyd Internet 142 Views MS Dhoni MS Dhoni ఢిల్లీః భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ సార‌థి మ‌హేంద్ర‌సింగ్ ధోని త‌న కెప్టెన్సీ ర‌హ‌స్యల‌ను బ‌య‌ట‌పెట్టాడు. ‘‘మ్యాచ్‌లో ప్రతి అంశాన్ని నేను గమనించే వాడిని. క్రికెట్‌ పట్ల ఎంతో నిజాయతీగా ఉండేవాడిని. నాకు కలిసొచ్చిన అంశం ఏమిటంటే.. నేను గేమ్‌ను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోగలను. అదే నా సామర్థ్యం. ప్రతి మ్యాచ్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే అప్పట్లో నేను జట్టులో చిన్నవాడిని అయినప్పటికీ సీనియర్లు ఎవరైనా గేమ్‌ పట్ల నా ఆలోచనలను అడిగితే ఏమాత్రం ఆందోళన చెందేవాడిని కాదు. నాకు అనిపించింది నేను చెప్పేవాణ్ని. బహుశా ఇవే నన్ను కెప్టెన్‌గా ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు అయి ఉండొచ్చు’ అని ధోనీ స్ప‌ష్టం చేశారు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘మీకు మాత్రమే చెప్తా’ కలెక్షన్స్: చిన్న సినిమా.. పెద్ద విజయం!! ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాపై విమర్శకులు పెదవి విరిచినా ప్రేక్షకులు మాత్రం బాగానే ఆదరిస్తున్నారు. ఈ చిన్న సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లను బాగానే రాబడుతోంది. Samayam Telugu | Updated: Nov 4, 2019, 10:09PM IST మీకు మాత్రమే చెప్తా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ నెల 1న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల రేటింగ్‌లు ఎలా ఉన్నా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆదరిస్తున్నారు. థియేటర్లలో నవ్వులు పువ్వులు పూయిస్తోన్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే డీసెంట్ వసూళ్లను సాధిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే 4 కోట్ల 05 లక్షల రూపాయల గ్రాస్‌ను ఈ చిత్రం వసూలు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. Also Read: వయొలెన్స్ కావాలన్నారుగా.. సాలిడ్‌గా ఇస్తా: నాని కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూనే తన అభిరుచి మేరకు విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా టార్గెటెడ్ ఆడియన్స్‌కు డబుల్ ట్రీట్‌గా మారిందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడమే అందుకు నిదర్శనం అంటున్నారు. ఇక హీరోగా నటించిన తరుణ్ భాస్కర్‌తో పాటు ప్రధాన పాత్రధారులైన అభినవ్ గోమఠం, అవంతికా మిశ్రా, పావని గంగిరెడ్డి, అనసూయ, నవీన్ జార్జ్ థామస్‌ల నటన, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారడంతో రాబోయే రోజుల్లో మరింత పెద్ద విజయంగా ఈ సినిమా నిలవబోతోందని చెబుతున్నారు. కాగా, ఈ సినిమాకు షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. మదన్ గుణదేవా సినిమాటోగ్రఫీ అందించారు. శివకుమార్ సంగీతం సమకూర్చారు. కింగ్ ఆఫ్ ద హిల్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరోగా నటించిన తరుణ్ భాస్కర్.. డైలాగుల రచనలో దర్శకుడు షమ్మీర్ సుల్తాన్‌కు సహకారం అందించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
sumalatha 125 Views bse , NSE , stock market Sensex ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నేటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ ఒక దశలో 300 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 11,100 మార్క్‌ పైన కదలాడింది. అయితే చివరి గంటల్లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా లాభాల్లో చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. మొత్తంగా నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 52 పాయింట్ల స్వల్ప లాభంతో 37,402 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ అత్యల్పంగా 6 పాయింట్లు లాభపడి 11,054 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.45గా కొనసాగుతోంది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
1entertainment
Hyderabad, First Published 14, May 2019, 4:57 PM IST Highlights బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. మాస్ హీరోగా అతడిని ఎస్టాబ్లిష్ చేయాలని అతడితండ్రి బెల్లంకొండ సురేష్ ప్రయత్నిస్తున్నాడు. ఆ కారణంగానే పక్కా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ బి, సి ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అతడి సినిమాల్లో హీరోయిజానికి ఢోకా ఉండదు. స్టార్ హీరోయిన్లు, భారీ కాస్టింగ్ ఉండేలా చూసుకుంటాడు. అలాంటి హీరో 'సీత' లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటించడం కొందరిని ఆశ్చర్యపరిచింది. దర్శకుడు తేజ కథ మొత్తం చెప్పకుండా బెల్లంకొండని మోసం చేశాడనే  కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ బెల్లంకొండ మాత్రం కథ ఒప్పుకొనే సినిమా చేశాడని అంటున్నాడు దర్శకుడు తేజ. నిజానికి ఈ సినిమాలో హీరోగా ముందుగా బెల్లంకొండని తీసుకోవాలని అనుకోలేదట. ఇతర హీరోలను సంప్రదించగా.. వాళ్లెవరూ అంగీకరించకపోవడంతో అదే సమయంలో స్క్రిప్ట్ ని బెల్లంకొండకి వినిపించారట. ఈ విషయాన్ని తేజ స్వయంగా చెప్పుకొచ్చాడు. సినిమాలో హీరోయిన్ రోల్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని, ఆ కారణంగా తాను అడిగిన హీరోలెవరూ స్క్రిప్ట్ ఓకే చేయలేదని.. బెల్లంకొండ శ్రీనివాస్ ని అడిగితే మరో ఆలోచన పెట్టుకోకుండా ఈ సినిమా చేసినట్లు తేజ చెప్పాడు. ఇప్పటివరకు కమర్షియల్ కథలతో లక్ పరీక్షించుకున్నా బెల్లంకొండకి సరైన సక్సెస్ రాలేదు. ఆ కారణంగానే తన బౌండరీస్ దాటి కొత్తగా ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!  Last Updated 14, May 2019, 4:57 PM IST
0business
సైరా నరసింహారెడ్డి.. తెర వెనుక ఏం జరిగింది..మరో బాహుబలి అవుతుందా? Highlights ఇపుడు ఇండస్ట్రీలో ఒకటే  ప్రశ్న... చిరంజీవి ఉయ్యాలవాడ మరొక బాహుబలి అవుతుందా​ని.. బ్రిటిష్ వాళ్లతో తలపడి అమరుడయిన యోధుడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైరా ​పేరుతో మెగా స్టార్ చిరంజీవి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే   ఉయ్యాలవాడ సినిమా ఆలోచన ఎలా వచ్చింది? నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు..ఠాగూర్ సినిమా కన్నా ముందే ఈ ఉయ్యాలవాడను తెరకెక్కించాలని చిరంజీవి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే, అది  కార్యరూపం దాల్చిందుకు ఇంతకాలం పట్టింది.పదేళ్ళ క్రితమే ఈ ప్రాజెక్ట్ పై చాలా సీరియస్ గా వర్క్ జరిగింది. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా కోసం దాదాపు సంవత్సరం పాటు పనిచేశారంటేనే ,ఈ సినిమా కథా వస్తువు ఎంతక్లిష్టం గా ఉంటుందో ఈజీ గానే అర్ధం చేసుకోవచ్చు..చిరంజీవి ఖైదీ నం.150 తర్వాత ఏ తరహా స్క్రిప్ట్ తో సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న తరుణం లో అనూహ్యం గా  ఈ కథ మదిలో మెదలడం,పక్కన పెట్టిన ఈ ప్రాజెక్ట్ కి తుది మెరుగులు దిద్దడం చక చకా జరిగిన పరిణామాలు. ఇకపోతే సినిమా ప్రారంభం నుంచే హైప్ క్రియేట్ చేసేందుకు మెగా స్కెచ్ వేశారని అర్ధమవుతూనే ఉంది..బాహుబలి రికార్డ్స్ ని క్రాస్ చేయాలనే టార్గెట్ తో చెర్రీ ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్న మాట. కలెక్షన్స్ పరంగా హిస్టరీ క్రియేట్ చేయాలనే లక్ష్యం తో తెలుగు తో పాటు హిందీ,తమిళ్,కన్నడ భాషలలో ....వీలుని బట్టి మరికొన్ని భాషలలో ''సై రా '' ని  రూపొందించడానికి సన్నాహాలు చెస్తున్నారు. క్రేజ్ కోసం బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ ని,కన్నడ సూపర్స్టార్ సుదీప్ ని,తమిళ్ హీరొ విజయ్ సేతుపతి ని ఎంచుకున్నారు. ఎవరీ ఉయ్యాలవాడ ? రాయలసీమ నుంచి తొలినాళ్ల స్వాతంత్ర్య సమర యోధుడిగా చరిత్రకెక్కిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్రను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించేందుకు మెగా కాంపౌండ్ నిర్ణయం తీసుకోవడమే ఒక సెన్సేషన్. చరిత్ర లో కొన్ని వాస్తవాలు కాలం తో పాటు మారుతుంటాయనే దానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితమే ఒక ఉదాహరణ.ఉయ్యాలవాడ ఒక యోధుడు...అందులో ఎలాంటి సందేహం లేదు.దాదాపు తొమ్మిది నెలల పాటు బ్రిటీష్ వారితో పోరాటం సాగించాడంటేనే ఆయన ఎలాంటి వీరుడో  అర్ధం చేసుకోవచ్చు..కనబడీ కనబడకుండా గెరిల్లా యుద్ధ తంత్రం తో పోరాటం కొనసాగించి బ్రిటీష్ సైనికుల్ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించి " సైరా సై సై రా" అంటూ సవాల్ విసిరిన సైనిక తంత్రం ఆయనది. అయితే ఉయ్యాలవాడ బ్రిటీష్ వారితో ఎందుకు తల పడ్డాడు ? అనే విషయం లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వాతంత్ర్య సంగ్రామం అనే ప్రశ్నే ఉదయించని కాలం లో ఆయన బ్రిటీష్ – ఇండియా ప్రభుత్వం తో పోరుకి సిద్ధమయ్యాడు. రైతుల నుండి కప్పం వసూలు చేసే విషయం లో వచ్చిన తేడాలే చినికి చినికి గాలి వానలా మొదలై పోరుకు బీజం వేసింది ఒక వాదన. అయితే మెలమెల్లగా ఉయ్యాలవాడ ను ఒక స్వాతంత్ర్య సమర యోధుడిగాగుర్తించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ రాయలసీమ పౌరుషానికి ఉయ్యాలవాడ ను ప్రతీక గా,ఉదాహరణ గా చెప్పుకోవడం నూటికి నూరు శాతం సమంజసం. ఉయ్యాలవాడ ఒక వ్యక్తి కాదు..శక్తి అని కీర్తించుకోవడం తెలుగు వారికందరికీ గర్వకారణం. . 1847 ఫిబ్రవరి 22 న ఆయన్ని బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసి,కోయిలకుంట్ల కోట బురుజు పై ఆయన తలను మూడు నెలల పాటు వేలాడదీసిన తర్వాత తెల్లవారితో తలపడేందుకు కొంత కాలం పాటు ఎవరూ సాహసించ లేక పోయారు. ఆయన మరణాంతరం అక్కడి ప్రాంతం లోని ఒక వర్గం ఆయన్ని కీర్తిస్తూ,బుర్ర కథల రూపం లో ఉయ్యాలవాడ ను సజీవంగా నిలిపేందుకు శాయ శక్తులా కృషి చేసింది. ఈ తరుణంలోనే ఆయన సాహసం ఆయనని స్వాతంత్ర్య సమర యోధుడిగా మలచింది. ఏది ఏమైనా ఒకే ఒక్కడు కేవలం పదుల సంఖ్య అనుచర గణంతో వందలాది తెల్ల సైనికులపై దాదాపు 9 నెలల పాటు పోరు కొనసాగించడం అనేది నిజంగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప విశయమే.అయితె గడిచిన ఇన్నేళ్ల కాలంలో ఆయన గురించిన ప్రస్తావన చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే వచిందనేది ఎవరూ కాదనలేని సత్యమ్.ప్రస్తుత తరం లో చాలా మందికి ఆయన గురించిన అవగాహన లేక పోవడానికి ఇది కూడా ఒక కారణం అనే చెప్పుకోవాలి..దాదాపుగా ఆయన పేరు,ఆయన పోరాట పటిమ మసక బారుతున్న నేపథ్యం లో వెండితెర మీద ఆయన జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరగడం...ఒక పోరాట యోధునికి అర్పించే నివాళిగా చెప్పుకోవచ్చు..తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన చరిత్ర నిలిచిపోయేలా''సై రా నరసింహా రెడ్డి'' చిత్రాన్ని మలిచేందుకు యూనిట్ సమాయత్తమౌతోంది.   ఈ సినిమా  రూపకల్పన లో మరో కోణం ఉందా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో జరుగుతున్న హాట్ హాట్ డిస్కషన్ ఇదే...ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ లో రాయలసీమ,తెలంగాణా ప్రాంతాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎక్కువ గా వున్నరు. వాళ్లు తమదనుకుని పార్టీ ఉనికి ప్రశ్నార్ధకమైన నేపథ్యం లో ''ఉయ్యాలవాడ'' ద్వారా తమ అస్తిత్వాన్ని చాటుకుంటూనే...ఆ వర్గం పాలిటిటకల్ ఐడెంటికి ఈ చిత్రం జీవం పోసే అవకాశం ఉందని   గుస గుసలు వినిపిస్తున్నాయి.. సినిమా ప్రభావం ప్రజల మీద అంతో ఇంతో ఉంటుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందునా ఒక యోధుడి జీవితాన్ని ఆవిష్కరించే సినిమా కనుక ప్రజలపై,మరీ ముఖ్యంగా తమ సామాజిక వర్గ వోటర్స్ మీద ఉంటుందనేది ఈ వర్గం నాయకుల ఆలోచన గా తెలుస్తోంది...చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం,ఈ సినిమాను  ఎన్నికలకు కొన్ని నెలల ముందు  విడుదల చేసే ఉండటం వల్ల ,  అన్ని రకాలుగా ఇది కలిసి వస్తుందని కాంగ్రెస్ లో ని ఒక వర్గం నాయకులు ఆశిస్తున్నారు. అయితే సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్తితి.  నాలుగు భాషలలో నిర్మితమయ్యే సినిమా కనుక దాదాపు ఒక సంవత్సరం పాటు పని చేయాల్సి ఉంటుంది.  మెగాస్టార్ చిరంజీవి మదిలో ఏముందో తెలియదు కానీ ఈ డిస్కషన్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది..''అందరి వాడు'' గా పేరున్న చిరు రాజకీయాల్లోకి వచ్చి కొందరివాడు గా మారారు. ఇటీవలే   సినిమా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అందరివాడు గా తన పూర్వ వైభవాన్ని సాధించుకునే క్రమం లో... మళ్లీ కొందరివాడు అనిపించుకునేందుకు '' సై  రా '' అంటారా??అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.  ఏది ఏమైనా ప్రారంభం నుంచే ఈ సినిమా పై పలురకాల అంచనాలు. విచిత్రం గా వూహకు అందని చర్చలు జరగడం మెగా కాంపౌండ్ లో ఆనందాన్నే నింపుతోంది...ఎందుకంటే..వారికి కావాల్సింది కూడా అదే మరి. Last Updated 25, Mar 2018, 11:58 PM IST
0business
Hyderabad, First Published 3, May 2019, 2:52 PM IST Highlights 'RX100', 'అర్జున్ రెడ్డి' సినిమాల తరువాత టాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ తో కూడిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని.. ఇది మంచి పరిణామం కాదని దర్శకనిర్మాతల ఆలోచన తీరు మారాలంటూ నటి, సెన్సార్ బోర్డ్ మెంబర్ జీవితారాజశేఖర్ అన్నారు.  'RX100', 'అర్జున్ రెడ్డి' సినిమాల తరువాత టాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ తో కూడిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని.. ఇది మంచి పరిణామం కాదని దర్శకనిర్మాతల ఆలోచన తీరు మారాలంటూ నటి, సెన్సార్ బోర్డ్ మెంబర్ జీవితారాజశేఖర్ అన్నారు. తాజాగా 'డిగ్రీ కాలేజ్' అనే సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది. దీనికి అతిథిగా జీవితా విచ్చేశారు.  ఈ సందర్భంగా ఆమె ట్రైలర్ పై ఘాటుగా స్పందించింది. తెలుగులో లిప్ లాక్ లేకుండా సినిమాలు రావడం లేదని అసహనం వ్యక్తం చేసింది. సినిమాలో కంటెంట్ లేకపోతే ఎన్ని లిప్ లాక్ లు పెట్టి, అమ్మాయిని నగ్నంగా చూపించినా సినిమా హిట్ అవ్వదంటూ హితబోధ చేసింది. ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది.. కానీ అది ఎక్కడ పడితే అక్కడ చేయమని.. కొన్ని వందల మంది మధ్యలో అలా ప్రవర్తించమని.. ఇటువంటి సినిమాలు థియేటర్ లో చూడడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది. సోషల్ మీడియాలో, టీవీల్లో ఉండడం లేదా అని కొందరు వాదిస్తున్నారని, అయితే వాటిలో ఒక్కరే రూమ్ లో ఉండి చూస్తుంటారని చెప్పుకొచ్చింది. సెన్సార్ బోర్డ్ మెంబర్ గా దర్శకులు సామాజిక బాధ్యతతో సినిమాలు తీయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇటువంటి సినిమాలకు సెన్సార్ ఇవ్వకపోతే దానికి కూడా గొడవ చేస్తున్నారని, కాంట్రవర్సీ కోసం తాను ఈ మాటలు చెప్పడం లేదని, మనసుకి అనిపించింది చెప్పినట్లు స్పష్టం చేసింది.
0business
Hyderabad, First Published 7, Sep 2019, 12:44 PM IST Highlights ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జన్మస్దలం అయ్యిన కర్నూల్ లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట జరిపి, ఆ తర్వాత హైదరాబాద్ లో చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ ఈవెంట్ ని రిలీజ్ సమయం దగ్గరపడ్డాక చేస్తారు. ఈ లోగా కర్నూల్ లో ఈవెంట్ ని పూర్తి చేస్తారు. భారీ సినిమాలకు ఆ బడ్జెట్ కు తగ్గట్లే ప్రమోషన్ కావాలి. లేకపోతే జనాల్లోకి అనుకున్నట్లుగా వెళ్లదు .బజ్ క్రియేట్ కాదు. దాంతో ఓపినింగ్స్ రావటం కష్టమైపోతుంది. ఈ విషయం ఎంతో అనుభవం ఉన్న చిరంజీవికు తెలుసు. అందుకే ఆయన తన తాజా చిత్రం సైరా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయింతి సందర్బంగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పూర్తి హైప్ తీసుకురావాలనుకుంటున్నారు. అందుకోసం ఈ చిత్రానికి రెండు చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేద్దామని నిర్ణయానికి వచ్చినట్లు సమచారం. ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జన్మస్దలం అయ్యిన కర్నూల్ లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట జరిపి, ఆ తర్వాత హైదరాబాద్ లో చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ ఈవెంట్ ని రిలీజ్ సమయం దగ్గరపడ్డాక చేస్తారు. ఈ లోగా కర్నూల్ లో ఈవెంట్ ని పూర్తి చేస్తారు. స్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం “సైరా నరసింహా రెడ్డి”.బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు.  కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్   నిర్మిస్తున్న ఈ చిత్రం 200 కోట్ల బడ్జెట్ తో రూపొందింది అని తెలుస్తోంది. ఇక హిందీ రిలీజ్  విషయానికి వస్తే..“సైరా”కు బాలీవుడ్ స్టార్ హీరో హ‌ృతిక్ రోషన్ నుంచి భారీ పోటీ ఎదురవుతోంది. అక్టోబర్ రెండో తేదీనే హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన “వార్” సినిమా హిందీతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదలవుతోంది. దీంతో రెండు భారీ సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది.   ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.   మరో ప్రక్క తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఇప్పటికే  ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా  విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్  వచ్చింది. Last Updated 7, Sep 2019, 12:46 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ప్రొ కబడ్డీ ప్లేఆఫ్ రేసు.. పాయింట్ల పట్టిక ఇదే స్టార్ రైడర్లు ఉన్న తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి ఇప్పటికే దాదాపు నిష్క్రమించగా.. ఎలాంటి అంచనాలు లేని జట్లు ప్లేఆఫ్ బెర్తుని దర్జాగా ఖాయం చేసుకున్నాయి. Samayam Telugu | Updated: Oct 1, 2019, 06:44PM IST హైలైట్స్ ఉత్కంఠగా మారిన ప్రొ కబడ్డీ లీగ్ ప్లేఆఫ్ రేసు మూడు జట్ల‌కి బెర్తు ఖరారు.. పోటీలో మరో ఐదు టీమ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిన తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ ఈ నెల 11 వరకూ జరగనున్న లీగ్ దశ మ్యాచ్‌లు ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ చరమాంకానికి చేరుకుంది. టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడుతుండగా.. ఇప్పటికే 10 వారాల మ్యాచ్‌లు ముగిశాయి. అయినప్పటికీ.. మూడు జట్లకి మాత్రమే ప్లేఆఫ్ బెర్తులు ఖాయమయ్యాయి. భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ జట్లు వరుస పరాజయాలతో ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించగా.. మిగిలిన మూడు ప్లేఆఫ్ బెర్తుల కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. ఈ నెల 11 వరకూ లీగ్ దశ మ్యాచ్‌లు జరగనుండగా.. టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి. టోర్నీలో 20 మ్యాచ్‌లాడిన దబాంగ్ ఢిల్లీ 15 విజయాల్ని అందుకుని 82 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత దబాంగ్ ఢిల్లీ (78), హర్యానా స్టీలర్స్ (65) టాప్-3లో నిలిచి ప్లేఆఫ్‌కి చేరాయి. ఇక యు ముంబా, బెంగళూరు బుల్స్, యూపీ యోధా, జైపూర్ పింక్స్ పాంథర్స్, గుజరాత్‌ పార్చూన్ జెయింట్స్‌ ప్లేఆఫ్ ఆశలు.. ఈ 10 రోజుల ప్రదర్శనపైన ఆధారపడి ఉన్నాయి. సీజన్ ఆరంభంలోనే అగ్రశ్రేణి జట్లుగా కొనసాగిన జైపూర్, యూపీ యోధా, బెంగళూరు బుల్స్ అనూహ్యంగా మధ్యలో తడబడి.. ప్లేఆఫ్ రేసులో ఇప్పుడు వెనకబడ్డాయి. తెలుగు టైటాన్స్ జట్టు ఇప్పటి వరకూ 18 మ్యాచ్‌లాడగా.. ఇందులో కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో.. 39 పాయింట్లతో పట్టికలో 11వ స్థానంలో టైటాన్స్ నిలవగా.. మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందిన తమిళ్ తలైవాస్ 31 పాయింట్లతో 12వ స్థానంలో ఉంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో ఎక్కువ క్రేజ్ ఉన్న రైడర్లు రాహుల్ చౌదరి (తెలుగు టైటాన్స్), సిద్ధార్థ దేశాయ్ (తెలుగు టైటాన్స్) ఈ జట్లలోనే ఉండటం కొసమెరుపు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV భారత్-పాక్ యుద్ధనేపథ్యంతో రానా సినిమా బాహుబలి క్రేజ్ రానా స్టేటస్ను అమాంతం పెంచేసింది. TNN | Updated: Jan 9, 2016, 08:17AM IST భారత్-పాక్ యుద్ధనేపథ్యంతో రానా సినిమా? బాహుబలి క్రేజ్ రానా స్టేటస్ ను అమాంతం పెంచేసింది. అతను చేసే తరువాత సినిమాపై ఆసక్తిని పెంచింది. పీవీపీ సినిమా సంస్థతో రానా త్రిభాషా చిత్రం చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. దానికి ‘ఘాజీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి దీనిని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా కథ చాలా ఆసక్తిగా ఉండేట్టు తెలుస్తోంది. కంచె సినిమా 1939 నాటి రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంతో నడుస్తుంది. అదే విధంగా రానా సినిమా 1971వ నాటి ఇండో-పాక్ వార్ కథాంశంతో రూపొందుతోంది. ఈ విషయాన్ని రానా కూడా ఓ సారి అన్నారు. తన అభిమానులంతా మాస్ సినిమా చేస్తే బాగుంటుందని అంటున్నారట, అయితే యుద్ధం కన్నా మాస్ ఏముంది అంటూ రానా వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో నావికా దళ యుద్ధాన్ని చూపిస్తారు. నేలపై సైనికుల యుద్ధాలు చాలా సార్లు సినిమాలుగా వచ్చాయి. అందుకే కొత్తంగా నావికదళం చేసే యుద్ధాలను చిత్రిస్తారట. సినిమా పేరు కూడా 1971 ఇండోపాక్ యుద్ధంలో మునిగిపోయిన పాకిస్తాన్ సబ్ మెరైన్ పేరునే పెట్టారు. ఆ సబ్ మెరైన్ పేరు ‘పీఎన్ఎస్ ఘాజీ’. సినిమా షూటింగ్ కూడా రెండు రోజుల క్రితమే మొదలైంది.
0business
CHANDA ఐసిఐసిఐ బ్యాంకు ఎండి వేతనం రూ.7.85 కోట్లు! ముంబయి, మే 27: ఐసిఐసిఐబ్యాంకు సిఇఒ చందా కొచ్చర్‌ జీతాన్ని బ్యాంకు యాజమాన్యం పెంచింది. 2016-17 సంవత్సరానికిగాను ఆమె 7.85కోట్లు జీతం కింద డ్రాచేసారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 64శాతం పెరిగింది. 2017 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఆమె బేసిక్‌ జీతం 15శాతంపెరిగి 2.67 కోట్లకు చేరింది. బ్యాంకు వార్షిక నివేదికను అనుసరించి చూస్తే రోజువారిపద్ధతిలో ఆమెకు కంపనీ 2.18లక్షలుగా నిర్ణయించింది. పనితీరు బోనస్‌ కింద 2.2 కోట్లు ఆమె రాబట్టుకున్నారు. ఆర్థికస్థాయి క్షీణించడంతో 2015-16 సంవత్సరానికి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. ఆమెకు కంపెనీ 4.79కోట్లు అంతకుముందు సంవత్సరంలో చెల్లించింది. ఆమె బేసిక్‌ వేతనం 2.32కోట్లుగా ఉంది. ఇతర భత్యాలు అన్నీ కలుపుకుంటే ఆమె ఇంటికి భారీ మొత్తం తీసుకెళ్లగలిగారు. అంతేకాకుండా బ్యాంకు పనితీరు సందర్భంగా ఆమె అవిరళకృషే ఇందుకుకీలకం. వసతిగృహం, గ్యాస్‌, విద్యుత్‌, నీరు, ఫర్నిచర్‌, క్లబ్‌ఫీ, గ్రూప్‌బీమా, కార్లు, టెలిఫోన్‌ఎల్‌టిసి పిఎఫ్‌ వంటివి ఇతర భత్యాలపరంగా ఉన్నాయి. ====
1entertainment
bollywood legend dilip kumar`s health is well and he was safe బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‌కి మళ్లీ ఏమైంది ? ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ అనారోగ్యంతో మరోసారి అస్వస్థతకు గురయ్యారని.. TNN | Updated: Sep 8, 2017, 09:39PM IST ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ అనారోగ్యంతో మరోసారి అస్వస్థతకు గురయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఈసారి మరింత విషమంగా వుందని వస్తున్న వదంతుల్లో నిజం లేదని తేలిపోయింది. దిలీప్ కుమార్ నిక్షేపంగా, మునుపటికన్నా ఎంతో ఆరోగ్యంగా వున్నారని ఆయన ట్విటర్ హ్యాండిల్ బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్లు పలు ట్వీట్స్ పోస్ట్ చేశారు. అభిమానులు పంపించిన సందేశాలు చదివి వినిపిస్తున్నప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు, కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయని ఆ ట్వీట్స్‌లో పేర్కొన్నారు. Aap ke khuloos-o-pyaar bhare hue paigham Saab ko ushi jazbaat se sunaye ja rahe hain. -FF pic.twitter.com/CAhSYWNmlb — Dilip Kumar (@TheDilipKumar) September 8, 2017 In the next tweet will be posting a picture from this afternoon -FF ( @faisalMouthshut ) — Dilip Kumar (@TheDilipKumar) September 8, 2017 Saab ki tabiyat kaafi behtar hai. Aap sabke tweets sunke woh muskurate rahe aur khushi se ro pade. Will post pics later. -FF — Dilip Kumar (@TheDilipKumar) September 8, 2017 Sat next to Saab n read hundreds of beautiful messages sent by so many of you. He smiled and had tears in his eyes as I kept reading. -FF — Dilip Kumar (@TheDilipKumar) September 8, 2017 గత నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన దిలీప్ కుమార్ దాదాపు వారం రోజులపాటు ఆస్పత్రిలోనే వుండి పూర్తిస్థాయిలో కోలుకున్న అనంతరం డిశ్చార్జ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలావుండగా తాజాగా దిలీప్ కుమార్ ఆరోగ్యంపై మరోసారి వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో స్వయంగా తన ట్విటర్ హ్యాండిల్ ద్వారా వచ్చిన ఈ ట్వీట్స్ ఆయన అభిమానులకి ఊరటనిచ్చాయి.
0business
ఫిట్‌నెస్‌ పరీక్షలో గంభీర్‌, యువరాజ్‌ సఫలం జస్‌ప్రీత్‌, బుమ్రా కూడా హాజరు న్యూఢిల్లీ : బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్షలో ఓపెనర్‌ గంభీర్‌,ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సఫలమయ్యారు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో గాయపడ్డ ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ స్థానంలో గంభీర్‌కు పిలుపొచ్చినట్లు సమాచారం.వన్డే,టి20 సిరీస్‌లలో బంతితోనూ సత్తాచాటగల యువరాజ్‌కు అవకాశం రావచ్చని తెలుస్తుంది. వీరిద్దరితో పాటు యువ పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, బరిందర్‌ శరణ్‌ సైతం ఫిట్‌నెస్‌ పరీక్షలకు హాజరయ్యారు. టెస్టు జట్టులో 12వ ఆటగాడిగా మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఉన్నా ఈ మధ్య దులీప్‌ ట్రోఫీలో నాలుగు హాఫ్‌ సెంచరీలతో దూసుకుపోయిన గంభీర్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. కాగా బిసిసిఐ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
2sports
sandhya 175 Views HUAWEI 5G smart phone , July 26 HUAWEI 5G smart phone ముంబయి: చైనా టెలికాం యంత్రసామగ్రి ఉత్పత్తి కంపెనీ హువేయి తన మొట్టమొదటి 5జి స్మార్ట్‌ఫోన్‌ను ఈనెల 26వ తేదీనే విడుదలచేస్తున్నట్లు ప్రకటించింది. గతనెలలోనే ప్రభుత్వం దేశంలోని మేజర్‌ కంపెనీలకు 5జి సేవలు ప్రారంభించాలని ఆదేశించిన సంగతి తెలిసింది. ప్రపంచదేశాలు ముందున్న రేసులో శరవేగంగా వచ్చే టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలో 5జికి ఇపుడు అగ్రస్థానంలో ఉంది. చైనా, అమెరికా ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో 5జి సేవలప్రారంభం ఇపుడు సంచలనంగా మారింది. హువేయి మేట్‌ 20ఎక్స్‌ పేరిట కంపెనీ కేంద్ర కార్యాలయం షెన్‌జెన్‌లో ఫోన్‌ రూపొందించిందని గ్లోబల్‌టైమ్స్‌ ప్రస్తావించింది. దేశంలోని అన్ని టెలికాం కంపెనీలకు 5జి సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇక 5జి సేవలు వాణిజ్యీకరణ కూడా సత్వరమేప్రారంభించేందుకు కంపెనీయోచిస్తోంది మొత్తం 5జి పారిశ్రామికీకరణకు అమెరికా,చైనాలుముందు ప్రోత్సాహం ఇస్తున్నాయి. హువేయి కంపనీ 5జి స్మార్ట్‌ఫోన్లకోసం సొంత చిప్‌సెట్‌ కిరిన్‌ను విడుదలచేసింది. హువేయి మేట్‌20ఎక్స్‌ విడుదలతో చైనా 5జి మార్కెట్‌మరింతపెరుగుతుందని అంచనా. 5జి టెక్నాలజీస్‌ పరంగాచూస్తే భావితరం సెల్యులర్‌టెక్నాలజీ పదినుంచి 100 రెట్లు డౌన్‌లోడ్‌ స్పీడ్‌తో ఉంటుంది. డ్రైవర్‌లెస్‌ కార్ల తరహాలోనే మొబైల్‌సేవల్లో నెక్స్ట్‌జెన్‌ మొబైల్‌ పరికరాలనుసైతం అందిస్తుంది. బీజింగ్‌ నగరంలోనే ఇందుకోసం 4300 వరకూ 5జి బేస్‌ స్టేషన్లు ఏర్పాటుచేసారు. పట్టణ ప్రాంతాల్లోని కీలక ప్రాంతాల్లో ఐకానిక్‌ భవనాలు సూపర్‌ఫాస్ట్‌ టెక్నాలజీని అమలుచేసేందుకువీలుగా 5జి లైసెన్సులు టెలికాం సంస్థలకు జారీచేసింది. హువేయి సంస్థపై అమెరికా ఆగ్రహానికి ప్రధాన కారణం కేవలం 5జి టెక్నాలజీని ముందుకు తీసుకురావడం అమెరికాకు ఇష్టంలేదని, అందువల్లనే కంపెనీకి చిక్కులు తెస్తోందని చైనా ఆరోపిస్తోంది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
1entertainment
Hyderabad, First Published 8, Jul 2019, 3:23 PM IST Highlights ఓ సినిమా తీసి హిట్ కొడితే చాలు.. టాలీవుడ్ వారిని నెత్తిన పెట్టేసుకుంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది కుర్ర దర్శకులు హిట్లు అందుకొని పెద్ద పెద్ద బ్యానర్ లతో పని చేసే అవకాశాలను దక్కించుకున్నారు.  ఓ సినిమా తీసి హిట్ కొడితే చాలు.. టాలీవుడ్ వారిని నెత్తిన పెట్టేసుకుంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది కుర్ర దర్శకులు హిట్లు అందుకొని పెద్ద పెద్ద బ్యానర్ లతో పని చేసే అవకాశాలను దక్కించుకున్నారు. తాజాగా మరో ఇద్దరు కుర్ర దర్శకులకు పెద్ద బ్యానర్ ల నుండి అడ్వాన్స్ లు అందినట్లు తెలుస్తోంది. గతంలో 'మెంటల్ మదిలో' సినిమా తీసిన దర్శకుడు వివేక్ ఆత్రేయ తాజాగా 'బ్రోచెవారెవరురా' అనే మరో సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఇతడితో కలిసి పని చేయడానికి మైత్రి మేకర్స్ ముందుకొచ్చింది. అంతేకాదు.. వివేక్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారట. వివేక్ తదుపరి సినిమా మైత్రిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మైత్రి ఆఫీస్ లో పది మందికి పైగా దర్శకులు కథలతో కుస్తీలు పడుతున్నారు. ఇప్పుడు వివేక్ కూడా ఈ బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడు. అలానే ఇటీవల 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో సక్సెస్ అందుకున్న దర్శకుడు స్వరూప్ కి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. కె.ఎఫ్.సి అనే పంపిణీ సంస్థ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి దిగుతోంది. ఆ సంస్థ బ్యానర్ లో స్వరూప్ సినిమా చేయబోతున్నాడు. కోన వెంకట్ కూడా స్వరూప్ కి అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి చిన్న సినిమాలు తీసి పెద్ద నిర్మాతల కళ్లల్లో బాగానే పడ్డారు.  Last Updated 8, Jul 2019, 3:23 PM IST
0business
rana will get married before prabhas, says rajamouli on koffee with karan ప్రభాస్ కన్నా ముందే రానా పెళ్లి: రాజమౌళి ‘ప్రభాస్‌ను పెళ్లెప్పుడు చేసుకుంటావ్.. రానా కన్నా ముందే చేసుకుంటావా లేదా’ అని కరణ్ అడగగా.. రాజమౌళి కలుగజేసుకుని ప్రభాస్ కన్నా ముందు రానా పెళ్లే అవుతుందని చెప్పారట. Samayam Telugu | Updated: Dec 10, 2018, 04:34PM IST టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఎవరు అని అడిగితే టక్కున చెప్పే పేరు ప్రభాస్. ఈ ఆరడుగుల అందగాడి పెళ్లి విషయం తెలుగు నాట ఇప్పటికీ హాట్ టాపిక్కే. ప్రభాస్ పెళ్లిపై ఇప్పటికే బోలెడన్ని వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఏదీ నిజం కాలేదు. ఇప్పటికీ ప్రభాస్ పెళ్లిపై చర్చ జరుగుతూనే ఉంది. కేవలం ప్రేక్షకుల్లోనే కాదు.. సినీ పరిశ్రమకు చెందిన పెద్దల్లోనూ ఇదే విషయం చర్చకు వస్తోంది. హిందీలో బాగా పాపులర్ అయిన ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ యజమాని, బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తారనే విషయం కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికే ప్రభాస్, రానా, రాజమౌళిలతో కరణ్ జోహార్ ఇంటర్వ్యూకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. కొద్ది రోజుల్లో ఈ షో టీవీలో ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే, ఈ షోలో కూడా ప్రభాస్ పెళ్లి విషయం చర్చకు వచ్చిందని అంతర్గత వర్గాల సమాచారం. ‘ప్రభాస్‌ను పెళ్లెప్పుడు చేసుకుంటావ్.. రానా కన్నా ముందే చేసుకుంటావా లేదా’ అని కరణ్ అడగగా.. రాజమౌళి కలుగజేసుకుని ప్రభాస్ కన్నా ముందు రానా పెళ్లే అవుతుందని చెప్పారట. దీంతో అక్కడ నవ్వులు పువ్వులు పూశాయని అంటున్నారు. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే ఈ టాక్ షో ప్రసారమయ్యేంత వరకు ఆగాల్సిందే.
0business
Hyderabad, First Published 19, Oct 2018, 10:16 AM IST Highlights బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పేరు తెలియని వారుండరు. అంతగా ఆమె పాపులారిటీ దక్కించుకుంది. సినిమాలంటే కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచేది ఈ బ్యూటీ. తాజాగా ఆమె ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పేరు తెలియని వారుండరు. అంతగా ఆమె పాపులారిటీ దక్కించుకుంది. సినిమాలంటే కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచేది ఈ బ్యూటీ. తాజాగా ఆమె ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కంగనా కెరీర్ తొలినాళ్లలో దర్శకుడు పూరి జగన్నాథ్ 'ఏక్ నిరంజన్' సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశాడు. ప్రభాస్ హీరోగా నటించాడు. ఈ సినిమా విడుదలయ్యి దాదాపు తొమ్మిదేళ్లు పూర్తవుతుంది. ఆ తరువాత కంగనా తెలుగు సినిమాలలో కనిపించలేదు. బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మరోపక్క ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో కంగనా వద్ద ప్రభాస్ టాపిక్ తీసుకురాగా.. 'ఏక్ నిరంజన్' సినిమా నుండే ప్రభాస్ తో మాట్లాడడం మానేశానని షాకింగ్ కామెంట్స్ చేసింది. 'ఏక్ నిరంజన్' సినిమా సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. దాని కారణంగానే అప్పటినుండి ఇద్దరం మాట్లాడుకోవడం మానేశామని చెప్పుకొచ్చింది. అయితే 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ నటన చూసి గర్వంగా ఫీల్ అయ్యానని, 'మణికర్ణిక' సినిమాలో తన నటన చూసి కూడా ప్రభాస్ గర్వంగా ఫీల్ అవుతాడంటూ తన పాత్ర గొప్పదనం గురించి తెలిపింది. అయితే ప్రభాస్ తో ఎందుకు గొడవ జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు ఈ బ్యూటీ.  Last Updated 19, Oct 2018, 10:16 AM IST
0business
Apr 29,2016 భారత 'సీఈఓలకు 'భళా' జీతాలు న్యూఢిల్లీ : బహుళ జాతి కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తున్న పలువురి భారతీయుల జీతాలు అదిరిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది అధిక జీతాలు అందుకున్న 100 మంది సీఈఓల జాబితా విడుదలయ్యింది. ఇందులో పలువురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. భారత సంతతికి చెందిన పెప్సీకో సీఈఓ ఇంద్రానూయీ, లియోండెల్‌ బాసెల్స్‌ సీఈఓ భావేశ్‌ పటేల్‌ వీరిద్దరు అధిక జీతాలు అందుకుంటున్న తొలి పది మంది సీఈఓల జాబితాలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యా నాదేళ్ల 26వ స్థానంలో చోటు దక్కించు కున్నారు. అత్యధిక జీతం అందుకున్న 100 సీఈఓల జాబితాలో ఆరుగురు మహిళలు ఉన్నారు. అందులో భారత్‌ తరఫున ఒకే ఒక్క మహిళ ఇంద్రానూ యీ. ఒరాకిల్‌ సీఈఓలు మార్క్‌ వి హర్డ్‌, సఫ్రా ఏ క్యాట్‌లు ఇరువురు తొలిస్థా నంలో నిలిచారు. 2015లో వీరి జీతం 53.2 మిలియన్‌ డాలర్లు. 43.5 మిలి యన్‌ డాలర్ల వేతనంతో వాల్గ్‌ డిస్నీ సీఈఓ రాబర్డ్‌ ఏ ఇగర్‌ రెండో స్థానంలో ఉన్నారు. 24.5 మిలియన్‌ డాలర్ల జీతంతో బాసెల్స్‌ సీఈఓ భవేష్‌ పటేల్‌ ఆరో స్థానంలో నిలిచారు. 22.2 మిలియన్‌ డాలర్ల వేతనంతో పెప్సీకో సీఈఓ ఇంద్రా నూయీ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల 18.3 మిలియన్‌ డాలర్ల వేతనంతో ఈ జాబితాలో 26వ స్థానాన్ని పొందారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 1, Oct 2019, 5:11 PM IST Highlights సైరా సినిమాలో చిరంజీవి పాత్ర చనిపోతుందని ప్రేక్షకుల్ని మానసికంగా సిద్ధం చేసే కార్యక్రమాన్ని కొన్ని రోజులుగా కొనసాగిస్తోంది యూనిట్.    'సైరా నరసింహారెడ్డి' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర చనిపోతుందనే విషయాన్ని మొదటి నుండి ప్రేక్షకులకు చెబుతూ వారిని మానసికంగా సిద్ధం చేస్తోంది చిత్రబృందం. ఇప్పటికే దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు చిరంజీవి కూడా అదే పని చేస్తున్నారు. తన పాత్ర చనిపోతుందని, ప్రేక్షకులు షాక్ అవ్వాల్సిన  అవసరం లేదని అంటున్నారు. ఇది చరిత్ర కాబట్టి, ప్రేక్షకులు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి వస్తారు కాబట్టి వాళ్లకి షాకింగ్ గా అనిపించదని చిరు అన్నారు. నరసింహారెడ్డిలో పాత్రను మాత్రమే చూస్తారని.. తనను చూడరని అంటున్నారు మెగాస్టార్. నరసింహారెడ్డి పాత్ర చనిపోతుందని చాలా రోజులుగా చెబుతూ వస్తున్నామని.. కాబట్టి ప్రేక్షకులు నిరాశపడరనే అనుకుంటున్నామని అన్నారు. సినిమా క్లైమాక్స్ పూర్తైన తరువాత గొప్ప ఫీలింగ్ తో ప్రేక్షకుడు బయటకొస్తాడనే నమ్మకం తనకుందని చిరు అన్నారు. బ్రిటీష్ వాళ్లు నరసింహారెడ్డి తలను కోటగుమ్మానికి ముప్పై ఏళ్లపాటు వేలాడి ఉంచారని.. ప్రజల్లో భయం పుట్టించడానికే వారు ఆ పని చేశారని చెప్పిన చిరంజీవి ఆ సన్నివేశాలు మాత్రం 'సైరా'లో ఉండవని చెప్పారు. క్లైమాక్స్ లో వచ్చే పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమా ముగుస్తుందని.. అదంతా ఎంతో ఎమోషనల్ గా ఉంటుందని చెబుతున్నారు.  రామ్ చరణ్ నిర్మాతగా మారి, 'సైరా' సినిమాను తనకు, ప్రేక్షకులకు గిఫ్ట్ గా అందించాడని, ఓ తండ్రిగా తను చరణ్ కి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనే విషయంగురించి ఇంకా ఆలోచించలేదని చెప్పిన చిరు 'సైరా' రిలీజ్ తరువాత తప్పకుండా చరణ్ కి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు.  Last Updated 1, Oct 2019, 5:11 PM IST
0business
అఖిల్ తదుపరి సినిమా టైటిల్ రిజిస్టర్ అయింది Highlights అఖిల్ చిత్రంతో  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రెండో చిత్రం చేస్తున్న అఖిల్ ఈ చిత్రానికి రంగుల రాట్నం అనే టైటిల్ రిజిస్టర్ చేయించిన అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని అఖిల్ తాజాగా రెండో సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు . అఖిల్ సినిమా డిజాస్టర్ కావడంతో చాలాకాలం పాటు ఖాళీగా ఉండిపోయాడు . అయితే ఎట్టకేలకు మనం వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తాజాగా అఖిల్ రెండో సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా కు ఏ టైటిల్ అనుకుంటున్నారంటే అదే... రంగుల రాట్నం . 1966 వ సంవత్సరంలో రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది రంగులరాట్నం చిత్రం. ఇన్నాళ్లకు అదే టైటిల్ తో అఖిల్ సినిమా చేస్తున్నాడు . రంగులరాట్నం టైటిల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రిజిస్టర్ చేయించారు కానీ ఇది అఖిల్ కోసమే అని మాత్రం అధికారికంగా చెప్పలేదు. Last Updated 25, Mar 2018, 11:38 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సాహో: ప్రభాస్‌తో ఢీ అంటోన్న లేడీ విలన్! బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించిన ఏ వార్త అయినా హాట్ టాపిక్‌గా మారింది. TNN | Updated: Aug 30, 2017, 08:15PM IST బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో 'సాహో' చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా చిత్రబృందం చిన్న టీజర్‌ను విడుదల చేసి అందరినీ మెప్పించింది. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనుకుంటోన్న చిత్రబృందం దానికి తగ్గట్లుగా కృషి చేస్తోంది. ముందుగా అందరి దృష్టిని ఆకర్షించడానికి ఈ సినిమాలో బాలీవుడ్ నుండి ఎక్కువగా నటులను ఎంపిక చేసుకుంటున్నారు. శ్రద్ధాకపూర్‌ను హీరోయిన్‌గా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, టిన్ను ఆనంద్ వంటి నటులను ఎన్నుకున్నారు. ఇప్పుడు మరో బాలీవుడ్ నటి ఈ ప్రాజెక్ట్‌లో భాగమైందని సమాచారం. మోడల్‌గా, నటిగా, ఫ్యాషన్ డిజైనర్‌గా, టెలివిజన్ ప్రెజంటర్‌గా పలు విభాగాల్లో తన సత్తా చాటిన మందిరా బేడిను ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. 45 ఏళ్ల ఈ హాట్ విమెన్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్. కథకు తగ్గట్లుగా ఆమె సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కూడా కనిపిస్తారని తెలుస్తోంది. తాజాగా మందిరా బేడీ ‘సాహో’ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.
0business
Suresh 86 Views రెండేళ్లలో హర్యానాకు రూ.2437 కోట్ల పెట్టుబడులు ఛండీగఢ్‌, సెప్టెంబరు 18: సత్వర పారిశ్రామికీకరణ విధానాలఫలితంగా హర్యానాలో సుమారు 60కి పైగా చిన్నమధ్యతరహా పరిశ్రమలను స్థాపించారు. గడచిన రెండేళ్లలో హర్యానా రాష్ట్రానికి 2437 కోట్ల పెట్టుబడులు అందినట్లు తేలింది. ఈ పరిశ్రమల ద్వారా సుమారు 18వేలమందికిపైగా నిరుద్యోగు లకు ఉపాధి కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో 8077 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరి శ్రమలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వర కూ 9248 కోట్ల పెట్టుబడులు రాగా ఈ కాలం లోనే 1,36,689 మందికి ఉపాధి కల్పించ గలిగినట్లు హర్యానా ప్రభుత్వ పరిశ్రమలశాఖ వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వా మ్యంతో కామన్‌ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్లు 18వేలమందికి ఉపా ధి కల్పించినట్లు పరిశ్రమల శాఖ అధికార ప్రతినిధి వివరించారు. ఉత్పత్తిరంగానికి చిన్న, మధ్యతరహా పరిశ్రమలే కీలకమని గుర్తించిన మఱ్యానా ప్రభుత్వం టూల్‌రూమ్స్‌, టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఐఎంటి రోహ్‌తక్‌, పారిశ్రామి వృద్ధికేంద్రం సాహా ప్రాంతంలోను ఈ ప్రాజెక్టులు వచ్చాయి. ఈ రెండుప్రాజెక్టుల్లో ప్రభు త్వం సుమారు 100 కోట్ల పెట్టుబడులు పెట్టింది. అంతేకాకుండా అంకుర పరిశ్రమలస్థాపనకు విస్తృత ప్రచారం నిర్వహించిందని వెల్లడించారు. ఎక్కువగా యువతనుంచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారుచేసేలక్ష్యంతో హర్యానా ప్రభుత్వం విస్తృత కృషిచేస్తోంది. రవాణా కారిడార్‌లో కూడా పెట్టు బడులుపెరి గాయి. ఢిల్లీ నుంచి ముంబై కారిడార్‌లో హర్యానా ప్రభు త్వం మూడుకీలక కార్యాచరణలను అమలుచేస్తోం ది. పారిశ్రామికప్రోత్సాహక మండలి ఆధ్వర్యంలో హర్యానా ప్రభుత్వం రవాణా కారిడార్లలో కూడా ప్రాజెక్టులు చేపడుతోంది. ఇందులో భాగంగానే దక్షి ణ హర్యానాలో సమీకృత మల్టీమోడల్‌ రవాణా హబ్‌ను ఏర్పాటుచేస్తోంది. దీనివల్ల రాజధాని పరి సర ప్రాంతాలన్నింటికీ మేలుజరుగుతుంది. గుర్‌ గావ్‌లో గ్లోబల్‌సిటీ నిర్మిస్తోంది. మాస్‌ర్యాపిట్‌ ట్రాన్సిట్‌వ్యవస్థ ద్వారా గుర్‌గావ్‌ మనేసార్‌ బావాల్‌ ప్రాంతాలను కలుపుతోంది. ఇందుకోసం మేసార్‌ బావల్‌ పెట్టుబడుల ప్రాంతంగా రూపొందిం చేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొంది స్తున్నట్లు పరిశ్రమల శాఖ అధికార ప్రతినిధి వివరించారు. 402 చదరపు కీలోమీటర్ల లో ఈపెట్టుబడుల రీజియన్‌ను వృద్ధిచేస్తా రు. గ్లోబల్‌ సిటీప్రాజెక్టు కింద లక్షకోట్ల రూపాయల పెట్టుబడులు రాగలవని అంత విలువైన ప్రాజెక్టులు కూడా రూపుదిద్దుకుంటు న్నట్లు పరిశ్రమల శాఖ ప్రచారం చేస్తోంది. ఎగ్జి బిషన్‌, కన్వెన్షన్‌కేంద్రం, అత్యధికనాణ్యత విలువలు జోడించిన నాలెడ్జ్‌ ఇండస్ట్రీస్‌, కేంద్ర కీలక వాణిజ్య జిల్లాలు, టౌన్‌షిప్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం రూట్‌మాప్‌ సిద్ధం చేసింది.
1entertainment
బెంగళూరు టెస్ట్ : 474 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ Highlights బ్యాటింగ్ ఆరంభించిన అప్ఘాన్... బెంగళూరు లో అప్ఘాన్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ లో భారత జట్టు 474 పరుగుల వద్ద ఆలౌటైంది. నిన్న ఓపెనర్లు దాటిగా బ్యాటింగ్ చేసి సెంచరీలు సాధించడంతో ఆరంభంలోనే గట్టి పునాది పడింది.అయితే మిగతా ఆటగాళ్లలో ఒకరిద్దరు మినహా మిగతావారెవరూ ఆ స్థాయిలో రాణించలేదు. దీంతో భారత జట్టు బారీ స్కోరు సాధించలేకపోయింది.  మొత్తంగా నిన్న, ఇవాళ కలిపి 104.5 ఓవర్లాడిన భారత జట్టు 474 పరుగులు సాధించింది. ఇవాళ 347/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన టీం ఇండియా మరో  127 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ ఆటగాడు అశ్విన్‌(7) త్వరగా ఔటైనా హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా మంచి ఇన్నింగ్స్ ను నిర్మించారు. బాగా పరుగులు సాధిస్తున్న హర్దిక్ కు స్ట్రైక్ రొటేట్ చేస్తూ జడేజా సహకారం అందించాడు. ఇలా హార్దిక్‌ పాండ్యా 83 బంతుల్లో అర్థశతకం సాధించాడు.  436 పరుగుల వద్ద జడేజా 8 వ వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరడంతో ఈ బాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడటంతో 474 వద్ద భారత జట్టు ఆలౌటైంది.  చివర్లో ఉమేష్ యాదవ్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. కేవలం 21 బంతుల్లోనే 26 (2 ఫోర్లు, 2 సిక్స్ )పరుగులు సాధించి నాటౌట్ గానిలిచాడు.   అఫ్గానిస్థాన్‌ బౌలర్లలో యమీన్‌ అహ్మద్‌జాయ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఇతడు మూడు వికెట్లతో భారత జట్టును భారీ స్కోరు చేయకుండా కట్టడిచేయగలిగాడు. ఇక మిగతా బౌలర్లు వఫాదార్‌, రషీద్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు సాధించగా మహ్మద్‌ నబీ, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లు తలో వికెట్‌ తీశారు.   Innings Break! #TeamIndia all out for 474 in 104.5 overs (Dhawan 107, Vijay 105, Hardik 71). #TheHistoricFirst #INDvAFG pic.twitter.com/fb4k7ABNkN
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV మైకేల్ ఫెల్ప్స్ పై ఫన్నీ ట్వీట్స్ రియో ఒలింపిక్స్ లో అమెరికా స్టార్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. TNN | Updated: Aug 11, 2016, 02:31AM IST రియో ఒలింపిక్స్ లో అమెరికా స్టార్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా మరో రెండు బంగారు పతకాలు సాధించాడు. తాజాగా సాధించిన పతకాలతో అతడి ఖాతాలో 25 ఒలింపిక్ పతకాలు ఉన్నాయి. ఇందులో 21 బంగారం, 2 రజతాలు, 2 కాంస్య పతకాలున్నాయి. మరి ఇలాంటి బంగారు చేప ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఫెల్ప్స్ పై కొందరు ఫన్నీగా చేసే ట్వీట్స్ ప్రజెంట్ గా వైరల్ అవుతున్నాయి. ‘ఒలింపిక్స్ లో ఇండియా 116 ఏళ్లలో మొత్తం 26 పతకాలు సాధిస్తే.. ఫెల్ప్స్ ఒక్కడే 25 పతకాలు సాధించాడు. మనం ఒక్కటే లీడ్ లో ఉన్నాం’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నెస్ట్ మైకేల్ ఫెల్ప్స్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. అందులో కొన్ని మీరూ చూడండి. Michael Phelps practicing at his house pic.twitter.com/Hw8o097GWu
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ​ డివిలియర్స్ ఊచకోత.. బంగ్లా టార్గెట్ 354 దక్షిణాఫ్రికా హిట్టర్ ఏబీ డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో TNN | Updated: Oct 18, 2017, 05:39PM IST దక్షిణాఫ్రికా హిట్టర్ ఏబీ డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో డివిలియర్స్ (176: 104 బంతుల్లో 15x4, 7x6) మెరుపు శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. అతనికి ఓపెనర్ హసీమ్ ఆమ్లా (85: 92 బంతుల్లో 4x4) అర్ధ శతకంతో చక్కటి సహకారం అందించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రుబెల్ హుస్సేన్ నాలుగు వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలో వికెట్ నష్టపోకుండా విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించింది. ఓపెనర్లు హసీమ్ ఆమ్లా, డికాక్ (46: 61 బంతుల్లో 1x4) తొలి వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ స్కోరు వద్దే డికాక్‌ని రుబెల్ పెవిలియన్‌కి పంపగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్‌ని షకిబ్ అల్ హసన్ బోల్తా కొట్టించాడు. దీంతో క్రీజులో‌కి వచ్చిన ఏబీ డివిలియర్స్ కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడినా.. అనంతరం భారీ షాట్లతో రెచ్చిపోయాడు. ఏ బంతి వేసినా.. బౌండరీకి తరలించాలనే కసితో అతను హిట్టింగ్ చేయడంతో బంగ్లా బౌలర్లు లయ తప్పారు. అతని జోరు చూస్తుంటే డబుల్ సెంచరీ చేస్తాడేమో అనిపించింది. కానీ.. 48వ ఓవర్‌లో రుబెల్ హుస్సేన్ విసిరిన బంతిని హిట్ చేయబోయి షబ్బీర్‌కి క్యాచ్ ఇచ్చి ఏబీ ఔటయ్యాడు. కానీ.. అప్పటికే దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసేసింది.
2sports
Hyderabad, First Published 5, Mar 2019, 3:49 PM IST Highlights టాలీవడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తారక్ సినిమా సినిమాకు ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు గాని ఇంతవరకు సొంతంగా ఒక బిజినెస్ ను పెట్టుకోలేదు. ఇక ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టంగా ఉంటున్న తరుణంలో ఆదాయాన్ని పెంచుకోవాలని ఇటీవల కొంత మంది హీరోల నుంచి కొన్ని ఐడియాలను తీసుకున్నాడట.  టాలీవడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తారక్ సినిమా సినిమాకు ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు గాని ఇంతవరకు సొంతంగా ఒక బిజినెస్ ను పెట్టుకోలేదు. ఇక ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టంగా ఉంటున్న తరుణంలో ఆదాయాన్ని పెంచుకోవాలని ఇటీవల కొంత మంది హీరోల నుంచి కొన్ని ఐడియాలను తీసుకున్నాడట.  లైఫ్ లాంగ్ ఉండే బిజినెస్ బెటర్ అని సినిమా ప్రపంచంలోనే తన బిజినెస్ ఉండాలని మల్టిప్లెక్స్ లను మొదలెట్టడానికి ఈ హీరో సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ ఏషియన్ సినిమాస్ తో కలిసి AMB సినిమాస్ ను రన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అదే తరహాలో తారక్ కూడా ఏషియన్ సినిమాస్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో మల్టిప్లెక్స్ లను నిర్మించడానికి తన టీమ్ ను రెడీ చేస్తున్నాడు.  ముందుగా అమరావతి లేక విశాఖపట్నం వంటి నగరాల్లో బిజినెస్ ను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా గవర్నమెంట్ నుంచి అనుమతి రావాల్సి ఉందట. ఒక్కసారి ఒకే అయితే పనులు మొదలుపెట్టాలని తారక్ రెడీగా ఉన్నట్లు సమాచారం.     Last Updated 5, Mar 2019, 3:49 PM IST
0business
- వచ్చే రెండేళ్లలో 80వేల ఖాళీల భర్తీ - ఎస్‌బిఐ సహ పిఎస్‌యు బ్యాంకుల్లో నియామకాలు న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో సహ దేశంలోని టాప్‌ పిఎస్‌యు బ్యాంకుల్లో వచ్చే రెండేళ్లలో సుమారు 80వేల ఉద్యోగాల భర్తీ కానున్నాయి. ఎస్‌బిఐలో దాదాపు 80వేలమంది ఆఫీసర్లు రిటైరవ్వబోతున్నారని విశ్వసనీయ సమాచారం. 2015-16, 2016-17లలో భారీ సంఖ్యలో పదవివిరమణ చేయనున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 39వేల765 మంది ఉద్యోగులు రిటైరవ్వబోతున్నారు. వీరిలో 19వేల065 మంది ఆఫీసర్లస్థాయి,14వేల669 క్లర్క్‌ స్థాయిలో పదవీ విరణమ చేయ బోతు న్నారు. దేశ వ్యాప్తంగా 22 ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. వీటికి మరి కొన్ని అనుబంధ బ్యాంకులున్నాయి. మధ్యస్థాయి ఉద్యోగ నియామకాలపై సడలింపు ప్రణాళిక..? బ్యాంకుల్లో కీలకమైన మధ్యస్థాయి ఉద్యోగ నియామకాల భర్తీకి వెసులుబాటు కల్పించేదిశగా కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌పై న్యాయ సలహా బ్యాంక్‌ ఉద్యోగాల కోసం క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ సరైందనికేేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయపడుతున్నారు. బ్యాంక్‌ క్యారపస్‌ హైరింగ్‌ కోసం ఎక్కువ ఉత్సూకత చూపుతున్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంకులో ఉన్న ఖాళీల భర్తీకి వెసులుబాటు కల్పించే అవకాశంలేదని బ్యాంకు వర్గాలు అంటున్నాయి. కాగా కేంద్రం మాత్రం క్యాంపస్‌ రిక్రూట్‌మెంటుపై ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల మార్గాలకోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ న్యాయసలహా తీసుకుంటుందని తెలిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ప్రిన్స్ మహేష్ బాబు బలం ఎవరో తెలుసా? లైఫ్ పార్ట్ నర్ నమ్రత శిరోద్కర్ తన బలమని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. ఆదివారం ఆయన బార్య, నటి నమ్రత పుట్టినరోజు. Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin-top:0cm; mso-para-margin-right:0cm; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0cm; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:"Times New Roman"; mso-fareast-theme-font:minor-fareast; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin;} --> | Updated: Jan 22, 2017, 12:34PM IST లైఫ్ పార్ట్ నర్ నమ్రత శిరోద్కర్ తన బలమని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. ఆదివారం ఆయన బార్య, నటి నమ్రత పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా మహేష్‌ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నా బలం, నా జీవితానికి వెలుగు నా ప్రియమైన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేస్తూ.. నమత్ర ఫొటోను పోస్ట్‌ చేశారు. My strength and the light of my life - Happy Birthday to my dearest wife :) pic.twitter.com/OemBbGNKqK — Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2017 వంశీ చిత్రంలో మహేష్ నమ్రతలు కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు. వీరి గౌతమ్, సితార ఇద్దరు పిల్లున్నారు. ప్రస్తుతం మహేష్ ఎఆర్ మురుగుదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ధోనీ, డ్వేన్ బ్రావో మధ్య 3 రన్స్ రేస్..! మైదానంలో మహేంద్రసింగ్ ధోని భుజంపై చేయివేసి ఆటపట్టించే చనువు ఉన్న అతికొద్ది మంది క్రికెటర్ల జాబితాలో డ్వేన్ బ్రావో ముందు వరుసలో Samayam Telugu | Updated: May 29, 2018, 02:04PM IST ధోనీ, డ్వేన్ బ్రావో మధ్య 3 రన్స్ రేస్..! మైదానంలో మహేంద్రసింగ్ ధోని భుజంపై చేయివేసి ఆటపట్టించే చనువు ఉన్న అతికొద్ది మంది క్రికెటర్ల జాబితాలో డ్వేన్ బ్రావో ముందు వరుసలో ఉంటాడు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి సుదీర్ఘకాలంగా అభిమానులకి సుపరిచితమే. మ్యాచ్ మధ్యలో సరదాగా సవాళ్లు విసురుకోవడం.. వాటిని ఛేదించడం ఈ ఇద్దరికీ మామూలే. 2016 ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ లయన్స్ తరఫున ఆడిన డ్వేన్ బ్రావో తన చేతికి దొరికిన బంతిని కిందకి విసిరి.. ధైర్యముంటే రెండో పరుగు చేయాలని ధోనీకి సవాల్ విసరగా.. క్షణాల వ్యవధిలో ధోనీ రెండో పరుగుని పూర్తి చేసి మైదానంలో నవ్వులు పూయించాడు. ఆ మ్యాచ్‌ అనంతరం ధోనీ కాలర్‌ని పట్టుకుని.. బ్రావో ఆటపట్టించిన తీరుని అభిమానులు మర్చిపోలేరు. When Thala challenged Champion for a three run dash, post the victory yesterday! Any guesses who wins it?… https://t.co/02XpF37dui — Chennai Super Kings (@ChennaiIPL) 1527503836000 తాజాగా ఐపీఎల్ 2018 సీజన్‌లో టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు ఫుల్ ఖుషీగా ఉంది. గత ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై గెలిచిన అనంతరం ధోనీ, బ్రావో మధ్య ఒక సరదా పందెం జరిగింది. ఫిటెనెస్‌ నిరూపణలో భాగంగా వికెట్ల మధ్య మూడు పరుగులను ఎవరు వేగంగా పూర్తి చేస్తే వారే విజేత అని తేల్చారు. పోటీలో ఇద్దరూ అత్యుత్తమంగా పరుగెత్తారు. కానీ.. విజేత ఎవరో వీడియో చూసిన అనంతరం మీరే చెప్పాలి..!!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
— STAR MAA (@StarMaa) September 24, 2017 బిగ్ బాస్ షోలో పాల్గొన్న పోటీదారులు: అర్చన, సమీర్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, సింగర్ మధుప్రియ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, జ్యోతి, సింగర్ కల్పన, మహేష్ కత్తి, కత్తి కార్తీక, శివ బాలాజీ, ఆదర్శ్, హరి తేజ, ధనరాజ్, దీక్ష(వైల్డ్ కార్డ్), నవదీప్ (వైల్డ్ కార్డ్) ఫైనల్ కన్టెస్టెంట్స్: ఆదర్శ్, శివబాలాజీ, హరితేజ, నవదీప్, అర్చన ఇక ఈరోజు గ్రాండ్ ఫినాలే హైలైట్స్ విషయానికి వస్తే.. ముఖ్యంగా బిగ్‌బాస్ సీజన్ 1 ఫైనల్ విన్నర్‌ను ప్రకటించే ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుండటంతో ఆ ఎపిసోడ్‌ను చాలా స్పెషల్‌గా ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను ఆదివారం సాయంత్రం 6 గంటలకే ప్రారభమైంది. తారక్ వన్‌మ్యాన్ షోగా దాదాపు 4 గంటల పాటు బిగ్‌బాస్ షో ఆకట్టుకున్నారు. హైలైట్స్ .. # బిగ్‌బాస్ సీజన్‌1 ఫైనల్ ఎపిసోడ్‌లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ రాకింగ్ పెర్ఫామెన్స్‌‌ని ఇస్తూ ఎన్టీఆర్ సాంగ్స్‌తో స్టేజ్‌ని షేక్ చేసేశారు. # ఇక ఫైనల్‌లో ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా ఉండబోతుందని ఎదురు చూస్తున్న ప్రేక్షకులను ఫాలో .. ఫాలో.. అనే సాంగ్‌‌కి దేవిశ్రీతో కలిపి స్టెప్పులు వేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు ఎన్టీఆర్. # దేవిశ్రీ ప్రసాద్‌‌తో కలిసి స్టేజ్‌ని పంచుకుని ‘జై లవకుశ’ రిలీజ్ తరువాత దేవిశ్రీని బిగ్‌బాస్ స్టేజ్ మీదే కలుస్తున్నానని చాలా హ్యాపీగా ఉందన్నారు. # జై లవకుశ సినిమాకి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ ప్రధాన కారణం అంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్ # ఇక బిగ్ బాస్ సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్‌ విశేషాలను తెలియజేస్తూ.. ఫైనల్ కన్టెస్టెంట్స్ ఐదుగురురిలో విన్నర్‌ కోసం జరిగిన ఓటింగ్‌లో 11 కోట్ల తొంభై లక్షల ఓట్లు పోలైనట్లు తెలిపారు ఎన్టీఆర్. # ఇక బిగ్‌బాస్ హౌస్‌నుండి ఎలిమినేట్ అయిన కన్టెస్టెంట్స్‌లో ముమైత్, కల్పనలు తప్ప మిగతా పోటీదారులందరూ పాల్గొని సందడి చేశారు. # వారిలో సంపూర్ణేష్ బాబు తాను బిగ్ బాస్ సీజన్ 1 నుండి ప్రారంభంలోనే బయటకు రావడం తప్పేనని ఇప్పుడు చాలా బాధపడుతున్నానంటూ అవకాశం ఉంటే సీజన్ 2లో కన్టెస్టెంట్‌గా పాల్గొంటానని తన మనసులో కోరికను బయటపెట్టాడు. # అయితే ఒక సీజన్‌లో పాల్గొన్న వారికి మరో ఎపిసోడ్‌లో అవకాశం ఉండదని అయినా నీకోసం స్టార్ మా యాజమాన్యంతో మాట్లాడుతా అంటూ ఎన్టీఆర్ అభయం ఇచ్చారు. # ఎలిమినేట్ కన్టెస్టెంట్ మధుప్రయ తన పాటలతో స్టేజ్‌ని హుషారెత్తించింది. #ధనరాజ్ నాయకత్వంలో జ్యోతి, సంపూర్ణేష్ బాబు, సమీర్, కత్తికార్తీక, మహేష్ కత్తి కలిసి ‘బిగ్‌బాస్’ స్కిట్ చేసి నవ్వుల పూయలు పూయించారు. ​#మరోవైపు కీలకమైన ఫైనల్ పోరులో ఉన్న ఐదుగురు కన్టెస్టెంట్స్‌లో అర్చనకు అతి తక్కువ ఓట్లో పోల్ కావడంతో బిగ్ బాస్ హౌస్‌నుండి నిష్క్రమించింది. తాను హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత శివబాలాజీ, నవదీప్‌లలో ఎవరో ఒకరు విన్నర్ కావొచ్చని తెలిపింది. # ఇక మిగిలిన నలుగురు ఫైనల్ కన్టెస్టెంట్స్‌లో తక్కువ ఓట్లు సాధించి నాలుగోస్థానంతో సరిపెట్టుకుని హౌస్ నుండి బయటకు వచ్చేశాడు నవదీప్. ఇక బిగ్ బాస్ హౌస్‌ను వీడి స్టేజ్ మీదకు వచ్చిన నవదీప్.. బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్‌ అయ్యే అవకాశం హరితేజకు ఎక్కువ ఉందన్నారు. # ఐదుగురు ఫైనల్ కన్టెస్టెంట్స్‌లో అర్చన, నవదీప్‌లు నిష్క్రమించగా.. హౌస్‌లో హరితేజ, శివబాలాజీ, ఆదర్శ్‌లు మాత్రమే మిగిలారు. ఇక వీళ్లలో మూడో స్థానం సరిపెట్టుకుని బిగ్‌బాస్ హౌస్‌ను ఇప్పుడే వీడాలనుకుంటే 10 లక్షల తీసుకుని వెళ్లొచ్చని ఎన్టీఆర్ ఆఫర్ ఇవ్వగా కన్టెస్టెంట్స్ ముగ్గురూ ఎవరూ వెనక్కి తగ్గలేదు. అయితే ప్రేక్షకులు ఈ ముగ్గుర్లో తక్కువ ఓటింగ్ హరితేజకు ఇవ్వడంతో మూడో స్థానంతో సరిపెట్టుకుని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది హరికథ హరితేజ. ఇక మిగిలిన శివబాలాజీ, ఆదర్శ్‌లలో శివబాలాజీ టైటిల్ విన్నర్ కావొచ్చునని తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇక ఆడియన్స్ నుండి పోలైన 11 కోట్ల తొంభైలక్షల ఓట్లలో హరితేజకు 2 కోట్ల 43 లక్షల ఓట్లు వచ్చాయని ఎన్టీఆర్ తెలపడంతో తనకు ఓట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు హరితేజ. ఇక ఎలిమినేట్ అయిన కన్టెస్టెంట్స్ కోసం ప్రత్యేక అవార్డ్‌లను ప్రకటించారు ఎన్టీఆర్ ఫన్నీ అవార్డ్స్: అయోమయం(సంపూర్ణేష్ బాబు) గ్రైన్డర్ అవార్డ్ (దీక్ష)
0business
GST ‘విలాసం’పై జిఎస్‌టి చిద్విలాసం! న్యూఢిల్లీ: లగ్జరీకార్లు, ఇతరవిలాస వస్తువు లు ఉత్పత్తులపై జిఎస్‌టి పన్ను విధింపులకు పరి మితిని కూడా జిఎస్‌టి మండలి ఖరారుచేసింది. లగ్జరీకార్లు, మత్తుపానీయాలు వంటి వాటిపై 15 శాతం నుంచి గరిష్టంగా 28శాతంవరకూ పన్నులు విధించే అవకాశంఉంది. ఇక మాదకద్రవ్యాలు వంటి ఉత్పత్తులపై మరింత గరిష్టంగా విధించే అవకాశం ఉంటుంది. పాన్‌మషాలా ఉత్పత్తులపై 135శాతం పరిమితి ఉంటుంది. పొగాకు సిగరెట్లు వంటి వాటి పై 290శాతం లేదా 4170 రూపాయలు ప్రతి వెయ్యి సిగరెట్లుకు జిఎస్‌టి అమలువుతుంది. ఇక బొగ్గు, లిగ్నేట్‌ ఖనిజాలపై పర్యావరణ సెస్‌తోపాటు మొత్తం గరిష్టపరిమితి టన్నుకు 400 రూపాయ లుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తు త పరోక్షరంగ పన్నులతో పోలిస్తే కొత్త పన్నులు చాలా తక్కువగా ఉంటాయని చెపుతున్నారు. జిఎస్‌టి మండలి ఆర్థికమంత్రి అరున్‌జైట్లీ అధ్యక్ష తన ముందుగానే సమావేశం అయి లగ్జరీ కార్లకు 40శాతంగా నిర్ణయించింది. 28శాతం నుంచి 12 శాతం అదనంగా ఛార్జిచేసేందుకు వీలువుతుంది. జిఎస్‌టి మండలి 25శాతం పాన్‌మషాలకు తగ్గిం చిందనే చెప్పాలి. సిగరెట్లతో పోలిస్తే తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో పన్ను 26శాతంగా ఉంటే సెస్‌ 14శాతానికి పెరుగుతుంది. మొత్తంగా 40 శాతం మాత్రంఅమలవుతుందని అంచనా. జిఎస్‌టి కి సంబంధించిన నాలుగు బిల్లులను మండలి ఆమో దించింది. ఎస్‌జిఎస్‌టి, యుపియన్‌ టెరిటరీ జిఎస్‌టి, కేంద్ర జిఎస్‌టి, ఐజిఎస్‌టి నష్టపరిహారం చెల్లింపు బిల్లులు మొత్తం మండలతి సమావేశంలో ఖరారు అయ్యాయని జైట్లీ వెల్లడించారు. వెను వెంటనే కేబినెట్‌ సమావేశానికి పంపిస్తామని, అనం తరం పార్లమెంటుకు ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆర్థికశాఖఅధికారులు చెపుతున్నారు. ఎస్‌జిఎస్‌టి ల పరంగాచూస్తే రాష్ట్రాలకేబినెట్‌లు, అసెంబ్లీల్లో ఆమోదిస్తారు. వెనువెంటనే జిఎస్‌టిని జూలై ఒక టవ తేదీ నుంచి అమలులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. ప్రస్తు తం ఉన్న అంచనాలను బట్టి పాన్‌మసాలా 135 శాతం, సిగరెట్లు 4170 రూపాయలు, లేదా 290శాతం బొగ్గు టన్నుకు 400 రూపాయలు, మత్తు పానీయాలు, శుద్ధిచేసిన జలవనరులు, వివిధ రుచుల్లోని రంగుల నీళ్లుపై 15శాం, లగ్జరీ కార్లపై 15నుంచి 28శాతం వరకూ ఉంటుంది. ఇతర సరఫరా వస్తువులపై 15శాతం ఉండవచ్చని జిఎస్‌టి మండలి వీటన్నింటినీ ఖరారుచేసిందని ఆర్థికశాఖలోని ఒక సీనియర్‌ అధికారి వెల్లడించారు.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాళ్ల దాడి..! బంగ్లాదేశ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్ల దాడి జరిగింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా TNN | Updated: Sep 5, 2017, 12:41PM IST బంగ్లాదేశ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్ల దాడి జరిగింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా చిట్టిగాంగ్ వేదికగా సోమవారం ఆరంభమైన రెండో టెస్టులో సాయంత్రం ఆట ముగిసిన తర్వాత క్రికెటర్లు హోటల్‌కి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి విసిరిన రాళ్లలో ఒకటి బస్సు కిటికీ అద్దానికి తగలడంతో అది పూర్తిగా ధ్వంసమైంది. అయితే.. బస్సులోని క్రికెటర్లు ఎవరూ గాయపడలేదని ఆ జట్టు సెక్యూరిటీ మేనేజర్ సీన్ కారోల్ వెల్లడించారు. మంగళవారం భారీ భద్రత నడుమ రెండో రోజు ఆట కోసం క్రికెటర్లు స్టేడియానికి వచ్చారు. ‘సోమవారం రాత్రి హోటల్‌కి వస్తుండగా.. బస్సు కిటికీ అద్దం ధ్వంసమైంది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ భద్రతా అధికారులతో ఈ విషయమై చర్చిస్తున్నాం. ప్రాథమిక విచారణలో అద్దానికి రాయి తగిలినట్లు గుర్తించారు. మంగళవారం క్రికెటర్లు ప్రయాణించే దారిలో భదత్రని బంగ్లాదేశ్ పెంచింది’ అని క్రికెట్ ఆస్ట్రేలియా సెక్యూరిటీ మేనేజర్ సీన్ కారోల్ వెల్లడించారు. భద్రత కారణాలతోనే గత దశాబ్దకాలంగా బంగ్లాదేశ్‌లో పర్యటించేందుకు ఆస్ట్రేలియా ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ని కూడా ఆసీస్ బహిష్కరించింది.
2sports
Visit Site Recommended byColombia ఆస్ట్రేలియా గడ్డపై నిన్న ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌లో అత్యద్భుతంగా రాణించిన పంత్ ఒక భారీ శతకంతో పాటు.. మొత్తంగా 350 పరుగులతో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో.. అతనికి వన్డే, టీ20ల్లోనూ వరుసగా అవకాశాలివ్వాలంటూ సౌరవ్ గంగూలీ, అజహరుద్దీన్, ఆకాశ్ చోప్రా తదితర మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. వన్డే జట్టు నుంచి పంత్‌ని తప్పించడానికి గల కారణాలను తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో వెల్లడించారు. ‘భారత్ జట్టు ప్రపంచకప్ ప్రణాళికల్లో రిషబ్ పంత్ కూడా ఒక వికెట్ కీపర్‌గా ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. రేసులో ఉన్న ముగ్గురు వికెట్ కీపర్లు (ధోనీ, పంత్, దినేశ్ కార్తీక్) ఇటీవల అత్యుత్తమంగా రాణిస్తున్నారు. అయితే.. ఆస్ట్రేలియాతో టీ20, టెస్టు సిరీస్‌‌ల్లో ఆడిన పంత్‌కి విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే తప్పించాం. అతనే కాదు.. టీమ్‌లోని ఆటగాళ్లందరి పని ఒత్తిడిపైనా దృష్టి సారించి నిర్ణయం తీసుకుంటున్నాం’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వివరించారు. ఆసీస్‌‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రాని కూడా ఈరోజు వన్డే జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు.. అతని స్థానంలో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ ముందు పని ఒత్తిడి తగ్గించి తగినంత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తలపడే భారత్ జట్టు ఇదే..! విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
ప్రపంచ మార్కెట్ల పరుగులు - లాభాల్లోనే అన్ని దేశాల సూచీలు - సెన్సెక్స్‌లో 516 పాయింట్ల ర్యాలీ ముంబయి: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు 2 శాతం వరకు పెరిగాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఇప్పట్లో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని సంకేతాలు రావడం, అగ్రరాజ్యం మన్నికైన వస్తువుల కోసం చేసిన ఆర్డర్లలో వృద్ధి నమోదు అయిందన్న గణాంకాలు అక్కడి మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయి. దీంతో అమెరికా మార్కెట్లు నాలుగేళ్లలోనే ఎప్పుడు లేనంత ఒక్కరోజు గరిష్ఠ లాభాలను ఆర్జించాయి. ఈ పరిణామాలకు చైనాతో పాటు ఆసియా మార్కెట్ల నుంచి అనుకూల స్పందన లభించింది. దీంతో ప్రపంచ మార్కెట్లనీ పరుగులు పెట్టాయి. ప్రధాన మార్కెట్లకు మద్దతు లభించింది. యూరోపియన్‌ మార్కెట్లు లాభాలలో నడవడానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ పుంజుకోవడం, చమురు ధరల్లో స్థిరత్వం దేశీయ మదుపరుల్లో విశ్వాసాన్ని నింపింది. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 516.53 పాయింట్ల మేర రాణించి 26,231.19 పాయింట్ల వద్ద స్థిర పడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 157.10 పాయింట్లు పెరిగి 7,948.95 వద్ద ముగిసింది. బీఎస్‌ఈఇలో రంగాల వారిగా కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌ సూచీ అత్యధికంగా 5.11 శాతం పెరిగింది. ఇదే క్రమంలో రియాల్టీ సూచీ 4.02 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 2.03 శాతం, వైద్య సూచీ 2.93 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి 8.41 శాతం, విఇడిఎల్‌ 6.55 శాతం, టాటా స్టీల్‌ 4.8 శాతం, లూపిన్‌ 4.79 శాతం, సిప్లా 3.95 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు భెల్‌ 3.54 శాతం, బజాజ్‌ ఆటో 2.4 శాతం, టాటా మోటార్స్‌ 0.62 శాతం, ఎన్‌టిపిసి 0.50 శాతం, హీరో మోటో కార్ప్‌ 0.47 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌ సూచీ 2.3 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 2.5 శాతం చొప్పున రాణించాయి. మొత్తంగా బిఎస్‌ఇలో మదుపర్ల మద్దతుతో 2000 స్టాక్స్‌ లాభాల్లో ముగియగా, మరోవైపు 678 స్టాక్స్‌ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్‌లో 21 స్టాక్‌లు లాభాల్లో నిలిచాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
పన్ను ప్రయోనాలపైనే కార్పొరేట్‌ రంగం ఆశలు ఆటో, విద్యుత్‌, రియాల్టీ, మౌలికవనరుల రంగాలపైనే గురి న్యూఢిల్లీ, జనవరి 20: కేంద్ర ప్రభుత్వం వచ్చేనెల ఒకటవ తేదీ ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్‌పై సామాన్య, మధ్యతరగతి వర్గాల నుంచి కార్పొరేట్‌, పారిశ్రామికరంగాల వరకూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరపరిణామాల నేపథ్యం లో వస్తున్న బడ్జెట్‌కావడం, మొదటిసారిగా రైల్వే, సాధారణ బడ్జెట్‌లను విలీనంచేసిఒకే బడ్జెట్‌గా ప్రవేశపెడుతుండటంతో అందరికళ్లు బడ్జెట్‌పైనే ఉన్నాయి. అయితేఇందుకు తగ్గట్లుగానే ముందు ఆదాయపు పన్ను పరిమితులపైనే అందరి దృష్టి ఉంది. పన్నుపరిమితులు ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి మరి కొంత సడలించాల్సిఉందని ఏంజెల్‌బ్రోకరేజి సంస్థ చెపుతోంది. దీనివల్ల వినిమయశక్తి పెరుగుతుందని అంచనా. ప్రత్యేకించి ఆటోమొబైల్‌ రంగం పెద్దనోట్ల రద్దుతో ఎదురైన నగదు సంక్షో భం కారణంగా అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. నవంబరు, డిసెంబరునెలల అమ్మకాలు మరింతగా క్షీణించాయి. దీనివల్ల ప్రభుత్వం కూడా వ్యక్తిగత ఆదాయపు పన్నురేట్లను సడలిం చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనివల్ల ఆటోమొబైల్‌ డిమాండ్‌ పెరుగుతుందని, ఎస్‌యువిలపై ఎక్సైజ్‌సుంకం తగ్గిం చాలని కోరుతున్నాయి. ఇక బ్యాంకింగ్‌ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిఉంది. బ్యాంకుల ఆస్తి అప్పులపట్టీలు మరిం తగా దిగజారాయి. మొండిబాకీలు పెరిగిపోవడమే ఇందుకు కీలకం. మైలికవనరుల రంగానికి ఎక్కువ నిధులు రాబట్టాలంటే బ్యాంకర్లు రుణాలివ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాంకులకు మూలధనవనరులు పెంచాల్సి ఉంది. అందువల్ల ప్రభుత్వరంగ బ్యాంకులకుమూలధనవనరుల తోడ్పాటుపెరగాలి. ఎఫ్‌ఎంసిజి రంగంపరంగా ఈ ఏడాది ఎలాంటి వృద్ధి లేదు. పిఎం కృషి సంచాయియోజన, రాష్ట్రీయకృషి వికాస్‌యోజన, పిఎం గ్రామ్‌ సడక్‌ యోజన వంటి వాటికి ఎక్కువ నిధులు ఖర్చుచేయాల్సిన అవసరం ఎంతోంది. ముఖ్యంగా వినియోగదారులకు ఎక్కువ వ్యయపరిమితి పెంచుకునేందుకు పన్నుశ్లాబ్‌లు పెంచాలి. 2017బడ్టెట్‌లో కీలకం అంతా మౌలికవనరులరంగమే. బడ్జెట్‌ కేటాయింపుల్లో 30శాతం ఎక్కువగా రోడ్లు, హైవేల శాఖకు అందుతాయని అంచనా. గ్రామీణాభివృద్ధికి పదిశాతం పెరుగు తాయి. గ్రామీణపక్కాగృహనిర్మాణం, రోడ్లు, వంతనెలు, గృహ నిర్మాణశాఖ, పేదరికనిర్మూలన వంటి వాటికి 20శాతం కేటా యింపులు పెంచుతుందని అంచనా.ఇక పట్టణాపరంగా స్మార్ట్‌ సిటీ పథకాలు కూడా అనివార్యం అవుతుంది. ఇక ఐటిరంగా నికి ఎలాంటి భారీప్రోత్సాహకాలు కనిపించడంలేదు. కేవలం పన్ను రాయితీలు మినహాయింపులు మాత్రమే ఉంటాయి. ఆర్‌అండ్‌డి వ్యయం పెంచేందుకువీలుగా ప్రభుత్వం ఐటి తరుగుదలను కొంత పెంచాల్సి ఉంటుంది. ఐటి, టెలికాం హార్డ్‌ వేర్‌ ఉత్పత్తులకు ప్రోత్సాహకాలుంటాయి. ఇక ఖనిజవనరు లు, గనులపరంగా కూడా కొంత వెసులుబాటును కోరుతు న్నాయి. కనీస దిగుమతి ధరలు, దిగుమతులపై సుంకం పెంపు, ఉక్కు ఉత్పత్తులకు బిఐఎస్‌ మార్కు విధిగా ఉండా లన్న నిబంధనలు ఉండాలని కోరుతున్నారు. చైనా, యూరోప్‌ ల నుంచి వచ్చే కొన్ని రకాల ఉక్కుపై సుంకాలు పెంచాలని కోరుతున్నాయి. దేశీయ మార్కెట్‌కు ఊతం ఇవ్వాలన్నదే కార్పొరేట్ల ప్రగాఢ ఆకాంక్ష. ఇక ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిలో కోత విధించేందుకు ఒప్పందానికి రావడం వల్ల ధరల స్థిరీకరణకు మార్గం ఏర్పడింది. అయితే ప్రభుత్వం విదేశాల నుంచి దేశానికి ఎల్‌ఎన్‌జి రవాణాకు జిఎస్‌టిని మినహాయించాలని కోరుతోంది. సేవాపన్ను మినహాయిస్తే గ్యాస్‌ ఆధారితపరిశ్రమ లకు మేలు జరుగుతుందని అంచనా. కంపెనీలకు పన్ను విరామం వంటివి కేటాయిస్తే స్వఛ్ఛ ఇంధనం ఉత్పత్తి ద్వారా కంపెనీలకు మేలు జరుగుతుందని కార్పొరేట్ల వాదన. ఇక ఫార్మా కంపెనీలకు ఎంతో మద్దతునివ్వాల్సి ఉంటుంది. పన్ను ప్రయోజనాలతో పాటు ఆర్‌అండ్‌డిపరంగా రాయితీలు అవస రమని బ్రోకింగ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. పరోక్ష రాయితీల పరంగా బడ్జెట్‌లో హెల్త్‌కేర్‌ రంగానికి కేటాయింపులు పెంచ డంవల్ల ఈ రంగానికి మేలు జరుగుతుంది. ఇక ప్రభుత్వం పునరుత్పత్తి విద్యుత్‌కు భారీరాయితీలు అవసరం అవుతాయి. పన్నుప్రయోజనాలపై ఎక్కువ ఆసక్తిచూపుతున్నారు. సోలార్‌ పార్కులను సెజ్‌లతో సమానంగాచూస్తూ మ్యాట్‌ మినహా యింపు ఇవ్వాలని కోరుతున్నాయి. సోలార్‌ రంగానికి గ్రీన్‌ బాండ్లు జారీ చేసేందుకు అనుమతించాలని, వడ్డీరేట్లను తగ్గిం చాల్సి ఉంటుందని ఆ రంగం కోరుతోంది. 2022 సంవత్స రానికి అందరికీ పక్కాఇల్లు పథకం కింద పదిశాతం కేటాయిం పులు పెంచాలని రియాల్టీరంగం కోరుతోంది. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులపరంగా మూలధన లబ్ధిపై పన్ను ప్రయో జనాలపరంగా స్పష్టత ఇవ్వాలని రియాల్టీరంగం కోరుతోంది.
1entertainment
Jul 24,2015 1000 కోట్లు దాటిన బజాజ్‌ లాభం ముంబయి: గతంలో ఎన్నడూ లేని విధంగా బజాజ్‌ ఆటో సంస్థ మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఇతర ఆదాయం పెరగడం కారణంగా బజాజ్‌ ఆటో సంస్థ నికర లాభం రికార్డు స్థాయిలో జూన్‌తో ముగిసిన త్రైమాసిక కాలంలో రూ.1000 కోట్ల మార్కును అధిగమించినట్లు సంస్థ వెల్లడించింది. అమ్మకాలు, వ్యాపార పరిమాణ వృద్ధిలో నెలకొన్న స్తబ్దత కారణంగా బజాజ్‌ ఆటో అలరించే ఫలితాలను వెల్లడించక పోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావించాయి. అయితే జూన్‌ త్రైమాసికంలో వ్యాపార పరిమాణంలో 2.5 శాతం వృద్ధి నమోదు అయింది. నికర అమ్మకాలు కూడా ఏడాది ప్రాతిపదికన 7.2 శాతం మేర పెరిగి రూ.5,505 కోట్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. అధికమొత్తంలో ఇతర ఆదాయం, అస్ట్రియాకు చెందిన కేటీఎం నుంచి సమకూరిన డివిడెండ్‌ కారణంగా నికరలాభం ఏడాది ప్రాతిపదికన 64 శాతం, జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంస్థ లాభం 37 శాతం మేర పెరిగి రూ.1,015 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.740 కోట్లుగా ఉంది. రిటైల్‌ స్థాయిలో మార్కెట్‌ వాటా 19.2 శాతం మేర పెరిగిందని వ్యాపారాభివృద్ధి విభాగం అధ్యక్షుడు ఎస్‌.రవికుమార్‌ అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: పాయింట్లలో స్మిత్ పైపైకి, కోహ్లి కిందకు ఐసీసీ టెస్టు ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో స్థానాలేమీ మారకపోయినప్పటికీ.. కోహ్లి మాత్రం ఎక్కువ పాయింట్లను కోల్పోయాడు. TNN | Updated: Feb 27, 2017, 12:06AM IST ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. గతంలో ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ వీరిద్దరూ తొలి రెండు స్థానాల్లోనే ఉన్నప్పటికీ.. పుణె టెస్టు తర్వాత ఇద్దరి మధ్య పాయింట్లలో వ్యత్యాసం బాగా పెరిగింది. పుణె టెస్టులో సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్.. ఆరు పాయింట్లను మెరుగు పర్చుకోగా.. కోహ్లి మాత్రం 22 పాయింట్లను చేజార్చుకున్నాడు. గతంలో స్మిత్ ఖాతాలో 933 పాయింట్లు ఉండగా.. ఇప్పుడవి 939కి చేరాయి. అదే సమయంలో కోహ్లి పాయింట్లు 895 నుంచి 873కి తగ్గిపోయాయి. స్మిత్, కోహ్లి మధ్య 66 పాయింట్ల తేడా ఉండగా. మూడోస్థానంలో ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్, స్మిత్ మధ్య 91 పాయింట్ల తేడా ఉంది. నాలుగో స్థానంలో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 823 పాయింట్లతో కొనసాగుతున్నాడు. BREAKING: @stevesmith49 has stormed clear at the top of the @MRFWorldwide ICC Player Rankings for Test Batsmen! https://t.co/F3JbQ9BMUJ pic.twitter.com/YMKMN5JlV7 — ICC (@ICC) February 26, 2017 గతంలో సచిన్ టెండుల్కర్ 898 పాయింట్లను సాధించగా.. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకటించక ముందు 895 పాయింట్లు సాధించిన కోహ్లి మరో మూడు పాయింట్లు మెరుగుపర్చుకుంటే... సచిన్‌ను చేరుకునే వీలుండేది. కానీ పుణె టెస్టులో 13 పరుగులు మాత్రమే చేసిన విరాట్ పాయింట్లను భారీగా కోల్పోయాడు. భారత గడ్డపై ఒక టెస్టులో కోహ్లికి ఇదే అత్యల్ప స్కోరు (రెండు ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్ చేసిన సందర్భంలో) కావడం బాధాకరం. టెస్టుల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ఆసియా ఆటగాళ్ల జాబితాలో సంగక్కర 938 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, పాక్ ప్లేయర్ మహ్మద్ యూసుఫ్ (933), సునీల్ గావస్కర్ (916), సచిన్ (898) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పటికైతే కోహ్లి సచిన్ రికార్డును మిస్ కాగా.. పుణెలో సెంచరీతో ఆకట్టుకున్న స్మిత్.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఆరోస్థానానికి చేరుకున్నాడు. గ్యారీ సోబర్స్, వివియన్ రిచర్డ్స్, సంగక్కర లాంటి ఆటగాళ్లను స్మిత్ అధిగమించాడు. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆల్‌టైం టెస్టు ప్లేయర్ల జాబితాలో బ్రాడ్‌మెన్ (961) తొలిస్థానంలో ఉండగా, హట్టన్ (945), జాక్ హబ్స్ (942), పాంటింగ్ (942), పీటర్ మే (941) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పాంటింగ్, బ్రాడ్‌మెన్ ఆసీస్ ప్లేయర్లు కాగా, మిగతావారు ఇంగ్లండ్‌కు ఆడిన వారు కావడం విశేషం.
2sports
ఎయిర్‌టెల్‌, వొడా ఫోన్‌ను వెనక్కినెట్టి మొదటి స్థానం Reliance Jio న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో మూడేళ్లలో తన అప్రతిహత ప్రస్థానంతో మొదటి స్థానానికి చేరుకుంది. దాదాపు 24 ఏళ్ల క్రితం టెలికం రంగంలోకి ప్రవేశించిన భారతి ఎయిర్‌ టెల్‌ను, మరో దిగ్గజం వొడాఫోన్‌ సంస్థను అతి తక్కువ కాలంలో వెనక్కినెట్టి సంచలనాన్ని నమోదు చేసింది. మొత్తం 33 కోట్ల 13 లక్షల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న సంస్థ జూన్‌ నాటికి 10,900 కోట్ల రూపాయలు ఆర్జించి ఆదాయంలోనూ తిరుగులేదని నిరూపించింది. ఇదే కాలానికి ఎయిర్‌టెల్‌ 10,701.5 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా 9,808.92 కోట్లతో తర్వాత స్థానాలకు పడిపోయాయి. తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/
1entertainment
AADI కస్టమర్లకోసం ఆడి స్పోర్ట్స్‌ డ్రైవ్‌ హైదరాబాద్‌, జూలై 9: ఆడికంపెనీ కస్టమర్లకోసం ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఆడిస్పోర్ట్స్‌ డ్రైవ్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 30మందికి పైగా కస్టమర్లు పాల్గొని ఆడి పనితీరుపైనాఫీచర్ల పైనా సంతృప్తి వ్యక్తంచేశారు. పుణెలో కూడా ఇదేతరహా డ్రైవ్‌నిర్వహిస్తే కస్టమర్లు ఎంతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆడి ఇండియా హెడ్‌ రాహిల్‌ అన్సారి వెల్లడించారు. జర్మనీ లగ్జరీ కారు ఆడి ఇప్పటికే పలువురు కస్టమర్లను ఆకర్షిం చింది. తాజాగా తన మార్కెట్‌ వ్యూహాన్ని మారు స్తూ ఆడిస్పోర్ట్స్‌డ్రైవ్‌ నిర్వహించి ఆడి స్పోర్టీ పనితీరును కస్మటర్లకు తెలియజెపింది. ఆడి ఆర్‌8, ఆడి ఆర్‌ఎస్‌7 కేటగిరీ కార్లు నగర వాతా వరణానికి అనువుగా ఉంటాయని రాహిల్‌ వెల్ల డించారు. హైదరాబాద్‌లో ఆడి కార్ల కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సేవలు అందిస్తామని స్పోర్ట్స్‌కార్ల పనితీరుపై నిపుణులైన సిబ్బంది వివరరిస్తారన్నారు. ఆడి విలాసవంత మైన కార్ల ఫీచర్లు, పనితీరును ఆచరణాత్మకంగా తెలుసుకనేందుకే ఆడిస్పోర్ట్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ఆడి హైదరాబాద్‌ఎండిరాజీవ్‌సంఘ్వి వెల్లడించారు
1entertainment
Feb 26,2017 ట్యాక్సీ సేవల యోచనేలేదు: రిలయన్స్‌ న్యూఢిల్లీ: మార్కెట్లో క్యాబ్‌, టాక్సీ సేవలను నిర్వహిస్తున్న వారికి శుభవార్త. రిలయన్స్‌ త్వరలోనే యాప్‌ ఆధారిత ట్యాక్సీ సేవలను ప్రారంభించనుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ సంస్థ ప్రకటించింది. రిలయన్స్‌ ట్యాక్సీ సేవలను ప్రారంభించనుందన్న వార్తలు ఇటీవలి కాలంలో మీడియాలో బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి. 'కిక్‌స్టార్ట్‌' పేరుతో రిలయన్స్‌ జియో సంస్థ ట్యాక్సీ సేవలను ప్రారంభించనుందని వార్తా సంస్థ కథనాన్ని కూడా ప్రచురించింది. దీంతో చిన్నచిన్న క్యాబ్‌ నిర్వాహకులు, ట్యాక్సీ సేవలను అందించే వారు గత కొంత కాలంగా ఆందోళన చెందుతూ వస్తున్నారు. టెలికాంలో ధరల పోటీ మాదిరిగానే తక్కువ ధరకు ట్యాక్సీ సేవలతో రిలయన్స్‌ తమ ఉపాధికి గండి కొడుతుందేమోనని వారు ఆందోళన చెందడం కనిపించింది. తాజాగా రిలయన్స్‌ ఈ విషయమై తన స్పష్టతనిచ్చింది. తాము సమీప భవిష్యత్తులో ఎలాంటి యాప్‌ ఆధారిత సేవలను ప్రారంభించడం లేదని స్పష్టం చేసింది. 'ఆ వార్త తప్పు.. ఖండిస్తున్నాం'అని రిలయన్స్‌ అధికార ప్రతినిధి ఒకరు ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాంటి ప్రణాళికలేవీ తమ పరిశీలనలో లేవనివి తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
‘నేత్ర’  ఆడియో విడుద‌ల‌! Highlights రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై గోపీచరణ్‌, ఐశ్వర్య అడ్డాల‌ హీరో హీరోయిన్‌లుగా రెడ్డెం యాదకుమార్‌ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్‌ హార్ట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఉద‌య్ నాగ్ ర‌త‌న్ దాస్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్ర ఆడియో పాటలు మార్కెట్ లోకి విడుద‌ల‌య్యాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ న‌టులు, `మా` అధ్య‌క్షులు డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ తొలి సీడీ ఆవిష్క‌రించి స్టార్ మేక‌ర్ స‌త్యానంద్ కు అంద‌జేశారు. అనంత‌రం డా.రాజేంద్రప్ర‌సాద్ మాట్లాడుతూ....``ఎంతో మంది హీరోల‌ను త‌యారు చేసిన స‌త్యానంద్ `నేత్ర‌` చిత్రంలో న‌టించాడ‌ని తెలిసి మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయాను. వార‌బ్బాయి కూడా ఈ చిత్రం ద్వారా న‌టుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. త‌న‌కు మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నా. పాట‌లు విన్నాక సంగీత ద‌ర్శ‌కుడికి మంచి సంగీత ప‌రిజ్ఞానం ఉంద‌ని తెలుస్తోంది. ట్రైల‌ర్ చూశాక సినిమా చూడాల‌న్న క్యూరియాసిటీ క‌లిగింది. క‌చ్చితంగా చూస్తాను. ద‌ర్శ‌కుడు మాట‌లు, చూసిన ప్రోమోస్ ను బ‌ట్టి ప్ర‌తిభాశాలి అని అర్థ‌మవుతోంది. స‌త్యానంద్ శిష్యులు, ఆయ‌న‌కు బాగా కావాల్సిన వారంతా క‌లిసి చేసిన ఈ ప్ర‌య‌త్నం ఫలించాల‌నీ ఆశిస్తూ...యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు `` అని తెలిపారు.  స్టార్ మేక‌ర్ స‌త్యానంద్ మాట్లాడుతూ...``ఇప్ప‌టి వ‌ర‌కు 149 మందిని న‌టులుగా తీర్చిదిద్దాను. అందులో 95 మంది హీరోల‌య్యారు. ఈ సినిమాలో కూడా నా శిష్యులు న‌టించారు. ద‌ర్శ‌కుడు యాదా కుమార్ కూడా నా శిష్యుడే. ప్ర‌భాష్ బ్యాచ్ త‌ను. సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. ర‌త‌న్ గారు విన‌సొంపైన పాట‌లు స‌మ‌కూర్చారు. నేను నా కుమారుడు క‌లిసి మొద‌టి సారిగా న‌టించే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటూ ఈ సినిమా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.   నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ... ‘చిన్నప్పటి నుంచి సినిమాల‌పై ఉన్న ఆసక్తితో స్నేహితుల‌ సహకారంతో ‘నేత్ర’ చిత్రాన్ని రూపొందించాను.  విశాఖ, అరకు, రాజమండ్రి ప్రదేశాల్లో జరిపిన  షూటింగ్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా పూర్త‌య్యాయి. ఫ‌స్ట్ కాపీ చూశాము. యూనిట్ అంతా కూడా ఎంతో హ్యాపీ.  దర్శకుడు చిత్రాన్ని చెప్పిన దానికంటే కూడా ఎంతో బాగా తెర‌కెక్కించాడు. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని ఆశిస్తున్నా`` అన్నారు. చిత్ర దర్శకుడు రెడ్డెం యాదకుమార్‌ మాట్లాడుతూ... ‘ల‌వ్‌ అండ్‌ హర్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. మా నిర్మాత ఎక్క‌డా రాజీప‌డకుండా సినిమా క్వాలీటీతో  నిర్మించారు. ప్ర‌తి విష‌యంతో నాకు ఎంతో స‌హ‌క‌రించారు. హీరో  గోపిచ‌ర‌ణ్‌, హీరోయిన్‌ ఐశ్వర్య వారి న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటారు. అనుకున్న దానికంటే కూడా సినిమా చాలా బాగా వచ్చింది. స్టార్ మేక‌ర్ సత్యానంద్‌గారు, వారి అబ్బాయి క‌లిసి న‌టించిన తొలి సినిమా మా `నేత్ర‌` కావ‌డం ఆనందంగా ఉంది. ర‌త‌న్ గారి సంగీతం సినిమాకు ప్ల‌స్ అవుతుంది. ప్ర‌తి ఒక్క‌రూ ఇష్ట‌ప‌డి చేసిన  సినిమా ఇది. ఈ పాట‌ల‌ను, సినిమాను విజ‌యవంతం చేసి మా నిర్మాత‌ను నిల‌బెట్టాల‌ని కోరుకుంటున్నా. మా ఆడియో ఫంక్ష‌న్ కు విచ్చేసి తొలి సీడీ ఆవిష్క‌రించిన డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ గారికి నా ధ‌న్యావాద‌ల‌న్నారు. న‌టుడు శివాజీరాజా మాట్లాడుతూ...``నేను కూడా స‌త్యానంద్ గారి శిష్యుడినే. వారి చేతిలో ప‌డ్డ ప్ర‌తి వారు మంచి స్థాయిలో ఉన్నారు. వారి శిష్యులంతా క‌లిసి చేసిన ఈ ప్ర‌య‌త్న స‌క్సెస్ కావాల‌న్నారు. హీరో గోపీచ‌ర‌ణ్ మాట్లాడుతూ...``నేను హీరోగా న‌టిస్తున్న తొలి చిత్ర‌మిది. మంచి పాట‌లు కుదిరాయి. అభిరుచి క‌లిగిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో ప‌ని చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. హీరోయిన్ ఐశ్వ‌ర్య మాట్లాడుతూ...``స‌త్యానంద్ గారి వ‌ద్ద యాక్టింగ్ లో శిక్ష‌ణ పొందాను. నేను న‌టించిన సినిమాలో వారు కూడా న‌టించ‌డం లక్కీగా భావిస్తున్నా`` అన్నారు.  సంగీత ద‌ర్శ‌కుడు ఉద‌య్ నాగ్ ర‌త‌న్ దాస్ మాట్లాడుతూ...``ద‌ర్శ‌క నిర్మాత‌లు సంగీతం ప‌ట్ల అవ‌గాహ‌నుండ‌టంతో మంచి బాణీలు రాబ‌ట్టుకున్నారు. న‌టీన‌టులంద‌రూ కూడా చ‌క్క‌టి హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించారు. మా పాట‌లు విని ఆనందిస్తార‌ని కోరుకుంటున్నా`` అన్నారు. రామ సత్యనారాయ‌ణ మాట్లాడుతూ...``పాట‌లు బావున్నాయి. ట్రైల‌ర్స్ చూస్తుంటే హ‌ర్ర‌ర్ కామెడీ సినిమాలా ఉంది. ప్ర‌జంట్ ఈ త‌రహా చిత్రాలు బాగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా వాటి కోవ‌లోకి చేరుకోవాల‌న్నారు. పాట‌లు, ట్రైల‌ర్స్ బావున్నాయి. సినిమా విజ‌యంవంత‌మ‌వ్వాల‌న్నారు అన్నం రెడ్డి కృష్ణ కుమార్. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.    గోపిచరణ్‌, ఐశ్వర్య హీరో హీరోయిన్‌లుగా నటిస్తుండగా, స్టార్‌మేకర్‌ సత్యానంద్‌, ఐకె త్రినాధ్‌, ధీరేంద్ర ధీరు, బుగత సత్యనారాయణ, హేమ, రేణుక, రాఘవేంద్ర, ప్రియాంక, సునీల్‌ చరణ్‌, తిరుమల‌రెడ్డి, జబర్దస్త్‌ అప్పారావు, జనార్ధన్‌ తదిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌నాగ్‌ రతన్‌దాస్‌, మాట‌లు: ప్రసాదుల‌ మధుబాబు, కెమెరా:  ఎస్‌.వి. గోపాల్‌, ఎడిటింగ్‌: నర్సింగ్‌ రాధోడ్‌, కొరియోగ్రఫి: లుక్స్‌ రాజశేఖర్‌, బాల‌కృష్ణ, ఫైట్స్‌: బాజీరావు,  నిర్మాత: పీరికట్ల రాము, కథ ` స్క్రీన్‌ప్లే ` దర్శకత్వం: రెడ్డెం యాదకుమార్‌. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రివర్స్‌స్వీప్ ఆడబోయి.. బోల్తాపడ్డాడు..! స్పిన్నర్ అక్షర్ బౌలింగ్‌లో వాస్తవంగా బ్యాక్‌వర్డ్ స్కైర్‌లెగ్ దిశగా బంతిని తరలించాలని గుణతిలక యోచించాడు TNN | Updated: Aug 20, 2017, 04:15PM IST భారత్‌తో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక ఓపెనర్ గుణతిలక (35: 44 బంతుల్లో 4x4) ఆశ్చర్యకరరీతిలో ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్ ఆడేందుకు ప్రయత్నించిన గుణతిలక.. కవర్స్‌లో ఫీల్డర్ కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో 74 పరుగుల వద్ద లంక తొలి వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ అక్షర్ బౌలింగ్‌లో వాస్తవంగా బ్యాక్‌వర్డ్ స్కైర్‌లెగ్ దిశగా బంతిని తరలించాలని గుణతిలక యోచించాడు. అయితే.. షాట్ ఆడటంలో కాస్త తడబడి ముందుగానే బ్యాట్‌ని ఊపేశాడు. దీంతో బంతి బ్యాట్ అంచున తాకుతూ కవర్స్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా క్యాచ్ అందుకున్నాడు. స్వీప్, రివర్స్‌స్వీప్ షాట్స్ ఆడే సమయంలో బ్యాట్స్‌మెన్ షాట్ ఎంపికలో తడబడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ వికెట్ మరోసారి క్రికెట్ ప్రపంచానికి గుర్తు చేసింది.
2sports
Director Marithi distributing Raj Tarun Movie క‌థ‌పై నమ్మకమే కొనిపించింది: మారుతి యువ‌హీరో రాజ్‌త‌రుణ్‌ న‌టిస్తున్న తాజా చిత్రం సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు. TNN | Updated: Dec 8, 2015, 11:44AM IST 21ఎఫ్‌తో ఇటీవ‌లే హ్యాట్రిక్ హిట్‌ను అందుకున్నాడు యువ‌హీరో రాజ్‌త‌రుణ్‌ . వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్న ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు. శ్రీ శైలేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఎస్‌.శైలేంద్ర బాబు, హ‌రీష్ దుగ్గిశెట్టి, కె.వి.శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ‌నివాస్ గ‌విరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్ర టీజ‌ర్‌ను హీరో సునీల్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ద‌ర్శ‌కుడు మారుతి మాట్ల‌డుతూ గ్రామీణ నేప‌థ్యంలో ఫీల్‌గుడ్ మూవీగా తెర‌కెక్కిన చిత్ర‌మిద‌ని, బ‌న్నీవాసు ఈ సినిమాను నిర్మించాల్సింద‌ని, కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేద‌ని, క‌థ‌పై న‌మ్మ‌కంపై త‌న మిత్రుల‌తో క‌లిసి రెండు ఏరియాల్లో సినిమాను పంపిణీచేస్తున్నాన‌ని తెలిపారు క‌థ‌ను, త‌న‌ను న‌మ్మి నిర్మాత‌లు ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చార‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు.త‌న బాడీలాంగ్వేజ్‌కు స‌రిపోయే చ‌క్క‌టి క‌థ‌ను శ్రీ‌నివాస్ సిద్ధం చేశాడ‌ని, రీరికార్డింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయ‌ని, ఈ నెలాఖ‌రులో లేదా జ‌న‌వ‌రిలో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని రాజ్‌త‌రుణ్ చెప్పారు. క‌న్న‌డ భాష‌లో ప‌లు చిత్రాలు నిర్మించిన తాను హ్యాట్రిక్‌ హీరో రాజ్‌త‌రుణ్ చిత్రంతో తెలుగులో నిర్మాత‌గా అరంగేట్రం చేయ‌డం ఆనందంగా ఉంద‌ని శైలేంద్ర‌బాబు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్‌.శంక‌ర్, హ‌రీష్ దుగ్గిశెట్టి, శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, విశ్వ త‌దిత‌రులు పాల్గొన్నారు. కుమారి 21ఎఫ్‌తో ఇటీవ‌లే హ్యాట్రిక్ హిట్‌ను అందుకున్నాడు యువ‌హీరో రాజ్‌త‌రుణ్‌. వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్న ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు. శ్రీ శైలేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఎస్‌.శైలేంద్ర బాబు, హ‌రీష్ దుగ్గిశెట్టి, కె.వి.శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ‌నివాస్ గ‌విరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్ర టీజ‌ర్‌ను హీరో సునీల్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ద‌ర్శ‌కుడు మారుతి మాట్ల‌డుతూ గ్రామీణ నేప‌థ్యంలో ఫీల్‌గుడ్ మూవీగా తెర‌కెక్కిన చిత్ర‌మిద‌ని, బ‌న్నీవాసు ఈ సినిమాను నిర్మించాల్సింద‌ని, కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేద‌ని, క‌థ‌పై న‌మ్మ‌కంపై త‌న మిత్రుల‌తో క‌లిసి రెండు ఏరియాల్లో సినిమాను పంపిణీచేస్తున్నాన‌ని తెలిపారు క‌థ‌ను, త‌న‌ను న‌మ్మి నిర్మాత‌లు ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చార‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు.త‌న బాడీలాంగ్వేజ్‌కు స‌రిపోయే చ‌క్క‌టి క‌థ‌ను శ్రీ‌నివాస్ సిద్ధం చేశాడ‌ని, రీరికార్డింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయ‌ని, ఈ నెలాఖ‌రులో లేదా జ‌న‌వ‌రిలో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని రాజ్‌త‌రుణ్ చెప్పారు. క‌న్న‌డ భాష‌లో ప‌లు చిత్రాలు నిర్మించిన తాను హ్యాట్రిక్‌ హీరో రాజ్‌త‌రుణ్ చిత్రంతో తెలుగులో నిర్మాత‌గా అరంగేట్రం చేయ‌డం ఆనందంగా ఉంద‌ని శైలేంద్ర‌బాబు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్‌.శంక‌ర్, హ‌రీష్ దుగ్గిశెట్టి, శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, విశ్వ త‌దిత‌రులు పాల్గొన్నారు.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కోహ్లి లాంటి ఆటగాడ్ని ఏబీ చూడలేదట..! భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లాంటి క్రికెటర్‌ని తానెక్కడా చూడలేదని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ TNN | Updated: Aug 30, 2017, 02:27PM IST భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లాంటి క్రికెటర్‌ని తానెక్కడా చూడలేదని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ఆటలో ఎవరినీ అనుసరించకుండా తనకంటూ ప్రత్యేక శైలి‌ని కోహ్లి సృష్టించుకున్నాడ‌ని.. అతను ఈ తరానికి బెస్ట్ క్రికెటర్ అంటూ డివిలియర్స్ ప్రశసించాడు. గత వారంలో దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి అనూహ్యంగా తప్పుకున్న డివిలియర్స్ తాజాగా మీడియాతో సుదీర్ఘంగా మాట్టాడాడు. ‘వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న క్షణం నుంచీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ నిర్ణయంతో నేను మళ్లీ రీఫ్రెష్ అయిన భావన కలుగుతోంది. నా జీవితం క్రికెట్‌తో మమేకమైపోయింది. అందుకే.. కెరీర్ చివరాంకంలో ఆటని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో కెప్టెన్సీని వదులుకున్నా. నా కెరీర్ ఇంకో రెండు లేదా.. గరిష్టంగా మరో ఏడేళ్లు ఉండొచ్చేమో నాకు తెలీదు. ఇక వచ్చే ఏడాది భారత్ జట్టు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ కోసం వస్తోంది. రెండేళ్ల క్రితం మేము భారత్ గడ్డపై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. కానీ.. ఈ సిరీస్‌లో మాత్రం వారికి గట్టిపోటీనిస్తాం. కెప్టెన్ విరాట్ కోహ్లి తనకంటూ ప్రత్యేక శైలి సృష్టించుకున్నాడు. నా గురించి కోహ్లి ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. కానీ.. అతనే ఈ తరానికి అత్యుత్తమ ఆటగాడు. ఇద్దరం చాలా సరదాగా, ఆటపై అంకితభావంతో గౌరవంగా ఉంటాం’ అని డివిలియర్స్ వివరించాడు.
2sports
Suresh 78 Views bse దేశీయ గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల కదలికలు ముంబయి,ఆగస్టు 13: ఉత్తరకొరియా, అమెరికా మధ్య్పస్తుతం నెలకొన్నయుద్ధవాతావరణం ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేపింది. దీనితో అమెరికా సహా ఆసియా వరకూ స్టాక్‌ మార్కెట్లు గత వారం పతనం అయ్యాయి. ఫలితంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు గత వారం పతనం అయ్యాయి. ప్రామాణిక సెన్సెక్స్‌ 1000 పాయింట్లకుపైగా దిగజారింది. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలుచేపడితే అంతర్జాతీయ స్థాయిలో సెంటిమెంట్‌కు దెబ్బతగులుతుందని, ఇది దేశీయంగా కూడా తీవ్రప్రభావం చూపుతుందని మార్కెట్‌నిపుణుల అంచనా. వచ్చేవారం దేశీయంగా పలు ఆర్ధిక గణాంకాలు వెలువడతాయి. 14వ తేదీ సోమవారం జులై నెల టోకుధరలద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి అవుతాయి. మేనెలలోనమోదయిన 2.178శాతం నుంచి జూన్‌లో 0.9శాతానికి టోకుధరలసూచీ ద్రవ్యోల్బణం తగ్గిన సంగతి తెలిసిందే. ఈబాట లోనే జులైనెలకు రిటైల్‌ధరల వినియోగద్రవ్యో ల్బణం వివరాలుసైతం వెల్లడి అవుతాయి. సిపిఐజూన్‌లో 2.18శాతంనుంచి 1.54శాతానికి క్షీణించింది. ఇక వచ్చేవారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం అవుతున్నది. మంగళవారం 15న స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలకు సెలవు ఉంటుంది. బుధ వారం అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌రిజర్వు పాలసీవివరాలు వెల్లడి అవుతాయి. ఇక శుక్ర వారం జూన్‌నెల పారిశ్రామికోత్పత్తిప్రగతి సూచీ వెల్లడిఅయ్యాయి. వస్తుసేవలపన్ను, అమలు నేపథ్యంలో ఐఐపి 0.1శాతం క్షీణించింది. 2013 తర్వాత మళ్లీ కనిష్టస్థాయిలో నమోదయింది. కేపిటల్‌గూడ్స్‌రంగం 6.77శాతంమేరవెనకడుగు వేయడం ప్రభావంచూపింది. కాగా ఐఊపి ప్రభావంసోమవారం ట్రేడింగ్‌పై ప్రతిఫలించవచ్చు నని పేర్కొంటున్నారు ఆర్ధిక గణాంకాలతోపాటు వర్షపాత విస్తరణకు సైతం ప్రాధాన్యం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలుచెపుతున్నాయి. ఈ నెల 9 కల్లా దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ సగటుకంటే 3శాతం తక్కువగాఉంది. అలాగే కార్పొరేట్‌ ఫలి తాలు కూడా కొంత కీలకం అవుతాయి. సోమవారంగ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌,కోల్‌ ఇండియా, టాటాపవర్‌ ఫలితాలు వెల్లడిస్తాయి. వచ్చే వారం ఈ అంశాలతోపాటు ముడిచమురుధరలు, డాలరుతోరూపాయి మారకంవిలువలు, ఆసియా యూరోప్‌మార్కెట్ల కదలికలు కూడా కొంత కీలకం కానున్నాయి. అలాగే విదేశీ పెట్టుబడుల ధోరణులు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితంచేస్తాయి.
1entertainment