news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Dec 06,2016
జనవరి వరకు నగదు కష్టాలే: నొమూరా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయపు ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పలు రకాలుగా ప్రభావితం చూపే అవకాశం ఉందని రేటింగ్ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. సర్కారు నిర్ణయంతో నగదు ప్రవాహం తగ్గి మూడో త్రైమాసిక వృద్ధి రేట 6.5 శాతానికే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లుగా నొమూరా సంస్థ విశ్లేషించింది. రానున్న మార్చి త్రైమాసికంలోనూ (క్యూ4 లోనూ) నోట్ల రద్దు తాలుకా స్తబ్దత ప్రతిబింబించే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. నగదు కొరతతో ఆ త్రైమాసికంలోనూ వృద్ధి రేటు 7 శాతంగానే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. డిమాం డ్కు తగ్గ సప్లయి లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా తెలిపింది. ఈ పరిస్థితిని అధిగమిస్తే వృద్ధి పుంజుకోవచ్చని వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.3 శాతంగా వృద్ధి రేటు ఉండవచ్చని తొలుత ఈ సంస్థ అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వృద్ధి రేటును అంచనాలకు కోత పెట్టింది. 2017 మార్చితో ముగిసే త్రైమాసికంలో వృద్ది రేటు 7 శాతానికి పరిమితం కావచ్చని నోమూరా తన పరిశోధనలో వెల్లడించింది. జనవరి చివరి వరకు నగదు కొరత ప్రభావం కొనసాగవచ్చని విశ్లేషించింది. విత్త, బ్యాంకింగ్ సంస్థలకు ప్రభుత్వం నగదు ప్రవాహాన్ని పెంచడం ద్వారా నగదు కొరత తీరితే 2017 ద్వితీయార్థంలో వృద్ధి రేటు పెరుగొచ్చని తెలిపింది.
వృద్ధి 6.9 శాతానికి పరిమితం: ఫిచ్
నోట్ల రద్దు దేశ జీడీపీపై ప్రభావం చూపనుందని ఇది వరకే ఫిచ్ రేటింగ్స్ విశ్లేషించింది. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో తాత్కాలికంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనుందని, దీంతో వృద్ధి రేటు 7.4 శాతం నుంచి 6.9 శాతానికి పడిపోవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసే త్రైమాసికంలో నగదు ప్రవాహం భారీగా తగ్గింది. ఈ క్రమంలోనే 2016-17లో జిడిపి వృద్ధి రేటు 6.9 శాతానికి పడిపోనుందని విశ్లేషిం చింది. ఇంతక్రితం 7.4 శాతం ముందస్తు వృద్ధి రేటును అంచనా వేసింది. 2017-18, 2018-19లో వరుసగా 7.7 శాతం, 8 శాతం చొప్పున వృద్ధి రేటును అంచనా వేసింది. ఇదే సయమంలో రియాల్టీ భారీగా దెబ్బతిన్నదని అంచనా వేసింది. దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయ డం ద్వారా రియాల్టీ రంగం తీవ్ర ఒత్తిడికి గురి అవు తుందని ఫిచ్ విశ్లేషించింది. నోట్ల మార్పిడి వల్ల స్థిరాస్తి అమ్మకాలు 20-30 శాతం మేర పతనం కానున్నాయని అంచనా వేసింది. గత నవంబర్లో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఆస్తులు, బంగారా నికి భారీగా డిమాండ్ పడిపోనుందని పేర్కొంది. భారత్ అత్యధికంగా నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని పేర్కొంది. ప్రజలు తమ వద్ద ప్రకటించని ఆదాయాన్ని ప్రధానంగా ఇళ్లు, బంగారంపై పెట్టుబడులుగా పెడుతారని ఫిచ్ పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 27, Oct 2018, 2:14 PM IST
Highlights
అందరూ అనుకుంటునట్లుగానే దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి అల్లు అర్జున్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అది కూడా రీమేక్ కథతోనే అని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ లో విడుదలైన 'సోను కే టిటు కీ స్వీటీ' అనే సినిమా రీమేక్ హక్కులను త్రివిక్రమ్ దక్కించుకోవడంతో బన్నీతో ఈ కథనే తీస్తున్నట్లు ప్రచారం సాగింది.
అందరూ అనుకుంటునట్లుగానే దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి అల్లు అర్జున్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అది కూడా రీమేక్ కథతోనే అని తెలుస్తోంది.
కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ లో విడుదలైన 'సోను కే టిటు కీ స్వీటీ' అనే సినిమా రీమేక్ హక్కులను త్రివిక్రమ్ దక్కించుకోవడంతో బన్నీతో ఈ కథనే తీస్తున్నట్లు ప్రచారం సాగింది. అది ఇప్పుడు నిజమేనని తెలుస్తోంది. బన్నీకి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేసి సినిమాను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు.
డిసంబర్ 11న సినిమా పూజా కార్యక్రమం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నుండి సినిమా సెట్ మీదకి వెళ్లొచ్చు. ఈ మేరకు నిన్న అల్లు అరవింద్ ఓ మీటింగ్ నిర్వహించి గీతాఆర్ట్స్ కి సంబంధించి కొందరు కీలక వ్యక్తుల సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. నిర్మాత ఎవరనే విషయం ఇంకా తేలలేదు.
ఎవరు ఈ సినిమాని నిర్మించినా.. అందులో గీతాఆర్ట్స్ భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుందని మాత్రం తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ.. త్రివిక్రమ్ తో కలిసి రెండు సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
| 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
bse
స్టాక్ మార్కెట్లపై ఉద్రిక్తతల ఎఫెక్ట్
ముంబయి, మే 24: భారత్ పాక్ ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్లపై ప్రభావంచూపించాయి. నిఫ్టీ 9400 వద్ద ముగిస్తే సెన్సెక్స్ 200 పాయింట్లు దిగజారిం ది. ఫార్మారంగ స్టాక్స్ మంగళవారం నాటిట్రేడింగ్ లో భారీ నష్టాలు చవిచూసాయి. ఇటీవలి లాభాల స్టాక్స్నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపిం చడం భారత్ ఆర్మీ పాకిస్థాన్ మిలిటరీ పోస్టులపై దాడులు వంటివి కొంత మార్కెట్లను ఒత్తిళ్లకు గురి చేసాయి. అలాగే మాంచెస్టర్ ఉగ్రదాడులు కూడా మార్కెట్లపై ఒత్తిడిపెంచాయి. సెన్సెక్స్ 205 పాయింట్లు క్షీణించి 30,365వద్ద స్థిరపడితే నిఫ్టీ 52పాయింట్లు దిగువన 9386వద్ద స్థిరపడింది. ఇక బిఎస్ఇ మిడ్క్యాప్,స్మాల్క్యాప్ సూచీలుసైతం ఒకటిశాతం చొప్పున దిగజారాయి. ఇన్వెస్టర్లు అప్ర మత్తంగా వ్యవహరించారని ఫార్మారంగం ఎక్కువ పోటీతోపాటు రాబడులు తక్కువతో ఎక్కువ ఒత్తిళ్ల కు లోనయినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సేవల సంస్థ విభాగాధిపతి వినోద్నాయర్అన్నారు. మారుతిసుజుకి, ఎంఅండ్ఎం, టాటాస్టీల్, విప్రో, హీరోమోటోకార్ప్ వంటిసంస్థలు సెన్సెక్స్లో లాభ పడ్డాయి. అదానిపోర్టులు, సిప్లా,సన్ఫార్మా, గెయిల్ సంస్థలు ఎక్కువ వెనుకబడ్డాయి. ఫార్మాంగస్టాక్స్ ఎక్కువ నష్టపోయాయి. నిఫ్టీఫార్మా సూచి వరుసగా ఆరోరోజునష్టాల్లో ఊగిసలాడింది. ఈసూచి మూడు శాతం దిగజారింది. సన్ఫార్మా, అరబిందో, సిప్లా కంపెనీలుకూడా అదేదారిలో నడిచాయి. సన్ఫార్మా షేరుధర 6శాతం దిగజారి 601.50కి చేరింది. అరబిందోఫార్మా ఐదుశాతం దిగజారింది. జిందాల్ స్టీల్ అండ్పవర్ నాలుగుశాతం దిగజారింది. ఎప్ఎంసిజి స్టాక్స్ రెండు ట్రేడింగ్లలో లాభాలు కొంత తగ్గాయి. నిఫ్టీ ఎఫ్ఎంసిజి సూచి 1శాతం దిగజారింది. ఐటిసి, డాబర్ ఇండియా ఒకటిశాతం, 1.2శాతం క్షీణించింది. ప్రభుత్వరంగంలోని గెయిల్ 5.8శాతం క్షీణించింది. ఐటిరంగంలో స్టాక్స్ ఆటో రంగ స్టాక్స్ టెక్ మహీంద్ర వంటివి ఒకటిశాతం లాభపడింది. మారుతిసుజుకి 2.8శాతం లాభపడిం ది. అంతర్జాతీయంగా కూడా స్టాక్ మార్కెట్లు మాంచెస్టర్ ఉగ్రదాడులతో ఒత్తిళ్లకులోనయ్యాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని జపాన్ బయటి షేర్లు లాభాలు కరిగిపోయాయి. జపాన్నిక్కీ కూడా 0.2శాతం దిగజారింది. మాంచెస్టర్ దాడి జరిగినా యూరోస్టాక్స్ 600 సూచి 0.2శాతం పెరిగింది. జర్మనీ డాక్స్ 0.3శాతం పెరిగింది. యూరోజోన్ బ్లూచిప్ కంపెనీలు 0.6శాతం పెరిగాయి.చైనా సిఎస్ఐ 300 సూచి లాభనష్టాలమధ్య ఊగిస లాడింది. చివరకు 0.3శాతం లాభపడింది. షాంఘై కాంపోజిట్ 0.5శాతం దిగజారితే హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ 0.15శాతం నష్టపోయింది. ========= బులియన్ కొనుగోళ్లకు జిఎస్టి భయం! న్యూఢిల్లీ, మే 23: భారత్ బంగారం దిగుమతులు రెండో అర్ధసంవత్సరంలో 313.8టన్నులవరకూ ఉంటాయని మొదటి అర్ధసంవత్సరంతో పోలిస్తే 60 శాతం పెరిగినట్లవుతుందని నిపుణుల అంచనా. జిఎస్టిముందస్తు కొనుగోళ్లతో పోలిస్తే దిగుమతులు ఈ పండగ సీజన్లో కొంతమేరతగ్గాయి. సాంప్రదాయ బద్ధంగా పండగసీజన్లలో దిగమతులు పెరుగుతాయి.అలాగే రెండో అర్ధ సంవ త్సరంలో ఎప్పుడూ పెరుగుతాయి. జూలై ఒకటవ తేదీనుంచి జిఎస్టి అమల వుతున్నందున జ్యూయెలర్లు, వ్యాపారులుతమతమ వద్ద నిల్వలను పెంచుకునే ప్రయత్నంచేస్తారు. భారత్ బంగారం దిగుమతులు సహజంగానే రెండో అర్ధ భాగంలో పెరుగుతాయి. పెళ్ళిల్లు, పండుగలు దీపా వళి, దసరా వంటి సందర్భంగా కొనుగోళ్లు పెంచు తారు. జిఎస్టిపరంగా ఈఏడాది అమలయితే కొంత మేర పన్నులు పెరుగుతాయి. అలాగే అమెరికా పరం గాను, మరికొంత రాష్ట్రాలపరంగాను సుంకాలను అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే పండగసీజన్నాటి కొనుగోళ్ల రష్ రానున్న కాలంలో ఉండకపోవచ్చని పసిడిశుద్ధి కేంద్రాలు, ముద్రణాల యాల సంఘం కార్యదర్శి జేమ్స్జోస్ వెల్లడించారు. ఏప్రిల్నెలలో బంగారం దిగుమతులు ప్రభావమే ఇందుకు కీలకమని చెపుతున్నారు. జిఎస్టి అమలు కు వస్తున్నందున ఎక్కువ పన్నలు ఉండే అవకాశం ఉందని ఇప్పటికే బులి యన్రంగం భావిస్తోంది. అందుకే డిమాండ్కూడా తగ్గుతూ వస్తున్నది. భారత్ బంగారం దిగుమతులు మొదటి ఆర్ధ సంవత్సరంలో 450 టన్నులకు ఉంటా యి. 2016 ఇదేకాలంనాటి దిగుమతులకంటే రెట్టింపు ఉంటాయని జిఎఫ్ఎం ఎస్ సీనియర్ విశ్లేషకులు సుధీష్ నంబియాత్ పేర్కొన్నారు. రెండో అర్ధభాగం లో మాత్రం దిగుమతులు 250 టన్నులకు పడిపోతాయని అంచనావేసారు. ఐదేళ్ల సగటుతోపోలిస్తే 40శాతం తగ్గుతుందని ఆయన వెల్లడించారు. 2016 రెండో అర్ధభాగంలో 313.8 టన్నులు దిగుమతి అయ్యాయి. అదేసంవత్సరం మొదటి ఆరునెలలతోపోలిస్తే 60శాతం పెరిగాయని నంబియాత్ అన్నారు. ప్రతి ఏటా రెండో అర్ధసంవత్సరంలో కొనుగోళ్ల రద్దీ అంతగా ఉండదు. అంత ర్జాతీయధరలు మాత్రమే కొంత మద్దతునిస్తుంటాయని వీటికితోడు ఎక్ఛేంజి ట్రేడెడ్ఫండ్స్ కొంతమేర ధరలను సర్దుబాటుచేయగలమని ముంబై కేంద్రంగా ఉన్న ఒక డీలర్ వెల్లడించారు. బంగారం దిగుమతు లు రానున్నకాలంలో 50 టన్నులకు తగ్గుతాయని రిఫైనరీస్ అసోసియేషన్ కార్యదర్శి జోస్ వెల్లడిం చారు. ఏప్రిల్నెలలో 85 టన్నుల నుంచి కొంత తగ్గు తుందని దీనివల్ల భారత్ వాణిజ్యలోటును కట్టడి అవుతుందని నిపుణుల అంచనా. శుద్ధిచేయని బంగా రం దిగుమతులు కూడా ఈఅర్ధసంవత్సరంలో కొంత తగ్గుతాయని, కొత్త నిబంధనలు ప్రకారం బిఐఎస్ ధృవీకృత రిఫైనరీలు మాత్రమే జూన్ ఒకటవ తేదీ నుంచి బంగారం దిగుమతులు చేసు కునే అవకాశం ఉందని జోస్ వెల్లడించారు. బిఐఎస్ ధృవీకరణ పొందేందుకు రిఫైనరీలకు కనీసం ఆరునెలల వ్యవధి పడు తోందని, ఎక్కువశాతం చిన్న రిఫైనరీలు అందువల్లనే గుర్తింపును తెచ్చుకోలే కోతున్నాయని ఆయన అన్నారు. 2016లో భారత్ 142టన్నుల శుద్ధిచేయని బంగారాన్ని దిగుమతిచేసుకున్నట్లు ప్రపంచ పసిడి మండలి అంచనావేసింది.
| 1entertainment
|
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2 (ఫోటోలు)
First Published 29, Oct 2018, 4:12 PM IST
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
హుషారు సినిమా ప్రెస్ మీట్ - 2
Recent Stories
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Yuvraj Singh: రూ.16 కోట్ల నుంచి రూ.కోటికి.. యువీ పతనం
ఒకప్పుడు ఐపీఎల్ వేలంలో యువరాజ్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడేవారు. 2015లో ఢిల్లీ డేర్డెవిల్స్ ఏకంగా రూ.16 కోట్లు ధరకు యువీని దక్కించుకుంది.
Samayam Telugu | Updated:
Dec 19, 2018, 09:33AM IST
Yuvraj Singh: రూ.16 కోట్ల నుంచి రూ.కోటికి.. యువీ పతనం
హైలైట్స్
* తొలి రౌండ్లో యువీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
* ఒకప్పుడు రూ.16కోట్లకు అమ్ముడుపోయిన యువీకి ఇప్పుడు దక్కింది కేవలం రూ.కోటి
* ముంబయి ఇండియన్స్కు ధన్యవాదాలు చెబుతున్న యువీ ఫ్యాన్స్
డాషింగ్ బ్యాట్స్మెన్గా భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన యువరాజ్ సింగ్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. అటు టీమిండియాలోకి రాలేక.. క్రికెట్ను వీడలేక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్లోనూ కోట్లు పెట్టి కొనుక్కున్న జట్లకు సరైన న్యాయం చేయలేకపోతున్నాడు. దీంతో అతడి ధర ఏటా దిగజారిపోతోంది. ఓ టైమ్లో రూ.16కోట్లకు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యపరిచిన యువీకి మంగళవారం జరిగిన వేలంలో అవమానకర పరిస్థితి ఎదురైంది. జైపూర్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలం తొలి రౌండ్లో యువరాజ్ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. కానీ రెండో రౌండ్లో ముంబై ఇండియన్స్ జట్టు రూ.కోటి (బేస్ ధర) ఇచ్చి యువరాజ్ సింగ్ను తమ జట్టులోకి తీసుకుంది.
అంచెలంచెలుగా ఎదిగి.. పాతాళానికి..
ఒకప్పుడు ఐపీఎల్ వేలంలో యువరాజ్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడేవారు. 2011లో పుణె జట్టు 1.8 మిలియన్ డాలర్లు (12.78 కోట్లు)కి యువరాజ్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2014లో ఆర్సీబీ రూ.14 కోట్లకి, 2015లో ఢిల్లీ డేర్డెవిల్స్ ఏకంగా రూ.16 కోట్లు ధరకు యువీని దక్కించుకున్నాయి. అయితే కొనుగోలు చేసిన ధరకు యువీ సరైన న్యాయం చేయడం లేదని భావించిన ఆయా జట్లు తర్వాత ఏడాది అతడిని వదిలించుకున్నాయి. 2016లో సన్రైజర్స్ 7 కోట్లు పెట్టి యువీని కొనుగోలు చేయగా.. 2018లో పంజాబ్ 2 కోట్ల బేస్ ధరకి యువీని దక్కించుకుంది.
కొంతకాలంగా యువీ ఏ ఫార్మాట్లోనూ రాణించకపోవడం.. ముఖ్యంగా టీం ఇండియాలో చోటు దక్కించుకోకపోవడం తదితర కారణాలతో 2019 వేలంలో యువీ తొలి రౌండ్లో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. రెండో రౌండ్లో ముంబయి ఇండియన్స్ జట్టు జట్టు రూ.కోటి (బేస్ ధర)కి కొనుగోలు చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ముంబయి ఇండియన్స్ నిర్ణయంపై యువీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమ్మకంతో తనను కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్కు యువీ న్యాయం చేస్తాడో లేదో చూడాలంటే మరో నాలుగు నెలలు వేచిచూడాల్సిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Chicago, First Published 25, Aug 2018, 11:25 AM IST
Highlights
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. వర్ధమాన దేశాలపై ప్రభావం చూపకున్నా.. చైనాతో ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్యం చేస్తున్న దేశాలకు తిప్పలు తప్పవని పేర్కొన్నారు. డాలర్ విలువ బలోపేతం కావడం వల్లే రూపాయి మారకం విలువ పతనమైందన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.
షికాగో: సరిగ్గా 13 ఏళ్ల క్రితమే రుణ సంక్షోభంతో పొంచి ఉన్న ఆర్థిక మాంద్యాన్ని ముందే ఊహించి చెప్పిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్.. రుణ సంక్షోభం గురించి హెచ్చరించారు. తాజాగా ఇపుడు వాణిజ్య యుద్ధంతో హానికరమైన ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఇవి అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. ‘ప్రస్తుతం వాణిజ్యంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పడుతున్నారు. ఆ విషయంలో అంతా మంచే జరగడం చాలా ముఖ్యం. ఇందుకు చర్చలు ఇంకా ముఖ్యం. తెగేదాకా లాగకపోవడమే మంచిది’ అని ఆయన పేర్కొన్నారు.
వాణిజ్య యుద్ధమే కీలకం
‘మనకందరికీ సంక్షోభం ముందు ఏం జరుగుతుందన్నది తెలుసు. అంతక్రితం సంక్షోభ కాలంలో మనం చూశాం. ఆస్తుల ధరలు, రుణాల ధరలు పెరుగుతూ పోతాయి’ అని రఘురామ్ రాజన్ గుర్తుచేశారు. ‘ఇటీవల అంతర్జాతీయ వృద్ధి బలంగానే ఉంది. ఇప్పుడు ఉన్న వాణిజ్య యుద్ధ ఆందోళనలు ఎంతకాలం కొనసాగుతాయన్నది ఇపుడు కీలకం’ అని ఒక ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవలి కాలంలో అతర్జాతీయ ప్రగతి బాగానే ఉన్నదని అయితే ఎంతకాలం ఇది కొనసాగుతుందన్న విషయం పరిశీలించాల్సి ఉన్నదన్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంక్షోభం అభివ్రుద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం చూపుతుందన్నారు.
విచిత్రమేమిటంటే.. 2005లో రుణ సంక్షోభం గురించి ఆయన హెచ్చరించింది కూడా ఇక్కడే కావడం గమనార్హం. ‘అమెరికా, చైనాలు వాణిజ్య యుద్ధం విషయంలో ఎలా ముందుకు వెళతాయన్నదాన్ని బట్టి వృద్ధికి ఎంత ప్రమాదం ఉండేది తెలుస్తుంది. ప్రస్తుతం అంతర్లీనంగా పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. కొన్ని వర్థమాన దేశాల్లోనూ ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి’ అని ఆయన చెప్పారు.
తెగని చర్చలు.. కుదేలవుతున్న వర్ధమాన మార్కెట్లు
దాదాపు రెండు నెలల తర్వాత అమెరికా, చైనా ప్రతినిధులు చర్చలకు వచ్చినా రెండు రోజుల చర్చల తర్వాత ఎటువంటి ప్రగతీ సాధించలేకపోయారని రఘురామ్ రాజన్ గుర్తు చేశారు. దీంతో వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ అలుముకున్నాయన్న రాజన్ వ్యాఖ్యలు గమనార్హం. అమెరికా స్టాక్ మార్కెట్లు ఈ వారం రికార్డు గరిష్ఠానికి చేరగా. వర్థమాన దేశాల మార్కెట్లు మాత్రం కుదేలవుతున్నాయి. ఉదాహరణకు షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ కాంపోజిట్ ఇండెక్స్ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 17% వరకు నష్టపోయింది.
చైనాపై సుంకాలు వర్ధమాన దేశాలకు ఇబ్బందే
టర్కీ, అర్జీంటీనాలు ఈ ఏడాది కరెన్సీ సంక్షోభం బారీనపడ్డాయని రఘురామ్ రాజన్ గుర్తు చేశారు. కానీ ఇది వర్థమాన మార్కెట్లకు సోకకపోయినా చైనాపై సుంకాల వల్ల ఇతర వర్థమాన దేశాలపై మాత్రం ప్రభావం ఉండొచ్చునని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా చైనా ద్వారా ఎగుమతులు చేసే దేశాలు, ఆ దేశ వాణిజ్యంపై ఆధారపడే దేశాలకు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజన్ అంచనా వేశారు.
పెరిగింది కరంట్ ఖాతాలోటు మాత్రమే
‘నిజం చెప్పాలంటే.. ద్రవ్యలోటును భారత అధికార వర్గాలు నియంత్రణలోకితెచ్చాయి. కరెంట్ ఖాతా లోటు మాత్రం పెరిగింది. అదీకూడా అధిక ముడి చమురు ధరల వల్లేన’ని ఆయన వివరించారు. ‘ఎన్నికలకువెళుతున్న నేపథ్యంలో భారత్, బ్రెజిల్ వంటి దేశాలు సాధ్యమైనంత వరకు మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి’ అని అన్నారు. యూపీఏ హయంలో వృద్ధి మెరుగ్గా రాణించిందని జీడీపీ పాత సిరీస్ చూపిస్తున్న వివాదంపై మాట్లాడుతూ ‘మనం ఇపుడు భవిష్యత్పై దృష్టి సారించాలి. భారత్ 7.5 శాతం వృద్ధితో ముందుకెళుతోంది కదా’ అని పేర్కొన్నారు. బ్యాంకుల్లో పెరుగుతున్న మొండి బకాయిలపై మాట్లాడుతూ ‘బ్యాంకుల్లో పాలన మెరుగు కావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
రూపాయిపై భయం అక్కర్లేదు
భారత్, బ్రెజిల్ వంటి దేశాలు తమ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంపై దృష్టి సారించాలని రాజన్ సూచించారు. భారత్ విషయానికొస్తే రూపాయి క్షీణతపై మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అది మొత్తం మీద డాలర్ బలోపేతం వల్ల జరిగిన పరిణామంగానే భావించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల16వ తేదీన డాలర్పై రూపాయి మారకం విలువ 70.395 వద్ద ఆల్టైం కనిష్ఠ స్థాయిని చేరిన సంగతి తెలిసిందే.
Last Updated 9, Sep 2018, 11:02 AM IST
| 1entertainment
|
Mumbai, First Published 4, May 2019, 11:43 AM IST
Highlights
రిలయన్స్ బ్రదర్ ‘అనిల్ అంబానీ’కి మరో సంకటం వచ్చి పడింది. మొన్న ఆర్ కామ్.. తాజాగా అనిల్ సారథ్యంలోని రిలయన్స్ కేపిటల్ సంక్షోభం ముంగిట నిలిచింది. నగదు నిల్వలు రూ.11 కోట్లకు పడిపోయాయి. మరోవైపు వివిధ సంస్థలకు చెల్లించాల్సిన రూ.1,760 కోట్ల బకాయిలకు గడువు సమీపిస్తోంది.
ముంబై: అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో పటిష్ఠంగా ఉన్న సంస్థ రిలయన్స్ కేపిటల్ ఒక్కటే. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ కమ్యూనికేషన్.. ఇలా గ్రూపులోని అన్ని కంపెనీలు ఆర్థికంగా చితికిపోయినా రిలయన్స్ కేపిటల్ మాత్రం గత ఐదేళ్లలో లాభాలను రెట్టింపు చేసుకోగలిగింది.
గ్రూపులోని మిగతా కంపెనీల సంక్షోభ ప్రభావం పడకుండా సురక్షితంగా వ్యాపారం కొనసాగించగలిగింది. కానీ ఇప్పుడీ కంపెనీ కూడా ఒత్తిడికి గురవుతోంది. మార్చి నాటికి కంపెనీ నగదు నిల్వల స్థాయి రూ.11 కోట్లకు పడిపోయాయి.
దాంతో నిధులు పెంచుకునేందుకు రిలయన్స్ కేపిటల్ 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.14వేల కోట్లు) విలువైన ఆస్తుల విక్రయానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆస్తుల అమ్మకాన్ని వీలైనంత త్వరగా ముగిస్తే తప్ప కంపెనీ నిధుల కొరత సమస్య నుంచి గట్టెక్కే అవకాశాలు కన్పించడం లేదని మార్కెట్ వర్గాలంటున్నాయి.
మార్కెట్ నుంచి సేకరించిన రుణాల్లో 25.2 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,760 కోట్లు) మేర బకాయిలను రిలయన్స్ కేపిటల్ ఈ రెండు నెలల్లో తీర్చాల్సి ఉంది. ద్రవ్య వల్ల గడువులోగా బకాయిలు చెల్లించడంలో విఫలమైతే కంపెనీ సంక్షోభంలోకి జారుకోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సమస్య నుంచి బయటపడేందుకు సకాలంలో ఆస్తుల అమ్మకం కీలకమని క్రెడిట్ అడ్వైజరీ సంస్థ ఆదిత్య కన్సల్టింగ్ మేనేజింగ్ పార్ట్నర్ మాథ్యూ ఆంటోనీ పేర్కొన్నారు. లేదంటే కంపెనీ ద్రవ్య సంక్షోభంలోకి జారుకునే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
మూడీస్ దేశీయ విభాగమైన ఇక్రా, కేర్ రేటింగ్, బ్రిక్వర్క్ రేటింగ్ వంటి పలు ఏజెన్సీలు ఈ మధ్యకాలంలో రిలయన్స్ కేపిటల్, దాని స్వల్పకాలిక రుణాల రేటింగ్లను తగ్గించి వేశాయి. ఆస్తుల విక్రయంలో జాప్యం, క్రమంగా క్షీణిస్తున్న నగదు నిల్వలు, రుణాలకు పొంచి ఉన్న రిస్క్లను ఇందుకు కారణమని పేర్కొన్నాయి.
వివిధ సంస్థల రేటింగ్ తగ్గింపు కంపెనీ షేర్లపై ప్రభావం చూపింది. రిలయన్స్ కమ్యూనికేషన్ దివాళా తీయడంతోపాటు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం కూడా రిలయన్స్ కేపిటల్ షేర్లను దెబ్బతీశాయి. దాంతో ఈ ఏడాది కంపెనీ షేర్లు 40 శాతం మేర పతనమయ్యాయి.
గత దశాబ్దకాలంలో అనిల్ అంబానీ ఉత్థాన పతనాలను చూశారు. 2008లో 3,100 కోట్ల డాలర్లుగా నమోదైన ఆయన సంపద ప్రస్తుతం 12 కోట్ల డాలర్లకు పడిపోయింది.
అనిల్ అంబానీ గ్రూప్లోని ఇతర కంపెనీలకు రిలయన్స్ కేపిటల్ ఇచ్చిన రుణాలు, పెట్టిన పెట్టుబడులు రూ.13,748 కోట్లు. సదరు కంపెనీలన్నీ సంక్షోభంలో ఉండటంతో అవి తిరిగొస్తాయో లేదో నమ్మకం లేదు.
గత ఏడాది సెప్టెంబర్ నాటికి విక్రయించాల్సిన ఆస్తుల్లో కేవలం మూడోవంతు ఒప్పందాలను మాత్రమే పూర్తి చేయగలిగింది. నియంత్రిత షేర్హోల్డర్ల వాటాల్లో మూడొంతుల షేర్లు తనఖాలో ఉండటంతో అనిల్ అంబానీపై ఒత్తిడి పెరుగుతోంది.
Last Updated 4, May 2019, 11:43 AM IST
| 1entertainment
|
Posted on April 30, 2013
జైపూర్ ఏప్రిల్ 29 (జనంసాక్షి) : జైపూర్లో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాట్స్మెన్ ముకుంద్ 21 బంతుల్లో 19 పరుగులు చేసి … వివరాలు →
Posted on April 30, 2013
చెలరేగిన శర్మ 39 బంతుల్లో 79 పరుగులు పోరాడి ఓడిన పంజాబ్ నాల్గో స్థానంలో ముంబయి జట్టు ముంబయి ఏప్రిల్ 29 (జనంసాక్షి) : ముంబయిలో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై ముంబయి ఇండియన్స్ జట్టు నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు 174 పరుగులు … వివరాలు →
Posted on April 26, 2013
చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం, మెరుపులు మెరిపించిన మైక్ హస్సీ ధావన్, అమిత్ శ్రమ వృథా హైదరాబాద్కు తప్పని ఘోర పరాభవం చెన్నై ఏప్రిల్ 25 (జనంసాక్షి) : ఐపీఎల్లో-6లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ సన్రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై 5వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవెసింది.మహీంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ … వివరాలు →
Posted on April 26, 2013
ఐపీఎల్-6లో ఎక్కువగా ఇష్టపడే వ్యక్తిగా ధోనీ చెన్నై,ఏప్రిల్ 25 (జనంసాక్షి): ప్రపంచ క్రికెట్లో అతి కొద్దిసమయంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ…ఆటలోనే కాదు ఆర్జనలోనూ , పాపులారిటీలోనూ దిగ్గజాలతో పోటీపడగలిగిన సత్తా ఉన్నవాడు. ఇప్పటికే పలు రూపాలలో ఇది నిరూపితమైంది కూడా. తాజాగా ఐపీఎల్ ఆరో సీజన్లో ఎక్కువమంది కోరుకునే ఆటగాడి … వివరాలు →
Posted on April 26, 2013
ఢిల్లీ : లండన్ ఒలంపిక్స్ క్వాటర్ ఫైనల్కు చేరి సంచలనాలు సృష్టించిన పార్లపల్లి కాశ్యప్ గురువారం ప్రపంచ బ్యాట్మింటన్ సమాఖ్య (బిడబ్య్లూసీ) విడుదల చేసిన ర్యాకింగ్లో ఆరవ స్థానాన్ని చేజేక్కించుకున్నాడు. బుధవారం జరిగిన ఇండియన్ ఓపెన్ సూపర్ సిరిస్లో పురుషుల సింగిల్ మ్యాచ్లో ప్రపంచ, ఆసియా, ఒలంపిక్స్ మాజీ చాంపియన్ తోఫిక్ హిదాయత్ (ఇండోనేషియా) జరిగిన … వివరాలు →
| 2sports
|
want to become crorepati with public provident fund? here’s what it will take
టార్గెట్ కోటి రూపాయలు.. ఎలా సంపాదించాలి? అందుబాటులో ఒక ఆప్షన్!
రిస్క్ లేకుండా ధనవంతులు కావాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. అయితే దీనికి సహనం కావాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి.
Samayam Telugu | Updated:
Nov 2, 2019, 05:39PM IST
టార్గెట్ కోటి రూపాయలు.. ఎలా సంపాదించాలి? అందుబాటులో ఒక ఆప్షన్!
హైలైట్స్
కోటీశ్వరులు కావాలని ప్లాన్ చేస్తున్నారా?
అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది
ఇందులో డబ్బులు పెడితే కచ్చితంగా రూ.కోటి పొందొచ్చు
అయితే దీర్ఘకాలంలో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది
డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా. అది కూడా త్వరితగతిన కోటీశ్వరులు కావాలని ప్రయత్నిస్తున్నారా? అయితే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని సంపాదించాలి. లేదా మంచి బిజినెస్ను స్టార్ట్ చేయాలి. మోస్తారు జీతం వచ్చే వారు కోటీశ్వరులు కాలాలంటే చాలా ఏళ్లు పడతాయి. ప్రణాళికాబద్ధంతో, సరైన ఇన్వెస్ట్మెంట్ వ్యూహంతో ముందుకు వెలితే అనుకున్న లక్ష్యాన్ని సాకారం చేసుకోవచ్చు.
రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు, కచ్చితనమైన రాబడి కోరుకునే వారికి డబ్బు సంపాదించేందుకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. దీని పేరు పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). పోస్టాఫీస్కు వెళ్లి ఈ అకౌంట్ను తెరవొచ్చు.
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
'గౌతమిపుత్ర శాతకర్ణి' జాబితాలో మరో అరుదైన రికార్డ్!
క్రిష్ దర్శకత్వంలో నందమూరి బసవతారకరామ పుత్ర బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి రికార్డుల పరంపర కొనసాగుతోంది...
| Updated:
Jan 18, 2017, 08:35PM IST
క్రిష్ దర్శకత్వంలో నందమూరి బసవతారకరామ పుత్ర బాలకృష్ణ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నటి హేమామాలిని, శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే బాలకృష్ణ, క్రిష్ కెరీర్లలో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్టర్‌గా నిలిచిన ఈ సినిమా తాజాగా తక్కువ వ్యవధిలో అత్యధిక లైకులు సొంతం చేసుకున్న ట్రైలర్‌గా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
డిసెంబర్ 16న రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కి ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ కనిపించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 7.1 మిలియన్ వ్యూస్‌లకి చేరిన ఈ ట్రైలర్ తాజాగా ఒక లక్ష లైకులని సొంతం చేసుకున్న ట్రైలర్‌గానూ రికార్డ్ కొట్టేసింది. ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయిలో వ్యూస్, లైకులు కైవసం చేసుకున్న తొలి తెలుగు సినిమా ట్రైలర్ కూడా ఇదే కావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
| 0business
|
Jan 05,2017
ఎఫ్డీిఐల్లో 27% వృద్ధి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో భారత్లోకి 27 శాతం వృద్ధితో 27.82 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీిఐ) వచ్చి చేరాయి. 2015-16 ఇదే కాలంలో 21.87 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు నమోదయ్యాయి. ప్రధానంగా సర్వీసు, టెలికం, ట్రేడింగ్, కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆటోమొబైల్ రంగాల్లోకి అత్యధిక ఎఫ్డీఐలు వచ్చాయి. కాగా సింగపూర్, మారిషస్, నెథర్లాండ్, జపాన్ దేశాల నుంచి భారీగా ఎఫ్డీఐలు నమోదయ్యాయని డిపార్టుమెంట్ ఆఫ్ ఇండిస్టీయల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) వెల్లడించింది. కాగా క్రితం ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎఫ్డీఐల్లో 23 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ పెట్టుబడులు కీలకంగా ఉన్నాయి. కేవలం రోడ్లు, నౌకాశ్రయాలు, విమానశ్రయాలు తదితర మౌలిక వసతుల రంగంలోనే లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.విదేశీ పెట్టుబడుల వల్ల అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ కూడా బలపడటానికి దోహదం చేయనుందని డీిఐపీపీ పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Suresh 138 Views Team India
TEAM INDIA
కొలంబో: శ్రీలంకపై ఐదు వన్డేల క్లీన్స్వీప్ టీమిండియా చేసింది. ఇప్పటికే సిరీస్ను 3-0తో గెలుచుకున్న విరాట్ సేన వన్డేలోను పూర్తి అధిపత్యాన్ని కొనసాగించింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో 6 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచి వన్డే సిరీస్ను 5-0తో కైవసం చేసుకుంది. శ్రీలంకపై ఐదు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం ఇదే రెండోసారి. 46.3 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేసింది. విరాట్, జాదవ్ నాలుగో వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఛేజింగ్లో ఓపెనర్లు రహానే, రోహిత్ వికెట్లను త్వరగానే కోల్పోయినా, కెప్టెన్ విరాట్, మనీష్ పాండే, కేదార్ జాదవ్ టీమ్ను గెలుపుబాట పట్టించారు. సిరీస్లో ఒక మ్యాచ్ ఐనా గెలిచి పరువు
నిలబెట్టకుందామనుకున్న లంక ఆశలను వమ్ము చేశారు. విరాట్ 110 పరుగులతో నాటౌట్గా నిలిచారు.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బుల్లితెరపై బాహుబలి సీరియల్ ‘ఆరంభ్’
బాహుబలి మూవీతో తెలుగు సినిమా తడాఖా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశారు దర్శకుడు రాజమౌళి. తాజాగా బాహుబలి పేరుతో టీవి సీరియల్ రాబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తినెలకొంది.
TNN | Updated:
May 7, 2017, 02:17PM IST
బాహుబలి మూవీతో తెలుగు సినిమా తడాఖా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశారు దర్శకుడు రాజమౌళి. సినిమా విడుదలైన 9 రోజుల్లోనే సాధించి 1000 కోట్ల రూపాయలను సాధించి.. ఇదీ తెలుగోడి సత్తా అని హాలీవుడ్ సినిమాతో పోటీపడి నెంబర్ 3 స్థానంలో నిలిచింది. దీంతో కలెక్షన్స్ సునామీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిని బాహుబలి 2 మూవీకి సంబంధించిన ఏ వార్త అయినా ఇప్పుడు సంచలనంగానే మారింది.
తాజాగా బాహుబలి పేరుతో టీవి సీరియల్‌ రాబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తినెలకొంది. బాహుబలి సినిమాకు తెరపడిందేమో గానీ దాని ప్రస్థానాన్ని మాత్రం మేకర్స్ కొనసాగించబోతున్నారు. బాహుబలి క్యారెక్టర్స్‌తో పుస్తకాల్ని, కామిక్స్ ను, టీవీ సిరీస్ ఇలా రకరకలుగా బాహుబలిని ఒక బ్రాండ్ మార్చాలని బాహుబలి టీం భావిస్తోంది. ఇప్పటికీ చాలా పనులు విజయవంతంగా సాగుతున్నాయి. అయితే అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం బాహుబలి టీవీ సిరీస్. దీని కోసం తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికీ ట్విస్ట్ ఇస్తూ..చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ఈ టీవీ సిరీస్‌ను హిందీలో తెరకెక్కించబోతున్నామని.. ఆ తరువాత తెలుగు ఇతర భాషల్లో డబ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.
| 0business
|
Visit Site
Recommended byColombia
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ టెస్టు సిరీస్లో ఇప్పటి వరకూ అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత క్రికెటర్గా రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా ఆ రికార్డ్ని పుజారా బ్రేక్ చేశాడు. 2003-04లో జరిగిన ఆసీస్ పర్యటనలో రాహుల్ ద్రవిడ్ 1,203 బంతులతో ఆ రికార్డ్ని నెలకొల్పగా.. పుజారా 1,258 బంతులతో దాన్ని కనుమరుగు చేసి నెం.1 స్థానంలోకి దూసుకెళ్లాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో విజయ్ హజారే (1947-48) 1,192 బంతులతో ఉండగా.. విరాట్ కోహ్లీ (2014-15) 1,093 బంతులు, సునీల్ గవాస్కర్ (1977-78) 1,032 బంతులతో టాప్-5లో ఉన్నారు.
తాజా టెస్టు సిరీస్లో ఎక్కువ బంతులు ఎదుర్కొన్న భారత క్రికెటర్గానే కాకుండా.. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గానూ పుజారా కొనసాగుతున్నాడు. అడిలైడ్, మెల్బోర్న్ టెస్టులో సెంచరీలు సాధించిన పుజారా.. సిడ్నీలో 193 పరుగులు చేయడం ద్వారా.. మొత్తం 521 పరుగులతో నిలిచాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
ప్రపంచ బ్యాంక్ అధినేత రేసులో నూయి!
- ప్రధానంగా ప్రతిపాదిస్తున్న ట్రంప్ కుమార్తె ఇవాంకా
- ఇంద్రా వైపే మొగ్గుచూపుతున్న వైట్హౌస్ వర్గాలు
- అమెరికా అభ్యర్థి కావడంతో ఎంపికకు అవకాశం
- 'న్యూయార్క్ టైమ్స్'వరుస కథనాల్లో వెల్లడి
న్యూయార్క్: ప్రపంచ బ్యాంకు అధినేత రేసులో భారత సంతతి మహిళ ఇంద్రా నూయి ముందంజలో ఉందంటూ అమోరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదనతో ఆ పదవి నూయిని వరించే అవకాశం ఉందని వివిధ వార్త సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి ఇంద్రా నూయి పేరును ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నామినేట్ చేసినట్టు 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి1న ఆయన పదవి నుంచి తప్పుకోనున్నట్టు ఇటీవల ప్రకటించారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు మొదలైంది. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్, ఐరాసలో అమెసీఈవో ఇంద్రా నూయి పేరు పోటీలో ఉందని వినిపిస్తోంది. 12 ఏళ్లు అమె పెప్సీకోకు సీఈవోగా వ్యవహారించి.. గతేడాది అక్టోబర్లో పదవీ విరమణ పొందారు. నూయి ప్రపంచబ్యాంకు అధ్యక్షురాలు అయితే బాగుంటుందని ప్రపంచ బ్యాంక్లో అమెరికా అతిపెద్ద భాగస్వామి అయినందున ఆ దేశం సూచించిన వ్యక్తికే పదవి దక్కే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి పేరును ప్రతిపాదించే వ్యక్తుల్లో ఇవాంక ట్రంప్ కీలక వ్యక్తి కావడంతో ఆమె విజ్ఞప్తిని సభ్య దేశాలు ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతురాలైన మహిళల్లో ఇంద్రా నూయికి ప్రత్యేక స్థానం ఉందంటూ ట్రంప్, ఇవాంకా అనేక సార్లు ప్రశంసించిన విషయం తెలిసిందే.
ఎన్నిక జరిగే అవకాశం..
ప్రపంచ బ్యాంక్లో అమెరికా అతిపెద్ద భాగస్వామిగా ఉంది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు సూచించిన వ్యక్తికే ఈ పదవి దక్కే అవకాశం మెండుగా ఉంటుంది. ఇది వరకు పలువురి పోటీతో 2012లో మాత్రం ఎన్నిక అనివార్యమైంది. ఈసారి కూడా ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ట్రంప్ బిజినెస్ సలహాదారుల కౌన్సిల్లో నూయి చేరడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. తర్వాత ఆమె అందులోంచి వైదొలిగారు. అదే విధంగా గతంలో ఇవాంక కూడా నూయి తమ సలహాదారు అంటూ మద్దతుగా ట్వీట్ చేశారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవి రేసులో ఇవాంక ట్రంప్తోపాటు బ్యాంకు కోశాగార కార్యదర్శి స్టీవెన్ మునిచ్, వైట్హౌస్ తాత్కాలిక చీఫ్ ఆఫ్ స్టాఫ్ మిక్ ముల్వెనీ కూడా ఉన్నారు. వీరితో పాటు ట్రంప్కు ప్రచార సమయంలో సలహాదారులుగా పనిచేసిన మరో ఇద్దరు పోటీ పడుతున్నారు. అయితే ఇంద్రానూయి నామినేషన్ వేస్తారా లేదా అనే దానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో అధ్యక్ష పదవికి పలువురు పోటీ పడుతున్నారు. ఒక వేళ అమెరికా 63 ఏళ్ల నూయిని ప్రతిపాదిస్తే ఆమె అంగీకరిస్తారా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇంద్రా నూయి విషయంలో వస్తున్న రిపోర్టులపై వైట్హౌస్ కూడా స్పందించలేదు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
sandhya 238 Views chanda-kochhar , ed , ICICI Bank-Videocon loan fraud case
chanda kocchar
ముంబై: ఐసిఐసిఐ బ్యాంకు, వీడియోకాన మనీలాండరింగ్ కేసులో విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) విస్తృతం చేయనుంది. ఈ కేసులో ఐసిఐసిఐ బ్యాంకు మాజీ సిఇఒ చందాకొచ్చర్తోపాటు బ్యాంకు ఉన్నతాధికారులను మరోసారి ప్రశ్నించనున్నట్లు ఇడి వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో చందాకొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్లను గత నెలలో ప్రశ్నించిన ఇడి వారి స్టేట్మెంట్లను నమోదు చేసింది. చందాకొచ్చర్ ఇచ్చిన సమాధానాలను ఇతర అధికారులను ప్రశ్నించి వారి సమాధానాలతో సరిపోల్చేందుకు ఇడి ప్రయత్నిస్తోంది. ఐసిఐసిఐ బ్యాంకుతో వీడియోకాన్ డీల్ గురించి పూర్తి సమాచారం రాబట్టేందుకు ఇడి కసరత్తు ముమ్మరం చేసింది. కాగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కొన్ని వ్యక్తిగత కారణాలతో తనకు కొంత సమయం కావాలని కోరిన చందాకొచ్చర్ త్వరలోనే ఇడి ఎదుట హాజరుకానున్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్చట్టం కింత చందాకొచ్చర్ ఆమె మరిది రాజీవ్ కొచ్చర్ల ఆస్తులను అటాచ్ చేసేందుకు ఇడి యోచిస్తోంది. ఐసిఐసిఐ బ్యాంకు వీడియోకాన్కు రుణాలు జారీచేసే క్రమంలో పెద్దమొత్తంలో బ్యాంకు చీఫ్ చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్కు చెందాయని, అనుచిత లబ్ధిపొందాలనే అభియోగాలు నమోదైన సంగతి విదితమే.
తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
దుమ్మురేపిన మంధన.. భారత్ రికార్డ్ స్కోరు
టీమిండియా క్రికెటర్ స్మృతి మంధన బ్యాటింగ్లో దుమ్ము రేపింది. భారత్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకుంది. దీంతో టీమిండియా టీ20ల్లో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది.
Samayam Telugu | Updated:
Mar 25, 2018, 11:55AM IST
దుమ్మురేపిన మంధన.. భారత్ రికార్డ్ స్కోరు
ట్రై సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. కెప్టెన్ మిథాలీ రాజ్ (43 బంతుల్లో 53), స్మృతి మంధన (40 బంతుల్లో 76) రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. టీ20ల్లో ఇది భారత్కు అత్యధిక స్కోరు కాగా.. ఓవరాల్గా టీ20ల్లో రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. నెదర్లాండ్స్పై 2010లో సౌతాఫ్రికా చేసిన 205 పరుగులే మహిళల టీ20ల్లో టాప్ స్కోరుగా ఉంది.
Visit Site
Recommended byColombia
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు మిథాలీ రాజ్, స్మతి మంధన భారత్కు శుభారంభం ఇచ్చారు. వీరద్దరూ తొలి వికెట్కు 12.5 ఓవర్లలోనే 129 పరుగులు జోడించారు. మిథాలీ నిలకడగా ఆడగా.. మంధన ధాటిగా ఆడింది. 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మంధన.. 12 ఫోర్లు, 2 సిక్స్లతో 40 బంతుల్లోనే 76 పరుగులు రాబట్టింది. భారత్ తరఫున టీ20ల్లో ఫాస్టెస్ట్ 50 రికార్డ్ను సొంతం చేసుకుంది.
ఛేజింగ్లో మహిళల క్రికెట్లో అత్యధిక స్కోరు 181 పరుగులు. గత ఏడాది ఆసీస్పై ఇంగ్లాండ్ ఈ రికార్డు నెలకొల్పగా.. ఈ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లిష్ జట్టుకు 199 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
England, First Published 4, Feb 2019, 1:07 PM IST
Highlights
వెస్టిండీస్ చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న ఇంగ్లాండ్కు మద్ధతు ప్రకటిస్తూ... ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లీష్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది.
వెస్టిండీస్ చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న ఇంగ్లాండ్కు మద్ధతు ప్రకటిస్తూ... ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లీష్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది.
పేలవ ప్రదర్శన కారణంగా సిరీస్ను 2-0తో కోల్పోయింది. త్వరలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో ఇంగ్లాండ్ జట్టుపై ఇంటా బయటా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్టుకు మద్ధతు తెలుపుతూ.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు.
‘‘ప్రస్తుతం ఇంగ్లాండ్కు టెస్ట్ క్రికెట్ అంత ప్రాధాన్యత కాదు.. వారి చూపంతా వన్డే ప్రపంచకప్ గెలవడమే.. దానిపైనే వారు కసరత్తులు చేస్తున్నారంటూ ట్వీట్ చేశాడు. దీనిపై క్రికెట్ అభిమానులు పీటర్సన్ను ట్రోల్ చేశారు.
జట్టుకు మద్ధతుగా నిలిస్తే తప్పేం లేదు కానీ.. ఇక్కడ టెస్ట్ ఫార్మాట్నే తక్కువ చేసేలా స్టేట్మెంట్ ఇవ్వడం సబబు కాదని సూచించారు. ‘‘ ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్లో ఓడిపోతుంది.. అప్పుడు తెలుస్తోంది నొప్పి .. వరల్డ్కప్ల లీగ్ దశ నుంచి ఇంటికి వెళ్లిపోతుంది’’ అని ఒకరు.. ‘‘90లలో టెస్ట్ ఫార్మాట్లో నెంబర్ వన్గా ఆసీస్ ప్రపంచకప్లు గెలవలేదా అని గుర్తుచేశారు.
Last Updated 4, Feb 2019, 1:07 PM IST
| 2sports
|
Hyderabad, First Published 5, Apr 2019, 4:04 PM IST
Highlights
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీని స్థాపించి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చిన పవన్ ఇప్పుడు ఒంటరిగా పోటీకి దిగుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీని స్థాపించి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చిన పవన్ ఇప్పుడు ఒంటరిగా పోటీకి దిగుతోంది. పార్టీ పెట్టినప్పటి నుండి పవన్ ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్లారు.
తన కుటుంబ సభ్యులు మాత్రం ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనలేదు. పవన్ కళ్యాణే మెగాహీరోలను దూరం పెట్టాడని వార్తలు వినిపించాయి. ఇది ఇలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత తన రెండో అన్నయ్య నాగబాబుని పార్టీలోకి ఆహ్వానించి నరసాపురం ఎంపీ టికెట్టు ఇచ్చారు.
ఈ క్రమంలో నాగబాబుతో పాటు ఆయన భార్య, కూతురు నీహారికలు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంఅలానే పవన్ పోటీకి దిగిన భీమవరం అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహించారు. తాజాగా నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొన్నాడు.
జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ తన తండ్రి నాగబాబు, బాబాయ్ పవన్ ల కోసం ప్రచారంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన కొత్త సినిమా పని మీద ఇటీవల అమెరికా వెళ్లిన వరుణ్ తేజ్ ఈరోజే తిరిగొచ్చారు. వచ్చీరాగానే ప్రచారంలో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంటోంది.
Last Updated 5, Apr 2019, 4:04 PM IST
| 0business
|
honor
హానర్8 లైట్
హైదరాబాద్, మే 15: హువేయి కంపెనీ స్మార్ట్ఫోన్ హానర్8 సిరీస్ బ్రాండ్ కొత్త ఫోన్లైట్ను విడుదల చేసింది. హానర్8 ఆల్గ్లాస్ డిజైన్కు భావితరం డిజైన్ తో తయారుచేసింది. హానర్8 ఆండ్రాయిడ్ 7.0 ఐఎంయుఐ 5.0తో లభిస్తుంది. ఆప్డేట్తో ఔట్ఆఫ్ బాక్స్ మొద టి ఉపకరణంగా హువే వారి హానర్ రూపంలో అందుబాటుకు తెచ్చింది. ఆండ్రాయిడ్ 7.0ను మరింత చేరువ చేసేందుకు ఐఎం యుఐ 5.0ను డిజైన్ చేసింది. హానర్ 8లైట్లో 3000 ఎంఎహెచ్ బ్యాటరీ 650 డబ్ల్యు హెచ్ఎల్ శక్తితో పనిచేస్తుంది.4జిబి రామ్, 64జిబి అంతర్గత మెమరీ తో 3డిగేమ్స్ వీడియో లనుఏకకాలంలో వినియో గించుకునే అవకాశం ఉంది. 12ఎంపి కెమేరా/ 8ఎంపి కెమేరా శక్తివం తమైన చిత్రాలు అంది స్తాయి. 5.2 అంగుళాల ఎఫ్హెచ్డి స్క్రీన్ స్పష్టమైన చిత్రాలు చూపిస్తుంది. హానర్ భాగస్వామ్య స్టోర్లలో రూ.17,999లకు లభిస్తున్నది. ఇన్లైన్కాల్ బటన్, స్టాండర్డ్ యుఎస్బి నుంచి మైక్రో యుఎస్బి కేబుల్ పారదర్శకబ్యాక్కవర్లు ఉంటాయని వెల్లడించింది. హానర్ 15నెలల సర్వీస్ వారంటీతో వస్తోంది.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త ‘ఇన్కమ్ ట్యాక్స్’ రూల్స్..!
మీరు పన్ను చెల్లిస్తున్నారా? అయితే మీరు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ 1 నుంచి ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించిన దాదాపు 7 నిబంధనలు మారాయి. అవేంటో ముందుగానే తెలుసుకుంటే మంచిది.
Samayam Telugu | Updated:
Sep 2, 2019, 03:20PM IST
హైలైట్స్
పన్ను చెల్లింపుదారులు తప్పక తెలుసుకోవలసిన అంశాలు
సెప్టెంబర్ 1 నుంచి పలు మార్పులు
టీడీఎస్, క్యాష్ విత్డ్రా వంటి అంశాల్లో కొత్త రూల్స్
పాన్ ఆధార్ లింక్ గడువు పూర్తి.. అనుసంధానం చేసుకోకపోతే కొత్త పాన్ కార్డులు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. సెప్టెంబర్ 1 నుంచి పలు అంశాలు మారాయి. సాధారణంగా ట్యాక్స్ సంబంధిత మార్పులు బడ్జెట్లో ప్రతిపాదిస్తారు. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. అయితే ఈసారి బడ్జెట్ను ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టడంతో సెప్టెంబర్ 1 నుంచి మార్పులు అమలులోకి వచ్చాయి.
క్యాష్ విత్డ్రాయెల్స్ దగ్గరి నుంచి పాన్-ఆధార్ లింక్ వరకు పలు అంశాలు మారాయి. అవేంటో చూద్దాం..
✺ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ కస్టమర్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి లేదా ఆపైన డబ్బుల్ని విత్డ్రా చేసుకుంటే.. 2 శాతం టీడీఎస్ చెల్లించాలి.
✺ స్థిరాస్థి కొనుగోలు సమయంలో.. కార్ పార్కింగ్ ఫీజు, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ ఫెసిలిటీ పీజు, క్లబ్ మెంబర్సిప్ ఫీజు, మెయింటెనెన్స్ ఫీజు, అడ్వాన్స్ ఫీజు వంటి వాటిని కూడా ఇకపై ప్రాపర్టీ కొనుగోలు మొత్తం కిందకే చూపించాలి. ప్రాపర్టీ పేమెంట్ చెల్లింపు సమయంలోనే వీటికి సంబంధించి టీడీఎస్ కట్ అవుతుంది.
✺ ఒక ఆర్థిక సంవత్సరంలో కాంట్రాక్టర్ లేదా ప్రొఫెషనల్ రూ.50 లక్షల విలువైన చెల్లింపులు స్వీకరిస్తే.. 5 శాతం టీడీఎస్ డిడక్ట్ అవుతుంది.
Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి 7 కొత్త రూల్స్!
✺ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీ మొత్తంపై ఇక 5 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఇది వరకు మెచ్యూరిటీ మొత్తంపై 1 శాతం టీడీఎస్ ఉండేది. ఉదాహరణకు మీ పాలసీ ప్రీమియం విలువ రూ.లక్ష అయితే అప్పుడు బీమా మొత్తం కనీసం రూ.10 లక్షలు ఉండాలి. సెక్షన్ 10(10)డీ కింద అప్పుడు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఒకవేళ ఈ సెక్షన్ కింద మినహాయింపు లేకపోతే 1 శాతం బదులుగా 5 శాతం టీడీఎస్ కట్ అవుతుంది.
Also Read: SBI అదిరిపోయే శుభవార్త.. ఆ తగ్గింపు నిర్ణయం అమలులోకి!
✺ పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకొని ఉండకపోతే మీ పాన్ కార్డులు పనిచేయవు. మళ్లీ కొత్త పాన్ కార్డులు తీసుకోవలసి రావొచ్చు.
✺ ఆధార్, పాన్ ఇంటర్ఛేంజబిలిటీ సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కు ఆధార్ లేదా పాన్ కార్డు ఏదో ఒకదాన్ని ఉపయోగించొచ్చు. పాన్ కార్డు వారు ఆధార్తోనే ఐటీఆర్ సమర్పించొచ్చు. అలాగే పాన్ అవసరం అయిన ప్రతి చోటా ఆధార్ ఉపయోగించొచ్చు.
✺ బ్యాంకులు ఇప్పటిదాకా రూ.50,000, ఆపైన లావాదేవీల వివరాలను స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ (ఎస్ఎఫ్టీ) రూపంలో ఆదాయపు పన్ను శాఖకు అందజేసేది. కేంద్రం ఇప్పుడు ఈ పరిమితిని తొలగించింది. అంటే చిన్న మొత్తంలోని లావాదేవీలను కూడా బ్యాంకులు ఇకపై ఐటీ డిపార్ట్మెంట్కు తెలియజేయాల్సి ఉంటుంది.
| 1entertainment
|
సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో ఇమ్రాన్ కీలుబొమ్మ
Mohammad Kaif-imran khan
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై భారత క్రికెటర్ల విమర్శలు కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం(యూఎన్జీఏ)లో ఇమ్రాన్ చేసిన ప్రసంగంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మాజీ సారథి సౌరవ్ గంగూలీ వంటివారు మండిపడ్డారు. తాజాగా, మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా వారి సరసన చేరాడు. గొప్ప క్రికెటర్గా పేరు సంపాదించుకున్న ఇమ్రాన్ఖాన్ ఇప్పుడు పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారారని ఎద్దేవా చేశాడు. పాకిస్థాన్ ఉగ్రవాదుల తయారీ కార్ఖానాగా మారిందని ఆరోపించాడు. ఉగ్రవాదుల విషయంలో పాక్ తీసుకోవాల్సిన చర్యలు చాలానే ఉన్నాయని కైఫ్ అభిప్రాయపడ్డాడు. యూఎన్జీఏలో ఇమ్రాన్ చేసిన ప్రసంగం వింటే ఆటగాడి నుంచి పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతిల్లో ఇమ్రాన్ కీలుబొమ్మగా ఎలా మారిందీ అర్థమవుతుందని కైఫ్ పేర్కొన్నాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telengana/
| 2sports
|
Hyderabad, First Published 11, Sep 2019, 10:45 AM IST
Highlights
తమిళ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం `బిగిల్`( విజిల్ అనే అర్థం) కూడా దీపావళి రిలీజ్ కు రెడీ అవుతోంది. అట్లీ దర్శకుడు. ఎ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కల్పాతి ఎస్.అఘోరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
పండగ సీజన్ లో సినిమాలు రిలీజ్ లు పెట్టుకుంటే కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. శెలవులు సినిమాకు కలిసొస్తాయి. టాక్ కు సంభంధం లేకుండా థియోటర్స్ హౌస్ ఫుల్స్ అవుతాయి. మొన్న సాహో చిత్రం కూడా వినాయిక చవతి శెలవులను క్యాషష్ చేసుకుంది. అదే మాదిరిగా దీపావళి రోజున సినిమాలు రిలీజ్ చేయటానికి సినిమావాళ్లు ఉత్సాహపడుతున్నారు. తెలుగులో వెంకీ మామ సినిమాని దీపావళికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అనుకోని విధంగా వెంకీ మామకు తమిళ హీరో విజయ్ నుంచి సమస్య ఎదురు అవుతోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం `బిగిల్`( విజిల్ అనే అర్థం) కూడా దీపావళి రిలీజ్ కు రెడీ అవుతోంది. అట్లీ దర్శకుడు. ఎ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కల్పాతి ఎస్.అఘోరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రెండు పాత్రల్లో ఒకటి గ్యాంగ్స్టర్ పాత్ర అయితే.. మరొకటి ఫుట్బాల్ ప్లేయర్ పాత్రట. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తున్నారు.
విజయ్ కు తెలుగులో కూడా చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. ఆయన గత చిత్రం మెర్సల్ ...తెలుగులో అదిరింది టైటిల్ తో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. `తెరి`, `మెర్సల్` చిత్రాల తర్వాత విజయ్ ,అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో `బిగిల్` సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు.
దాంతో వెంకీ మామ టీమ్ ఇప్పుడు ఆలోచనలో పడిందిట. ధైర్యం చేసి విజయ్ సినిమాపై వేద్దామా అంటే థియోటర్స్ సమస్య ఇద్దరికీ వస్తుంది. ఇద్దరూ థియోటర్స్ పంచుకోవాలి. అయితే సురేష్ ప్రొడక్షన్స్ సొంత సినిమా కాబట్టి మంచి థియోటర్స్ అన్ని వెంకీ మామకే దక్కుతాయనటంలో సందేహం లేదు. విజయ్ సినిమాని వాయిదా వెయ్యాలంటే తమిళంలోనూ రిలీజ్ డేట్ మార్చాలి. అది జరిగే పని కాదు. కాబట్టి తెలుగువాళ్లకు ఒకే రోజు రెండు సినిమాలు పండగ గా ఈ దీపావళి మారనుంది.
Last Updated 11, Sep 2019, 10:47 AM IST
| 0business
|
ఎర్రమట్టి కోర్టుకు అలవాటు పడేందుకు
యూరప్లో కొన్ని వారాలు గడిపా : సానియా
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఓపెన్లో పోటీలు క్లేకోర్టులో జరుగుతాయని, ఎర్రమట్టి కోర్టుకు అలవాటు పడేందుకు యూరప్లో కొన్ని వారాలు గడిపానని భారత్ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలిపారు. ఇది నా ఫేవరెట్ కోర్డు కాదని, కొత్త సహచరి యరోస్లావా స్వెదోవాతో బరిలోకి దిగుతున్నందున ప్రాక్టీస్లో బిజీ అయిపోయానన్నారు. ఒక కొత్త జోడీగా మేమిద్దరం ఒప్పటికే మంచి విజయాలు సాధించామన్నారు. కానీ అనూహ్యమైన ఓటమి మమ్మల్ని మరింత కష్టపడేలా చేసిందన్నారు. ఇప్పుడు మేం మా బలాలు ఏమిటో తెలుసుకుంటున్నామన్నారు. అది మాకు ఫ్రెంచ్ ఓపెన్లో ఉపయోగపడుతుందన్నారు. స్వావాకు నాకు ఎన్నోఏళ్ల అనుబంధం ఉందన్నారు. 2007లో బెంగుళూరు ఓపెన్ సెమీస్లో ఆమె నన్ను ఓడించి తొలి డబ్ల్యుటిఏ సింగిల్స్ టైటిల్ నెగ్గిందన్నారు. కానీ, ఆతర్వాత ఏడాది వింబుల్డన్లో ప్రతీకారం తీర్చుకున్నానన్నారు. డబుల్స్లోనూ ఇద్దరం చాలా సార్లు ప్రత్యర్థులుగా పోటీ పడ్డామన్నారు. మార్టినా హింగీస్తో కలిసి 2015 యూఎస్ ఓపెన్ డబుల్స్ ఫైనల్లో ష్వెదోవా- డెలాక్వాను ఓడించి టైటిల్ సాధించానన్నారు. కానీ, గతేడాది వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో ష్వెదోవా మాకు చెక్ పెట్టిందన్నారు. అలాగే ష్వెదోవాతో కలిసి 2011లో కొంతకాలం ఆడానన్నారు. అప్పుడు మేం వాషింగ్టన్ డబ్ల్యుటిఎ టైటిల్ నెగ్గాం కానీ, అది జరిగి ఇప్పుడు ఎన్నో ఏళ్లు అయినట్లు అనిపిస్తుందన్నారు. గ్రాస్ కోర్టు ష్వెదోవా ఫేవరెట్. అందువల్ల సహజంగానే వింబుల్డన్లో మాకు ఎక్కువ అవకాశాలుంటాయి. కానీ, వ్యక్తిగతంగా మేమిద్దరం క్లే కోర్టులోనూ చెప్పుకొకే విజయాలు సాధించామ న్నారు. వేర్వేరు సహచరులతో ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచామన్నారు. రోలాండ్ గారోస్ ఎర్ర మట్టిలో మేం మరింత ముందుకెళ్లాలంటే కొంత అదృష్టం కూడా అవసరమని భావిస్తు న్నామన్నారు.
| 2sports
|
internet vaartha 717 Views
జలంధర్ : దేశంలోని మొట్టమొదటి చిన్న ఫైనాన్స్బ్యాంకు ప్రారంభం అయింది. క్యాపిటల్ స్మాల్ఫైనాన్స్ బ్యాంకు పంజాబ్లో పదిశాఖలు ప్రారంభిస్తుందని, 2017లో మరో తొమ్మిదిశాఖలు జో డిస్తుందని బ్యాంకు ప్రకటించింది. జలంధర్కేంద్రంగా ఉన్న ఈబ్యాంకు ఇప్పటివరకూ కేపిటల్ లోకల్ ఏరియా బ్యాంకుగా 2000సంవత్సరం నుంచి పనిచేస్తోంది. పంజాబ్లోని ఐదుజిల్లాల్లో 47శాఖలతో పనిచేస్తోంది. రిజర్వుబ్యాంకు అనుమతులిచ్చిన పదిసంస్థల్లో ఈబ్యాంకు కూడా ఒకటి. ఆర్బిఐ రీజినల్ డైరెక్టర్నిర్మల్చంద్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ఇదొక చారిత్రకఘట్టం అని పేర్కొన్నారు. చిన్న ఫైనాన్స్బ్యాంకులు బ్యాంకింగ్ వ్యవస్థకురావడం మంచి పరిణామంగా చెప్పారు. ప్రాంతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఇతర చిన్న సంస్థలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభు త్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో భారీ దిగ్గజాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. నిర్మల్చాంద్ మాట్లాడుతూ లక్ష జనాభాకు ఏడు శాఖలు మాత్ర మే ఉన్నాయని అభివృద్ధి చెందిన దేశాల్లో లక్ష జనాభాకు 40శాఖలు పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటికీ బ్యాంకుఖాతాలేని వారికి ఈబ్యాంకు లు సేవలందిస్తాయి. మొత్తం 90 శాతం మైక్రోస్మాల్ బిజినెస్సంస్థలు చేతుల్లో ఈ వర్గాలు నడుస్తున్నాయి. అందువల్లనే బ్యాంకింగ్ సేవలు వీరికి చేరువచేసేందుకు ఈ విధానం అనుసరిస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు కూడా ఈ సంస్థలు సహకరిస్తాయన్నారు. బ్యాంకు ఎండి సర్వజిత్సింగ్ సామ్రా మాట్లాడుతూ స్థానిక ఏరియా బ్యాంకునుంచి చిన్న ఫైనాన్స్ బ్యాంకుగా మారిం దని, విస్తరణకు భౌగోళిక హద్దులు లేవన్నారు. బ్యాంకు వ్యాపారం నాలుగురెట్లు పెరిగిందన్నారు. మూడువేల కోట్లనుంచి 12 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులు కనీసం 25లక్షలలోబడి మాత్రమే రుణాలిస్తున్నాయని, కేపిటల్ బ్యాంకు మాత్రం 60శాతం రుణాలి స్తుందన్నారు. బ్యాంకుప్రాధాన్యతారంగాలకు కూడా రుణాలిస్తుందని, అడ్వాన్సుల్లో 79శాతం ఈ రంగం లోనే ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారంలోని ఏడురోజులు కూడా పనిచేస్తుందని, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్బ్యాంకు తన లక్ష్యాలను వ్యూహాత్మకంగా సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు.
| 1entertainment
|
May 03,2017
అద్యంతం ఊగిసలాటలో మార్కెట్లు
ముంబయి: వివిధ పరిణామాల మధ్య మంగళవారం మార్కెట్లు రోజంతా ఊగిసలాటలో నమోదయ్యాయి. తుదకు ఎన్ఎస్ఈ నిఫ్టీ 9.75 పాయింట్లు పెరిగి 9,313.80 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2.78 పాయింట్లు పెరిగి 29,921 వద్ద ముగిసింది. ఉదయం 30,021 వద్ద మొదలైన రోజంతా ఒడిదుడుకులకు గురై ఓ దశలో 30,069 గరిష్ట స్థాయిలో మరో దశలో 29,804 కనిష్ట స్థాయి వద్ద ట్రేడింగ్ అయ్యింది. బీఎస్ఈలో రంగాల వారిగా రియాల్టీ సూచీ అత్యధికంగా 1.99 శాతం పెరిగింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
దుబాయ్ టెస్టులో పాక్కు చుక్కలు చూపించిన విండీస్!
పాకిస్థాన్ జట్టు 400వ టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది. కానీ విండీస్ ఆటగాళ్ల పోరాటంతో చివరి దాకా ఓటమి భయంతో బిక్కచచ్చింది.
TNN | Updated:
Oct 18, 2016, 01:08PM IST
దుబాయ్ టెస్టులో పాక్కు చుక్కలు చూపించిన విండీస్!
దుబాయ్‌లో పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో నెగ్గిన పాక్ ఊపిరి పీల్చుకుంది. క్రికెట్ చరిత్రలోనే రెండో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ అయిన ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 579/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు ఓపెనర్ అజహర్ అలీ ట్రిపుల్ సెంచరీ సాధించి డై అండ్ నైట్ టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీయన్‌గా రికార్డు నెలకొల్పాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ బ్యాట్స్‌మెన్ బాగానే పోరాడారు. బ్రావో 87 పరుగులు, శామ్యూల్స్ 76 పరుగులు చేయడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 357 పరుగులు చేయగలిగింది. అదే సమయంలో పాక్ స్పిన్నర్ యాసిర్ షా ఐదు వికెట్లు తీసి 17 టెస్టుల్లోనే వంద వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్‌(18 టెస్టుల్లో 100 వికెట్లు)ను వెనక్కి నెట్టాడు.
Visit Site
Recommended byColombia
తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌కు 222 పరుగుల భారీ ఆధిక్యం ఉండటంతో ఇప్పటి వరకూ మ్యాచ్‌లో ఆ జట్టే పై చేయి సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటింగ్‌కు దిగడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. విండీస్ బౌలర్ దేవేంద్ర బిషు 8 వికెట్లతో చెలరేగిపోయాడు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో 579 పరుగులు చేసిన పాకిస్థానీ బ్యాట్స్‌మెన్ మలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులకే చాప చుట్టేశారు. ఆసియా గడ్డ మీద అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన ఆసియేతర వ్యక్తిగా బిషూ రికార్డులకెక్కాడు. టెస్టుల్లో బిషూకి ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ బ్యాట్స్‌మెన్ అసాధారణంతా పోరాడారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాక్‌కు విజయానికి సరిపడా పరుగులు లభించాయి. ఆట చివరి రోజుకు వచ్చేసరికి వెస్టిండీస్‌ గెలవాలంటే 251 పరుగులు అవసరం కాగా, పాక్ నెగ్గాలంటే 8 వికెట్లు కూల్చాల్సిన పరిస్థితి తలెత్తింది. అద్భుతంగా పోరాడిన బ్రావో 249 బంతులను ఎదుర్కొని 116 పరుగులు చేశాడు. బ్రావో అవుటయ్యే సమయానికి విండీస్‌కు మరో 83 పరుగులు అవసరం కాగా, పాక్‌కు మూడు వికెట్లు కావాలి. ఈ దశలోనూ కెప్టెన్ జాసన్ హోల్డర్ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌లలో ఇద్దరూ రనౌట్ కావడంతో విండీస్ 289 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ తన 400వ టెస్టులో 56 పరుగులతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. పాక్ నెగ్గినా.. విండీస్ తన పోరాటంతో ఆకట్టుకుంది.
బ్రావో కాసేపు నిలిచినా, చివరి ఇద్దరు బ్యాట్స్‌మెన్ రనౌట్ కాకుండా ఉన్నా మ్యాచ్ డ్రాగా ముగిసేదే. కానీ వెస్టిండీస్ బ్యాడ్‌లక్. పాక్‌కు దుబాయ్ గడ్డ మీద పదకొండు టెస్టుల్లో ఇది పదో విజయం కావడం విశేషం. పాక్‌లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తోన్న బస్సుపైకి ఉగ్రవాదులు దాడికి పాల్పడిన నాటి నుంచి ఏ దేశం కూడా పాక్‌లో క్రికెట్ ఆడేందుకు ముందుకు రావడం లేదు. దీంతో తటస్థ వేదిక అయిన దుబాయ్‌నే పాక్ తన హోం గ్రౌండ్‌గా మలుచుకుంది. విండీస్‌పై విజయంతో టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా మిస్బా 23 విజయాలతో గ్రేమ్ స్మిత్, క్లైవ్ లాయిడ్‌ల సరసన నిలిచాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
టీమ్లోకి ధోనీ రీఎంట్రీపై ముందే వచ్చిన లీక్లు..!
ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనున్న భారత్ .. ఆ తర్వాత జనవరి 23 నుంచి న్యూజిలాండ్తో ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఈ మొత్తం సిరీస్లకి జట్టుని సెలక్టర్లు ఈరోజే ప్రకటించేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో మెప్పించిన కృనాల్ పాండ్య.. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కి ఎంపికయ్యాడు. అతను తన సోదరుడు హార్దిక్ పాండ్యాతో కలిసి ఆ సిరీస్లో ఆడే అవకాశం ఉంది.
India’s squad for ODI series against Australia and New Zealand: Virat (Capt), Rohit (vc), KL Rahul, Shikhar, Rayudu… https://t.co/c6fXe7YlHk
— BCCI (@BCCI) 1545651491000
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో తలపడే భారత్ జట్టు ఇదే..!
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ
India’s squad for T20I series against New Zealand: Virat(Capt), Rohit (vc), KL Rahul, Shikhar Dhawan, Rishabh Pant,… https://t.co/0l7USfUOLS
— BCCI (@BCCI) 1545651505000
న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో తలపడే భారత్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Hyderabad, First Published 5, Aug 2019, 4:45 PM IST
Highlights
బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంటుంది. కానీ వెండితెరపై ఆమెకి సరైన గుర్తింపు మాత్రం రాలేదు. అందుకే డిజిటల్ రంగంలో తన సత్తా చాటాలని అనుకుంటోంది.
ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు సినిమాల కంటే వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. సెన్సార్ సమస్యలు లేకపోవడం.. చెప్పాలనుకున్న కథను యధాతథంగా తెరకెక్కించదానికి ఛాన్స్ ఉండడంతో ఎక్కువమంది దర్శకులు, నటీనటులు వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు.
కియారా అద్వానీ లాంటి తారలు కూడా డిజిటల్ మీడియాకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దశాబ్ద కాలంగా హీరోయిన్ గా వెలుగొందుతోన్న కాజల్ కూడా ఇప్పుడు డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తోంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయనున్న వెబ్ సిరీస్ లో కాజల్ నటించబోతుందని సమాచారం.
ఇప్పుడు యాంకర్ రష్మి కూడా వీరి బాటలోనే వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమవుతుందట. బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంటుంది. కానీ వెండితెరపై ఆమెకి సరైన గుర్తింపు మాత్రం రాలేదు. అందుకే డిజిటల్ రంగంలో తన సత్తా చాటాలని అనుకుంటోంది.
'ఎ ఫిలిం బై అరవింద్' చిత్ర దర్శకుడు శేఖర్ సూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ లో రష్మి నటించబోతుంది. ఈ వెబ్ సిరీస్కంటెంట్ ఆమెకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందులో సీనియర్ నటుడు శ్రీకాంత్, సత్యదేవ్ లాంటి నటులు కూడా కనిపించబోతున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ తో రష్మిఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి!
Last Updated 5, Aug 2019, 4:45 PM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
షారుఖ్ కోసం తొక్కిసలాట: ఒకరి మృతి
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ను చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట ఒకరు మృతి చెందిన ఘటన గుజరాత్లోని వడోదరలో చోటుచేసుకుంది.
TNN | Updated:
Jan 24, 2017, 11:37AM IST
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట ఒకరు మృతి చెందిన ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు రైల్వే పోలీసులు కూడా గాయపడ్డారు. తన తాజా సినిమా ‘రాయీస్’ ప్రమోషన్ కోసం షారుఖ్ సోమవారం సాయంత్రం ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సుమారు రాత్రి 10.30 గంటలకు రైలు వడోదర రైల్వేస్టేషన్‌‌కు చేరుకుంది. అప్పటికే షారుఖ్ కోసం వేచి చూస్తున్న అభిమానులు రైలు ప్లాట్‌ఫాం వద్దకు రాగానే ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
రైలు సుమారు 10 నిమిషాలు పాటు వడోదర స్టేషన్‌లో ఆగుతుంది. దీంతో షారుఖ్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. వారిని నియంత్రించేందుకు రైల్వే పోలీసులు లాఠీ చార్జీ కూడా చేసారు. ఇంతలో రైలు బయలుదేరడంతో అభిమానులు దాని వెంట పరుగులు తీసారు. దీంతో మరోసారి తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక ఫర్హీద్ ఖాన్ పఠాన్ అనే వ్యక్తి మరణించాడు. ఈయన స్థానిక రాజకీయ నాయకుడుని రైల్వే పోలీసులు గుర్తించారు.
| 0business
|
anchor sreemukhi army hulchal in social media, bigg boss season 3 mania starts
Sreemukhi Bigg Boss: శ్రీముఖి ఆర్మీ.. బిగ్ బాస్ స్టార్ట్ కాకుండానే మొదలైన రచ్చ
బిగ్ బాస్ సీజన్ 3 ఇంకా ప్రారంభం కాకుండానే ఆర్మీలు ఏర్పడిపోయాయి. గత సీజన్లో ‘కౌశల్ ఆర్మీ’, ‘గీతా మాధురి ఆర్మీ’, దీప్తి సునైనా ఆర్మీ ఇలా చాలా రకాల ఆర్మీలు సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే ఇప్పుడు శ్రీముఖి పేరుతో ఆర్మీలు హల్ చల్ చేస్తున్నాయి.
Samayam Telugu | Updated:
Jul 6, 2019, 09:03PM IST
దున్నపోతు ఈనింది అంటే.. కన్నె (తాడు) తీస్కురా.. కట్టేద్దాం అన్నాడట వెనకటికి ఎవడో. సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది ఈ ముచ్చట. గత రెండు సీజన్లుగా బుల్లి తెర ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్.. త్వరలో సీజన్ 3 ప్రారంభం కానుంది. హోస్ట్గా కింగ్ నాగార్జున వస్తుండటంతో బుల్లితెర ప్రేక్షకుల్లోనే కాకుండా వెండితెర ప్రేక్షకుల్లోనూ అమితాసక్తి ఏర్పడింది.
ఇక సీజన్ 2లో కంటెస్టెంట్స్ వీక్ అనే మైనెస్ను చెరిపేందుకు ఖతర్నాక్ లాంటి 14 మంది కంటెస్టెంట్స్ను బిగ్ బాస్ హౌస్లో దించబోతోంది స్టార్ మా. వీరు వంద రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఈ 14 మంది కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈ 14 మందిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు యాంకర్ శ్రీముఖి . ఇటీవల పటాస్ షోకి రాం రాం పాడేసిన ఈ బోల్డ్ యాంకర్.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యింది.
#SreemukhiArmy @SreemukhiA @MukhiSree #BiggBossTelugu3 #BiggBoss3Telugu #biggboss https://t.co/Qsrmi5SfSp
— SreemukhiArmy (@SreemukhiA) 1562313855000
భారీ శరీరాన్ని సగానికిపైగా తగ్గించుకుని నాజూకుగా మారిన శ్రీముఖి.. ఈ మేకోవర్ అంతా బిగ్ బాస్ కోసమే అంటూ బయట పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్లో శ్రీముఖి అనే వార్త హల్ చేస్తుండటంతో ఆమె పేరుతో అప్పుడే ఆర్మీలు కూడా ప్రారంభించేయడం కొసమెరుపు.
Welcome to #BiggBossTelugu3 #SreemukhiArmy already decided that @MukhiSree only the title winner for this year… https://t.co/c77RF9bNGn
— SreemukhiArmy (@SreemukhiA) 1561875594000
గత సీజన్లో సాధారణ సెలబ్రిటీగా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన కౌశల్ని సీజన్ 2 విన్నర్ని చేసింది ‘కౌశల్ ఆర్మీ’నే. కౌశల్కి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో షేర్ చేస్తూ కౌశల్కి ఫుల్ క్రేజ్ తీసుకువచ్చారు. మరో వైపు మిగతా సెలబ్రిటీల ఇమేజ్ని డ్యామేజ్ చేయడంలో పక్కా ప్లాన్ వర్కౌట్ చేసి సక్సెస్ అయ్యింది కౌశల్ ఆర్మీ. అయితే ఈ ఆర్మీ కోసం కౌశల్ అంతా ముందే సెట్ చేసుకుని బిగ్ బాస్ హౌస్కి వెళ్లారని.. ఆయన హౌస్కి వెళ్లిన తరువాత కౌశల్ భార్య నీలిమ ఆర్మీ బాధ్యతల్ని మోసారంటూ ప్రచారం నడించింది. ఇందులో వాస్తవం ఎంతన్నది ఎవరికీ తెలియదు కాని.. కౌశల్ బిగ్ బాస్ విన్నర్ కావడంతో ఈ ఆర్మీ కీలకం అయ్యిందన్నది వాస్తవం.
#BiggBossTelugu3 #sreemukhiArmy @SreemukhiA @MukhiSree https://t.co/OBxiERUnYA
— SreemukhiArmy (@SreemukhiA) 1562313767000
ఇప్పుడు ఇదే తరహాలో కొత్తగా సోషల్ మీడియాలో ‘శ్రీముఖి ఆర్మీ’ ఏర్పడింది. అసలు శ్రీముఖి బిగ్ బాస్ హౌస్లో వెళ్తుందా? లేదా? అన్న విషయంపై సందిగ్ధత వీడక ముందే ‘శ్రీముఖి ఆర్మీ’ ఏర్పడటం సోషల్ మీడియా హాట్ టాపిక్గా మారింది. ఈలెక్కన బిగ్ బాస్ హౌస్లో శ్రీముఖి హంగామా దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. అన్నట్టు.. శ్రీముఖి కోసం ఏకంగా యాభై లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చిందట స్టార్ మా. అందుకే తనకు ఎంతో క్రేజ్ తీసుకువచ్చిన పటాస్ షోని వదిలేసిందట శ్రీముఖి. వీటిలో వాస్తవం ఎంతన్నది జూలై 21 నాటికి తేలిపోనుంది. ఆరోజే బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
#SreemukhiArmy @MukhiSree https://t.co/7uBRMQQEVG
| 0business
|
డిజిటల్ చెల్లింపులకు హెల్ప్లైన్-14444
- నాస్కామ్, టెలికాం సంస్థలతో కలిసి ఏర్పాటు
-10 లక్షల పీవోఎస్ యంత్రాల దిగుమతి యోచన : చంద్రబాబు
న్యూఢిల్లీ: దేశంలో నగదురహిత లావాదేవీలను పెంపొందించే కార్యక్రమంలో భాగంగా సర్కారు పలు వినూత్న ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్ పేమెంట్లకు సంబంధించి సమస్యల పరిష్కారానికి గాను 14444 హెల్ప్లైన్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం నాస్కామ్, టెలికాం ఆపరేటర్లు, నితి ఆయోగ్లు కలిసి పని చేయనున్నాయి. డిజిటల్ పేమెంట్లపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ నాలుగో సమావేశంలో ఈ దిశగా సమాలోచనలు జరిగాయి. కమిటీ కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నగదు రహిత చెల్లింపులకు వెసులుబాటు కల్పించేందుకు గాను దాదాపు పది లక్షల 'విక్రయ కేంద్ర యంత్రాల'ను (పీవోఎస్) దిగుమతి చేసుకొనే యోచనలో ఉన్నట్టుగా ఆయన తెలిపారు. డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదులకు గాను '14444' హెల్ప్లైన్ను తీసుకువచ్చేందుకు గాను ఐటీ విభాగానికి చెందిన నాస్కామ్, టెలిఫోన్ ఆపరేటర్లు సర్కారు సమాలోచనలు జరుపుతోందని నిటి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింగ్ పనగారియా తెలిపారు. ఈ హెల్ప్లైన్ను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్టుగా వివరించారు. డిజిటల్ చెల్లింపుల విషయమై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ వచ్చే వారం తన మధ్యంతర నివేదకను ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించనున్నట్టు బాబు తెలిపారు. డిసెంబరు 31 తరువాత కూడా నగదురహిత లావాదేవీలకు ప్రోత్సహకాలు, రాయితీలు వర్తిస్తాయని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Recommended byColombia
247 ఎపిసోడ్లోని హైలెట్స్..
భరత్ తన ప్రేమని తెలిపేందుకు అమ్ముల్ని తీసుకుని వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లాడు. అక్కడికి ప్రేమికులు వస్తుంటారని, మనసులో కోరికలు నెరవేరతాయని తెలుసుకున్న భరత్.. అమ్ములు నడిచిన పసుపు పాదాల ముద్రలో నడవాలని ఆశపడతాడు. కానీ సడన్ ఎంట్రీ ఇచ్చిన అంకిత్.. ఆ ప్రయత్నాన్ని ఆపి.. అమ్ములు పాద ముద్రలో అడుగుపెట్టి.. ‘‘ఈ పాదంలో జతపడి నడిచే అర్హత నాకు మాత్రమే ఉందిరా’’ అంటాడు అంకిత్ అమ్ములు మీద ఉన్న గుండెలోతుల్లోని ప్రేమని బయటపెడుతూ. ‘‘ఆ పాదాలు ఎవరికి సొంతమవుతాయో దేవుడే నిర్ణయిస్తాడు’’ అంటాడు భరత్ నమ్మకంగా.. ‘‘చూద్దాం!’’ అని బదులిస్తాడు అంకిత్.
ఇలా వాళ్ల మధ్య మాట యుద్ధం జరిగిన తర్వాత.. అమ్ములు–భరత్ గుడి ప్రాంగణంలో ఓ చోట కూర్చుని ఉంటారు. అంకిత్ వాళ్లకి కొంత దూరంలో వాళ్ల మాటలను గమనిస్తూ ఉంటాడు. ‘‘ఇక్కడికి ఇంత మంది ప్రేమ జంటలు వస్తారని నేను అనుకోలేదు అమ్ములు’’ అంటూ.. ఆ పక్కనే లవర్స్ రంగులు పులుకోవడం చూపిస్తూ అంటాడు భరత్. మళ్లీ తనే మాట్లాడుతూ.. ‘‘అమ్ములు.. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఇలా అడగడంలో నాకు మరే ఉద్దేశం లేదు. కేవలం నీ మనసు తెలుసుకుందామని అడుగుతున్నా అంతే. చెప్పు అమ్ములు ప్రస్తుతం నీ మనసులో ఎవరున్నారు?’’ అని సూటిగా అడుగుతాడు. ఓ పెన్ తీసుకొచ్చి బొమ్మ గీసి చూపించడమంటాడు భరత్. దాంతో ఏ బొమ్మ గీస్తుందో కనిపించక అంకిత్ టెన్షన్ పడుతుంటాడు.
ఇంతలో అమ్ములు నవ్వుతూ తన తండ్రి సీనయ్య బొమ్మ గీసి చూపిస్తుంది భరత్కి. ‘‘నాకు తెలుసు అమ్ములు.. నీకు మీ నాన్న అంటే ఎంత ఇష్టమో!’’ అనడంతో ఆ మాట విన్న అంకిత్ ఊపిరి పీల్చుకుంటాడు సంతోషంగా. ‘‘సరే అమ్ములు.. మనం కూడా ఆ రంగులు రాసుకుందాం రా..! ఇక్కడ రంగులు పులుముకుంటే ఎన్ని జన్మలైనా కలిసే ఉంటారట’’ అని పిలుస్తాడు భరత్. ఆ మాటకి అంకిత్ టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో అమ్ములు భరత్తో.. ‘‘నేను రాను మీరు వెళ్లండి’’ అని సైగ చెయ్యడంతో అంకిత్ సంతోషపడతాడు. ‘‘అలా రంగులు రాసుకోకుండా వెళ్లకూడదంట అమ్ములూ.. అశుభం అట. పద వెళ్దాం’’ అని భరత్ ఒప్పిస్తాడు.
దాంతో అమ్ములు అక్కడ నుంచి దేవుడి ముందు ఉన్న రంగల దగ్గరకు నడుస్తుంది. భరత్.. అంకిత్ ఉన్న చోటికి వెళ్లి.. ‘‘చూడరా.. ఇప్పుడు అమ్ములుకి రంగులు రాసి నా ప్రేమని తెలుపుతాను’’ అంటూ వెళ్లిపోతాడు. అయోమయంలో ఉన్న అంకిత్ కూడా అక్కడికి వెళ్తుంటాడు. అలా వస్తున్న సమయంలో ఒక మహిళ అంకిత్కి తగలడంతో.. ఆమె చేతిలోని ఆయిల్ అంకిత్ కాలు మీద పడిపోతుంది. సారీ చెప్పి ఆమె వెళ్లిపోతుంది. తర్వాత అదే అయోమయంలో హోమగుండం పక్కనే నిలబడి కళ్లనిండా నీళ్లతో బాధగా అమ్ములు–భరత్లను చూస్తూ ఉంటాడు.
ఇంతలో అమ్ములు దేవుడి ముందు ఉన్న రంగులు తీసుకుని శ్రీకృష్ణుడి బుగ్గలకు రాస్తుంది. అమ్ములుకి రాయడానికి ఆమె దగ్గరకు భరత్ వస్తూ ఉంటాడు. ఇంతలో అంకిత్ కాళ్లకు మంట అంటుకుంటూ ఉంటుంది. అది గమనించుకునే స్థితిలో అతడి మనసు ఉండదు. ఇదే సమయంలో ఇద్దరు ప్రేమికుల కేరింతలు విని అమ్ములు తల తిప్పగా.. ఎదురుగా అంకిత్ ఉంటాడు. అంకిత్ కాలు కాలడం చూసిన అమ్ములు పరుగున వెళ్లి అక్కడ ఉన్న పసుపు రంగు దోసిటతో తీసుకుని వెళ్లి అంకిత్ కాళ్ల మీద వేసి మంట ఆరిపేస్తుంది. అది చూసి అంకిత్ వెర్రి నవ్వు నవ్వుతూ మనుషుల్లో లేనట్లుగా చూస్తూ ఉంటాడు. ఏమైంది? కాలుతుంటే చూసుకోవేంటి? అని సైగలతో అడుగుతూనే ఉంటుంది అమ్ములు. అయినా అంకిత్ చలనం లేకుండా చూస్తుంటే.. బుగ్గలపైన కొడుతూ.. ‘‘చూడు ఎలా కాలిందో?’’ అంటూ సైగలు చేస్తూనే ఉంటుంది. అదంతా భరత్ చూసి.. షాక్లో ఉంటాడు.
అంకిత్ ఆ ఆనందంలోనే ఇంటికి వస్తాడు. ‘‘కాలు ఎందుకు కాలింది? పసుపు ఎందుకు అయ్యింది’’ అని తల్లి నందిని, మరదలు సరయూ అడిగితే.. ‘‘దారిలో వస్తుంటే అగ్ని ప్రమాదం జరిగింది. వాళ్లని కాపాడుతుంటే నాకు కాలింది. వెంటనే పసుపు పెట్టారు’’ అని అబద్ధం చెప్పేస్తాడు. తర్వాత లక్కీకి అసలు నిజం చెబుతాడు. అది చాటుగా సరయూ వినేస్తుంది. లక్కీ, అంకిత్ల మీద ఇంకా కోపం పెంచుకుంటుంది. భరత్ తనలో తాను ఆలోచించుకుంటాడు. అమ్ములు అంకిత్ని కాపాడటం, ‘నీ దృష్టిలో నా స్థానం ఏంటి’ అని అమ్ముల్ని తను అడిగినప్పుడు దేవుడిని చూపించడం.. ఇదంతా తలుచుకుని.. ‘అంటే అమ్ములు మనసులో అంకిత్ ఉన్నాడు. అంకిత్ ఉన్నాడంటే.. నేను లేనట్లేగా’ అనుకుంటాడు. అయితే నేను తప్పుకుని.. వాళ్లని కలిపితే సరి అనుకుంటుండగా.. భరత్ అంతరాత్మ అడ్డుపడుతుంది. ‘‘ఏ నమ్మకంతో వాళ్లని కలపాలనుకుంటున్నావ్?’’ అంటూ ప్రశ్నిస్తుంది.
కమింగ్ అప్లో..
అమ్ములు వాళ్ల ప్రేమకు గుర్తుగా పెరుగుతున్న గులాబీ మొక్క ఉన్న కుండీని తీసుకెళ్లి అంకిత్ ముందు పాడేస్తుంది. దాంతో.. అంకిత్ ఆ గులాబీ మొక్కతో వాళ్ల ప్రేమ కబుర్లు చెబుతూ ఉంటాడు. కోపంగా అంకిత్ చెయ్యి పట్టుకున్న అమ్ములు.. ‘‘నీ ఉద్దేశం ఏంటి?’’ అని సైగలతో అడుగుతుంది. దాంతో నవ్వుతూ.. ‘‘నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్.. నీ మనసులో నేను ఉన్నాను’’ అంటూ ఉంటాడు. మరిన్ని వివరాలకు రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే. ‘మౌనరాగం’ కొనసాగుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Arjuna Award: అర్జున అవార్డుకి నలుగురు భారత క్రికెటర్ల పేర్లు సిఫారసు..!
భారత్ జట్టులోకి 2016లో ఆరంగేట్రం చేసిన జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా టీమ్లో తనదైన ముద్ర వేశాడు. ఇక 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన మహ్మద్ షమీ.. గత ఏడాది కాలంగా అత్యుత్తమ ప్రదర్శనతో జట్టు విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు.
Samayam Telugu | Updated:
Apr 27, 2019, 03:33PM IST
Arjuna Award: అర్జున అవార్డుకి నలుగురు భారత క్రికెటర్ల పేర్లు సిఫారసు..!
హైలైట్స్
అర్జున అవార్డుకి బుమ్రా, షమీ, జడేజా, పూనమ్ పేర్లు సిఫారసు
ప్రపంచకప్ జట్టులోకి ఎంపికైన ముగ్గురు క్రికెటర్లకీ చోటు
గత ఏడాది అర్జున అవార్డుని దక్కించుకున్న స్మృతి మంధాన
మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ మొదలు
క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికిచ్చే ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈరోజు నలుగురు క్రికెటర్ల పేర్లని సిఫారసు చేసింది. ఈ జాబితాలో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ షమీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు మహిళల క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్కి కూడా చోటు లభించింది. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఏటా క్రీడాకారుల్ని ఈ అర్జున అవార్డుతో సత్కరిస్తుండగా.. 2018లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధానాకి ‘అర్జున’ పురస్కారం దక్కింది.
భారత్ జట్టులోకి 2016లో ఆరంగేట్రం చేసిన జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా టీమ్లో తనదైన ముద్ర వేశాడు. ఇక 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన మహ్మద్ షమీ.. గత ఏడాది కాలంగా అత్యుత్తమ ప్రదర్శనతో జట్టు విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా.. ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ జట్టు టెస్టు సిరీస్ గెలవడంలో షమీ పాత్ర కీలకం. ఈ ఇద్దరు బౌలర్లు మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభంకానున్న ప్రపంచకప్లో భారత్ జట్టుకి ప్రధాన బలమని ఇప్పటికే మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
టీమిండియాలోకి 2009లో అరంగేట్రం చేసిన రవీంద్ర జడేజా.. తొలుత స్పిన్నర్గా ఆ తర్వాత పరిపూర్ణమైన ఆల్రౌండర్గా జట్టులో కొనసాగుతున్నాడు. అన్నిటికంటే మించి.. భారత అగ్రశ్రేణి ఫీల్డర్గా ఇప్పటికే ఎన్నోసార్లు ప్రశంసలు అందుకున్నాడు. ఇక గత కొంతకాలంగా భారత మహిళల క్రికెట్ జట్టులో నిలకడగా రాణిస్తున్న పూనమ్ యాదవ్.. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ టాప్-10 బౌలర్గా కొనసాగుతోంది. అర్జున అవార్డు రేసులో నిలిచిన బుమ్రా, షమీ, జడేజా.. ఇటీవల ప్రపంచకప్ జట్టులోకి కూడా ఎంపికవడం విశేషం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అమెజాన్ ఇండియాలో 4వేల ఉద్యోగాలు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఈ మేరకు మరో ఏడు గిడ్డంగులను ఏర్పాటు చేయనుంది.
TNN | Updated:
May 2, 2017, 07:12PM IST
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఈ మేరకు మరో ఏడు గిడ్డంగులను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా నాలుగు వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 27 గిడ్డంగులను నిర్మించిన ఈ అమెరికన్ కంపెనీ తాజాగా మరో ఏడు గిడ్డంగులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఐదు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఏడాది జూన్ చివరి నాటికి మొత్తం 41 గిడ్డంగులను అందుబాటులోకి తెచ్చేలా అమెజాన్ ప్రయత్నిస్తోంది.
దేశీ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్టుకు గట్టి పోటీనిస్తున్న అమెజాన్.. దేశంలో తమ కంపెనీ మౌలికసదుపాయాలు, టెక్నాలజీ ప్లాట్‌ఫాంను విస్తృతం చేసుకునేందుకు అధికంగా నిధులు కేటాయిస్తోంది. ‘గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మా స్టోరేజ్ కెపాసిటీ రెండింతలు కానుంది. భారత్‌లో మా వ్యాపారం పుంజుకోవడానికి మౌలికసదుపాయాలను పెంచుకోవడం కోసం పెట్టుబడులు పెడతాం’ అని అమెజాన్ ఇండియా కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా వెల్లడించారు.
| 1entertainment
|
bse
రూ.4లక్షల కోట్లకు చేరిన మార్కెట్ విలువలు
ముంబయి, ఆగస్టు 18: ఐటిసి మార్కెట్ విలువలు భారీగాపెరిగాయి.జిఎస్టి అమలు వినియోగరంగ ఉత్పత్తుల కంపెనీలకు భారీగా కలిసొచ్చినట్లు తెలు స్తోంది. ఎన్ఎస్ఇలో ఐటిసి షేర్లు 354.8 రూపా యలుగా ట్రేడింగ్ జరిగింది. వీటితో మార్కెట్ విలువలు నాలుగు లక్షలకోట్లకు చేరుకుంది. మొత్తం 294 పాయింట్ల లబ్దితో బిఎస్ఇ సెన్సెక్స్ కూడా భారీగా పెరిగింది. ఐటిసి ఒక్కటే సెన్సెక్స్ 172 పాయింట్లు మద్దతునిచ్చింది. పన్ను వ్యూహం పరంగా సిగరెట్లపై జిఎస్టి తిరిగి కొంత పునః సమీక్ష చేయడం ఐటిసికి కలిసొచ్చింది. కంపెనీ బ్రాండెడ్ ప్యాకేజి ఫుడ్స్ను విక్రయిస్తున్నది. హోటల్స్, పేపర్బోర్డులు, వ్యవసాయ అనుబంద ఉత్పత్తులు ఉన్నాయి. ఇతర అన్ని రకాల వ్యాపా రాలను నిర్వహిస్తున్నది. మొత్తంగా ఐటిసి 62.7 శాతం టర్నోవర్ సిగరెట్లనుంచే పొందుతున్నది. పన్నుభారం సిగరెట్లపై తగ్గినపక్షంలో ద్వంద్వపన్ను ల విధానం తొలగింపుజరిగితే ఐటిసికి మరింతగా కలిసొస్తుంది. అంతకుముందు వ్యాట్ ఎంఆర్పిపై అదనంగా విధించేవారు. వీటితోపాటే ఎక్సైజ్సుం కం కూడా ఉండేది. ప్రస్తుతం వీటన్నింటితోను 5-6శాతం ధరలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోం ది.
ఇటీవలి ప్రభుత్వ నోటిఫికేషన్లో సిగరెట్లపై అదనపు సుంకం ఉంటుందనిప్రకటించింది. అయితే ఇప్పటివరకూ దానిపై స్పష్టతలేదు. జుపస్తుతం జాతీయ ప్రకృతి విపత్తులనిధిని వసూలు చేస్తు న్నారు. ఈ సుంకం అమలవుతుందా లేదా అన్న స్పష్టత కూడా లేదు. మోర్గాన్ స్టాన్లీ ప్రతినిధులు మాత్రం నాలుగుశాతం సిగరెట్లపై పన్నులు తగ్గింపు ఉంటుందని అంచనావేస్తున్నారు.అలాగేమరో రెండు శాతం ధరల సరళీకృతం ఉంటుందని అంచనా. సిగరెట్లపై ఎన్సిసిడి అంటే విపత్తులనిధి అమల య్యే అవకాశం లేదన్న అంచనాలున్నాయి. ఏడు శాతం సిగరెట్లపన్నుల్లోను, 3.5శాతం ధరల సరళీ కృత విధానంలోను సడలింపులు ఉన్నందున జిఎస్టి పరిధిలో సరపరా పరంగా కొంత పన్ను పెరుగుతుందని, ఐటిసి కూడా పంపిణీ మార్జిన్ సుమారు రెండు శాతం పాయింట్లు పెంచే అవకాశం లేకపోలేదని అంచనాలున్నాయి. మరోకొన్ని రోజుల్లో ఈ విపత్తులనిధి విధింపుపై స్పష్టత రాగల దన్న అంచనాలునానయి.
ప్రస్తుతం సిగరెట్లపై పన్ను విధానం కొంత తలనొప్పులు తెచ్చేదిగానే ఉంది. ఇన్వెస్టర్లు అంచనాలను చూస్తేప్రభుత్వం ఖచ్చితంగా సిగరెట్ల వినియోగంపై కఠినంగా ఉంద ని అందువల్ల పన్నులు మరింతపెంచే అవకాశం లేకపోలేదని వీటికితోడు అక్రమ సిటరెట్ల వ్యాపారం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. దీనివల్ల పన్నులరంగంలో సడలింపులు ఉంటే వసూళ్లు కూడా పెరుగుతాయన్న అంచనా లున్నాయి. ఆరోగ్యపరమైన ఆంక్షలపరంగా కంటే వ్యాపారపరంగా ఎదురవుతున్న సవాళ్లను కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి స్టాక్ ర్యాలీని చూస్తే మార్కెట్ నిపుణులు ఐటిసి స్టాక్పట్ల అప్ర మత్తంగా ఉండాలని సూచిస్తున్నా రు.
2017 కేలండర్ సంవత్సరంలో ఐటిసి 43శాతం లాభపడింది. బిఎస్ఇ సెన్సెక్స్ 17శాతం ర్యాలీ, 32శాతం బిఎస్ఇ ఎఫ్ఎంసిజి సూచి ర్యాలీతో పోలిస్తే భారీగా పెరుగుదల నమోదు చేసింది. ఇప్పటికిప్పుడు సిగరెట్లపై ప్రభు త్వం భారీగా పన్నులు విధించే అవకాశం లేదని, వీటికి తోడు ఐటిసి ఇతర గ్రూప్ వ్యాపారాలు కూడా అనుకున్నంత జోరు గా లేవని ఈక్వినామిక్స్ ఎండి జి.చొక్క లింగం వెల్లడించారు. మోర్గాన్ స్టాన్లీ అంచనాలనుచూస్తే ఐటిసి లక్ష్యనిర్దేశిత ధర రూ.310గా ఉంది. నోమురా లక్ష్యనిర్దేశిత ధర 14శాతం ఎగువవరకూ కొనుగోలు చేయవచ్చని చెపుతోంది. గతనెల 30వ తేదీనివేదికలో ఐటిసిని 311వద్ద కొనుగోలుచేయవచ్చని సూచించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద జిఎస్టీ అమలువల్ల ఎఫ్ఎం సిజిరంగానికి భారీగాలబ్దిజరుగుతునందన్నది ఐటిసి వంటి సంస్థల దూకుడును బట్టి స్పష్టం అవుతోంది.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మూడో టీ20లో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
శ్రీలంకతో ముంబయిలోని వాంఖడే స్డేడియంలో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్
TNN | Updated:
Dec 24, 2017, 06:41PM IST
మూడో టీ20లో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
శ్రీలంకతో ముంబయిలోని వాంఖడే స్డేడియంలో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ముగిసిన రెండు టీ20ల్లో ఘన విజయం సాధించి.. 2-0తో సిరీస్‌ని చేజిక్కించుకున్న భారత్.. చివరి టీ20లో కూడా గెలిచి లంకేయుల్ని క్లీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి గౌరవంగా సుదీర్ఘ సిరీస్‌ని ముగించాలని లంక ఆశిస్తోంది.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కుక్ ద్విశతకంతో యాషెస్కి ఊపొచ్చింది..!
ఏకపక్షంగా సాగిపోతున్న యాషెస్ సిరీస్కి ఊపొచ్చింది. ఇప్పటికే వరుగా మూడు టెస్టులు ఓడి ఆతిథ్య ఆస్ట్రేలియాకి సిరీస్ని చేజార్చుకున్న
TNN | Updated:
Dec 28, 2017, 12:20PM IST
కుక్ ద్విశతకంతో యాషెస్కి ఊపొచ్చింది..!
ఏకపక్షంగా సాగిపోతున్న యాషెస్ సిరీస్‌కి ఊపొచ్చింది. ఇప్పటికే వరుగా మూడు టెస్టులు ఓడి ఆతిథ్య ఆస్ట్రేలియాకి సిరీస్‌ని చేజార్చుకున్న ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో దుమ్మురేపుతోంది. ఓపెనర్ అలిస్టర్ కుక్ (226 నాటౌట్: 387 బంతుల్లో 23x4) డబుల్ సెంచరీ బాదడంతో ఆటలో మూడో రోజైన గురువారం మూడో సెషన్‌కి ఇంగ్లాండ్ 473/9తో నిలిచింది. అంతకముందు ఆస్ట్రేలియా జట్టు.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (103) శతకం సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకి ఆలౌటైంది. ప్రస్తుతం 146 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఇంగ్లాండ్ కొనసాగుతోంది.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ప్రపంచ కప్ కబడ్డీ: ఫైనల్స్ చేరిన భారత్
ప్రపంచ కప్ కబడ్డీ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది.
TNN | Updated:
Oct 22, 2016, 02:16AM IST
ప్రపంచ కప్ కబడ్డీ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం రాత్రి థాయ్ ల్యాండుతో జరిగిన సెమీఫైనల్స్ లో భారత్ 53 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్స్ కు అర్హత సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన నాటి నుండి భారత జట్టు అమేయమైన ప్రతిభ కనబరిచింది. అడుగడుగునా చక్కని ఆటతో ఆకట్టుకుంది. మన రైడర్లు, డిఫెండర్లు సమష్టి కృషితో భారత్ తొలి భాగాన్ని 36-8 పాయింట్లతో ముగించింది. ఆ తరువాత రెండో అంకంలో కూడా అలాగే ఆడి 73-20తో ఘన విజయం సాధించి ఫైనల్స్ చేరింది. భారత్ శనివారం జరిగే తుదిపోరులో ఇరాన్ జట్టుతో తలపడనుంది. ఫైనల్స్ లో అడుగుపెట్టిన భారత జట్టుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనల్స్ కు ఆల్ ది బెస్ట్ చెపుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
| 2sports
|
Suresh 126 Views gst
భారీగా నమోదు కానున్న జిఎస్టి రిటర్న్లు
హైదరాబాద్: ఒక్కసారిగా కేంద్రం ఆదాయం వృద్దిలోకి వచ్చింది.ఊహించినదానికంటే ఎక్కువ శాతం జిఎస్టి రూపంలో ఆదాయం సమకూర డంతో కేంద్రం ఆశాజనకంగా ముందుకు సాగు తుంది. గతం కంటే ఎంతో మెరుగైన విధంగా పన్ను వసూలు కాబడడుతుంది. జిఎస్టి ప్రవేశపెట్టిన తరవాత జులై మాసానికి దేశ వ్యాప్తంగా రిటర్న్సుపరుగులు పెడుతున్నాయి. కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగు తుండ టంతో కేంద్రం చేపట్టిన జిఎస్టి ప్రజల నుంచి మంచి స్పందన కనబడుతున్నట్లు పరిస్థితలు తెలియ జేస్తున్నాయి. జిఎస్టి సత్పలితాలను కలుగజేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ధీమాగా ముందుకు సాగు తుంది. ప్రస్తుతం ఆశాజనకంగానే జిఎస్టి రిటర్నులు దాఖలయ్యాయి.
భవిష్యత్తులో జిఎస్టి రిటర్నుల రూపంలో ఆదాయం మరింతగా సమ కూరనుంది.కాగా భవిష్యత్తులో జిఎస్టి కింద నమోదయ్యే పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతుందనీ,దీంతో పాటు పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయని కేంద్రం భావిస్తుంది. వాస్తవానికి బడ్జెట్ టార్గెట్ ప్రకారం,జులైలో పన్నుల వసూలు ఆశించినదానికంటే మెరుగ్గా వసూలైంది.91 కోట్లు ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా.కాగా దీనికంటే ఎక్కువగానే జిఎస్టి రిటర్నులు చ్చాయి.మొత్తం నూరు శాతం మంది పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ఫైల్ చేస్తే రాబడి ఇంకా పెరుగుతుందనే ఆశాభావం నెలకొనిఉంది.దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను ఎంతో ఆశాజనకమైన ఆరంభాన్ని ఇచ్చింది.
జిఎస్టి కింద ఇప్పటి వరకు 64 శాతం వసూలైంది.జిఎస్టి కింద మొత్తం 59.57 లక్షల మంది నమోదు చేసుకోగా వారిలో సుమారు 38.3 లక్షల మంది మాత్రమే పన్ను చెల్లించారు.వసూలైన మొత్తం పన్నులో సెంట్రల్ జిఎస్టి ద్వారా సుమారు 14.894,స్టేట్ జిఎస్టి ద్వారా సుమారు 22.722,ఇంటిగ్రేటెడ్ జిఎస్టి ద్వారా 47.469 కోట్లు వచ్చాయి.లగ్జరీ ఉత్ప త్తులు తదితర జాబితా ప్రకారం విధించే సెస్ను ద్వారాసుమారు 7,198 కోట్లు వసూ లైంది.ఇక పాత పద్దతి ద్వారా జిఎస్టికి మారిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 72.33 లక్షలు ఉంటుంది.అయితే లాంఛనాలన్నీ పూర్తి చేసి రిటర్న్సు దాఖలుకు సిద్దంగా ఉన్న వారు తాజా లెక్కలప్రకారం 59.57 లక్షలు.జిఎస్టి ఫైలింగ్లో జాప్యం చేస్తున్న వారి నుంచి రోజు 100 జరిమానా వసూలు చేయనున్నట్లు తెలిసిందే.
| 1entertainment
|
అంచనాలు మించిన టీసీఎస్
- ఏడాదిన్నర తర్వాత తొలిసారి..!
- క్యూ4లో లాభాల్లో 64% వృద్ధి
- 2015-16లో లక్ష కోట్లకు చేరిన రెవెన్యూ
ముంబయి : ఏడాదిన్నర తర్వాత తొలిసారి టీసీఎస్ మార్కెట్ వర్గాల అంచనాలను దాటి మెరుగైన ఆర్ధిక ఫలితాలను సాధించింది. దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ ఉత్పత్తుల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గత ఆర్ధిక సంవత్సరం జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో మార్కెట్ అంచనాలకు మించి లాభాల్లో 64.4 శాతం వృద్ధితో రూ.6341 కోట్లు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3,712.67 కోట్ల నికర లాభాలు నమోదు చేసుకుంది. క్రితం సెప్టెంబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన త్రైమాసికం లాభాలతో పోల్చితే క్యూ4 లాభాల్లో 5.42 శాతం పెరుగుదల నమోదయ్యింది. వరుసగా ఆరు త్రైమాసికాల తర్వాత నిపుణుల అంచనాలను చేరిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మార్చితో ముగిసిన ఏడాదిలో టిసిఎస్ తొలిసారి రూ.1 లక్షల కోట్ల రెవెన్యూను చేరిందని ఆ కంపెనీ ప్రకటించింది. సోమవారం ముంబయిలో టిసిఎస్ క్యూ4 ఫలితాలను ఆ సంస్థ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు.. తమ కీలక పోర్టుపోలియోలు బీఎఫ్ఎస్ఐ, రిటైల్, తయారీ రంగాలు మంచి ప్రగతిని కనబర్చాయని చంద్రశేఖరన్ అన్నారు. క్రితం జనవరి నుంచి మార్చితో ముగిసిన కాలంలో టిసిఎస్ కొత్తగా 22,576 మంది ఉద్యోగులను తీసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,53,843కు చేరిందని టిసిఎస్ హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ అజరు ముఖర్జీ తెలిపారు. విదేశాల్లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 90,000కు చేరిందన్నారు.
రెవెన్యూ
2015-16 క్యూ4లో టిసిఎస్ రెవెన్యూ 3.96 శాతం పెరిగి రూ.రూ.28,449 కోట్లకు చేరింది. 2015 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రూ.27,364.01 కోట్ల రెవెన్యూ నమోదు చేసుకుంది.
వ్యయం..
క్రితం క్యూ4లో కంపెనీ వ్యయం 4.64 శాతం పెరిగి రూ.21,068.54 కోట్లుగా నమోదయ్యింది. ఇంతక్రితం త్రైమాసికంలో రూ.20,409.14 కోట్లుగా ఉంది.
డివిడెండ్..
ఫలితాల సందర్బంగా టిసిఎస్ తుది డివిడెండ్ను ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేర్పై రూ.27 లేదా 2,700 శాతం డివిడెండ్ను అందించాలని నిర్ణయించింది. ఏదాది వార్షిక సాధారణ సమావేశం తర్వాత ఏడు రోజులకు ఈ డివిడెండ్ను చెల్లించనుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Aug 10,2018
ఐకియా స్టోర్ ప్రారంభం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైటెక్ సిటీ సమీపంలో దేశంలోనే మొట్టమొదటి ఐకియ పర్నిచర్ షోరూమ్న గురువారం ఆయన ప్రారంభించారు. ఐకియ ద్వారా దాదాపు 2వేల మందికి ప్రత్యక్షంగా, 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. భారతదేశంలో మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టాలని తమ లక్ష్యంకాగా.. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల మీద రూ.4,500 కోట్లు వెచ్చించామని ఐకియా భారత సీఈఓ పీటర్ బెట్జెల్ తెలిపారు. ఇందులో హైదరాబాద్ స్టోరు కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇంట్లో ఉపయోగపడే చిన్న వస్తువుల మొదలు.. గది అలంకరణ సామాగ్రి, ఫర్నిచర్ ఇలా దాదాపు 7,500వరకూ వస్తువులను ఈ స్టోరులో అందుబాటులో ఉంచామన్నారు. వంటగది, పడక గది, హాలు తదితరాల నమూనాలు కూడా చూడొచ్చని తెలిపారు. తాము విక్రయించే వస్తువుల్లో 20శాతం వరకూ ఇక్కడ తయారైనవే ఉంటాయనీ, మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. దీనికోసం స్థానిక తయారీదారులు, సరఫరాదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు.
స్టోర్ వద్ద తీవ్ర తోపులాట..
ఐకియా సంస్థ తన స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా వన్ ప్లస్ వన్ ఆఫర్ తో పాటు దాదాపు 1000 రకాల ఉత్పత్తుల ధర రూ.200 లోపు విక్రయి స్తున్నట్టుగా ప్రకటించడంతో ఆఫర్లను అందిపుచ్చుకొనేందుకు తొలిరోజే పెద్ద సంఖ్యలు వినియోగదారులు తరలి వచ్చారు. ఓకే సారి భారీ జనం తరలిరా వడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది అదుపుచేయలేక పోయారు. జనాలు బారికే ట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో స్టోర్ వద్ద తీవ్ర తోపులాట జరిగింది. కొంతసేపు స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. లోపులా టలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మహిళలూ ఉన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 6, Feb 2019, 4:38 PM IST
Highlights
బయోపిక్ తెరకెక్కుతోంది అంటే ఆ కథకు సంబందించిన వారి హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొన్న ఎన్టీఆర్ రిలీజైనప్పుడు చంద్రబాబు కూడా సినిమాపై ఓ లుక్కేశారు. ఇక నందమూరి హడావుడి ఏ రేంజ్ లో కనిపించిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ మాత్రం తన తండ్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమాపై కాస్త కూడా స్పందించడం లేదు.
బయోపిక్ తెరకెక్కుతోంది అంటే ఆ కథకు సంబందించిన వారి హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొన్న ఎన్టీఆర్ రిలీజైనప్పుడు చంద్రబాబు కూడా సినిమాపై ఓ లుక్కేశారు. ఇక నందమూరి హడావుడి ఏ రేంజ్ లో కనిపించిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ మాత్రం తన తండ్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమాపై కాస్త కూడా స్పందించడం లేదు.
రాజకీయాల్లో ఆయన బిజీగానే ఉండవచ్చు గాని కనీసం ఓ ట్వీట్ కూడా చేయడానికి తీరిక లేదా అని ఓ వర్గం వారు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాపై స్పందిస్తే ఎక్కడ తన పాలిటిక్స్ కి సినిమా రంగు అంటిస్తారో అని.. జగన్ స్పందించడం లేదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన యాత్ర ప్రీ రిలీజ్ కు జగన్ వస్తారని అంతా అనుకున్నారు. కానీ జగన్ ప్రస్తావన ఆ ఈవెంట్ లో బాగానే వచ్చింది గని ఆయన రాలేదు.
అయితే యాత్ర టీమ్ మాత్రం జగన్ నుంచి కొంచెం సపోర్ట్ వస్తే బావుంటుందని బాగానే ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ కావడానికి ఎంతో సమయం లేదు. శుక్రవారం భారీగా రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమాకు బజ్ మాత్రం పెద్దగా లేదు. మమ్ముంటికి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా బిజినెస్ లేదు. ప్రమోషన్స్ పెంచాల్సిన సమయంలో చిత్ర యూనిట్ చప్పుడు చేయడం లేదు.
సినిమాతో బిజినెస్ చేస్తున్న వారు జగన్ యాత్ర ప్రమోషన్స్ లో ఓ అడుగేస్తే సినిమాపై జనాల్లో ఆసక్తి పెరుగుతుందని అనుకుంటున్నారు. కానీ జగన్ ఇంతవరకు సినిమా గురించి కనీసం చిన్న మాట అయినా మాట్లాడలేదు. రాజకీయాల్లో భాగంగా ఆయన మద్దతుతోనే సినిమా వస్తోంది అనే కామెంట్స్ బాగానే వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో తెలియదు గాని జగన్ మాత్రం యాత్ర సినిమాపై కామెంట్ చేసేలా లేడని టాక్ వస్తోంది.. మరి సినిమా రిలీజ్ అనంతరం సినిమానైనా చూస్తారో లేదో..
Last Updated 6, Feb 2019, 4:38 PM IST
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన స్మిత్
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్ డ్వేన్ స్మిత్ ప్రకటించాడు.
TNN | Updated:
Mar 2, 2017, 01:22PM IST
వెస్టిండీస్ ఆటగాడు డ్వేన్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ సహా ఇతర టీ20 లీగ్‌లలో ఆడేస్తున్న ఈ విండీస్ క్రికెటర్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడుతున్నాడు. షార్జాలో కరాచీ కింగ్స్‌తో రెండో క్వాలిఫైయింగ్ ఫైనల్ ముందు 33 ఏళ్ల స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
2015 వరల్డ్ కప్‌లో చివరిసారిగా విండీస్ తరఫున ఆడిన స్మిత్.. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. 2003-04లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా స్మిత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అరంగేట్రం చేశాక రెండో ఇన్నింగ్స్‌లోనే సెంచరీతో నాటౌట్‌గా నిలిచి సత్తా చాటాడు. స్మిత్ చివరిసారిగా 2006లో టెస్టు క్రికెట్ ఆడాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో టాప్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా స్మిత్ నిలకడగా రాణించాడు. రెండు వరల్డ్ కప్‌లలో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2007 వరల్డ్ కప్‌లో విండీస్ తొందరగా ఇంటి ముఖం పట్టడంతో.. 2010 వరకూ అతడు జట్టులో చోటు కోల్పోయాడు. స్మిత్.. మూడు టీ20 వరల్డ్ కప్‌లు ఆడాడు. వెస్టిండీస్ టీ20 స్పెషలిస్టుగా పేరొందిన స్మిత్ 33 మ్యాచ్‌ల్లో 582 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
షారూక్ సినిమా షూటింగ్ ను అడ్డుకుంటాం - వీహెచ్పీ
అసహనంపై బాలీవుడ్ స్టార్ షారూక్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది.
TNN | Updated:
Feb 3, 2016, 03:38PM IST
షారూక్ సినియా ఘూటింగ్ నిలిపివేయాల్సిందే - వీహెచ్పీ
గుజరాత్: అసహనంపై బాలీవుడ్ స్టార్ షారూక్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వీహెచ్పీ ఆందోళన బాట పట్టింది. ఆందోళన కార్యక్రమంలో భాగంగా షారూక్ నటిస్తున్న రీజ్ సినిమా ఘటింగ్ అడ్డుకోవాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం 15 రోజుల పాటు కుట్చ్ , అహ్మదాబాద్ నగరాల్లో షారూక్ కొత్త సినిమాకు సంబంధించిన షూటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కుడ్చ్ జిల్లా కలెక్టర్ ను కలిసి ఘూటింగ్ నిలుపుదల చేయాలని బుధవారం వీహెచ్పీ నేతలు కోరారు. మరోవైపు నిరసన కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన వాల్ పోస్టర్లను వీహెచ్పీ కార్యకర్తలు దగ్ధం చేశారు. అసహనంపై భుజ్ జిల్లాలో షారూక్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని వీహెచ్పీ నేతలు ఆరోపిస్తున్నారు.
| 0business
|
RENAULT
50వేల రీనాల్ట్ క్విడ్ రీకాల్
ముంబై, అక్టోబరు 12: ఫ్రెంచ్ఆటోదిగ్గజం రీనాల్ట్ సుమారుగా 50 వేల యూనిట్ల క్విడ్చిన్నకార్లను వెనక్కు పిలుస్తోంది. ఇంధన వ్యవస్థలో లోపాలు తలెత్తడంతో గుర్తించిన కంపెనీ వెంటనే రీకాల్ చేస్తోంది. 800 సిసి క్విడ్చిన్నకార్లలో రీనాల్ట్ ఇండియా ఇప్పటికే స్వఛ్ఛందంగా తనిఖీలు నిర్వ హిస్తోంది. 2016 మే 18నుంచి అక్టోబరు నెల మధ్యలో ఉత్పత్తిచేసిన కార్లకే వీటి లోపాలు ఉన్నట్లు అంచనా. ఇంధన వ్యవస్థలో లోపాలు, హోస్క్లిప్ను జోడించడం వంటివి చేపట్టింది. హోస్క్లిప్ జోడించడం వల్ల ఇంధన వ్యవస్థలో లోపాలు తగ్గించినట్లవుతుందని కంపెనీ అంచ నా. కస్టమర్లకు ఎటువంటి రుసుంలేకుండా ఉచి తంగా ఈ మరమ్మతులు చేస్తామని అన్ని డీలర్ షిప్లవద్దకు తమతమ కార్లను తీసుకువస్తే తనిఖీ లు జరుగతాయని కంపెనీ ప్రకటించింది. రీకాల్ చేసిన పదిశాతం కార్లలో మాత్రమే ఈలోపాలు తలెత్తినట్లు తేలింది. గత ఏడాది సెప్టెంబరులో విడుదలచేసిన క్విడ్రీనాల్ట్ కంపెనీకిమంచి ఊతం ఇచ్చింది. 80-0 సిసి సెగ్మెంట్లో కారుధరలు 2.64లక్షలనుంచి 3.73లక్షలుగా ఉంది. ఆగస్టు లో 1000 సిసి ఇంజన్ వేరియంట్ను కూడా విడుదలచేసింది. ఢిల్లీ ఎక్స్షోరూంధరగా 3.95 లక్షలుగాఉంది. ఏప్రిల్,సెప్టెంబరునెలల్లో కంపెనీ 56,028 క్విడ్ చిన్నకార్లను విక్రయించింది.
| 1entertainment
|
Vaani Pushpa 142 Views Dream , ROHITH SHARMA , SEHWAG
Rohit sharma
విశాఖ: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఓపెనర్గా దిగి డకౌట్గా పెవిలియన్ చేరిన సందర్భంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్ధతుగా నిలిచాడు. రోహిత్కు ఓపెనర్గా సక్సెక్ కావడానికి సమయం పడుతుందని, అతను వీరేంద్ర సెహ్వాగ్ తరహా బ్యాట్స్మెన్ అంటూ కొనియాడాడు. ఇది రోహిత్కు మంచి బలాన్ని ఇచ్చినట్లు సఫారీలతో తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలతో మెరిశాడు. ఫలితంగా ఓపెనర్గా దిగిన తొలి టెస్టులోనే వరుస సెంచరీలు సాధించి ఏకైక బ్యాట్స్మెన్గా రోహిత్ నిలిచాడు. కాగా, రోహిత్ ప్రదర్శనపై సెహ్వాగ్ తాజాగా స్పందించాడు. తన అధికారిక ట్విటర్ అకౌంట్లో రోహిత్ను కొనియాడుతూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఇది రోహిత్కు అద్భుతమైన టెస్టు మ్యాచ్. టెస్టు క్రికెట్లో ఓపెనర్గా చేయాలన్న రోహిత్ కల నెరవేరింది. ఇక ముందు కూడా నీకు అంతా మంచి జరగాలి. ఇదొక భారత్ సాధించిన అతి గొప్ప విజయం. ఇందులో మయాంక్ అగర్వాల్, షమీ, అశ్విన్, పుజారాల ప్రాతినిథ్యం కూడా ఉందని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/sports/
| 2sports
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ
| 1entertainment
|
హోమ్ క్రీడలు కొత్త జెర్సీల్లో మెరిసిన భారత క్రికెటర్లు
కొత్త జెర్సీల్లో మెరిసిన భారత క్రికెటర్లు
August 22, 2019, 2:28 PM IST
Share on:
టెస్టు క్రికెట్లో ఐసిసి కొత్తగా అమలు చేస్తున్న నిబంధనల్లో భాగంగా భారత ఆటగాళ్లకు కొత్త జెర్సీలను కేటాయించారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా గురువారం భారత్వెస్టిండీస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఇక, ఐసిసి కొత్త నిబంధనల ప్రకారం జెర్సీలపై నంబర్లతో పాటు ఆటగాళ్ల పేర్లను ముద్రిస్తున్నారు. యాషెస్ సిరీస్తో దీనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే న్యూజిలాండ్, శ్రీలంక జట్లు కూడా ఈ విధానానికి తెరలేపాయి.
తాజాగా భారత్, విండీస్ జట్లు కూడా కొత్త జెర్సీలతో మెరువనున్నాయి. మొదటి టెస్టును పురస్కరించుకుని భారత క్రికెట్ బోర్డు క్రికెటర్ల కొత్త జెర్సీలను ఆవిష్కరించింది. తెల్లని జెర్సీల వెనక క్రికెటర్ల పేర్లు ముద్రించారు. వీటిని ధరించిన టీమిండియా క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఫొటో షూట్లో సరదాగా పాల్గొన్నారు.క్రికెటర్లు కొత్త జెర్సీల్లో దిగిన చిత్రాలను వెంటనే తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. సన్నాహక మ్యాచ్లోనే ఆటగాళ్లు కొందరు వీటిని ధరించినప్పటికీ ఫొటో షూట్ చేయలేదు. ఈసారి ఆటగాళ్లు దీనిలో పాల్గొన్నారు. కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రహానెతో సహా జట్టు సభ్యులందరూ ఫొటో షూట్లో పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వరుసగా రెండో అర్ధశతకం బాదిన శ్రేయాస్
శ్రీలంక జట్టుపై వన్డే సిరీస్లో భారత యువ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ వరుసగా రెండో అర్ధశతకం బాదేశాడు. విశాఖపట్నం
TNN | Updated:
Dec 17, 2017, 06:53PM IST
వరుసగా రెండో అర్ధశతకం బాదిన శ్రేయాస్
శ్రీలంక జట్టుపై వన్డే సిరీస్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ వరుసగా రెండో అర్ధశతకం బాదేశాడు. విశాఖపట్నం వేదికగా ఆదివారం జరుగుతున్న మూడో వన్డేలో కేవలం 44 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శ్రేయాస్ తన కెరీర్‌లో రెండో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో 216 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన భారత్ జట్టు 18 ఓవర్లు ముగిసే సమయానికి 109/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. శ్రేయాస్‌తో పాటు క్రీజులో ఓపెనర్ శిఖర్ ధావన్ (38: 39 బంతుల్లో 5x4) ఉన్నాడు.
| 2sports
|
డిజిటల్ ప్రకటనల దూకుడు..!
- రూ.7500 కోట్ల విలువ
- 2015తో పోల్చితే 40% వృద్ధి :పలు రిపోర్టుల వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్ వినియోగం విరివిగా పెరిగిపోవడంతో డిజిటల్ ప్రకటనలు కూడా దూసుకు వస్తున్నాయి. గతేడాది ఈ ప్రకటనల విలువ భారీ స్థాయిలో పెరిగింది. 2017 దీపావళి పండుగ సమయం కంటే ముందు నుంచి ఆన్లైన్ ప్రకటనలు అనుహ్యాంగా పెరిగాయని పలు రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. డిజిటల్ ప్లాట్ఫాంలపై ప్రకటనలు 36 శాతం మేర పెరిగాయని ఆడ్బై వెంచర్స్ సహ వ్యవస్థాపకులు సౌరవ్ పట్నాయక్ తెలిపారు. ప్రస్తుత ఏడాదిలో వీటి విలువ రూ.7,500 కోట్లకు చేరనుందని డిజిటల్ ఇన్ప్యూజన్ డైరెక్టర్ నితిన్ చౌదరీ అంచనా వేశారు. దేశంలోని మొత్తం ప్రకటనల్లో 14 శాతం డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ రంగం ఆక్రమించి ఉంది. కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో ఇది కీలకంగా మారింది. గతేడాది ఈపరిశ్రమ వంద కోట్ల డాలర్ల మైలు రాయిని దాటిందని ఐఎంఆర్బీ కంటర్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. భవిష్యత్తులో ఈప్రకటనలు మరింత జోరును ప్రదర్శించను న్నాయని బిజినెస్లైన్ ఒక కథనం ప్రచురించింది.
2016 ముగింపు నాటికి డిజిటల్ ప్రకటనల విలువ రూ.7300 కోట్లకు చేరింది. 2015 నాటి వ్యయంతో పోల్చితే 40శాతం వృద్ధి చోటు చేసుకుంది. 2017 డిసెం బర్ నెలలో అత్యధికంగా గూగుల్, మారుతి సుజుకి, అమె జాన్ ఫ్రైమ్ సంస్థలు డిజిటల్ ప్రకటనలకు అత్యధికంగా ఖర్చు చేశాయని పట్నాయక్ తెలిపారు. ప్రకటనలు, పబ్లిషర్స్, ఏజెన్సీలకు సంబంధించిన డేటా రిపోర్టులను యాడ్బై సమీకరిస్తుంది. ఈ సంస్థ బయోసైన్సెస్, ఇజ్రాయిల్ కంపెనీ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. డెస్క్టాప్, మొబైల్, వీడియోస్ వేదకల్లోని ప్రకటనలను విశ్లేషిస్తుంది. గత నెలలో గూగుల్ అతి పెద్ద డిజిటల్ ప్రకటనదారుగా నిలిచింది. ఈ కంపెనీ క్లౌడ్ సేవలకు సంబంధించిన జీ సూట్ను ప్రచారం చేసింది. అదే విధంగా గూగుల్ రూపొందించిన ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ పిక్సల్2ను ప్రమోట్ చేసింది. కాగా అమెజాన్ అత్యధికంగా ప్రైమ్ వీడియోస్కు వ్యయం చేసిందని యాడ్బై డాటా తెలిపింది. మారుతి సుజుకి తన డిజైర్, సెలెరియో ఎక్స్ సెడన్ కార్ల ప్రచారాన్ని ఎక్కువగా నిర్వహించింది.
ప్రకటనలకు మొబైల్ రంగం భిన్నమైన వేదికగా అవత రించింది. ఈ సెగ్మెంట్ డిజిటల్ ప్రకటనల్లో ఆస్ట్రేలియా టూరిజం అగ్రస్థానంలో నిలిచిందని యాడ్బై పేర్కొంది. అదే విధంగా అమెజాన్ రెండో స్థానంలో ఉంది. మూడు స్థానంలో అత్యధికంగా డ్రీమ్11, ఫాంటసీ క్రికెట్ గేమ్స్ ప్రకటనలు ఎక్కువగా వచ్చాయి. ఇతర దేశాల డిజిటల్ ప్రకటనలతో పోల్చితే అమెరికా తర్వాత భారత్ నిలిచింది. ఇమార్కెటర్స్ రిపోర్టు ప్రకారం 2018లో అమెరికాలో డిజిటల్ డిస్ప్లే యాడ్స్ విలువ 48 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. భారత్లో 2017 తొలి త్రైమాసికం వీడియో ప్రకటనల్లో 60 శాతం పెరుగుదల ఉందని ఇన్మొబీ రిపోర్టు పేర్కొంది. డిజిటల్ ప్రకటనల కోసం ప్రతీ రోజు 2.5 క్వింటాలియన్ బైట్ల డేటా ఖర్చు అవుతుం దని అంచనా. సీఐఐ, కెేపీఎంజీ రిపోర్టు ప్రకారం 2020 నాటికి భారత డిజిటల్ ప్రకటనల విలువ రూ.25వేల కోట్ల (4బిలియన్ డాలర్ల)కు చేరనుంది. డిజిటల్ ప్రకటనల్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా, ప్రొగ్రమెటిక్ అడ్వర్టయిజింగ్ కీలక పాత్రను పోషించనున్నాయని విశ్లేషించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
రాజకీయాల నేపథ్యంలో మణిరత్నం సినిమా
టైటిల్ రిజిస్టర్ చేయించిన దర్శకుడు
సంగీతం సమకూర్చనున్న ఏఆర్ రెహమాన్
దక్షిణాదిన ప్రఖ్యాత దర్శకుల్లో మణిరత్నం ఒకరు. చిన్న కథనైనా సరే..తన మేకింగ్ ద్వారా అద్భుతంగా తెరకెక్కించడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. అందుకే ఆయన చిత్రాలకు ప్రేక్షకులు ఇప్పటికీ నీరాజనం పలుకుతుంటారు. ప్రస్తుతం కార్తితో క్యూట్ లవ్ స్టోరీ చేస్తున్నాడు లెజెండరీ దర్శకుడు. మార్చిలో ఈ చిత్రం విడుదల కానుంది. డ్యూయెట్ పేరుతో తెలుగులోకి అనువాదం కానుంది. దిల్ రాజు తెలుగు వర్షన్ ను ప్రసెంట్ చేస్తున్నాడు.
డ్యూయెట్ సినిమా తర్వాత మణిరత్నం ఓ భారీ చిత్రం తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఓకే బంగారం, డ్యూయెట్ లాంటి ప్రేమకథా చిత్రాల తర్వాత మణిరత్నం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో చిత్రాన్ని తీసుకురానున్నాడట. ఎధిర్ కట్చీ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో ఒకప్పటి హీరో కార్తిక్ ప్రధాన పాత్రలో నటించనున్నాడట. ఎధిర్ కట్జీ అంటే అపోజీషన్ అని అర్ధం. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మణిరత్నం తమిళనాడు ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. రెహమాన్ స్వరాలు సమకూర్చనున్నాడు.
Last Updated 25, Mar 2018, 11:57 PM IST
| 0business
|
Hyderabad, First Published 14, Sep 2019, 4:23 PM IST
Highlights
తాను తెలుగు సినిమాలు తీస్తుంటానని సుక్కు పరిచయం చేసుకుంటే.. తాను తెలుగు సినిమాలు పెద్దగా చూడనని.. మీరెవరో నాకు తెలియదు అని నాని అంటాడు. థియేటర్ లో ఈ సీన్ బాగా పండింది.
టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు తమ సినిమాలలో క్యామియోలు చేస్తుంటారు. అలానే వేరే వాళ్ల సినిమాల్లో కూడా తళుక్కున మెరుస్తుంటారు. తాజాగా దర్శకుడు సుకుమార్ సైతం తన ముఖానికి రంగేసుకొని ప్రేక్షకులను పలకరించాడు.
అసలు విషయంలోకి వస్తే ఇటీవల విడుదలైన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో సుకుమార్ కనిపించాడు. ఈ సినిమాలో నాని రైటర్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అతను హాలీవుడ్ సినిమాలను చూసి నవలలు రాస్తుంటాడు. ఊహించని విధంగా అతడి జీవితంలోకి ఐదుగురు ఆడవాళ్లు రావడం, వారి రివెంజ్ లో భాగమై.. ఆ జర్నీనే కథగా మలుస్తాడు. ఇది దర్శకుడైన సుకుమార్ కళ్లలో పడి.. దాని ఆధారంగా సినిమా తీయలనుకుంటాడు.
ఇలా కొసమెరుపులా సినిమాలో సుకుమార్ ఎంట్రీ ఉంటుంది. తాను తెలుగు సినిమాలు తీస్తుంటానని సుక్కు పరిచయం చేసుకుంటే.. తాను తెలుగు సినిమాలు పెద్దగా చూడనని.. మీరెవరో నాకు తెలియదు అని నాని అంటాడు.
థియేటర్ లో ఈ సీన్ బాగా పండింది. క్లైమాక్స్ లో వచ్చే ఈ సీన్ ఆడియన్స్ ని బాగా నవ్వించింది. ఇది ఇలా ఉండగా.. సుకుమార్ మరో సినిమాలో కూడా క్యామియో చేశాడు. అదే 'వాల్మీకి'. ఈ సినిమాలో కూడా తన నిజజీవితంలో మాదిరి డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
| 0business
|
sumalatha 203 Views Jet Airways , SBI
Jet Airways
ముంబయి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17న తన కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జెట్ ఎయిర్వేస్కు ఆర్థిక సాయం చేసేందుకు రుణదాతలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎంత మొత్తంలో రుణం ఇవ్వనున్నారో మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. కానీ 10మిలియన్ డాలర్లు రుణంగా ఇచ్చేందుకు రుణదాతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల సంస్థ పగ్గాలు అప్పులిచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేతుల్లోకి వెళ్లాయి. ఉద్యోగులకు సైతం జీతాలిచ్చుకోలేని పరిస్థితికి చేరిన జెట్ ఎయిర్వేస్..ఈ రుణంతో కొంత మేర బయట పడనుంది. ఈ సంస్థ తన కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించాలంటే కనీసం రూ.400 కోట్లు అవసరం.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/
| 1entertainment
|
Hyderabad, First Published 5, Mar 2019, 2:25 PM IST
Highlights
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. దివంగత నటుడు నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే అంశాలతో ఈ సినిమాను రూపొందించారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. దివంగత నటుడు నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే అంశాలతో ఈ సినిమాను రూపొందించారు.
ఈ సినిమాను ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను అనుకున్నదానికంటే కాస్త ముందుగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాబట్టి సినిమా ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయని భావిస్తున్నారు. అందుకే పెద్దగా పోటీ సమయంలో రిలీజ్ చేస్తే ఎక్కువ థియేటర్లు దొరకడంతో పాటు కలెక్షన్లు కూడా భారీగా ఉంటాయని అనుకుంటున్నారు.
మార్చి 22న ఈ సినిమాతో పాటు అల్లు శిరీష్ 'ఏబీసీడీ', 'ప్రేమ కథా చిత్రమ్ 2' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అందుకే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను కాస్త ముందుకు జరిపి మార్చి 15న తీసుకువస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇప్పటికైతే దీనికి సంబంధించిన ఎలా ప్రకటన చేయలేదు.
Last Updated 5, Mar 2019, 2:25 PM IST
| 0business
|
Royal Challengers
20 ఓవర్లకు బెంగళూరు: 162-8
ముంబై: ముంబైలో బెంగళూరు, ముంబై జట్ల మధ్య జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్లో బెంగళూరుజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లనష్టానికి 162 పరుగులు చేసింది.. బెంగళూరు బ్యాట్స్మెన్లు ఎబి డెవిలియర్్స 43, పవన్ నేగి 35, కేదార్ జాదవ్ 28, కోహ్లి 20 పరుగులు చేశారు.. ముంబై ఇండియన్స్ బౌలర్లు మెక్లింగన్ 3, క్రునాల్ పాండ్యా 2, బుమ్రా ఒకటి, శర్మక ఒక వికెట్ చోప్పున తీసుకున్నారు.
| 2sports
|
Hyderabad, First Published 31, Oct 2018, 12:14 PM IST
Highlights
టీం ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ పై మరో సీనియర్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశారు
టీం ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ పై మరో సీనియర్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ధోని ప్రదర్శన అంత గొప్పగా ఏమీలేదంటూ కామెంట్ చేశారు.
ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇటీవల టీ20 టీమ్ లను ప్రకటించగా.. అందులో ధోనీకి చోటు ఇవ్వని సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన అభిమానులు సెలక్టర్లపై మండిపడుతున్నారు. కాగా.. దీనిపై గంగూలీ స్పందించారు.
మంగళవారం ఓ జాతీయ ఛానల్తో మాట్లాడుతూ.. ‘టీ20లకు ధోనిని ఎంపికచేయకపోవడం పట్ల నేనేమి ఆశ్చర్యానికి గురికాలేదు. ఎందుకంటే అతని ప్రదర్శన అంత గొప్పగా ఏమి లేదు. ధోని 2020 టీ20 వరల్డ్కప్ వరకు జట్టులో ఉంటాడని అనుకోవట్లేదు. అందుకే సెలక్టర్లు మంచి ఫామ్లో ఉన్న రిషభ్ పంత్కు అవకాశం ఇస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ వరకు సెలక్టర్లు ధోనికి అవకామిస్తేనే ఎక్కువగా భావిస్తా. వెస్టిండీస్తో చివరి వన్డే అనంతరం ధోని ఆటకు చాలా గ్యాప్ వస్తుంది. అతను డొమెస్టిక్ క్రికెట్ ఆడడు.
మళ్లీ ఆసీస్, న్యూజిలాండ్లతో వన్డే సిరీస్ల్లోనే ఆడుతాడు. అతన్ని రంజీ ట్రోఫీలు ఆడామని సెలక్టర్లు సూచించాలి. దీంతో ఆటతో టచ్లో ఉంటాడు. ఇది అతని ఫామ్ తిరిగి సాధించడానికి ఉపయోగపడుతోంది. ఎంత పెద్ద ఆటగాడైనా.. రోజు ఆడకపోతే.. ఆటపై ఉన్న పట్టు కోల్పోతాడు’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇక ఎమ్మెస్కే ప్రసాధ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20 సిరీస్లకు ధోనిని పక్కకు పెడుతు భారత జట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
Last Updated 31, Oct 2018, 12:14 PM IST
| 2sports
|
నా పై కుట్ర జరుగుతోంది.. అందుకే దుష్ప్రచారం -కాజల్
Highlights
ప్రస్థుతం రానాతో నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో నటిస్తున్న కాజల్
తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న కాజల్
తనపై వస్తున్న పుకార్లలో నిజం లేదంటున్న కాజల్
అందాల నటి కాజల్ చాలా బిజీగా ఉంది. రానా తో కలిసి చేస్తున్న నేనే రాజు నేనే మంత్రి తర్వాత పెద్దగా సినిమాలు లేవు. అవకాశాలు తగ్గుతోన్న క్రమంలో తాను మరింత అందంగా కనిపించవలసిన అవసరాన్ని గుర్తించిన కాజల్, తన ముక్కు సర్జరీ చేయించిందని అంటున్నారు. గతంలో ఆమె ఫోటోలు .. ఇప్పటి ఫోటోలు చూస్తుంటే తేడా స్పష్టంగా తెలుస్తోందన్నది నెటిజన్ల వాదన. అంతే కాదు తాజాగా ఒక టాలీవుడ్ హీరో తో డేటింగ్ లో ఉందంటూ వచ్చిన మరో రూమర్ కూడా కాజల్ కి చిరాకు గానే ఉందట. రూమర్స్ అంటూ తాజా ఇంటర్వ్యూలో వీటిపై కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చింది కాజల్.
ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడిన కాజల్.. తను ప్రేమ వివాహమే చేసుకుంటానని, తనకు కాబోయే వాడు సినీరంగానికి చెందినవాడైనా ఫర్వాలేదని, అతను అందంగా ఉన్నా లేకపోయినా, అరడుగుల పొడవు ఉండాలని చెప్పింది. దీంతో ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో కాజల్ ప్రేమలో ఉందని, అతణ్ని రహస్యంగా కలుస్తోందని కూడా గాసిప్లు పుట్టుకొచ్చేశాయి.
అలాగే సినిమాలో అవకాశాల కోసం ఈ అమ్మడు తాజాగా తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుందన్న వార్తలపై చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది కాజల్. ‘ఇటీవలి కాలంలో నాపై వస్తున్న వార్తలు చాలా బాధ కలిగిస్తున్నాయి. నా ఎదుగుదలను చూసి ఓర్వలేని వారే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. నాపై పన్నుతున్న కుట్ర ఇదంతా వారు నాపై పన్నుతున్న కుట్ర. అయినా నేను వెనక్కి తగ్గను. తెలుగు,తమిళ అగ్రహీరోల సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నన్నేం చేయలేర'ని చెప్పింది. మరి ముక్కులో మార్పెలా వచ్చిందో.
Last Updated 25, Mar 2018, 11:59 PM IST
| 0business
|
న్యూ ఇయర్ పార్టీ లో స్టార్స్ హంగామ గ్యాలరీ
First Published 5, Jan 2018, 12:23 PM IST
న్యూ ఇయర్ పార్టీ లో స్టార్స్ హంగామ గ్యాలరీ
న్యూ ఇయర్ పార్టీ లో స్టార్స్ హంగామ గ్యాలరీ
న్యూ ఇయర్ పార్టీ లో స్టార్స్ హంగామ గ్యాలరీ
న్యూ ఇయర్ పార్టీ లో స్టార్స్ హంగామ గ్యాలరీ
న్యూ ఇయర్ పార్టీ లో స్టార్స్ హంగామ గ్యాలరీ
న్యూ ఇయర్ పార్టీ లో స్టార్స్ హంగామ గ్యాలరీ
న్యూ ఇయర్ పార్టీ లో స్టార్స్ హంగామ గ్యాలరీ
న్యూ ఇయర్ పార్టీ లో స్టార్స్ హంగామ గ్యాలరీ
న్యూ ఇయర్ పార్టీ లో స్టార్స్ హంగామ గ్యాలరీ
Recent Stories
| 0business
|
Sep 27,2016
10న బ్యాంకులు పని చేస్తాయి!
న్యూఢిల్లీ: వచ్చే నెల (అక్టోబరు) మొదటి అర్ధ భాగంలో బ్యాంకులకు వరుసగా అయిదు రోజుల సెలవుల నేపథ్యంలో బ్యాంకుల పనిదినాలపై 'ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్' స్పష్టతనిచ్చింది. అక్టోబరు 10న బ్యాంకులు పనిచేస్తాయని అసోసియేషన్ వెల్లడించింది. అక్టోబరు 8న రెండో శనివారం, 9న ఆదివారం, 10న ఆయుధ పూజ, 11న విజయ దశమి, 12న మొహర్రం కావడంతో బ్యాంకులకు వరుసగా అయిదు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార, మార్కెట్ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. వరుసగా మూడు రోజులకు మించి బ్యాంకులు సెలవులను పాటించకూడదనే నిబంధన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన అసోసియేషన్ అక్టోబరు 10న బ్యాంకులకు పనిదినంగా పాటించాలని నిర్ణయించింది. ఆ రోజు 'ఆయు ధపూజ' పర్వదినం అయినప్పటికీ బ్యాంకులు పని చేయనున్నట్లుగా ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్ వెల్లడించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
ఏదో ఒక పార్మాట్ క్రికెట్లో ఆడకపోవచ్చు: డెవిలియర్స్్
డర్బన్: దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎబి డివిలియర్స్ ఒక ఫార్మాట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నాడు.కాగా తీరిక లేని క్రికెట్ షెడ్యూల్త తీవ్ర అలసటకు గురవుతున్నానని,కొన్నాళ్లు గడిచాక ఏదో ఒక పార్మాట్లో తాను ఆడకపోవచ్చని 31 సంవత్సరాల డివిలియర్స్ పేర్కొన్నాడు.డివిలియర్స్ అటువంటి ఆలోచన చేయడంపై పలు వదంతులు వ్యాప్తించాయి.అయితే దక్షిణాఫ్రికా క్రికెట్లోని వ్యవహారాలు నచ్చకే రిటైర్మెంట్ ఆలోచనలో డివిలియర్స్ పడ్డాడని అతని మాజీ టీమ్ సభ్యులు చెప్పినట్లు మీడియాలో వార్త కథనాలు వచ్చాయి.ఆ కథనాలను డివిలియర్స్్ ఖండించాడు.ఎన్నో వదంతులు వ్యాపిస్తున్నాయని,కానీ అవేవి నిజం కాదని,రెండు,మూడేళ్లుగా అపరిమిత క్రికెట్తో ఒత్తిడికి గురవుతున్నట్లు చెబుతూనే ఉన్నానని,ఇప్పుడిక విశ్రాంతి అవసరమని భావిస్తున్నానని అతను పేర్కొన్నాడు.ప్రెష్గా ఉండటానికి పని భారం తగ్గించుకోవాలనుకుంటున్నట్లు,భవిష్యత్ల అన్ని ఫార్మాట్లలో ఆడకపోవచ్చని డివిలియర్స్ వెల్లడించాడు.వన్డే జట్టుకు కెప్టెన్ అయిన డివిలియర్స్,పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతూనే టెస్ట్ల నుంచి తప్పుకునే అవకాశముంది.
| 2sports
|
New Delhi, First Published 23, Mar 2019, 1:27 PM IST
Highlights
రుణ ఎగవేతదారుల స్టయిలే స్టయిల్. కంపెనీ పేరిట రుణాలు తీసుకోవడం.. వాటిని డొల్ల కంపెనీల్లోకి మళ్లించి.. అక్కడ నుంచి విదేశాలకు బదిలీ చేసి.. దేశీయంగా కంపెనీ మూతబడేలా చేసి తర్వాత పరిస్థితి విషమిస్తుందంటే ముడుపులిచ్చి, అధికార పార్టీ నేతల మాటున విదేశాలకు చెక్కేస్తారు. సరిగ్గా స్లెర్లింగ్ బయోటెక్ సంస్థ ఆంధ్రాబ్యాంక్ సారథ్యంలోని కన్సార్టియం నుంచి రూ.8,100 కోట్ల రుణాలు తీసుకుంది. తీరా తీర్చాల్సి వచ్చేసరికి పరారయ్యారు అసలు ప్రమోటర్లు. వారికి అల్బేనియాలో పౌరసత్వం కూడా ఉన్నదట. వారి సహాయకుడు హితేశ్ పటేల్ ఈడీ చేసిన విజ్నప్తి మేరకు ఇంటర్ పోల్ నిఘా పెట్టడంతో పట్టుబడ్డాడు. చట్టపరమైన చర్యలన్నీ పూర్తిచేసి భారతదేశానికి అప్పగిస్తామని అల్బేనియా అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ: భారత్లో వేల కోట్ల రూపాయాల ఆర్థిక మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారు ఒక్కొక్కరిగా పోలీసులకు చిక్కుతున్నారు. ఆ మధ్య విజయ్ మాల్యా.. మొన్న నీరవ్ మోదీ.. తాజాగా మరో ఆర్థిక నేరగాడు అరెస్టయ్యాడు. రూ. 8,100 కోట్ల మనీలాండరింగ్ కేసులో స్టెర్లింగ్ బయోటిక్ ప్రమోటర్ల అనుంగు సహచరుడు హితేశ్ పటేల్ను అల్బేనియాలోని టిరానాలో పోలీసులు అరెస్టు చేశారు.
గుజరాత్కు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్నకు చెందిన హితేశ్ పటేల్ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 11వ తేదీన జారీ చేసిన ఇంటర్పోల్ నోటీసు ఆధారంగా హితేశ్ను టిరానాలో ఈ నెల 20వ తేదీన అరెస్టు చేసినట్టు అల్బేనియా అధికారులు ప్రకటించారు.
స్టెర్లింగ్ బయోటెక్ కేసులో ప్రధాన నిందితులైన నితిన్ సందేసరా, చేతన్ సందేసరా సోదరుల సన్నిహిత బంధువు పటేల్. కేసులో ఆయన కూడా సహ నిందితుడు. ఆయనను త్వరలోనే భారత్కు అప్పగించనున్నట్టు అధికారులు చెప్పారు. సందేసరా సోదరులు ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీలకు డమ్మీ డైరెక్టర్లను తేవడంలో పటేల్ కీలకంగా వ్యవహరించినట్టు ఆయనపై అభియోగం ఉంది.
హితేశ్ నరేందర్ భాయ్ పటేల్ను తాము అరెస్టు చేసినట్టు అల్బేనియా అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు తెలిపారు. త్వరలోనే హితేశ్ అప్పగింత లాంఛనాలు పూర్తి చేసి భారత్కు తీసుకువచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అల్బేనియా వెళ్తారని చెబుతున్నారు.
సందేసరా సోదరులు ఆంధ్రాబ్యాంకు సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంకు రూ.8100 కోట్ల మేరకు రుణాలు ఎగవేసినట్టు అభియోగం ఉంది. స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీ పైన, దాని డైరెక్టర్లు నితిన్ సందేసరా, చేతన్ సందేసరా సోదరులు, చేతన్ భార్య దీప్తి, రాజ్ భూషణ్ ఓంప్రకాశ్ దీక్షిత్, విలాస్ జోషి, చార్టర్డ్ అకౌంటెంట్ హేమంత్ హాథి, ఆంధ్రాబ్యాంకు మాజీ డైరెక్టర్ అనూప్ గార్గ్తో పాటు కొందరు గుర్తు తెలియని వ్యక్తులపై ఈడీ, సీబీఐ కేసులు దాఖలు చేశాయి.
ఆంధ్రాబ్యాంకు నాయకత్వంలోని కన్సార్షియం నుంచి వారు రూ.5 వేల కోట్ల మేరకు రుణం తీసుకుని ఎగవేశారని, అది మొండి బకాయిగా మారిందని ఆరోపణ ఉంది. మొత్తం ఎగవేత రుణం పరిమాణం రూ.8100 కోట్లకు చేరినట్టు చెబుతున్నారు.
ఆ కేసులో ఇప్పటివరకు సీబీఐ ఐదు చార్జిషీట్లు దాఖలు చేసింది. రూ.4710 కోట్ల విలువ గల ఆస్తులు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో రూ.140 కోట్ల మేరకు లంచాలు ముట్టచెప్పారన్న కేసులో కొందరు అధికారుల పాత్రపై కూడా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. హితేశ్ పటేల్, ఆయన సన్నిహితులు నితిన్, చేతన్ ఆదాయం పన్ను శాఖ సీనియర్ అధికారులకు కూడా లంచాలిచ్చారన్న అభియోగాన్ని కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితులైన నితిన్ సందేసరా, చేతన్ సందేసరాలపై కూడా నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. కాగా.. వీరిద్దరికీ అలబానియా పౌరసత్వం ఉంది. అయితే వీరి ఆచూకీపై ఇంతవరకూ స్పష్టత లేదు.
| 1entertainment
|
ఈ సారి కూడా ప్రకటన వరకేనా.. నందులు ఇస్తారా..ఐదేళ్లు మరి
Highlights
గత కొన్నేళ్లుగి సినీరంగంలో ఇవ్వాల్సిన నందులు పెండింగ్
సినీ రంగంలో ప్రతిభా పాఠవాలు ప్రదర్శించిన వారికి అవార్డులు
రాజకీయ కారణాలతో, ఒత్తిడి లేకపోవడంతో వాయిదాల పర్వం
ఈసారి నంది అవార్డుల ప్రధానోత్సవం గ్రాండ్ గా నిర్వహిస్తామంటున్న ఏపీ సర్కార్
సినీరంగంలో విశేష సేవలందించిన వారికి, అద్భుత ప్రతిభాపాఠవాలు ప్రదర్శించిన వారికి ఏటా సర్కారు నంది అవార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా ఈ సంప్రదాయం పలు రాజకీయ కారణాలతో గందరగోళంలో పడింది. రాష్ట్ర విభజనకు ముందు రాజకీయాల కారణంగా ఈ అవార్డులకు ఏళ్ల తరబడి తుప్పు పడితే.. ఇప్పుడు విడిపోయాక కూడా నంది అవార్డులను ఏళ్లతరబడి పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు.
రాష్ట్రం విడిపోక ముందు రాజకీయాల వల్ల నంది అవార్డులు అపహాస్యం అయ్యాయి. నంది అవార్డుల ఎంపిక విషయంలో విమర్శలు రావడం, నంది అవార్డులు వరుసగా ఎప్పడికప్పుడు ప్రతీ సంవత్సరం ఇవ్వక పోవడం చేసేవారు. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత నంది అవార్డులకు మరింత కష్టం వచ్చింది. నంది అవార్డులను ఏ రాష్ట్రం ఇవ్వాలనే చర్చ మొదట జరిగింది. ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను తాము ఇస్తాము అంటూ ముందుకు వచ్చింది. ఇక పెండింగ్ లో వున్న ఏటి నుంచి క్రిందటేటీ దాకా నంది అవార్డులను ప్రకటించేందుకు సిద్దం అయ్యారు.
గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన అవార్డులను ప్రకటించారు. తాజాగా మూడు సంవత్సరాలకు గాను అవార్డులను ప్రకటించారు. మొత్తంగా అయిదు సంవత్సరాల అవార్డులు ఇవ్వాల్సి ఉంది. ఇలా ఇప్పటివరకు నంది అవార్డులకు సంబంధించిన నిన్నటి ప్రకటనతో పెండింగ్ లో పడిపోయిన సంవత్సరాలన్నింటికి అవార్డులు ఇవ్వటం జరిగింది. కాని నంది అవార్డుల ప్రదానోత్సవం మాత్రం జరగడం లేదు. ప్రభుత్వానికి నంది అవార్డుల ప్రధానం అనేది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. అయినా కూడా నంది అవార్డులను ఇచ్చేందుకు సరైన వేదిక ఏర్పాటు చేసి ఈవెంట్ నిర్వహించేందుకు ఎందుకో ముందుకు రావడంలేదు.
అసలే ప్రభుత్వ పెద్దలు దీనిపై ఆసక్తి చూపకపోవడంతో పాటు, సినీ వర్గాల వారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రాకపోవడం వల్లే నంది అవార్డులకు ఈ గతి పట్టింది అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం ఏపి ప్రభుత్వం ప్రకటించడమే కాదు జనవరి చివరి వారంలో ఈ అవార్డుల వేడుకను జరపాలని నిర్ణయించుకుంది. కొత్త సంవత్సరంలో నంది అవార్డుల పండుగ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ వేడుక జరిగితేగానీ నమ్మే పరిస్థితులు లేకపోవడం శోచనీయం. మరోవైపు నంది అవార్డులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ప్రతియేటా.. పారదర్శకంగా కనిటీల ద్వారా ఎంపిక జరుగుతోందని కమిటీ సభ్యులు అంటున్నారు.
Last Updated 25, Mar 2018, 11:58 PM IST
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
డౌన్ పేమెంట్తో 'నోకియా' ఫోన్లు!
నోకియా ఫోన్లను ఇష్టపడేవారికి గుడ్న్యూస్. టెలికామ్ దిగ్గజం ఎయిర్టెల్ కేవలం రూ.3,799 డౌన్ పేమెంట్తో నోకియా ఫోన్లను వినియోగదారులకు అందించనుంది.
Samayam Telugu | Updated:
May 27, 2018, 11:52PM IST
డౌన్ పేమెంట్తో 'నోకియా' ఫోన్లు!
నోకియా ఫోన్లను ఇష్టపడేవారికి గుడ్న్యూస్. టెలికామ్ దిగ్గజం ఎయిర్టెల్ కేవలం రూ.3,799 డౌన్ పేమెంట్తో నోకియా ఫోన్లను వినియోగదారులకు అందించనుంది. గతేడాది అక్టోబర్ లో ఐఫోన్ 7, 8 మోడల్స్ను ఇలాగే అందించడం ప్రారంభించిన ఎయిర్టెల్ తరువాత వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లను కూడా ఈఎంఐ పద్ధతిలో వినియోగదారులకు అందివ్వడం ప్రారంభించింది. ఇక తాజాగా నోకియా 8 సిరోకో, నోకియా 7 ప్లస్, నోకియా 6.1 ఫోన్లను కూడా నిర్దిష్ట మొత్తంలో డౌన్ పేమెంట్తో ఎయిర్టెల్ అందిస్తోంది.
నోకియా 6.1 ఫోన్ కావాలనుకునే వారు రూ.3,799తోపాటు 12 నెలల ఎయిర్టెల్ ప్లాన్కు అయ్యే మొత్తం రూ.1499 చెల్లిస్తే ఫోన్ను అందిస్తారు. అందుకు గాను ముందుగా కస్టమర్లకు చెందిన కేవైసీ వెరిఫై చేసి అందుకు అనుగుణంగా వచ్చే క్రెడిట్ రిపోర్టు ప్రకారం లోన్ శాంక్షన్ చేస్తారు. తరువాత ఈఎంఐలను ఎంచుకుని ముందు చెప్పిన విధంగా పేమెంట్ పూర్తి చేయాలి. దీంతో ఫోన్ హోమ్ డెలివరీ అవుతుంది.
డెలివరీ సమయంలో కస్టమర్ తన ఐడీ, ఇతర వివరాలు వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ తన 'డిజిటల్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్'లో భాగంగా 'ప్రాజెక్ట్ నెక్ట్స్' అనే కార్యక్రమం ద్వారా ఈఎంఐ పద్ధతిలో ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మనోజ్ బర్త్ డే.. అలనాటి ఫొటోతో మోహన్ బాబు విషెస్
తన చిన్న కుమారుడు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనదైన స్టయిల్లో బర్త్ డే విషెస్ చెప్పారు.
Samayam Telugu | Updated:
May 20, 2018, 12:04PM IST
మనోజ్ బర్త్ డే.. అలనాటి ఫొటోతో మోహన్ బాబు విషెస్
మే 20న టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ల పుట్టిన రోజు. ఇద్దరు హీరోల బర్త్ డే ఒకే రోజు కావడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీలవుతారు. ఏటా ఓ రేంజ్లో బర్త్ డే సంబరాలు చేస్తుంటారు. మనోజ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్కు విషెస్ చెబితే.. తారక్ ఫ్యాన్స్ మనోజ్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతుంటారు. ఆదివారం వీరిద్దరి బర్త్ డే విషెస్లతో ట్విట్టర్ హోరెత్తుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మంచువారబ్బాయికి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు.
| 0business
|
తెలంగాణలో ఏరోస్కిల్ అకాడమీ
హైదరాబాద్, జనవరి 27: తెలంగాణ లో ఏరోస్కిల్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఏరోక్యాం పస్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం కారణంగా అంతర్జాతీయ స్థాయివైమానిక సిబ్బంది నైపుణ్య తర్ఫీదు అకాడమి వస్తుందని, బోదనారంగం, వైమానికరంగం నిపుణులతో ఈ అకాడమి ఏర్పాటవుతుందని ఏరోక్యాంపస్ అధికారు లు వెల్లడించారు. యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ, డిజిసిఎ వంటి సంస్థలు అకాడమి కోర్సు లకు సర్టిఫికేషన్ ఇస్తాయి. ఈ ఒప్పందంపై ఏరోక్యాంపస్ జనరల్ మేనేజర్ జోరోమ్ వెర్స్చేవ్, ఐటిశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ప్రభుత్వ సలహాదారు పాపారావు, బ్రాడీక్స్ అంతర్జాతీయ ఆర్ధిక వ్యవహారాల శాఖ కౌన్సిలర్ ఫ్రాజీ రాఫార్డ్ టిఎస్ఐఐసి వైస్ఛైర్మన్ ఎండి ఇ వెంకటనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరెండింటి సంయుక్త వెంచర్గా వస్తున్న ఈఅకాడమితో అత్యుత్తమ స్థాయి వైమానిక రంగ శిక్షణకు దోహదం చేస్తుందని ఐటిశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు.
| 1entertainment
|
త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న ఐపిఎల్ స్టార్ బౌలర్
Highlights
ప్రేయసితో నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడి
ఐపిఎల్ లో తన అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో తనవంతు పాత్ర పోషించిన బౌలర్ సందీప్ శర్మ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే ఆయన తన ప్రేయసి తాషా సాత్విక్ ను పెళ్లాడనున్నట్లు తెలిపాడు. ఇప్పటికు తమకు నిశ్చితార్థం జరిగిందని సందీప్ శర్మ వెల్లడించారు. తనకు కాబోయే భార్య సాత్విక్ తో కలిసి దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సందీప్ ఈ విషయాన్ని తెలిపాడు.
గతంలో సందీప్ కింగ్స్ లెవెన్ పంజాబ్ తరపున ఐపిఎల్ లో ఆడాడు. ఈ సమయంలోనే వీరి మద్య ప్రేమ చిగురించింది. దీంతో సందీప్ అద్బుత ప్రదర్శన చేసినప్పుడల్లా తాషా సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు తెలిపేది. దీంతో వీరి మద్య ఏదో జరుగుతోందని అభిమానుల్లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే వీటికి తెరదించుతూ ఆమెను పెళ్లి చేసుకోనున్నట్లు సందీప్ ప్రకటించారు.
ఈ ఐపిఎల్ సీజన్ లో హైదరాబాద్ జట్టు ఆడిన పలు మ్యాచ్ లకు తాషా వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో సందీప్, తాషా మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారన్న వార్త విని క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
| 2sports
|
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
First Published 19, Jan 2017, 8:37 AM IST
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
చేతన ఉత్తేజ్ (ఉత్తేజ్ కుమార్తె) గ్యాలరీ
Recent Stories
| 0business
|
Hyderabad, First Published 19, Aug 2019, 1:45 PM IST
Highlights
మెగాస్టార్ చిరంజీవి తనయుడిపై మరోసారి తన ప్రేమను చాటుకున్నారు.సైరా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల కోడలు ఉపాసనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ సామర్ధ్యాన్ని గురించి వివరించాడు. అలాగే తన నలభై ఏళ్ళ సినీ కెరీర్ లో చరణ్ వల్ల ఒక కోరిక కూడా తీరిందని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి తనయుడిపై మరోసారి తన ప్రేమను చాటుకున్నారు.సైరా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల కోడలు ఉపాసనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ సామర్ధ్యాన్ని గురించి వివరించాడు. అలాగే తన నలభై ఏళ్ళ సినీ కెరీర్ లో చరణ్ వల్ల ఒక కోరిక కూడా తీరిందని చెప్పారు.
మెగాస్టార్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ ని చూసి నేను చాలా గర్వపడుతున్నా. ఎవరైనా మీకు సంతృప్తి కలిగించిన విషయం ఏమిటని అడిగితే. ఏ మాత్రం ఆలోచించకుండా చరణ్ అని చెబుతాను. చరణ్ కు ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నా. ఇన్నేళ్ల కెరేరి లో 150 సినిమాలు చేసిన నేను మహాధీర - రంగస్థలం వంటి సినిమాల్లో నటించలేదు. ఒకవేళ రంగస్థలం లాంటి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఆ సినిమా చేయడానికి ఒప్పుకునేవాడిని కాను.
కానీ రామ్ చరణ్ ఆ సినిమాలో అద్భుతంగా నటించి నటుడిగా బెస్ట్ పెర్ఫెమెన్స్ ఇచ్చాడు. ఇక సైరా సినిమా ఇంత అద్భుతంగా రావడానికి చరణ్ ముఖ్య కారణం. ఇలాంటి సినిమాల్లో నటించాలనుకున్న నా కోరికను చరణ్ తీర్చాడు. అందుకు చాలా సంతోషపడుతున్నట్లు మెగాస్టార్ తెలియజేశారు.
Last Updated 19, Aug 2019, 1:45 PM IST
| 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
Currency
కెనరాబ్యాంకు రూ.3500 కోట్ల నిధుల సమీకరణ
ముంబయి, జూన్ 17: కెనరాబ్యాంకు ఈక్విటీ నిధుల సమీకరణ కింద రూ.3500 కోట్లు రాబట్టేం దుకు కసరత్తులు పూర్తిచేస్తోంది. బ్యాంకు ఇప్పటికే 1124కోట్లు మార్చినెలలో రైట్స్ ఇష్యూద్వారా సేక రించింది. మొత్తం రూ.6300 కోట్లు సమీకరించా లని నిర్ణయించింది. బోర్డు డైరెక్టర్లు ఇష్యూజారీకి ఇప్పటికే ఆమోదించారు. అర్హులైన సంస్థాగత ప్లేస్ మెంట్ ద్వారా ఈరైట్స్ను ఆఫర్ చేసేందుకు యోచి స్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంకు ఈసమాచారం బిఎస్ఇకి నివేదిక ఇచ్చింది. వాటాదారుల అనుమతినిచ్చే సర్వసభ్యసమావే శంలో సాధించగలమనిబ్యాంకు చెపుతోంది. మార్చి నెలలోనేబ్యాంకు రూ.1124 కోట్లు సమీకరించింది. రూ.207 చొప్పున ఈక్విటీషేరు ధరలను నిర్ణయిం చింది.
బ్యాంకుషేర్లు తాజాగా రూ.352కి చేరాయి. ప్రభుత్వ వాటా బ్యాంకులో 66.3శాతంగా ఉంది. జీవితబీమా సంస్థ 13.62శాతం వాటాలున్నాయి. మూలధన వనరులు సమీకరణకోసం అదనపు టైర్ వన్బాండ్ల జారీచేసి 1800కోట్లు, రెండోశ్రేణి బాండ్ల జారీ ద్వారా రూ.1000 కోట్లు జారీకి బ్యాంకు కసరత్తులు చేస్తోంది. బ్యాంకు కేపిటల్ అడక్వసీ రేషియో మార్చిచివరి నాటికి 11.08శాతం నుంచి 12.86శాతంగా ఉంది. బ్యాంకు అంతకుముందు సంవత్సరంలో రూ.2813 కోట్ల నష్టం నుంచి రూ.1122 కోట్ల లాభాల్లోకి మళ్లింది. అందువల్లనే నిధుల సమీకరణకు కసరత్తులు ముమ్మరంచేసింది.
| 1entertainment
|
బాల్యంలో యంగ్ టైగర్ ఇలా.. జూ.ఎన్టీఆర్ రేర్ ఫొటోస్!
First Published 4, Aug 2019, 11:36 AM IST
నందమూరి వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూ. ఎన్టీఆర్ చిన్ననాటి నుంచే నటనలో ప్రతిభ కనబరిచాడు. నూనూగు మీసాల వయసులోనే హీరోగా మారి స్టూడెంట్ నెం1 చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కెరీర్ తిరుగులేని విధంగా సాగుతోంది. మాస్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్ననాటి నుంచి ఎన్టీఆర్ అరుదైన దృశ్యాలు ఇవే!
బ్రహ్మర్షి విశ్వామిత్ర సెట్స్ లో తాతతో కలసి..
తన తల్లి షాలినితో బాల్యంలో..
మేజర్ చంద్రకాంత్ సెట్స్ లో మోహన్ బాబు, ఎన్టీఆర్ తో కలసి ఉన్న జూ. ఎన్టీఆర్.
భక్త మార్కండేయ సెట్స్ లో..
జూ.ఎన్టీఆర్ స్కూల్ లో దిగిన ఫోటో.
టీనేజ్ లో ఎన్టీఆర్.
స్టూడెంట్ నెం1 సెట్స్ లో రాజమౌళితో కలసి..
తండ్రి హరికృష్ణతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులు.
బాల రామాయణం సెట్స్ లో ఎన్టీఆర్
సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలసి..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ కు ఎన్టీఆర్ కరచాలనం
రాజీవ్ కనకాల, ఇతర నటులతో యంగ్ టైగర్
రానా దగ్గుబాటితో సరదాగా..
పూరి జగన్నాధ్, ప్రభాస్ తో కలసి ఎన్టీఆర్ ఫన్ టైం..
నిర్మాత, ప్రస్తుత ఏపీ మంత్రి కోడలి నానితో ఎన్టీఆర్
సింహా విజయోత్సవ వేడుకలో బాలయ్య, నారా చంద్రబాబు నాయుడుతో కలసి వేదికపై ఎన్టీఆర్.
అందాల భామలు ఇలియానా, భూమికలతో ఎన్టీఆర్.
Recent Stories
| 0business
|
ఇన్ఫోసిస్కు మరో సీనియర్ షాక్!
- తాజాగా సంస్థ సీఎఫ్వో రంగ రాజీనామా
- కొనసాగుతోన్న సీనియర్ల రెజిగేషన్ల పర్వం
- సరిగ్గా ఏడాది కిందటే విశాల్ రాజీనామా..
- ప్రత్యామ్నాయ సంస్థ ఏర్పాటు చేస్తారా..?
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశీయ రెండో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ నుంచి సీనియర్లు తప్పుకుంటున్న పరంపర కొనసాగుతోంది. తాజాగా సంస్థకు కంపెనీ 'చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్' (సీఎఫ్వో) రంగనాథ్ తన పదవికి రాజీనామా చేశారు. 18 ఏండ్లుగా ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న రంగనాథ్ 'కొత్త విషయాల్లో వృత్తిపరమైన అవకాశాల' దృష్ట్యా తన బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టుగా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పదవికీ రాజీనామా చేసినప్పటికీ సంస్థలోని నిబంధనల మేరకు ఆయన ఈ ఏడాది నవంబరు 16 వరకు సీఎఫ్వో పదవిలో కొనసాగనున్నారు. గతంతో సీఎఫ్వోగా పనిచేసిన రాజీవ్ బన్సాల్ రాజీనామా చేయడంతో 2015లో రంగనాథ్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ ఇన్ఫోసిస్లో 18 ఏండ్ల సుదీర్ఘమైన, విజయవంతమైన కెరీర్ను పూర్తి చేసుకున్నాక.. కొత్త విషయాల్లో వృత్తిపరమైన అవకాశాల కోసం ఇన్ఫోసిస్ను వీడాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. గత మూడేళ్లలో కంపెనీకి ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ వాటిని అధిగమిస్తూ మేం ఉత్తమ ఆర్థిక ఫలితాలను సాధించామని చెప్పేందుకు గర్వపడుతున్నా' అని అన్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాటు దిశగా అడుగులు..
దేశీయ ఐటీ దిగ్గజంగా వెలుగొందుతున్న ఇన్ఫోసిస్ నుంచి కీలక క్యాడర్లో ఉన్న ఒక్కొక్కరు జారకుంటుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఒక టీమ్గా పని చేసిన సంస్థ మాజీ సీఈవో, ఎండీ విశాల్ సిక్కా సరిగ్గా ఏడాది కిందట (18ఆగస్టు, 2017న) తన పదవికి రాజీనామా చేశారు. సంస్థ సహ చైర్మెన్గా, స్వతంత్య్ర డైరెక్టర్గా పని చేసిన రవి వెంకటేషన్ కూడా గత మే నెలలో తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే వరుసలో కంపెనీ 'చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్' (సీఎఫ్వో) రంగనాథ్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఒక జట్టుగా పని చేసిన సీనియర్లందరు ఒక్కొక్కరుగా జారుకొంటుండడం చూస్తుంటే తెర వెనుక ఇన్ఫోసిస్కు ప్రత్యామ్నాయంగా మరో సంస్థ ఏర్పాటు దిశగా చర్యలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. రాజీనామా చేసిన సీనియర్లందరు మరో సంస్థలో చేరకుండా.. తాము భవిష్యత్తు వృద్ధి కోసం పని చేసేందుకు సంస్థను వీడుతున్నట్టుగా చెబుతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ దగ్గరగా వీక్షిస్తుంటే రానున్న రోజుల్లో ఇన్ఫోసిస్కు దీటుగా ఐటీ దిగ్గజ సంస్థ కొత్త టెక్నాలజీలతో వెలుగులోకి రానున్నదన్న విషయం అవగతమవుతోంది. ఈ క్రమంలోనే సంస్థలో కీలకంగా ఉన్న ఒక్కొక్కరు జారుకొంటున్నట్టుగా సమాచారం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Wahab Riaz ruled out with ankle injury
భారత్ ఎఫెక్ట్.. పాక్ బౌలర్ ఔట్..?
లయ తప్పిన రియాజ్.. ఓవర్ మధ్యలోనే బౌలింగ్ చేసే సమయంలో పట్టుతప్పి కింద పడిపోయాడు.
TNN | Updated:
Jun 6, 2017, 05:03PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బ్యాట్స్‌మెన్ చేతిలో ఊచకోతకి గురైన పాకిస్థాన్ బౌలర్ వాహబ్ రియాజ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో 8.4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన రియాజ్ ఏకంగా 87 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ ఆరంభంలోనే ఈ బౌలర్‌ని శిఖర్ ధావన్ లక్ష్యంగా చేసుకుని హ్యాట్రిక్ ఫోర్లు బాదేయగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్‌లు చుక్కలు చూపించేశారు. దీంతో లయ తప్పిన రియాజ్.. ఓవర్ మధ్యలోనే బౌలింగ్ చేసే సమయంలో పట్టుతప్పి కింద పడిపోయాడు.
‘రియాజ్ కాలికి గాయమైంది. అతను కోలుకోవడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుందని స్కానింగ్ అనంతరం వైద్యులు తెలిపారు. దీంతో అతను ఛాంపియన్స్ ట్రోఫీ‌లోని మిగతా మ్యాచ్‌లకి దూరంకానున్నాడు. రియాజ్ స్థానంలో ఎవరిని తీసుకునేది త్వరలోనే వెల్లడిస్తాం’ అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం పాకిస్థాన్ తన రెండో మ్యాచ్‌ తలపడనుంది.
| 2sports
|
ఇలాంటి స్వాగతం ఊహించలేదు
మోగా: మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ ఫైనల్ చేరుకోవడంలో కీలకపాత్ర పోషించింది హర్మన్ ప్రీత్ కౌర్. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్న హర్మన్ ఆదివారం తన సొంతింటికి చేరుకుంది. పంజాబ్లోని మోగాలో ఆమెకి ఘనస్వాగతం లభించింది. మోగా శివారులో నివసించే హర్మన్ కుటుంబం ఆమె రాక కోసం ఎంతగానో ఎదురు చూసింది. హర్మన్ వచ్చిన అనంతరం సోదరుడు గుర్జీందర్ ఆమెను ప్రేమతో కౌగిలించుకున్నాడు. బ్రదర్ ఎలా ఉన్నావు అంటూ హర్మన్ అతన్ని ఆప్యాయంగా పలకరించింది. అనంతరం కుటుం బసభ్యులతో హర్మన్ సరదాగా గడిచింది. ఈసం దర్భంగా హర్మన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఈ తరహాలో నాకు ఘన స్వాగతం నాకు దక్కలేదు. నా సారథ్యంలో ఆసియా కప్ (టీ20 టోర్నమెంట్) గెలిచిన సమయంలో కూడా ఇంత స్పందన లేదు. నాకు అంతా కొత్తగా ఉంది.
అబి µమానులు బ్రహ్మరథం పడతారని నేను అసలు ఊహించలేదు. ఇప్పుడు చాలా గర్వంగా ఉంది. నా స్వంత గ్రామంలో జరిగిన ఈ ఘన స్వాగ తాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను అని చెప్పింది. విమానాశ్రయం నుంచి మోగా వచ్చే దారిలో పలువురు నన్నుగుర్తుపట్టారు. నా వాహనాన్ని ఆపి సెల్ఫీలు దిగాలని కోరారు. ఇప్పుడు నన్ను అందరూ గుర్తుపడుతున్నారు. మోగాలో ఉంటూ ఎన్నో టోర్నీలు ఆడాను. కానీ ఎన్నడూ ఇలా లేదు. ఇలాంటి అనుభూతి నా ఒక్కదానికే కాదు. ప్రపంచకప్ ఆడి వచ్చిన మహిళా క్రికెటర్లందరూ ఇలాంటి అనుభూతినే పొందుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నా దృష్టి అంతా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ పైనే. దీన్ని మేము గెలవాలి. ఇది మా కల అని హర్మన్ వివ రించారు. హర్మన్ను చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో అభి మానులు తరలివచ్చారు. హర్మన్ రాకను పురస్కరించుకుని స్థానికులు, రాజకీయ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్పై హర్మన్ 171 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ను ఫైనల్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనంతరం ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో 9 పరు గుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. ఫైన ల్లో ఓడిపోయినప్పటికీ మిథాలీసేన అద్భుత పోరాట ప్రదర్శన కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
| 2sports
|
ఈ మల్టీస్టారర్ సినిమాలొస్తే బాలీవుడ్ భయపడాల్సిందే
First Published 11, Aug 2019, 11:44 AM IST
సౌత్ సినిమా స్థాయి రోజురోజుకి నేషనల్ లెవల్ ని ధాటి ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దన్న పాత్ర పోషించే బాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువకాకుండా సౌత్ సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. బాహుబలి - KGF సినిమాల క్రేజ్ కి బాలీవుడ్ కూడా షాకయ్యింది.
ఇక నెక్స్ట్ మల్టీస్టారర్ సినిమాలు సౌత్ లో గట్టిగానే రెడీ అవుతున్నాయి. అందులో కొన్ని సెట్స్ పై ఉండగా మరికొన్ని డిస్కర్షన్స్ లో ఉన్నాయి. ఒకసారి వాటిపై లుక్కేద్దాం పదండి.
విజయ్ - అజిత్: మాస్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోలు కోలీవుడ్ లో రజినీకాంత్ తరువాత బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్నవారు. వీరి కలయికలో తప్పకుండా ఓ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ లో గత ఏడాది నుంచి టాక్ వస్తోంది.
రాండాముజమ్(మలయాళం) - మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ కు 1000 కోట్ల వరకు ఖర్చవుతుందట. మహాభారతం ఆధారంగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో టాలీవుడ్ - కోలీవుడ్ అలాగే బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలు వివిధ పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది.
ప్రభాస్ - గోపీచంద్: కథ సెట్టయితే తప్పకుండా మల్టీస్టారర్ సినిమా చేస్తామని గోపీచంద్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే 300కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా ఎదిగిన ప్రభాస్ 30కోట్ల మార్కెట్ ఉన్న గోపితో వర్క్ చేస్తాడో లేదో?
రజినీకాంత్ - కమల్ హాసన్: ఈ ఇద్దరు స్టార్ హీరోలుగా మారిన తరువాత కలిసి నటించలేదు. స్టార్ దర్శకులు చాలా సార్లు వీరితో సినిమా చేయాలనీ అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. భవిష్యత్తులో మాత్రం ఇద్దరం కలిసి ఒక సినిమా చేస్తామని చాలా సార్లు కమల్, రజిననీలు మీటింగ్ లలో బహిరంగంగానే చెప్పారు.
పవన్ కళ్యాణ్ - చిరంజీవి - త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించడానికి సీనియర్ నిర్మాత పొలిటీషియన్ సుబ్బిరామిరెడ్డి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ గతంలోనే ఇచ్చారు. త్రివిక్రమ్ రెండు కథలను కూడా రెడీ చేశారు. ఆ సినిమా కోసం ఆయన 300 కోట్లు ఖర్చు పెట్టడానికైనా రెడీ అని సుబ్బిరామిరెడ్డి డిస్కర్స్ చేశారు కానీ ఎందుకో కాలక్రమేణా ఆ ప్లానింగ్స్ కనుమరుగైపోయాయి.
సూర్య - కార్తీ: ఈ బ్రదర్స్ ని ఒకే తెరపై చూపాలని గత కొంతకాలంగా చాలా కథలు పుడుతున్నాయి. అయితే మంచి కథను సెట్ చేసుకొని హై బడ్జెట్ లో సౌత్ లో ఒక బ్రదర్స్ మల్టీస్టారర్ తీయాలని ఆలోచిస్తున్నారు. మంచి మార్కెట్ ఉన్న ఈ హీరోలతో కలిసి సినిమా చేయాలంటే మినిమమ్ 150 కోట్లు దాటుతుందని చెప్పవచ్చు.
KGF 2 - ఫస్ట్ పార్ట్ తో కన్నడ ఇండస్ట్రీ మార్కెట్ ని ఒక్కసారిగా పెంచేసిన KGF సెకండ్ పార్ట్ లో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడు. ఆయన విలన్ గానే కనిపించినప్పటికీ సినిమాలో యష్ తో పాటు మరో స్టార్ హీరో కనిపిస్తాడని టాక్ వస్తోంది. 200కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మహావీర్ కర్ణ - విక్రమ్ తన కెరీర్ లో చేస్తోన్న మొట్టమొదటి హై బడ్జెట్ మూవీ ఇది. 300కోట్ల వరకు ఖర్చు చేయనున్న ఈ హిస్టారికల్ సినిమాలో కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కనిపించనున్నట్లు సమాచారం.
సైరా - మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రంలో అమితాబ్ బచ్చన్ - విజయ్ సేతుపతి - సుదీప్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. 200కోట్లకు పైగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.
విశాల్ - నాని: ఈ కాంబోలో మల్టీస్టారర్ మూవీ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే అవకాశం ఉన్నట్లు టాక్. యాత్ర దర్శకుడు మహి వీ రాఘవ ప్రస్తుతం ఈ కాంబినేషన్ ని పట్టాలెక్కించడానికి బిజీగా ఉన్నాడు.
RRR - దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి స్టార్ యాక్టర్స్ నటించడం ఒక చరిత్రే అని చెప్పాలి. 350 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 సమ్మర్ ఎండింగ్ లో రానుంది.
Recent Stories
| 0business
|
Suresh 90 Views
సన్నాహక మ్యాచ్లో న్యూజిలాండ్ 324/7
న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీ ఛాంపియన్ ముంబయితో ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు సత్తా చాటింది.కాగా తొలి ఇన్నింగ్స్ను ఆ జట్టు 7 వికెట్లకు 324 పరుగులకు డిక్లేర్ చేసింది.టాప్ లాథమ్ 55 పరుగులు,కేన్ విలియమ్స్ 55 పరుగులతో హాఫ్ సెంచరీలు చేయగా శాంట్నర్ 45 పరుగులతో సమిష్టిగా సత్తా చూపాడు. ముం బయి బౌలర్ల బల్విందర్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు,విశాల్ దబోల్కర్,విజ§్ు గోహిల్,సిద్దేశ్ ఒక్కొక్కరు ఒక వికెట్ తీసుకున్నారు.కాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో స్వదేశీ,విదేశీ ఆటగాళ్లతో సందడి వాతావరణం నెలకొన్నటైంది.కాగా ఒక పక్క ముంబయి జట్టు ఆటగాళ్లు మరోపక్క కివిస్ జట్టు సభ్యులు మైదానంలో కఠోర సాధన చేశారు.బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పలువురు ఆటగాళ్లు నెట్ సెషన్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.కాగా మూడు టెస్టులు,5 వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత్ వచ్చింది. ఈనెల 22 కాన్పూర్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుం డగా దానికి ముందు కివీస్ జట్టు 18 వరకు ముంబయితో వార్మప్ మ్యాచ్ ఆడనుంది.కాగా న్యూజిలాండ్ జట్టు నెట్ సెషన్లో పాల్గొంది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సాధన మొదలుపెట్టారు.ఢిల్లీలోని పిరోజ్షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు నెట్ సెషన్లో పాల్గొన్నారు.భారత స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడం పెద్ద సవాలని సొంత గడ్డపై వారిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు.తమ దేశపు స్పిన్ బౌల ర్లతో ఎక్కువ సమయం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశా మని బ్యాట్స్మెన్ వివరించారు.
| 2sports
|
నిధుల కోసం బ్యాంకులు మార్కెట్ బాట
- 4 నెలల్లో ఎనిమిది బ్యాంకులు 'క్యూ'
- క్విప్ లేదా వాటా విక్రయానికి మొగ్గు
- పీఎన్బీతో మొదలుకానున్న తంతు
న్యూఢిల్లీ: నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) సమస్యతో సతమతమవుతున్న బ్యాంకులు తమ మూలధన అవసరాల కోసం కావాల్సిన నిధుల నిమిత్తం మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ జరపాలని యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా రానున్న నాలుగు నెలల కాలంలో (మార్చి నాటికి) ఎనిమిది ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్కెట్లోకి రానున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన రూ.2.11 కోట్ల మూలధనీకరణ ప్రణాళికలో భాగంగా బ్యాంకులు ఈ నిధుల సమీకరణపై దృష్టి పెట్టాయి. తమకు అవసరమైన నిధులను మార్కెట్ల నుంచి సమీకరించుకొనేందుకు ఇప్పటికే కొన్ని బ్యాంకులకు అనుమతులు లభిం చగా.. మరికొన్ని బ్యాంకుల ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. ప్రయివేట్ ప్లేస్మెంట్ లేదా రైట్స్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు బ్యాంకులు ఎక్కువ ఆసక్తితో ఉన్నాయి. చాలా బ్యాంకులు అర్హత కలిగిన సంస్థాగత ప్లేస్మెంట్ (క్విప్) విధానంలో నిధుల వేటకు సిద్ధమవుతున్నాయి. కొత్తగా నిధుల కోసం మార్కెట్లకు రానున్న బ్యాంకుల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ముందు వరుసలో ఉంది. ఈ బ్యాంకు క్విప్ ద్వారా దాదాపు రూ.5,000 కోట్ల మేర నిధులను సమీకరించేందుకు ముందుకు రానున్నట్టుగా సమాచారం. ఆ తరువాత వరుసలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంకులు మార్కెట్ నుంచి నిధుల సమీకరణకు సమాయత్తమవు తున్న ట్టుగా తెలుస్తోంది. ఇందులో ఎక్కువ బ్యాం కులు వాటా విక్రయంపై దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు 2015లో రూ.2.75 లక్షల కోట్లు ఉండగా అది ఈ ఏడాది జూన్ నాటికి రూ.7.33 లక్షల కోట్లకు చేరిన విషయం తెలి సిందే. బ్యాంకుల ఆర్థికంగా పరిపుష్టం చేసేం దుకు గాను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత అక్టోబరులో రూ.2.11 లక్షల కోట్ల అనధికారిక ఉద్దీపన ప్రకటించిన సంగతి తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
తొలి టీ20లో విండీస్పై పాక్ ఘన విజయం
టీ20 ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ను పాక్ జట్టు మట్టి కరిపించింది. తొలి మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
TNN | Updated:
Sep 24, 2016, 11:46AM IST
దుబాయ్లో వెస్టిండీస్తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో పాక్ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో టీ20 ప్రపంచ ఛాంపియన్లను అలవోకగా ఓడించి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 19.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటయ్యింది. ఆ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగారు. డ్వేన్ బ్రావో 55 పరుగులు చేయగా, టేలర్ 21 పరుగులు చేశారు. 12 ఓవర్లు ముగిసే సరికి విండీస్ జట్టు 48 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్రావో, టేలర్ రాణించడంతో ఆ జట్టు 100 పరుగుల మార్కును దాటగలిగింది. పాక్ బౌలర్ ఇమాద్ వసీం 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. స్వల్ప లక్ష్యసాధన కోసం బరిలోకి దిగిన పాక్కు ఓపెనర్ షార్జీల్ ఖాన్ (22) రూపంలో షాక్ తగలింది. కానీ ఖలీద్ లతీఫ్తో జత కట్టిన బాబర్ అజీమ్ (55 నాటౌట్) రాణించడంతో 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. దీంతో 9 వికెట్ల తేడాతో విండీస్పై ఘన విజయం సాధించింది. టీ20ల్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందడం పాకిస్థాన్కు వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం. గత మ్యాచ్లో ఆ జట్టు ఇంగ్లండ్పై కూడా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీసిన ఇమాద్ వసీంకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టీ20ల్లో 5 వికెట్లు తీసిన రెండో పాక్ బౌలర్ ఇమాద్ కావడం విశేషం. అంతకు ముందు ఉమర్ గుల్ ఈ ఘనత సాధించాడు.
| 2sports
|
నేడు అల్లు రామలింగయ్య జయంతి
Highlights
తెలుగు సినిమాకు పాలకొల్లు అందించిన ఆణిముత్యం
తెలుగు సినిమాకు పాలకొల్లు అందించిన ఆణి ముత్యం అల్లు రామలింగయ్య(అక్టోబర్ 1, 1922- జూలై 31, 2004). అనుకరించే విద్యలో అరితేరి నాటకాల్లోకి వచ్చిపడ్డారు అల్లురామలింగయ్య. అల్లు రామలింగయ్య నాటకాలు చూసిన ప్రజానాట్యమండలి గరికపాటి రాజారావు ‘పుట్టిల్లు’తో ఆయనను సినిమాల్లోకి తెచ్చారు.
రేలంగి తరువాత ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్న హాస్యనటుడుడాయనే. స్వాతంత్య్ర పోరాటంలో కూడా ఆయన పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. ‘పుట్టిల్లు’ తర్వాత హెచ్.ఎమ్.రెడ్డి గారి ‘వద్దంటే డబ్బు’లో నటించారు. సినిమాలలో నిలదొక్కుకునేందుకు నాటి చాలా మందినటుల్లాగానే అల్లు రామలింగయ్య కూడా బాగా కష్టపడ్డారు. అప్పు చేసి పప్పుకూడు, మాయాబజార్, దొంగరాముడు, మూగమనసులు లాంటి సినిమాలు ఆయన్ని హస్యమహానటుడిని చేశాయి. హాస్య నటుల్లో అల్లు విశిష్టమయిన వాడు. కామెడీ వేషాలతో మొదలుపెట్టిన కామెడీ-విలనీ లో కూది దిట్ట అనిపించుకున్నాడు. విలన్ పక్కన ఆయన ఉంటే తప్ప విలెనీ పూర్తికాదేమో అనేంత పరిస్థితితీసుకువచ్చారు. సత్యనారాయణ, రావుగోపాలరావులను అల్లురామలింగయ్య లేకుండా ఉహించగలమా!
1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసారు రామలింగయ్య. 1116 చిత్రాల్లో నటించాలనేది ఆయన కోరికట. అది తీరకుండానే వెళ్లిపోయారని ఆయన సన్నిహితులు చెబుతారు.
Last Updated 25, Mar 2018, 11:56 PM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘మెహబూబా’ సెన్సార్ టాక్.. ఛార్మి ఫుల్ ఖుషీ!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మెహబూబా’ సెన్సార్ పూర్తి చేసుకుంది.
Samayam Telugu | Updated:
May 3, 2018, 08:50PM IST
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మెహబూబా’. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై పూరి కనెక్ట్స్ నిర్మించింది. మే 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది. హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు.. శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం గురువారం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ బోర్డు సభ్యులకు సినిమా చాలా బాగా నచ్చిందని, దీంతో తమకు కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందని సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఛార్మి వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో మెసేజ్ను విడుదల చేశారు.
‘మా సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యులందరూ సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఆకాష్ చాలా బాగున్నాడు, లవ్ స్టోరీ చాలా బాగుంది అని పదే పదే చెప్పడంతో మాకు చాలా ఎనర్జీ వచ్చింది. సినిమాపై మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మే 11న ప్రపంచవ్యాప్తంగా ‘మెహబూబా’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని ఛార్మి తెలిపారు.
‘మెహబూబా’ సెన్సార్ టాక్.. ఛార్మి ఫుల్ ఖుషీ!
X
కాగా, 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. యుద్ధ సన్నివేశాలను పూరి అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని అంటున్నారు. ఈ చిత్రంలో ఆకాశ్ సరసన నేహాశెట్టి హీరోయిన్గా నటించింది. మురళీ శర్మ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. యంగ్ సినిమాటోగ్రాఫర్ విష్ణుశర్మ సన్నివేశాలను ఎంత బాగా తెరకెక్కించారో ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది.
| 0business
|
సంస్కరణలు యథాతథం
ముంబాయి: కరెన్సీ విలును తగ్గేంచే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ అన్నారు. వృద్దిరేటను పెంపొందించుకునేందుకు సంస్కరణలను కొనసాగిస్తూనే ఉంటామన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సదస్సులో ఆయన ప్రధాన ప్రసంగం చేశారు. భాగస్వాములను ఎపుడూ ఇబ్బందులకు గురిచేయాలనే ఆలోచన లేదన్నారు. భారత వాణిజ్యాన్ని బలోపేతం చేయటానికి ఇతర దేశల ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే పద్దతి అవలంభించబోమన్నారు.
| 1entertainment
|
ప్లేయర్స్.. కాదు కాదు.. పందెం కోళ్ళు..!
Highlights
ప్లేయర్స్.. కాదు కాదు.. పందెం కోళ్ళు..!
హైదరాబాద్: సంక్రాంతి పండగప్పుడు పందెం కోళ్ళ గురించి రకరకాల స్టోరీస్ వస్తుంటాయి. వాటికి జీడిపప్పు తినిపిస్తారని, మసాజ్ చేస్తారని, కన్న పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటారని. కానీ పందాల టైమ్లో మాత్రం గ్యాప్ లేకుండా బరిలోకి దింపుతారు వాటి యజమానులు. అయితే గెలుపు లేకుంటే చావు.. పందెం కోళ్ళ ముందు ఉన్న రెండే రెండు మార్గాలు. ప్రస్తుతం ఫుట్బాల్ ఫీవర్తో ఊగిపోతున్న ప్రపంచంలో ప్లేయర్స్కు పందెం కోళ్ళ పెద్దగా తేడా లేకుండా పోతున్నది. వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో మొదలవుతుందన్నా సరే వేరే మ్యాచ్లలో తప్పనిసరిగా ఆడాల్సిన పరిస్థితిలో ప్లేయర్స్ ఉంటున్నారు. ఆ క్రమంలో శారీరకంగా, మానసికంగా విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. అంతర్జాతీయ నిపుణుల మాటల్లో చెప్పాలంటే వారు ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలంటే ఒక స్పెష్టలిస్టుల బృందం నిరంతరం ఆటగాళ్ళను కంటికి రెప్పలా కనిపెడుతుండాలి.
రెస్టుకు ఏది బెస్ట్ టైమ్?
ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి వరల్డ్ కప్ టోర్నమెంట్ వస్తుంటుంది. ప్రపంచంలో చాలా టీమ్స్ ఈ ఫుట్బాల్ వేడుక కోసం వేచి చూస్తుంటాయి. ఆటగాళ్ళకు అయితే అది టెన్షన్స్తో కూడుకున్న మెగా టెస్ట్. ఎలాగంటే.. ఈసారి వరల్డ్ కప్ విషయానికి వస్తే, అది జూన్ 14న రష్యాలో ప్రారంభం కావడానికి కేవలం మూడు వారాలకు ముందే యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ ముగిసింది.
కానీ లీగ్లో టీమ్స్ ఆర్గనైజర్స్ మాత్రం వరల్డ్ కప్ సంగతి తర్వాత ముందు దీంట్లో గెలుపు సాధించండి అన్నంతలా ప్లేయర్స్ మీద వత్తిడి తీసుకొచ్చారని 1990 వరల్డ్ కప్లో ఇంగ్లీష్ నేషనల్ టీమ్కు సాయపడిన అప్లయిడ్ స్పోర్ట్స్ ప్రొఫెసర్ జాన్ బ్రెవర్ అన్నారు. చివరి గేమ్ దాకా ప్లేయర్స్ను 100 శాతం వాడుకోవడమే పరమావధిగా క్లబ్లు పనిచేస్తున్నాయి. వరల్డ్ కప్ విషయం తర్వాత చూసుకుందాములే ధోరణితో ప్లేయర్స్ను టెన్షన్ పెడుతుంటారు అని బ్రెవర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సత్తా చెక్ చేయడానికి జీపీఎస్.. ప్లేయర్స్పై హైటెక్ నిఘా..!
ప్లేయర్స్ను ఎప్పటికప్పుడు ఫామ్లో తీసుకువస్తుండటం ట్రయినర్స్కు విషమ పరీక్ష అనే చెప్పాలి. వాళ్ళయినా ఎంత సేపని, ఎక్కడెక్కడని ప్లేయర్స్ వెంట పడతారు? ఈ విషయంలో టెక్నాలజీ ట్రయినర్స్ పాలిట వరమైంది. జీపీఎస్.. పూర్తిగా చెప్పాలంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. శాటిలైట్ సాయంతో నేల మీద చిన్న చీమ తలమీద వెంట్రుక కదలికలను సైతం మిల్లీ సెకన్లలో లెక్కకట్టి చెప్పే అద్భుతమైన సాధనం.
ట్రయినింగ్ సెషన్స్లో మ్యాచ్లలో ప్లేయర్స్ ప్రతి కదలికను, పరుగులో వస్తున్న మార్పులు, వేగంలో హెచ్చు, తగ్గులు, ఆఖరికి వారి గుండె కొట్టుకుంటున్న రేటును తెలుసుకోవడానికి సైతం ఈ జీపీఎస్ను వాడుతుంటారు.
మొదటి మ్యాచ్కు ముందు అడవుల్లో బైక్ రైడ్స్
ప్లేయర్స్ పక్కా ఫిట్నెస్ కోసం రెగ్యులర్ ఎక్సర్సైజులు మాత్రమే కాకుండా ఫన్నీగా ఉండే ఆటలు కూడా వారితో ఆడిస్తుంటారు. మొదటి మ్యాచ్కు ముందు, రెగ్యులర్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక వారం లేదా రెండు వారాల ముందు అడవుల్లో బైక్ రైడ్స్ లేకుంటే కొండలు, గుట్టలు ఎక్కడం లాంటివి చేయిస్తుంటారు. ఇదంతా కూడా మ్యాచ్లో గాయాలు తట్టుకునేలా ప్లేయర్స్ను సిద్ధం చేసే క్రతువులో ఓ భాగం మాత్రమే.
గాయాలు సర్వసాధారణం
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ వరల్డ్ కప్ పోటీల్లో ప్లేయర్స్ గాయపడ్డం సర్వసాధారణమైపోయింది. 2014 బ్రెజిల్ వరల్డ్ కప్లో ప్లేయర్స్కు 104 గాయాలు అయ్యాయి. అంటే సగటున ఒక మ్యాచ్కు 1.68 గాయాలు తగిలాయి.గాయాల్లో అత్యధికం కాళ్ళకు సంబంధించినవైతే, వాటిలో 18 శాతం తల లేదా మెడకు సంబంధించినవి. గాయాల్లో 10 శాతం చెయ్యి, భుజానికి చెందినవి.
Last Updated 7, Jun 2018, 10:35 AM IST
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఢిల్లీని రంజీ ఫైనల్కి చేర్చిన గంభీర్
భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శతకంతో ఏడేళ్ల తర్వాత మళ్లీ రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుని ఫైనల్కి చేర్చాడు. పుణె వేదికగా
TNN | Updated:
Dec 19, 2017, 06:04PM IST
ఢిల్లీని రంజీ ఫైనల్కి చేర్చిన గంభీర్
భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శతకంతో ఏడేళ్ల తర్వాత మళ్లీ రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుని ఫైనల్‌కి చేర్చాడు. పుణె వేదికగా బెంగాల్‌తో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్, 26 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తుదిపోరుకి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటవగా.. అనంతరం ఓపెనర్లు గౌతమ్ గంభీర్ (127: 216 బంతుల్లో 21x4), చండేలా (113: 192 బంతుల్లో 18x4, 1x6) శతకాల మోత మోగించడంతో ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 398 పరుగులు చేసింది.
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
cash
భారత్ ఉత్పత్తిరంగంలో వేతనాలు తక్కువే!
న్యూఢిల్లీ,జూలై 20: భారత్ను ఉత్పత్తిరంగ హబ్గా నిలిపేందుకుఓపక్క ప్రభుత్వం కృషి చేస్తుంటే ఈరంగంలోజీతభత్యాలు ఆశించిన స్థాయి లో లేవు. 16శాతం దిగజారి కనిష్ట వేతనం 2014 లో గంటకు 251.9రూపాయలుగాఉండగా 2015 లో 252.1 రూపాయలకు పెరిగింది. 2016లో 211.7రూపాయలుగా మాత్రమే కొనసాగడం గమ నార్హం. ఉత్పత్తిరంగంలో వేతనాలు కొత్తప్రతిభా వంతులను తీసుకునేందుకు ఏమాత్రం సానునకూ లంగా లేవు. అలాగే కొత్త నైపుణ్యవంతులు ఇలాం టి వేతనాలకు ఉత్పత్తిరంగానికి ఏమాత్రం ప్రాధా న్యతనివ్వరని అంచనా. ఈ గణాంకాలను చూస్తే భారత్లో ఉత్పత్తిరంగంలో సగటు కనిష్టవేతనం 211.7రూపాయలుగా ఉంది.
వివిధ పారామీటర్ల ను పరిగణనలోకి తీసుకుంటే ఈ నివేదికలో ఉద్యో గులు ఉత్పత్తిరంగానికి కేవలం సెకండరీ స్థాయి విద్యాపరంగా 101.4 రూపాయలుగా ఉంది. అదే పోస్టు గ్రాడ్యుయేట్లకు 270.8 రూపాయలుగా ఉంటే సెకండరీ విద్యావంతులకు పోస్టుగ్రాడ్యు యేట్లకంటే 62.6శాతం తక్కువగా ఉన్నాయి. పురుషుల కేటగిరీలో సగటు వేతనం 256.6 రూపాయలు, మహిళా ఉద్యోగులు 179.8 రూపా యలుగా వేతనాలు పొందుతున్నారు. లింగవివక్ష కూడా వేతనాల్లో కొనసాగుతోంది. 29.9శాతం పురుషులు, మహిళా ఉద్యోగులకు వేతనాల్లో తేడా ఉంది.
ఐటిరంగం, బ్యాంకింగ్, ఆర్థికసేవలు, బీమా, ఉత్పత్తి రంగం, విద్యారంగం, పరిశోధన, న్యాయపరంగాను, మార్కెట్ కన్సల్టెన్సీ, బిజినెస్ కార్యకలాపాలు, హెల్త్కేర్, కేరింగ్ సేవలు, సోషల్ వర్క్, రవాణా, రంగం కమ్యూనికేషన్, నిర్మాణం సాంకేతిక రంగ కన్సల్టెన్సీ సేవలుపరంగా ఈ వేత నాల సర్వే జరిగింది. ఇక వివిధరంగాలవారీగా ఉపాధి వేత నాలను చూస్తే గరిష్ట వేతనం గంటకు బ్యాంకింగ్, ఆర్థికసేవలు, బీమారంగాల్లో 433 రూపాయలుగా ఉంది. ఐటిరంగానికి 386.8 రూపాయలు, హెల్త్కేర్, కేరింగ్సేవలు, సోషల్ వర్క్ రంగంలో 242.5 రూపాయలుగా ఉంది.
క విద్యారంగంలో గంటకు 204.1 రూపాయ లుగా ఉన్నాయి. ఏదేనిదేశం ఆర్థిక వ్యవస్థకు ఉత్ప త్తిరంగం వెన్నెముకలాంటిదని చెప్పాలి. భారత్ ఉత్పత్తిరంగంలో స్థూల దేశీయోత్పత్తికి 16శాతం వాటాను అందిస్తుంది. కార్మికశక్తిలో 12-13శాతం గా ఉంది. భారత్ ఆర్థిక వ్యవస్థకు చెప్పుకోదగిన రాబడులు అందిస్తోంది. ఈఉత్పత్తిరంగం అన్నింటి కంటే తక్కువ జీతాలు చెల్లిస్తున్న రంగంగా నిలవ డం దురదృష్టకరి. కేవలం 211.7 రూపాయలు సగటు వేతనం అందుతున్నదంటే చాలా తక్కువే నని మాన్స్టర్ డాట్కామ్ ఆసియా పసిఫిక్, మధ్య తూర్పు దేశాల ఎండి సంజ§్ుమోడి పేర్కొన్నారు.
భారత్లో మానవవనరులు ఎక్కువగా యాంత్రీ కరణ దిశగా నడుస్తున్నాయి. ఉత్పత్తిరంగ పవర్ హౌస్గా నిలిచేందుకు వీలుగా కార్మిక, ఉద్యోగరం గాల్లో నైపుణ్యానికి మరింత పదునుపెట్టడం, వారికి తరచూ శిక్షణ ఇచ్చి సామర్ధ్యం పెంపు వంటివి అనివార్యమని సంస్థ సర్వేలో తేలింది. ప్రతి ఏటా మార్కెట్కు పది మిలియన్ల యువత ఉపాధిరంగానికి వస్తుండగా ఉత్పత్తిరంగ వేతనాలు ఏమాత్రం సరిపోవని మాన్స్టర్ అంచనావేసింది.
| 1entertainment
|
Visit Site
Recommended byColombia
గతంలో మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి, ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ లేదా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ పొందాలంటే చాలా తతంగం ఉండేది. చాలా డాక్యుమెంట్లు అవసరమయ్యేవి. అయితే ఇప్పుడు మీరు కేవలం 2 ఫామ్స్ను ఫిల్ చేస్తే సరిపోతుంది. ఎంట్రప్రెన్యూర్ మెమోరాండమ్ 1, ఎంట్రప్రెన్యూర్ మెమోరాండమ్ 2 అనే రెండు ఫారాలను వివరాలతో నింపితే సులభంగానే లోన్ పొందొచ్చు. గతంలో 11 రకాల డాక్యుమెంట్లు అవసరమయ్యేంది.
Also Read: బంధువులు, స్నేహితుల నుంచి డబ్బు అప్పు తీసుకోకండి.. ఈ 6 ఆప్షన్లు ట్రై చేయండి!
అంతేకాకుండా ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి ఆన్లైన్ ప్రక్రియ. దీంతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వ సబ్సిడీ సహా ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. సులభంగానే రుణ ఆమోదం లభిస్తుంది. ఐయామ్ ఎస్ఎంఈ ఆఫ్ ఇండియా చైర్మన్ రాజీవ్ చావ్లా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈల కోసం వివిధ రకాల సంక్షేమ, సబ్సిడీ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఇప్పుడు ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్తో ప్రభుత్వ బెనిఫిట్స్ను ఎస్ఎంఈలు సులభంగా పొందొచ్చని తెలిపారు.
Also Read: ఎస్బీఐ డెబిట్ కార్డు ఉంటే 1 నిమిషంలోనే లోన్..!
ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్లో ఎస్ఎంసీ లేదా ఎంఎస్ఎంఈ యూనిట్ పేరు నమోదు చేసిన తర్వాత వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. సులభంగా లోన్, గ్యారంటీ లేకుండా రుణం, సబ్సిడీ రేటుకే రుణాలు వంటి బెనిఫిట్స్ అందుతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా వీళ్లు ప్రభుత్వపు మైక్రో బిజినెస్ లోన్స్ ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చని తెలిపారు. ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం కేవలం 3-4 నిమిషాలు పడుతుందన్నారు. ఆధార్ లేదా ఎంఎస్ఎంఈ వెబ్సైట్స్కు వెళ్లి నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
Nov 01,2015
మూడో రోజూ తగ్గిన పసిడి
న్యూఢిల్లీ : వరుసగా మూడో సెషన్లోనూ బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు బులియన్ మార్కెట్లో ఆభరణాల వర్తకులు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి దిగివస్తోందని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపధ్యంలోనే శనివారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర తగ్గి రూ.26,820, రూ.26,670కు చేరింది. ఇంతక్రితం రెండు సెషన్లలో రూ.435 దిగివచ్చింది. మరోవైపు కిలో వెండిపై రూ.140 పెరిగి రూ.36,770కి చేరింది. 100 వెండి నాణేల ధర యథాతథంగా రూ.52,000గా పలికింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 6, Oct 2018, 9:37 AM IST
Highlights
తెలుగులో 'దేవదాసు' సినిమాతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకున్న నటి ఇలియానా.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి ఓ వెలుగు వెలిగింది. 'బర్ఫీ' సినిమా తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ఆమె టాలీవుడ్ కి దూరమైంది.
తెలుగులో 'దేవదాసు' సినిమాతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకున్న నటి ఇలియానా.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి ఓ వెలుగు వెలిగింది. 'బర్ఫీ' సినిమా తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ఆమె టాలీవుడ్ కి దూరమైంది.
ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాలో నటిస్తోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇలియానా.. తన బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతూ ఆ ఫొటోలన్నీ కూడా అభిమానులతో పంచుకుంటుంది.
ఇటీవల అమెరికన్ గ్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కంపెనీ మకా ఫీ (MCA Fee) నిర్వహించిన సర్వేలో ఇలియానా అత్యంత ప్రమాదకర సెలబ్రిటీగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఇలియానా. తప్పుడు వెబ్సైట్లు క్లిక్ చేసేందుకు హ్యాకర్లు బాగా పేరొందిన సెలబ్రిటీల పేర్లను వాడుకుంటారు.
వారి ఫొటోలను ఇతర వివరాలను ఎరగా చూపించి వైరస్ లను వ్యాప్తిజేస్తున్నారు. ఇటీవల హ్యాకర్లు ఇలియానా ఫోటోలను బాగా వాడుకుంటూ నెటిజన్లను ఇబ్బంది పెడుతున్నారట. ఇలియానా తర్వాతి స్థానంలో ప్రీజి జింటా.. వీరితోపాటు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, కృతి సనన్, అక్షయ్ కుమార్, రిషీ కపూర్, పరిణితీ చోప్రా కూడా ఉన్నారు
Last Updated 6, Oct 2018, 9:39 AM IST
| 0business
|
Hyderabad, First Published 7, Apr 2019, 7:02 PM IST
Highlights
మహేశ్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం మహర్షి టీజర్ యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తూ దూసుకుపోతోంది.
మహేశ్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం మహర్షి టీజర్ యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఫ్యాన్స్ కు ఉగాది కానుకగా వచ్చిన ఈ టీజర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. టీజర్ లో మహేష్ చెప్పినట్టు ‘సక్సెస్లో ఫుల్స్టాఫ్లు ఉండవు.. కామాలు మాత్రమే ఉంటాయి’ అనే విధంగా దూసుకెళ్తోంది.
మహర్షి టీజర్ కు యూట్యూబ్ లో ఒక 1.2 కోట్ల వ్యూస్ రావడం స్టామినాని తెలియచేస్తోంది. అంతేకాదు, కోటి వ్యూస్ నుంచి 1.2 కోట్ల వ్యూస్ కి చేరడానికి చాలా తక్కువ సమయం తీసుకున్న టీజర్ గా మహర్షి రికార్డు నెలకొల్పింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరోజు వ్యవధిలో ఎక్కువమంది చూసిన టీజర్ కూడా ఇదే కావటం విశేషం. దాంతోపాటే, ట్విట్టర్ లో ఎక్కువమంది రీట్వీట్ చేసిన, లైక్ చేసిన టీజర్ గానూ మహర్షి మరో ఘనత అందుకుంది.
ఇక ఈ టీజర్లో మహేష్బాబు మునుపటి కంటే ఇంకా స్టైలిష్ అండ్ క్లాస్ లుక్తో అదరగొట్టారు. యాక్షన్ సీక్వెన్స్లలో మాస్ ఆడియన్స్ను అలరించే విధంగా ఫైట్స్ తో దుమ్ము రేపారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Last Updated 7, Apr 2019, 7:02 PM IST
| 0business
|
profit
కోటక్ మహీంద్ర నికర లాభం రూ.813 కోట్లు
ముంబై, అక్టోబరు 28: కోటక్ మహీంద్ర బ్యాంకు నికరలాభం రెండో త్రైమాసికంలో 43శాతం పెరిగి 813కోట్లకుచేరింది. సంఘటిత లాభం చూస్తే 28 శాతం పెరిగి 1202కోట్లుగా ఉంది. కోటక్ మహీం ద్ర బ్యాంకు నికరవడ్డీ ఆదాయం 19శాతంపెరిగి 1995 కోట్లుగా ఉంది. నికరవడ్డీ మార్జిన్ కూడా 4.47శాతం పెరిగింది. సెప్టెంబరు చివరినాటికి అడ్వాన్సులు కూడా 13శాతం పెరిగి 1,26,015 కోట్లకు చేరాయి. ఇక పొదుపు డిపాజిట్లు రెండో త్రైమాసికంలో 35శాతం పెరిగి 30,678 కోట్లకు చేరాయి. కరెంటుఖాతా డిపాజిట్లపరంగాచూస్తే 28 శాతంపెరిగి 19,273కోట్లకు చేరాయి. ఇక కరెంటు సేవింగ్స్ఖాతాల డిపాజిట్లు 39శాతం పెరిగినట్లు బ్యాంకు ప్రకటించింది. మొత్తం 1336 శాఖలు ఏర్పాటుచేసామని, మొత్తం 702కేంద్రాల్లో 2044 ఎటిఎంలు పనిచేస్తున్నట్లు బ్యాంకు వివరించింది. ఇక స్థూల నిరర్ధక ఆస్తులు 2.49శాతం నికర నిరర్ధక ఆస్తులు 1.20శాతంగా ఉన్నాయి. నెల వారీగా బ్యాంకు మొబైల్ లావాదేవీల ప్లాట్ఫామ్పై 3500 కోట్ల లావాదేవీలు నిర్వహిస్తోందన్నారు. మొబైల్ లావాదేవీలు 118శాతం పెరిగాయన్నారు. కోటక్ సెక్యూరిటీస్మొబైల్ లావాదేవీలు నెలకు 8 వేల కోట్లుగా ఉన్నాయని బ్యాంకు ప్రకటించింది. ఇక కోటక్ లైఫ్ బీమా పాలసీలు కూడా జెనీ ట్యాబ్ ఆధారిత లావాదేవీలుపెరిగాయని 48శాతం లావా దేవీలు జరుగుతున్నట్లు వివరించింది. అర్ధసంవ త్సర కాలానికిగాను నికరలాభం 1202కోట్లుగా ఉంది. అడ్వాన్సులు 1,54,078 కోట్లుగా ఉన్నా యి. నికరవడ్డీ మార్జిన్ 4.46శాతం, క్యాపిటల్ అడక్వసీ నిష్పత్తి బేసెల్3 ప్రకారం 17.3శాతంగా ఉంది. మొత్తంఆస్తులపరంగాటర్నోవర్ 1,20,705 కోట్లకు పెరిగింది. ఇక కోటక్ మహీంద్ర ప్రైమ్ 130 కోట్ల లాభాలతో నడిచింది. కోటక్ మహీంద్ర పెట్టుబడుల విభాగం 53కోట్లలాభాలు ఆర్జించింది.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కేరళలో కబాలి కొత్త రికార్డు
కేరళలో కబాలి మూవీ రికార్డు సృష్టించింది. ఆ రాష్ట్రంలో దాదాపు 306 థియేటర్లలో విడుదలైంది.
TNN | Updated:
Jul 22, 2016, 10:50AM IST
కేరళలో కబాలి మూవీ రికార్డు సృష్టించింది. ఆ రాష్ట్రంలో దాదాపు 306 థియేటర్లలో విడుదలైంది. ఒక తమిళ సినిమా ఇన్ని థియేటర్లలో విడుదలవ్వడం ఇదే తొలిసారి. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేతుల మీదుగా సినిమాను కేరళలో విడుదల చేశారు. తమిళనాడుతో సమానంగా కేరళలోనూ విపరీతమైన క్రేజీ కనిపిస్తోంది. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కబాలి 12 వేల స్క్రీన్లపై విడుదలైంది. ఈ రేంజ్లో విడుదలైన ఏకైనా సినిమా కబాలినే కావడం విశేషం. సినిమా మొత్తం మలేషియా బ్యాక్ గ్రౌండ్ తో సాగుతుంది. దీంతో ఆ దేశంలోనూ కబాలి ఫీవర్ సాగుతోంది.
| 0business
|
వరల్డ్ కప్లో రొనాల్డో తొలి హ్యాట్రిక్.. స్పెయిన్తో మ్యాచ్ డ్రా
Highlights
వరల్డ్ కప్లో రొనాల్డో తొలి హ్యాట్రిక్.. స్పెయిన్తో మ్యాచ్ డ్రా
హైదరాబాద్: వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఓపెనింగ్ మ్యాచ్ గెలుచుకోవాలనుకున్న స్పెయిన్ ఆశలను పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో నిలువునా కూల్చాడు. వరల్డ్ కప్లో తొలిసారిగా హ్యాట్రిక్ గోల్ చేయడం ద్వారా ప్రత్యర్థి జట్టు చేతిదాకా వచ్చిన విజయాన్నిదూరం చేశాడు. 3-3 తో మ్యాచ్ డ్రా కావడానికి మూలకారకుడయ్యాడు. టోర్నమెంట్ తుదికంటా పోరాడాలన్న పోర్చుగల్ కల సాకారమయ్యే దిశగా జట్టులో ఆత్మ స్థైర్యాన్ని నింపాడు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక సోచిలోని ఫిస్ట్ ఒలింపిక్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య సాగిన ఫుట్బాల్ పోరు ఆద్యంతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. అభిమానులను అసలైన వీకెండ్ను అందించింది. హోరాహోరీగా సాగిన గేమ్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నరీతిలో ఎత్తుకు పై ఎత్తులు వేశారు.
రొనాల్డో పోర్చుగల్కు తొలి గోల్ అందించి అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తాడు. అంతే దీటుగా స్పెయిన్ ప్లేయర్ డిగో కోస్టా గోల్ చేయడంతో ఒక్కసారిగా గేమ్ ఉత్కంఠభరితమైన వాతావరణాన్ని నెలకొల్పింది. 1-1 ఉన్న స్కోరు కాస్త కోస్తా, రొనాల్డో మరోసారి చెరి ఒక గోల్ చేయడంతో 2-2 కు చేరుకుంది. నాచో మరో గోల్ చేయడంతో స్పెయిన్ 3 గోల్స్, పోర్చుగల్ 2 గోల్స్ చేశాయి. అయితే స్పెయిన్ చేసిన తప్పిదానికి ప్రత్యర్థి జట్టు ఫ్రీ కిక్ చేసే అవకాశం వచ్చింది. అది ఎక్స్ట్రా టైమ్ నాలుగు నిముషాల్లో.
అందరి చూపు బాల్ ఎదురుగా నిలబడ్డ రొనాల్డోపైనే ఉంది. అతడి కాలిలో ఏ మాయ ఉందో కానీ తెలియదు కానీ దడి కట్టిన ప్రత్యర్థుల తలల మీద వెళ్ళిన బాల్ స్పిన్ చేసినట్టుగా చేరుకొని రొనాల్డో ఖాతాలో తొలి వరల్డ్ కప్ హ్యాట్రిక్ రికార్డును సంపాదించి పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని కిక్ ఆఫ్ ది మ్యాచ్ అనాలి. ఆ కిక్తో మ్యాచ్ 3-3తో డ్రా అయ్యింది. పో్ర్చుగల్కు 1 పాయింట్ తెచ్చి పెట్టింది. ఇంతటి ఘనత సాధించిన అతడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
మ్యాచ్ లెక్కలోకి వెళితే.. స్పెయిన్ 12 అటెంప్ట్స్, 10 ఫౌల్స్ చేస్తే పోర్చుగల్ 8 అటెంప్ట్స్, 12 ఫౌల్స్కు పాల్పడింది. ఇరు జట్లకు చెరొక ఎల్లో కార్డు వార్నింగ్ వచ్చింది. మొత్తం మ్యాచ్ ఆడిన సమయం 90+4 నిముషాలు అంటే 94 నిముషాలు.
Last Updated 16, Jun 2018, 10:15 AM IST
| 2sports
|
పంజాబ్పై గుజరాత్ లయన్స్ విజయం
మొహలీ: ఐపిఎల్ 9 సిజన్లో భాగంగా సోమవారం రాత్రి జరిగిన పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో గురజాత్ లయన్స్ ఘనవిజయం సాధించింది. పంజాబ్ విధించిన 162 పరుగుల లక్ష్యాన్ని అయిదు వికెట్ల తేడాతో గుజరాత్ 17.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ అరోన్ ఫించన్ 47 బంతుల్లో 4 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
| 2sports
|
sanjay
స్మార్ట్రాన్ బోర్డు డైరెక్టర్గా సంజఝా
న్యూఢిల్లీ, హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న స్మార్ట్రాన్ ఎలక్ట్రా నిక్స్ సంస్థకు బోర్డ్ ఆప్డైరెక్టర్స్లో సభ్యునిగా సంజ§్ుఝా చేరారు. గ్లోబల్ ఫౌండ్రీస్ సిఇఒ మోటారోలా పూర్వఛైర్మన్గా వ్యవహరించిన సంజ §్ు ఇపుడు వ్యూహాత్మక సలహాదారుగా స్మార్ట్రాన్కు సేవలందిస్తున్నారు. అంతర్జాతీయ టెక్నాలజీ పరిశ్రమను శాసిస్తున్న అగ్రశ్రేణి పది మంది భార తీయ సంతతికి చెందిన సిఇఒలలో ఒకరుగా సంజ§్ు నిలిచారు. ఇన్వెస్టర్ అయిన సంజ§్ు స్మార్ట్రాన్లో స్వతంత్ర డైరెక్టర్ హోదా కలిగి ఉంటారు. సెమి కండక్టర్లు, మొబైల్ పరి శ్రమలో అపారమైన అనుభవం విజ్ఞానం కలిగిన సంజ§్ు స్మార్ట్రాన్ నిర్వహణప్రతిభ బలోపేతం చేసేం దుకు అంతర్జాతీయ విస్తరణ పథకాల అమలుకు వ్యూహకర్తగా సేవలందిస్తారని లింబారెడ్డి వివరించారు. సంజ§్ు ప్రస్తుతంప్రపంచంలో రెండో అతిపెద్ద సెమికండక్టర్ తయారీ సంస్థ గ్లోబల్ ఫౌండ్రీస్కు సిఇఒగా ఉన్నారు. విజయవంతమైన ట్రాక్రికార్డు ఉన్న సంజ§్ు క్వాల్కామ్లో కూడా పనిచేసారు. ====== ్కటాటామోటార్స్ నుంచి ప్రైమారేస్ట్రక్ న్యూఢిల్లీ, మార్చి 14: టాటామోటార్స్ నుంచి ఫ్యూచర్రెడీ శక్తివంతమైన 1000బిహెచ్పి ప్రైమా రేస్ట్రక్ ను సిద్ధంచేసింది. టివన్ప్రైమా ట్రక్రేసింగ్ ఛాంపియన్షిప్లో ఈ ప్రతిష్టాత్మక ట్రక్ పాల్గొంటుంది. భారత్లోని ఉత్పత్తి కేంద్రాల్లో రూపొందించిన బిల్ట్ ఇన్ ఇండియా ట్రక్కుగా ప్రైమా మంచి శక్తివంతగా పనిచేస్తుంది. పదిసెకన్లలోనే జీరో నుంచి 160 కిలోమీటర్ల వేగానికి పికప్ ఉంటుంది. యుకె, యూరోప్ దేశాల్లో నిర్వహించే గ్లోబల్ రేస్ట్రక్లకు ధీటుగా ప్రైమాను రూపొందించారు. 1040హెచ్పి 12 లీటర్ ఇంజన్ ఛాసిస్ మధ్యలో ఉంటుంది. 16 స్పీడ్ గేర్బాక్స్ హైడ్రాలిక్ సాయంతో ఉన్న గేర్ షిప్టింగ్ ఏర్పాటు చేసారు. బాక్స్టైప్ ఫ్రేమ్తో ఛాసిస్ రూపొందించారు. రేసింగ్ సీట్ స్లిప్పింగ్ మోడ్లో ఉంటుంది. డిటాచబుల్ స్టీరింగ్ ఏర్పా టు, రాల్కేజ్తో కూడిన విశాలమైన కేబిన్, బ్రేక్ డిస్క్ కూలింగ్, రేసింగ్ ఆధారిత స్లిక్టైర్లు ఏర్పాటుచేసారు. టాటామోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీం ద్ర పిషరోడి మాట్లాడుతూ టివన్ మూడు సీజన్ల తర్వాత టాటామోటార్స్ ప్రతి ష్టాత్మకమైన 1000 బిహెచ్పి టివన్ ప్రైమారేస్ట్రక్ను ఉత్పత్తిచేసిందని అన్నారు. కేవలం 12నెలల వ్యవధిలోనే పూర్తిస్థాయి లో ఉత్పత్తి జరిగిందన్నారు. టాటామోటార్స్, కుమ్మిన్స్ ఇంక్ అమెరికా సంస్థల జాయింట్ వెంచర్ కంపెనీగా టాటాకుమ్మిన్స్ ఆధ్వర్యంలో ఈ ట్రక్కురూపొందింది. సీజన్4 ట్రక్రేసింగ్లో టాటామోటార్స్ వాబ్కో, జెకెటైర్, క్యాస్ట్రాల్, కుమ్మిన్స్, టాటా టెక్నాలజీస్ వంటి వాటిని భాగస్వామ్యం తీసుకుంది.
==
| 1entertainment
|
United States, First Published 6, Sep 2019, 10:06 AM IST
Highlights
అమెరికా టెన్నిస్ సంచలనం సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్లో ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల సింగిల్స్ సెమీస్లో ఐదో సీడ్ స్వితోలినాపై సెరెనా 6-3, 6-1 తేడాతో విజయం సాధించింది
అమెరికా టెన్నిస్ సంచలనం సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్లో ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల సింగిల్స్ సెమీస్లో ఐదో సీడ్ స్వితోలినాపై సెరెనా 6-3, 6-1 తేడాతో విజయం సాధించింది.
ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తన పవర్ఫుల్ సర్వీసులతో మట్టికరిపించింది. కాగా.. సెరెనా తలపడిన ఆఖరి ఆరు టోర్నమెంట్లలో ఆమె నాలుగుసార్లు ఫైనల్కు చేరడం విశేషం.
ఈ ఏడాది వింబుల్డన్ ఫైలన్కు చేరిన సెరెనా 2-6, 2-6 తేడాతో ఓటమి పాలైంది. మరో సెమీస్లో బెన్సిచ్, ఆండ్రిస్కూ తలపడున్నారు. ఈ మ్యాచ్లో గెలిచిన విజేతతో సెరెనా తుది సమయంలో తలపడనుంది.
Last Updated 6, Sep 2019, 10:06 AM IST
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మెల్బోర్న్ పిచ్కి ఐసీసీ ‘యావరేజ్’ రేటింగ్..!
మెల్బోర్న్ టెస్టులో మూడో రోజు నుంచి పిచ్ ‘అస్థిర బౌన్స్’ కారణంగా బ్యాటింగ్ కష్టమైపోయింది. బౌలర్లకి ఈ పిచ్ నుంచి అతిగా సహకారం లభించడంతో జస్ప్రీత్ బుమ్రా (6/33) చెలరేగిపోయాడు.
Samayam Telugu | Updated:
Jan 1, 2019, 11:39AM IST
మెల్బోర్న్ పిచ్కి ఐసీసీ ‘యావరేజ్’ రేటింగ్..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్ ఐదో రోజు ముగిసినా.. ఆ పిచ్కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ‘యావరేజ్’ రేటింగ్ ఇచ్చింది. ఆదివారం ముగిసిన ఈ టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు 137 పరుగుల తేడాతో గెలుపొందగా.. ఈరోజు ఆ పిచ్పై ఐసీసీ నివేదికని విడుదల చేసింది. ఇటీవల రెండో టెస్టు మ్యాచ్ జరిగిన పెర్త్ పిచ్కి కూడా ఐసీసీ యావరేజ్ రేటింగే ఇచ్చిన విషయం తెలిసిందే.
మెల్బోర్న్ టెస్టులో తొలి రెండు రోజులు బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. చతేశ్వర్ పుజారా (106: 319 బంతుల్లో 10x4), విరాట్ కోహ్లీ (82: 2014 బంతుల్లో 9x4) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ను 443/7తో డిక్లేర్ చేసింది. అయితే.. మూడో రోజు నుంచి పిచ్ ‘అస్థిర బౌన్స్’ కారణంగా బ్యాటింగ్ కష్టమైపోయింది. బౌలర్లకి ఈ పిచ్ నుంచి అతిగా సహకారం లభించడంతో జస్ప్రీత్ బుమ్రా (6/33) చెలరేగిపోయాడు. దీంతో.. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 151 పరుగులకే కుప్పకూలగా.. భారత్కి 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ని భారత్ 106/8తో డిక్లేర్ చేయగా.. 399 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 261 పరుగులకి ఆలౌటైంది. పిచ్ నుంచి అస్థిర బౌన్స్ని చూసిన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ‘యావరేజ్’ రేటింగ్తో ఐసీసీకి నివేదిక సమర్పించాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఆ మ్యాచ్కి కూడా జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు. నాలుగు టెస్టుల ఈ సిరీస్లో భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రోహిత్ సిక్సర్ల మోత.. డివిలియర్స్ రికార్డ్ బ్రేక్
శ్రీలంకతో జరిగిన టీ20లో సిక్సర్ల మోత మోగించిన రోహిత్.. డివిలియర్స్ నెలకొల్పిన రికార్డును తుడిచేశాడు.
TNN | Updated:
Dec 23, 2017, 05:20PM IST
రోహిత్ సిక్సర్ల మోత.. డివిలియర్స్ రికార్డ్ బ్రేక్
ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ మెరుపు శతకంతో చెలరేగాడు. ఫాస్టెస్ట్ సెంచరీ సహా అనేక రికార్డులను రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. 43 బంతుల్లోనే 118 పరుగులు చేసిన హిట్ మ్యాన్.. 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. ఇంతకు ముందు డేవిడ్ మిల్లర్ కూడా 35 బంతుల్లోనే శతకం బాదాడు. ఇండోర్ మ్యాచ్‌‌లో తొలి 50 పరుగుల్ని 23 బంతుల్లో పూర్తి చేసిన రోహిత్.. ఆ తర్వాత విశ్వరూపం చూపాడు. సిక్సర్ల మోత మోగిస్తూ.. 12 బంతుల్లోనే తర్వాతి 50 పరుగులు పూర్తి చేశాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మొత్తం పది సిక్సర్లు బాదిన రోహిత్.. ఓ టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది 64 సిక్సర్లను తన ఖాతాలో వేసుకున్న రో‘హిట్’ తద్వారా ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సర్లు సంధించిన క్రికెటర్‌గా ఏబీ డివిలియర్స్ రికార్డును బ్రేక్ చేశాడు. 2015లో డివిలియర్స్ 63 సిక్సర్లు బాదాడు. 2012లో మూడు ఫార్మాట్లలో క్రిస్ గేల్ 59 సిక్సర్లు బాదగా.. మూడేళ్ల తర్వాత దాన్ని ఏబీ బ్రేక్ చేశాడు. ఈ సఫారీ బ్యాట్స్‌మెన్ నెలకొల్పిన రికార్డును రోహిత్ రెండేళ్లలోపే బద్దలు కొట్టడం విశేషం.
రోహిత్ మెరుపు సెంచరీతో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీ20ల్లో ఇదే రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఈ సెంచరీ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో రెండో శతకం బాదిన మెక్‌కల్లమ్, గేల్, లూయిస్, కాలిన్ మున్రోల సరసన రోహిత్ నిలిచాడు. ఈ ఏడాది కోహ్లి అత్యధికంగా 11 సెంచరీలు చేయగా, రోహిత్ 8 సెంచరీలతో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.