news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Mar 03,2018
'మీ' స్మార్ట్టీవీ రూ.13,000!
ముంబయి: భారత్లోని టీవీ మార్కెట్పై కన్నేసిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ షియోమి మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని మిడ్ రేంజ్ టీవీలను మార్కెట్లోకి తీసుకు రానున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగా రూ.15 వేల కంటే తక్కువ ధరలోనే 32 అంగుళాల టీవీని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. హైడెఫినేషన్ (హెచ్డీ) క్వాలీటీతో రూ.12,999లకే 32 అంగుళాల స్మార్ట్ టీవీని సంస్థ మార్కెట్లోకి తేనుందని ప్రముఖ టెక్నాలజీ వార్తా సంస్థ ఐగ్యాన్ ప్రచురించింది. ఇందులో 1 జీబీ ర్యామ్తో పాటు 4జీబీ ఇంటర్నల్ మెమెరీ సౌలభ్యం ఉండనున్నట్టుగా తెలిపింది. దీనికి తోడు రూ.21,999 లకే 43 అంగుళాల ఫుల్ హెచ్డీ టీవీని అందించే అవకాశం ఉందని పేర్కొంది. ఇందులో 2 జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ మెమోరీ అందుబాటులో ఉంటాయని ఐగ్యాన్ తెలిపింది. అత్యాధునిక బ్లూటూత్ వెర్షన్, వైఫై సౌకర్యాలు ఈ టీవీకి అదనపు హంగుళుగా నిలువనున్నాయి. ఎంఐ 4ఏ సిరీస్లో వీటిని లాంచ్ చేసే అవకాశం ఉంది. మార్చి 7న వీటిని అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు సంస్థ తన అధికారిక యాప్లో ప్రకటించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బాక్సాఫీస్: ఆ సినిమాకే మంచి ఛాన్స్!
బాక్సాఫీస్ వద్ద శూన్యత కనిపిస్తోంది. పెద్ద సినిమాలు పోటీలో లేవు. అద్భుతం చేస్తుందని అనుకున్న ‘కాలా’ తీవ్రంగా నిరాశ పరిచింది.
Samayam Telugu | Updated:
Jun 22, 2018, 09:11AM IST
బాక్సాఫీస్ వద్ద శూన్యత కనిపిస్తోంది. పెద్ద సినిమాలు పోటీలో లేవు. అద్భుతం చేస్తుందని అనుకున్న ‘కాలా’ తీవ్రంగా నిరాశ పరిచింది. ఫర్వాలేదనిపించుకున్నా.. ఈ సినిమాకు సరైన వసూళ్లు రాకపోవడం గమనార్హం. భారీ వ్యాపారాన్ని చేయాల్సిన ఈ సినిమా డిజాస్టర్గా మిగిలింది. ఇలా వచ్చిన భారీ సినిమా ఫెయిల్ అయిపోవడం, ప్రస్తుతం మరే పెద్ద సినిమాలు కూడా రాకపోవడంతో.. బాక్సాఫీస్ పరిస్థితి డల్గా ఉంది. అయితే ఉన్నంతలో చిన్న సినిమా ఒకటి ఫర్వాలేదనిపించుకోవడం టాలీవుడ్కు కొంత ఊరట. అదే ‘సమ్మోహనం’. గత వారంలో విడుదల అయిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలను, పాజిటివ్ టాక్ను పొందింది.
విడుదలకు ముందే బాగా ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ను కూడా పొందింది. ప్రత్యేకించి మల్టీప్లెక్స్ ఆడియన్స్లో, ఓవర్సీస్లో ఈ సినిమా మంచి వసూళ్లను పొందుతోంది. మరే సినిమా కూడా పోటీలో లేకపోవడం.. సమ్మోహనం పాలిట వరంగా మారింది.
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బాప్ రే సన్నీ.. రూ.150 కోట్లతో తెలుగు సినిమా?
శృంగార తారగా ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించిన సన్నీలియోన్.. ఈ మధ్య బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్లో హాట్ హాట్ పెర్ఫామెన్స్తో అదరగొట్టేస్తుంది.
TNN | Updated:
Dec 3, 2017, 04:13PM IST
శృంగార తార‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించిన సన్నీలియోన్.. ఈ మధ్య బాలీవుడ్, టాలీవుడ్‌ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో హాట్ హాట్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేస్తుంది. తనదైన శైలిలో అందాలను అస్సలు దాచుకోకుండా ఆరబోస్తూ కనువిందు చేస్తుంది. జిస్మ్ 2 మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సన్నీలియోన్‌ వరుస ఐటమ్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటుంది. రయీస్ సినిమాలో షారూఖ్ ఖాన్‌తో కలసి చిందేసిన ఈ చిన్నది తాజాగా సంజయ్ దత్ ‘భూమి’ సినిమాలో ‘ట్రిప్పి ట్రిప్పి’ అంటూ ఒక ఐటెం సాంగ్‌‌లో తడి తడి అందాలతో కుర్రకారులో కాకరేపింది.
దీంతో అమ్మడికి బాలీవుడ్‌లోను కాకుండా తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లోనూ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా తెలుగులో రాజశేఖర్ నటించిన గరుడవేగ మూవీలోనూ ‘డియో.. డియో’ అంటూ ఐటమ్ బాంబ్ పేల్చింది. దీంతో తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించిన సన్నీ.. త్వరలోనే ఒక పూర్తిస్థాయి తెలుగు సినిమా చేయనుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పిరియాడిక్ వార్ డ్రామాలో సన్నీ లీయోన్ లీడ్ రోల్ చేయనుంది.
| 0business
|
Recommended byColombia
గత ఎపిసోడ్లో జరిగిన కథ..
మనోరమ ద్వారా విషయం తెలుసుకున్న సమీర్.. చిన్నీ కోసం జైల్కి పరుగుతీశాడు. అయితే అక్కడ చిన్నీ సమీర్కి నిజం చెప్పదు. ‘నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటున్నావో? ఎవరు నిన్ను బెదిరిస్తున్నారో.. అంతా తెలుసుకుంటా.. బైయిల్ ఏర్పాట్లు చేస్తాను’ అని చెప్పి వెళ్లిపోతాడు. అయితే సమీర్ని బైయిల్ ఏర్పాట్లు చేయకుండా ఉండేందుకు రక్తం కావాలి అని చెప్పి ఫోన్ చేసి సమీర్ని హాస్పెటల్కి పిలుస్తుంది మనోరమ.
705 ఎపిసోడ్లో హైలైట్స్..
ఉపలక్షిత జైల్కి వచ్చి చిన్నీని కలుసుకుంటుంది. ఆమెకు జరిగిందంతా చెబుతుంది చిన్నీ. అయితే ఉపలక్షిత.. ‘ఇది చిన్న కేసు కాదు.. జీవితం నాశనం చేసుకోకు. నాకు తెలిసి.. లక్ష్మీ ఆంటీ కూడా ఈ పని చేసి ఉండరు.. ఏదో జరిగింది.. మొదట నువ్వు నీ మీద కేసు వేసుకోవడం సరికాదు’ అంటూ చాలా చెబుతుంది. కానీ చిన్నీ బాగా ఏడుస్తూ.. ‘నా తల్లి లేకపోతే నాకు జీవితమే లేదు. నాకోసం ఎన్నో త్యాగాలు చేసిన నా తల్లి కోసం నేను ఈ మాత్రం చేయలేనా? మా అమ్మ జైలు పాలు అయితే నేను తట్టుకోలేను’ అంటుంది.
Read Also: మీరు ‘కోయిలమ్మ’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్లు ఒక్క క్లిక్తో!
అమర్ ఆలోచనలో ఉంటాడు.చిన్నీ దగ్గర వాగ్మూలం తీసుకోవడానికి పోలీసులు చిన్నీ సంతకం చేయాలని చెబుతారు. దాంతో ఒకసారి అమర్తో మాట్లాడాలని ఫోన్ చేసి ఇవ్వమంటుంది. అయితే అమర్ చిన్నీతో మాట్లాడటానికి ఇష్టపడడు. చిన్నీ బాధపడుతూ సైన్ చేసి ఇచ్చేస్తుంది. ఇంతలో మనోరమా కావాలనే అమర్ దగ్గరకు వచ్చి.. ‘మన సమీర్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు.. మీ నాన్నకు ఈ పరిస్థితి కలిపించిన ఆ చిన్నీకి సాయం చేయడానికి వెళ్లాడు.. ఇంకా రాలేదు’ అంటూ ఎక్కిస్తుంది. ఇంతలో సమీర్ వచ్చి.. ‘రక్తం కావాలన్నారుగా అత్తయ్యా? ఇచ్చేసి వస్తాను’ అంటాడు.
ఇంతలో లాయర్ నుంచి సమీర్కి కాల్ వస్తుంది. ‘సారీ లాయర్ గారూ ఇందాక చూసుకోలేదు. మా వదిన చిన్నీకి బైయిల్ వచ్చేలా చేయండి’ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అమర్ ఆవేశంగా వెళ్లి లాగిపెట్టి సమీర్ని కొడతాడు. ఫోన్ కింద పడిపోతుంది. సమీర్ షాక్లో ఉంటాడు.‘ఏం చేస్తున్నావ్ రా? మన డాడీ ఈ పరిస్థితికి కారణం అయిన మనిషికి నువ్వు సాయం చేస్తున్నావా? నువ్వు డాడీకి రక్తం ఇవ్వడానికి వీళ్లేదు’ అంటూ గొడవ పడతాడు. అంతే కాకుండా.. ‘నువ్వు డాడీకి రక్తం ఇవ్వాలనుకుంటే చిన్నీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సాయం చేయనని డాడీ మీద ఒట్టు పెట్టు’ అంటూ మాట తీసుకుంటాడు. దాంతో సమీర్ చాలా బాధపడతాడు.
తండ్రి రమేష్ చంద్రకు రక్తం ఇచ్చి వచ్చిన తర్వాత అమర్ దగ్గరకు వెళ్లి, పక్కనే కూర్చుని.. ‘అన్నయ్యా.. వదిన తప్పు చేసి ఉండదు అన్నయ్యా ఒక్కసారి వదినని కలువు.. మన పరువు పోతుంది. డాడీ మామూలు అయ్యే సరికి ఇంటి కోడలే అతడిని చంపాలనుకుందనే విషయం ప్రపంచానికి తెలిస్తే.. డాడీ పరువు పోతుంది.. వెళ్లు అన్నయ్యా..’ అంటూ బతిమాలాడి అమర్ని పంపిస్తాడు. డాక్టర్స్ రమేష్ చంద్రను పరీక్షించి ‘కోలుకునే అవకాశం ఉంది’ అని చెప్పడంతో.. మనోరమా రమేష్ చంద్రను ఎలాగైనా చంపెయ్యాలని నిర్ణయించుకుంటుంది. అందుకే సమీర్ని ఏదైనా తినిరారా అంటూ బయటికి పంపిస్తుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కోయిలమ్మ కొనసాగుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
వొడాఫోన్ కొత్త డేటా ప్లాన్లతో రోజూ 2జీబీ అంతకంటే ఎక్కువ
జియో, ఎయిర్టెల్ ఎక్కువ కాలపరిమితి ప్యాక్లను సరికొత్తగా మార్చడంతో వొడాఫోన్ సైతం అందుకు తగ్గట్లుగా సిద్ధమైంది.
Samayam Telugu | Updated:
Jun 19, 2018, 12:49PM IST
జియో, ఎయిర్టెల్ ఎక్కువ కాలపరిమితి ప్యాక్లను సరికొత్తగా మార్చడంతో వొడాఫోన్ సైతం అందుకు తగ్గట్లుగా సిద్ధమైంది. కొత్తగా రూ.511, రూ.569 ధరల్లో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.511 ప్రీపెయిడ్ ప్లాన్లో భాగంగా84 రోజుల పాటు అపరిమిత ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు. ఇంకా రోజుకు 2జీబీ చొప్పున 84 రోజులకు 168జీబీ డేటా ఉచితం. అంటే ఒక జీబీ ఖరీదు 3 రూపాయలుగా ఉంటుంది.
రూ.569 ప్లాన్ : అధిక డేటా కోసం
ఇంకొక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.569లో భాగంగా ఎక్కువ డేటాను అందించే విధంగా ఉంది. ప్లాన్లో భాగంగా మొత్తం 252 జీబీని అందించనున్నారు.
84 రోజులు వ్యాలిడిటీ కలిగిన ఈ ప్యాక్లో సైతం అపరిమిత ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.
ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్లు చొప్పున 84 రోజుల పాటు ఉచిత ఎస్ఎంఎస్ సదుపాయం.
ప్రతి రోజూ 3జీబీ డేటా చొప్పున మొత్తం 252 జీబీ అంటే ఒక్కో జీబీ ఖరీదు రూ.2.66 గా ఉంటుంది.
| 1entertainment
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
2 కంట్రీస్: సునీల్కు ఇది అగ్నిపరీక్ష
ఒకవైపు వరస పరాజయాలు.. ఇక హీరోగా వేషాలు మానేసి, కమేడియన్ గానే ట్రై చేసుకుంటే మేలేమో అనే ఉచిత సలహాలు, మరోవైపు మార్కెట్ లేదు అనే మాటలు
TNN | Updated:
Dec 29, 2017, 09:58AM IST
ఒకవైపు వరస పరాజయాలు.. ఇక హీరోగా వేషాలు మానేసి, కమేడియన్ గానే ట్రై చేసుకుంటే మేలేమో అనే ఉచిత సలహాలు, మరోవైపు మార్కెట్ లేదు అనే మాటలు, ఇంకోవైపు సునీల్ తో నటించడానికి నో అంటున్న హీరోయిన్లు.. ఏతావాతా సునీల్ పరిస్థితి ఇది. ‘అందాల రాముడు’తో తొలిసారి హీరో అవతారం ఎత్తి కొన్నేళ్ల తర్వాత ‘మర్యాద రామన్న’తో సూపర్ హిట్ ను కొట్టి.. ఆపై హీరో పాత్రలకే పరిమితం అయిన సునీల్ ఇప్పుడు ఒక విధంగా అగ్నిపరీక్షనే ఎదుర్కొంటున్నాడు. హీరోగా ఇకపై కెరీర్ ను కొనసాగించాలంటే నేటి విడుదల ‘2 కంట్రీస్’ కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ఈ హీరో.
ఈ సినిమా మలయాళంలో ఇదే పేరుతో వచ్చిన దిలీప్ సినిమాకు రీమేక్. దీంతో ఒక భాషలో హిట్టైన కథ కాబట్టి.. ఆత్మవిశ్వాసం ఉంటుంది. దర్శకుడు ఎన్.శంకర్ ఈ సినిమా కోసం స్వయంగా నిర్మాతగా మారాడు. ఈ నేపథ్యంలో వీళ్ల లక్ ఎలా ఉందనే విషయం మరి కాసేపట్లో తేలనుంది.
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఐదు వస్తువులపై జీఎస్టీ తొలగింపు
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి చేనేతను తీసుకురావడంపై మొదటి నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
TNN | Updated:
Sep 19, 2017, 08:37AM IST
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి చేనేతను తీసుకురావడంపై మొదటి నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. చేనేత రంగానికి, సగటు వినియోగదారునికి నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తగదని ఆందోళన చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించి చేనేత రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తానికి వీరి మొరను కేంద్ర ప్రభుత్వం ఆలకించింది. చేనేత ముడి సరుకులతోపాటు మరికొన్ని వస్తువుల రేట్లను కేంద్ర ప్రభుత్వం సవరించింది.
ఈనెల 9న హైదరాబాద్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 21వ సమావేశంలో నిర్ణయించిన మేరకు మొత్తం 40 వస్తువుల పన్ను శ్లాబులను మారుస్తూ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఖాదీ వస్త్రాలు, చేనేత చరఖాలు, మట్టి విగ్రహాలు, పత్తి చెక్క, చీపుర్లను జీఎస్టీ నుంచి మినహాయించింది. ప్రస్తుతం ఖాదీ వస్త్రాలు, చీపుర్లు, పత్తి చెక్కపై ఐదు శాతం జీఎస్టీ ఉండగా.. మట్టి విగ్రహాలపై 28 శాతం, చేనేత చరఖాలపై 18 శాతం జీఎస్టీ ఉంది. తాజా మినహాయింపు నేపథ్యంలో ఇక నుంచి ఈ వస్తువుల క్రయవిక్రయాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసంర ఉండదు. అలాగే మరో 35 వస్తువులపై కూడా జీఎస్టీని తగ్గించారు.
| 1entertainment
|
జాతీయ సీనియర్ అథ్లెటిక్స్
100 మీటర్ల విజేత రీనా
ఫతేమైదాన్ : తెలంగాణ అథ్లెటిక్స్సంఘం అధ్వర్యంలో గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో జరుగుతున్న 56వ జాతీయ అథ్లెటిక్స్చాంపియన్షిప్లో మహిళా100 మీటర్ల స్వ్రింట్లో కర్ణాటకకు చెందిన రీనా జాజ్ బంగారు పతకం గెలుచుకుంది. ఈమె లక్ష్యాన్ని 11.99 సెకన్లల్లో పరుగెత్తగా తమిళనాడు క్రీడా కారిణి అర్చన రజిత పతకం సాధించగా, మహారాష్ట్రకు చెందిన రూచాపటేల్ కాంస్య పతకం సాధించింది. గురువారం నాడు ఒక్కడ జరిగిన మరిన్ని ఫలితాలు : 20 మీటర్ల నడకలో బాబుబాయ్ స్వర్ణపతకం, గుజరాత్ సాగర్ జోషి రజిత పతకం, గౌరికుమార్ కాంస్య పతకం మణిపూర్, మహిళల 100 మీటర్ల హడిల్స్లో సుగీనా కేరళ స్వర్ణ పతకం, ధనలక్ష్మి రజిత పతకం తమిళనాడు, కీర్తన కాంసయ పతకం తానా, పురుషుల 110 మీటర్ల హడిల్స్ శ్రీకాంత్ స్వర్ణపతకం కేరళ, ప్రేమ్కుమార్ రజిత పతకం తెలంగాణ, అక్షయ్ కాంస్య పతకం కేరళ, మహిళా త్రిబుల్ జెంపులో శిల్పాచాకో స్వర్ణపతకం కేరళ, కార్తీక రజిత పతకం తానా, జయోలైన్ కాంస్య పతకం కర్ణాటక, గురువారం నాడు విశేషం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారుడు 110 మీటర్ల హడిల్స్లో రజిత పతకం సాధించి కొంత ఊరట కల్గించాడు.
| 2sports
|
అంబానీల 'వ్యూహ్మాత్మక భాగస్వామ్యం'
- జియోతో దోస్తీని ప్రకటించిన ఆర్కామ్
ముంబయి: రిలయన్స్ సోదరుల మధ్య వ్యాపార మైత్రి కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండిస్టీస్కు టెలికాం అనుబంధ సంస్థ 'రిలయన్స్ జియో'తో త్వరలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనున్నట్లు 'రిలయన్స్ కమ్యూనికేషన్స్్' (ఆర్కామ్) ఛైర్మన్ అనిల్ అంబానీ బుధవారం ఇక్కడ ప్రకటించారు. ఆర్కామ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ జియో దేశంలో4జీ సేవల విస్తరణకు గాను అవసరమైన స్పెక్ట్రమ్ వ్రాణిజ్యం, పంపకాలకు సంబంధించి ఈ భాగస్వామం ఉండనుందని ఆయన తెలిపారు. రిలయన్స్ జియో సంస్థ డిసెంబరు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను విస్తరించనున్న విషయం తెలిసిందే. దీనికి తోడు రష్యాకు చెందిన సిస్టెమా సంస్థకు చెందిన భారత అనుబంధ సంస్థతో విలీనం చర్చలు కూడా కీలక దశలో ఉన్నట్లు అనిల్ అంబానీ తెలిపారు. డిసెంబరు నుంచి రిలయన్స్ జియో సంస్థ భారీ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా 4జీ సేవలు ప్రారంభించనున్న నేపథ్యంలో దేశంలో దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్లతో సహా ఆర్కామ్ సంస్థలు తీవ్ర వ్యాపార ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. దేశంలో స్మార్ట్ మొబైల్ ఫోన్లు చౌకగా అందుబాటులోకి రావడంతో దేశ వ్యాప్తంగా డేటా వాడకం బాగా పెరిగింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
చివరి వన్డే విశాఖలోనే.. అనుమానాలు అక్కర్లేదు!
పిచ్ బాగోలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఐదో వన్డేను వైజాగ్లో నిర్వహించే విషయమై అనుమానాలు వ్యక్తం కాాగా, పిచ్ బాగానే ఉందని క్యూరేటర్ చెప్పారు.
TNN | Updated:
Oct 20, 2016, 01:01PM IST
చివరి వన్డే విశాఖలోనే.. అనుమానాలు అక్కర్లేదు!
పిచ్ బాగోలేకపోవడంతో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న చివరి వన్డే మ్యాచ్‌ విశాఖపట్నం నుంచి తరలిపోనుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో.. మ్యాచ్ ఇక్కడే జరగనుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు గంగరాజు స్పష్టం చేశారు. వన్డే మ్యాచ్ నిర్వహణకు పిచ్ ఉందని బీసీసీఐ క్యురేటర్ నివేదిక ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో పిచ్ దెబ్బతిన్నది. దీంతో పిచ్‌ను పరిశీలించేందుకు క్యురేటర్‌ను పంపాలని ఆంధ్ర క్రికెట్ సంఘం బీసీసీఐకి విన్నవించింది. ఏసీఏ అభ్యర్థన మేరకు బీసీసీఐ క్యురేటర్ శ్రీరామ్ కస్తూరి రంగన్‌ను పంపింది. విశాఖపట్నం వచ్చి పిచ్‌ను తనిఖీ చేసిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. హెవీ రోలర్ వాడాలని సలహా ఇచ్చారు. మైదానంలో నాలుగు నెలల కిందటే కొత్త పిచ్‌ను వేశామని, గత రెండు నెలలుగా భారీ వర్షాలు కురవడంతోపాటు సరిపడా వెలుతురు లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు కూడా అయిన గోకరాజు రంగరాజు తెలిపారు. వన్డే మ్యాచ్ గురించి ఎలాంటి ఇబ్బందులు లేవని, వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు మ్యాచ్ గురించే కాస్త ఇబ్బంది ఉందని ఆయన తెలిపారు.
ఇటీవల ఈ స్టేడియంలో అస్సాం, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ సన్నాహక మ్యాచ్‌ నిర్వహించారు. ఆట మూడో రోజు ఏకంగా 17 వికెట్లు పడటంతో ఈ పిచ్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పిచ్ చిత్తడిగా ఉండటం వల్ల బ్యాట్స్‌మన్ బంతులను ఎదర్కోడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ మ్యాచ్‌లో పిచ్‌పై కొన్ని బంతులు చాలా తక్కువ ఎత్తులో దూసుకు రావడంతో అస్సాం కోచ్ సునీల్ జోషి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. నిజానికి ఈ పిచ్‌ను భారత్, న్యూజిలాండ్ వన్డే కోసం తయారుచేశారని, కానీ తమ మ్యాచ్‌లో పిచ్ స్వభావం బయటపడిందని ఆయన వెల్లడించారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఫైనల్లో ఏంటి.. నాగర్కోటి ఆ స్పీడ్..?
న్యూజిలాండ్లో శనివారం ముగిసిన అండర్-19 ప్రపంచకప్ ద్వారా చాలా మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు.
TNN | Updated:
Feb 3, 2018, 06:50PM IST
ఫైనల్లో ఏంటి.. నాగర్కోటి ఆ స్పీడ్..?
న్యూజిలాండ్లో శనివారం ముగిసిన అండర్-19 ప్రపంచకప్ ద్వారా చాలా మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. శుభ్మన్ గిల్, మన్జోత్ కల్రా, కెప్టెన్ పృథ్వీ షా బ్యాట్తో మెరిస్తే.. బంతితో అనుకుల్, అభిషేక్ వర్మ, నాగర్కోటి, శివమ్ మావి సత్తాచాటారు. ముఖ్యంగా నాగర్కోటి ఫైనల్లో గంటకి సరాసరి 143 కి.మీ వేగంతో బంతులు విసురుతూ దిగ్గజ క్రికెటర్లని సైతం ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో అనే కాదు.. టోర్నీ మొత్తం కూడా నాగర్కోటి 140 కి.మీ వేగంతో బంతులు విసురుతూనే వచ్చాడు.
టాలెంట్ ఎక్కడున్నా వేగంగా గుర్తించే నైపుణ్యమున్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గత నెల 14వ తేదీన ఓ ట్వీట్ చేశాడు. ‘విరాట్ కోహ్లి, వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ.. అండర్-19 ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శని ఓ సారి చూడండి. న్యూజిలాండ్ పిచ్లపై శివమ్ మావి, నాగర్ కోటి గంటకి 145 కి.మీ వేగంతో బంతులు విసురుతున్నారు’ అని ఆ ట్వీట్ చేశాడు. దాదా ఊహే నిజమైంది. ఫైనల్లో నాగర్కోటి 147 కి.మీ వేగంతో విసిరిన బంతికి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ జాక్ ఇవాన్స్ వద్ద సమాధానమే లేకపోయింది. బంతిని ఎదుర్కోలేక అతను క్లీన్ బౌల్డవగా.. వేగానికి ఆఫ్ వికెట్ గాల్లోకి లేచి వైడ్లైన్కి అవల పడింది. అండర్-19 జట్టు బౌలర్ ఇంత స్పీడ్తో బౌలింగ్ చేయడమా..? ఏంటి నాగర్కోటి ఈ స్పీడ్..? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వేగాన్ని చూసేనేమో.. కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంఛైజీ ఇటీవల ఐపీఎల్ వేలంలో రూ. 3.2 కోట్లకి నాగర్కోటిని కొనుగోలు చేసింది.
| 2sports
|
Oct 19,2016
ఇల్లినాయిస్తో తెలంగాణ ఒప్పందం
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: తెలంగాణ, ఇల్లినాయిస్ రాష్ట్రాలు కలిసి వివిధ రంగాలలో నైపుణ్యాల సహకారం పంచుకోను న్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని షికాగోలు జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో పరిశ్రమల వాణిజ్య ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి, రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మ్మేషన్ ఆఫీసర్ (సీఓఓ)లు అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ లు,ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుతో పాటు భారత కన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ అసఫ్ సయీద్ కూడా పాల్గొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా రెండు రాష్ట్రాలు స్మార్ట్ స్టేట్ సోల్యూషన్స్, ఈ-పాలన, వ్యవస్థాపకత, ఆవిష్కరణలు, వాణిజ్య ఇంక్యూబేషన్లు, ఉద్యోగాల కల్పన, తదితర అంశాల్లో ఇరు రాష్ట్రాలు భాగస్వామ్య సహకారాన్ని అందించు కొనున్నాయి. ఇల్లినాయిస్ రాష్ట్రం స్మార్ట్ స్టేట్ సోల్యూషన్స్లో భాగంగా తెలంగాణలో కాలుష్య పర్యవేక్షణ బోర్డును ఏర్పాటు చేయనుంది. విపత్తు, అత్యవసర ఉత్తమ పద్ధతులు, టూల్స్ ప్రక్రియలు, డెటా మేనేజిమెంట్, డెటా విశ్లేషణలు, ఓపెన్ డెటా, ఇంటిలిజెంట్ రవాణా వ్యవస్థను ఇరు రాష్ట్రాలు పంచుకుంటాయి. షికాగో పర్యటనలో ఉన్న మంత్రి స్థానకంగా ఉన్న 100 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీఈ హెల్త్ కేర్, జీఈ ఏవిషయేషన్ ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Meriborn Cricket Club
క్రికెట్లో ఇకపై రెడ్ కార్డ్ సస్పెన్షన్
ముంబై: త్వరలో క్రికెట్లో పలు విప్లవాత్మక మార్పులు రానున్నాయి.కాగా క్రికెట్లో బంతికి,బ్యాట్కు మధ్య సమతుల్యం చేసేందుకు మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసిసి) కొన్ని పరిమి తులను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ర్ెం కార్డ్ సస్పెన్షన్,బ్యాట్ సైజ్ కుదింపు లాంటి మార్పులను ప్రపంచ క్రికెట్ కమిటీకి సూచిం చింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ బ్రియర్లీ నేతృత్వంలో రెండు రోజుల పాటు సమావేశమై ఈ కమిటీ పలు అంశాలపై చర్చించింది.ఇందులో మైదానంలో ఆటగాళ్లు హింసాత్మకంగా ప్రవర్తిస్తే రెడ్ కార్డ్ సస్పెన్షన్ వేటు వేయాలని సిఫారసు చేసింది.కాగా ఈ తరహా వేటు ప్రస్తుతం పుట్బాల్-హాకీ తరహాలో ప్లేయర్లకు మాత్రమే ఉంది.టెస్టు మ్యాచ్ను నాలుగు రోజులకు కుదించడంపైనా కమిటీ చర్చించింది.అయితే చివరకు ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.ఇందులో భాగంగా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ను ప్రవేశపెట్టడంపై అడుగులు వేయాలి కూడా ఎంసిసి సూచించింది.కాగా ఈ కమిటీ భేటీలో మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), రమీజ్రాజా(పాకిస్థాన్),జాన్ స్టీఫెన్సన్(ఎంసిసి చీఫ్ ) పాల్గొన్నారు.
అక్టోబరు 1 నుంచి కొత్త నిబంధనలు ఇక ఎంసిసి విషయానికి వస్తే క్రికెట్లో నిబం ధనలను రూపొందించడం దీని బాధ్యత.కాగా ఈ కమిటీ చేసిన ప్రతిపాదనలను ఎంసిసి ప్రధాన కమిటీకి పంపుతారు.అక్కడ ఇవి ఆమోదం పొందితే లా ఆఫ్ క్రికెట్లో కొత్త కోడ్ 2017 అక్టోబరు 1 నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి వస్తాయి.కాగా తాజా ప్రతిపాదనల ప్రకారం మైదానంలో ఆటగాడు తీవ్ర స్థాయిలో క్రమశిక్షణకు ఉల్లంఘించినపుడు అతని మ్యాచ్ నుంచి పంపే అధికారం అంపైర్లకు ఉంటుంది. కాగా బ్యాట్స్మెన్ కొట్టిన బంతి ఫీల్డర్ హెల్మెట్కు తగిలి క్యాచ్ పడితే ప్రస్తుతం నాటౌట్గా ఇస్తున్నారు.ఇకపై దానిని ఔట్గా పరిగణించాలని కమిటీ ప్రతిపాదించింది.బ్యాట్ సైజ్పై పాంటింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బ్యాట్ను కుదించేందుకు 60 శాతం మంది ఆటగాళ్లు మద్దతిస్తున్నారు.బ్యాట్ బ్లేడ్ సైజ్ 40 మిల్లీ మీటర్లు మించకుండా చూడాలని ప్రతిపాదించారు.ఒలింపిక్స తదితర క్రీడల్లో క్రికెట్ను ప్రవేశపెట్టడాన్ని బిసిసిఐ వ్యతిరేకిస్తు వస్తుంది. సచిన్ సూచన తిరస్కరణ రంజీల్లో రెండు పిచ్లపై మ్యాచ్లను నిర్వహించాలని సచిన్ సూచనను ఎంసిసి సానుకూలంగా స్పందించలేదు.దీంతో అందరిని సంతృప్తి పరిచాకే తుది నిర్ణయం తీసుకోవాలని కమిటీ సభ్యలు నిర్ణయించారు.ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఫోటీ తత్వం ఉండాలి.కాగా రెండు రకాల పిచ్లను ఉపయోగిస్తే ఫస్ట్క్లాస్ క్రికెట్ ప్రాధాన్యం తగ్గుతుంది.ఇది ఎంసిసి క్రికెట్ కమిటీ అభిప్రాయం అని పాకిస్థాన్ క్రికెటర్ రమీజ్రాజా పేర్కొన్నాడు. ఎంసిసి కమిటీ సభ్యులు వేరే మైక్ బ్లేయర్లే(చైర్మన్),జాన్ స్టిఫెన్సన్(క్రికెట్ ఎంసిసి హెడ్),జిమ్మీ ఆడమ్స్,గంగూలీ,రాడ్ మార్ష్.
| 2sports
|
బాల్ టాంపరింగ్లో దోషిగా డుప్లెసిస్
అడిలైడ్: బాల్ టాంపరింగ్ వివాదంలో ఐసిసి ఆర్టికల్ 2.2.9 ప్రవర్తనా నియమావళిని ఉల్లం ఘించినందుకు గాను దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డెప్లెసిస్పై చర్యలను తీసుకుంది.కాగా బాల్ టాంపిరింగ్కు పాల్పడినట్లు వీడియో పుటేజీలో తేలడంతో అతడికి మొత్తం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధిస్తూ ఐసిసి నిర్ణయం తీసుకుంది.రెండవ టెస్టులో పాల్గొన్న అంపైర్ల సాక్ష్యాలు,మార్లేబోస్ క్రికెట్ క్లబ్ క్రికెట్ జాస్ స్టీపెన్సన్ హెడ్ ఇచ్చిన వివరణలను పరిగణలోకి తీసుకున్న ఐసిసి బాల్ టాంపరింగ్ వివాదంలో డుప్లెసిస్ను దోషిగా తేల్చింది.అయితే అడిలైడ్లో జరిగే మూడవ టెస్టు ఆడేందుకు మాత్రం డుప్లెసిస్కు క్లియరెన్స్ ఇచ్చింది.డె ప్లెసిస్ తన లాలాజలంతో బంతని రుద్దడమే కాకుండా, నోటిలో ఉన్న మింట్ను కూడా ఉపయోగించి నట్లు ఐసిసి తన నివేదికలో పేర్కొంది.ఇది ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్లోని 2.2.9 నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు. దీంతో అతనికి వార్నింగ్ ఇచ్చి జరిమానా విధిస్తున్నట్లు ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్సన్ పేర్కొన్నాడు.డెప్లెసిస్పై చర్యలు తీసుకునే క్రమంలో ఫీల్డ్ అంపైర్ల సాక్ష్యం తీసుకున్నట్లు ఆయన వెల్లడించాడు.అయితే ఫీల్డ్ అంపైర్లు వెంటనే అప్రమత్తమై డుప్లెసిస్ చర్యను నివారించారని రిచర్డ్ సన్ వెల్లడించాడు.బాల్ టాంపరింగ్కు పాల్పడటం వల్ల బంతి యొక్క స్థితి మారుతుందని ఆయన పేర్కొన్నాడు. అయితే తాను కావాలని ఏ తప్పు చేయలేదని డుప్లెసిస్ తన వాదనను ఐసిసి ముందు వినిపించాడు. కావాలని చేయకపోయినా అతడు ఐసిసి కోడ్ నియమావళిని ఉల్లఘించినట్లే అవుతుందని, దీంతో డుప్లెసిస్పై మ్యాచ్నిషేదం పడే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చినప్పటికి చివరకు 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించడం విశేషం.గతంలో 2013లోనూ పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో డెప్లెసిస్ బాల్ టాంపరింగ్కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై 50 శాతం మ్యాచ్ ఫీజు కోల్పోయాడు.ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా 2-0 తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించి దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
| 2sports
|
Passengers movie coming to India soon in all regional languages
అంతరిక్షంలో తప్పిపోయిన ప్రేమజంట
క్రిష్ , జెన్నీఫర్ అనే జంట అంతరిక్షంలో నూతన గ్రహాన్ని కనుగొనేందుకు ప్రయాణమయ్యారు. అక్కడే వీరి ప్రేమ చిగురించింది. అయితే వారి ప్రయాణంలో అవాంతరం ఎదురయ్యింది. వారు మళ్ళీ భూగ్రహానికి తిరిగి...
TNN | Updated:
Dec 23, 2016, 07:34PM IST
క్రిష్ , జెన్నీఫర్ అనే జంట అంతరిక్షంలో నూతన గ్రహాన్ని కనుగొనేందుకు ప్రయాణమయ్యారు. అక్కడే వీరి ప్రేమ చిగురించింది. అయితే వారి ప్రయాణంలో అవాంతరం ఎదురయ్యింది. వారు మళ్ళీ భూగ్రహానికి తిరిగి వస్తారా? లేదా అక్కడే సెటిల్ అయిపోతారా? తెలుసుకోవాలని ఉందా?
అయితే విషయంలోకి వెళ్దాం.. మార్టేన్ టైయిడమ్ దర్శకత్వంలో క్రిష్ ప్రాట్, జెన్నీఫర్ లారెన్స్ నటించిన రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ అడ్వంచర్ థ్రిల్లర్ ' ప్యాసెంజర్స్ ' డిసెంబర్ 21న విడుదలయింది. అంతరిక్షంలో ఓ నూతన గ్రహాన్ని కనుగొంటారు శాస్త్రవేత్తలు. అందులో జనజీవనయోగమైన అంశాలున్నాయేమో తెలుసుకొనేందుకు స్పేస్ షిప్ లో క్రిష్, జెన్నీఫర్ ను పంపిస్తారు. ఆ నూతన గ్రహాన్ని చేరుకొనేవరకు వారిని నిద్రావస్థలో ఉంచుతారు. అయితే అంతరిక్ష ప్రయాణంలో అనుకోకుండా 90 ఏళ్ళు ముందుగానే వారు నిద్రలేస్తారు. తరువాత ఒకరిపై ఒకరు మనసు పడతారు. నిజానికి వారి నిద్రావస్థకు సెట్ చేసిన టైమ్ కంటే ముందే వారు నిద్రలేవడం వల్ల ఏమి జరిగింది? వారు అనుకున్న ప్రకారం కొత్త గ్రహం చేరుకున్నారా లేదా? తరువాత ఏమయింది? అన్న ఉత్కంఠ భరితమైన అంశాలతో 'ప్యాసెంజర్స్' సినిమా సాగుతుంది.
జనవరి 6న ఇండియాలో ఈ ప్యాసెంజర్స్ చిత్రం తెలుగు,తమిళం,హిందీ మరియు ఆంగ్ల భాషలలో ఒకేసారి విడుదల కానుంది.
Jennifer Lawrence (Aurora) and Chris Pratt (Jim) star in an exciting action-thriller about two strangers who are on a 120-year journey to another planet when their hibernation pods wake them 90 years too early. Jim and Aurora are forced to unravel the mystery behind the malfunction as the ship teeters on the brink of collapse, jeopardizing the lives of the passengers on the greatest mass migration in human history. They begin to fall for each other, unable to deny their intense attraction... only to be threatened by the imminent collapse
of the ship and the discovery of the truth behind why they woke up.
The film "Passengers" scheduled for release on Jan 06th, 2017 in India.
| 0business
|
sumalatha 115 Views Nirmala Sitharaman , rbi
Reserve Bank of India
న్యూఢిల్లీ: విదేశీ మారక ద్రవ్యం సమీకరించేందుకు బాండ్స్ జారీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలపై ఆర్బీఐ ఆగస్టు 16వ తేదీన బోర్డు భేటీ కానుంది. ఈ భేటీలో బాండ్ల అంశంతో పాటు పలు విషయాలు చర్చించనున్నారు. ప్రధాని కార్యాలయ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. మరోపక్క ఆర్థిక మంత్రి మాత్రం బాండ్ల జారీ ఉంటుందన్నట్లే ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు.
ఇటీవల ప్రభుత్వం సావరీన్ బాండ్లను జారీ చేయాలని నిర్ణయించింది. దీనిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శించారు. భారత్ పరిస్థితి బాగున్నప్పుడు వీటిని కొంటారని పరిస్థితి బాగోనప్పుడు అమ్మేస్తారని పేర్కొన్నారు.
తాజా ఎడిటోరియల్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/editorial/
| 1entertainment
|
Hyderabad, First Published 3, May 2019, 2:23 PM IST
Highlights
అక్కినేని నాగచైతన్య మజిలీ సినిమా ద్వారా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. సమంతతో కలిసి నటించిన ఎమోషనల్ లవ్ స్టోరీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూస్తుండగానే సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది.
అక్కినేని నాగచైతన్య మజిలీ సినిమా ద్వారా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. సమంతతో కలిసి నటించిన ఎమోషనల్ లవ్ స్టోరీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూస్తుండగానే సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. 28రోజుల్లో 68కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం.
నాగచైతన్య కెరీర్ లోనే అత్యధికంగా 38 కోట్ల(షేర్స్) రూపాయలను మజిలీ కలెక్ట్ చేసింది. గత నెల 5న విడుదలైన మజిలీ ఈ రేంజ్ లో హిట్టవుతుందని ఎవరు ఉహించంలేదు. పైగా పోటీగా చిత్రలహరి - జెర్సీ అలాగే కాంచన - అవెంజర్స్ లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కలెక్షన్స్ లో తేడా రాలేదు.
28రోజులకుగాను ఏరియాల వారీగా మజిలీ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజం...................... ..13.02 Cr
| 0business
|
Hyderabad, First Published 16, Aug 2019, 6:22 PM IST
Highlights
'కర్మ' తో తెలిసి రాలేదు. ఆ తరువాత 'కిస్' ఇచ్చిన దెబ్బకు డైరెక్షన్ ని వదిలి కథల గూడచారిలా మారాడు 'ఎవరు' కథానాయకుడు అడివి శేష్.'క్షణం' నుంచి సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తున్న ఈ హీరో నెక్స్ట్ మేజర్ తో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
కర్మ' తో తెలిసి రాలేదు. ఆ తరువాత 'కిస్' ఇచ్చిన దెబ్బకు డైరెక్షన్ ని వదిలి కథల గూడచారిలా మారాడు 'ఎవరు' కథానాయకుడు అడివి శేష్.'క్షణం' నుంచి సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తున్న ఈ హీరో నెక్స్ట్ మేజర్ తో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. సినీ కెరీర్ లో జయాపజయాలు కామన్. కానీ డిఫరెంట్ హిట్స్ రెండు మూడు అందుకుంటే అది కెరీర్ కి చాలా కలిసొస్తుంది.
ఈ జనరేషన్ లో కామెడీ యాంగిల్ లో నాని డిఫరెంట్ టైమింగ్ తో క్లిక్కయితే విజయ్ దేవరకొండ హెవీ యాంగ్రీ అండ్ రియాలిటీ యాక్టింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకొచ్చారు. ఇప్పుడు అదే తరహాలో సొంతంగా అడివి శేష్ కూడా తన కెరీర్ ను సెట్ చేసుకుంటున్న తీరును మెచ్చుకొని తీరాల్సిందే.
ఈ జనరేషన్ కుర్ర హీరోల కంటే ఒక అడుగు ముందుకు వేసి సొంతంగా తనకు సెట్టయ్యే కథలను రాసుకోని సక్సెస్ లు అందుకుంటున్నాడు. అలాగే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ - ప్రమోషన్స్ వంటి విషయాల్లో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. సినిమా ప్రివ్యూలను మీడియాకు ఒక రోజు ముందుగానే వేయడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని.
ఎందుకంటె ఎవరి సినిమాలు వారికి ముద్దుగానే ఉంటాయి. తేడా వస్తే కనీసం అడివి శేష్ చెప్పినట్టుగా పోస్టర్స్ అతికించుకునే పిండి ఖర్చు కూడా వెనక్కి రాదు. అలాంటిది క్రిటిక్స్ ప్రశంసలు అందుకునేలా ఎవడు సినిమాను అడివి శేష్ ప్రమోట్ చేశాడు. సో మనోడు ఇదే విధంగా ఆలోచిస్తే కెరీర్ మరో లెవెల్ కు వెళుతుందని చెప్పవచ్చు. ఆల్ ది బెస్ట్ అడివి శేష్..
Last Updated 16, Aug 2019, 6:22 PM IST
| 0business
|
డబ్బు ఎగవేసే సలహాలు ఇవ్వకండి
- నల్లధనం అరికట్టడంలో సీఏలు కీలక ప్రాత పోషించాలి
- జీరో మార్కెట్ వైపు మొగ్గు చూపొద్దని ప్రజలకు విజ్ఞప్తి : సీఏ ఫోరమ్ లోగో ఆవిష్కరణలో మంత్రి ఈటల
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: దేశంలో ఎకానమీకి సరిపోయే చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ)లు ఉంటే ఈ రోజు రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేసే అవసరం వచ్చేది కాదని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అదివారం సనత్నగర్లో తెలంగాణ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఫోరం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఫోరం లోగోను ఆవిష్కరించి, నిరుపేద సీఏ విద్యార్థులకు ఫోరం తరపున ఆర్థిక సహయం కింద చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న అక్రమ సంపాదనను అరికట్టడంలో సీఏలు ప్రధాన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. టాక్స్ మదింపు విషయంలో దేశం చాల ప్రిమేటివ్ స్టేజిలో, వెనుక బాటుతనంలో ఉందని అన్నారు. దేశంలో ఓ వర్గం ప్రజలు ఆకలి అలమటిస్తుంటే..మరో వర్గం లక్షల కోట్లను అక్రమ మార్గంలో సంపాందించే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. దీంతో అభివృద్ధి ఫలాలు అందరికి సమానంగా అందాలన్న స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నారు. 70 ఏండ్ల భారతావనిలో సంపద కొంతమందికి చుట్టం అయ్యిందని, మెజారిటీ ప్రజలను దారిద్రంలోనే ఉంచిందని వ్యాఖ్యానించారు. సీఏలు దేశం కోసం ఆలోచించాలి అని సూచించారు. తమ క్లయింట్లకు డబ్బు ఎగవేసే మార్గాలు కాకుండా టాక్స్ కట్టించే దిశగా ప్రయత్నం సాగాలని అన్నారు. ఈ విషయంలో ప్రధానంగా ప్రజల్లో చైతన్యం రావాలని ఈటెల ఆకాంక్షించారు. వస్తువుల కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా బిల్లు తీసుకోవాలని, తక్కువ ధరకు వస్తుందని జీరో మార్కెట్లో కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వ్యాపారస్తులు సైతం టాక్స్ చెల్లించి ఆత్మగౌరవంతో బతకాలి కానీ..తమ గౌరవం తాకట్టు పెట్టి దోషులుగా నిలబడవద్దని హితవు పలికారు. ప్రతి ఏడాది 2000 మంది విద్యార్థులకు సీఏపై అవగాహనా క్లాస్లు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన తెలంగాణ సీఏ ఫోరమ్ను ఈటెల అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోరం వ్యవస్థాపకులు కలిమిచెర్ల విజరు కుమార్, ఉపాధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి సంజీవ్, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
2019 ప్రపంచకప్లో ఇంగ్లాండ్కే ఛాన్స్లెక్కువ..!
ఇంగ్లాండ్ జట్టు గత కొద్దినెలలుగా వన్డేలు ఆడుతున్న తీరు చూస్తుంటే.. వచ్చే ఏడాది ప్రపంచకప్లో ఆ జట్టే విజేతగా నిలిచేలా కనిపిస్తోందని దక్షిణాఫ్రికా
Samayam Telugu | Updated:
Jun 1, 2018, 12:07PM IST
2019 ప్రపంచకప్లో ఇంగ్లాండ్కే ఛాన్స్లెక్కువ..!
ఇంగ్లాండ్ జట్టు గత కొద్దినెలలుగా వన్డేలు ఆడుతున్న తీరు చూస్తుంటే.. వచ్చే ఏడాది ప్రపంచకప్లో ఆ జట్టే విజేతగా నిలిచేలా కనిపిస్తోందని దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. 2019 ప్రపంచకప్కి ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తుండటం కూడా ఆ జట్టు విజయావకాశాల్ని రెట్టింపు చేస్తోందని వివరించిన డొనాల్డ్.. దక్షిణాఫ్రికా జట్టు కప్ ఆశలు ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్తో సన్నగిల్లాయని వెల్లడించాడు. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లోనూ ఇంగ్లాండ్ జట్టు 125 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తర్వాత వరుసగా భారత్ (122), దక్షిణాఫ్రికా (113) ఉన్నాయి.
| 2sports
|
viral v. acharya
ఆర్బిఐ డిఫ్యూటీి గవర్నర్గా వైరల్ వి ఆచార్య
న్యూఢిల్లీ, డిసెంబరు 29: కేంద్ర ప్రభుత్వం న్యూయార్క్ వర్సి టీలో ఆర్థికవిభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న వైరల్ వి ఆచార్యను రిజర్వుబ్యాంకు డిఫ్యూటీ గవర్నర్గా నియమించింది. కేబినెట్ నియామకాల కమిటీ ఆయన నియామకాన్ని ఖరారు చేసింది. వైరల్ ఈమేరకు పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. పెద్దనోట్ల రద్దు అనంతరం ఒకే సారి భారీ ఎత్తున నిబంధనలు మార్పులుచేర్పులు చేస్తున్నట్లు భారీ విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో వైరల్ ఆచార్య డిఫ్యూటీ గవర్నర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నా రు. ఆర్థికరంగంలో ఎదురవుతున్న సమ స్యలు, సవాళ్లు, సంక్లిష్ట పరిస్థితులపై ఆచార్య పరిశోధనలు చేసారు. సిద్ధాంతపరమైన పరిశోధనలకు ఆచార్య పెట్టిందిపేరు. న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఆయన ఆర్థికవిభాగం ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఐఐటి ముంబై పూర్వవిద్యార్ధిగా ఉన్న ఆచార్య కంప్యూటర్సైన్స్ ఇంజనీరింగ్లో బ్యాచలర్ డిగ్రీ పొందారు. 2001లో న్యూయార్క్ వర్సిటీనుంచి ఫైనా న్స్లో పిహెచ్డి పొందారు. 2001 నుంచి 2008 వరకూ లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పని చేసారు. అక్కడే కాల ర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రైవేటు ఈక్విటీ విభాగానికి బోధనా డైరెక్టర్గా పనిచేసారు. 2008 లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో హౌబ్లన్నార్మల్ రీసెర్చ్స్కాలర్గా కొన సాగారు. అంతేకాకుండా ఆయన మంచి సంగీతకారునిగా కూడా పేరున్న ఆచార్య ఆధ్వర్యంలో డిఫ్యూటీ గవర్నర్గా ఆయన సేవలు కీలకం కానున్నాయి.
| 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఇద్దరు సౌతిండియా లెజెండ్స్ ఒకే సినిమాలో!
సౌతిండియన్ సినీ పరిశ్రమలోనే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనూ లెజెండ్స్గా గుర్తింపు వున్న నటులు...
TNN | Updated:
Aug 7, 2017, 08:13PM IST
సౌతిండియన్ సినీ పరిశ్రమలోనే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనూ లెజెండ్స్‌గా గుర్తింపు వున్న నటులు కమల్ హాసన్, మోహన్ లాల్. ఈ ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యారు. చివరిసారిగా 2009లో వీళ్లిద్దరూ కలిసి 'ఉన్నైపోల్ ఓరువన్' అనే తమిళ చిత్రంలో నటించారు. బాలీవుడ్‌లో హిట్ అయిన ఏ వెడ్నెస్‌డే సినిమాకు ఇది తమిళ రీమేక్. ఉన్నైపోల్ ఓరువన్ సినిమా రిలీజైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి మరో తమిళ రీమేక్ సినిమాకి సైన్ చేశారని తెలుస్తోంది. ఇది కూడా బాలీవుడ్‌లో హిట్ అయిన సినిమాకు తమిళ రీమేక్ వెర్షన్ కావడం విశేషం.
బాలీవుడ్ హిట్ ఫిలిం ఓ మై గాడ్ సినిమాకి సంబంధించిన తమిళ రీమేక్ వెర్షన్‌లో మోహన్ లాల్, కమల్ హాసన్ కలిసి నటించనున్నారని సమాచారం. అయితే, ఇప్పటివరకు ఈ వార్తలని ఈ నటులు కానీ లేదా తమిళ సినీవర్గాలు కానీ ఎవ్వరూ అధికారికంగా ధృవీకరించలేదు. కాకపోతే త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. అన్నట్టు ఇదే ఓ మై గాడ్ సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్, వెంకటేష్ హీరోలుగా గోపాల గోపాల అనే టైటిల్‌తో రూపొంది, హిట్ అయిన సంగతి తెలిసిందే.
| 0business
|
Kerala, First Published 18, Aug 2018, 7:34 AM IST
Highlights
కేరళలో కురుస్తున్న తీవ్ర వర్షాలతో అక్కడి ప్రజా జీవనం స్తంభించిపోయింది. దాదాపు 14 జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
తిరువనంతపురం: కేరళలో కురుస్తున్న తీవ్ర వర్షాలతో అక్కడి ప్రజా జీవనం స్తంభించిపోయింది. దాదాపు 14 జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇతర రాష్ట్రాలు, సినీ ప్రముఖులు కూడా మలయాళీలనుసాధ్యమైనంత ఆదుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే టెలికాం సంస్థలు తగిన సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. ఫోన్ బిల్లుల చెల్లింపుల్లో వెసులుబాటు, అలాగే ఒక వారం రోజుల పాటు ఫ్రీ డేటా, టాక్ టైం అందిస్తామని ప్రకటించాయి.
ఏడు రోజుల ‘జియో’ ఉచిత సేవలిలా.
.
రిలయన్స్ జియో ఏడు రోజుల పాటు ఉచిత సేవలు అందిస్తానని ప్రకటించడంతోపాటు, బీఎస్ఎన్ఎల్ అపరిమిత ఫ్రీ కాల్స్, డేటా, 100 మేసేజ్లు అందించనున్నది. అలాగే ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ.30 టాక్ టైం క్రెడిట్, 1జీబీ డేటాను వారం రోజులు పాటు అందించడానికి ముందుకు వచ్చింది. ‘ఈ బాధాకర సమయాల్లో మీకు సాయం చేయడానికి మీ వెంట ఉంటాం. మీరు ఆప్తుల గురించి సమాచారం తెలుసుకోవడానికి, వారితో టచ్లో ఉండటానికి ఈ ఆఫర్ ను అందిస్తున్నాం’ అని జియో తెలిపింది.
వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ అపరిమిత ఆపర్లు
బీఎస్ఎన్ఎల్ సొంత వినియోగదారులు అపరిమితంగా ఆఫర్లు అందించడంతోపాటు ఇతర నెట్ వర్క్ల వారితో మాట్లాడేందుకు రోజుకు 20 నిమిషాల టాక్టైంను అందిచనున్నదని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఎయిర్టెల్ కూడా ఈ జాబితాలో చేరింది. పోస్ట్ పెయిడ్ వినియోగదారులు బిల్లు చెల్లించడానికి కొంత సమయం ఇవ్వడంతోపాటు ఎటువంటి అంతరాయం లేని సేవలను కల్పించనున్నది. అలాగే ఒక వీశాట్ను ఏర్పాటు చేసి ఐదు కేంద్రాల్లో ఫ్రీ వైఫై, కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తున్నట్లు ఎయిర్ టెల్ పేర్కొన్నది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతో దగ్గరిలో గల ఎయిర్ టెల్ షోరూంలలో ఛార్జింగ్ చేసుకోవడం, స్టోర్స్ నుంచి ఫ్రీ కాల్స్ చేసుకొనే ఫెసిలిటీని ఎయిర్ టెల్ అందిస్తుంది.
రూ.10 లక్షల కోట్లకు ఐటీ వసూళ్లు
గత ఆర్థిక సంవత్సరం (2017 - 18)లో రూ.10.03 లక్షల కోట్ల మేర ఆదాయం పన్ను వసూలైనట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. ఆదాయ పన్ను తూర్పు జోన్ రెండు రోజుల సమావేశంలో సీబీడీటీ సభ్యుడు శబ్రి భట్టసాలి మాట్లాడుతూ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 6.92 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని, అంతక్రితం ఏడాదితో పోలిస్తే 1.31 కోట్ల మంది పెరిగారని చెప్పారు. 2016-17లో 5.61 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేశారు. నికరంగా గతేడాది కోటి మందికిపైగా పన్ను పరిధిలోకి వచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 1.25 కోట్ల మందిని ఈ పన్ను పరిధిలోకి తేవాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పెద్ద అప్పు ఖాతాలపై ఆర్బీఐ నజర్!
దేశీయ బ్యాంకింగ్ రంగం ప్రక్షాళన దిశగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అడుగులు వేస్తోంది. దేశంలోని అతిపెద్ద మొండిబాకీలు వాటికి బ్యాంకులు ప్రత్యేకంగా జరుపుతున్న కేటాయింపులపై ప్రత్యేక నజర్ పెట్టింది. బ్యాంకింగ్ రంగంలో ఒత్తిడిలో కొనసాగుతున్న దాదాపు 200 పెద్ద అప్పు ఖాతాలు.. వాటికి ఆయా బ్యాంకులు జరిపిన కేటాయింపులపై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ మొండి బాకీల విషయంలో బ్యాంకులు నిర్ధిష్టమైన నిబంధనలు పాటించాయా లేదా అనే దానిపై తొలుత సమాచారం సేకరిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారి ఒకరు చెప్పారు. ముఖ్యంగా రుణాలపై అంచనా, కేటాయింపులు, రుణాల పునరుద్ధ్దరణపై ఆర్బీఐ దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
వీడియోకాన్, జిందాల్ తదితర సంస్థలపై ఆర్బీఐ ‘ఐ’
ఆర్బీఐ పరిశీలనలో ఉన్న సమస్యాత్మక పెద్ద ఖాతాల్లో వీడియోకాన్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ తదితర సంస్థలు ఉన్నట్టుగా సమాచారం. 2018 మార్చి ముగింపుకల్లా బ్యాంకింగ్ రంగంలో స్థూల మొండి బాకీలు రూ.10.3 లక్షల కోట్లకు చేరి, 11.2 శాతంగా నమోదయ్యాయి. 2017 ఇదే మార్చి నాటికి మొండి బాకీలు రూ.8 లక్షలతో 9.5 శాతంగా చోటు చేసుకున్నాయి. గతేడాది జరిపిన వార్షిక తనిఖీల్లో యాక్సిస్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, యస్ బ్యాంకులు మొండి బాకీలను తక్కువగా చూపి దొరికి పోయాయి. ఆ బ్యాంకులు మొండి బాకీల కోసం కేటాయింపులు తక్కువగా చేసి చూపెట్టాయి. ఈ నేపథ్యంలోనే అన్ని బ్యాంకులు తమకు మొండి బాకీల సమగ్ర వివరాలను అందజేయాలని గతేడాది ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
Last Updated 9, Sep 2018, 12:25 PM IST
| 1entertainment
|
Nov 04,2015
'హీరో'కు పండుగ గిరాకీ
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ 'హీరో మోటో కార్ప్' గత నెలలో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. ఈ పండుగ మాసంలో ఆ కంపెనీ అమ్మకాలు ఏకంగా 11.25 శాతం పెరిగి 6,39,802 యూనిట్లకు చేరాయి. 2013 అక్టోబర్లో అత్యధికంగా 6.25 లక్షల యూనిట్లు విక్రయించింది. ఆ తర్వాత భారీ విక్రయాలు గత మాసంలోనే నమోదు కావడం విశేషం. 2014 ఇదే మాసంలో 5,75,056 యూనిట్లు విక్రయించింది. అక్టోబర్లో స్కూటర్ అమ్మకాలు ఏకంగా 74.6 శాతం పెరిగాయని ఆ కంపెనీ తెలిపింది. అమ్మకాల విభాగంలో స్కూటర్ల విక్రయాల వాటా 13 శాతం నుంచి 20 శాతానికి పెరిగినట్లు సంస్థ వెలువరించింది. మంగళవారం నిఫ్టీలో హీరో మోటోకార్ప్ షేర్ విలువ 1.36 శాతం లేదా రూ.34.55 పెరిగి రూ.2,580.40 వద్ద ముగిసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 13, Jul 2019, 12:41 PM IST
Highlights
కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత హీరోలుగా మారి సక్సెస్ రాక ఇండస్ట్రీ నుండి కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు.
కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత హీరోలుగా మారి సక్సెస్ రాక ఇండస్ట్రీ నుండి కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు. అయితే కమెడియన్ అలీ మాత్రం హీరోగా బ్రేక్ వచ్చినా.. కామెడీ వేషాలు వదల్లేదు.
'యమలీల' సినిమాతో హిట్ కొట్టిన అలీ ఆ తరువాత హీరోయిజం ఉన్న సినిమాల కోసం చూడలేదు. తనకు వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్లాడు. హీరోగా తనకు కెరీర్ లేదని తెలుసుకున్న తరువాత మళ్లీ కామెడీ వేషాలు వేసుకుంటూ తన కెరీర్ ని పొడిగించుకున్నాడు. అప్పట్లోనే అంత మెచ్యురిటీ చూపించిన అలీ.. ఇప్పుడు మాత్రం ఆ ఆలోచన చేస్తున్నట్లు కనిపించట్లేదు.
తాజాగా ఆయన హీరోగా నటించిన సినిమా టీజర్ విడుదలైంది. కొన్ని నెలల క్రితం అలీ హీరోగా 'పండుగాడి ఫోటో స్టూడియో' అనే సినిమా విడుదలైంది. దిలీప్ రాజా అనే దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా టీజర్ లో అలీ విన్యాసాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. మాస్ హీరో మాదిరి బౌన్సింగ్ ఫైట్లు చేస్తూ, బిల్డప్ డైలాగ్స్ చెబుతూ భయపెట్టేశాడు.
పైగా ఓ సీన్లో హీరోయిన్ ని కౌగిలించుకొని దొర్లే తీరు చూస్తుంటే మరింత చీప్ గా అనిపిస్తోంది. ఈ టీజర్ చూసిన వారంతా ఈ వయసులో అలీకి ఇలాంటి సినిమాలు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి!
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఫ్యామిలీతో రవితేజ సెల్ఫీ
దాదాపు అందరూ సినీతారలు సోషల్ మీడియాతో ఏదో ఒక పోస్టు చేస్తూ ఉంటారు.
TNN | Updated:
Feb 2, 2017, 07:31PM IST
దాదాపు అందరూ సినీతారలు సోషల్ మీడియాతో ఏదో ఒక పోస్టు చేస్తూ ఉంటారు. కానీ రవితేజ అందుకు భిన్నం. ఆయన పెద్దగా సోషల్ మీడియాలో స్పందించరు. వ్యక్తిగత విషయాలు పెద్దగా షేర్ చేసుకోరు. అలాంటిది మొదటిసారి తన ఫ్యామిలీ ఫోటోని ఫేస్ బుక్ లో షేర్ చేసుకున్నారు. తన భార్య, కూతురు, కొడుకుతో ఉన్న సెల్ఫీని ఆయన పోస్టు చేశారు. దానికి క్యాప్షన్ గా ఫ్యామిలీతో సెల్ఫీ టైమ్ అని పెట్టారు. రవితేజ ఫ్యామిలీని చూసి అతని అభిమానులు ఆనందిస్తున్నారు. పోస్టుకు కామెంట్లు, లైకులు తెగ పడుతున్నాయి. ఆ పోస్టును ఇప్పటివరకు రెండు లక్షలకు మందికి పైగా చూశారు. వందల్లో ఫోటోల షేర్ అవుతోంది.
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
’బాహుబలి’కి నిరాశ
బాహుబలి సినిమా హాలీవుడ్ ప్రమాణాలతో ఉందని సినీ పండితులు ప్రశంసలు కురిపించారు.
TNN | Updated:
Sep 24, 2015, 02:18PM IST
హైదరాబాద్ : బాహుబలి సినిమా హాలీవుడ్ ప్రమాణాలతో ఉందని సినీ పండితులు ప్రశంసలు కురిపించారు. కలెక్షన్ల పరంగా, సాంకేతిక విలువల పరంగా అందరి మన్ననలు పొందింది. అంతేకాదు. ఆస్కార్ నామినేషన్ల కోసం కూడా పరిశీలనకు ఎంపికైంది. ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో పరిశీలనకు దీన్ని ఎంపికచేశారు. కమర్షియల్ హిట్ శ్రీమంతుడు కూడా కమిటీ పరిశీలనకు వెళ్లింది. అయితే ఈ రెండు సినిమాలూ ఎంపిక కాలేదు. ఇక ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో రూపొందిన భజరంగీ భాయూజాన్, విమర్శకుల ప్రశంసలు పొందిన పీకూ, హైడర్ సినిమాలు కూడా కమిటీ ఎంపికకు వెళ్లినా అవి కూడా ఎంపిక కాలేదు.
మరాఠీ సినిమా ‘కోర్ట్’ ఎంపికైంది.
| 0business
|
internet vaartha 116 Views
హైదరాబాద్ : కారు చౌక స్మార్ట్ఫోన్లు, ట్యాబ్పిసిలను అందించే డేటావిండ్ సంస్థ తాజాగా డిటాచ్బుల్ యుబి స్లట్ ట్యాబ్స్, డ్రాయిడ్సఫర్ నెట్బుక్లను విడుదలచేసింది. మొట్టమొదటిసారి ఈ ట్యాబ్పిసిలు 7డిసిప్లస్ 3జి7ప్లస్ వెర్షన్లలో విడుదలవుతోంది. వీటిధరలు రూ.3999, రూ. 4999లుగా కంపెనీ ప్రకటించింది. డేటావిండ్ సిఇఒ తునీత్ సింగ్ తులి మాట్లాడుతూ డ్రాయిడ్ సఫర్నెట్బుక్స్ వేరుచేయ దగిన బ్లూటూత్ 2ఇన్వన్ కీబోర్డుతో వస్తోంది.0.3ఎంపి ముందుకెమేరా, 2ఎంపి వెనుక కెమేరా ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ వ్యవస్థతో వస్తోంది. డ్యూయల్కోర్ కార్టెక్స్ ఎ7 ప్రాసెసర్తో ఉంది. 32జిబి వరకూ మెమరీ పొడిగించుకోవచ్చు. వైఫై హాట్స్పాట్, వైఫై డైరెక్ట్, బ్లూటూత్, జిపిఎస్ వంటి ఫీచర్లు ఎంపికచేసిన మోడళ్లలో ఉన్నాయి. జిపిఆర్ఎస్/ఎడ్జ్ వ్యవస్థలపై ఇంటర్నెట్ వినియోగం అందుబాటులో ఉంటుంది. తేలికపాటినాజూకైన నెట్బుక్స్, స్లేట్ట్యాబ్స్ను మార్కెట్లో యువతను ఎక్కువ ఆకర్షిస్తాయనడంలో సందేహంలేదు.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Brendon McCullum: కోల్కతా నైట్రైడర్స్ హెడ్ కోచ్గా హిట్టర్
కోల్కతా నైట్రైడర్స్ టీమ్లో దూకుడు మరింత పెంచేందుకు ఆ జట్టు ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మజానికి క్రికెట్ ప్రపంచానికి రుచిచూపిన హిట్టర్ని హెడ్ కోచ్గా నియమించింది.
Samayam Telugu | Updated:
Aug 16, 2019, 09:53AM IST
Brendon McCullum: కోల్కతా నైట్రైడర్స్ హెడ్ కోచ్గా హిట్టర్
హైలైట్స్
కోల్కతా నైట్రైడర్స్ హెడ్ కోచ్గా బ్రెండన్ మెక్కలమ్
ఐదు సీజన్లు కేకేఆర్ తరఫున ఆడిన మాజీ కివీస్ ఓపెనర్
2019 సీజన్ వరకూ కోచ్గా ఉన్న కలిస్.. ఇటీవల ఉద్వాసన
ఐపీఎల్లో తొలి సెంచరీ బాదిన క్రికెటర్గా మెక్కలమ్
ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ హెడ్కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కలమ్ నియమితులయ్యాడు. 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్లో విధ్వంసక సెంచరీతో.. అందరి చూపు ఈ టోర్నీపై పడేలా చేసిన మెక్కలమ్ సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్లో ఐదు సీజన్లు కోల్కతా టీమ్ తరఫున ఆడాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ మాజీ ఓపెనర్.. ప్రైవేట్ టీ20 లీగ్స్లో మాత్రం కొనసాగుతున్నాడు. కానీ.. 2019 ఐపీఎల్ సీజన్లో మెక్కలమ్ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. 2020 ఐపీఎల్ని మెక్కలమ్ పర్యవేక్షణలోనే కోల్కతా నైట్రైడర్స్ ఆడనుందని ఆ జట్టు ఫ్రాంఛైజీ తాజాగా ప్రకటించింది.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
జియో ఫ్రీ కాల్స్, డేటా ఆఫర్ డిసెంబర్ 3 వరకే!
అవును, నిజమే రిలయన్స్ జియో సంస్థ ఫ్రీ వాయిస్ కాల్స్, డేటా ఆఫర్ను డిసెంబర్ 3 వరకే అందించనుందని ట్రాయ్ స్వయంగా తెలిపింది.
TNN | Updated:
Oct 20, 2016, 07:02PM IST
రిలయన్స్ జియో ఉచిత సేవలు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు బదులుగా డిసెంబర్ 3కే ముగియనున్నాయి. టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెలువరించిన సమాచారం ప్రకారం డిసెంబర్ 3తోనే ఆ సంస్థ ఉచిత ఆఫర్లకు మంగళం పాడాల్సి ఉంటుంది. జియో ఆఫర్ల విషయమై ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా తదితర టెలీకా సంస్థలు ట్రాయ్‌కు ఫిర్యాదు చేశాయి. జియో ఆఫర్ ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీ ఫిర్యాదు కిందకు రాదన్న ట్రాయ్ ఈ విషయమై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఒక సంస్థ నెట్ వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు కాల్ చేసినందుకుగానూ టెర్మినేషన్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఐడియా నెట్‌వర్క్ నుంచి ఎయిర్‌టెల్‌కు ఓ వినియోగదారుడు కాల్ చేసుకుంటే.. ఐడియా సంస్థ ఎయిర్‌టెల్‌కు నిమిషానికి రూ.14 పైసలను టెర్మినేషన్ ఛార్జీ కింద చెల్లిస్తుంది.
ప్రస్తుతం ఉచితంగా కాల్స్‌ను అందిస్తున్న జియో కనీసం టెర్మినేషన్ ఛార్జీలను కూడా వసూలు చేయట్లేదని మిగతా కంపెనీలు ఆరోపించాయి. ఫ్రీ కాల్స్‌ను అందిస్తూ, ఫ్లోర్ రేట్ కోసం ఉద్దేశించినట్రాయ్ నిబంధనలను జియో ఉల్లంఘించిందనే విషయాన్ని టెలీకాం సంస్థలు ట్రాయ్ దృష్టికి తీసుకొచ్చాయి. ఈ విషయమై ట్రాయ్ స్పందిస్తూ.. జియో కేవలం తొలి 90 రోజులకే ఈ ఉచిత ఆఫర్‌ను అందిస్తుందని సమాధానం ఇచ్చింది. ఇది మార్గదర్శాలకు లోబడే ఇస్తున్న ఆఫర్ అని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 5న రిలయన్స్ జియో సేవలను అధికారికంగా ప్రారంభించిన సందర్భంగా ముకేశ్ అంబానీ ప్రసంగిస్తూ.. తమ కస్టమర్లకు ఈ ఏడాది చివరి వరకూ వాయిస్ కాల్స్, 4జీ డేటాను అందించనున్నట్లు తెలిసిందే. మరి ఇప్పుడు ముకేశ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Reliance Jio Infocomm will curtail its offer of free voice and data services till December 3 , instead of its previously announced date of December 31. The company has also received a clean chit from the telecom regulator which has found its tariff plans including free voice and data offers permissible and complaint with rules. According to a communication from the telecom regulator, Jio’s tariff plans cannot be considered as "non-IUC complaint, predatory or discriminatory at present.
The communication which has been sent to the chiefs of Vodafone, Airtel, Idea Cellular, Videocon Telecom and Telenor was in response to a Joint representation made by these telcos on September 20 and the consequent deliberations held on September 30 in which telcos are believed to have complained to the regulator that Jio’s offers were non-IUC omplaint.
| 1entertainment
|
Hyderabad, First Published 14, Sep 2019, 3:27 PM IST
Highlights
ఇటీవల విడుదల చేసిన 'ది స్కై ఈజ్ పింక్' సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం నాడు ఈ సినిమాను టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఈ క్రమంలో యూనిట్ సభ్యులంతా ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రీమియర్ పూర్తయిన తరువాత ప్రియాంకా ఎమోషనల్ అయ్యారు.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. కొంతకాలంగా హాలీవుడ్ కే పరిమితమైన ఈ బ్యూటీ మూడేళ్ల విరామం తరువాత హిందీలో ఓ సినిమాలో నటించింది. అదే 'ది స్కై ఈజ్ పింక్'.
సోనాలీ బోస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్, జైరా వాసిం కీలకపాత్రలు పోషించారు. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురైనప్పటికీ పదిహేనేళ్లకే రైటర్ గాగుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరి జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం నాడు ఈ సినిమాను టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఈ క్రమంలో యూనిట్ సభ్యులంతా ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రీమియర్ పూర్తయిన తరువాత ప్రియాంకా ఎమోషనల్ అయ్యారు.
దర్శకురాలు సోనాలీ బోస్ ను హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ తో యూనిట్ అందరూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రివర్సు మేళం ‘జంబలకిడిపంబ’ మళ్లీ..
అంతా రివర్సు మేళం. అసాంతం గందరగోళం. వాళ్లు వీళ్లు అవుతారు.. వాళ్లు వీళ్లు అవుతారు.. పురుషపుంగవులు కొద్ది రోజుల తరువాత ఆడవాళ్లుగా మారిపోతే ఎలా ఉంటుంది?
TNN | Updated:
Dec 29, 2017, 05:13PM IST
అంతా రివర్సు మేళం. అసాంతం గందరగోళం. వాళ్లు వీళ్లు అవుతారు.. వీళ్లు వాళ్లు అవుతారు.. పురుషపుంగవులు కొద్ది రోజుల తరువాత ఆడవాళ్లుగా మారిపోతే ఎలా ఉంటుంది? ఇదే స్టోరీ లైన్‌ను తీసుకుని 1992లో ఇ. వి. వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘జంబలకిడిపంబ’ చిత్రం హాస్యభరిత చిత్రాల్లో నేటికీ అగ్రస్థానంలో ఉంటుంది. ఇందులో నరేష్, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమాలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి ఆడవాళ్ళ పనులు మగవారు, మగవాళ్ళ ఆడవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో వినోదభరితంగా తెరకెక్కించారు. కామెడీ సినిమా అంటే ఇలా కూడా తీయవచ్చా అని ‘జంబలకిడిపంబ’ అప్పట్లో పెను సంచలనం. మగాళ్లు ఆడాళ్లుగా.. ఆడాళ్లు మగాళ్లుగా మారిపోయే ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల కడుపు చెక్కలు చేసింది. ఇప్పుడు అదే టైటిల్‌తో తెలుగులో మరో కామెడీ ఎంటర్టైనర్ మూవీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు వచ్చేశాయి.
| 0business
|
Tom modi
టీమిండియా క్రికెట్ కోచ్గా టామ్ మూడీ…?
న్యూఢిల్లీ : టీమిండియా క్రికెట్ కోచ్గా టామ్ మూడీ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులు స్వీకరణ మే 31తో ముగిసింది. భారత్ మాజీ క్రికెటర్లు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అయితే కోచ్ పదవి కోసం ఇప్పటివరకు ఎవరెవరకు దరఖాస్తులు చేసుకున్నారే విషయమై బోర్డు స్పందించలేదు. అయితే అధికార ప్రకటన లేకపోయినప్పటికీ దరఖాస్తు చేసుకున్న హై ప్రొపైల్ వ్యక్తుల్లో టామ్ మూడీ ఒకరని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త కోచ్ ఎంపిక విషయంపై మాట్లాడిన ఓ బిసిసిఐ అధికారి ఒకరు టామ్ మూడీకి చాన్స్ ఉందని తెలిపినట్లు సమాచారం. తాజా పరిణామాలు ప్రస్తుతం సన్రైజర్స్ హైద్రాబాద్కు కోచ్గా ఉన్న మూడీకి లాభం చేకూర్చేలా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మూడీ గతంలో శ్రీలంక జట్టుతో పాటు వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్లకు కోచ్గా కూడా వ్యవహరించారు. టామ్ మూడీ కోచ్గా ఉన్న సమయంలో శ్రీలంక 2007 వరల్డ్ కప్ ఫైనల్ వరకు చేరుకుంది.
ఈక్రమంలో ఆయన ఉపఖండం పిచ్లపై అవగాహన ఉంది. టామ్ మూడీ కోచ్గా ఉన్న సమయంలోనే సన్రైజర్స్ హైద్రాబాద్ ఐపిఎస్ విజేతగా కూడా అవతరించింది. ఐపిఎల్ పదో సీజన్లో కూడా క్వాలిఫియర్-2 వరకు చేరుకుంది. ఇంటర్వూలన్నీ ఇంగ్లాండ్లో..? ఇదిలా ఉంటే కోచ్ పదవికోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులన్నింటినీ బోర్డు సిఇఓ రాహుల్ జోహ్రీ లండన్లో ఉన్న క్రికెట్ సలహా కమిటీ సభ్యులకు అందించనున్నారు. ఇంటర్వూలన్నీ ఇంగ్లండ్లోనే జరపాలా..? లేదా..? అనే విషయం సిఎసి నిర్ణయిస్తుంది. ఇది పూర్తిగా వారికి సంబంధించిన విషయం. కుంబ్లే కూడా మరోసారి కమిటీ ముందు రావాలా అనేది కూడా వారే తేలుస్తారు. అని బోర్డు వర్గాలు తెలుపుతున్నాయి.
| 2sports
|
sandhya 169 Views IPO , modi
ముంబయి: అనూహ్యమెజార్టీతో నరేంద్రమోడీ ఎన్డిఎ కూటమి మళ్లీ పగ్గాలు చేపట్టడంతో మార్కెట్లలో నిధుల సమీకరణ లావాదేవీలు భారీ ఎత్తున పెరుగుతాయని ఆర్ధికనిపుణులు అంచనావేస్తున్నారు. ఐపిఒ వంటి క్ర్రియలకు ఇపై భారీ ర్యాలీ ఉంటుందని చెపుతున్నారు. సంస్థాగత అర్హులైన ప్లేస్మెట్ వంటి విధానాల్లో ఈ మూడు త్రైమాసికాల్లో కార్యకలాపాల్లో రికవరీ ఉంటుందని చెపుతున్నారు. మార్చినెలాఖరువరకూ చూస్తే మ్తొం 59 కంపెనీలు 53 వేల కోట్ల రూపాయలు సమీకరించాలని ఐపిఒలకు దరఖాస్తుచేసాయి. ప్రైమ్ డేటా బేస్ కథనాలను చూస్తే ఐపిఒ మార్కెట్భారీ స్థాయిలో పునరుద్ధరిస్తున్నట్లు కనిపిస్తోంది. కంపెనీలు ఇప్పటికే ఈ డీల్స్కోసం సంప్రదింపులుప్రారంభించాయి. జులైనుంచి ఐపిఒ కార్యకలాపాల్లో మంచి ఊపు ఉంటుందని ముంబయి కేంద్రంగా ఉన్న ఇన్వెష్మటెంట్ బ్యాంక్ ఈక్వేరియస్ క్యాపిటల్ సంస్థ ఎండి మునీష్ అగర్వాల్పేర్కొన్నారు. ఇప్పటివరకూ స్థిరమైన ప్రభుత్వం వస్తుందా లేక సంకీర్ణ ఏర్పడుడుతందా అన్న అనిశ్చితి తొలగిపోవడంతో మార్కెట్లకు ఐపిఒల రాక పెరుగుతుందని అంచనా. ఇప్పటివరకూ కేవలం ఏడు సంస్థలు ఆత్రమే 5033 కోట్ల నిధులు ఐపిఒలద్వారా సమీకరించాయి. అంతకుముందు ఏడాది అయితే 24 కంపెనీలు 30,959 కోట్లు సమీకరించాయి. ఐపిఒ ఆధారిత కంపెనీలు సెబీ అనుమతిసాధించినప్పటికీ కొంతమేర సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా అన్న మీమాంసతో ఇప్పటివరకూ మార్కెట్లకు రాలేదు. ఇపుడు ఆ అనిశ్చితి కాస్తా తొలగిపోవడంతో మార్కెట్లకు నిధులసమీకరణ లావాదేవీలుపెరుగుతాయని ఎల్అండ్ఎల్ పార్టనర్స్ భాగస్వామి రవిదూబే పేర్కొన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/
| 1entertainment
|
Feb 07,2016
కరెన్సీనోట్లూ కాటేస్తాయ్ !!
న్యూఢిల్లీ: 'ఎక్కువ డబ్బు అనర్ధదాయకం' ఇది మన పెద్దవారు తరుచూ చెప్పే మాట. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఎక్కువగా కరెన్సీ నోట్లతో వ్యవహారాలు జరిపే వారికి మాత్రం కొన్ని కష్టాలు తప్పవంటున్నారు పరిశోధకులు. వీరు ఎక్కువగా కొన్ని ప్రాణాంతక వ్యాధుల భారిన పడే అవకాశాలు ఉన్నాయన్నది వారి వాదన. నిత్యం షాపులు, మార్కెట్లు, బ్యాంకుల్లో ప్రత్యక్షంగా కరెన్సీ నోట్ల చెలామణి జరిపే వారికి ఈ ముప్పు అధికమని వారు చెబుతున్నారు. వివిధ రకాల వ్యక్తుల నుంచి కరెన్సీ నోట్లు చెలామణి అవుతుండడం.. వారిలో చాలామంది కనీస వ్యక్తిగత శుభ్రతను పాటించకపోవడం వల్ల డబ్బు కాగితాల ద్వారా యాంటీబయోటిక్స్ను ఎదుర్కొని నిలిచే ప్యాథజెన్స్ బ్యాక్టిరియా విస్తరిస్తోందట. 'సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండిస్టియల్ రీసర్చ్' (సీఎస్ఐఆర్), 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ' సంస్థలు ఒక పరిశోధనలో నోట్లపై ప్రమాదకరమైన బ్యాక్టిరియా ఉండడాన్ని గుర్తించాయి. ఈ బ్యాక్టిరియాల మూలంగా పలు రకాల చర్మ వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశం ఉన్నట్లు తేల్చారు. నోట్ల చెలామణి విభాగంలో ఉండేవారు చేతులను శుభ్రంగా కడగకుండా ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఉదరకోశ ఇన్ఫెక్షన్లతో పాటు పలు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. భారత్ మార్కెట్లలో బాగా చెలామణిలో ఉండే రూ.10, రూ.20, రూ.100. రూ.500 నోట్ల ద్వారా పలు వ్యాధికారక బ్యాక్టిరియాలు, వైరెస్లు ఎక్కువగా ఇతరులకు వ్యాప్తి చెందుతున్నాయి. ఇక్కడి కరెన్సీ నోట్లపై సుమారు 70 శాతం మేర ఫంగీ వంటి వ్యాధికారక క్రిములు, 9 శాతం వరకు వివిధ బ్యాక్టీరియా, ఒక శాతం మేర వైరెస్ ఉంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. నోట్లతో వ్యవహారం జరపకుండా బతకడం చాలా కష్టం కాబట్టి డబ్బు కాగితాలు.. జబ్బు కాగితాలుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా ఇలాంటి వ్యాధికారక క్రిములు విస్తరించకుండా జాగ్రత్తపడొచ్చన్నది వారి సూచన. ఎక్కువగా నగదు కౌంటింగ్ యాంత్రాలు, ఆన్లైన్ వ్యవహారాలను ప్రోత్సహించాలని వారు చెబుతున్నారు. కాబట్టి కరెన్సీ కాగితాలతో జర భద్రం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 24, Oct 2018, 5:05 PM IST
Highlights
ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో ఎన్నో సీరియల్స్ వచ్చాయి. అయితే వాటిల్లో ఎక్కువగా ఆదరణ పొంది ఏళ్ల తరబడి బుల్లితెర ప్రేక్షకులను అలరించిన క్రైమ్ సీరియల్ ‘సీఐడీ’.
ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో ఎన్నో సీరియల్స్ వచ్చాయి. అయితే వాటిల్లో ఎక్కువగా ఆదరణ పొంది ఏళ్ల తరబడి బుల్లితెర ప్రేక్షకులను అలరించిన క్రైమ్ సీరియల్ ‘సీఐడీ’. ఈ సీరియల్ ఇతర భాషల్లో కూడా అనువాదమై మంచి ఆదరణను అందుకుంది. ముఖ్యంగా తెలుగులో కూడా సీరియల్ మంచి రేటింగ్ ను అందుకుంది.
1997 నుంచి సోని ఛానల్ లో ప్రసారమవుతున్న ‘సీఐడీ’ కి మొదటి ఎపిసోడ్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఎపిసోడ్ వరకు మంచి క్రేజ్ అందుకుంది. రేటింగ్ లో ఎక్కడా తగ్గకుండా సాగుతోన్న సమయంలో సీరియల్ నిర్మాత బీపీ.సింగ్ సడన్ గా సీరియల్ ను ఆపేస్తున్నట్లు తెలుపుతూ.. ఇక ‘సీఐడీ’ ఉండదని చెప్పారు. దాదాపు 21 ఏళ్ల నుంచివస్తోన్న ఈ సీరియల్ 1546 ఎపిసోడ్లను పూర్తిచేసుకుంది.
ఇక చివరి ఎపిసోడ్ ఈ నెల 29న ప్రసారం కానుంది. ఇక సీరియల్ లో ఇన్స్పెక్టర్ గా నటించిన దయా షో ముగుస్తున్న సందర్బంగా తన వివరణను ఇచ్చాడు. సీరియల్ విషయంలో టీఆర్ పి తో పాటు అంతా బాగానే ఉంది. సీరియల్ మధ్యలో నిర్మాత సీరియల్ ను ముగిస్తున్నట్లు చెప్పడం తమకు ఫ్యాన్స్ కు నీరాశను కలిగిస్తోందని అన్నారు.
Last Updated 24, Oct 2018, 5:05 PM IST
| 0business
|
ఫిఫా 2018 లో చరిత్ర సృష్టించిన ప్రాన్స్, డెన్మార్క్ మ్యాచ్ (వీడియో)
Highlights
గోల్ లెస్ మ్యాచ్ గా...
హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన ప్రాన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్ సి లో డెన్మార్క్ తో నిన్న జరిగిన మ్యాచ్ 0-0 తో డ్రా అయ్యింది. ఇప్పటివరకు 2018 ప్రపంచకప్లో 37 మ్యాచ్లు జరగ్గా, ఇలా ఒక్క గోల్ కూడా లేకుండా ముగిసిన మ్యాచ్ ఇదొక్కటే. ఫలితంగా ఈ ఈవెంట్లో తొలి గోల్ లేస్ డ్రాగా ఈ మ్యాచ్ రికార్డులకెక్కింది.
ఇక ఇప్పటికే నాకౌట్ చేరిన ఫ్రాన్స్ ఏడు పాయింట్లతో గ్రూప్ ‘సి’లో టాపర్గా నిలిచింది. డెన్మార్క్ ఐదు పాయింట్లతో రెండో స్థానం దక్కించుకుంది. దీంతో ఈ రెండు జట్లు ఇప్పటికే నాకౌట్ కు చేరుకున్నాయి.
ఈ మ్యాచ్ లో ప్రాన్స్ ఆధిపత్యమే ఎక్కువగా కనిపించినా గోల్ మాత్రం చేయలేకపోయింది. జోరు మీదున్న ఫ్రాన్స్ ఆటగాళ్లను నిలువరించడంలో డెన్మార్క్ జట్టు సఫలమైంది.
ఈ మ్యాచ్ లో తొలి అర్ధభాగంలో ఇరు జట్లకు గోల్ చేయడానికి చిన్నచిన్న అవకాశాలు వచ్చాయి. అయితే రెండో అర్ధభాగంలో రెండు జట్టు హోరాహోరీగా పోరాడటంతో గోల్ చేయడానికి ఒక్క చాన్స్ కూడా రాలేదు. 26వ నిమిషంలో డెన్మార్క్ స్ట్రయికర్ ఎరిక్సన్ కొట్టిన ఫ్రీకిక్ దాదాపుగా గోల్పోస్ట్లోకి వెళ్లినట్లుగా కనిపించింది. కానీ ఫ్రాన్స్ గోల్ కీఫర్ దాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నారు. మ్యాచ్ మొత్తంలో ఫ్రాన్స్ 11సార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్పైకి దాడికి దిగగా, డెన్మార్క్ ఐదుసార్లు ప్రయత్నించింది. అయినా ఫలితం లేకుండా పోయింది.
| 2sports
|
నాగబాబుపై సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి
Highlights
సైకియాట్రిస్టు దగ్గరకు వెళ్లి చూపించుకో నాగబాబు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీ రెడ్డి చేసిన వాఖ్యలపై పవన్ అన్నయ్య నాగబాబు గత కొద్దిసేపటి క్రితమే మీడియా ద్వారా స్పందించిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో నాగబాబు చేసిన వాఖ్యలపై శ్రీ రెడ్డి కౌంటర్ ఇచ్చింది.ఈ సందర్భంగా తన పేస్ బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది. ‘మానవతా వాదినంటున్న నాగబాబు మాటలు ఎంత దయనీయంగా ఉన్నాయి. మీరు మానవతావాదివని అనుకుంటున్నారా? మీకు దయ ఉందా? ఓ మై గాడ్.. మీరు దయార్ధ్ర హృదయులు కాదు.. మీరు ఎంతో క్రూరులు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెబుతాను వేచి చూడండి. మీర్ పర్ఫెక్ట్ అని భావిస్తున్నారా? మీరు సంపూర్ణంగా పర్ఫెక్ట్ కాదు… సైకియాట్రిస్టు అవసరం ఎవరికి ఉందో చెబుతాను..’అని శ్రీ రెడ్డి పోస్ట్ చేసింది.
| 0business
|
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
First Published 5, Mar 2018, 12:24 PM IST
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
నితిన్ రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణం ప్రారంబోత్సవ గ్యాలరీ
Recent Stories
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రోహిత్ శర్మకి పుత్రికోత్సాహం.. సిడ్నీ టెస్టుకి దూరం..?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో అతని రాకతో భారత్ జట్టులో సమతూకం వచ్చింది. సిడ్నీ టెస్టులోనూ అతను ఆడితే బాగుంటుంది. కానీ..?
Samayam Telugu | Updated:
Dec 31, 2018, 01:48PM IST
రోహిత్ శర్మకి పుత్రికోత్సాహం.. సిడ్నీ టెస్టుకి దూరం..?
ఆస్ట్రేలియాతో గురువారం నుంచి సిడ్నీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్కి భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ దూరంకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతని భార్య రితిక ఆదివారం ఓ బిడ్డకి జన్మనివ్వడంతో వారిని చూసేందుకు భారత్కి ఈ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రానున్నాడట. దాదాపు తొమ్మిది నెలలు తర్వాత భారత టెస్టు జట్టులోకి ఇటీవల పునరాగమనం చేసిన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో (రెండు ఇన్నింగ్స్లు 37, 1) 38 పరుగులతో నిరాశపరిచాడు. ఆ టెస్టులో గాయం కారణంగా పెర్త్లో జరిగిన రెండో టెస్టుకి దూరమైన ఈ మిడిలార్డర్ బ్యాట్స్మెన్.. ఆదివారం మెల్బోర్న్లో ముగిసిన మూడో టెస్టులో మాత్రం 63 నాటౌట్, 5 పరుగులతో రాణించాడు. పిచ్ బ్యాటింగ్కి కష్టమైన దశలో రోహిత్ శర్మ చేసిన 63 పరుగులతోనే భారత్ జట్టు 400పైచిలుకు స్కోరుతో మ్యాచ్పై పట్టు సాధించగలిగింది.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ: ఐఎమ్ఎఫ్
భారత ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతోంది. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) ఈ విషయాన్ని వెల్లడించింది.
TNN | Updated:
May 9, 2018, 03:27PM IST
వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ: ఐఎమ్ఎఫ్
భారత ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతోంది. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) ఈ విషయాన్ని వెల్లడించింది. 2018లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుందని ఐఎమ్ఎఫ్ తెలిపింది. 2018లో భారత్ 7.4 వృద్ధి రేటుతో ఈ ఘనత సాధించనుందని ఈ ప్రతిష్టాత్మక సంస్థ బుధవారం (మే 9) ఓ నివేదికలో పేర్కొంది. 2019 నాటికి భారత వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకుంటుందని ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది.
2018, 19 కాలానికి సంబంధించి దక్షిణాసియాలో ఇండియా తర్వాత బంగ్లాదేశ్ 7 శాతం వృద్ధి రేటుతో రెండో స్థానంలో నిలవనుందని ఐఎమ్ఎఫ్ తెలిపింది. శ్రీలంక వృద్ధి రేటు 2018లో 4 శాతం, 2019లో 4.5 శాతం; నేపాల్ వృద్ధి రేటు 2018లో 5 శాతం, 2019లో 4 శాతం ఉంటుందని అంచనా వేసింది.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి పరిణామాల నుంచి భారత్ కోలుకుందని ఐఎమ్ఎఫ్ ఆసియా, పసిఫిక్ రీజినల్ ఎకనామిక్ ఔట్లుక్ వెల్లడించింది. భారత్లో అనుసరిస్తున్న ద్రవ్య విధానం ద్రవ్యోల్బణ ఒత్తిడిని అధిగమించడానికి తోడ్పడుతోందని తెలిపింది. 2017లో వినియోగదారుల ధరల పెరుగుదల 3.6 శాతంగా ఉందని పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది 5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
Sharapova
వైల్డ్కార్డు ద్వారా రోజర్స్కప్కు షరపోవా
న్యూఢిల్లీ: నిషేదిత ఉత్ప్రేరకం మెలోడియం వాడి డోప్ టెస్ట్ల్లో పట్టుబడి 15నెలలు టెన్నిస్కు దూరమైన అందాల తార ప్రపంచ మాజీ నంబర్ వన్ మరియా షరపోవాకు ఫ్రెంచ్ ఓపెన్లో పాల్గొనేందుకు ఆమెకు వైల్కార్డు ఎంట్రీ ఇచ్చేందుకు నిర్వాహకులు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్ కోసం ఆశగా ఎదురుచూసిన షరపోవాకు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా షరపోవాకు వైల్ కార్డు ద్వారా మరో ఎంట్రీ దక్కింది. నిషేదం ముగిసిన అనంతరం ఇప్పుడిప్పుడే టోర్నీల్లో పాల్గొంటన్న షరపోవాకి తాజాగా రోజర్స్ కప్లో పాల్గొనేందుకు వైల్కార్డు లభించింది. ఆగస్టు 5నుంచి 13వరకు ఈటోర్నీ టొరొంటోలో జరగనుంది. ఈసందర్భంగా టోర్నమెంట్ డైరెక్టర్ కర్ల్ హేల్ మాట్లాడుతూ మరియా గ్రాండ్స్లామ్ విజేత..ఎంతో మందికి అభిమాన తార..అని తెలిపారు. రోజర్స్కప్లో ఆడేందుకు కెనడా వెళ్లడానికి ఆశగా చూస్తున్నట్లు ఈసందర్భంగా షరపోవా తెలిపింది. గతంలో కెనడాలో ఎన్నో విజయాలు నమోదు చేశానని, అభిమానుల నుంచి ఎంతో మద్ధతు లభించినట్లు ఆమె గుర్తు చేసుకుంది. ఈఏడాది రోజర్స్ కప్ టోర్నీనే అతిపెద్ద ఈవెంట్గా భావిస్తు న్నానని, నాశక్తిమేరకు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తానని ఆమె తెలిపింది.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వెహికల్ ఎవరు గెలిచినా.. డ్రైవర్ ధోనీనే..!
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బైక్స్ అంటే మహా సరదా. కెరీర్ తొలినాళ్ల నుంచే జట్టులో ఎవరికైనా
TNN | Updated:
Sep 4, 2017, 06:03PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బైక్స్ అంటే మహా సరదా. కెరీర్ తొలినాళ్ల నుంచే జట్టులో ఎవరికైనా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రూపంలో బైక్ వస్తే దాన్ని గ్రౌండ్లోనే సరదాగా ఒక రౌండ్ వేసేవాడు. ఒక్కోసారి యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలు సైతం వెనకవైపు కూర్చుని ధోనీ బైక్ రైడింగ్ని ఎంజాయ్ చేసేవారు. దాదాపు 13 ఏళ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. మధ్యలో ఎన్నో బైక్స్, కార్లను ధోనీ మైదానంలో చక్కర్లు కొట్టించాడు.
శ్రీలంకతో తాజాగా ముగిసిన వన్డే సిరీస్లో 15 వికెట్లతో సత్తాచాటిన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ రూపంలో మల్టిక్స్ కారు బహుమతిగా వచ్చింది. ఇందులో భారత క్రికెటర్లని ఎక్కించుకున్న ధోనీ మైదానంలోనే ఒక రౌండ్ వేయించాడు. తాళం బుమ్రానే తీసుకున్నా.. డ్రైవర్ మాత్రం మళ్లీ ధోనీనే..!!
| 2sports
|
Hyderabad, First Published 10, May 2019, 4:55 PM IST
Highlights
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అఫ్రీది... మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. దాదాపు అఫ్రీది నోటి నుంచి ఏ మాట వచ్చినా... అది వివాదం కిందకే మారుతుంది.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అఫ్రీది... మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. దాదాపు అఫ్రీది నోటి నుంచి ఏ మాట వచ్చినా... అది వివాదం కిందకే మారుతుంది. ఇటీవల గేమ్ ఛేంజర్ పేరిట ఓ పుస్తకాన్ని రాసి... గంభీర్ పై విమర్శలు గుప్పించాడు. ఆ వివాదం ముగిసిన తర్వాత ఆల్టైం ప్రపంచకప్ జట్టును కూడా ప్రకటించి మరో దుమారానికి తెరలేపాడు.
ఆ జట్టులో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్తో పాటు భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చోటు ఇవ్వకపోగా...కోహ్లీ పేరు మాత్రం ప్రస్తావించాడు. దీంతో... దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా... దీనిపై అఫ్రీది స్పందించాడు.
‘సచిన్, ధోనీ భారత క్రికెట్కు ఎంతో కీర్తి తెచ్చిపెట్టారు. వాళ్లను కించపరచడం నా ఉద్దేశం కాదు. కోహ్లీని ఎంచుకోవడానికి కారణం అతని బ్యాటింగ్ మాయాజాలమే. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. రెండు దేశాల మధ్య విద్వేషాలను తగ్గించేందుకు క్రికెట్ మంచి మార్గం. అందుకే భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడాలి. అలా అయితేనే రెండు దేశాల ప్రజల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి’ అని అఫ్రిది పేర్కొన్నాడు.
Last Updated 10, May 2019, 4:55 PM IST
| 2sports
|
Suresh 78 Views
హెచ్డిఎఫ్సి ఆదిత్యపూరికి జీవన సాఫల్య పురస్కారం
ముంబై, సెప్టెంబరు 16: ప్రైవేటురంగంలోని రెండో అతిపెద్ద బ్యాంకు హెచ్డిఎఫ్సి ఎండి సిఇఒ ఆదిత్యపూరికి జీవనసాఫల్య పురస్కారం లభించింది. ఫైనాన్షియల్ఎక్ప్ప్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదిత్య పూరిని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ జీవితసాఫల్యపురస్కారంతో సత్కరించారు. అంతకుముందే సిఎన్బిసి టివి18 సంస్థ ఆదిత్యపూరిని అత్యుత్తమ బిజినెస్ లీడర్ అవార్డుతో సత్కరించింది. ఖాతాదారుల సేవలే ప్రధాన లక్ష్యంగా వాటాదారుల అందరికీప్రాధా న్యత కల్పించడం తమలక్ష్యంగా పనిచేసామన్నా రు. ప్రపంచంలోని అతిగొప్ప గ్లోబల్బ్రాండ్లలో మొదటివందబ్రాడ్లలోభారత్నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకుమాత్రమే గుర్తింపుసాధించిందని, వరుసగారెండేళ్లనుంచి అత్యంతవిలువైనబ్రాండ్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు గుర్తింపుసాధించడం వెనుక ఆదిత్యపూరి కృషిఎంతోఉందని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రతినిధులు ప్రశంసించారు.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Pre-owned Cars: సెకండ్హ్యాండ్ కార్లకు భలే గిరాకీ!
రూ.5 లక్షలు పెడితే కొత్త ఆల్టో, శాంట్రో కార్లు వస్తాయనుకుంటే.. అదే రూ.5 లక్షలకు సెకండ్హ్యాండ్ మార్కెట్లో హోండా సిటీ వస్తోందని పాండే తెలిపారు. టైర్2, టైర్3 పట్టణాల్లో సెకండ్హ్యాండ్ కార్లకు డిమాండ్ ఉందని పేర్కొన్నారు.
Samayam Telugu | Updated:
Apr 14, 2019, 02:38PM IST
హైలైట్స్
గత ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 2.7 శాతం పెరుగుదల
అదేసమయంలో సెకండ్హ్యాండ్ కార్ల అమ్మకాల్లో దాదాపు 4 రెట్లు వృద్ధి
అందుబాటు ధర, చెల్లించే మొత్తానికి అధిక విలువ వంటి అంశాలు కారణం
కారు కొనాలనే ఆశ దాదాపు అందరికీ ఉంటుంది. అయితే ఇక్కడే ఒక విషయం ఆలోచించాలి. కొనాలనుకునేది సెకండ్హ్యాండ్ కారా? లేక కొత్త కారా? ఏ కారు కొనుగోలు చేయాలనే అంశంపై స్పష్టత తప్పనిసరి. ఇటీవల కాలంలో కొత్త ప్యాసింజర్ కార్ల అమ్మకాలు నెమ్మదించాయి. అదేసమయంలో ప్రిఓన్డ్ కార్ల అమ్మకాలు పెరిగాయి.
2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో కేవలం 2.7 శాతం పెరుగుదల మాత్రమే కనిపించింది. అదేసమయంలో కొత్త కార్ల అమ్మకాలతో పోలిస్తే సెకండ్హ్యాండ్ కార్ల అమ్మకాల్లో ఏకంగా 4 రెట్లు పెరుగుదల నమోదైంది. అంటే పాత కార్లకు భలే డిమాండ్ ఉంది.
| 1entertainment
|
Hyderabad, First Published 4, Mar 2019, 9:26 AM IST
Highlights
విజయ్ దేవరకొండ హీరోగా దూసుకుపోతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఆయన తమిళం లోనూ ఫ్యాన్ బేస్ ఏర్పడటంతో అక్కడా తన సత్తా చూపించే పనిలో పడ్డారు.
విజయ్ దేవరకొండ హీరోగా దూసుకుపోతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఆయన తమిళం లోనూ ఫ్యాన్ బేస్ ఏర్పడటంతో అక్కడా తన సత్తా చూపించే పనిలో పడ్డారు ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో‘హీరో’ టైటిల్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహించే ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతుంది. ప్రస్తుతం విజయ తో 'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుంది. ఈ సినిమాలో బైక్ రేసర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. బైక్ రైడింగ్ కోసం ఆల్రెడీ స్పెషల్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారట విజయ్.
తమిళం చిత్రం ‘కాకముటై’కు డైలాగ్ రైటర్గా పని చేశారట ఆనంద్. ఈ సినిమాలో విజయ్కు జోడిగా మాళవిక మోహనన్ కనిపిస్తారని టాక్. రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘పేట’ సినిమాలో మాళవిక మోహనన్ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు తదిదశకు చేరుకున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. అలాగే ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కూడా విజయ్నే హీరోగా నటిస్తున్నారు.
Last Updated 4, Mar 2019, 9:26 AM IST
| 0business
|
Dec 24,2016
జెబ్రోనిక్స్ నుంచి 2.2 మల్టీమీడియా స్పీకర్
నవతెలంగాణ- వాణిజ్య విభాగం :ప్రముఖ ఐటీ ఫెరిఫరల్స్ వినియో గదారుల ఎలక్ట్రానిక్స్, సర్వైవలెన్స్ ప్రొడక్ట్ల సరఫరాదారుడు జెబ్రోనిక్స్ తమ ఆడియో సెగ్మేంట్లోని పోర్టుఫోలియోకు మరో ప్రొడక్ట్ను జతచేసింది. కొత్తగా జెడ్ఈబీ-బీటీ 361 ఆర్యూసీఎఫ్గా పిలవబడే 2.2 మల్టీమీడియా స్పీకర్ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.4,242 మాత్రమే అని పేర్కొంది. ఈ కొత్త ప్రొడక్టు సంగీత అభిమానుల మనసు దోచుకుంటుందని తెలిపింది. 4 అంగుళాల సబ్వూఫర్ డ్రైవర్లు సింగిల్ క్యాబినెట్లో అమర్చబడి ఉంటాయని, లివింగ్ రూమ్లో థియేటర్ లాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయని జెబ్రోనిక్స్ డైరెక్టర్ ప్రదీప్ దోషి పేర్కొన్నారు. దీంతో పాటు కొత్త స్పీకర్ బ్లూటూత్ కనెక్టివిటీ, యుఎస్బీ పోర్ట్, ఎస్డీ సపోర్ట్, బిల్ట్ ఇన్ ఎఫ్ఎమ్ ట్యూనర్తో వస్తుందని ఆయన తెలిపారు. సబ్వూఫర్ అవుట్పుట్ పవర్ 24 వాట్లు కాగా ప్రతి శాటిలైట్ కూడా 12 వాట్ల పవర్ని అందిస్తుందని వివరించారు. అలాగే 2.2 స్పీకర్ రిమోట్ కంట్రోల్తో వస్తుందని పేర్కొన్నారు. ఈ మల్టీమీడియా స్పీకర్ ఆన్లైన్లోను, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా లభ్యమవుతుందని తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Sunil Gavaskar: చెత్త రికార్డులో గవాస్కర్ సరసన కేఎల్ రాహుల్
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆఫ్ స్టంప్కి వెలుపలగా విసిరిన బంతిని.. ఆడాలా.. వద్దా అనే మీమాంసలో పడిపోయిన కేఎల్ రాహుల్ ఆఖరి క్షణంలో బ్యాట్ని పక్కకి తీసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వెళ్లి వికెట్లపై పడింది.
Samayam Telugu | Updated:
Dec 17, 2018, 03:09PM IST
Sunil Gavaskar: చెత్త రికార్డులో గవాస్కర్ సరసన కేఎల్ రాహుల్
ఆస్ట్రేలియా గడ్డపై పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ చెత్త రికార్డులో చోటు దక్కించుకున్నాడు. పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో.. రెండు ఇన్నింగ్స్ల్లోనూ 2, 0తో పేలవంగా బౌల్డయిన కేఎల్ రాహుల్.. టెస్టుల్లో అతి తక్కువ మ్యాచ్ల్లోనే అత్యధిక సార్లు బౌల్డయిన భారత ఓపెనర్గా రికార్డుల్లో నిలిచాడు. అంతేకాకుండా రెండు ఇన్నింగ్స్ల్లోనూ మూడు సార్లు బౌల్డయిన రెండో భారత క్రికెటర్గానూ సునీల్ గవాస్కర్ సరసన చేరాడు. చివరిగా ఆడిన 11 ఇన్నింగ్స్ల్లో కేఎల్ రాహుల్ ఏకంగా ఏడుసార్లు బౌల్డవడం కొసమెరుపు.
| 2sports
|
reliance jio - new app 'jiojuice' for battery saving
జియో సరికొత్త యాప్.. 'జియో జ్యూస్'..!
ఇప్పటికే ఉన్న యాప్స్తోపాలు మరో కొత్త యాప్ను ప్రవేశపెట్టాలని జియో యోచిస్తోంది. త్వరలో 'జియో జ్యూస్' పేరిట ఓ బ్యాటరీ సేవింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది.
TNN | Updated:
Apr 1, 2018, 11:56AM IST
సంచలన టెలికామ్ సంస్థ రిలయెన్స్ జియో ... సంచలనాలు ఇప్పట్లో ఆగేలా లేవు.... ఇప్పటికే టెలికామ్ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ... ఇచ్చి... దిగ్గజ టెల్కోలకు చుక్కులు చూపిన జియో... ఈ తర్వాత... తక్కువ ధరలో జియో 4జీ ఫీచర్ ఫోన్లు, జియోఫై, డేటా కార్డు అంటూ... మార్కెట్లో జియో పేరును నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. త్వరలో జియో సెటప్ బాక్సులు... కూడా విడుదలచేసే యోచనలో కూడా ఉంది. మరోవైపు జియో ప్రైమ్ సభ్యత్వ గడువు మార్చి 31తో ముగియగా... మరో ఏడాదిపాటు అంటే 2019 మార్చి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీనిద్వారా జియో వినియోగదారులు మరో ఏడాదిపాటు సేవలు కొనసాగనున్నాయి.
ప్రైమ్ మెంబర్షిప్ వల్ల వినియోగదారులు... జియోకు సంబంధించి.. ఎన్నో పెయిడ్ యాప్స్ను ఉచితంగా వాడుకోవచ్చు. ఇప్పటికే ఉన్న యాప్స్తోపాలు మరో కొత్త యాప్ను ప్రవేశపెట్టాలని జియో యోచిస్తోంది. త్వరలో ' జియో జ్యూస్ ' పేరిట ఓ బ్యాటరీ సేవింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని జియో ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. యాప్ లాంచింగ్ ఎప్పుడన్న... విషయం మాత్రం తెలుపలేదు.
Is this you when your phone loses power? #JioJuice Coming Soon. https://t.co/v016KjjgTX
— Reliance Jio (@reliancejio) 1522399818000
Your digital life will never get interrupted again. #JioJuice Coming Soon. https://t.co/RF6pLA7Fs5
— Reliance Jio (@reliancejio) 1522333091000
| 1entertainment
|
యాప్ నియంత్రిత వాటర్ హీటర్లు
- మార్కెట్లోకి విడుదల చేసిన వి-గార్డ్
హైదరాబాద్: ప్రముఖ విద్యుత్తు ఉపకరణాల తయారీ కంపెనీ వి-గార్డ్ వినూత్నమైన 'వెర్నో' వాటర్ హీటర్లను హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా నియంత్రించబడే 'వెర్నో' హీటర్లను తమ సంస్థ వినూత్నంగా రూపొందించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వి రామచంద్రన్ తెలిపారు. 'వెర్నో'లో 15 లీటర్లు, 25 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు వేరియంట్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటి ధరలను వరుసగా రూ.16,000, రూ.17,500గా నిర్ణయించినట్లు తెలిపారు. వినియోగదారులు తమ సంస్థ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ వెర్నోను నియంత్రించవచ్చన్నారు. ఇంట్లో వైఫై సౌకర్యం ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినియోగదారులు తమ మొబైల్ ఉపయోగించి ఈ వాటర్ హీటర్లను నియంత్రించుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
3 శాతం లాభపడ్డ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్
చైనా దిగుమతులపై సుంకాల విషయంలో ట్రంప్ ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు నెలకొని ఆసియా మార్కెట్లపై ఒత్తిడి నెలకొంది. చమురు ధరల ఒత్తిడికి ఇది కూడా తోడవ్వడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
Samayam Telugu | Updated:
Jun 18, 2018, 04:00PM IST
ఉదయం నుంచి స్థిరంగా కొనసాగిన ట్రేడింగ్ మార్కెట్లు ముగిసే సరికి చివరకు మదుపర్లకు నష్టాలను మిగిలిచ్చింది. చైనా దిగుమతులపై సుంకాల విషయంలో ట్రంప్ ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు నెలకొని ఆసియా మార్కెట్లపై ఒత్తిడి నెలకొంది. చమురు ధరల ఒత్తిడికి ఇది కూడా తోడవ్వడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
నష్టాల్లోమార్కెట్లు
మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 74 పాయింట్లు క్షీణించి 35,548 వద్ద, మరో సూచీ నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 10,780 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్(3.86%), టాటా మోటార్స్(1.91%), బజాజ్ ఆటో(0.62%), మారుతి(0.58%), ఇండస్ ఇండ్ బ్యాంక్(0.37%)ఎక్కువగా లాభపడగా, మరో వైపు వీఈడీఎల్(2.87%), కొటక్ బ్యాంక్(2.12%), భారతీ ఎయిర్టెల్(1.89%), కోల్ ఇండియా(1.63%), యాక్సిస్ బ్యాంక్(1.33%) అత్యధికంగా నష్టపోయాయి.
| 1entertainment
|
sandhya 283 Views stock market
stock market
ముంబై: 17వ లోక్సభ సమావేశాలు ఈ రోజు ప్రారంభమవుతున్న వేళ సోమవారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం బాంబే స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ 157 పాయింట్లు నష్టపోయి 39,294 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 54 పాయింట్లు నష్టంతో 11,768 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.86 వద్ద కొనసాగుతుంది.
తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/latest-news/
| 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
Jun 10,2015
డీఎల్ఎఫ్ 'సినిమా' పీవీఆర్ చేతికి
న్యూఢిల్లీ: పెరిగిన అప్పు భారాన్ని కొంత తగ్గించుకోవడంలో భాగంగా ఫ్రముఖ స్థిరాస్తి సంస్థ డీఎల్ఎఫ్ తమ అప్రాధాన్యత వ్యాపార విభాగాలను విక్రయించడాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సంస్థకు చెందిన డీటీ సినిమాను దాదాపు రూ.500 కోట్లకు తిరోగమన అమ్మకాల ప్రాతిపదికన పీవీఆర్ సంస్థకు విక్రయించింది. తమ అనుబంధ సంస్థ 'డీఎల్ఎఫ్ యుటిలిటీస్' తమ డీటీ సినిమాస్ విభాగాన్ని రూ.500 కోట్లకు విక్రయించేందుకు గాను పీవీఆర్ సినిమాస్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డీఎల్ఎఫ్ తెలిపింది. తమ ప్రధాన వ్యాపారంపై మరింత వ్యూహాత్మక దృష్టి నిలిపేందుకు గాను సినిమా వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌరభ్ చావ్లా తెలిపారు. డీటీ సినిమాస్కు జాతీయ రాజధాని ప్రాంతంలోనూ (ఎన్సీఆర్), ఛండీగఢ్లోనూ ఎనిమిది మల్టిప్లెక్స్ భవనాలతో 6000 సీట్ల సామర్థ్యం కలిగిన 29 తెరలు ఉన్నాయి. కొత్తగా రెండు భవనాలలో దాదాపు 10 నూతన తెరలను కూడా అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించుకుంది. ఈ విక్రయానికి పరిపాలన నియంత్రణ అనుమతులు, చట్టపరమైన అనుమతులు లభించాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా సంస్థ అప్పు భారం రూ.23,000 కోట్లకు చేరిన నేపథ్యంలో సంస్థ వివిధ అప్రాధాన్యత వ్యాపారాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. మార్చితో ముగిసిన త్రైమాసికానికి సంస్థ అప్పు భారం రూ.20,965 కోట్లకు చేరింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Mar 03,2016
విట్ విద్యార్థికి 'కెటీిహెచ్ మాస్టర్స్'
చెన్నయ్ : 'వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (విట్) యూనివర్శిటీలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న మహమ్మద్ కమల్ క్వాజాకు వైర్లెస్ సిస్టమ్ ట్రాక్లో 'కేటీహెచ్ మాస్టర్స్ చాలేంజ్ -2016' తొలి బహుమతి లభించింది. యూనివర్శిటి ఒక్క ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో తమ విద్యార్థికి స్టాకహోంలోని కేటీహెచ్ రాయల్ ఇన్స్టిస్యూట్ ఆఫ్ టెక్నలాజీలో వైర్లెస్ సిస్టమ్లో మాస్టర్ డిగ్రీ చేయడానికి స్కాలర్షిప్ను అందించనున్నట్లు తెలిపింది. ఇది ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన యూనివర్శిటీ అని వివరించింది. ఇక్కడి నుంచి అనేక మంది విజయవంతంగా టెక్నోక్రాట్స్, ఎంటర్ప్రిన్యూర్స్, పరిశోధకులు రూపుదిద్దుకున్నారని పేర్కొంది. వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించి తనను టాప్ విద్యార్థుల్లో ఒక్కరిగా 'కెేటీహెచ్ మాస్టర్స్' గుర్తించిందని క్వాజా పేర్కొన్నారు. తోడ్పాటు అందించిన విట్ విశ్వవిద్యాలయం అధికారులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Swift dezire
మార్కెట్లోకి స్విఫ్ట్ డిజైర్
న్యూఢిల్లీ, మే 17: మారుతిసుజుకీలో అత్యంత విజయ వంతమైన సిఫ్ట్ డిజైర్ మోడల్ను సరికొత్త హంగుల తో మార్కెట్లోకి విడుదల చేశారు. డిజైర్ సిరీస్లో ఇది మూడో తరం కారు. కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ఇప్పటికే స్విఫ్ట్ డిజైర్ షేరు 50శాతం పైమాటే. కొత్త మోడల్లో మార్కెట్వాటా మరింత పెరుగుతుందని మారుతిసుజుకి భావిస్తోంది. కొత్త డిజైర్ను ఏకేఏ సుజుకీ బీ ప్లాట్ఫామ్పై తయారుచేస్తున్నారు. ఇప్ప టికే బాలినోను కూడా దీనిపై తయారు చేస్తున్నారు. దీని ప్రారంభ మోడల్ ధర రూ.5,45,000లక్షలు. కాగా టాప్ వేరియంట్ అయిన జడ్డిఐ ప్లస్ ఎజిఎస్ మోడల్ ధర రూ.9,41,000లక్షలు. దీనిని రూ.33వేలు చెల్లించి మారుతి డీలర్స్ వద్ద బుక్ చేసుకోవచ్చు. మే తొలివారం నుంచి బుకింగ్స్ స్వీకరిస్తున్నారు. కారు అందటానికి దాదాపు 8వారాలు సమయం పట్టవచ్చు. ఈసారి కొత్తగా మూడు రంగుల్లో డిజైర్ అందుబాటులోకి వచ్చింది. ఆక్స్ఫర్డ్ బ్లూ, గాలెంట్ రెడ్, షీర్వుడ్ బ్రౌన్ రంగుల్లో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ బరువు 85 కిలోలు తగ్గగా, డీజిల్ వేరియంట్ బరువు 105 కిలోల వరకు తగ్గింది. కొత్త డిజైర్ అభివృద్ధికి మారుతి రూ.1,000కోట్లు వెచ్చించింది. ఇది 3,95ఎంఎం పొడవు కలిగి ఉంటుంది. 1.2లీటర్ వివిటి (పెట్రోల్), 1.3లీటర్ డిడిఐఎస్(డీజిల్). ఈ రెండు ఇంజిన్లలో ఆటోగేర్ ఆప్షన్ను మారుతి ఇచ్చింది.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సెంచరీతో టీమిండియాను గట్టెక్కించిన రహానే
సౌతాఫ్రికా భారత్ ల మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రెహానే సెంచరీతో కదంతొక్కాడు.
TNN | Updated:
Dec 4, 2015, 10:40AM IST
సౌతాఫ్రికా భారత్ ల మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రెహానే సెంచరీతో కదంతొక్కాడు. దీంతో భారత్ స్కోర్ : 257/7 కు చేరింది. 231 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఉదయం కోహ్లీసేన బ్యాంటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. టీమిండియా చేతిలో ఇంకా మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. మూడు వందల పైచిలుగు స్కోర్ చేయాలనే లక్ష్యంగా టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. అశ్విన్ 21 పరుగులతో రెహానేకు చక్కటి సహకారం అందిస్తుండటంతో 300 స్కోర్ పెద్ద కష్టకాకపోవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 300పై స్కోర్ చేసి సఫారీలను ఒత్తడిలో నెట్టేలానే వ్యూహంతో భారత్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది.
| 2sports
|
Investment
మార్కెట్ల నుంచి తగ్గుతున్న పెట్టుబడులు
ముంబై, డిసెంబరు 15: పెట్టుబడులకు భారత్ స్వర్గ ధామం అన్న విదేశీ ఇన్వెస్టర్ల భావన రానురాను మసక బారుతోంది. ఈ కేలండర్ సంవత్సరంలో ఇప్పటివరకూ విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 200 కోట్ల డాలర్ల పెట్టు బడులు వెనక్కి తీసుకున్నట్లు తేలింది. గడచిన ఎనిమిది సంవత్సరాలతో పోలిస్తే అధ్వాన్నంగా ఉంది. ఎక్కువగా డెట్ రంగంలోనే పెట్టుబడులకు విఘాతం కలిగింది. ఇటీవలి సంవత్సరాల్లో విదేశీనిధులు మార్కెట్ పరిస్థితులను బేరీజువేసుకుని ఎక్కువశాతం తగ్గించివేసారు. నిపుణుల అంచనాల ప్రకారంచూస్తే 2017 రెండో అర్ధసంవ త్సరంలో కూడా మరింత అమ్మకాల ఒత్తిళ్లు ఉంటాయని అంచనా. డెట్ రంగంనుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఈ ఏడాది 43 వేల కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం లేదా కేలండర్ సంవత్సరం ముగియడానికి కొద్దిరోజులు మాత్రమే మిలిగి ఉన్న తరునంలో నికరంగా 30వేల కోట్లు నిధులు ఈక్విటీ మార్కె ట్కు వచ్చాయని అంచనా.
ఇన్వెస్టర్లు ఎక్కువగా 41,215 కోట్ల రూపాయలు 2008లో మాత్రమే మార్కె ట్ల నుంచి వెనక్కి తీసుకున్నారు. ఆ ఏడాది అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ఎక్కువ నెలకొన్న సంగతి తెలిసిందే. అత్యధికంగా విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడుల్లోనే వెనక్కిపోయాయని, ప్రత్యేకించి డెట్రంగంలో మరింతగా ఉన్నాయని జియోజిత్ బిఎన్పి పరిభాస్ ముఖ్య పెట్టు బడుల వ్యూహకర్త వికె విజ§్ుకుమార్ వెల్లడించారు.
5నాన్స్డాట్కామ్ సిఇఒ దినేష్ రోహిరా మాట్లాడుతూ భారత్ మార్కెట్ల నుంచి అక్టోబరు నుంచీ పెట్టుబడులు వెనక్కి తరలిపోతున్నాయని పేర్కొన్నారు. తక్కువ స్థాయి ఉత్పత్తి, దేశీయ వినియోగం తగ్గడం వల్లనే పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు. ఇటలీలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభం, రాజ్యాంగంపై రిఫరెండమ్, దేశీయంగా జిఎస్ఇ ప్రభావం కొంత ఇందుకు దోహదంచేస్తోంది. ఈ రెండింటి కారణాల వల్లనే పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లకు తక్కువగా వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 29వేల కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేసారు. బాండ్లపరంగా చూస్తే 42 వేల కోట్లు పెట్టుబడులు పెట్టారు. 2016లో ఇప్పటివరకూ 14 వేల కోట్లు వెనక్కి తీసుకున్నారు. పెట్టుబడులు ఉపసం హరించుకున్నప్పటికీ దేశీయంగా భారత్ ఈక్విటీ మార్కె ట్లకు నికర పెట్టుబడులు 1992నుంచి ఇప్పటివరకూ చూస్తే 8.3 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉన్నాయి.
| 1entertainment
|
ఎన్టీఆర్ వర్కౌట్స్ ను చూసి రన్ వీర్ ఏమన్నాడో తెలుసా...
Highlights
తారక్ లుక్ కి ప్రశంశలు జల్లు
బాలీవుడ్ హీారోలు సైతం ట్వీట్లు
ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కోసం క్యారెక్టర్ కోసం ఎంత కష్టమైన పడుతాడు. దానికి ఉదాహరణ జిమ్ లో తన కండలు పెంచిన తీరు చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. అంతే కాదండోయ్ ఈ పిక్ చూసి బాలీవుడ్ అగ్ర హీరో సైతం నివ్వరపోయి ట్వీట్ చేశాడు.
త్రివిక్రమ్, రాజమౌళిల సినిమా కోసం ఎన్టీఆర్ అన్ని విధాల రెఢీ అవుతున్నాడు. రీసెంట్ గా అమెరికాలో జక్కన్న సినిమా కోసం వర్కషాప్ అండ్ ఫోటోషూట్ కోసం వెళ్లి తిరిగి వచ్చిన తారక్ టైమ్ వేస్ట్ చేయకుండ వర్కౌట్లు మొదలెట్టేశాడు. వచ్చే నెల మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనున్న త్రివిక్రమ్ సినిమా క్యాస్టింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. సినిమా ఈ లుక్ టెంపర్ కంటే కూడా ఇందులో ది బెస్ట్ గా ఉండేలా తయారవుతున్నాడంట.సినిమాలో తారక్ ఏ రేంజ్ కుమ్మేస్తాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ టైగర్ ని వెండితెరపై చూడలంటే దసరా వరకు ఆగక తప్పదు.
Last Updated 26, Mar 2018, 12:04 AM IST
| 0business
|
హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ (ఫొటోలు)
First Published 22, Oct 2018, 5:28 PM IST
హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ (ఫొటోలు)
హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ (ఫొటోలు)
హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ (ఫొటోలు)
హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ (ఫొటోలు)
హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ (ఫొటోలు)
హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ (ఫొటోలు)
హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ (ఫొటోలు)
హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ (ఫొటోలు)
హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ (ఫొటోలు)
హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ (ఫొటోలు)
హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ (ఫొటోలు)
హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ (ఫొటోలు)
Recent Stories
| 0business
|
Visit Site
Recommended byColombia
జట్టుని నడిపించడంలో తనకి అనుభవం లేకపోవడంతో.. గతంలో కెప్టెన్లుగా వ్యవహరించిన మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్లను సిరీస్కి ఎంపిక చేయాలని కెప్టెన్గా బాబర్ అజామ్ సూచించాడట. అయితే.. ఇటీవల శ్రీలంకతో సిరీస్కి సీనియర్ క్రికెటర్లకి అవకాశాలిచ్చి దెబ్బతిన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. మరోసారి ఆ సాహసం చేయలేమని తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది. అతనికి మద్దతుగా చీఫ్ కోచ్ కమ్ చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్ మద్దతుగా నిలిచినా.. పీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదని సమాచారం.
Read More: భారత్లో బంగ్లాదేశ్ టూర్.. మ్యాచ్ల షెడ్యూల్ ఇదే
శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం సీనియర్ బ్యాట్స్మెన్ ఉమర్ అక్మల్ని దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి పీసీబీ ఎంపిక చేసింది. కానీ.. తొలి రెండు టీ20ల్లోనూ అతను గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అతనే కాదు.. సీనియర్ ఆటగాళ్లెవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో.. పీసీబీ కఠిన నిర్ణయాలకి ఉపక్రమించి.. ఏకంగా కెప్టెన్ సర్ఫరాజ్పైనే వేటు వేసింది. దేశవాళీ క్రికెట్లో ఆడి ఫామ్ నిరూపించుకుని మళ్లీ జట్టులోకి రావాలని అతడ్ని పీసీబీ ఆదేశించిన విషయం తెలిసిందే.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్ x శ్రీలంక టీ20 మ్యాచ్ ఆలస్యం..!
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య బుధవారం జరగాల్సిన ఏకైక టీ20 మ్యాచ్ ఆలస్యంకానుంది.
TNN | Updated:
Sep 6, 2017, 06:36PM IST
కొలంబో వేదికగా భారత్ , శ్రీలంక మధ్య బుధవారం జరగాల్సిన ఏకైక టీ20 మ్యాచ్ ఆలస్యంకానుంది. స్టేడియం పరిసరాల్లో ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో మైదానాన్ని సిబ్బంది పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6.30 గంటలకి టాస్ వేయాలి. కానీ.. ప్రస్తుతం వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినా.. మైదానాన్ని సిద్ధం చేయాలి కాబట్టి టాస్ మరో అరగంట పాటు ఆలస్యంకానున్నట్లు మ్యాచ్ అధికారులు వెల్లడించారు.
సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే భారత్ చేతిలో టెస్టులు, వన్డేల్లో క్లీన్‌స్వీప్‌నకు గురైన శ్రీలంక కనీసం ఈ ఏకైక టీ20లోనైనా సత్తా చాటాలని ఆశిస్తోంది. మరోవైపు లంక గడ్డపై ఓటమి రుచి ఎరుగని భారత్ మంచి జోరుమీదుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఫామ్‌లో ఉండటం టీమిండియాకి కలిసొచ్చే అంశం.
| 2sports
|
Sports Minister Rajyavardhan Singh Rathore promises support to Savita Punia
గోల్ కీపర్ తొమ్మిదేళ్ల పోరాటం ఫలించింది
భారత మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ సవిత పునియా తొమ్మిదేళ్ల పోరాటం ఫలించింది. ఆమెకి అన్నివిధాల సాయం అందిస్తామని కేంద్ర క్రీడల
TNN | Updated:
Nov 9, 2017, 12:27PM IST
భారత మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ సవిత పునియా తొమ్మిదేళ్ల పోరాటం ఫలించింది. ఆమెకి అన్నివిధాల సాయం అందిస్తామని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తాజాగా స్పష్టం చేశారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత మహిళా హాకీ జట్టు ఇటీవల ఆసియా కప్‌‌ విజేతగా నిలవడంలో సవిత క్రియాశీలక పాత్ర పోషించింది. కానీ.. కేంద్రం, హరియాణా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు తనకు ఎలాంటి సాయం అందలేదని సవిత ఆవేదన వ్యక్తం చేయడంపై క్రీడల మంత్రి స్పందించారు.
‘హాకీ ప్రాక్టీస్, మ్యాచ్‌ల షెడ్యూల్ కారణంగా నేను ప్రత్యేకంగా ఎలాంటి ఉద్యోగం చేయలేకపోతున్నాను. దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగం ఇస్తామని గతంలో హరియాణా ప్రభుత్వం చెప్పింది. కానీ.. పతకాలు తెస్తేనే అనే మెలిక పెట్టింది. తాజాగా ఆసియా కప్‌ గెలిచిన జట్టులో నేను గోల్ కీపర్‌ని. కనీసం ఇకనైనా ప్రభుత్వం స్పందిస్తుందేమో చూడాలి’ అని సవిత ఇటీవల మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్పందించారు. ‘గోల్‌ కీపర్ సవిత వివరాలను సేకరించమని సంబంధిత అధికారులను ఇప్పటికే ఆదేశించాను. తప్పకుండా ఆమెకి అన్నివిధాల సాయం చేస్తాం’ అని మంత్రి వివరించారు.
| 2sports
|
Oct 08,2015
గోజావాస్లో పెరిగిన స్నాప్డీల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ సంస్థ గోజావాస్తో స్నాప్డీల్ దోస్తీ మరింత బలపడింది. తాజాగా గోజావాస్లో ఈ కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ మరో రూ.130 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లుగా వెల్లడించింది. గోజావాలో స్నాప్డీల్ పెట్టుబడులు పెట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో కూడా స్నాప్డీల్ సంస్థ గోజావాస్లో పెట్టుబడులు పెటింది. గోజావాస్ సంస్థ ఇప్పటికే దేశంలోని 350 పట్టణాలలో డెలివరీ సర్వీసెస్ను అందిస్తోంది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ రెండో విడుత పెట్టుబడులను పెడుతున్నట్లుగా స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ బన్సాల్ తెలిపారు. ఇరు సంస్థలు జట్టుకట్టిన అనంతరం గత ఆరు నెలలుగా అన్లైన్ బుకింగ్ ఉత్పత్తుల డెలవరీ సమయం దాదాపు 24 గంటల మేర తగ్గినట్టు తెలిపారు. తాజా పెట్టుబడలు గోజావాస్ సేవల విస్తృతి మరింత పెరిగేందుకు తాజా పెట్టుబడులు మరింతగా దోహదం చేస్తుందని వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రో‘హిట్’.. రాంచీ టెస్టులో భారత్ 497/9 డిక్లేర్డ్
రాంచీ టెస్టులోనూ భారీ స్కోరుతో విజయానికి టీమిండియా బాటలు వేసుకుంది. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ, రహానె సెంచరీ బాదడంతో తొలి ఇన్నింగ్స్ని భారత్ 497/9 వద్ద డిక్లేర్ చేసింది.
Samayam Telugu | Updated:
Oct 20, 2019, 03:15PM IST
హైలైట్స్
రాంచీ టెస్టులో తొలి ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసిన భారత్
డబుల్ సెంచరీ బాదిన రోహిత్, రహానె సెంచరీ
రెండు ఓవర్లలోనే ఐదు సిక్సర్లు బాదిన ఉమేశ్ యాదవ్
నాలుగు వికెట్లు పడగొట్టిన సఫారీ బౌలర్ జార్జ్ లిండే
దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ని 497/9 వద్ద డిక్లేర్ చేసింది. మ్యాచ్లో రెండో రోజైన ఆదివారం ఓవర్నైట్ స్కోరు 224/3తో మొదటి ఇన్నింగ్స్ని కొనసాగించిన టీమిండియా.. రోహిత్ శర్మ (212: 255 బంతుల్లో 28x4, 6x6) డబుల్ సెంచరీ, అజింక్య రహానె (115 బంతుల్లో 192 బంతుల్లో 17x4, 1x6) శతకం బాదడంతో మెరుగైన స్కోరు చేయగిలింది. రెండో సెషన్ ముగుస్తుందన్న దశలో భారత్ ఇన్నింగ్స్ని విరాట్ కోహ్లీ డిక్లేర్ చేయగా.. అప్పుడు క్రీజులో నదీమ్ (1 నాటౌట్), మహ్మద్ షమీ (10 నాటౌట్: 11 బంతుల్లో 1x6) ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జార్జ్ లిండే నాలుగు వికెట్లు పడగొట్టగా.. కగిసో రబాడ మూడు, ఆన్రిచ్ నోర్తేజ్, డాన్ పైట్ ఒక వికెట్ తీశారు.
Read More: రోహిత్ శర్మ దెబ్బకి సిక్సర్ల వరల్డ్ రికార్డ్ బ్రేక్..!
ఆదివారం తొలి రెండు సెషన్ల ఆటలో రోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ఆటే హైలైట్గా నిలిచింది. ఈరోజు ఓవర్నైట్ వ్యక్తిగత స్కోరు 117తో ఇన్నింగ్స్ని కొనసాగించిన రోహిత్ శర్మ.. టెస్టు కెరీర్లో తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 199 వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్.. తర్వాత ఓవర్లోనే ఔటైపోయాడు. అనంతరం వచ్చిన జడేజా (51: 119 బంతుల్లో 4x4) హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించగా.. సాహా (24), అశ్విన్ (14) నిరాశపరిచారు. కానీ.. 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ఉమేశ్ యాదవ్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు.
Read More: 64 ఏళ్ల తర్వాత.. భారత్కి 3 డబుల్ సెంచరీలు
భారత్ స్కోరు 450 వద్ద జడేజా ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ (31: 10 బంతుల్లో 5x6) వరుస సిక్సర్లు బాదేశాడు. స్పిన్నర్ జార్జ్ లిండే బౌలింగ్ని లక్ష్యంగా చేసుకున్న ఉమేశ్ యాదవ్.. అతను వేసిన రెండు ఓవర్లలో ఏకంగా ఐదు సిక్సర్లు నమోదు చేశాడు. దీంతో.. భారత్ స్కోరు బోర్డు ఒక్కసారిగా పరుగులు పెట్టింది. అయితే.. ఆరో సిక్సర్ బాదే ప్రయత్నంలో లిండే బౌలింగ్లోనే ఉమేశ్ ఔటవగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే కోహ్లీ.. భారత్ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశాడు.
| 2sports
|
India vs Sri Lanka Tests: Angelo Mathews ready for tough challenge
సచిన్ కారణంగా 99 వద్ద ఔటైపోయా..!
భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ మెరుపు ఫీల్డింగ్ కారణంగా.. 2009లో తాను తొలి టెస్టు శతకాన్ని తృటిలో చేజార్చుకున్నట్లు శ్రీలంక మాజీ
TNN | Updated:
Nov 3, 2017, 02:43PM IST
భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ మెరుపు ఫీల్డింగ్ కారణంగా.. 2009లో తాను తొలి టెస్టు శతకాన్ని తృటిలో చేజార్చుకున్నట్లు శ్రీలంక మాజీ కెప్టెన్ మాథ్యూస్ గుర్తు చేసుకున్నాడు. భారత్ గడ్డపై నవంబరు 16 నుంచి శ్రీలంక వరుసగా మూడు టెస్టులు, మూడు వన్డేలు, 3 టీ20ల సుదీర్ఘ సిరీస్‌ ఆడనుంది. ఇటీవల ఆ దేశ పర్యటనకి వెళ్లిన భారత్‌ చేతిలో అన్ని ఫార్మాట్లలోనూ లంకేయులు క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. అయితే.. త్వరలో జరగబోవు సిరీస్‌లో టీమిండియాకి పోటీనిస్తామని మాథ్యూస్ ధీమా వ్యక్తం చేశాడు.
‘భారత్‌తో జరగబోవు సిరీస్‌ మా జట్టుకి చాలా కఠినమైనది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సిరీస్‌‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు శ్రీలంక ఆటగాళ్లు గత కొద్దిరోజుల నుంచి సన్నద్ధమవుతున్నారు. ఫలితాలతో సంబంధం లేకుండా.. పాజిటివ్ మైండ్‌తో మ్యాచ్‌లు ఆడతాం. 2009లో నా తొలి టెస్టు శతకాన్ని తృటిలో చేజార్చుకున్న తీరు నాకింకా గుర్తుంది. ముంబయి వేదికగా జరిగిన ఆ టెస్టులో నేను బంతిని చక్కగా హిట్ చేశాను. బంతి దాదాపు బౌండరీ లైన్ సమీపానికి వెళ్లింది. దీంతో అప్పటికి 98 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న నేను ఒక పరుగు పూర్తి చేసి.. కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీని అందుకుంటున్నాననే ఆనందంలో రెండో పరుగు కోసం పరుగెత్తాను. కానీ.. సచిన్ మెరుపు ఫీల్డింగ్‌ చేసి ధోనీకి బంతినివ్వడంతో రెండు అంగులాల దూరంలో రనౌటయ్యాను. ఆ సిరీస్‌ నేను నేర్చుకునేందుకు చాలా ఉపయోగపడింది’ అని మాథ్యూస్ వెల్లడించాడు.
| 2sports
|
Pranav, Sikhi Reddy
రన్నరప్గా ప్రణవ్-సిక్కిరెడ్డి
గ్లాస్గో: స్కాటిష్ ఓపెన్ గ్రాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్సీడ్గా బరిలోకి దిగిన ప్రణ§్ు చోప్రా,సిక్కిరెడ్డి జోడీ తృటిలో స్వర్ణ పతకం చేజార్చుకుంది.కాగా సెప్టెంబర్లో బ్రెజిల్ ఓపెన్ గ్రాండ్ ప్రి గెలిచిన ఈ భారత జోడీ మిక్స్డ్ డబుల్స్లో మలేసియాకు చెందిన గోహ్ సూన్ హుత్,షెవన్ జేమీ లియాతో జరిగిన హోరాహోరీ ఫైనల్లో 21-13,18-21,16-21తో పరాజయం చెందింది.కాగా తొలి గేమ్ను 4-0 ఆధిక్యంతో ప్రారంభించిన భారత జంట 11-6తో దూసుకెళ్లి 21-13తోకైవసం చేసుకుంది.రెండవ గేమ్లో 11-7తో ముందంజలో ఉన్న ప్రత్యర్థి జంట 13-13తో స్కోరు సమం చేయడమే కాకుండా 21-16తో గేమ్ గెలుచుకుంది.కీలకమైన ఆఖరి గేమ్లోనూ ప్రత్యర్థి జట్టే పై చేయి సాధించింది.ప్రణవ్,సిక్కిరెడ్డి 16-12తో ఆధిక్యంలో ఉన్న మలేసియా జోడీని నిలువరించడంలో విఫలమై రన్నరఫ్తో సరిపెట్టుకున్నారు
| 2sports
|
Indina Currency
రూ. 70కి చేరుతున్న డాలర్ వర్సెస్ రూపాయి
న్యూఢిల్లీ, నవంబరు 23: డాలరుతో రూపాయి మారకం విలువలు 68.50 రూపాయలకు చేరాయి. అమెరికా డాలర్ అంతర్జాతీయంగా పటిష్టం కావడం, ఆదేశంలో మారుతున్న ఆర్ధ్థిక స్థితిగతులే ఇందు దోమదంచేసాయి. ఆసియా దేశాల కరెన్సీలతో కూడా డాలర్ పటిష్టం కావడం గమనార్హం. 2013 ఆగస్టులో డాలరుతో రూపాయి మారకం విలువలు 68.85 రూపాయలుగా నమోదయింది. అమెరికా ఫెడ్ రిజ ర్వు ఫండ్రేట్లను పెంచితే భారత్ కరెంటుఖాతాలోటు పెరుగుతుందని అంచనా. విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో తమతమ షేర్లను విక్ర యించడం, ఇతర గ్లోబల్ కరెన్సీల్లో డాలర్విపరీతంగాపెరగడం కూడా ఒక కారణం అయింది. డొనాల్డ్ట్రంప్ ఎన్నికయిన తర్వాత అమెరికా కరెన్సీ ధోరణులు భారీగా పెరిగాయి. రూపాయి నవంబరు 9వ తేదీ నుంచి రూపాయి మారకం విలువలు రెండుశాతం క్షీణించాయి. ట్రంప్ విజయంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, అధ్యక్ష అభ్య ర్ధి ఇన్ఫ్రా రంగంపై జరిపే వ్యయప్రణాళికలు కీలకం అవుతాయని అంతేకాకుండా పన్నుల్లో కోతలు ఉంటాయని చెపుతున్నారు. పటిష్ట మైన ఆర్థిక గణాంకాలు కూడా వడ్డీరేట్లను పెంచేందుకు దోహదం చేస్తుంది. వచ్చేనెలలోనే ఫెడ్రిజర్వు తన వడ్డీరేట్లను పెంచుతుంది. ఛైర్పర్సన్ జన్నెట్ ఎల్లెన్ ఇప్పటికే ఆ సంకేతాలను పంపించారు. ఇక అమెరికా బాండ్ల రాబడులు భారీగా పెరుగుతున్నాయి. డాలర్ పటిష్టం కావడమే ఇందుకుకీలకం. దీనితో ఇన్వెస్టర్లు అందరూ అమెరికా బాండ్ల మార్కెట్లవైపు పరుగులు తీస్తూ వర్ధమానమార్కెట్ల నుంచి తమపెట్టు బడులను ఉపసంహరించుకుంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు భారత్లోని స్టాక్ మార్కెట్లలో ఈనెల 8వ తేదీ నుంచి సుమారు 12వేల కోట్లకుపైబడిన షేర్లను విక్రయించారు. దీనివల్ల భారత్ రూపాయిపై మరింత భారం పెరిగింది. భారత్ స్టాక్ మార్కెట్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగు తున్నాయి. ఇదం తా పెద్దనోట్లు రద్దు తర్వాతనుంచే కని పిస్తున్నది. జిడిపి వృద్ధి అంచనాలను కూడా కొన్ని బ్రోక రేజి సంస్థలు తగ్గి స్తున్నాయి. సమీప భవిష్యత్తులోకూడా ఈ క్షీణత కొనసా గుతుందని, హెచ్ ఆర్బివి క్లయింట్ సొల్యూషన్స్ అధి నేత టిఎస్ హరి హర్ ప్రకటించారు. రానున్న కాలంలో డాలరుతోరూపాయి మారకం విలువు 70కి చేరతాయని ఆయన అంచనా. గతంలో 68.85 అంచనాలను సైతంఅధిగమించి రూ.70లకుడాలర్చేరుతుందని అంచనా.
| 1entertainment
|
'మహీంద్రా'లో వ్యర్థాల నుంచి సీఎన్జీ
- మహీందా వరల్డ్ సిటీలో వెయ్యి చ.మీ. పరిథిలో అత్యాధునికంగా ఏర్పాటు
- రోజుకు 400 కిలోల సహజ వాయువు అందుబాటులోకి ొ వాహనాలతో పాటు వంట, విద్యుదుత్పత్తికీ వినియోగం
చెన్నై: వాణిజ్య వాహనాల దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ సరికొత్త ఇంధన వినియోగం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా శనివారం ఆ సంస్థ అహ్యార, వంటింటి వ్యర్థాల ద్వారా బయో-సీఎన్జీని ఉత్పత్తి చేసే ప్లాంటును ఇక్కడి 'మహీంద్రా వరల్డ్ సిటీ' (ఎండబ్ల్యూసీ)లో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర విద్యుత్తు, బొగ్గు, పురుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈ ప్లాంటును ప్రారంభించారు. దాదాపు 1000 చదరపు మీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్లాంటులో ఎనిమిది టన్నుల మేర ఆహార, వంటింటి వ్యర్థాల నుంచి దాదాపు 1000ఎం3 మేర ముడి బయోగ్యాస్ను ఉత్పత్తి చేయనున్నారు. తదుపరి ఈ వాయువును శుద్ధి చేసి మేటి సహజ వాయువుగా మార్చి వినియోగించనున్నారు. ప్రాథమిక అంచనాల మేరకు రోజుకు 400 కిలోల మేర శుద్ధి చేసిన సహజ వాయువు (200 కిలోవాట్ల సామర్థ్యానికి సరిపడ) అందుబాటులోకి రానుంది. దీనిని సిలెండర్లలో అదిక పీడనం వద్ద నింపి మహీంద్రా ప్లాంటులో వినియోగి ంచనున్నారు. ఈ ప్లాంటు నుంచి రోజుకు వెలువడే నాలుగు టన్నుల వ్యర్థాలను ఆర్గానిక్ ఫర్టిలైజర్ల తయారీకి వినియోగించనున్నారు. ఈ ప్లాంటు నుంచి వచ్చే సీఎన్జీని ఎండబ్ల్యూసీలో వాహనాలు, బస్సులు, ఇతర వాణిజ్య వాహనాలకు ఇంధనంగా వాడనున్నారు. దీనికి తోడు వంటకు, వీధి దీపాలను వెలిగిం చేందుకు, విద్యుత్తు అవసరాల నిమిత్తం కూడా ఈ గ్యాస్ను వినియోగించనున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ అండ్ ఫార్మ్ ఇక్విప్మెంట్ రంగం ఈడీ, అధ్యక్షుడు పవన్ గోయెంకా మాట్లాడుతూ ఒక సదుద్దేశంతో ఈ ప్లాంటును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ ప్లాంటులో గ్యాస్ ఉత్పత్తికి అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే విధమైన ప్లాంటులను ఏర్పాటు చేసేందకు ముందుకు వచ్చే వారికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
balakrishna and puri jagannadh paisa vasool collections updates
కలెక్షన్స్ తోడా: ఎవరికెన్ని పైసలు పోయాయ్!
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే చాలు టాక్తో సంబంధం లేకుండా కనీసం 40 కోట్ల షేర్ను సాధిస్తోంది. తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన 'పైసా వసూల్' సినిమా సెప్టెంబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే.
TNN | Updated:
Sep 11, 2017, 03:58PM IST
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే చాలు టాక్‌తో సంబంధం లేకుండా కనీసం 40 కోట్ల షేర్‌ను సాధిస్తోంది. తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన 'పైసా వసూల్' సినిమా సెప్టెంబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే. బాలకృష్ణ మార్కెట్ పెరిగిన నేపధ్యంలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందని అంతా అనుకున్నారు. పూరీ తక్కువ బడ్జెట్‌లో సినిమాను రూపొందించడంతో 32.5 కోట్లకే సినిమాను సేల్ చేసుకున్నారు. సినిమా మొదటి వారంలో జోరు చూపించినా.. వీక్ డేస్‌లో బాగా డల్ అయిపోయింది. వారంలో రోజుల్లో కలిపి మొత్తం సినిమా 17.25 కోట్లు మాత్రమే వసూల్ చేసింది.
అర్జున్ రెడ్డి ఎఫెక్ట్‌ భారీగా పడటంతో వీక్ డేస్‌లో కలెక్షన్స్ మరీ తగ్గిపోయాయి. లాంగ్ రన్‌లో సినిమా 20 కోట్లు అయినా కలెక్ట్ చేస్తుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే కనీసం పది కోట్ల వరకు బయ్యర్లకు నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైజాంలో ఈ సినిమా బిజినెస్ 8 కోట్ల వరకు జరిగింది. కానీ అక్కడ 3.8 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టింది. అంటే దాదాపు 3 కోట్ల నష్టం వాటిల్లింది. సీడెడ్‌లో సినిమా హక్కుల్ని 6 కోట్లకు అమ్మగా.. అక్కడ అక్కడ మూడున్నర కోట్లు మాత్రమే వసూలైంది. ఇక వైజాగ్‌లో 3 కోట్లకు అమ్మిన సినిమా అక్కడ బయ్యర్లకు సగానికి సగం నష్టాల్ని కలిగిస్తోంది. ఇలా సినిమా కొన్న ప్రతి ఏరియాలో బయ్యర్లు కూడా నష్టాలను భరించక తప్పడం లేదు.
| 0business
|
jadeja
ఐసిసి తాజా ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో జడేజా
న్యూఢిల్లీ: ఐసిసి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో భారత ఆటగాడు జడేజా బౌలర్ల జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.ఆ తరువాత స్థానంలో మరో భారతీయ ఆటగాడు అశ్విన్ ఉన్నాడు.బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో కోహ్లీ మరో స్థానం దిగజారి అయిదవ స్థానానికి పడిపోయాడు.ఆల్రౌండర్ జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అగ్రస్థానంలో ఉన్నాడు.తాజాగా భారత్-ఆస్ట్రేలియా,న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్లు ముగిశాయి.వరుస టెస్టుల్లో సత్తాచాటిన పలువురు ఆటగాళ్లు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.ఆసీస్తో ముగిసిన టెస్టు సిరీస్లో సరిగా ఆడలేక కోహ్లీ టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో నాలుగవ స్థానం నుంచి అయిదవ స్థానానికి పడిపోయాడు.499 పరుగులతో దూసుకుపోయిన ఆసీస్ సారధి స్టీవ్ స్మిత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
న్యూజిలాండ్,ఇంగ్లండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్,జా§్ు రూట్ తరువాత స్థానాల్లో ఉన్నారు.గత వారం రెండవ స్థానంలో ఉన్న పుజారా తాజా ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు దిగజారి నాలుగవ స్థానాన్ని దక్కించుకున్నారు. 11 స్థానాలు ఎగబాకిన కెఎల్ రాహుల్ 11వ స్థానంలో నిలువగా మూడు స్థానాలు ఎగబాకిన రహానే 14వ స్థానంలో నిలిచాడు.బౌలర్ల జాబితాలో టాప్-20 లో ఇద్దరు భారతీయ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు.జడేజా,అశ్విన్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.ఆల్రౌండర్ల జాబితాలో జడేజా,అశ్విన్ రెండు,మూడు స్థానాలు దక్కించు కున్నారు.
| 2sports
|
Hyderabad, First Published 5, Oct 2019, 7:10 AM IST
Highlights
హీరో గోపీచంద్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. కెరీర్ ఆరంభంలో రణం, యజ్ఞం, ఆంధ్రుడు లాంటి చిత్రాలతో మాస్ లో మంచి పునాది వేసుకున్నాడు. కానీ తాం బాక్సాఫీస్ రేంజ్ ని పెంచుకునేలా హిట్ కొట్టలేకపోతున్నాడు. అక్టోబర్ 5 శనివారం విడుదలవుతున్న చాణక్య చిత్రం గోపీచంద్ మార్కెట్ పరిధిని పెంచే చిత్రం అవుతుందేమో చూడాలి.
ఆరడుగుల కటౌట్, మాస్ అప్పీల్ ఉండే లుక్ తో గోపీచంద్ కు కలసి వచ్చే అంశాలు. నటన పరంగా కూడా గోపీచంద్ పలు చిత్రాల్లో ప్రశంసలు దక్కించుకున్నాడు. గోపీచంద్ ఇటీవల విభిన్నమైన కథలని ఎంచుకుంటున్నాడు.
తాజాగా గోపీచంద్, తమిళ దర్శకుడు తిరు కాంబినేషన్ లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ చిత్రం చాణక్య నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే యూఎస్ లో చాణక్య చిత్ర ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన, సినిమా టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
సీనియర్ నటుడు నాజర్ లీడ్ చేసే రా (Raw) సంస్థలో గోపీచంద్ అండర్ కవర్ ఆఫీసర్. చాణక్య చిత్రం పర్వాలేదనిపించే విధంగా ఉంది. ఇలాంటి స్పై థ్రిల్లర్ చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కథనం కూడా ఉత్కంఠ భరితంగా సాగాలి. గోపీచంద్ తన నటనతో, యాక్షన్ సీన్స్ లో పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ కొన్ని సన్నివేశాలని దర్శకుడు తిరు రొటీన్ గా చిత్రీకరించారు. గోపీచంద్, హీరోయిన్ మెహ్రీన్ మధ్య సాగే లవ్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు.
గోపీచంద్ పాల్గొనే అండర్ కవర్ ఆపరేషన్స్ మాత్రం కొంతవరకు థ్రిల్ ని కలిగిస్తాయి. సెకండ్ హాఫ్ లో కూడా సినిమా ఆసక్తికరంగా అనిపించదు. స్పై థ్రిల్లర్ గా దర్శకుడు ఈ చిత్రంపై అంచనాలు పెంచాడు. కానీ క్లైమాక్స్ లో రొటీన్ కమర్షియల్ సినిమా తరహాలోనే చాణక్య చిత్రం ముగుస్తుంది. ఓవరాల్ గా చాణక్య యావరేజ్ చిత్రంగా మిగిలిపోనున్నట్లు యూఎస్ ప్రీమియర్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది.
Last Updated 5, Oct 2019, 7:12 AM IST
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
1 జీబీ డేటా ధరకే 10 జీబీ డేటా: వొడాఫోన్
1 జీబీ డేటా కోసం రీచార్జ్ చేసుకుంటే.. 9 జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది.
TNN | Updated:
Sep 27, 2016, 01:14PM IST
జియో రంగ ప్రవేశంతో టెలీకాం రంగంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంబానీ వ్యూహాలను కాచుకోవడానికి మిగతా కంపెనీలు కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్‌లు ఆఫర్ల బాటలో ముందంజలో ఉండగా, ఇప్పుడు వొడాఫోన్ కూడా రేసులోకి వచ్చింది. 1 జీబీ డేటాను కొనుగోలు చేస్తే 9 జీబీ డేటాను ఫ్రీగా అందిస్తామని చెబుతోంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న వొడాఫోన్ కస్టమర్లు 1 జీబీ డేటా కోసం రీచార్జ్ చేసుకుంటే అదనంగా 9 జీబీ డేటా లభిస్తుందని వొడాఫోన్ ఇండియా తెలిపింది. కొత్త 4జీ స్మార్ట్ ఫోన్ అంటే.. ఆరు నెలల నుంచి వొడా సిమ్‌ను ఆ ఫోన్లో వాడకుండా ఉంటే సరిపోతుందని తెలిపింది. వొడాఫోన్ ప్లేలో టీవీ, మూవీస్, మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఫ్రీగా అందిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది చివరి వరకూ ప్రి పెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. 4జీ హ్యాండ్‌సెట్ యూజర్లు వొడాఫోన్ సూపర్ నెట్ అనుభవాన్ని పొందేందుకు ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని వొడాఫోన్ ఇండియా డెరైక్టర్ సందీప్ కటారియా పేర్కొన్నారు. వొడాఫోన్ సొంతంగా 3జీ/4జీ సేవలు అందిస్తున్న సర్కిళ్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఉచితంగా అందిస్తున్న డేటాను రాత్రి 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్యలో మాత్రమే వాడుకునే వీలుంది.
Vodafone India launched a data offer where a customer connecting with a new 4G handset can now get the benefit of 10GB data at the cost of just 1GB for up to three months, a company statement said. According to Vodafone, a new 4G smartphone means one that was not used on the Vodafone network in the last 6 months. "With Vodafone SuperNet customers can now pay for 1GB and get 9GB additional free. As a result, a customer connecting with a new 4G handset can now enjoy 10GB data at the cost of just 1GB for up to 3 months," the company statement said.
| 1entertainment
|
Oct 11,2016
మాల్యాను 'రెడ్ కార్నర్' చేయలేం!
న్యూఢిల్లీ: దేశీయంగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు తరలిపోయిన లిక్కర్ డాన్ విజరు మాల్యాకు ఇంటర్పోల్ నుంచి శుభవార్త వెలువడింది. అంతర్జాతీయంగా ఎక్కడ ఉన్నా.. మాల్యాను అరెస్ట్ చేసేందుకు మాల్యా అరెస్ట్ విషయమై తాజాగా ఇంటర్పోల్ను ఆశ్రయించిన 'ఎన్ఫోర్స్్ మెంట్ డైరెక్టరేట్'కు చుక్కెదురైనట్లుగా తెలుస్తోం ది. అభిగవర్గాల సమాచారం మేరకు ఈడీ మే 12న ఇంటర్పోల్ను అశ్రయించింది. దీనికి ఇంటర్నేషనల్ పోలీస్ ఏజెన్సీ స్పందిస్తూ మాల్యాపై ఉన్న ఆరోపణలు సాధారణమైనవేనని పేర్కొన్నట్లు తెలిసింది. అసాధారణమైన కేసు గానీ.. అసాధరణమైన అభ్యర్థన గానీ మాల్యాకు వ్యతిరేకంగా లేని కారణంగా ఆయన అరెస్టునకు రెడ్కార్నర్ నోటీస్ను జారీ చేయలేమని ఇంటర్పోల్ వెల్లడించినట్లు సమాచారం. దీంతో మాల్యా అరెస్టునకు 'మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటి' (ఎంఎల్ఏటీ) రూపంలో ఇంటర్పోల్ను ఆశ్రయించేందుకు గాను ఈడీ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసాధారణ అభ్యర్థన రూపంలో బ్రిటన్ను అశ్రయించి మాల్యాను అరెస్ట్ చేయించాలన్నది ఈడీ ఆలోచనగా తెలుస్తోంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 22, Sep 2018, 2:23 PM IST
Highlights
దర్శకుడు మణిరత్నం రూపొందించిన తాజా చిత్రం 'చెక్క చైవంత వానమ్'. తెలుగు లో 'నవాబ్' అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు, విజయ్ సేతుపతి వంటి నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు.
దర్శకుడు మణిరత్నం రూపొందించిన తాజా చిత్రం 'చెక్క చైవంత వానమ్'. తెలుగు లో 'నవాబ్' అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు, విజయ్ సేతుపతి వంటి నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు.
మణిరత్నం మార్క్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మణిరత్నం సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. తాజాగా చిత్రబృందం మరో ట్రైలర్ ని విడుదల చేసింది.
దీన్ని బట్టి తండ్రి సీటులో కూర్చోడానికి ముగ్గురు కొడుకుల మధ్య జరిగే పోరుతో ఈ సినిమాను తెరకెక్కించినట్లున్నారు. ''నేను మాట్లాడుతున్నాను, నవ్వుతున్నాను, ఆడుతున్నాను.. కానీ తిరిగి తిరిగి నా మైండ్లో ఒక్కటే డౌట్ రన్నవుతోంది. పెద్దాయన పోయాడంటే ఎవరికి లాభం'' అంటూ శింబు చెప్పే డైలాగుతో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్ మొత్తం యాక్షన్ తో నింపేశారు. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన పాట కూడా ఆకట్టుకుంటోంది. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated 22, Sep 2018, 2:23 PM IST
| 0business
|
Aswin Stark
కొనసాగుతున్న మాటల యుద్ధం
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన స్పిన్నర్ అశ్విన్పై ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ సంచలన వ్యాఖ్య చేశాడు. టీమిం డియా ఆస్ట్రేలియాలో పర్యటించినపుడు అశ్విన్కు బౌలింగ్ చేసి అతని నుదుటిపై బంతిని సంధించాలని తాను కోరు కుంటున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్ కిచ్చిన ఇంటర్వ్యూలో స్టార్ పేర్కొన్నాడు.టీమిండియా, ఆస్ట్రేలి యాల మధ్య బెంగళూరులో ముగిసిన రెండవ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ బౌలింగ్లో స్టార్క్ ఔటయ్యాడు.స్టార్క్ను ఔట్ చేసిన ఆనందంలో అశ్విన్ తన నుదిటిపై వేలు పెట్టి చేసిన సంజ్ఞ స్టార్క్కు కోపం తెప్పించింది.అదే టెస్టులో స్టార్ బౌలింగ్లో టీమిండియా ఓపెనర్ అభినవ్ముకుంద్ సిక్స్ కొట్టగా తలరాత అన్నట్లు గా స్టార్క్ అదే తరహాలో సైగ చేశాడు.బెంగళూరు టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లో అశ్విన్ బౌలింగ్లోనే స్టార్క్ ఔట య్యాడు.ఇదిలా ఉంటే నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్లో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.ఈ మాటల యుద్ధానికి భారత జట్టే కారణమని కూడా స్టార్క్ ఆరోపించడం విశేషం. బెంగళూరు టెస్టు అనంతరం గాయపడిన మిచెల్ స్టార్క్ చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. బెంగళూరు టెస్టులో 188 పరుగులు టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌ టైంది. దీంతో భారత్ 75 పరుగుల తేడాతో ఘన విజ యం సాధించింది. ఇక నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి టెస్టు ధర్మశాలలో ఈనెల 25న ప్రారం భం కానుంది.
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
మెహరిన్ కౌర్ లేటెస్ట్ ఫొటో గ్యాలరి
First Published 18, Sep 2017, 7:47 PM IST
మెహరిన్ కౌర్ లేటెస్ట్ ఫొటో గ్యాలరి
మెహరిన్ కౌర్ లేటెస్ట్ ఫొటో గ్యాలరి
మెహరిన్ కౌర్ లేటెస్ట్ ఫొటో గ్యాలరి
మెహరిన్ కౌర్ లేటెస్ట్ ఫొటో గ్యాలరి
మెహరిన్ కౌర్ లేటెస్ట్ ఫొటో గ్యాలరి
మెహరిన్ కౌర్ లేటెస్ట్ ఫొటో గ్యాలరి
మెహరిన్ కౌర్ లేటెస్ట్ ఫొటో గ్యాలరి
మెహరిన్ కౌర్ లేటెస్ట్ ఫొటో గ్యాలరి
మెహరిన్ కౌర్ లేటెస్ట్ ఫొటో గ్యాలరి
మెహరిన్ కౌర్ లేటెస్ట్ ఫొటో గ్యాలరి
Recent Stories
| 0business
|
Hyderabad, First Published 1, Jul 2019, 2:29 PM IST
Highlights
యంగ్ హీరో సందీప్ కిషన్ సరైన హిట్టు పడక కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
యంగ్ హీరో సందీప్ కిషన్ సరైన హిట్టు పడక కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మధ్యలో తమిళంలో కొన్ని సినిమాలు చేశాడు. అవి ఓ మోస్తరుగా ఆడినా.. తెలుగులో మాత్రం ఈ హీరోకి సక్సెస్ రావడం లేదు. రకరకాల జోనర్లు ఎన్ని ప్రయత్నిస్తున్నా.. వర్కవుట్ కావడం లేదు.
దీంతో తనే నిర్మాతగా మారి 'నిను వీడని నీడను నేనే' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. తాజాగా సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ సందర్భంగా ఓ అగ్రనిర్మాత తనను అవమానపరిచాడని సందీప్ కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కోవడంతో తన పనైపోయిందని.. ఇక సినిమాలు మానుకోవాలని ఆ పెద్ద నిర్మాత అన్నాడని సందీప్ వెల్లడించాడు. ఆ మాటలు తనను
ఎంతగానో బాధించాయని.. కానీ తానేమీ ఆ నిర్మాతపై కక్ష పెంచుకోలేదని సందీప్ చెప్పాడు.
ఆయన మాటలను పాజిటివ్ గా తీసుకొని తనేంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో నిర్మాతగా మారి 'నిను వీడని నీడను నేనే' సినిమా తీసినట్లు సందీప్ చెప్పుకొచ్చాడు. తనను అవమానపరిచిన ఆ అగ్ర నిర్మాత ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
సందీప్ కోరుకుంటున్నట్లుగా 'నిను వీడని నీడను నేనే' సినిమాతో సక్సెస్ అందుకొని ఆ అగ్ర నిర్మాతకు సమాధానం చెబుతాడేమో చూడాలి.. కార్తిక్ రాజు అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated 1, Jul 2019, 2:30 PM IST
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘రుద్రాక్ష’కు స్వీటీ ఒప్పుకోలేదట!
తెలుగు సినీ పరిశ్రమలో హీరో ఇమేజ్ను సంపాందించిన ఏకైక హీరోయిన్ అనుష్కనే అని చెప్పుకోవాలి.
TNN | Updated:
Dec 25, 2015, 07:21PM IST
తెలుగు సినీ పరిశ్రమలో హీరో ఇమేజ్ను సంపాందించిన ఏకైక హీరోయిన్ అనుష్కనే అని చెప్పుకోవాలి. ‘బాహుబలి’ రుద్రమదేవి చిత్రాలతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. అందుకే ఇప్పుడు అందరూ అనుష్క డేట్స్ కోసం క్యూలు కడుతున్నారు. ఆ కోవలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ‘రుద్రాక్ష’ అనే హారర్ చిత్రం రూపొందబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుందని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క ‘రుద్రాక్ష’కు గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. బాహుబలి-2తో పాటు మరో రెండు చిత్రాలు ఒప్పుకున్న ఈ అందాల సుందరి డేట్స్ సమస్య కారణంగా ఇంకా ‘రుద్రాక్ష’ చిత్రంలో నటించడానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదట. త్వరలోనే ఆమె ఈ చిత్రం పూర్తి క్తారిటీ ఇస్తుందని సమాచారం.
| 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IPL 2019 Date: మరో 74 రోజుల్లోనే ఐపీఎల్.. ఈసారి మజా రెట్టింపు
ముంబయి ఇండియన్స్ వేలంలో వెటరన్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ని చేజిక్కించుకుంది. అతను రాణించడంపై అనుమానాలు నెలకొన్నా.. ప్రపంచకప్ నేపథ్యంలో.. ఈ సీనియర్ హిట్టర్ చెలరేగే అవకాశమూ లేకపోలేదు..!
Samayam Telugu | Updated:
Jan 8, 2019, 06:10PM IST
IPL 2019 Date: మరో 74 రోజుల్లోనే ఐపీఎల్.. ఈసారి మజా రెట్టింపు
క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ మళ్లీ వచ్చేస్తోంది. దాదాపు 60 రోజుల పాటు ఉత్కంఠ మ్యాచ్లతో వీక్షకుల్ని మునివేళ్లపై నిలబెడుతూ.. హిట్టర్ల సిక్సర్లు, బౌలర్ల సంబరాలతో దేశంలోని స్టేడియాలు హోరెత్తిపోనున్నాయి. మార్చి 23న ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీ మే నెల రెండో వారంలో ముగిసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రస్తుతం బీసీసీఐ షెడ్యూల్ని రూపొందిస్తుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ‘చెన్నై సూపర్ కింగ్స్’ సొంత మైదానం చెపాక్లో ఈ టోర్నీ తొలి మ్యాచ్ జరగనుంది. గత ఏడాది ఏప్రిల్ 7న ప్రారంభమైన ఈ ఐపీఎల్ సీజన్.. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు వారాలు ముందే ఆరంభంకానుంది.
ఐపీఎల్లో ఉన్న జట్లు: చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్డెవిల్స్ పేరు మార్చుకుంది)
ఇటీవల జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలంలో కొన్ని ఫ్రాంఛైజీలు పవర్ హిట్టర్లని ప్రత్యేకంగా కొనుగోలు చేశాయి. దీంతో.. వారు ఏ మేరకు టోర్నీలో సత్తాచాటుతారో..? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు.. గత ఏడాది బాల్ టాంపరింగ్ కారణంగా నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ (సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్), స్టీవ్ స్మిత్ (రాజస్థాన్) మళ్లీ ఈ ఏడాది టోర్నీలోకి పునరాగమం చేయనున్నారు.
వేలంలో హిట్టర్లని కొనుగోలు చేసిన జట్లని ఓసారి పరిశీలిస్తే..! సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (రూ. కోటి)ను కొనుగోలు చేసింది. శిఖర్ ధావన్ స్థానంలో అతను ఆడే అవకాశం ఉంది. ఇక బెంగళూరు ఫ్రాంఛైజీ.. విండీస్ హిట్టర్ హిట్మెయర్ (రూ. 4.2 కోట్లు)ను కొనుగోలు చేసింది. ఇటీవల భారత్పై హెట్మెయర్ విధ్వంసక ఇన్నింగ్స్లతో వెలుగులోకి వచ్చాడు.
ముంబయి ఇండియన్స్.. వెటరన్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (రూ. కోటి)ని చేజిక్కించుకుంది. అతను రాణించడంపై అనుమానాలు నెలకొన్నా.. ప్రపంచకప్ నేపథ్యంలో.. ఈ సీనియర్ హిట్టర్ చెలరేగే అవకాశమూ లేకపోలేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ.. హైదరాబాద్ నుంచి శిఖర్ ధావన్ని బదిలీపై తీసుకుంది. దీంతో.. ఈ గబ్బర్ సొంత నగరం జట్టు కోసం ఎలా చెలరేగుతాడో..? చూడాలి. కోల్కతా నైట్రైడర్స్.. 2016 టీ20 ప్రపంచకప్ 6,6,6,6 హీరో కార్లోస్ బ్రాత్వైట్ (రూ.5.2 కోట్లు)ని తీసుకుంది.
మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. ఆ టోర్నీకి కనీసం 15రోజులు ముందే ఐపీఎల్ 2019 సీజన్ ముగియాల్సి ఉంది. ఈ మేరకు లోధా కమిటీ బీసీసీఐకి గతంలోనే షరతు విధించింది. దీంతో.. ఫ్రాంఛైజీల అభిప్రాయాలని సేకరించనున్న బీసీసీఐ.. త్వరలోనే పూర్తి స్థాయిలో షెడ్యూల్ ప్రకటించనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Visit Site
Recommended byColombia
ఈ సిరీస్‌లో ఆద్యంతం శ్రీలంక, బంగ్లా ఆటగాళ్లు, అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో పోరు సాగింది. నాదస్వరాలు, నాగిని నృత్యాలతో ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. శ్రీలంక, బంగ్లా మధ్య జరిగిన చివరి టీ20లో ఇది తారాస్థాయికి చేరింది. థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకున్న బంగ్లా ఆటగాళ్లు లంకను గేలి చేశారు.
Led by Sri Lankan flag waving Percy Indian team did a lap of honour to the Sri Lankan R Premadasa stadium crowd who supported India against Bangladesh #INDvBAN pic.twitter.com/WZuChHpjJu
— Azzam Ameen (@AzzamAmeen) March 18, 2018
దీంతో వారంతా ఫైనల్లో భారత్‌కు మద్దతు పలికారు. స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. మ్యాచ్ జరుగుతోంది కొలంబోలోనా.. కాన్పూర్‌లోనా అనేంతలా.. లంక ఫ్యాన్స్ భారత్‌‌కు సపోర్ట్ ఇచ్చారు. రోహిత్ ఆడుతున్నంత సేపు రోహిత్.. రోహిత్ అంటూ ఉత్సాహ పరిచారు. 18 ఓవర్లో ముస్తాఫిజుర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు లంక ఫ్యాన్స్ షాకయ్యారు. చివర్లో దినేశ్ కార్తీక్ హిట్టింగ్‌ చేస్తున్నప్పుడు తమవాడే ఆడుతున్నంతగా ఉత్సాహపరిచారు. ఆఖరి బంతికి భారత్ గెలవడంతో.. లంక గెలిచిందా..? అనేంతలా సంబరాలు చేసుకున్నారు.
Sri lanka looking more happy than india #INDvBAN #NidhasTrophy pic.twitter.com/aEtDu98FYP
— Ajay Devgn Mania (@AjayDevgnMania) March 18, 2018
మరోవైపు చివరి బంతి వరకూ అద్భుతంగా పోరాడినప్పటికీ ఓడటంతో బంగ్లా ఆటగాళ్లు నైరాశ్యంలో కూరుకుపోయారు. వారి కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. స్టేడియంలోని బంగ్లా ఫ్యాన్స్ హతాశయులయ్యారు. బంగ్లా పోరాటంతో ఆకట్టుకోగా.. దినేశ్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌‌ను గెలిపించడంతో లంక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Oct 23, 2019, 02:29 IST
ఐల్ ఆఫ్ మ్యాన్ చెస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ స్విస్ గ్రాండ్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసింది. యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన ఈ టోర్నీలో హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హారిక 5.5 పాయింట్లతో దినారా (కజకిస్తాన్)తో కలిసి సమఉజ్జీగా నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా హారికకు తొలి స్థానం, దినారాకు రెండో స్థానం లభించాయి. హారిక 11 మంది గ్రాండ్మాస్టర్లతో గేమ్లు ఆడింది. రెండు గేముల్లో గెలిచింది. ఏడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడింది. తాజా ప్రదర్శనతో హారిక త్వరలో వెలువడే ప్రపంచ ర్యాంకింగ్స్లో 13వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంటుంది.
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook , Twitter
Tags:
| 2sports
|
హైటెక్ సిటీలో ఐబిస్ హోటల్ ప్రారంభం
- 178 గదులతో అందుబాటులోకి..
నవతెలంగాణ-వాణిజ్య విభాగం :
ఎకార్ హోటల్స్, ఇంటర్ గ్లోబ్ హోటల్స్ సంయుక్తంగా హైదరాబా ద్లోని హైటెక్ సిటీలో ఐబిస్ హోటల్ను ప్రారంభించాయి. సకల సదుపా యాలు కలిగిన 178 గదులతో కూడిన ఈ హోటల్ సమకాలీన డిజైన్ను ప్రతిబింబిస్తూ అందుబాటు ధరల్లో సాటిలేని సౌకర్యం సౌలభ్యతను విస్తృతశ్రేణి రూమ్ లోపలి సౌకర్యాలతో అందిస్తుందని ఇంటర్గ్లోబ్ హోటల్స్ అధ్యక్షుడు, సీఈఓ జె.బీ సింగ్ అన్నారు. ప్రపంచంలో అగ్రశ్రేణి టెక్నాలజీ కార్పొరేషన్లు కొలువై ఉన్న హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న ఈ హోటల్, ఎకార్ హోటల్స్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు అతి సమీపంలో ఉందని ఆయన అన్నారు. తద్వార బిజినెస్ ట్రావెలర్లకు అత్యుత్తమ స్టే డెస్టినేషన్గా నిలుస్తుందని తెలిపారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆపరేషన్స్, ఎకార్ హోటల్స్ ఇండియా జీన్-మైఖేల్ కాస్ మాట్లాడుతూ..ఐకానిక్ నగరమైన హైదరాబాద్కు ఐబిస్ బ్రాండ్ను పరిచయం చేస్తుండటం పట్ల మేం చాలా గర్వంగానూ, ఉత్సాహంగానూ ఉన్నట్టు ఆయన అన్నారు. ఇది నగరంలో మొట్టమొదటి ఐబిస్ కావడం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇది 42వ హోటల్ అని వివరించారు. నాణ్యమైన సేవలను, సదుపాయాలను అతిథుల అవసరాలను తీర్చే రీతిలో వుంటుందని తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
విజయ్ దేవరకొండను చూసి భావోద్వేగం.. హత్తుకుని ఏడ్చేసిన అమ్మాయి!
Dear Comrade | టాలీవుడ్ ప్రస్తుతం అమ్మాయిల ఫాలోయింగ్ అత్యధికంగా ఉన్న హీరో విజయ్ దేవరకొండ అంటే అతిశయోక్తి కాదు. ఈ వీడియో చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.
Samayam Telugu | Updated:
Jul 28, 2019, 06:08PM IST
విజయ్ దేవరకొండను చూసి భావోద్వేగం.. హత్తుకుని ఏడ్చేసిన అమ్మాయి!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అమ్మాయిల హృదయాలను ఈ యంగ్ హీరో కొల్లగొట్టారు. ఆ తరవాత ‘గీత గోవిందం’తో అమ్మాయిల్లో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’తో విజయ్ క్రేజ్ నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు పాకేసింది. విజయ్ కోసం కేవలం తెలుగు అమ్మాయిలే కాదు తమిళం, కన్నడ, మలయాళం అమ్మాయిలు పడిచచ్చిపోతున్నారు. దీనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోనే సాక్ష్యం.
Visit Site
Recommended byColombia
తన అభిమాన హీరో విజయ్ దేవరకొండను అకస్మాత్తుగా చూసిన ఒక అమ్మాయి ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆయన్ని గట్టిగా హత్తుగా ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏడుస్తోన్న తన అభిమానిని దగ్గరకు తీసుకుని విజయ్ ఓదార్చారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుంది అనే విషయంలో స్పష్టత లేదు. బహుశా ఇటీవల ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్లో విజయ్ దేవరకొండ పాల్గొన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుని ఉండొచ్చు.
Emotional moment of @TheDeverakonda fan! #VijayDeverakonda #VijayDevarakonda #BiggBossTamil #BiggBossTamil3… https://t.co/lci4zekrSh
— The Cine Bytes (@TheCineBytes) 1564246069000
‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రచారంలో భాగంగా నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లోనూ మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్లో ఈ మ్యూజిక్ ఫెస్టివల్స్ జరిగాయి. అయితే చెన్నై, బెంగళూరు, కొచ్చి.. ఈ మూడు నగరాల్లో ఏదో ఒక చోటుకి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుని ఉండొచ్చు. ఏదేమైనా ఈ వీడియో విజయ్ క్రేజ్కు అద్దం పడుతోంది. దగ్గరకు వచ్చిన అభిమానిని అవైడ్ చేయకుండా విజయ్ దేవరకొండ ఓదార్చడం అందరినీ ఆకట్టుకుంటోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
భీముని పాత్రపై ప్రభాస్ క్లారిటీ
Highlights
మోహన్ లాల్ ను భీమునిగా ఎంపిక చేయటానికి బలమైన కారణం ఉండి ఉంటుంది
కొచ్చిలో మీడియా సమావేశంలో మోహన్ లాల్ మహాభారత్ గురించి మాట్లాడిన ప్రభాస్
ఇటీవల కాలంలో బాహుబలి2 తర్వాత అంతే చర్చనీయాశంగా మారిన మరో సినిమా మహాభారత్. కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రకటించిన మహాభారత్ సినిమాలో మోహన్ లాల్ స్థానంలో భీమునిగా తాను నటించడం కన్నా... అతనే కరెక్టనీ, మోహన్ లాల్ తో కలిసి పని చేసే అవకాశం వస్తే తనకు సంతోషమని ప్రభాస్ అన్నాడు.
ఇటీవల మోహన్ లాల్ వెయ్యి కోట్ల మహాభారత్ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో పలు ప్రశంసలతోపాటు కొందరు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్ గా చెప్పుకునే కమాల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే కూడా.. మహాభారత్ సినిమాలో మోహన్ లాల్ కంటే ప్రభాస్ భీముని పాత్రలో కరెక్ట్ గా సెట్ అవుతాడని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన మళయాళ సినీ అభిమానులు కేఆర్కే ట్వీట్స్ పై దుమ్మెత్తిపోశారు.
ఇలాంటి రూమర్స్ పై స్పందించిన ప్రభాస్... మహాభారత్ సినిమాలో భీమునిగా మోహన్ లాల్ బదులు తాను చేయాలనే ఆలోచనే కరెక్ట్ కాదని, అయితే మోహన్ లాల్ తో కలిసి పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని ప్రభాస్ స్పష్టం చేశాడు.
ఇటీవల బాహుబలి2 ఆడియో విడుదల కార్యక్రమానికి కొచ్చి వెళ్లిన ప్రభాస్ అక్కడి ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో పై విధంగా స్పందించాడు. బాహుబలి కేరళలో 300 స్క్రీన్స్ పై రిలీజ్ కానుంది. తొలి రోజే 1500 షోలు వేయనున్నారు.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కొత్త సినిమాతో రజనీకాంత్ దూకుడు
రాజకీయాల్లో బిజీ అవుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీ... సినిమాల్లో దూకుడు తగ్గించలేదు. తలైవా మరో కొత్త ప్రాజెక్ట్కు ఓకే చెప్పేశాడు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో... కళానిధి మారన్ సమర్ఫణలో మమ్మత్ ప్రొడక్షన్ బ్యానర్లో ఈ మూవీని తెరకిక్కించనున్నారు.
TNN | Updated:
Feb 23, 2018, 05:55PM IST
రాజకీయాల్లో బిజీ అవుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీ... సినిమాల్లో దూకుడు తగ్గించలేదు. తలైవా మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పేశాడు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో... కళానిధి మారన్ సమర్ఫణలో మమ్మత్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఈ మూవీని తెరకిక్కించనున్నారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. సుబ్బరాజ్ పిజ్జా, ఇరవైతో పాటు మరికొన్ని సినిమాలను తీశారు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా రజనీ ఏమాత్రం స్పీడు తగ్గించలేదు. సినిమాలు కూడా తగ్గిస్తాడేమోనని అనుకుంటున్న సమయంలో... మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పి... ఇండస్ట్రీని వదులుకునేది లేదనే సంకేతాలు పంపారు. తలైవా రోబో 2.ఓ, కాలా మూవీలతో బిజీగా ఉన్నారు. కాలా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతోంది.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బంగ్లాదేశ్తో టీ20లో భారత్ టార్గెట్ 140
కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్ బౌలర్లు పుంజుకున్నారు. గురువారం రాత్రి జరుగుతున్న
TNN | Updated:
Mar 8, 2018, 09:22PM IST
బంగ్లాదేశ్తో టీ20లో భారత్ టార్గెట్ 140
కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్ బౌలర్లు పుంజుకున్నారు. గురువారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు జయదేవ్ ఉనద్కత్ (3/38), విజయ్ శంకర్ (2/32) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో లిటన్ దాస్ (34: 30 బంతుల్లో 3x4), షబ్బీర్ రెహ్మాన్ (30: 26 బంతుల్లో 3x4, 1x6) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. బౌలర్లు తమ తప్పిదాలను దిద్దుకున్నా.. ఫీల్డర్లు మాత్రం పేలవ ప్రదర్శనని కొనసాగించారు. శార్ధూల్ ఠాకూర్, సురేశ్ రైనా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో క్యాచ్‌లను జారవిడిచారు.
టాస్ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్ ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (15: 16 బంతుల్లో 2x4), సౌమ్య సర్కార్ (14: 12 బంతుల్లో 1x4, 1x6) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఐదు ఓవర్లలోపే పెవిలియన్ చేరిపోగా.. అనంతరం ముష్ఫికర్ రహీమ్ (18: 14 బంతుల్లో 2x4, 1x6), కెప్టెన్ మహ్మదుల్లా (1) నిరాశపరిచారు. ఈ దశలో జట్టు స్కోరు బోర్డు నడిపించే బాధ్యతలు తీసుకున్న దాస్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. షబ్బీర్ రెహ్మాన్‌తో కలిసి ఐదో వికెట్‌కి 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత ఫీల్డర్లు వరుసగా క్యాచ్‌లు వదిలేయడం కూడా ఈ జోడీకి కలిసొచ్చింది. అయితే.. జట్టు స్కోరు 107 వద్ద దాస్ ఔటవడంతో మళ్లీ బంగ్లాదేశ్ తడబడింది. చివర్లో హసన్ (3), రుబెల్ హుస్సేన్ (0) పేలవరీతిలో వికెట్లు చేజార్చుకోవడంతో బంగ్లాదేశ్ 139 పరుగులకే పరిమితమైంది. శ్రీలంకతో గత మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20లో భారత్ జట్టు బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా 175 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
India vs Pakistan Highlights: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
భారత్ చేతిలో ఓడినా.. ఆ తర్వాత శుక్రవారం రాత్రి అఫ్గానిస్థాన్పై 3 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్థాన్ మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుంది.
Samayam Telugu | Updated:
Sep 24, 2018, 07:47AM IST
ఆసియా కప్లో భారత్ , పాకిస్థాన్ జట్లు మళ్లీ ఈరోజు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా భారత్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీ గ్రూప్ దశలో భాగంగా గత బుధవారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ని 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన టీమిండియా.. ఈరోజు కూడా అదేజోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.
మరోవైపు భారత్ చేతిలో ఓడినా.. ఆ తర్వాత శుక్రవారం రాత్రి అఫ్గానిస్థాన్పై 3 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్థాన్ మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తుండగా.. భారత్ జట్టు మరోసారి దాయాది జట్టుని ఓడించి టోర్నీ ఫైనల్ బెర్తుని ఖాయం చేసుకోవాలని కోరుకుంటోంది.
భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు పాక్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. హారీస్, ఉస్మాన్పై వేటు పడగా.. షదాబ్, అమీర్ జట్టులోకి వచ్చారు.
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ , అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని ( వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, చాహల్
పాక్ తుది జట్టు: ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, షోయబ్ బాలిక్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్/ కెప్టెన్), ఆసిఫ్ అలీ, షదాబ్ ఖాన్ , మహ్మద్ నవాజ్, హసన్ అలీ, మహ్మద్ అమీర్, షాహీన్ అఫ్రిది
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్ట్
తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
| Updated:
Jan 2, 2018, 01:15PM IST
ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. తనను గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించారని, ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబరు 29 న పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు, దీనికి సంబంధించిన ఆధారాలను సైతం పోలీసులకు అందజేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఆలయవాణి రేడియోలో జాకీగా పనిచేస్తున్నట్లు సమాచారం. వెంకటరమణ కాలనీలో నివాసముంటున్న మహిళను గాయకుడు శ్రీనివాస్‌ కొంతకాలంగా వేధిస్తున్నారని.. ఇటీవల అవి ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
అయితే తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి, అందులో వాస్తవం లేదని పోలీసుల విచారణలో తెలిపారు. ఫిర్యాదు చేసిన రేడియో జాకీ తనకు తెలుసని గజల్ శ్రీనివాస్ అన్నారు. నా భుజానికి, కాళ్ల నొప్పులకు ఫిజియోథెరపీ జరుగుతోందని, సోమవారం ఫిజియోథెరపిస్ట్ రాకపోతే ఈ అమ్మాయి వచ్చి చేసిందని తెలియజేశారు. ఆమె తనపై ఇలా ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థంకావడం లేదని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
| 0business
|
గీతాఆర్ట్స్ 2 కొత్త చిత్రానికి కెమెరా స్విచ్ ఆన్ చేసిన అల్లు అయాన్
Highlights
గీతాఆర్ట్స్ 2 కొత్త మూవీకి కెమెరా స్విచాన్ చేసిన అల్లుఅయాన్
అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ, పరశురాం, బన్నివాస్ కాంబినేషన్లో మూవీ
వరుస సూపర్హిట్ చిత్రాల తరువాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నివాసు నిర్మాతగా జిఏ2 బ్యానర్ లో పరుశురాం దర్శకత్వంలో, పెళ్ళిచూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరొగా చిత్రం ఈ రోజు మాస్టర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వగా పూజాకార్యక్రమాలు జరుపుకుంది. మే రెండవ వారం నుండి సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ చిత్రానికి కెమెరా మణికంఠన్, సంగీతం గోపిసుందర్ లు అందిస్తున్నారు.
చిత్ర నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ..శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో జిఏ2 ప్రోడక్షన్ నెం-4 గా , శ్రీరస్తుశుభమస్తు చిత్రాన్ని దర్శకత్వం చేసిన పరుశురాం , పెళ్ళిచూపులు హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో , మాస్టర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వగా పూజాకార్యక్రమాలు జరుపుకున్నాం. మే రెండవ వారం నుండి సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈచిత్రం రోమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కెమెరా మణికంఠన్, సంగీతం గోపిసుందర్ లు అందిస్తున్నారు. మిగతా వివరాలు అతి త్వరలో తెలియజేస్తాం.అని అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో, బన్ని వాసు నిర్మాతగా ,జిఏ2 బ్యానర్లో , పరుశురాం గారి దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి పూజాకార్యక్రమాలు జరుపుకున్నాం. ఈచిత్రం రోమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రం చేయటం చాలా ఆనందంగా వుంది. అని అన్నారు.
దర్శకుడు పరుశురా మాట్లాడుతూ.. అల్లు అరవింద్ గారి సమర్పణలో , బన్ని వాసు నిర్మాతగా, జిఏ2 బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న చిత్రానికి మాస్టర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వగా పూజాకార్యక్రమాలు జరుపుకున్నాం. మే రెండవ వారం నుండి సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈచిత్రం రోమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కెమెరా మణికంఠన్, సంగీతం గోపిసుందర్ లు అందిస్తున్నారు. మిగతా వివరాలు నిర్మాత అతి త్వరలో తెలియజేస్తాం.అని అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా- మణికంఠన్, సంగీతం-గోపిసుందర్, సమర్పకులు- అల్లు అరవింద్, నిర్మాత- బన్ని వాసు, కథ,మాటలు, దర్శకత్వం- పరుశురాం
| 0business
|
kranthi madhav to direct vijay deverakonda
విజయ్ దేవరకొండతో క్రాంతి మాధవ్ సినిమా !
పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో భారీ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండతో సినిమాలు...
TNN | Updated:
Sep 7, 2017, 08:23PM IST
పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో భారీ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే విజయ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా కూడా యాడ్ అయినట్లు తెలుస్తోంది. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో మెప్పించిన దర్శకుడు క్రాంతి మాధవ్.. విజయ్ కోసం ఓ కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.
ఈ విషయంపై క్రాంతి మాధవ్ మాట్లాడుతూ.. ''ప్రతి సినిమాను ఓ కొత్త జోనర్‌లోనే తెరకెక్కించాలని అనుకుంటాను. విజయ్‌తో పక్కా లవ్ స్టోరీ చేయాలనుకుంటున్నాను. అయితే అందులో ఓ నిజాయితీ గల కొత్త పాయింట్ ఉంటుంది. ఈ సినిమాలో విజయ్‌ని ఓ కొత్త కోణంలో చూపించబోతున్నాం. తన పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో పడ్డాం. త్వరలోనే హీరోయిన్ పేరుని అనౌన్స్ చేస్తాం' అని వెల్లడించారు. కె.ఎస్.రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ప్రస్తుతం క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేసిన 'ఉంగరాల రాంబాబు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
| 0business
|
- అప్పులు మరో 3.5 లక్షల కోట్లు
- 2020 సెప్టెంబర్ నాటికి అదనం
- ఇది వరకే రూ.14 లక్షల కోట్ల కుప్ప
- బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి
- ఇండియా రేటింగ్స్ రిపోర్టు..
న్యూఢిల్లీ : భారత బ్యాంకింగ్ రంగానికి కార్పొరేట్ల మొండి బాకీలు ఉరితాళ్లలా మారుతున్నాయి. బడా పారిశ్రామిక వర్గాలకు ఇచ్చిన అప్పుల్లో మరో రూ.3.5 లక్షల కోట్లు నిరర్ధక ఆస్తులుగా మారనున్నాయని ఓ రిపోర్టు హెచ్చరించింది. కార్పొరేట్లకు ఇచ్చిన మొత్తం అప్పుల్లో 40 శాతం రాని బాకీలుగా మారొచ్చని అంచనా వేసింది. బడా బాబులకు ఇచ్చిన మొత్తం 19.3 శాతం అప్పుల్లో మరో 3.9 శాతం రుణాలు రాని బాకీల ఖాతాల్లోకి చేరొచ్చని ఇండియా రేటింగ్స్ ఫైనాన్సీయల్ ఇన్స్ట్యూషన్స్ అండ్ బ్యాంకింగ్ అసోసియేట్ డైరెక్టర్ జిందాల్ హరినా విశ్లేషించారు. బ్యాంకు రుణ పుస్తకాల్లో ఇప్పటికీ వీటిని గుర్తించలేదన్నారు. 2019-20 ద్వితీయార్థంలో కొత్తగా రూ.1.5-2 లక్షల కోట్లు మొండి బాకీలుగా మారొచ్చన్నారు. సెప్టెంబర్ 2018 నాటికి రూ.13.5-14 లక్షల కోట్ల కార్పొరేట్ల నుంచి రాని బాకీలు ఉన్నాయని, అయితే ఇందులో రూ.10 లక్షల కోట్లను మాత్రమే బ్యాంకులు గుర్తించాయన్నారు. కాగా ఈ రూ.1.5-2 లక్షల మొండి బాకీల కోసం బ్యాంకులు రూ.40,000 కోట్ల కేటాయింపులు చేయాల్సి రావొచ్చని జిందాల్ తెలిపారు.పెద్ద ప్రయివేటు బ్యాంకుల రేటింగ్ స్థిరంగా ఉండొచ్చని ఈ ఎజెన్సీ అంచనా వేసింది. అదే విధంగా ప్రభుత్వం రంగంలోని 19 బ్యాంకుల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా ప్రతికూల రేటింగ్ నుంచి బయటపడొచ్చని పేర్కొంది. 2019-20లో కార్పొరేట్ల ఆస్తుల కోసం చేసే కేటాయింపులు, పరిష్కారాలను బట్టి ఆ బ్యాంకుల స్థిరత్వం ఆధారపడనుందని పేర్కొంది. ఎన్సీఎల్టీ ఉన్న రూ.4.50 లక్షల కోట్ల విలువ చేసే అతిపెద్ద 40 మొండి బాకీల ఆస్తుల కోసం బ్యాంకులు 70-75 శాతం కేటాయింపులు చేయాల్సిన పరిస్థితి రావొచ్చని ఈ రిపోర్టు పేర్కొంది. 2018-19, 2019-20లో పరిష్కారం, లిక్విడేషన్ అంశాలపై ఆధారపడి బ్యాంకుల రుణ వ్యయం నమోదు కానుంది. 2017-18, 2018-19లో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకు అందించే రూ.1.94 లక్షల కోట్ల మూలధనం కేవలం కార్పొరేట్ల ఎన్పిఎల కోసం కేటాయింపులు చేయడానికి సరిపోతుందని ఈ ఎజెన్సీ పేర్కొంది.
పీఎస్బీలకు రూ.60వేల కోట్లు..
2018-19 నాలుగో త్రైమాసికంలో రూ.66,000 కోట్ల మూలధనం అవసరమని ఈ ఎజెన్సీ పేర్కొంది. ప్రస్తుత, వచ్చే ఆర్ధిక సంవత్సరాల్లో రుణల జారీలో 10-11 శాతం వృద్ధి నమోదు కావచ్చొని అంచనా వేసింది. ప్రభుత్వం అందించే మూలధనం కూడా ఏమాత్రం సరిపోదని పేర్కొంది. 2019-20లో చాలా వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల్లోకి రావొచ్చని అంచనా వేసింది. డిపాజిట్లలో తీవ్ర పోటీ ఉండొచ్చని.. వీటిలో 6 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
ఒత్తిడిలో ఎన్బీఎఫ్సీలు..
ఎన్బీఎఫ్సీలపై ఇండియా రేటింగ్స్ మరో రిపోర్టును వెల్లడించింది. 2019-20లో బ్యాంకింగేతర విత్త సంస్థల (ఎన్బీఎఫ్సీ) రాబడిలో ఒత్తిడి కొనసాగొచ్చని విశ్లేషించింది. ఆటో, రియల్ ఎస్టేట్ రంగాల లావాదేవీల్లో తగ్గుదల చోటు చేసుకోవడం ద్వారా ఎన్బీఎఫ్సీలపై మరింత తీవ్ర ప్రభావం పడొచ్చని తెలిపింది. కాగా ఎంఎస్ఎంఇ రుణాల్లోనూ తగ్గుదల చోటుచేసుకోనుందని అంచనా వేసింది. ఈ రంగం రుణాలు ప్రతికూలత నుంచి స్థిరత్వానికి చేరొచ్చని పేర్కొంది. ఇది వరకు ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వల్ల ఇంకా ఎగవేతల పర్వం కొనసాగుతుందని ఇండియా రేటింగ్స్ విశ్లేషించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.