news
stringlengths
299
12.4k
class
class label
3 classes
నాలుగేండ్లలో వెయ్యి కోట్ల రెవెన్యూ లక్ష్యం - వాటర్‌ హీటర్‌ విభాగంలోకి స్టాండర్డ్‌ - హావెల్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ వెల్లడి నవతెలంగాణ, బిజినెస్‌ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రికల్‌ ఉత్పత్తుల కంపెనీ హావెల్స్‌ ఇండియాకు చెందిన స్టాండర్డ్‌ విభాగం వచ్చే మూడు, నాలుగేండ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.400 కోట్ల రెవెన్యూ నమోదు చేశామని హావెల్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అబ్ర బెనర్జీ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ, ఏపీ హెడ్‌ పంకజ్‌ కె వసాల్‌తో కలిసి కొత్తగా నాలుగు వేరియంట్లలో వాటర్‌ హీటర్లు, స్విచ్చులు, ఫ్యాన్లను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్బంగా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వాటర్‌ హీటర్ల మార్కెట్‌ రూ.1300-రూ.1500 కోట్ల మధ్య ఉందన్నారు. ప్రతి ఏడాది ఈ వ్యాపారం 12 శాతం పెరుగుతుందన్నారు. కాగా రాజస్థాన్‌లోని తమ నిమ్రాన్‌ ప్లాంట్‌ ఏడాదికి 5 లక్షల వాటర్‌ హీటర్ల తయారీ సామర్థ్యం కలిగి ఉందన్నారు. గత రెండేండ్లుగా స్టాండర్డ్‌ రెవెన్యూ 22 శాతం పెరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా తమకు 2500 ఆధికృత డీలర్లు, 10000 అవుట్‌లెట్లలో తమ ఉత్పత్తులు లభిస్తాయన్నారు. పంకజ్‌ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రూ.25 కోట్ల వ్యాపారం జరుగుతుందన్నారు. రెండు రాష్ట్రాల్లో 125 మంది డీలర్లు ఉన్నారన్నారు. కొత్తగా జోఅండ్‌జో ప్రైమ్‌, అమియో, అమేజర్‌, లిఫ్ట్‌ పేర్లతో లీటర్‌ నుంచి 25 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ హీటర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటి విలువ రూ.3,500 నుంచి రూ.14,000 మధ్య ఉంటుందన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia సుభాష్ కపూర్‌ దర్శకత్వంలో ‘మొఘల్’ సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపిన అమీర్ ఖాన్.. తాజాగా సుభాష్‌పై ఓ బాధితురాలు లైంగిక ఆరోపణలు చేయడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. మరోవైపు సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో నటిస్తున్న అక్షయ్ కుమార్ .. కొంత మంది మహిళలు సాజిద్ తమని లైంగికంగా వేధించాడంటూ గళం విప్పడంతో ఆ సినిమా షూటింగ్‌ని తాత్కాలికంగా నిలిపివేశాడు. దీంతో.. ఈ ఇద్దరికీ ‘అమ్మ’ మద్దతు తెలుపుతోందని వెల్లడించిన జగదీశ్.. సెక్రటరీ సిద్ధిఖ్ అసోషియేషన్‌ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Suresh 106 Views ఉగ్రవాదుల దాడిపై విరుచుకుపడిన సెహ్వాగ్‌ న్యూఢిల్లీ: పాక్‌ సరిహద్దుల్లోని యురిలో ఉన్న భారత సైనిక స్థావరంపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిపై మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ విరుచుకుపడ్డాడు.కాగా ఈ ఘటనలో 17 మంది జవానులు వీర మరణం పొందారు.దీన్ని ఉద్దేశించి ది అసోసియేటెడ్‌ ప్రెస్‌ సహా కొన్ని విదేశీ మీడియా సంస్థలు ఉగ్ర వాదులను తిరుగుబాటు దారులుగా పేర్కొన్నాయి.కాగా ఈ అంశంపై సెహ్వాగ్‌ బాధాతప్త హృదయంతో స్పందించాడు.కాగా దాడి గురించి విని నాగుండె పగిలింది. వారు తిరుగుబాటు దారులు కాదు, ఉగ్రవాదులు,ఉగ్రవాదానికి ఎప్పటికైన ఖచ్చితంగా సమాధానం చెప్పితీరాలని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు.
2sports
100 కోట్లు దాటిన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ బిజినెస్ Highlights  రిలీజ్ కు ముందే కోట్లు కొల్లగొడుతున్న మెగాస్టార్ మూవీ 103 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ క్రియేట్ చేసిన చిరంజీవి ఖైదీనెంబర్ 150 మెగా స్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించిన ఖైదీ నెంబర్ 150     మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే అదరగొట్టింది. మెగాస్టార్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదంటూ ఇండస్ట్రీ వర్గాలకు స్ట్రాంగ్ మెసేజ్ పంపుతోంది. ఇప్పటికే థీట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా అన్నీ కలిపి 100 కోట్లకు పైగా బిజినెస్ చేసేసింది. వివి వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన ఖైదీ నెంబర్ 150 చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందించాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు.   సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జనవరి 11న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ గుంటూరు హాయ్ లాండ్ లో జనవరి 7న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.   నైజాం : రూ.21.5Cr.(Asian Films / Geetha) సీడెడ్ : Rs 11.7 Cr (Rayudu) యూఎస్ఏ : Rs 7.8 Cr (AV cinema) ఈస్ట్ : Rs 5.4 Cr (Anusri Films) వెస్ట్ : Rs 4.6 Cr (Shanmuka Films) కృష్ణా : Rs 4.6 Cr (G3 Movies) గుంటూరు : Rs 6.4 Cr (V Celluloids) నెల్లూరు : Rs 3.0 Cr (S2 cinemas) మొత్తం ఏపీ/తెలంగాణ : Rs 65 Cr కర్ణాటక : Rs 8.5 Cr (Brunda Associates) తమిళనాడు: Rs 1 Cr (SPI Cinemas) రెస్ట్ ఆఫ్ ఇండియా : Rs 1 Cr ఓవర్సీస్ : Rs 12 Cr (Classics Cinemas) ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థీట్రికల్ రైట్స్ : Rs 87.5 Cr శాటిలైట్ రైట్స్ : Rs 13 Cr ( MAA TV) ఆడియో మరియు ఇతర హక్కులు : Rs 2.5 Cr ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్: రూ.103 Cr.
0business
ఆరు రోజుల లాభాలకు బ్రేక్‌  Oct 23, 2019, 02:42 IST ఇన్ఫోసిస్‌ ఎఫెక్ట్‌   ఇటీవల పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ   335 పాయింట్లు పతనమై 38,964కు సెన్సెక్స్‌   74 పాయింట్ల నష్టంతో 11,588కు నిఫ్టీ ఆరు రోజుల స్టాక్‌మార్కెట్‌ లాభాలకు మంగళవారం బ్రేక్‌ పడింది. ఈ ఆరు రోజుల్లో లాభపడిన కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరగడం, ప్రజావేగు ఫిర్యాదు నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ భారీగా నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 39,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. మహారాష్ట్ర, హర్యానా ఎగ్జిట్‌ పోల్స్‌ పాలక బీజేపీకే అనుకూలంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు పుంజుకోవడం వంటి సానుకూలాంశాలు  ప్రభావం చూపించలేకపోయాయి.  దిగువ స్థాయిల్లో ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్ల మద్దతు లభించడంతో నష్టాలు పరిమితమయ్యాయి. సెన్సెక్స్‌ 335 పాయింట్లు పతనమై 38,964 పాయింట్ల వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టపోయి 11,588 పాయింట్ల వద్ద ముగిశాయి.  సెన్సెక్స్‌ నష్టాల్లో ఆరంభమైంది. 501 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...  నష్టాల తర్వాత లాభాల్లోకి వచి్చనప్పటికీ, మళ్లీ నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో  128 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ మరో దశలో 373 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 501 పాయింట్ల రేంజ్‌లో పతనమైంది. ఇంట్రాడేలో 11,700 పాయింట్లపైకి నిఫ్టీ ఎగబాకినప్పటికీ, అమ్మకాల ఒత్తిడి కారణంగా ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. ఇక ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా మొదలయ్యాయి.   - లాభాలు పెంచుకోవడానికి అకౌంట్‌ అవకతవకలకు, అనైతిక విధానాలకు ఇన్ఫోసిస్‌ సీఈఓ సలిల్‌ పరేఖ్‌ పాల్పడ్డారన్న ప్రజావేగు ఫిర్యాదుల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేర్‌ భారీగా పతనమైంది.  - సెపె్టంబర్‌ క్వార్టర్లో ప్రమోటర్లు తమ వాటాను తగ్గించుకున్నారన్న వార్తల కారణంగా డిష్‌ టీవీ షేర్‌ 12 శాతం పెరిగి రూ. ముగిసింది.   - క్యూ2 ఫలితాలు బాగా ఉండటంతో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 13 శాతం, శ్రీ సిమెంట్‌ 5 శాతం, గ్రాన్యూల్స్‌ ఇండియా 18 శాతం చొప్పున లాభపడ్డాయి.   Read latest Business News and Telugu News | Follow us on FaceBook , Twitter Tags:
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Suresh Babu: బీభత్సం సృష్టించిన‌ సురేశ్‌బాబు కారు..స్టేషన్‌లో లొంగిపోయిన నిర్మాత సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ సమీపంలోని కార్కానా పరిధి టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబుకు చెందిన కారు, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. Samayam Telugu | Updated: Oct 22, 2018, 04:01PM IST Suresh Babu: బీభత్సం సృష్టించిన‌ సురేశ్‌బాబు కారు..స్టేషన్‌లో లొంగిపోయిన నిర్మా... సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ సమీపంలోని కార్కానా పరిధి టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబుకు చెందిన కారు, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. స్వయంగా ఆయనే వాహనం నడిపి ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తోన్న సురేశ్ చంద్ర, ఆయన భార్య దుర్గాదేవి, వారి చిన్నారి సిద్ధేశ్ గాయపడ్డారు. ప్రస్తుతం ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కాలికి గాయం కావడంతో చంద్రకు సైతం చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దుర్గాదేవి స్వల్పగాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ప్రమాద సమయంలో కారు వేగం 100 కిలోమీటర్ల పైనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నాయంటే, వాహనం ఎంత వేగంతో ప్రయాణిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
0business
Hyderabad, First Published 2, Nov 2018, 10:49 AM IST Highlights బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సాజిద్ ఖాన్ పై రోజురోజుకి మీటూ ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ అతడిపై ఆరోపణలు చేశారు. దీంతో అతడి కెరీర్ నాశనం అయింది. ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఉన్న సినిమాలు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సాజిద్ ఖాన్ పై రోజురోజుకి మీటూ ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ అతడిపై ఆరోపణలు చేశారు. దీంతో అతడి కెరీర్ నాశనం అయింది. ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఉన్న సినిమాలు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మరోనటి అహనా కుమ్రా కూడా సాజిద్ పై సంచలన ఆరోపణలు చేసింది. మీటూ ఉద్యమంలో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఆమె.. సాజిద్ పై చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ''సాజిద్ నన్ను తన ఇంటికి రమ్మని పిలిచాడు. అప్పటికే నాకు ఆయన గురించి చాలా మంది చెప్పారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నన్ను అతడు రూమ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ నేను బయటే మాట్లాడుకుందామని అన్నాను. దానికి అతడు బయట నా తల్లి ఉంది ఆమెకి ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదని అన్నారు. అందుకే గదిలో మాట్లాడుకుందామని తీసుకెళ్లారు. ఆయన ప్రవర్తనపై అనుమానం వచ్చి నా తల్లి పోలీస్ ఆఫీస్ అని ఆయనకి చెప్పాను. అయినా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. కుల్లు జోకులు వేస్తూ నన్ను నవ్వించడానికి ప్రయత్నించాడు. 100 కోట్లు ఇస్తాను.. కుక్కతో సెక్స్ చేస్తావా అని అడిగాడు. ఆ మాటలకి నేను నవ్వాలనేది ఆయన భావన. అసహ్యకరమైన జోకులు వేసి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు'' అంటూ వెల్లడించింది. ఈమె వ్యాఖ్యలతో సాజిద్ ని సోషల్ మీడియాలో మరింత తిట్టిపోస్తున్నారు. అతడిపై పోలీసు కేసులు కూడా నమోదవుతున్నాయి.  ఇవి కూడా చదవండి..
0business
Advance booking for Sardaar Gabbar Singh halted in multiplex theatres 'సర్ధార్' టికెట్ల బుకింగ్ వివాదంపై ఫ్యాన్స్ ఆగ్రహం కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్ధార్ గబ్బర్‌సింగ్ టిక్కెట్ల విక్రయం వివాదం ఇంకా కొనసాగుతూనే వుంది. | Updated: Apr 7, 2016, 04:40PM IST కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్ధార్ గబ్బర్‌సింగ్ టిక్కెట్ల విక్రయం వివాదం ఇంకా కొనసాగుతూనే వుంది. ఉగాది కానుకగా ఏప్రిల్ 8న ఈ సినిమా రిలీజ్ అవనుండగా ఇప్పటికీ.. అంటే ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు కూడా మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ల అమ్మకాలు ఇంకా ప్రారంభం కాలేదు. వివాదం పరిష్కారం కాకపోవడంతో మల్టీప్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ల విక్రయాలు జరపడంలేదు. డిస్ట్రిబ్యూటర్లకి, మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులకి మధ్య నెలకొన్ని వివాదమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. రిలీజ్‌కి ఇంకా 24 గంటల సమయం కూడా లేకపోవడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ల ఎదుట ఆందోళనకి దిగారు. ఇదిలావుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ టికెట్ల విక్రయంలో ఎలాంటి వివాదం లేకుండా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. రిలీజింగ్ కి ఎక్కువ సమయం లేదు కనుక మల్టీప్లెక్స్ థియేటర్లలో కూడా ఏ క్షణమైనా టికెట్ బుకింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.
0business
Suresh 116 Views Wawrinka Wawrinka లండన్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ స్టాన్‌ వావ్రింకా(స్విట్జర్లాండ్‌) వింబుల్డన్‌ తొలి రౌండ్‌ లోనే వెనుదిరిగాడు. రష్యా అటగాడైన 21 ఏళ్ళ డానిల్‌ మెద్విదేవ్‌తో జరిగిన పోరులో 6-4,3-6,6-4,6-1 తేడాతో వావ్రింకా పై విజయం సాధించాడు. ఈ టోర్నిలో వావ్రింకా ఐదో సీడుగా బరిలో దిగాడు. డానిల్‌కి గ్రాండ్‌స్లామ్‌ టోర్నిలో ఇదే తొలి విజయం. గత ఏడాది డానిల్‌ ర్యాంక్‌ 250, ప్రస్తుత ర్యాంక్‌ 49.
2sports
Nov 25,2018 అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ ఉత్పత్తుల దిగ్గజం ఆపిల్‌ను వెనక్కి నెట్టి అత్యంత విలువైన అమెరికా కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ అవతరించింది. 2010 తర్వాత 753.3 బిలియన్‌ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్‌ ఈ అగ్రస్థానాన్ని అందుకోవడం ఇది తొలిసారి. ఈ ఏడాది ఆగస్టు నాటికి 1ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా ఉన్న ఆపిల్‌ తాజాగా 746 బిలియన్‌ డాలర్లకు జారింది. ఆశించిన స్థాయి కన్నా ఐఫోన్‌ అమ్మకాలు తగ్గడం, వ్యయనియంత్రణ సఫలీకృతం కాకపోవడం, ఉద్యోగుల కొరత తదితర అంశాలు ఆపిల్‌ను వేధించడంతో సంస్థ విలువ పడిపోయింది. .కొద్ది వారాల సమయంలోనే ఆపిల్‌ షేర్లు 25 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. అంతేకాదదు ఆపిల్‌ మూలధనం (మార్కెట్‌ క్యాపిటల్‌) కూడా భారీ మార్పు చవిచూసింది. మైక్రోసాఫ్ట్‌, ఆపిల్‌ సంస్థల తర్వాత ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ 736.6బిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో నిలవగా, గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ 725.5 బిలియన్‌ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 'ఆ మూడు దిగ్గజ సంస్థలను మైక్రోసాఫ్ట్‌ వెనక్కి నెట్టి, సిలికాన్‌ వ్యాలీలోని కంపెనీల్లో అత్యంత విలువైన సంస్థగా అవతరించింది' అని ఎంఎస్‌పవర్‌యూజర్‌.కామ్‌ తన నివేదికలో తెలిపింది. ప్రస్తుతం అన్ని సంస్థలు క్లౌడ్‌ సేవలు, సాఫ్ట్‌వేర్‌ సేవలపైన చిన్న, పెద్ద సంస్థల నుంచి డిమాండ్‌ రావడం మైక్రోసాఫ్ట్‌ విలువ పెరిగేందుకు దోహదం చేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
పెరిగిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు Samayam Telugu| Aug 11, 2018, 11.11 AM IST దేశ‌వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను చ‌మురు కంపెనీలు పెంచేశాయి. అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డంతో ఈ విధంగా నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ విధంగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డం వ‌రుస‌గా ఇది రెండో రోజు. ముంబ‌యిలో పెట్రోలు రేటు 85 రూపాయ‌ల‌కు చేరువైంది. జూన్ 15,2017 నుంచి కేంద్రం ప్ర‌తి రోజు పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తూ వ‌స్తోంది. ఈ విధానం మొద‌లైన‌ప్ప‌టి నుంచి దాదాపుగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు పైపైకే వెళుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గరాల్లో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ఈ కింది విధంగా ఉన్నాయి. న‌గ‌రం
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బుమ్రా, భువీని మేమే రప్పించాం: విండీస్ కోచ్ జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌లను మళ్లీ భారత జట్టులోకి ఎంపిక చేయడానికి కారణం సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు బాగా ఆడుతుండటమేనని నాకు అనిపిస్తోంది -విండీస్ కోచ్ Samayam Telugu | Updated: Oct 26, 2018, 06:09PM IST బుమ్రా, భువీని మేమే రప్పించాం: విండీస్ కోచ్ వెస్టిండీస్ జట్టు మెరుగ్గా ఆడటంతోనే ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లను భారత జట్టులోకి మళ్లీ సెలక్టర్లు ఎంపిక చేశారని వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా అభిప్రాయపడ్డాడు. విశాఖపట్నం వేదికగా గత బుధవారం జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13x4, 4x6) అజేయ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షై హోప్ (123 నాటౌట్: 134 బంతుల్లో 10x4, 3x6) సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలిచింది. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. తొలి రెండు వన్డేలకి బుమ్రా, భువీలకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు వారి స్థానంలో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలను ఎంపిక చేశారు. కానీ.. ఈ ఇద్దరు పేసర్లూ రెండు వన్డేల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో.. చివరి మూడు వన్డేల కోసం గురువారం 15 మందితో కూడిన జట్టుని ప్రకటించిన సెలక్టర్లు.. షమీపై వేటు వేసి.. బుమ్రా, భువీలని మళ్లీ జట్టులోకి ఎంపిక చేశారు. ‘జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌లను మళ్లీ భారత జట్టులోకి ఎంపిక చేయడానికి కారణం సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు బాగా ఆడుతుండటమేనని నాకు అనిపిస్తోంది. లేకపోతే..తొలి రెండు వన్డేలకి విశ్రాంతినిచ్చిన వారిని మళ్లీ ఎందుకు పిలిపిస్తున్నట్లు..? వన్డేల్లో అపార అనుభవం ఉన్న బుమ్రా, భువీలను మళ్లీ రప్పించిన ఘనత విండీస్‌కే చెందుతుంది’ అని స్టువర్ట్ లా ధీమా వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌తో శనివారం పుణె వేదికగా భారత్ జట్టు మూడో వన్డేలో తలపడనుండగా.. చివరి మూడు వన్డేల కోసం నిన్న సెలక్టర్లు ప్రకటించిన భారత్ జట్టు ఇదే..! భారత్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV `శివ‌లింగ‌` ఛాలెంజింగ్‌గా తీసుకున్నా- రితిక డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయిన‌వాళ్లు.. ఇంజినీర్ కాబోయి యాక్ట‌ర్ అయిన‌వాళ్లు ఉన్నారు. అదే త‌ర‌హాలో మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యం నుంచి అనూహ్యంగా న‌టిగా అవ‌కాశం అందుకుంది రితిక సింగ్‌. TNN | Updated: Apr 13, 2017, 09:11PM IST డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయిన‌వాళ్లు.. ఇంజినీర్ కాబోయి యాక్ట‌ర్ అయిన‌వాళ్లు ఉన్నారు. అదే త‌ర‌హాలో మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యం నుంచి అనూహ్యంగా న‌టిగా అవ‌కాశం అందుకుంది రితిక సింగ్‌. ఆరంభ‌మే విక్ట‌రీ వెంక‌టేష్ సినిమా `గురు`లో కిక్‌బాక్స‌ర్ పాత్ర‌లో మెప్పించింది. ప్ర‌స్తుతం పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో రాఘ‌వ‌లారెన్స్ స‌ర‌స‌న‌ `శివ‌లింగ‌` చిత్రంలో న‌టించింది. రెండు విభిన్న‌మైన సినిమాల్లో వైవిధ్యం ఉన్న పాత్ర‌ల్లో నటించాన‌ని రితిక చెబుతోంది. ఏప్రిల్ 14న `శివ‌లింగ‌` రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో పాత్రికేయుల‌తో ముచ్చ‌టిస్తూ రితిక చెప్పిన సంగ‌తులివి... *స్వ‌త‌హాగా నేను బాక్సార్‌ని. చిన్న‌పుడే బాక్సింగ్ నేర్చుకున్నా. ఏసియ‌న్ బాక్సింగ్ ట్రోఫీలో విన్న‌ర్‌గా నిలిచాను. ఆ క్ర‌మంలోనే న‌న్ను చూసిన‌ మ్యాడీ (మాధ‌వ‌న్‌) నాన్న‌గారిని సంప్ర‌దించి త‌మిళ‌చిత్రం `ఇరుదుసుత్రు`లో అవ‌కాశం ఇచ్చారు. *వాస్త‌వానికి నేనుఎప్పుడూ న‌టి అవ్వాల‌నుకోలేదు. రియ‌ల్ లైఫ్‌లో మార్ష‌ల్ ఆర్ట్స్ ఫైట‌ర్‌ని. అయితే ఇలా సినిమాల్లోకి వ‌స్తాన‌ని అనుకోలేదు. ప్ర‌తిదీ అనుకోకుండా జ‌రిగిన‌దే. అనుకోకుండానే మ్యాడీ స‌ర్నా.. నాన్న‌గారిని క‌లిసి బాక్స‌ర్ రోల్ చేయాల్సిందిగా అడిగారు. ఆడిష‌న్స్‌కి వెళ్లి సెల‌క్ట‌యిపోయాను. ఆ సినిమా త‌మిళ్ హిందీలో స‌క్సెస్ సాధించింది. ఆ త‌ర్వాత తెలుగులో వెంకటేష్ `గురు`లోనూ ఛాన్స్ వ‌చ్చింది. *`శివ‌లింగ` చిత్రం క‌థ న‌చ్చి న‌టించాను. ముఖ్యంగా నా పాత్ర న‌న్ను ఆక‌ట్టుకుంది. అందుకే ఇందులో న‌టించేందుకు ఒప్పుకున్నా. ఇదో హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌. క‌న్న‌డ వెర్ష‌న్ `శివ‌లింగ‌` చూశాను. ఆ సినిమా ప్ర‌భావం నాపై ప‌డ‌కుండా ఎంతో జాగ్ర‌త్త తీసుకుని ఫ్రెష్‌గా న‌టించాను. *గురు చిత్రంలో మేక‌ప్ లేకుండా న‌టించాను. ఇందులో ఓ మామూలు అమ్మాయిగా న‌టించాలి. మేక‌ప్ వేసుకున్నా. డ్యాన్సులు చేయ‌డం, డిఫ‌రెంట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌డం చాలా క‌ష్టంగా అనిపించింది. ఇదివ‌ర‌కూ నేనెప్పుడూ డ్యాన్సులు చేయ‌లేదు. *లారెన్స్ మాష్టార్ మంచి డ్యాన్స‌ర్‌. డ్యాన్సులు అద‌ర‌గొట్టేస్తారాయ‌న‌. నాకేమో డ్యాన్సులు చాలా క‌ష్టం. దీనికితోడు శారీలో క‌నిపించాలి. శారీలోనే డ్యాన్సులు చేయాలి. అది ఇంకా పెద్ద స‌వాల్ అనిపించింది. మొత్తానికి ఈ చిత్రం చాలా పెద్ద ఛాలెంజింగ్ అనిపించింది. డ్యాన్సులు చేసేప్పుడు బాడీ లాంగ్వేజ్‌, ఎక్స్‌ప్రెష‌న్స్ పై లారెన్స్ మాష్టార్ స‌ల‌హాలు ఇచ్చారు. ఈ చిత్రంలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉంటాయి. *బాక్సింగ్‌తో పోలిస్తే యాక్టింగ్ చాలా క‌ష్టం. చిన్న‌ప్ప‌టినుంచి మార్ష‌ల్ ఆర్ట్స్ , బాక్సింగ్ నేర్చుకున్నా. అవి చేయ‌డం ఈజీ. కానీ న‌ట‌న క‌ష్టం. కొత్త అవ్వ‌డం వ‌ల్ల‌నే ప్ర‌తిదీ క‌ష్టం అనిపించింది. *శివ‌లింగ సినిమా చేసేప్పుడు యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, డ్యాన్సుల కోసం ఎక్కువ శ్ర‌మించాల్సొచ్చింది. ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 7 వ‌ర‌కూ ప్రాక్టీస్ చేసేదాన్ని. * గురు చిత్రంలో వెంక‌టేష్‌, సాలా ఖుడూస్‌లో మాధ‌వ‌న్ తో క‌లిసి న‌టించాను. ఆ ఇద్ద‌రూ అమేజింగ్ యాక్ట‌ర్స్‌. అన్నిర‌కాలుగా స‌పోర్ట్ చేశారు. ఎన్నో విలువైన విష‌యాలు వారి నుంచి నేర్చుకున్నా. గురు చిత్రంతో తెలుగులో ప్ర‌వేశించ‌డం ఆనందంగా ఉంది. వెంక‌టేష్ గారు ఈ చిత్రంలో న‌టించేందుకు నాకు ఎంతో సాయం చేశారు. *ప్ర‌స్తుతం తెలుగులో క‌థ‌లు వింటున్నా. మంచి అవ‌కాశాలు వ‌స్తే న‌టించేందుకు సిద్ధ‌మే. కెరీర్‌లో వైవిధ్యం ఉన్న సినిమాలు చేయాల‌నుకుంటున్నా. న‌ట‌న‌కు ఆస్కారం ఉండేవి ఎంపిక చేసుకుంటా. త‌మిళంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నా. * ప్రియాంక చోప్రా, ఆలియాభ‌ట్‌, అనుష్క శ‌ర్మ నా అభిమాన తార‌లు. వీళ్లంతా నాకు ఇన్‌స్పిరేష‌న్‌. వీళ్లంతా చిన్న‌వ‌య‌సులో ఎంతో ఇన్‌స్ప‌యిరింగ్‌గా ఎదిగిన తీరు న‌న్ను ఆలోచింప‌జేస్తుంది.
0business
మన లోకల్ కుర్రాడు.. నాని రేర్ పిక్స్! First Published 24, Jun 2019, 11:24 AM IST టాలీవుడ్ లో తన నటనతో నేచురల్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో నాని.  టాలీవుడ్ లో తన నటనతో నేచురల్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో నాని. తనదైన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ హీరోకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం.. నాని చిన్నప్పటి ఫోటో.. తన తండ్రి గంటా రాంబాబుతో నాని తన అక్కతో నాని చిన్నప్పటి ఫోటో బాపు గారు డైరెక్ట్ చేసిన 'రాధాగోపాలం' సినిమాకి నాని క్లాప్ అసిస్టెంట్ గా పని చేశారు. ఆ సమయంలో తీసిన ఫోటో 'రాధాగోపాలం' సినిమా సెట్ లో కృష్ణుడు వేషంలో ఉన్న వ్యక్తితో నాని నటి స్నేహతో నాని అల్లరి కీర్తి సురేష్ తో నాని క్రేజీ సెల్ఫీ రాఘవేంద్రరావు 'సౌందర్య లహరి' కార్యక్రమంలో రానాతో నాని సూపర్ స్టార్ రజినీకాంత్ తో నాని ఫ్యాన్ మూమెంట్ 'ఈగ' సినిమా సెట్ లో రాజమౌళి, సమంతలతో నాని 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాలో నటించిన చిన్నపిల్లలతో నాని సెల్ఫీ తన భార్య అంజనాతో నాని హీరో గోపీచంద్ పెళ్లి సమయంలో తీసుకున్న ఫోటో 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమా షూటింగ్ లో సరదాగా తీసుకున్న సెల్ఫీ భార్య అంజనా, స్నేహితులతో నాని నాని, అంజనా రేర్ వెకేషన్ ఫోటోలు మెగాస్టార్ చిరంజీవితో నాని ఫ్యాన్ బాయ్ మూమెంట్ 'అ!' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తీసుకున్న ఫోటో తండ్రి రాంబాబు, కొడుకు అర్జున్ లతో నాని స్పెషల్ ఫోటో తన కొడుకుతో నాని నానికి తన అక్క అంటే చాలా ఇష్టం.. సమయం దొరికితే ఆమెతో కలిసి టైం స్పెండ్ చేయాలని చూస్తుంటాడు.. Recent Stories
0business
BSNL 15వేల పిఒఎస్‌లతో బిఎస్‌ఎన్‌ఎల్‌ లావాదేవీలు న్యూఢిల్లీ, డిసెంబరు 30: ప్రభుత్వంప్రవేశపెట్టిన డిజిటల్‌ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వరంగంలోని బిఎస్‌ఎన్‌ఎల్‌ 15వేల పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషిన్లను లీజుకు తీసుకుం టున్నది. బిఎస్‌ఎన్‌ఎల్‌పరంగా మొత్తం బిల్లుల్లో 40శాతం వరకూ డిజిటల్‌మోడ్‌లో అందుతున్నాయి. వచ్చేమార్చినాటికి ఈ డిజిటల్‌ చెల్లింపులు రెట్టింపు అవుతాయని అంచనా. ఇందుకోసం 15వేల పాస్‌ మెషిన్‌లను వినియోగించనున్నట్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ సిఎండి అనుపమ్‌శ్రీవాస్తవ వెల్లడించారు. అంతే కాకుండా 25-30కస్టమర్‌ సేవా కేంద్రాలు ప్రతి టెలికాం జిల్లా ల్లోను ఇపాస్‌ మెషిన్లను ఏర్పాటుచేసేందుకు నిర్ణయించిందన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 334 టెలికాం జిల్లాలునానయి. ప్రతి టెలి కాం జిల్లాలో 2-5-శాతం కస్టమర్‌ సెంటర్లలో పాస్‌ మెషిన్లను ఏర్పాటు చేస్తున్నట్లువివరించారు. ప్రస్తుతం 1500నుంచి 2000 వరకూ పాస్‌ మెషిన్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌పరంగా వచ్చే మార్చి 31వ తేదీనాటికి 40శాతం బిల్లుల చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని అంచనావేస్తున్నట్లు వివరించారు. 30-40శాతం చెల్లింపులు మొబైల్‌, ల్యాండ్‌ లైన్‌, బ్రాడ్‌బ్యాండ్‌, ఫైబర్‌టుహోమ్‌ సేవలకు చెల్లింపులు అమలు చేస్తామన్నారు. డిసెంబరు 15వ తేదీ అన్ని సర్కిళ్ల సిజిఎంలతో సమావేశం నిర్వహించామని, కస్టమర్‌ సేవాకేంద్రాలన్నింటిలోనూ పాస్‌ సౌకర్యం ఏర్పాటుచేయాలని కోరామ న్నారు. మూలధన వ్యయం భరించాలని ఆదేశించామన్నారు. మూలధన వ్యయం కంటే ముందు లీజు ప్రాతి పదికన తీసుకుంటేమంచిదని భావించి వివిధ బ్యాంకులతో టైఅప్‌తో ముందు ప్రారంభించినట్లు వివరించారు.
1entertainment
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు Ganesh| Last Updated: శనివారం, 21 జూన్ 2014 (09:25 IST) రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో శనివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.322 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.50గా ఉంది. అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.326, విశాఖపట్నంలో రూ.328, విజయవాడ రూ.313, చిత్తూరులో రూ.363, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.313 రూపాయలుగా ఉంది. ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.370 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్‌లో రూ.331 రూపాయలుగా పలుకుతోంది. సంబంధిత వార్తలు
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు గురువారం భారీ పతనం అనంతరం కాస్త తేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 30 పాయింట్లు లాభపడి 27,673 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు లాభంతో 8,583 వద్ద ముగిసింది... TNN | Updated: Oct 14, 2016, 03:46PM IST గురువారం భారీ పతనం అనంతరం కాస్త తేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 30 పాయింట్లు లాభపడి 27,673 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు లాభంతో 8,583 వద్ద ముగిసింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. గెయిల్ ఇండియా, లార్సెన్ అండ్ టర్బో, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, బీపీసీఎల్, టీసీఎస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు జీ ఎంటర్టైన్మెంట్, హిందుస్థాన్ యూనీలీవర్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐడియా సెల్యూలార్ షేర్లు నష్టపోయాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 66.73వద్ద స్థిరపడింది.
1entertainment
hong kong open: winning start for saina nehwal; kashyap, verma out హాంగ్‌కాంగ్‌లో తొలి రౌండ్‌లో నెగ్గిన సైనా ​ హాంగ్‌కాంగ్ ఓపెన్లో హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో డెన్మార్క్‌కు చెందిన మెట్టే పౌల్సెన్‌పై 21-19, 23-21 తేడాతో చెమటోడ్చి నెగ్గింది TNN | Updated: Nov 22, 2017, 11:53AM IST హాంగ్‌కాంగ్ ఓపెన్లో హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో డెన్మార్క్‌కు చెందిన మెట్టే పౌల్సెన్‌పై 21-19, 23-21 తేడాతో చెమటోడ్చి నెగ్గింది. 2010లో హాంగ్ కాంగ్ ఓపెన్ నెగ్గిన సైనా.. తర్వాతి రౌండ్‌లో కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. యువ సంచలనం చెన్ యుఫేతో భారత క్రీడాకారిణి తలపడనుంది. పురుషుల సింగిల్స్‌ క్వాలిఫైయర్‌లో పారుపల్లి కశ్యప్ లీ డాంగ్ కియున్ చేతిలో ఓడాడు. తొలి గేములో కశ్చప్ ఆధిక్యంలో నిలిచినప్పటికీ.. లీ డాంగ్‌నే విజయం వరించింది. మరో షట్లర్ సౌరభ్ వర్మ కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. 15-21, 8-21 తేడాతో ఇండోనేసియాకు చెందిన టామీ సుగియార్టో చేతిలో వరుస గేముల్లో ఓడాడు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట 15 నిమిషాలకు పీవీ సింధు యియుట్ యీ లువాంగ్‌తో తలపడనుంది. హెచ్‌ఎస్ ప్రణయ్, సాయి ప్రణీత్ కూడా బరిలో దిగనున్నారు. డబుల్స్‌లో అశ్విని పొనప్ప-సిక్కి రెడ్డి, మను అట్రీ-సుమీత్ రెడ్డి పోటీలో పాల్గొనున్నారు.
2sports
సెప్టెంబ‌ర్ 1న సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ జవాన్ విడుద‌ల Highlights సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగాజవాన్ బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్న జవాన్ చిత్రం విడుదల తేదీ ఖరారు సెప్టెంబర్ 1 తేదీన జవాన్ విడుదల కానుందని తెలిపిన నిర్మాత దిల్ రాజు  సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. . ఇప్ప‌టికే టాకీ పార్టు పూర్తిచేసుకుని షూటింగ్ చివరి షెడ్యూల్ కి సిద్ద‌మ‌వుతుంది.  విడుద‌ల చేసిన ప్రీలుక్ పోస్ట‌ర్, టైటిల్ కి, మెద‌టి లుక్ పోస్ట‌ర్ కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. జ‌వాన్ అంటే అస‌లు ఏలాంటి క‌థ అనే చర్చ అటు అభిమానుల్లోను, ఇటు ప్రేక్ష‌కుల్లో ను ఆశ‌క్తి నెల‌కొంది. హీరో సెల్‌ఫోన్ ప‌ట్టుకుని ఎమెష‌న‌ల్ గా వుండ‌టం, మోబైల్ లో ఓ ఫ్యామిలి ఫోటో వుండ‌టం చూస్తే ఇది పక్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ అనిపించేలా వుంద‌ని కొంత‌మంది అంటుంటే..  హీరో హ్యండ్‌స‌మ్ గా హ‌కీ స్టిక్ ప‌ట్టుకుని కాలేజ్ గేట్ ద‌గ్గ‌ర బైక్ మీద స్టైలిష్ గా నిల్చున్న స్టిల్ చూసి ఇది ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని కొంత‌మంది అంటున్నారు. అయితే ఇది ప‌క్కాఫ్యామిలి స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపోందుతుందని యూనిట్ స‌బ్యులు చెబుతున్నారు. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబ‌ర్ 1న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.    నిర్మాత కృష్ణ మాట్లాడుతూ....  ద‌ర్శ‌కుడు బివిఎస్ రవి చెప్పిన కథ చెప్పిన‌ట్టే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెర‌కెక్కించాడు. మా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోయిన్ మెహ‌రిన్ లు స్రీన్ మీద చాలా అందంగా వుంటారు.  ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా  ఈ చిత్రాన్ని నిర్మించాం. చిత్రానికి సంభందించి మిగిలిని షూటింగ్ పార్ట్ ని జులైలో, అన్నికార్య‌క్ర‌మాలు అగ‌ష్టులో కంప్లీట్‌ చేసి సెప్టెంబ‌ర్ 1న చిత్రాన్ని విడుదల చేస్తాము. ఈ చిత్రం మెగాఅభిమానుల‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు దిల్ రాజు మాట్లాడుతూ.... సాయి ధరమ్ తేజ్ ,బివిఎస్ రవి కాంబినేష‌న్ లో చేస్తున్న చిత్రం జవాన్ . సాయి ధరమ్ తేజ్ ఈ క‌థ‌లో ఇన్‌వాల్వ్ అయ్యి మ‌రీ చేస్తున్నాడు.  ఈ చిత్రాన్ని మా సన్నిహితుడు కృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నట్టుగా  బాగా వచ్చింది. అని అన్నారు   దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ...   జ‌వాన్ చిత్రం కాన్సెప్ట్ ఎంట‌ని అంద‌రూ అడుగుతున్నారు. మా మెద‌టిలుక్ అంద‌రిలో ఆ క్యూరియాసిటి తెచ్చింది. మాస్ క‌మ‌ర్షియ‌ల్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ని ఎలా చూపించ‌బోతున్నారు అని అటు ఫ్యాన్స్‌, ఇటు ఇండ‌స్ట్రి ఫ్రెండ్స్ చాలా ఇంట్ర‌స్ట్ గా అడుగుతున్నారు. చాలా మంచి కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతుంది. సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్ప‌టివ‌ర‌కూ చెయ్య‌ని ఓ మంచి పాత్ర‌లో చేస్తున్నాడ‌నేది మాత్రం చెప్ప‌గ‌ల‌ను. దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశ్యం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి. తన కుటుంబాన్ని మ‌నోదైర్యంతో త‌న బుద్దిబ‌లంతో ఎలా కాపాడుకున్నాడన్నదే మా కాన్సెప్ట్. ఇది పక్కా ఫ్యామీలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మెహ్రీన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.  ప్రసన్న మెయిన్ విలన్ గా నటించారు. చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.   నటీనటులు - సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు, కెమెరా మెన్ - కెవి గుహన్, మ్యూజిక్ - తమన్, ఆర్ట్ - బ్రహ్మ కడలి, ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్, సహ రచయితలు - కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి, బ్యానర్ - అరుణాచల్ క్రియేషన్స్, సమర్పణ - దిల్ రాజు, నిర్మాత - కృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - బివిఎస్ రవి Last Updated 25, Mar 2018, 11:53 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’ రిలీజ్ డేట్ ఫిక్స్ ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’ లాంటి ఫ్యామిలి ఎంట‌ర్ టైన‌ర్ త‌రువాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ ‘ఒక్క క్షణం’. TNN | Updated: Nov 18, 2017, 06:35PM IST ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’ లాంటి ఫ్యామిలి ఎంట‌ర్ టైన‌ర్ త‌రువాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ ‘ఒక్క క్షణం’.‘ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడా’ లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శ్రీనివాస్ అవసరాల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం డిసెంబర్ 23‌న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు శిరీష్ హీరోగా మా బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రానికి ‘ఒక్క క్షణం’ అనే టైటిల్ పెట్టాం. ఈ టైటిలే సినిమాపై ఆసక్తిరేకెత్తించేదిగా ఉందని దీంతో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయన్నారు. ఈ టైటిల్‌కు తగ్గట్టే మా సినిమా అంద‌ర్నీ ఆకట్టుకుంటుందన్నారు. ఈ మూవీ ద‌ర్శ‌కుడు స్టైల్లో వుంటూ హీరో అల్లు శిరీష్‌ని చాలా కొత్త‌గా మెగాఅభిమానుల్ని ఆక‌ట్టుకునేలా చూపించారన్నారు. అల్లు శిరీష్ , సుర‌భి, అవ‌స‌రాల శ్రీనివాస్‌, సీర‌త్ క‌పూర్‌లు చాలా కొత్త పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటారు. అబ్బూరి రవి, ఛోటా కె ప్రసాద్, శ్యామ్ కె నాయిడు వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. సతీష్ వేగేశ్న, రాజేష్ దండ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారన్నారు.
0business
sandhya 274 Views SL vs SA , World Cup 2019 SL vs SA లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా నేడు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య చెస్టర్‌ లీ స్ట్రీట్‌లో లీగ్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ పోరులో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో పరువు కోసం ఆడుతోంది. మరోవైపు శ్రీలంక జట్టు ఇంగ్లాండ్‌పై సంచలన విజయంతో సెమీస్‌ స్థానంపై ఆశలు పెంచుకుంది. అందుకే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతుంది. తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV వంద వికెట్లు.. రషీద్ ఖాన్ మరో సంచలనం.. అతి తక్కువ వన్డేల్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశాడు. అతి పిన్న వయసులో వంద వికెట్లు సాధించిన బౌలర్‌గానూ రికార్డును సొంతం చేసుకున్నాడు. Samayam Telugu | Updated: Mar 25, 2018, 03:52PM IST వంద వికెట్లు.. రషీద్ ఖాన్ మరో సంచలనం.. అప్ఘానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ క్రికెట్లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ వన్డేల్లో 100 వికెట్లను తీసిన బౌలర్‌గా రషీద్ చరిత్ర సృష్టించాడు. హరారే వేదికగా విండీస్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో షాయ్ హోప్‌ను ఎల్బీగా అవుట్ చేసిన రషీద్.. వంద వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 44 వన్డేల్లోనే ఈ అప్ఘాన్ స్పిన్నర్ వంద వికెట్లను పడగొట్టడం విశేషం. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (52 మ్యాచ్‌లు) పేరిట ఉంది. రషీద్ ఖాన్ 19 ఏళ్ల 186 రోజుల వయసులో వంద వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డును సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్ కూడా అతడే కావడం విశేషం. అతి తక్కువ వన్డేల్లో 100 వికెట్లు తీసిన ఆటగాళ్లు: * రషీద్ ఖాన్ - 44
2sports
పృథ్వీషా విషయంలో క్లీన్‌చిట్‌ prduviraj shah ముంబయి: డోపింగ్‌ భూతం క్రీడాకారుల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఈ టెస్టులో పట్టుబడి ఇప్పటికే పలువురు క్రీడాకారులు ఆటకు దూరం అయ్యారు. మరికొందరిపై కేసులు నడుస్తున్నాయి. తాజాగా టీమిండియా యువకెరటం పృథ్వీషా, మరో ఇద్దరు క్రికెటర్ల డోపింగ్‌ కేసుల ప్రక్రియకుప్రపంచ డోపింగ్‌ నిరోధ సంస్థ (వాడా) క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీరిపై విధించిన 6-8 నెలల నిషేధం సబబుగానే ఉందని వెల్లడించింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ సమయంలో దగ్గుతో బాధపుతున్న షా బోర్టుకు చెప్పకుండా ఔషధ దుకాణంలో ఓ దగ్గుమందుకొని వాడాడు. అందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉంది. ఈ విషయాన్ని ముస్తాక్‌ అలీ బోర్డుకు తెలుపలేదు. దీంతో కెరీర్‌లో కోలుకోలేని దెబ్బతిన్నాడు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. https://www.vaartha.com/news/national/
2sports
SAHARA-1 సహారా అంబీవ్యాలీ వేలం షురూ! న్యూఢిల్లీ, ఆగస్టు 15: సుబ్రతారా§్‌ుకి మరో చుక్కెదురయింది. సహారాగ్రూప్‌ పరిధిµలోని పుణె సమీపంలోని అంబీవ్యాలీని వేలం వేస్తామని బేస్‌ధరను కూడా 37,392కోట్ల రూపాయలుగా నిర్ణ యించారు. బాంబేహైకోర్టు సోమవారం నాడే సహారాగ్రూప్‌ అంబీవ్యాలీని వేలానికి పెట్టింది. అధికారిక లిక్విడేటర్‌లో నావాలాలోని అంబీవ్యాలీ సిటీని రిజర్వుధరగా ప్రకటించారు. వివిద బ్యాంకర్లకు ఉన్న రుణబకాయిలను కూడా రికవరీ చేసుకునేందుకు, సెబీసహార వివాదంలో ధరావతుకు ఈ సొమ్మును జమచేస్తారని అంచనా. సుప్రీంకోర్టు సహారా గ్రూప్‌ దాఖలుచేసిన వాయిదా పిటిషన్‌ను తిరస్కరించింది. పుణె జిల్లాలోని పశ్చిఘాట్‌ప్రాంతంలోని అత్యంత విలాసవంతమైన వ్యాలీని వేలం వాయిదా వేయా లని, కొంత పెట్టుబడులు వస్తున్నందున ఆ మొత్తం జమచేస్తామని దరఖాస్తుచేసిన సంగతి తెలిసిందే. బాంబే హైకోర్టు అధికా రిక లిక్విడేటర్‌ వినోద్‌ శర్మ ప్రముఖ దిన పత్రి కలకు నోటీసులు జారీ చేసారు. సేల్‌, లీజ్‌, లేదా ఎలా ఉన్న ఆస్తి అలాగే అన్నట్లు వేలం ప్రక్రియను షురూ చేసా రు. భారీ ఆస్తులున్నం దున ఈ వేలం రెండు దశల్లో నిర్వహిస్తారని అంచనా. అలాగే రెండురోజులపాటు జరుగుతుంది. మెగాలోపోలిస్‌ తరహాలో అత్యంత అధునాతన రీతిలో అభివృద్ధిచేసిన అంబీవ్యాలీసిటీ 6761.64 ఎకరాల్లో విస్తరించింది. 1409.87 ఎకరాలు పరిసరాల్లోఉన్న మొత్తంతోపాటు, సతారా జిల్లాకు ఆనుకుని 321.66 ఎకరాలు అంబీవ్యాలీలో ఉన్నాయి. అధికారిక లిక్విడేటర్‌ మాట్లాడుతూ గ్రేసహ్యాద్రి పర్వతాలనడుమ అంబీవ్యాలీ అత్యంత ఆహ్లాదకరమైన ప్రాజెక్టు అయినందున బిడ్డర్లు ముందుకువస్తారన్నారు. కలపతోచేసిన ఆవా సాలు నుంచి అత్యాధునిక విల్లాలను కూడా ఏర్పాటుచేస్తారు. ఎయిర్‌పోర్టు, హాస్పిటల్‌, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌, రిటైల్‌; ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ స్కూలు, హాస్పిటాలిటీ వంటివి కూడా ఇక్కడ అందు బాటులో ఉండటంతో అత్యంత విలాసవంతమైన వ్యాలీకి బిడ్డర్లు లెక్కకు మించి రాగలరని అంచనా.
1entertainment
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
ARCHIVES ఎప్పుడూ నవ్వుతుంటానని.. ముంబయి: స్మృతి మంధాన ఓ సంచలనం. దూకుడైన ఆటతో మగువల క్రికెట్‌కే ఊపు తెచ్చింది ఆమె. 2018లో పరుగుల వరదపారించిన మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్నీ చేజిక్కించుకుంది. బ్యాటింగ్‌లో ఆమెదో ప్రత్యేక శైలి. ప్రత్యర్థి బౌలింగ్‌ను ధనాధన్‌ షాట్లతో చీల్చిచెండాడే ఈ సాంగ్లి (మహారాష్ట్ర) అమ్మాయి.. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. బౌలర్లకు తలనొప్పి తెప్పిస్తూనే.. తాను మాత్రం ఇలా హాయిగా నవ్వేస్తుండడంపై ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. దానికి కూడా నవ్వుతూనే స్పందించింది. ‘‘‘నువ్వు ఎప్పుడూ ఎందుకలా నవ్వుతుంటావు’ అని నా సహచర క్రీడాకారిణులు ఆటపట్టిస్తుంటారు. మైదానం వెలుపల ప్రత్యర్థి బౌలర్లు కనిపిస్తే.. ‘నేను మీవైపు నవ్వుతూ చూస్తుంటే.. మీరెందుకు అలా కొరకొరా చూస్తారు?’ అని అడుగుతుంటా. దానికి వాళ్లు.. ‘నీ నవ్వు మమ్మల్ని దహించివేస్తుంది’ అని చెబుతుంటారు. ఆ మాటలు వింటుంటే హాయిగాఅనిపిస్తుంది’’ అని మంధాన చెప్పింది. ప్రధానాంశాలు
2sports
Nov 16,2018 మరింత పెరిగిన వాణిజ్య లోటు.. న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో భారత వాణిజ్య లోటు 17.86 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. అధిక చమురు దిగుమతులు లోటును పెంచాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక రిపోర్టులో తెలిపింది. ఇంతక్రితం సెప్టెంబర్‌ మాసంలో ఈ లోటు 13.98 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకుంది. 2017 ఇదే అక్టోబర్‌లో 14.61 బిలియన్‌ డాలర్ల లోటు నమోదయ్యింది. క్రితం అక్టోబర్‌లో ఎగుమతులు 17.86 శాతం వృద్ధితో 26.98 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే మాసంలో దిగుమతులు 17.62 శాతం పెరిగి 44.11 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే చమురు దిగుమతుల్లో భారత్‌ మూడో అతిపెద్ద దేశంగా ఉంది. దేశం మొత్తం చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతుల నుంచి సమకూర్చుకుంటున్నదే. గత నెలలో చమురు దిగుమతులు 52.64 శాతం ఎగిసి 14.21 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. క్రితం అక్టోబర్‌లో పసిడి దిగుమతులు 42.9 శాతం తగ్గి 1.68 బిలియన్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ కాలంలో దేశ ఎగుమతులు 13.27 శాతం పెరిగి 191 బిలియన్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు 16.37 శాతం పెరిగి 302.47 బిలియన్లకు ఎగిశాయి. దీంతో ఈ ఏడు నెలల కాలంలో దేశ వాణిజ్య లోటు 111.46 బిలియన్‌ డాలర్లకు చేరింది. దిగుమతులు పెరిగి ఎగుమతులు తగ్గడం ద్వారా వాణిజ్య లోటు ఏర్పాడుతుంది. 2017-18 కాలలో వాణిజ్య లోటు 91.28 బిలియన్లుగా చోటు చేసుకుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia నాయకుడిగా.. హీరోగా.. లక్షల కోట్లమంది అభిమానుల్ని పొందటం పూర్వజన్మపుణ్యంగా భావిస్తున్నానన్నారు. మీరు కోరుకొన్నట్లుగానే పైసా వసూల్ ఖచ్చితంగా పైసా వసూల్ అవుతుందని.. తమ్ముడూ నేనే జంగిల్ బుక్ సినిమా చూడలేదు.. అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు అది నిజమో కాదో మీరే చెప్పాలంటూ డైలాగ్స్ ‘పైసా వసూల్’ డైలాగ్ చెప్పుతూ ఆకట్టుకున్నారు బాలయ్య. అయితే ఎప్పటిలాగే బాలయ్య తన స్పీచ్ అంతా తడబాటుతోటే సాగింది. పలుసార్లు తన మాటలను సవరించుకుని మాట్లాడారు. ఇక్కడకు వచ్చిన ప్రేక్షకులకు అభినందనలు అనబోయి జోహార్లు అనేసి తరువాత సవరించుకున్నారు బాలయ్య. ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. ఇవాళ బాలయ్య కోసం తరలివచ్చిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ.. వర్షం పడుతున్నా ఆయన కోసం అలాగే ఎక్కడికీ కదలకుండా బాలయ్య లాగే మొండిగా ఉన్నారని మీ కాళ్లు పట్టుకోవాలనుందన్నారు. ఇక బాలయ్య గురించి మాట్లాడుతూ.. బాలయ్య ఎక్కడకు వెళ్లినా బౌన్సర్స్ అవసరం లేదని.. ఆయనకు అభిమానులే బాడీగార్డ్స్ అని, ఒక వేళ ఎవరైనా మీద పడినా ప్రేమతోటే కొడతారని అది పెద్ద ఇష్యూ కాదన్నారు. బాలయ్య కామన్ సెన్స్‌తో మాత్రమే కొడతారని అదో లవ్ స్టోరీ అన్నారు పూరీ. ఆయన కొడితే ప్రేక్షకులు హ్యాపీ ఫీల్ అవుతారు. ఆయన అభిమానులతో ఉన్న అనుబంధం అలాంటిది. అది మీడియాకు తెలియదని గుర్తుపెట్టుకోండి. ఇకపై బాలయ్య ఎవర్నైనా కొడితే వాళ్లు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అస్సలు ఫీల్ కారన్నారు. హీరోయిన్ శ్రియ మాట్లాడుతూ.. గౌతమిపుత్ర తరువాత బాలయ్యతో నటించడంతో చాలా ఆనందంగా ఉందని ఈ అవకాశాన్ని ఇచ్చిన పూరీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక చార్మి మాట్లాడుతూ.. నా జీవితంలో బెస్ట్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది బాలయ్యే అంటూ జై బాలయ్య అంటూ ఫ్లైయింగ్ కిక్‌లు ఇచ్చేసింది. ఇక ‘పైసా వసూల్’ ఆడియో వేడుకకు గెస్ట్‌గా హాజరైన బోయపాటి మాట్లాడుతూ.. జంగిల్ బుక్‌లో పులి ఎలా ఉంటుందో బాలయ్యకు తెలియదు అన్నారని.. కాని అది ఎలా ఉంటుందో తనకు తెలుసని దగ్గర్నుండి నేను చూశానని.. అది పులి కాదని సింహం అన్నారు మాస్ డైరెక్షర్ బోయపాటి. ఆయనతో చేసిన ‘లెజెండ్’ మూవీ దక్షణ భారతదేశంలోనే వెయ్యిరోజులు ఆడిన బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని.. దాన్ని మించి పైసా వసూల్ పెద్ద హిట్ అవుతుందన్నారు. ఇక దర్శకుడు పూరీ గురించి మాట్లాడుతూ పూరీ జగన్నాథ్‌కు సినిమా తీయటంలో ప్రత్యేకమైన శైలి ఉందని మూవీని ఎక్కడ లేపితే ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందో ఆయనకు బాగా తెలుసన్నారు. ఈ సినిమాలో పాటలన్నీ విన్నానని అద్భుతంగా ఉన్నాయంటూ.. అనూప్ రూబెన్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV 18ఏళ్లకే టీమిండియాకి ఆడుతున్నాడు.. చాలు శ్రీలంకతో మొహాలి వేదికగా గత బుధవారం జరిగిన రెండో వన్డేతో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన యువ ఆల్‌రౌండర్ TNN | Updated: Dec 16, 2017, 04:19PM IST India's Washington Sundar bowls during the second one-day international cricket... శ్రీలంకతో మొహాలి వేదికగా గత బుధవారం జరిగిన రెండో వన్డేతో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుగైన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్ 65 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. శ్రీలంక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ లాహిరు తిరుమానె స్పిన్నర్ల లయని దెబ్బతీసే ఉద్దేశంతో వరుసగా స్వీప్‌, రివర్స్ స్వీప్ షాట్లు ఆడగా.. దీన్ని గమనించిన సుందర్.. తెలివిగా బంతిని విసిరి అతడ్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. మొహాలిలో తన కొడుకు ప్రదర్శన సంతృప్తినిచ్చిందని వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎమ్. సుందర్ ఆనందం వ్యక్తం చేశారు. మూడు వన్డేల ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే విశాఖపట్నంలో ఆదివారం జరగనున్న నేపథ్యంలో.. ఆర్. సుందర్ మీడియాతో శనివారం మాట్లాడాడు. ‘భారత్ జట్టులో తీవ్ర పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో 18 ఏళ్లకే సుందర్ అరంగేట్రం చేయడం సామన్యమైన విషయం కాదు. దొరికిన ఈ అవకాశాన్ని అతను నిలబెట్టుకోవాలంటే మరింతగా కష్టపడాలి. చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే అవకాశం దక్కడంతో.. అతని సుదీర్ఘ కెరీర్‌కి బాటలు పడినట్లే’ అని ఆర్.సుందర్ సంతోషం వ్యక్తం చేశారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కౌశల్ పొడుపు కథ: ముందు 64, వెనుక ఒకటి.. ఇంతకీ ఏమిటదీ? Samayam Telugu| Sep 26, 2018, 11.59 PM IST బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2.. ఎపిసోడ్ 109లో ఐదుగురు హౌస్‌మేట్స్ సరదాగా గడిపారు. దీప్తీ, కౌశల్, తనీష్, గీత, సామ్రాట్‌లు జోకులు వేసుకుంటూ.. పొడుపు కథలు చెప్పుకుంటూ సందడి చేశారు. కౌశల్.. బిగ్‌బాస్ హౌస్‌లోని బొమ్మలను చూస్తూ.. పొడుపు కథలు అడిగాడు. ఈ సందర్భంగా దీప్తీకి వచ్చిన అనుమానాలు నవ్వుతెప్పించాయి. ఇవీ కౌశల్ పొడుపు కథలు..: ముందు 64, వెనుక ఒకటే.. ఏమిటో చెప్పుకోండని కౌశల్ అడిగాడు. అయితే, ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. దీంతో సామ్రాట్ ‘షార్క్’ అని చెప్పాడు. అదెలా అని దీప్తి అడిగిన ప్రశ్నకు.. ‘‘ముందు షార్క్‌కు ముందు 64 పళ్లు ఉంటాయి. వెనుక తోక ఉంటుంది’’ అని కౌశల్ సమాధానం చెప్పాడు. ‘చూపుకు తెల్ల తలకి బహుబల్ల’ అని అడిగిన పొడుపు కథకు కూడా సామ్రాట్ తెలిగ్గానే సమాధానం చెప్పాడు. తెల్లగా ఉండేవి ఏనుగు దంతాలని, బహుబల్ల అంటే పెద్ద తలగదని తెలిపాడు. ఆ తర్వాత దీప్తి ఏదో పొడుపు కథను అడిగింది. దానిపై కాసేపు సరదా చర్చ జరిగింది. ‘‘బర్రె నడుచుకుంటూ వచ్చి పాలు ఇవ్వదు’’ అంటూ దీప్తి అనడంతో హౌస్‌లో మరోసారి నవ్వులు విరిశాయి.
0business
internet vaartha 308 Views ముంబై : క్రికెటర్‌ సచిన్‌ జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా సచిన్‌. కాగా సచిన్‌ ఈ సినిమాలో స్వయంగా నటిస్తున్నాడు.సచిన్‌ టీజర్‌ విడుదలై అభిమానులను అలరిస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో విషయం ఇప్పుడు అభిమానులకు సంతోషానిస్తుంది.అదేంటంటే సచిన్‌ తనయుడు అర్జున్‌ సచిన్‌ చిత్రంలో మెరువనున్నాడు. సచిన్‌ చిత్రంలో చిన్ననాటి పాత్ర కోసం సచిన్‌లా మంచి బ్యాటింగ్‌ స్కిల్స్‌ ఉన్న, అదీ సచిన్‌ పోలికలత ఉన్న యంగ్‌ కింగ్‌ కోసం ఎంతో మందిని వెతికిన ఈ చిత్ర బృందం చివరికి అర్జున్‌ అయితేనే దీనికి న్యాయం చేయగలుగుతాడని భావించారట. దీంతో ఈ సినిమాలో అర్జున్‌ తన తండ్రి పాత్రలో నటిస్తున్నాడని తెలిసింది. కాగా 120 నిముషాల నిడివితో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 40 నిముషాలకు పైగా సచిన్‌కు చెందిన ప్రదర్శన లను సందర్భానుసారం జోడించినట్లు తెలుస్తుంది.దీంతో మరోసారి మాస్టర్‌ స్వీట్‌ ఇన్నింగ్స్‌ను చూడటానికి అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు.
2sports
Oct 10,2015 మైక్రోమాక్స్‌ నుంచి కాన్వాస్‌ ల్యాప్‌ట్యాప్‌ న్యూఢిల్లీ : ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ మైక్రోమాక్స్‌ ఈ నెల 13న మార్కెట్లోకి కాన్వాస్‌ ల్యాప్‌టాప్‌ ఎల్టీ 777ను ఆవిష్కరించనున్నట్లు ఒక్క ప్రకటనలో తెలిపింది. దీన్ని ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌గాను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. 11.6 అంగుళాల డిస్‌ప్లే కలిగిన దీని ధర రూ.17,999గా నిర్ణయించింది. 2మెగా ఫిక్సల్‌ కెమెరా, 32జిబి అంతర్గత మెమోరీ, విండోస్‌ 10 ఆపరేటింగ్‌సిస్టమ్‌, 2జిబి ర్యామ్‌, 9000 ఎంఎహెచ్‌ బ్యాటరీతో రూపొందించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
లక్ష్యం నుంచి ప్రభుత్వం వెనకడుగు.. - 2050 నాటికే పూర్తి విద్యుత్తు వాహనాలు :  టయోటా వైస్‌ చైర్మెన్‌ శేఖర్‌ విశ్వనాథన్‌ నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశ వ్యాప్తంగా 2030 నాటికి దేశంలో పూర్తిగా విద్యుత్తు వాహనాలే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. 2050 వరకు ఇది సాకారమయ్యే అవకాశాలు కనిపించడం లేదని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) వైస్‌ చైర్మెన్‌, సంస్థ శాశ్వత డైరెక్టర్‌ శేఖర్‌ విశ్వనాథన్‌ తెలిపారు. కంపెనీ కొత్తగా రూపొందించిన టయోటా యారిస్‌ వాహనాన్ని గురువారం ఆయన తెలంగాణ మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వనాథన్‌ మాట్లాడుతూ 2030 నాటికి దేశంలో పూర్తిగా విద్యుత్తు వాహనాలే తిరిగేలా చూడాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. అయితే వాస్తవాలు గమనించి ప్రభుత్వం లక్ష్యం నుంచి వెనకడుగు వేసిందని వివరించారు. దేశంలో విద్యుత్తు వాహనాలు తిరిగేందుకు తగ్గ పరిస్థితులను, మౌలిక వసతులను కల్పించేందుకు గాను సర్కారుకు కనీసం 20 నుంచి 30 సంవత్సరాల గడువు పడుతుందని అన్నారు. పూర్తిస్థాయి విద్యుత్తు వాహనాలు అందుబాటులోకి వచ్చే వరకు హైబ్రిడ్‌ వాహనాలను ప్రోత్సహించడమే సరైన చర్య అని తాము సర్కారు సూచించినట్టుగా ఆయన తెలిపారు. అయిన హైబ్రిడ్‌ వాహనాలకు అసవరమైన మౌలిక వసతులను కల్పించే దిశగా సర్కారు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని విశ్వనాథన్‌ వివరించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 4000 కొత్త యారిస్‌ వాహనాలు అందుబాటులో ఉంచనున్నట్టుగా వివరించారు. విద్యుత్తు, హైడ్రోజన్‌, హైబ్రిడ్‌ హైడ్రోజన్‌ వాహనాలకు తోడు రానున్న అయిదేండ్ల కాలంలో అందుబాటులోకి రానున్న అన్ని రకాల కొత్త టెక్నాలజీలతో వాహనాలను రూపొందించేందుకు గాను తమ సంస్థ సన్నంద్ధంగా ఉందని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV లెనోవా 'ఎస్5' స్మార్ట్‌ఫోన్ విడుదల..! ప్రముఖ మొబైల్ ఫోన్ల సంస్థ లెనోవా తన నూతన ఫోన్‌ను విడుదలచేసింది. TNN | Updated: Mar 20, 2018, 06:04PM IST ప్రముఖ మొబైల్ ఫోన్ల సంస్థ లెనోవా తన నూతన ఫోన్‌ను విడుదలచేసింది. 3 జీబీ, 4 బీజీ వేరియంట్లలో, మెమోరీకి సంబంధించి 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ శ్రేణుల్లో ఈ ఫోన్లు ఉన్నాయి. 32 జీబీ ఫోన్ ధర రూ.10,289; 64 జీబీ ఫోన్ ధర రూ.12,349; 128 జీబీ ఫోన్ ధర రూ.15,440గా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే లెనోవో నుంచి విడుదలైన కొన్ని ఫోన్లు వినియోగదారుల మన్ననలు పొందాయి. తాజాగా చైనాలో విడుదల చేసిన ఈ ఫోన్... మరెంతగా రాణిస్తుందో చూడాలి. భారత మార్కెట్లలోకి ఈ ఫోన్లు త్వరలోనే రానున్నాయి. * 5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే * 2160 × 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ * 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ * 3/4 జీబీ ర్యామ్ * 32/64/128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ * ఆండ్రాయిడ్ 8.0 ఓరియో * 13 మెగాపిక్సెల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు * 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా * ఫింగర్‌ప్రింట్ సెన్సార్ * 4జీ వీవోఎల్‌టీఈ * యూఎస్‌బీ టైప్ సి * 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
1entertainment
director krish exclusive interview on gautamiputra satakarni గ్రాఫిక్స్‌తో సమయాన్ని వృథా చేయలేదు: క్రిష్ అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కావాలంటే గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం వృథా చేయొద్దని క్రిష్‌కి రాజమౌళి సలహా ఇచ్చారట. TNN | Updated: Jan 9, 2017, 07:51PM IST 'గమ్యం' సినిమాతో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్). ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ ఇలా ప్రతి సినిమాకు ఒక ప్రత్యేక ఉంది. తాజాగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో శాతవాహనుల చరిత్ర ఆధారంగా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సంధర్భంగా క్రిష్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ.. ఈ సినిమా చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? 2011-12 సమయంలో కరీంనగర్‌లో ఉన్న కోటిలింగాల తవ్వకాల్లో నాణేలు బయటపడ్డాయి. అప్పటి నుంచే సినిమా చేయాలనుకున్నాను. ఆడియన్స్‌కు చెప్పడానికి ఇది గొప్ప కథ అనిపించింది. దీనికి సంబంధించిన పుస్తకాలు పాశ్చ్యాత్తులు ప్రచురించారు. అంతేకాదు అమరావతికి సంబంధించిన స్తూపాలు లండన్ మ్యూజియంలో ఉన్నాయి. విదేశీయులకు తెలిసిన చరిత్ర మన వారికి తెలియదు. తరతరాలకు ఈ చరిత్ర తెలియాలని సినిమా చేశాం. Recommended byColombia చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా తీసారా..? ఏమైనా మార్పులు చేశారా..? 'గౌతమిపుత్ర శాతకర్ణి' చరిత్రకు సంబంధించి మూడేళ్లుగా చాలా పరిశోధన చేశాను. సివిల్స్, గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యే వారికి ఈ చరిత్ర గురించి తెలుస్తుంది. ఆ పుస్తకాలు చదివాను. గౌతమి తన బిడ్డ శాతకర్ణి గురించి శాసనాలు రాయించింది. వాటి ద్వారానే శాతకర్ణి గురించి అందరికీ తెలిసింది. శాతవాహనుల వంశానికి చెందిన 23వ రాజు శాతకర్ణి. కాలం కలిసొస్తే పేరు వస్తుందని అంటారు, కానీ కాలానికే కలిసొచ్చి శాతవాహన శకంగా ఖ్యాతిగాంచింది. నేను చదివింది.. నేను నమ్మిన దాన్ని సినిమాగా చేశాను. సినిమా చాలా క్రిస్పీగా ఉంటుంది. శాతకర్ణి చరిత్రలో మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? ముక్కలు ముక్కలుగా ఉండే ఘన రాజ్యాలన్నింటినీ ఒక్కటిగా చేయడం అతనికున్న పట్టుదలను తెలియజేస్తుంది. నాణేల మీద అతడి బొమ్మను ముద్ర వేయించుకున్న మొదటి రాజు ఆయన. తన తల్లి పేరును ముందు పెట్టుకొని గౌతమిపుత్ర శాతకర్ణి అని పిలిపించుకున్న మొదటి రాజు శాతకర్ణి. ఆ తరువాత నుంచి శాతవాహన రాజులందరూ తల్లి పేరును ముందు పెట్టుకొనే ఒరవడి సృష్టించారు. ఇలా ఆయన జీవితంలో ప్రతి అంశం ఎంతో స్ఫూర్తిగా అనిపిస్తుంది. బాలయ్యను దృష్టిలో పెట్టుకొని కథ సిద్ధం చేసుకున్నారా? నేను కథ రాసుకుంటున్నప్పుడే బాలకృష్ణ గారు తప్ప మరెవరూ చేయలేరనే ఆలోచన నాలో కదిలేది. కొన్ని డైలాగ్స్ ఉంటాయి.. 'అధములం కాదు ప్రథములం' ఇలాంటి డైలాగ్ చెప్పాలంటే గంభీరంగా ఉండాలి. ఈ కథ ఆయనకు చెప్పడానికి వెళ్లినప్పుడు గంటలో చెప్పమన్నారు నేను రెండు గంటలు చెప్పాను. వినగానే ఆయన నోటి నుండి వచ్చిన మొదటి మాట చాలా బావుంది క్రిష్ అని.. ఆయన గనుక ఒప్పుకోకపోతే ఈ సినిమా ఇంత తొందరగా చేసేవాణ్ని కాదు. ఇంత తొందరగా సినిమాను ఎలా పూర్తి చేయగలిగారు? నేను సినిమా మొదలు పెట్టినప్పుడే పక్కా ప్రణాళికతో మొదలు పెట్టాను. ప్రతిదీ అనుకున్నట్లుగానే చేసుకుంటూ వచ్చాను. సినిమాను జనవరి 12న రిలీజ్ చేయాలని ముందే అనుకున్నాను. అదే రోజు నేషనల్ యూత్ డే కావడం, సంక్రాంతి కావడంతో ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నాను. అది డెడ్ లైన్ పెట్టుకొని సినిమా చేశాను. డ్రీమ్ విత్ డెడ్ లైన్. అంతా పక్కా ప్లానింగ్ వలన సినిమాను ఇంత తొందరగా పూర్తి చేయగలిగాను. బాహుబలి సినిమాతో పోలికలు వస్తాయనే భయం మీలో లేదా? బాహుబలి లాంటి సినిమాతో ఈ సినిమాను పోల్చి చూడకూడదు. ఎందుకంటే బాహుబలి సినిమా ఫాంటసీ.. శాతకర్ణి సినిమా చరిత్ర. బాహుబలి సినిమాలో హీరో నీటి కొండ మీదకు ఎక్కినప్పుడు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమాలో అలా చూపించలేం. ఇక్కడ జరిగింది చెప్పాలి. యానిమేషన్ జోలికి వెళ్లలేం. ఈ సినిమా కోసం ఎవరి సలహాలైనా తీసుకున్నారా? సాధారణంగా నా సినిమా కథలన్నీ రాజమౌళి గారికి వినిపిస్తాను. ఎక్కడ సమయం దొరికితే అక్కడ చెప్పేస్తూ ఉంటాను. అలానే ఈ సినిమా కథ కూడా చెప్పాను. ఈ సినిమా కోసం ఆయన నాకు రెండు ముఖ్యమైన సలహాలు ఇచ్చారు. అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కావాలంటే గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం వృథా చేయకుండా వీలైనంత రియల్ లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించమని చెప్పారు. అలానే మేము జార్జియాలో ఎక్కువ శాతం షూటింగ్ పూర్తి చేశాం. ఎక్కువగా గ్రాఫిక్స్ చేయలేదు. అలానే సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ ఆయనే ఫోన్ చేశారు. ఇప్పటినుంచి నువ్వు నిద్రపోకు.. ప్రతి క్షణం పని చేస్తూనే ఉండమని చెప్పారు. బాలకృష్ణ గారితో కలిసి పని చేయడం ఎలా అనిపించింది? ఆయన ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. జార్జియాలో ఆయన గుర్రాల స్వారీ చేస్తుంటే అక్కడ గుర్రాలకు ట్రైనింగ్ ఇచ్చే అతను ఆశ్చర్యపోయాడు. ఎంతోమంది హాలీవుడ్ యాక్టర్స్‌ను చూశాను కానీ గురాన్ని ఇంత బాగా స్వారీ చేసే వారిని చూడలేదని అన్నారు. డూప్ చేయించడానికి బాలయ్య అసలు ఒప్పుకోలేదు. కనీసం రోప్ అయినా కడతామంటే ఒప్పుకోలేదు. అదీ పని పట్ల ఆయనకుండే డెడికేషన్. సోషల్ మీడియాలో ఇద్దరి అగ్ర హీరోలను ట్రోల్ చేస్తున్నారు. దానిపై మీ స్పందన? కొందరు మూర్ఖాభిమానుల వల్ల ఇదంతా జరుగుతుంది. వారి వయసు పాతికేళ్లు కూడా ఉండవు. చిరంజీవి గారు 150 సినిమాలు చేశారు. బాలకృష్ణ గారు 100 సినిమాలు చేశారు. సినిమాల పట్ల వారి అంకిత భావం అలాంటిది. వారి అనుభవం ముందు ఇలా కామెంట్స్ చేసే వారి వయసు ఎంత..? ఈ సినిమా ఓపెనింగ్‌కు బాలయ్య దగ్గరుండి చిరంజీవి గారిని ఆహ్వానించారు. నన్ను కథ అడిగి తెలుసుకొని అప్రిషియేట్ చేశారు చిరంజీవి. ఓపెనింగ్ రోజు వచ్చి క్లాప్ కొట్టి సినిమా సక్సెస్ కావాలని దీవించారు. వారి దీవెనలు నిజం కావాలని కదా..? అభిమానులు కోరుకునేది. వారి అభిమాన హీరో మాటలు అబద్ధం కావాలని కోరుకుంటారా..? అసలు కులాల సంగతి వారికెందుకు. హీరోలు స్నేహపూర్వకంగానే ఉంటున్నారు. అందరూ ఆరోగ్యకరమైన వాతావరణాన్నే కోరుకుంటున్నారు. బాలయ్య 100వ సినిమా అనే టెన్షన్ ఏమైనా ఉందా? ఏ సినిమా అయినా గొప్పగా చేయాలనే అనుకుంటాం. బాలయ్య 100వ సినిమా అనే ఒత్తిడి నా మీద లేదు. మంచి సినిమాను ప్రేక్షకులకు చెప్పాలనే భావన మాత్రమే ఉంది. బాలకృష్ణ గారు ఆకలితో ఉన్న సింహంలా ఈ సినిమాలో నటించారు. తెలుగు వారికి నచ్చే విధంగా ఈ సినిమా చేశాననే అనుకుంటున్నాను. ఈ సినిమాను బాలీవుడ్‌లో ఎందుకు ప్రమోట్ చేయలేదు? నేను ఈ సినిమా మొదటి నుంచి తెలుగులో తీయాలనే అనుకున్నాను. సబ్ టైటిల్స్‌తో విడుదల చేస్తున్నా కాబట్టి అందరూ చూడొచ్చు. తల్లి పాత్రకు హేమమాలినిని ఎలా ఒప్పించారు? మొదట ఆమె కథ వినడానికి కూడా అంగీకరించలేదు. నాకున్న కాంటాక్ట్స్‌తో గంట సమయం తీసుకున్నాను. నేరేట్ చేస్తున్నప్పుడు ఆమె ప్రతి విషయానికి ఎగ్జైట్ అయ్యారు. తరువాత ఆమెనే ఈ సీన్ ఇలా చేస్తే బావుంటుంది క్రిష్ అని నాకు చెప్పారు. హమ్మయ్య ఆమె నటించడానికి ఒప్పుకున్నారు అనుకున్నాను. శివరాజ్ కుమార్ గారిని తీసుకోవడానికి కారణం? పాత్ర డిమాండ్ చేసింది. శాతకర్ణి చరిత్రను నాటకంగా చెప్పేప్పుడు ఒక పవర్‌ఫుల్ వ్యక్తి కావాలనుకున్నాను. శివరాజ్ కుమార్ అద్భుతంగా చేశారు. ఇంత పెద్ద సినిమాను ప్లాన్ చేసుకుని అదే సయంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇబ్బందిగా అనిపించలేదా? జీవితం కడు రమ్యమైనది. నా భార్య పేరు రమ్య(నవ్వుతూ). దీనికి మించి ఇంకేం చెప్పలేను. ఈ సినిమాకు సీక్వెల్ ‘వశిష్టిపుత్ర పులోమావి’ ఉంటుందా? పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా చేస్తాను.
0business
హెల్త్‌ప్లస్ ప్లాన్‌ను ప్రారంభించిన ఎల్‌ఐసి నాగ్‌పూర్ (ఏజెన్సీ)| PNR| Last Modified సోమవారం, 4 ఫిబ్రవరి 2008 (17:41 IST) భారతీయ బీమా సంస్థ (ఎల్ఐసి) తాజాగా హెల్త్ ప్లస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై ఎల్ఐసి నాగ్‌పూరి డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ పార్థ శామల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ఒక కుటుంబంలోని (భార్య, భర్త, పిల్లలు) అందరికీ ఆరోగ్య బీమాను కల్పించుకోవచ్చన్నారు. ఈ స్కీము కింద చేరే వినియోగదారులకు హాస్పిటల్ కాష్ బెనిఫిట్ (హెచ్‌సిబి), ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) సేవలతో పాటు.. మేజర్ ఆపరేషన్లు సేవలు పొందవచ్చని వెల్లడించారు. ఈ పథకంలో చేరే వారు 18 నుంచి 55 సంవత్సరాల లోపు వారై ఉండాలని, ఈ పథకం మెచ్యూరిటీ కాలపరిమితి 65 సంవత్సరాలని చెప్పారు. అంతేకాకుండా మూడు నుంచి 17 సంవత్సరాల లోపు చిన్నారులకు భీమా సౌకర్యం కూడా చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో డెత్ బెనిఫిట్ లేదన్నారు. సంబంధిత వార్తలు
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పవన్ కల్యాణ్ స్టోరీలో జూనియర్ ఎన్టీఆర్! పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టోరీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే... TNN | Updated: Oct 28, 2017, 11:39PM IST హీరోలకి వున్న ఇమేజ్, వారి ఫిజిక్‌, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకులు, రచయితలు కథలు రాసుకోవడం సర్వ సాధారణమే. కానీ అవే కథలు అదే హీరోలకి కచ్చితంగా నచ్చాలని రూల్ ఏమీ లేదు కదా! అటువంటప్పుడే ఒకరి కోసం రాసుకున్న స్టోరీకి మరొకరు హీరో అవుతారు. గతంలో అలా ఎన్నో సందర్భాల్లో జరిగింది కూడా. అయితే, గతం సంగతెలా వున్నా మొదటిసారిగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఇటీవల ప్రారంభమైన చిత్రం వెనుక కూడా ఇటువంటి కహానీయే వుందట. తాజాగా వినిపిస్తున్న ఫిలింనగర్ టాక్ ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా వాస్తవానికి జూనియర్ కోసం రాసుకున్న కథ కాదుట. అవును, పవర్ స్టార్ కోసం రాసుకున్న కథను పవర్ స్టార్‌కే వినిపిస్తే, ఆ స్టోరీని విన్న తర్వాత ఈ స్టోరీ తనకన్నా తారక్‌కి అయితేనే బాగా సూటవుద్ది అని చెప్పాడట పవన్. తనకి స్టోరీ సూట్ అవుతది, కాదు అనే సంగతిని కాసేపు పక్కనపెడితే.... ఆ స్టోరీ ఎవరికైతే బాగా సూటవుద్దో కూడా చెప్పేంత స్నేహపూరితమైన వాతావరణం సినీ ప్రముఖల మధ్య వుండటం గొప్ప విషయమే అంటున్నారు ఈ సంగతి తెలిసిన వాళ్లు. అన్నట్టు ఈ సినిమా లాంచ్ అయింది కూడా పవర్ స్టార్ చేతుల మీదుగానే అనే సంగతి తెలిసిందే కదా!!
0business
ముగిసిన శకం గుడ్‌బై చెపుతున్న ఆర్‌బిఐ గవర్నర్‌ ముంబై, సెప్టెంబరు 3: భారత్‌ ఆర్థిక వృద్ధి ఆందోళనకరంగా ఉన్న దశనుంచి స్థిరమైన పటిష్టమైన ఆర్థికవ్యవస్థగా రూపదాల్చేం దుకు తనవంతుగా కృషిచేసిన రాజన్‌ తన మూడేళ్ల పదవీ కాలంలో గణనీయంగా కొత్తకార్యాచరణ అమలుకు తెచ్చారు. ఈనెల 4వతేదీ ఆదివారంతో ఆయన పదవీకాలం ముగుస్తుం ది. రాజన్‌ ఆరవతేదీ విధుల నుంచి వైదొలుగుతున్నారు. తనకు అత్యంత ఇష్టమైన బోధనావృత్తికి వెళతానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన మూడేళ్ల పదవీకాలంలో ఎన్నో ఎగుడు దిగు డులను చవిచసారు. స్థూల ఆర్ధ్థికవ్యవస్థలో సవాళ్లు, పాలసీ విధానాలు, ఆర్థికపరిపుష్టి, ద్రవ్యవినిమయంలో లోపాలు వంటి వాటిని అరికట్టి ఆర్థిక వ్యవస్థను, ఆర్థికవిధానాలో స్థిరత్వం తెచ్చేందుకు కృషిచేసారనే చెప్పాలి. అన్నింటికంటే ముందు రాజన్‌ సలహాలు, సూచనలను ఎక్కువగా వినేందుకు ఇష్టపడ తారు. ఆయన పాలసీనిర్ణయాలు కూడా ఎక్కువగా విభిన్నరం గాలనుంచి వాదనలు విన్నతర్వాత మాత్రమే నిర్ణయాలుంటా యని బ్యాంకర్ల అభిప్రాయం. ఎస్‌బిఐ ముఖ్యఆర్ధికవేత్త సౌమ్య కాంతిఘోష్‌ మాట్లాడుతూ ఆయనకు ఉన్న వినే అలవాటే ఆయ న్ను ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆర్థికవేత్తగా తీర్చిదిద్దిందన్నారు. వడ్డీరేట్లు, మారకం విలువల రేట్లు, వడ్డీ రేట్లశ్లాబ్‌ల వంటి వాటిలో ను, ఆర్‌బిఐ ద్రవ్యవిధానంలోను విభిన్నరంగాల సలహాలు విన డం వల్ల ఎంతోమేలు జరుగుతుందని మేధావులు అభిప్రా యం. భారత్‌పరంగా ద్రవ్యోల్బణ లక్ష్యంగా పనిచేస్తున్న దేశమని ప్రధాన కర్తవ్యంద్రవ్యోల్బణం అదుపుచేయ డమేనని నిపుణుల అంచనా. రాజన్‌ తనకున్న పాలనా పటిమద్వారా ద్రవ్యోల్బణం కట్టడిచేసేం దుకు అవసరమైన కార్యాచరణను అమలుచేసా రని బ్యాంకర్లు చెపుతున్నారు. ఆర్ధ్థికరంగపరంగా ప్రతి ఒక్కరి అభిప్రాయాల స్వీకరణతో తనదైన మార్గంలో లక్ష్యసాధనకు కృషిచేశారని చెపుతు న్నారు. రాజన్‌ నాయకత్వంలో ఆర్‌బిఐ పట్టిమై న ఆర్థికవ్యవస్థను జాతికి అందించగలిగిందని, భవి ష్యత్‌ వృద్ధికి ఇదే కీలకం అవుతుందని నిపుణుల అంచనా. కొత్తవిధానాలకు రూపకల్పన, ద్రవ్యవిధాన ప్రణాళిక రూపొందించడం, బ్యాంకుల ఆస్తి అప్పుల పట్టీల ప్రక్షాళన, ప్రైవేటురంగంలో బ్యాంకుల ఏర్పాటుకు లైసెన్సులు జారీ, చిన్న మొత్తాల బ్యాంకులు, చెల్లింపుల బ్యాంకులకు లైసె న్సులు జారీచేయడం వంటివి బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక సంస్కరణలుగా చెప్పవచ్చు. అంతేకాకుండా అన్నింటికంటే యూనివర్సల్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌(యుపిఐ)పేరిట సమీకృత మొబైల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రత్యేక యాప్‌ను కూడా విడుదలచేయడంలో కీలకంగా పనిచేసారు. రాజన్‌ 2013 సెప్టెంబరునాల్గవ తేదీ బాధ్యతలు స్వీకరించేనాటికి రూపాయి మారకం విలువలు 63.8రూపాయలుగా ఉంది. ప్రస్తుతం 66.9రూపాయలుగా కొనసాగుతున్నది. ఆయన పాలనలో ఏడాది తర్వాత రూపాయిమారకం విలువలు 4.5శాతం పెరిగి 60.9రూపాయలకు చేరా యి. రాజన్‌ పగ్గాలుచేపట్టకముందు రూపాయి కనిష్ట స్థాయి అంటే ఒక డాలరుకు 68.85రూపాయలుగా కొనసాగింది. మూడేళ్ల కాలంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 91 బిలియన్‌ డాలర్లు పెరిగి 276 బిలియన్‌ డాలర్లనుంచి 367 బిలియన్‌ డాలర్లకు చేరాయి. గరిష్ట స్థాయినిల్వలు భారత్‌ దిగుమతులను 8.1 నెలల స్థాయినుంచి 12.4నెలలకు పెంచింది. రాజన్‌ హయాంలో ఆర్థికవ్యవస్థలో నగదును అందుబాటు లోనికి తెచ్చేందుకు మంచి చర్యలు తీసుకున్నారు. ఎల్‌ఎఎఫ్‌ను కుదించి కొత్తగా ఎంసిఎల్‌ఆర్‌ను అమలు లోనికి తెచ్చారు. ఇక చివరిగా ఆర్‌బిఐ ప్రైవేటురంగం లో లైసెన్సులు జారీచేసి సంచలనాలు సృష్టించింది. చిన్నబ్యాంకులు, చెల్లింపు బ్యాంకులతో ఈ రంగం మరింత వృద్ధినిఆశిస్తుంది. రాజన్‌ హయాంలో రెండు యూనివర్సల్‌ బ్యాంకులువచ్చాయి. ఐడిఎఫ్‌సిబ్యాంకు, బంధన్‌ బ్యాంకులు తమతమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆర్‌బిఐ పదిసంస్థలకు సూత్రప్రాయంగా చిన్నఫైనాన్స్‌బ్యాంకులు ఏర్పా టుకు లైసెన్సులు జారీచేసింది. అలాగే 11 పేమెంట్‌బ్యాంకుల కు కూడా లైసెన్సులు జారీచేసింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులను తగ్గించేందుకు ఆర్‌బిఐ సమీకృత ప్రణాళి కలను అమలుచేసింది. దీనివల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థలో కొంత ఒత్తిడి పెరిగింది. స్థూల ఎన్‌పిఎలు జూన్‌నాటికి 8.7శాతా నికి చేరాయి. అంతకుముందు ఏడాది 4.2శాతంనుంచి పెరిగాయి. సమస్యాత్మక ఆస్తులు బ్యాంకింగ్‌ వ్యవస్థలో చూస్తే 2013 సెప్టెంబరునాటికి మొత్తం అడ్వాన్సుల్లో 11.5శాతంగా ఉన్నా యి. ప్రస్తుతం డిసెంబరు చివరినాటికి 14.5శాతంగా నమోద య్యాయి. సమస్యాత్మక ఆస్తులు పెరగడంవల్ల బ్యాంకులు రుణ పరపతికి వెనుకంజవేస్తున్నాయి. అందువల్లనే రుణపరపతిలో వృద్ధినమోదుకాలేదు. 2013 అంతకుముందు 17-18శాతంగా ఉంది. డిపాజిట్లపరంగా చూస్తే రెండంకెల వృద్ధినుంచి 9శాతం దిగువకు చేరింది. రాజన్‌ తన హయాంలో రెపోరేట్లను ఐదు పర్యాయాలు తగ్గించారు. మరోమూడు పర్యాయాలు తన మూడేళ్లకాలంలోపెంచారు. గతంలో పనిచేసిన వైవిరెడ్డి, దువ్వూరి సుబ్బారావులతోపోలిస్తే రాజన్‌ కొంత సానుకూల వైఖరితోనే వ్యవహరించారని నిపుణుల అంచనా. గతంలో గవర్నర్ల వడ్డీ రేట్ల పెంపు, తగ్గింపులను పరిగణనలోనికి తీసుకుంటే ర
1entertainment
Hyderabad, First Published 3, Jul 2019, 2:14 PM IST Highlights నాగార్జున త్వరలో ఫెరఫ్యూమ్ కంపెనీ యజమానిగా కనిపించి అలరించనున్నారు.  నాగార్జున త్వరలో ఫెరఫ్యూమ్ కంపెనీ యజమానిగా కనిపించి అలరించనున్నారు. ఆ ఫెరఫ్యూమ్ కంపెనీలో ఆడవాళ్లకు మాత్రమే అనే ఎక్సక్లూజివ్ ఫెరఫ్యూమ్స్ దొరుకుతాయట. దాంతో ఎప్పుడూ అమ్మాయిలు, హడావిడితో కళకళ్లాడిపోతాడన్నమాట నాగ్. ఇంతకీ ఏ సినిమాలో ఇలా కనపడబోతున్నారు అంటారా..ఇంకే ప్రాజెక్టు మీరు ఎక్సపెక్ట్ చేసిందే మన్మధుడు 2.  సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న ఈ మన్మధుడు వరస ప్రాజెక్టులతో ఉన్నారు. వాటిల్లో మన్మధుడు 2 సినిమాపై అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన టీజర్, ట్రైలర్, న్యూ స్టిల్స్ సక్సెస్ అవటంతో దర్శక,నిర్మాతలు సైతం సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. దానికి తగినట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం జోరుగా సాగుతోంది. మన్మధుడు సినిమాలో ఒక పెర్ఫ్యూమ్ యాడ్ కోసం పని చేసిన నాగార్జున ఈసారి మన్మధుడు 2 లో పెర్ఫ్యూమ్ కంపెనీ కి ఓనర్ గా ఎంట్రీ ఇవ్వనున్నారనే విషయం అభిమానులను ఆనందంలో ముంచేస్తోంది. ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా మరొక పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు తెలుస్తుంది.  అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. Last Updated 3, Jul 2019, 2:14 PM IST
0business
షారుఖ్ కూతురు సుహానా వైరల్ హాట్ బికినీ పిక్ Highlights సుహానీ వైరల్ హాట్ బికినీ పిక్ తో యూత్ షేక్ అవుతున్నారు. స్టార్ హిరోయిన్లు, హీరోల పిల్లలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా ఎదగటం సర్వ సాధారణమే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాక అన్ని పరిశ్రమల్లోనూ.. స్టార్స్ పిల్లలు ఇలా వచ్చి సక్సెస్ కూడా సాధిస్తున్నారు. ఇక ఇటీవల సోషల్ మీడియా ప్రభావం ఎక్కువవటంతో ముఖ్యంగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ల పిల్లలంతా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ హాలిడే ట్రిప్స్, ఫ్రెండ్స్‌ తో కలిసి ఔటింగ్‌కు వెళ్లిన ఫోటోలు పోస్టు చూస్తూ.. ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బాద్ షా.. షారుక్ ఖాన్ కూతురు సుహానా కూడా స్విమ్మింగ్ ఫూల్‌లో బికినీలో జలకాలాడుతున్న ఫోటో పోస్టు చేసింది. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు సుహానా చాలా అందంగా ఉందని, షారుక్ ఖాన్‌కు మిర్రర్ ఇమేజ్‌లా ఉందనే కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో సుహానా ఖాన్ చేస్తున్న హడావుడి చూసిన కొందరు ఆమె త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సినీ తారల పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడుస్తూ ఇండస్ట్రీ వైపు రావడం సహజమే. మరి సుహానా తండ్రి దారిలో నటన వైపు వస్తుందా? తల్లి దారిలో డిజైనింగ్ వైపు వెళుతుందో. మొత్తానికి ఇప్పుడు మాత్రం సుహానా క్రేజీ గా మారిపోయింది. Last Updated 27, Mar 2018, 8:32 PM IST
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Hyderabad, First Published 1, Jul 2019, 5:16 PM IST Highlights 2.0 చిత్రం శంకర్ భారతీయుడు 2 తెరకెక్కించాలనుకున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఆ చిత్రం ఆగిపోయినట్లే కనిపిస్తోంది.  2.0 చిత్రం శంకర్ భారతీయుడు 2 తెరకెక్కించాలనుకున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఆ చిత్రం ఆగిపోయినట్లే కనిపిస్తోంది. నిర్మాతలు హ్యాండివ్వడంతో శంకర్ మరో చిత్రంపై దృష్టిపెట్టారు. అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ హీరోల వారసులతో శంకర్ ఈ భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  శంకర్ ఇద్దరు క్రేజీ హీరోల కుమారులపై కన్నేశాడట. విలక్షణ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్, ఇళయదళపతి విజయ్ తనయుడు జేసన్ హీరోలుగా శంకర్ ఈ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. శంకర్ కుర్ర హీరోలతో సినిమాలు చేయడం చాలా అరుదు.  గతంలో సిద్ధార్థ్ హీరోగా శంకర్ బాయ్స్ అనే చిత్రాన్ని రూపొందించారు. శంకర్ సినిమాల్లో వినోదంతో పాటు దేశభక్తికి సంబంధించిన సందేశం కూడా ఉంటుంది. ధృవ్, జేసన్ లతో శంకర్ ఎలాంటి చిత్రాన్ని రూపొందిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.  Last Updated 1, Jul 2019, 5:16 PM IST
0business
నీహారిక పెళ్లిపై స్పందించిన చిరు Highlights నీహారిక పెళ్లిపై స్పందించిన చిరు  ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు కొన్ని వేల పెళ్లి సంబంధాలు వచ్చాయట కానీ ప్రభాస్ స్పందించలేదని సమాచారం. ఇటీవల మెగా డాటర్ నీహారికకు, ప్రభాస్‌కు పెళ్లి అనే వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రస్తుతం నీహారిక తన కెరీర్‌పై ద‌ృష్టి పెట్టింది కాబట్టి రూమర్స్‌ని తక్షణమే ఆపేయండి అని వెల్లడించారు. అంతకు ముందు ప్రభాస్, అనుష్క మధ్య లవ్ అఫైర్ ఉందని.. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ ఇద్దరు స్టార్స్ ఈ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు.  Last Updated 10, Apr 2018, 12:02 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV లైంగిక వేధింపులకు గురవ్వని ఆడపిల్ల ఉండదేమో? హాలీవుడ్ నిర్మాత వెన్ స్టెయిన్ లైంగిక వేధింపుల విషయం ఓ నటి బయటపెట్టడంతో ఆయన భాగోతం బయటపడిన విషయం తెలిసిందే. TNN | Updated: Oct 16, 2017, 08:12PM IST తనకు తెలిసి ఏదో ఒక రకంగా లైంగిక వేధింపులకు గురవ్వని ఆడపిల్ల ఉండదనుకుంటానని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద అన్నారు. హాలీవుడ్ నిర్మాత వైన్‌స్టైన్ చేతిలో పలువురు నటీమణులను లైంగిక వేధింపులకు గురయ్యారంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఏంజెలినా జోలీ, రోస్ మెక్‌గోవెన్ లాంటి హాలీవుడ్ ప్రముఖ నటీమణులు కూడా ఇతగాడి బాధితులే. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా హాలీవుడ్ నటి అలిస్సా మిలానో ట్విట్టర్ ద్వారా ‘మీటూ’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రచారం ప్రారంభించింది. వేధింపులకు గురైన మహిళలు ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా తనకు ట్వీట్ చేయాలని కోరింది. ఈ సందర్భంగా గాయని చిన్మయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించి చేసిన ట్వీట్లను చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని చిన్మయి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. తన స్నేహితుల్లోని కొందరు అబ్బాయిలపై వారి కన్నా వయసులో పెద్దవారైన పురుషులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చదివిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. వేధింపులకు గురైన వారిలో మహిళలే కాదు, పురుషులు కూడా ఉన్నారనే విషయాన్ని చిన్మయి గుర్తుచేయడాన్ని నెటిజన్లు ప్రశంసించారు. The #MeToo hashtag is heartbreaking. And as real as it gets. I dont know one woman who hasnt been groped / leched at / sexual assaulted in some way. I also have friends, grown men now, who have been raped by older men. — Chinmayi Sripaada (@Chinmayi) October 16, 2017 ఈ కామాంధుడి బారిన ప‌డ‌కుండా బాలీవుడ్ న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్‌ను తాను కాపాడానంటూ ఆమె మాజీ టాలెంట్ మేనేజ‌ర్ సిమోనె షెఫీల్డ్ పేర్కోవడం గమనార్హం. ఐశ్వర్యతో ఒంటరిగా సమావేశం ఏర్పాటు చేయాల‌ని ఆమెను హార్వీ చాలా సార్లు కోరినట్లు తెలిపింది. అందుకు నేను అంగీకరించలేదని సిమోన్ తెలియ‌జేసింది.
0business
Karachi, First Published 19, Oct 2018, 8:39 AM IST Highlights పాకిస్థాన్ నిషేధిత క్రికెటర్, స్పిన్నర్ డానిష్ కనేరియా మ్యాచ్ తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని పాక్ క్రికెట్ బోర్డ్, అభిమానులు, దేశ ప్రజలను కోరుకుంటున్నానని.. దయ చేసి తనను క్షమించాలని వేడుకున్నాడు పాకిస్థాన్ నిషేధిత క్రికెటర్, స్పిన్నర్ డానిష్ కనేరియా మ్యాచ్ తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని పాక్ క్రికెట్ బోర్డ్, అభిమానులు, దేశ ప్రజలను కోరుకుంటున్నానని.. దయ చేసి తనను క్షమించాలని వేడుకున్నాడు.. ఆరేళ్ల నుంచి ఆబద్ధాలు చెబుతున్నాను.. ఇప్పుడు నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. నాకెంతో భారంగా ఉంది. అందుకే ఇప్పుడు నిజం చెబుతున్నా.. స్పాట్ ఫిక్సర్ అని తాను ఇక పిలిపించుకోలేను.. ఇక ఎంత మాత్రమూ ఖండించనూ లేను... బుకీ అనుభట్‌ను కలిసి పెద్ద తప్పు చేశా.. ఈ విషయాన్ని అధికారులకు చెప్పకుండా.. భారీ మూల్యం చెల్లించుకున్నా.. యువ ఆటగాళ్లు ఇలాంటి ఘోరమైన తప్పిదాలు చేయొద్దని వేడుకుంటున్నా అని కనేరియా మీడియాకు తెలిపాడు. కనేరియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది.. తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు.. 2010లో ఇంగ్లాండ్‌‌తో టెస్టు సందర్భంగా కనేరియా, సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్, మహ్మాద్ ఆమిర్ స్పాట్ ఫిక్సింగ్‌‌కు పాల్పడి ఐదేళ్ల పాటు నిషేధానికి గురై.. క్రికెట్‌కు దూరమయ్యారు. డానిష్ కనేరియా 61 టెస్టుల్లో 261 వికెట్లు తీశాడు Last Updated 19, Oct 2018, 8:39 AM IST
2sports
పరుగులే.. పరుగులు... - ఆర్‌బీఐ చర్యతో బ్యాంక్‌ షేర్ల దూకుడు -అనుకూలించిన ప్రపంచ మార్కెట్లు - రెండో రోజూ భారీగా పెరిగిన మార్కెట్లు - వరుస జోరుతో 1239 పాయింట్లు పెరిగిన బీఎస్‌ఈ సూచీ - మళ్లీ 24వేల మార్క్‌కు సెన్సెక్స్‌ ముంబయి : వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీని నమోదు చేశాయి. బ్యాంకుల మూలధనం సమీకరణలో ఆర్‌బీఐ నిబంధనల సులభతరం నేపథ్యంలో బ్యాంకింగ్‌ షేర్లకు మంచి మద్దతు లభించింది. మరోవైపు అంతర్జాతీయంగా ఏషియన్‌ మార్కెట్‌లలో షేర్లు రెండు మాసాల గరిష్ట స్థాయిలో ట్రేడింగ్‌ కావడం భారత మార్కెట్లకు మరింత విశ్వాసాన్ని ఇచ్చాయి. దేశ వృద్ధి రేటుపై సానుకూల సంకేతాలు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, రూపాయి పుంజుకోవడం తదితర అనుకూల అంశాల నేపథ్యంలో బుధవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 463.63 పాయింట్ల పెరిగి 24,242.98 పాయింట్లకు చేరింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 146.55 పాయింట్లు పెరిగి 7,368.85 వద్ద స్థిరపడింది. వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 1000 పాయింట్లు పెరిగినట్లయ్యింది. బ్యాంకులు మూలధనం సమీకరణను మరింత సులభతరం చేయడానికి నిబంధనల్లో మార్పులు చేయనున్నామని రిజర్వు బ్యాంక్‌ ప్రకటించడం బ్యాంకింగ్‌ షేర్లకు డిమాండ్‌ను పెంచింది. బ్యాంకుల పటిష్టతకు అందరూ సహకరించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ కోరడం ఈ సూచీలకు మరింత మద్దతునిచ్చింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకు నిఫ్టీ 4.71 శాతం ర్యాలీ చేసింది. ఎస్‌బీఐ అత్యధికంగా 12.56 శాతం రాణించి రూ.182.40 వద్ద ముగిసింది. బ్యాంకు ఆఫ్‌ ఇండియా 7.67 వాతం పెరిగి రూ.93.30 వద్ద, ఐసీఐసీఐ బ్యాంకు 7.59 శాతం వృద్ధితో రూ.220.50 వద్ద, పీఎన్‌బీ 7.54 శాతం రాణించి 79.20 వద్ద, కెనరా బ్యాంకు 7.48 శాతం ర్యాలీతో 177.35 వద్ద ముగిశాయి. బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, బ్యాంకింగ్‌, ఐటీి సూచీలు 5.05 శాతం, 4.92 శాతం, 2.49 శాతం చొప్పున అధిక లాభాలు నమోదు చేసుకున్నాయి. ఎఫ్‌ఎంసీజీ సూచీ 0.11 శాతం విలువ కోల్పోయింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.9 శాతం, 2.2 శాతం చొప్పున రాణించాయి. బీఎస్‌ఈలో ఎసబీఐ, ఐసీఐసీఐ బ్యాంకుతో సహా అదాని పోర్ట్స్‌ 5.96 శాతం, హీరో మోటో కార్ప్‌ 4.99 శాతం, భెల్‌ 4.91 శాతం చొప్పున అధికంగా పెరిగిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఏడు వారాల గరిష్టానికి రూపాయి.. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పైసలు పుంజుకుని ఏడు వారాల గరిష్ట స్థాయికి చేరింది. విదేశీ నిధుల రాకకు తోడు బ్యాంకులు, ఎగుమతిదార్లు డాలర్ల అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపధ్యంలోనే రూపాయి విలువ 31 పైసలు లేదా 0.46 శాతం పటిష్టమై 67.54 వద్ద నమోదయ్యింది. రోజంతా 67.53-67.77 మధ్య ట్రేడింగ్‌ అయ్యింది. 2016 జనవరి 14 రూపాయి విలువ ఈ స్థాయిలో 67.29 వద్ద నమోదయ్యింది. వరుసగా క్రితం నాలుగు సెషన్లలో 118 పైసలు పుంజుకుంది. మరికొన్ని రోజులు ఈ ర్యాలీ కొనసాగుతందని విశ్లేషకులు చెబుతున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కెప్టెన్సీ అవకాశం మళ్లీ వస్తుందో రాదో..? కెప్టెన్సీ‌లో ఒత్తిడి ఉన్నా.. తాను మైదానంలో ఆ హోదాని ఎంజాయ్ చేస్తున్నట్లు భారత్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. శ్రీలంకతో TNN | Updated: Dec 23, 2017, 08:09PM IST కెప్టెన్సీ అవకాశం మళ్లీ వస్తుందో రాదో..? కెప్టెన్సీ‌లో ఒత్తిడి ఉన్నా.. తాను మైదానంలో ఆ హోదాని ఎంజాయ్ చేస్తున్నట్లు భారత్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్‌ వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరగనున్న నేపథ్యంలో శనివారం రాత్రి రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి పేరుతో పక్కకి తప్పుకోగా.. జట్టు పగ్గాలని సెలక్టర్లు రోహిత్ శర్మకి అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డే సిరీస్‌ని రోహిత్ సారథ్యంలో భారత్ జట్టు 2-1తో చేజిక్కించుకోగా.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
2sports
dlf 63% దిగజారిన డిఎల్‌ఎఫ్‌ అమ్మకాలు న్యూఢిల్లీ,మే 30: రియాల్టీరంగ మేజర్‌సంస్థ డిఎల్‌ ఎఫ్‌ నికర అమ్మకాలు 63శాతం దిగజారి 1160 కోట్లకు తగ్గాయి. ఈ ఆర్థికసంవత్సరంలో డిమాండ్‌ తగ్గడంతో స్థిరాస్తిమార్కెట్‌ పరంగా డిఎల్‌ఎఫ్‌ వృద్ధి ని సాధించలేకపోయింది. మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితపరిస్థితులే కారణమని స్పష్టం అవుతోంది. జులైనుంచి జిఎస్‌టి అమలుకు రావడం, కొత్తగా రెరా చట్టం అమలుకురావడం వంటిఅంశాలు కొంత రియాల్టీసంస్థలకు ప్రతికూలత తెచ్చాయి. డిఎల్‌ఎఫ్‌ అంచనాలప్రకారం వచ్చే నాలుగైదు త్రైమాసికాల్లో సాధారణ పరిస్థితికి వస్తుందని చెపుతోంది. స్థూలం గా బుకింగ్స్‌ 2100 కోట్లుగా ఉన్నాయి. రద్దుచేసు కోవడం లేదాఅప్‌గ్రేడేషన్‌ వంటివి 940 కోట్లుగా ఉంటే నికరంగా బుకింగ్స్‌ 1160 కోట్లుగా మాత్రమే ఉన్నట్లు తేలింది. నికర అమ్మకాలు 3150 కోట్లుగా ఈ రంగంలో ఉన్నాయని డిఎల్‌ఎఫ్‌ వెల్లడించింది. కంపెనీ గత ఏడాది 14.5 మిలియన్‌ల చదరపు అడుగుల స్థలంలో ప్రాజెక్టులు పూర్తిచేసింది. పెద్ద నోట్లు రద్దుతో వినియోగదారుల సెంటిమెంట్‌ కొంత దెబ్బతిన్నదని ప్రాథమిక మార్కెట్లలో ఇకపై పెరిగే అవకాశం ఉందని, అలాగే సెకండరీరీసేల్‌ మార్కెట్ల లో కూడా వృద్ధి కనిపిస్తుందని అన్నారు. నాలుగు నుంచి ఆరు త్రైమాసికాలకు సాధారణపరిస్థితి రావ చ్చని కంపెనీ చెపుతోంది. డిఎల్‌ఎప్‌ అంచనాల ప్రకారం రియాల్టీరంగం రానున్న కాలంలో సరఫరా పెరిగి తక్కువ డిమాండ్‌తో సతమతం అయ్యే ప్రమాదం లేకపోలేదని అంచనా వేసింది. రెరా అమలు వల్ల దీర్ఘకాలంలో ప్రభావంచూపిస్తుందని, స్వల్పకాలంలో కొంత నష్టమేనని అంచనావేసింది. అలాగే జిఎస్‌టి పన్ను అమలు కూడా కొంత దీర్ఘ కాలంలో సానుకూలత ఉంటుందని, అయితే అమలులో కొన్ని సవాళ్లు తప్పవని డిఎల్‌ఎఫ్‌ ప్రక టించింది. ముందు ప్రాజెక్టులను పూర్తిచేయడంపై దృష్టిపెట్టామని, డిమాండ్‌ పెరిగిన వెంటనే విక్ర యాలపై దృష్టిసారిస్తామని చెపుతోంది. అమ్మకాల వాయిదా వల్ల రాబడులు వచ్చే రెండు, మూడు త్రైమాసికాల్లోదెబ్బతింటాయి.మూలధన వ్యయం పెరుగుతుందని అంచనా. దీనివల్ల సంస్థకు ఉన్న రుణభారం మరికొంత పెరుగుతుందని అంచనా వేసింది.కంపెనీ నికరరుణం సుమారుగా జనవరి -మార్చి త్రైమాసికంలో 700 కోట్లు పెరిగి 25,096కోట్లకుచేరింది. గతవారంలో డిఎల్‌ఎఫ్‌ నికరలాభం 135.63 కోట్లుగా ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 2511.37 కోట్లు నష్టంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను నికరలాభం 694.17 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది 331.95 కోట్లు ఆర్జించింది. మొత్తం రాబడులు కూడా 16శాతం తగ్గి 8940.51కోట్లకు చేరాయి. అదే గత ఏడాది 10,597.04 కోట్లుగా ఉన్నాయి.
1entertainment
Hyderabad, First Published 2, Mar 2019, 3:38 PM IST Highlights హీరోగా వంద సినిమాలకు పైగా సినిమాలు చేసిన బాలకృష్ణ తన కెరీర్ లో సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. గతంలో నిర్మాతగా సినిమాలు చేయాలనుకున్నప్పటికీ కుదరలేదు. ఎట్టకేలకు తన తండ్రి బయోపిక్ తో నిర్మాతగా మారాడు బాలకృష్ణ. హీరోగా వంద సినిమాలకు పైగా సినిమాలు చేసిన బాలకృష్ణ తన కెరీర్ లో సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. గతంలో నిర్మాతగా సినిమాలు చేయాలనుకున్నప్పటికీ కుదరలేదు. ఎట్టకేలకు తన తండ్రి బయోపిక్ తో నిర్మాతగా మారాడు బాలకృష్ణ. ప్రీరిలీజ్ బిజినెస్ డెబ్బై కోట్ల వరకు జరగంతో సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాకి కనీసం ఏవరేజ్ టాక్ కూడా రాలేదు. లాభాల సంగతి పక్కన పడితే కనీసపు వసూళ్లు లేక బయ్యర్లు బోరుమంటున్నారు. ఈ క్రమంలో బాలయ్య తన బ్యానర్ పై సినిమాలు చేసే ఆలోచనను పక్కన పెట్టినట్లు సమాచారం.  బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేయాలనుకున్న సినిమాను మొదట బాలయ్య ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ పై తీయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం నిర్మాతను వెతికే పనిలో పడ్డారు.  నిర్మాతగా తొలి సినిమా దెబ్బ కొట్టడంతో బాలయ్య ఇప్పట్లో నిర్మాతగా సినిమాలు కంటిన్యూ చేయాలనుకోవడం లేదట. మరి బాలయ్య పూర్తిగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటారా లేదా..? అనే విషయంపై అధికార ప్రకటన రావల్సివుంది.  Last Updated 2, Mar 2019, 3:38 PM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Sensex Today: భారీ న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు ఒక్క రోజు లాభాల బాట ప‌ట్టిన దేశీయ మార్కెట్లు అంత‌లోనే ఉసూరుమ‌నిపించాయి. బుధ‌వారం ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా నేలచూపులకే పరిమితమయ్యాయి Samayam Telugu | Updated: May 23, 2018, 05:17PM IST Sensex Today: భారీ న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు ఒక్క రోజు లాభాల బాట ప‌ట్టిన దేశీయ మార్కెట్లు అంత‌లోనే ఉసూరుమ‌నిపించాయి. బుధ‌వారం ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా నేలచూపులకే పరిమితమయ్యాయి. చివరి గంటన్నరలో అమ్మకాలు ఊపందుకోవడంతో చివరికి భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 304 పాయింట్లు క్షీణించి 34,347 వద్ద నిలవగా.. నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 10,429 వద్ద స్థిరపడింది. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టపోగా.. ఆసియా, యూరప్‌ మార్కెట్లు సైతం తిరోగమన దిశ‌గా పయ‌నించ‌డంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెప్పారు. దీనికితోడు రూపాయి ఏడాదిన్నర కనిష్టం 68.28ను తాకడం కూడా ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు తెలియజేశారు.పెట్రోలియం ఉత్ప‌త్తుల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతుండ‌టం కూడా భార‌త మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణ‌మై ఉండొచ్చ‌ని బ్రోక‌ర్లు చెబుతున్నారు. ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఆసీస్‌‌కి షాక్.. టీ20‌ సిరీస్‌కి స్మిత్‌ దూరం భారత్‌తో ఇప్పటికే వరుస ఓటములతో ఢీలాపడిన ఆస్ట్రేలియా జట్టుకి షాకింగ్ న్యూస్. శనివారం రాంచీ వేదికగా మరికొద్దిసేపట్లో TNN | Updated: Oct 7, 2017, 02:59PM IST భారత్‌లో ఇప్పటికే వరుస ఓటములతో ఢీలాపడిన ఆస్ట్రేలియా జట్టుకి షాకింగ్ న్యూస్. శనివారం రాంచీ వేదికగా మరికొద్దిసేపట్లో తొలి టీ20 మ్యాచ్ ఆరంభంకానుండగా.. కెప్టెన్ స్టీవ్‌స్మిత్ గాయం కారణంగా ఏకంగా టీ20 సిరీస్‌ నుంచే తప్పుకున్నాడు. గత ఆదివారం నాగ్‌పూర్ వేదికగా జరిగిన చివరి వన్డేలో బంతిని ఆపేందుకు స్టీవ్‌స్మిత్ డైవ్ చేయగా.. అతని కుడి భుజానికి గాయమైంది. అయితే.. మ్యాచ్ ముగిసే వరకూ అలానే నొప్పితో ఫీల్డింగ్ చేసిన ఈ కెప్టెన్.. గత రెండు రోజుల నుంచి ప్రాక్టీస్‌కి దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా జట్టు డాక్టర్, ఫిజియో సూచన మేరకు సిరీస్‌ నుంచి స్మిత్ తప్పుకుంటున్నట్లు ‘క్రికెట్ ఆస్ట్రేలియా’ అధికారికంగా ప్రకటించింది. దీంతో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకి సారథ్యం వహించనున్నాడు. స్మిత్ స్థానంలో జట్టులోకి స్టాయినిస్‌కి అవకాశం ఇచ్చారు. ‘నాగ్‌పూర్ వన్డేలో స్మిత్ ప్రమాదకరంగా డైవ్ చేశాడు. దీంతో అతని కుడి భుజానికి గాయమైంది. చికిత్సలో భాగంగా ఎమ్ఆర్ఐ స్కాన్ తీశాం. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదం లేదు. కానీ.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అతడికి టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతినివ్వాలని నిర్ణయించాం’ అని జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. నవంబరులో ఇంగ్లాండ్‌తో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో స్టీవ్‌స్మిత్‌కి ఆస్ట్రేలియాలో మెరుగైన చికిత్స అందజేయనున్నట్లు జట్టు బోర్డు వివరించింది. ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌‌ని ఆస్ట్రేలియా 1-4తేడాతో చేజార్చుకున్న విషయం తెలిసిందే. శనివారం రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ ఆరంభకానుంది.
2sports
Today Gold Rate: పండుగ షాక్.. భారీగా పెరిగిన వెండి.. బంగారం ధరదీ ఇదే దారి! Samayam Telugu| Oct 25, 2019, 07.08 AM IST పసిడి ధర మళ్లీ పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.39,970కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.36,640కు చేరింది. పసిడి ధర ధర పెరిగితే.. వెండి ధర భారీగా పరుగులు పెట్టింది. ఏకంగా రూ.670 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,770కు చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,600 వద్దనే నిలకడగా ఉంది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా ఉంది. దీంతో ధర రూ.37,400 వద్దనే కొనసాగుతోంది. Also Read: భారీగా పడిపోయిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర! బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. కేజీ వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. రూ.670 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,770కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. Also Read: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? మీకోసం అదిరిపోయే దీపావళి ఆఫర్లు.. రూ.15,000 క్యాష్‌బ్యాక్! అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.02 శాతం క్షీణతతో 1,504.35 డాలర్లకు దిగొచ్చింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.22 శాతం పెరుగుదలతో 17.84 డాలర్లకు చేరింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. Also Read: రూ.10,000కు రూ.10 వేలు.. రూ.50,000కు రూ.50 వేలు.. ఇక్కడ మీ డబ్బు రెట్టింపు! బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV క్రీడాకారులే దేశంలో వీఐపీలు: రాజ్యవర్ధన్ దేశంలో క్రీడాకారులు మాత్రమే వీఐపీలుగా ఉండాలని నూతన క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ అభిప్రాయపడ్డారు. TNN | Updated: Sep 4, 2017, 07:09PM IST దేశంలో క్రీడాకారులు మాత్రమే వీఐపీలుగా ఉండాలని నూతన క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆదివారం రాజ్యవర్ధన్‌కి క్రీడల శాఖని అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో విజయ్ గోయల్ నుంచి సోమవారం బాధ్యతలు స్వీకరించిన రాజ్యవర్ధన్ మీడియాతో మాట్లాడారు. దేశం తరపున క్రీడల్లో ప్రాతినిథ్యం వహించేవారికి సౌకర్యాలను కల్పించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని నూతన మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఏథెన్స్ ఒలింపిక్స్‌లో డబుల్ ట్రాప్ (షూటింగ్ విభాగం)లో రాజ్యవర్ధన్ రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే. ‘దేశంలో ఒక్కరే వీఐపీలు ఉన్నారు. అది క్రీడాకారులే. అలా ప్రజల మనస్తత్వం మారాలి. క్రీడల మంత్రిత్వ శాఖలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా క్రీడాకారుల్ని చూసే కోణం మారాలి. పాఠశాల, కాలేజీల్లో క్రీడలకి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఆటలను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌లానే చూస్తున్నారు. కానీ.. క్రీడల కోసం తమ జీవితాన్ని ధారపోసేలా యువ క్రీడాకారుల్ని స్ఫూర్తివంతంగా తయారు చేయాలి. ప్రతి రాష్ట్రం ప్రతిభ ఉన్న క్రీడాకారుల్ని పంపిస్తే.. వారికి తగిన సౌకర్యాలు క్రీడల మంత్రిత్వ శాఖ కల్పించి శిక్షణ ఇస్తుంది. ఇలా క్రీడాకారులకి సౌకర్యాలు కల్పించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా’ అని రాజ్యవర్ధన్ రాథోడ్ వెల్లడించారు.
2sports
Hyderabad, First Published 9, Oct 2018, 4:35 PM IST Highlights బలవంతంగా మద్యం తాగించి తనను రేప్ చేశాడని ఆమె పేర్కోన్నారు. కాగా.. ఈ ఆరోపణలపై అలోక్ నాథ్ విచిత్రంగా స్పందించాడు. బాలీవుడ్ లో మీటూ ఉద్యమం రోజురోజుకి ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు అలోక్ నాథ్ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా ఆరోపించారు. బలవంతంగా మద్యం తాగించి తనను రేప్ చేశాడని ఆమె పేర్కోన్నారు. కాగా.. ఈ ఆరోపణలపై అలోక్ నాథ్ విచిత్రంగా స్పందించాడు. ఆరోపణలపై ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..‘ ఈ వ్యాఖ్యలను నేను ఖండించవచ్చు. అలాగే అంగీకరించవచ్చు. రేప్‌ కూడా జరిగి ఉండవచ్చు కానీ వేరేవాళ్లేవరో చేసి ఉండొచ్చు. ఈ వ్యాఖ్యలపై నేను అంతగా మాట్లాడకపోవడమే నాకు మంచిది. ఎక్కవగా మాట్లాడితే ఈ విషయం ఇంకా విస్తరిస్తోంది. ఒకానొక సమయంలో ఆమె నాకు మంచి స్నేహితురాలు. కానీ ఇప్పుడు పెద్ద సమస్యగా మారారు. ఆమె ఆరోపణలపై స్పందించడమే ఓ పిచ్చి చర్య. ప్రస్తుత రోజుల్లో ప్రపంచం ఎలా తయారైందంటే ఆడవారేది చెబితే అదే నమ్మెస్తున్నారు. వారు మాట్లాడేది అబద్దమైనా పరిగణలోకి తీసుకుంటున్నారు.’ అని పేర్కొన్నారు.  read more news
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Sydney Test: ఇషాంత్ ఔట్, అశ్విన్ డౌట్.. 13 మందితో కూడిన జట్టు ప్రకటన సిడ్నీ టెస్ట్ కోసం బీసీసీఐ 13 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఇషాంత్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్‌‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యపర్చింది. చివరి టెస్టులో అశ్విన్ ఆడటం అనుమానంగా మారింది. Samayam Telugu | Updated: Jan 2, 2019, 12:08PM IST Sydney Test: ఇషాంత్ ఔట్, అశ్విన్ డౌట్.. 13 మందితో కూడిన జట్టు ప్రకటన హైలైట్స్ సిడ్నీ టెస్టు కోసం 13 మందితో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ ఇషాంత్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్ అశ్విన్‌ను ఎంపిక చేసినా ఆడేది అనుమానమే, 13 మందిలో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు. సిడ్నీ టెస్టు కోసం 13 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఫామ్‌లో ఉన్న ఇషాంత్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్‌కు స్థానం కల్పించారు. కుమార్తెను చూడటం కోసం ముంబై వచ్చిన రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్‌కు పిలుపునిచ్చిన సెలక్టర్లు.. కుల్దీప్ యాదవ్‌కు అవకాశం కూడా కల్పించారు. ఫిట్‌నెస్ నిరూపించుకోవడంలో ఇబ్బంది పడుతోన్న అశ్విన్‌ను కూడా సిడ్నీ టెస్టుకు ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించింది. జట్టు ప్రకటనకు ముందు అశ్విన్ తుది టెస్టుకు దూరమైనట్టు మీడియా మేనేజర్ ప్రకటించారు. కానీ అంతలోనే అశ్విన్ పేరు 13 మంది ఆటగాళ్ల జాబితాలో ఉండటం గమనార్హం. గతేడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేస్ త్రయంలో ఒకడిగా నిలిచిన ఇషాంత్ శర్మ పక్కటెముకల గాయం కారణంగా చివరి టెస్టుకు దూరమైనట్టు తెలుస్తోంది. అశ్విన్‌‌కు తుది జట్టులో స్థానం కల్పించే విషయమై గురువారం ఉదయం నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ట్విట్టర్‌లో పేర్కొంది. 13 మందితో కూడిన జట్టులో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉండటం గమనార్హం. India name 13-man squad for SCG Test: Virat Kohli (C), A Rahane (VC), KL Rahul, Mayank Agarwal, C Pujara, H Vihari,… https://t.co/YTneu28dHy — BCCI (@BCCI) 1546398562000 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, అశ్విన్.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఒకీఫ్‌ వ్యాఖ్యలకు కోహ్లి కౌంటర్ మెల్‌బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్‌ గురించి ఆసీస్ కామెంటేటర్ ఒకీఫ్ అవహేళనగా మాట్లాడిన సంగతి తెలిసిందే. మయాంక్ దేశవాళీలో తన ట్రిపుల్ సెంచరీని రైల్వేస్ లాంటి జట్టుపై చేసి ఉంటాడని వ్యాఖ్యానించాడు. Samayam Telugu | Updated: Dec 31, 2018, 08:57AM IST ఒకీఫ్‌ వ్యాఖ్యలకు కోహ్లి కౌంటర్ హైలైట్స్ మా విజయాలకు కారణం ఫస్ట్ క్లాస్ క్రికెటే కారణమంటున్నాడు కోహ్లి బుమ్రా లాంటి మేటి బౌలర్‌ను అందించిన ఘటన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌దే ఆసీస్ కామెంటేటర్ ఒకీఫ్‌పై వ్యాఖ్యలకు కోహ్లి కౌంటర్ బుమ్రా లాంటి మేటి బౌలర్‌ భారత్‌కు లభించడం తమ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ గొప్పతనమని టీమిండియా సారథి విరాట్ కోహ్లి అన్నారు. మెల్‌బోర్న్ టెస్టులో గెలుపుకు కచ్చితంగా తమ దేశవాళీ క్రికెట్ గొప్పతనమే కారణమని విరాట్ అన్నాడు. విదేశాల్లో ఎదురయ్యే సవాళ్లను ఫాస్ట్ బౌలర్లు ధీటుగా ఎదుర్కొనేలా తమ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ విధానాలు ఎంతగానో మేలు చేస్తున్నాయని మ్యాచ్ అనంతరం కోహ్లి పేర్కొన్నాడు.
2sports
Suresh 144 Views G S T G S T న్యూఢిల్లీ: జీఎస్టీ కింద తొలి రిటర్న్‌ దాఖలు చేయని వారికి ఫైన్‌ విధించాలన్న జీఎస్టీ కౌన్సిల్‌ సూచనను ప్రభుత్వం జూలై నెలకు రద్దు చేసింది. గడువులోపు రిటర్న్‌ దాఖలు చేయనివారికి రోజుకు రూ.200 చోప్పున రుసుము విధించాలని జీఎస్టీ కౌన్సిల్‌ సిఫార్సు చేసింది. జూలై నెలకు జీఎస్టీని రద్దు చేసింది. జూలై నెలకు సంబంధించి ఆగస్టు 25 నాటికి దాఖలు చేయాల్సిన జీఎస్టీఆర్‌-3బిలో జాప్యంపై అపరాధ రుసుము మాత్రమే రద్దు చేశాం. చెల్లించాల్సిన పన్ను మొత్తానికి వడ్డీ మాత్రం కొనసాగుతుంది అని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం పేర్కొంది. లోగడ ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ గడువులోగా జీఎస్టీ రిటర్న్‌ దాఖలు చేయకపోతే రోజుకు రూ.200 అపరారధ రుసుము విధిస్తామన్నారు. దీనిలో 100 సెంట్రల్‌ జీఎస్టీ కింద, రూ.100 స్టేట్‌ కింద విధిస్తామని తెలిపారు. జూలౌ నెలకు సంబంధించి 59లక్షల మంది రిటర్న్‌ దాఖలు చేయాల్సి ఉండగా కేవలం 38లక్షలు మంది మాత్రమే దాఖలు చేయడం గమనార్హం.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV వేధింపుల కేసులో బుక్కైన శ్రీను వైట్ల డైరెక్టర్ శ్రీను వైట్ల గృహహింస కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. | Updated: Oct 26, 2015, 09:56PM IST బహుషా చూడబోతే డైరెక్టర్ శ్రీను వైట్లకి చాలా బ్యాడ్ టైమ్ రన్ అవుతున్నట్లుంది. మొన్నటికి మొన్న ఆయన డైరెక్ట్ చేసిన బ్రూస్ లీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడియెన్స్‌ని మెప్పించలేకపోగా తాజాగా ఆయనే ఏకంగా ఓ పోలీసు కేసులో బుక్ అయ్యాడు. కేసు పెట్టింది కూడా ఎవరో కాదు.. స్వయంగా ఆయన భార్య సంతోషి రూపనే. తన భర్త శ్రీను వైట్ల తనని మానసికంగా వేధిస్తున్నాడని బంజారాహిల్స్ పోలీసులకి ఫిర్యాదు చేసింది సంతోషి రూప. ఆమె ఫిర్యాదు మేరకి బంజారాహిల్స్ పోలీసులు సెక్షన్ 498ఏ కింద శ్రీను వైట్లపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దూకుడు సినిమాలో సమంతకి, బాద్‌షా సినిమాలో కాజల్ అగర్వాల్‌కి కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేసిన అనుభవం వుంది.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఆ ఫెయిల్యూర్స్ ధావన్‌ని రాటుదేల్చాయా..? శ్రీలంక బౌలర్లని వారి సొంతగడ్డపైనే బ్యాట్‌తో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ చెడుగుడు ఆడుకుంటున్నాడు TNN | Updated: Aug 21, 2017, 02:42PM IST శ్రీలంక బౌలర్లని వారి సొంతగడ్డపైనే బ్యాట్‌తో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండు శతకాలు బాదిన ధావన్.. ఆదివారం ముగిసిన తొలి వన్డేలో శతకంతో టీమిండియాకి ఒంటిచేత్తో విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ధావన్ రెండో వికెట్‌కి అజేయంగా 197 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 217 పరుగుల లక్ష్యఛేదనని భారత్‌ కేవలం 28.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించేసింది. ఈ సుదీర్ఘ సిరీస్‌లో శతకాల మోత మోగిస్తున్న శిఖర్‌ని ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు. కానీ.. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభం వరకూ శిఖర్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. దీంతో దాదాపు ఆరు నెలల పాటు టీమిండియాకి ధావన్ దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ.. ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటనల్లో భీకర ఫామ్‌తో దుమ్మురేపిన ఈ గబ్బర్ ఇప్పుడు లంక బౌలర్లకి కొరకారని కొయ్యగా మారాడు.
2sports
May 24,2015 కేసీఆర్‌ గ్రామంలో ఎస్‌బీహెచ్‌ హైదరాబాద్‌: పేదలకు చేరవవుతూ వ్యాపారాన్ని విస్తరించుకొంటున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) గ్రామీణ ప్రాంతాలల్లోనూ తమ శాఖలను తెరుస్తోంది. బ్యాంకు తాజాగా మెదక్‌ జిల్లా, సిద్ధిపేట మండలంలోని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌) స్వగ్రామం చింతమడక గ్రామంలో ఎస్‌బీహెచ్‌ శాఖను తెరిచింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఠమంత్రి టి.హరీష్‌రావు కొత్త ఎస్‌బీహెచ్‌ శాఖను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎస్‌బీహెచ్‌ సీజీఎం (ఆర్‌బీ) విశ్వనాథన్‌, దేవేంద్ర కుమార్‌, జనరల్‌ మేనేజర్‌ (హైదరాబాద్‌ నెట్‌వర్క్‌) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ వారికి ఆర్థిక సేవలను అందించాలనే సదుద్దేశంతో ముందుకు సాగుతున్న ఎస్‌బీహెచ్‌ సేవలను పలువురు ఈ సందర్భంగా ప్రశంసించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
"ఫిదా" పోరి సాయిపల్లవికి నాలుగేళ్ల పాప.. కన్ఫమ్ Highlights ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన మళయాల ముద్దుగుమ్మ తమిళనాట నాలుగేళ్ల పాపతో ఎంట్రీ ఇస్తున్న ఫిదా పోరి ఫిదా మూవీలో భానుమతి.. హైబ్రిడ్ పిల్ల.. ఒక్కటే పీస్.. అంటూ  తెలుగు ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసేసింది మలయాళ బ్యూటీ సాయిపల్లవి. తెలంగాణ యాసలో అదరగొట్టేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల లిస్ట్‌ లో ఫిదా మూవీ నిలవటంలో కీలక పాత్ర పోషించింది. అటు ప్రేమమ్ మూవీతో మలయాళ ప్రేక్షకుల్ని, ఇటు ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు తమిళ తంబీలను ఫిదా చేయడంపై ఫోకస్ పెట్టింది. నిజానికి మణిరత్నం ‘కాట్రు వెలియిడై’ సినిమాతో కోలీవుడ్‌ ఆరంగేట్రం చేసే అవకాశం వచ్చినా చివర్లో చేజారింది. తరువాత విక్రమ్ ‘స్కెచ్’ మూవీలోనూ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. తాజాగా ప్రముఖ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ చెప్పిన కథతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది సాయి పల్లవి. అయితే ఈ కథ దశాబ్దాలుగా భారతీయ సమాజంలో స్త్రీ ప్రధాన సమస్యల్లో ఒకటిగా ఉన్న అబార్షన్ల నేపథ్యంతో ‘కరు’ అనే వైవిద్యభరిత కథను తెరకెక్కించారు దర్శకుడు. ఈసినిమాలో సాయి పల్లవి పాత్ర డీ గ్లామర్ లుక్‌తో వినూత్నంగా ఉంటుందని.. సాయిపల్లవి నాలుగేళ్ల పాపకి తల్లిగా నటించిందని ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు దర్శకుడు ఏఎల్‌ విజయ్‌. ఇది చాలెంజింగ్ పాత్ర అని ఈ రోల్‌‌కు సాయి పల్లవి 100% న్యాయం చేసిందని మలయాళం, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా పేరొందుతున్న సందర్భంలో ఇలాంటి రోల్ చేయడం సాహసమే అన్నారాయన. ‘కరు’ సినిమాతో సొసైటీకి మంచి మెసేజ్‌ను ఇస్తున్నామని అబార్షన్ల నేపథ్యంతో తల్లి, నాలుగేళ్ల కూతురు మధ్య అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాము. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌ ని కంప్లీట్ చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  మొత్తానికి గ్లామర్ రోల్స్‌ ‌కు మాత్రమే హిరోయిన్స్ పరిమితమైపోతున్న ఈ రోజుల్లో సాయి పల్లవి ‘కరు’ లాంటి మూవీలో నటించి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. Last Updated 25, Mar 2018, 11:46 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఢిల్లీలో ఐపీఎల్ పాలక మండలి భేటీ ఐపీఎల్ పాలక మండలి సమవేశం మంగళవారం ఢిల్లీలో జరిగింది. TNN | Updated: Dec 8, 2015, 01:49PM IST ఐపీఎల్ పాలక మండలి సమవేశం మంగళవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమవేశంలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ, మ్యాచ్ ఫిక్సింక్ నిరోధించడాని చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఆటగాళ్ల కొనుగోలు సమయంలో అనుసరించాల్సిన పద్దతిపై చర్చ నడిచింది. అలాగే ఆ సారి మరో రెండు కొత్త జట్లు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమచారం.
2sports
Feb 23,2017 ఉద్యోగులకు బాధతో ఉద్వాసనలు: స్నాప్‌డీల్‌ న్యూఢిల్లీ: నిధుల కొరతను ఎదుర్కొంటున్న ఈ-కామర్స్‌ దిగ్గజం 'స్నాప్‌డీల్‌'లో ఊహించినట్టుగానే కొందరు ఉద్యోగులను ఇంటికి పంపించేయనుంది. సంస్థ ఈ విషయాన్ని ఎట్టకేలకు అంగీకరించింది. దీనికి తోడు సంస్థను తిరిగి పట్టాలెక్కించేంత వరకు సంస్థ సహ వ్యవస్థాపకులు కునాల్‌ బాహల్‌, రోహిత్‌ బన్సాల్‌లకు 100 శాతం వేతన కోతను ప్రకటించనున్నారు. సంస్థ ప్రస్తుత పరిస్థితిని ఉద్యోగులతో పంచుకున్న సహ వ్యవస్థాకులు కునాల్‌ బాహుల్‌ ఈ-మెయిల్‌ ద్వారా పంచుకొంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. మరికొందరూ తమ మార్గంలోనే వేతనాల్ని తగ్గించుకొనేందుకు ముందుకు వచ్చినట్టుగా ఆయన వెల్లడించారు. గత 2-3 ఏండ్ల కాలంలో మూలధనం రాక మెరుగ్గా ఉన్న సమయంలో కంపెనీని బహుముఖంగా పరుగులు పెట్టించే క్రమంలో కంపెనీ, మొత్తం పరిశ్రమ కొన్ని తప్పిదాలు చేసిందని తెలిపింది. వీటివల్ల సమస్యలు ఎదరయ్యాయని వీటిని సమర్థంగా ఎదుర్కొంటు పుంజుకునేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ఉద్యోగుల ఉద్వాసన నిర్ణయం తమకు బాధ కలిగిస్తోందని అన్నారు. ప్రముఖ ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ సంస్థ స్పాప్‌డీల్‌ రెండు రోజుల్లో 600 మంది ఉద్యోగులకు లేఆఫ్‌ ప్రకటించి ప్రక్రియకు రంగం సిద్ధం చేసింది. ఈ ఉద్వాసన సంస్థకు చెందిన ఈ-కామర్స్‌, లాజిస్టిక్స్‌, పేమెంట్స్‌ నిర్వహణ విభాగాల నుంచి ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. వారం రోజుల క్రితమే ఈ ప్రక్రియ మొదలైందని మరో రెండు రోజుల్లో పూర్తి అవుతుందని ఆ వర్గాలు తెలిపాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia ‘అరవింద సమేత’ తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేయడంతో చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్‌లో ‘సక్సెస్ మీట్’ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సునీల్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో త్రివిక్రమ్, తను రూమ్ మేట్స్‌గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను చెప్పారు. ‘త్రివిక్రమ్ ఈ సినిమాలో నాకు నీలాంబరి అని పేరు పెట్టారు. నాకు తెలిసి ఆ పేరు తను ఎందుకు పెట్టుంటాడంటే.. రూంలో ఉన్నప్పుడు నేను వంట చేసేవాడిని, తుడవటం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, బాబు రెడీ అయ్యేటప్పటికి జాగ్రత్తగా షూట్‌కేస్ పక్కన పెట్టడం చేసేవాడిని. సెంట్ ఒకటే ఉండేది. ఇద్దరం అడ్జస్ట్ కావాలి కాబట్టి తనకే నేను కొట్టేసి జాగ్రత్తగా దాచేసే వాడిని’ అని సునీల్ సరదాగా చెప్పారు. ‘పెనివిటి’ పాట వెనుక కథ ఇది.. ‘అరవింద సమేత’లో ‘పెనివిటి’ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. భర్త కోసం భార్య పడే ఆవేదనను ఆ పాటలో అద్భుతంగా చెప్పారు. అయితే దీని వెనుక కూడా తనే ఉన్నానని సునీల్ చెప్పారు. ‘త్రివిక్రమ్ మొదటిసారి రూం నుంచి బయలుదేరి చెన్నై వెళ్లాడు. రాయటానికి వెళ్లిపోయాడు. ఫోన్ లేదు. వారం రోజులైపోయింది. నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. వీడొస్తాడా, ఇంటికొస్తాడా, అసలే చెన్నై, తమిళం రాదు, ఎక్కడున్నాడో, ఏళకు తిన్నాడా, పడుకున్నాడా, ఆరోగ్యం ఎలా ఉందో, ఏ జర్వమైనా వచ్చిందా అని ఎదురు చూశాను. అందుకే దేవుడు నా ఆత్మని తన పెన్నులో ఇంకులా చేసి ఈ సందర్భం రాయడానికి అవకాశం కల్పించాడు’ అని సునీల్ నవ్వుతూ చెప్పారు. ఈ సమయంలో అక్కడంతా నవ్వులు పువ్వులు పూశాయి. త్రివిక్రమ్‌ను ఒక మహా వ్యక్తిగా నిరూపించడానికి తాను ఏమీ తెలియని అమాయకుడిలా ఎంత వదులుకోవాల్సి వచ్చిందోనని కాసేపు సరదాగా నవ్వించారు. షూటింగ్‌లో తమనంతా చాలా బాగా చూసుకున్న త్రివిక్రమ్.. నరకమంతా తారక్‌‌కు చూపించారని సునీల్ చెప్పారు. ఈ సినిమా మంచి బెంజ్ కారు లాంటిదని, అందుకే ఒక టైరు ట్రాక్టర్‌ది వేస్తే బాగుండదని తనకు కామెడీ పెట్టకుండా తన బ్రాండ్‌ను కూడా త్రివిక్రమ్ పెంచారని సునీల్ కొనియాడారు. ఇదే సినిమాను కేవలం తివిక్రమ్ దర్శకుడు కాకుండా వేరే ఏ పెద్ద డైరెక్టర్ అయినా తీస్తే ఎవ్వరూ కామెడీ అడగరని, సూపర్‌గా ఉంది అంటారని సునీల్ అన్నారు. త్రివిక్రమ్ కామెడీ అలవాటు చేశారు కాబట్టి, దర్శకుడిగా ఆయన పేరు ఉంది కాబట్టి కామెడీ లేదేంటి అని ప్రేక్షకులు అంటున్నారని సునీల్ చెప్పుకొచ్చారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
RUPEES మిరేజ్‌ సిరమిక్స్‌లో హల్క్‌హోల్డింగ్స్‌ పెట్టుబడి ముంబయి, జూలై 25: సౌదీ అరేబియాకు చెందిన మల్క్‌ హోల్డింగ్స్‌ తాజాగా మిరేజ్‌ సిరమిక్స్‌ కంపెనీల్లో రూ.100కోట్లు పెట్టుబడులు పెడుతు న్నట్లు ప్రకటించింది. 50శాతం వాటాను ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మిరేజ్‌ సిరమిక్స్‌లో కొను గోలుచేస్తోంది. భారతీయ సిరమిక్‌టైల్‌ పరిశ్రమ ప్రస్తుతం సాలీనా 25వేల కోట్ల రూపాయలకు పెరుగుతున్నదని, మరింతగా వృద్ధి చెందే అవ కాశం ఉందని మిరేజ్‌ సిరమిక్స్‌ ఛైర్మన్‌ శ్రీకాంత్‌ ఖదలిక్కర్‌ వెల్లడించారు. ఇప్పటివరకూ తమకు 450 మంది డీలర్లు ఉన్నారని దేశంలోని అన్ని ప్రాంతాలకు మిరేజ్‌ విస్తరించిందన్నారు. ఇటీవలే రెండు విభిన్న డిజైన్లను విడుదల చేసామన్నారు. ఎలైట్‌, అందుబాటుధరల్లో మరో డిజైన్‌ను విడు దల చేసామన్నారు. ఎనిమిదేళ్ల క్రితం స్థాపించిన మిరేజ్‌ సిరమిక్స్‌ భారత్‌ సిరమిక్‌ పరిశ్రమలో ఎంతో వృద్ధిని సాధించడంతో విస్తరణకుగాను కంపెనీ తన వాటాలను సౌదీ అరేబియా సంస్థకు జారీచేస్తోంది. 50శాతం వాటాను సౌదీకి చెందిన మల్క్‌ హోల్డింగ్స్‌ రూ.100 కోట్లకు కొనుగోలు చేస్తున్నది. మల్క్‌ సంస్థ ఛైర్మన్‌ షాజి యుఐ మల్క్‌ మాట్లాడుతూ సిరమిక్స్‌మార్కెట్‌లో అంత ర్జాతీయంగా భారత్‌ ఉత్పత్తిలో మూడోస్థానంలో నిలిచిందని, మరింతగా వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలున్నాయన్నారు. అందుకోసమే మిరేజ్‌ భాగస్వామి అవుతున్నట్లు వెల్లడించారు. భారత్‌ తమకు ఎంతో గిట్టుబాటైన మార్కెట్‌ అని దేశం లో రానున్న వచ్చేఐదేళ్లలో రూ.1000కోట్ల పెట్టు బడులు పెట్టాలన్న లక్ష్యంతో ప్రణాళికలు ఉన్న ట్లు తెలిపారు. మొత్తం 18 కంపెనీలు 11 దేశాల్లో మల్క్‌ హోల్డింగ్స్‌కు వ్యాపారాలున్నాయి.
1entertainment
Visit Site Recommended byColombia మన్జోత్ ఆడిన కొన్ని షాట్లు యువరాజ్‌ను మరిపించాయి. అతడి బ్యాటింగ్ స్టయిల్, ఆడిన స్ట్రయిట్ డ్రైవ్, పాదాల కదలికలు, పరిగెత్తే విధానం.. ఇలా చాలా విషయాల్లో నెటిజన్లు ఈ కుర్ర ప్లేయర్‌లో యువీని చూసుకుంటున్నారు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో గంభీర్ తరహా ఇన్నింగ్స్ ఆడిన కల్రా.. భవిష్యత్తులో యువీలా భారత జట్టులో కీలకంగా మారతాడని అప్పుడే అంచనాలు వేస్తున్నారు. 2000 సంవత్సరంలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ద్వారా యువీ వెలుగులోకి రాగా.. అప్పటికి ఏడాది కూడా నిండని మన్జోత్.. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ ద్వారా అందర్నీ ఆకట్టుకున్నాడు. చదవండి: ​ మన్జోత్ కల్రా సెంచరీ.. వరల్డ్‌కప్ విజేత భారత్ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా మన్జోత్ కల్రా రికార్డ్ నెలకొల్పాడు. 2012లో ఉన్ముక్త్ చంద్ ఆస్ట్రేలియాపై 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పుడు మన్జోత్ కూడా అదే జట్టుపై 101 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. ఓవరాల్‌గా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ సాధించిన ఐదో ఆటగాడు మన్జోత్.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Aug 03,2016 పదింటికి..రూ.5.73 లక్షల కోట్ల అప్పులు న్యూఢిల్లీ: పది కార్పొరేట్‌ గ్రూపులు దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.5.73 లక్షల కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉందట. ఇదే విషయాన్ని మంగళవారం రాజ్యసభకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగావర్‌ తెలిపారు. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం ఈ కార్పొరేట్‌లు మార్చి 2016 నాటికి బ్యాంకులకు రూ.5,73,682 కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉందన్నారు. అయితే వారి పేర్లను వెల్లడించడానికి వీలు లేదన్నారు. అత్యధికంగా మౌలిక వసతులు, స్టీల్‌, టెక్స్‌టైల్‌ రంగాల రుణాలు మొండి బాకీలుగా మారుతున్నాయన్నారు. వేగంగా రుణాల రికవరీ కోసం కొత్తగా 6 డెట్‌ రికవరీ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రుణ గ్రహీత చెల్లించలేకపోతే గ్యారంటీ ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం బ్యాంకులకు సూచించిందన్నారు. 2015-16లో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.59,547 కోట్ల రుణాలు రద్దు చేశాయని వెల్లడించారు. ఇదే సమయంలో ప్రయివేటు బ్యాంకులు రూ.12,017 కోట్లు, విదేశీ బ్యాంకులు రూ.1,057 కోట్ల చొప్పున రద్దు చేశాయి. రద్దు చేసిన రుణ గ్రహీతల పేర్లు తమ వద్ద లేవని మంత్రి పేర్కొనడం గమనార్హం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
5 రోజుల్లో రూ.15 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళ‌ు సాధించిన "గరుడవేగ" Highlights యాంగ్రీయంగ్ మేన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ హీరోగా వచ్చిన గరుడవేగ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ మంచి స్పందన రావటంతో గరుడవేగ సినిమాకు వసూళ్ల వర్షం ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌ల‌కు పెట్టింది పేరైన డా.రాజ‌శేఖ‌ర్ ఎన్.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా న‌టించిన చిత్రం `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బేన‌ర్‌పై ఎం.కోటేశ్వ‌ర్ రాజు నిర్మించారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 3న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌ని తెచ్చుకుంది. అంతేకాకుండా స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ అవుతూ.. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తూ రెండో వారంలో దిగ్విజ‌యంగా అడుగుపెడుతోంది.   ఈ సంద‌ర్భంగా.. చిత్ర నిర్మాత ఎం.కోటేశ్వ‌ర్ రాజు మాట్లాడుతూ - ``నేను నిర్మాత‌గా చేసిన తొలి సినిమా `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం` సెన్సేష‌న‌ల్ హిట్ అవ్వ‌డం చాలా ఆనందంగా ఉంది. సినిమా టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టినుంచి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌ను మించుతూ సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. డా.రాజ‌శేఖ‌ర్ గారి అద్భుత‌మైన పెర్‌ఫార్మెన్స్‌, ప్ర‌వీణ్ స‌త్తారు గారి ఎక్స్ ట్రార్డ‌న‌రీ టేకింగ్, సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల స‌హ‌కారం సినిమాని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాయి. ఐదు రోజుల్లో రూ.15 కోట్ల‌కిపైగా వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టుకున్న మా సినిమా.. రెండో వారంలోకి అడుగుపెడుతున్న‌ప్ప‌టికీ ఆద‌ర‌ణ అంత‌కు అంత‌గా పెరుగుతోంది. రెండో వారంలో కూడా థియేట‌ర్ల సంఖ్య పెర‌గ‌డ‌మే సినిమాకి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌కు సాక్ష్యం. ఇంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు`` అని తెలిపారు. Last Updated 26, Mar 2018, 12:01 AM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ​ఆ నటిని మావాడేం చేయలేదు: హీరో తల్లి మలయాళీ నటి పై దాడి ఉదంతంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కి ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. TNN | Updated: Aug 16, 2017, 08:07AM IST మలయాళీ నటి పై దాడి ఉదంతంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కి ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే బాధిత నటి ఒక ఎమ్మెల్యేపై కంప్లైంట్ చేస్తూ సీఎంకి లేఖ రాసింది. నటిపై దాడి విషయంలో మలయాళీ స్టార్ హీరో దిలీప్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు నెలన్నర నుంచి దిలీప్ పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు అమాయకుడు అంటూ.. పీసీ జార్జ్ అనే ఎమ్మెల్యే అన్నాడు. పోలీసులు అతడిని వేధిస్తున్నారని సదరు ఎమ్మెల్యే ఆవేధన వ్యక్తం చేశాడు. ఆ మేరకు పోలీసులకే కంప్లైంట్ కూడా చేశాడు. ఈ నేపథ్యంలో కేసు విచారణలో ఆ ఎమ్మెల్యే జోక్యం ఏమిటని.. బాధిత నటి పినరాయి విజయన్ కు లేఖ రాసింది. అదలా ఉంటే.. తాజాగా దిలీప్ తల్లి సరోజం పిళ్లై కేరళ సీఎంకు మరో లేఖ రాసింది. ఈమె తన తనయుడి తరఫున వకల్తాపుచ్చుకుని లేఖ రాసింది. దిలీప్ అమాయకుడు అని ఈమె పేర్కొన్నారు.
0business
LIC జీవితబీమా జోన్‌పరిధిలో రూ.4200 కోట్ల ప్రీమియం హైదరాబాద్‌,: జీవితబీమాసంస్థ దక్షిణ మండలం పరిధిలో కొత్తప్రీమియం రూ.4200 కోట్లను అధిగమిం చిందని జోనల్‌మేనేజర్‌ టిసిసుశీల్‌కుమార్‌ వివరించారు. మొత్తం బిజినెస్‌ ప్రీమియంలలో దక్షిణమధ్యమండలం 70శాతం వృద్ధిని సాధించిందని, కొత్తగా 21.17 లక్షల పాలసీలను విక్రయించిందని వివరించారు. అలాగే అఖిలభారత స్థాయిలో కొత్త బిజినెస్‌ ప్రీమియం ఆదాయవనరులపరంగా ఎల్‌ఐసి జీన్‌ అక్ష§్‌ు, ప్రీమియం రెండువేల కోట్లకుపైగా వసూలు చేసిం దన్నారు. మొత్తం ప్రీమియం రాబడులు 37,950 కోట్లుగా ఉన్నాయని అన్నారు. అంతకుముందు సంవత్సరం 33,165 కోట్లతో పోలిస్తే ఎక్కువగా ఉందన్నారు. మొత్తంప్రీమియం వృద్ధి 14.42శాతంగా ఉందని, కొత్త పాలసీలను 15 లక్షలకు పైగా చేర్పించాలని, 1500 కోట్ల ప్రీమియం వసూలుకు ప్రణాళిక అమలుచేస్తున్నట్లు సుశీల్‌కుమార్‌ వెల్లడించారు. ఇక పింఛన్‌గ్రూప్‌ బీమాలపరంగాచూస్తే జోన్‌లో మూడుపారామీటర్లను అధిగమించామని, మొత్తం 4322 స్కీలకుగాను 1.04 కోట్ల రూపాయలు సాధించిందని, కొత్తప్రీమియంపరంగా మొత్తం 10,373 కోట్ల రూపా యలు వసూలయినట్లు వివరించారు. ఆమ్‌ ఆద్మీబీమా యోజన పథకం అమలుచేసి 1.7 కోట్ల అసంఘటిత రంగ ఉద్యోగు లకు ప్రయోజనం కల్పించిందని, సహజంగా మృతిచెందితే రూ.30వేలు, ప్రమాదకారణంగా చనిపోతే రూ.75వేలు చెల్లిస్తున్నట్లు వివరించారు. దేశంలోనే ఎల్‌ఐసి దక్షిణ మధ్యమండలం మొదటిస్థానంలో నిలిచిందని, మృతిచెందిన బీమా క్లెయింల పరిష్కారంలో మొత్తం 1,33,404 పరిష్కరించి 1666.36 కోట్లు చెల్లించిందని సుశీల్‌కుమార్‌ వెల్లడించారు.
1entertainment
దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ First Published 2, Feb 2019, 5:13 PM IST దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్  దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ దండుపాళ్యం 4 ట్రైలర్ లాంచ్ ఫొటోస్ Recent Stories
0business
KOHLi11 104 ఇన్నింగ్స్‌ల తరువాత కోహ్లీ డకౌట్‌ పూణే: టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన పేరున నమోదు చేసు కున్నాడు. వరుసగా నాలుగు టెస్టు సిరీస్‌ల్లో నాలుగు డబుల్‌ సెంచరీలు చేశాడు.సుమారు ప్రతి మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌ కీలకమే.అయితే పుణే వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీ డకౌట్‌ అయ్యాడు.క్రికెట్‌లో డకౌట్‌ కావడం సాధారణే అయినప్పటికి కోహ్లీ డకౌట్‌ అయ్యాడంటే మాత్రం క్రికెట్‌ అభిమానులు అంత త్వరగా నమ్మే పరిస్థితి లేదు.ఎందుకంటే కోహ్లీ ఆట అలా ఉం టుంది. అసలు విషయం ఏమిటంటే 2014లో ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా కార్డిప్‌ వేదికగా జరిగిన వన్డేలో కోహ్లీ డకౌట్‌ అయ్యాడు.మూడు సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడే అతడు సున్నా పరుగులకే వెనుది రిగాడు.అన్ని రకాలఫార్మాట్లను కలుపుకుంటే 104 ఇన్నింగ్స్‌ల తరువాత డకౌట్‌ కావడం ఇదే తొలిసారి. భారత జట్టులో కోహ్లీ ఒక్కడిని కట్టడిచేస్తే చాలు మ్యాచ్‌ మనదే అని ప్రత్యర్థి భావించేలా తయారైంది ఇప్పటి భారత జట్టు.ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్నమ్యాచ్‌లో కోహ్లీ డకౌట్‌ కావడంతో కెఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీ మినహా మిగతా ఆటగాళ్లు ఎవరూ కూడా సత్తా చాటకపోవడం గమనార్హం. దీంతో కేవలం 105పరుగులకే భారత్‌ ఆలౌట్‌కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2sports
Dec 01,2015 నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మంగళవారం అయిదో దైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. గత సమీక్షలో 50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేట్లను తగ్గించిన ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌.. ఈ దఫా సమీక్షలో విధానపరమైన వడ్డీరేట్లలో సవరణలను చేసే అవకాశాలు చాలా తక్కువేననీ మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను పెంచే యోచనలో ఉన్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం కొంత ఆందోళన పెడుతున్నా.. రాజన్‌ వడ్డీనరేట్ల విషయంలో వేచి చూసే ధోరణినే కోనసాగించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అఖిల్ సినిమా విడుదల తేదీ అఖిల్ అక్కినేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా విడుదలకు తేదీ ఖరారైంది. TNN | Updated: Aug 12, 2015, 12:42PM IST అఖిల్ అక్కినేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా విడుదలకు తేదీ ఖరారైంది. వి.వి. వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అక్కినేని అభిమానులకు దసరా కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ చేయాలని యూనిట్ సభ్యులు ఓ నిర్ణయానికొచ్చారు. అఖిల్ సరసన బాలీవుడ్ నటి సైరా భాను మనవరాలు సయేశా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా దగ్గరపడుతోంది. హైదరాబాద్ శివార్లలోని సంఘీ ఫారెస్టులో ఆగస్టు 11 నుంచి మొదలయ్యే షూటింగ్‌లో ఓ ఫైటింగ్ సీన్, క్లైమాక్స్ పూర్తి చేయాలని యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఆ తర్వాత మరో మూడు పాటలు చిత్రీకరిస్తే ఇక సినిమా షూటింగ్ పార్ట్ అంతా పూర్తయినట్లేనని యూనిట్ వర్గాలు తెలిపాయి. అందులో రెండు పాటలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 12 వరకు విదేశాల్లో షూట్ చేయనుండగా మిగతా ఒక్క పాటని హైదరాబాద్‌లోనే ఓ భారీ సెట్టింగ్ రూపొందించి అందులో ఆ పాటని చిత్రీకరించనున్నారు. నిఖితా రెడ్డి సమర్పణలో సినీ హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ , తమన్‌లు మ్యూజిక్ అందిస్తున్నారు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ప్చ్.. చిక్కుల్లో ‘సర్కార్’.. హే మురుగా!! భారీ అంచనాలతో వచ్చేనెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తున్న తమిళ స్టార్ హీరో విజయ్ ‘సర్కార్’ చిత్రాన్ని వివాదం చుట్టేసింది. Samayam Telugu | Updated: Oct 27, 2018, 02:01PM IST ప్చ్.. చిక్కుల్లో ‘సర్కార్’.. హే మురుగా!! పెద్ద సినిమా విడుదలౌతుందంటే చాలు.. ఆ సినిమాను ఏదొక వివాదం చుట్టుముట్టేయడం ఈ మధ్య కాలంలో కామన్‌గా మారింది. ఇది ప్రమోషన్‌లో కొత్త ఎత్తుగడ అని కొందరు కొట్టిపారేస్తున్నా.. వివాదాలు మాత్రం ఆగటం లేదు. ఆ కథ నాది కాపీ కొట్టారు, ఆ కాన్సెప్ట్ నాది.. ఎత్తేశారు, ఆ పాట నాది.. ట్యూన్ దొంగిలించారు.. ఇలా రకరకాల వివాదాలు సినిమాలను చుట్టేస్తున్నాయి. తాజాగా భారీ అంచనాలతో వచ్చేనెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తున్న తమిళ స్టార్ హీరో విజయ్ ‘సర్కార్’ చిత్రాన్ని వివాదం చుట్టేసింది. Visit Site Recommended byColombia కత్తి, తుపాకి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తరువాత మురుగదాస్, విజయ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ‘సర్కార్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు విడుదలౌతున్న ఈ చిత్రం కథ నాదే అంటూ తమిళ రచయిత వ‌రుణ్ రాజేంద్ర‌న్ సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ రైట‌ర్స్ అసోషియేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. తాను పదేళ్ల క్రితం రాసుకున్న ‘సెంగోల్’ కథను కాపీ కొట్టి దర్శకుడు మురుగదాస్ ఇప్పుడు ‘సర్కార్’ చిత్రాన్ని తీస్తున్నారంటూ ఈ ఫిర్యాదులో పేర్కొనడంతో కేస్ ఫైల్ అయ్యింది. మ‌ద్రాస్ హై కోర్ట్ ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించడంతో మురుగదాస్ కోర్టు మెట్లు ఎక్కుతారా? లేక సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో స్టే తెచ్చుకుంటారా? లేదంటే.. ఎందుకొచ్చిన గోల అని అసలు ‘కథ’కుడితో రాజీ ప్రయత్నాలు చేస్తారో చూడాలి. Sarkar Telugu Teaser: ‘సర్కార్’ టీజర్ తెలుగులో X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ఫిలిం సిటీలో స్టార్ హీరోల కొట్లాటలు! First Published 6, Feb 2019, 10:53 AM IST ఫిలిం సిటీలో స్టార్ హీరోల కొట్లాటలు! ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'మహానాయకుడు' సినిమాకి సంబంధించిన బ్యాలన్స్ సన్నివేశాలను ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. ర్యాలీ నేపధ్యంలో ఈ సన్నివేశాలు సాగనున్నాయి. దీంతో సినిమా షూటింగ్ పూర్తికానుంది. ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో భాగంగా కీలకమైన ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సెట్ ని రూపొందించారు. రాజమౌళి రూపొందిస్తోన్న 'RRR' సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. చరణ్ తో పాటు వందలాది మంది ఫైటర్లపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పోలీస్ చెక్ పోస్ట్ నేపధ్యంగా సాగే ఫైట్ సీక్వెన్స్ ఇది. rrr
0business
అరవింద సమేత: ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ (ఫోటోలు) First Published 6, Oct 2018, 3:10 PM IST అరవింద సమేత: ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్  ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ ఫోటోలు Recent Stories
0business
ROHIT ఆసీస్‌ఫై రోహిత్‌ శర్మ సిక్సర్ల రికార్డు బెంగళూరు : టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో 50 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌ మెన్‌గా అవతరించాడు. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో రోహిత్‌ ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. ఆడమ్‌ జంపాలో రెండు, ట్రావిస్‌ హెడ్‌, కమిన్స్‌, రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్‌ కొట్టాడు. రోహిత్‌ శర్మ కండబలం గురించి అందరికీ తెలిసిందే. అతడు కసిగా బాదితే బంతి నేరుగా స్టాండ్స్‌ దాటి స్టేడియం అవతల పడుతుంది. అలాంటి కళ్లు చెదిరే షాట్లను ఇప్పటికే ఎన్నో చూశాం. ఇం డోర్‌లో నిర్వహించిన మూడో వన్డేలోనూ రోహిత్‌ కొట్టిన బంతి స్టేడియం దాటిపోవడంతో కొత్త బంతితో ఆట మొదలు పెట్టారు. కెరీర్‌లో 167 వన్డేలు ఆడిన రోహిత్‌ మొత్తం 141 సిక్సర్లు బాదగా అందులో ఆసీస్‌పైనే 50 కావడం గమనార్హం. రోహిత్‌ తర్వాత ఆసీస్‌ఫై ఎక్కువ సిక్సర్లు (39) ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ బాదాడు.
2sports
లవర్స్ క్లబ్ యూత్ కు నచ్చుతుందంటున్న నిర్మాత Highlights లవ్ర్స్ క్లబ్ పేరుతో యూత్ ఫుల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో అటెన్షన్ క్రియేట్ చేసిన లవర్స్ క్లబ్   ప్రవీణ్ గాలిపల్లి సమర్పణ‌లో, భరత్ అవ్వారి నిర్మాత‌గా ధృవ శేఖ‌ర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర‌, పావ‌ని ,ఆర్య‌న్‌. పూర్ణి లు జంట‌గా మెట్ట‌మెద‌టి సారిగా ఎమెష‌న‌ల్  ల‌వ్‌స్టోరి గా తెర‌కెక్కిన చిత్రం ల‌వ‌ర్స్‌క్ల‌బ్‌. ఈ చిత్రాన్ని  ప్లాన్ ‘బి’ ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యెక్క ప్రీలుక్ ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ద యూత్ కాగా, ఇప్ప‌డు ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేస్తున్నాము. సంక్రాంతి త‌రువాత ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని విడుదల చేస్తారు. ప‌క్కా యూత్‌ఫుల్ ఎమెష‌న‌ల్ ల‌వ్‌స్టోరిగా యువ‌త ని ఆక‌ట్టుకుంటుంది.   ఈ సంద‌ర్బంగా నిర్మాత భ‌ర‌త్ అవ్వారి మాట్లాడుతూ.. 2016 లో పెద్ద చిత్రాలు ఏరేంజి లొ సూప‌ర్‌హిట్స్ అయ్యాయో చిన్న చిత్రాలు అదే రేంజి విజ‌యాలు సాధించాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అని ఆడియ‌న్స్ ఫ్రూవ్ చేశారు. చిన్న చిత్రాలు మ‌నుగ‌డ‌కి మార్గం వేశారు. అదే ధైర్యంతో మా ల‌వ‌ర్స్ క్ల‌బ్ ని తెర‌కెక్కించాం. మా కంటెంట్ ప‌క్కా ఎమెష‌నల్ గా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. కొత్త వారితో చేసినా మెచ్యురిటి గా మా ద‌ర్శ‌కుడు ధృవ శేఖ‌ర్ పర్ఫోర్మన్సుస్ రాబట్టుకున్నారు. సంక్రాంతి త‌రువాత మా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఆడియ‌న్ ఈ మాట చెప్తారు. ఇటీవ‌లే ప్రీలుక్ అని విడుదల చేసిన మా పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో స‌న్సేష‌న్ అయ్యింది. ఇప్ప‌డు మా ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేస్తున్నాము. ఆడియో ని ఫిబ్ర‌వ‌రి లో విడుదల చేసి అదే నెల‌లో చిత్రాన్ని విడుదల చేయ్య‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. ప్ర‌స్తుతం షూటింగ్ కార్క‌క్ర‌మాలూ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అని అన్నారు.   ద‌ర్శ‌కుడు ధృవ శేఖ‌ర్ మాట్లాడుతూ.. ల‌వ‌ర్స్ కి అండ‌గా నిల‌బ‌డే ఒక యువకుడి జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు వస్తే వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కధాంశం. యదార్ధ సంఘటనలకు ఇన్స్పిర్ అయ్యి ఈ చిత్రాన్ని తెరకేక్కించాం. ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకేక్కించాం. ఇంతవరకు ఎవరు తీయని విధంగా ఈ టెక్నాలజీతో మేము తీసాం. ఈ టెక్నిక్ ఇండస్ట్రీ వాళ్ళని, యూత్ ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం.   వినోదాత్మ‌కంగా ఎమెష‌నల్ గా చిత్ర క‌థాంశాన్ని ఎంచుకున్నాం. అనుకున్న‌ది అనుకున్న‌ట్టుకుగా తెర‌కెక్కించాం. ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ వున్న చిత్రం ల‌వ‌ర్స్ క్ల‌బ్,  యూనిట్ మెత్తం చాలా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి చేశాము.యూత్ ఫుల్ టీం కావ‌టంతో అందరు చాలా ఎన‌ర్జిగా ప‌నిచేశారు. స్క్రీన్ మీద కూడా అదే ఎనర్జి క‌న‌ప‌డుతుంది. మా ఫ‌స్ట్ లుక్ అందిరిని ఆక‌ట్టుకుంటుందని ఆశిస్తున్నాము. ఫిబ్ర‌వ‌రి లొ విడుద‌ల చేయ‌నున్నాము .. అని అన్నారు.   అనిష్ చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణి, ధీరజ్, చిత్రం బాష, వైజాగ్ ప్రసాద్. అజయ్ రత్నం, సాంకేతిక నిపుణులు: మ్యూజిక్: రవి నిడమర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: మదన్ గంజికుంట, అవ్వారి ధను సహ నిర్మాతలు: నవీన్ పుష్పాల, శ్రీ చందన గాలిపల్లి నిర్మాత: భరత్ అవ్వారి
0business
internet vaartha 197 Views మొహాలీ : భారత్‌,ఆస్ట్రేలియా మధ్య జరిగిన టి20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది.స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు.ఒక వైపు వికెట్లు పడిపోతుంటే అతను భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు.కాగా ఈ మ్యాచ్‌ గురించి కోహ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.భారత్‌ బ్యాటింగ్‌కు దిఇన 10 ఓవర్లలో వికెట్ల పతనం చూసి మ్యాచ్‌ పైన ఆశలు వదిలేసుకున్నామని,ధోనీ క్రీజులోకి వచ్చే వరకు తాను ఎంతో ఒత్తిడికి లోనయ్యానన్నాడు. ధోనీ క్రీజులోకి రాగానే ఏం జరుగుతుందో ఎలా మ్యాచ్‌ను గెలువాలో కూడా తనకు అర్థం కాలేదని కోహ్లీ పేర్కొన్నాడు.భారత జట్టు కోసం ఆడిన ఆటను గుర్తుకు తెచ్చుకుంటూ తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నాడు.తాను ఒత్తిడి జయించడానికి అభిమానులే కారణమని కోహ్లీ వివరించాడు.మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ కంటే తన ప్రత్యేకత తక్కువేనని కోహ్లీ పేర్కొన్నాడు.అసిస్‌తో మ్యాచ్‌ అనంతరం చాలా మంది కోహ్లీని సచిన్‌తో పోలుస్తున్నారు.దీనిపై కోహ్లీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. థ్యాంక్యూ సచిన్‌ పాజి,నీ కంటే నా ప్రత్యేకత తక్కువే అని,అంతకు ముందు సచిన్‌ కోహ్లీకి కితాబిస్తూ ట్వీట్‌ చేశాడు.కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌పై ఆస్ట్రేలియా మీడియా కూడా ప్రశంసలు కురిపించింది.భారత్‌ మాజీ క్రికెటర్లు కోహ్లీని ఆకాశాని ఎత్తుకున్నారు.ఇక క్రికెట్‌ అభిమానులు అయితే కోహ్లీ పైన సోషల్‌ మీడియాలో కితాబు ఇస్తున్నారు. ఐసిసి టి20 ర్యాంకింగ్స్‌లో కోహ్లీ టాప్‌ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అనంతరం ఐసిసి టి20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ టాప్‌లో నిలిచాడు.కోహ్లీ 871 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు.టాప్‌ టెన్‌ బ్యాట్స్‌మెన్‌ వీరే. 1.కోహ్లీ – భారత్‌(871 పాయింట్లు),2.ఆరోస్‌ పించ్‌ – ఆస్ట్రేలియా (803 పాయింట్లు), 3.గుప్తిల్‌-న్యూజిలాండ్‌(762 పాయంట్లు), 4.డెప్లెసిస్‌- దక్షిణాఫ్రికా (741 పాయింట్లు), 5.హేల్ప్‌-ఇంగ్లాండ్‌  (737 పాయింట్లు), 6 క్రిస్‌గేల్‌ -వెస్టిండీస్‌   (724 పాయింట్లు), 7.కేన్‌ విలియమ్స్‌-న్యూజిలాండ్‌ (718 పాయింట్లు), 8.మసకద్జ-జింబాబ్వే(677 పాయింట్లు), 9.షహజాద్‌- అప్ఘానిస్థాన్‌ (674 పాయింట్లు), 10.వాట్సన్‌ -ఆస్ట్రేలియా(664 పాయింట్లు)
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ధోనీ 300వ వన్డే.. ఆ రికార్డులకీ మోక్షం..? భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్‌లో మరో అత్యుత్తమైన మైలురాయిని గురువారం చేరుకోనున్నాడు TNN | Updated: Aug 30, 2017, 04:25PM IST భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్‌లో మరో అత్యుత్తమైన మైలురాయిని గురువారం చేరుకోనున్నాడు. శ్రీలంకతో కొలంబో వేదికగా జరగనున్న నాలుగో వన్డే.. ధోనీ కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్. ఈ రికార్డుతో పాటు మరో రెండు అరుదైన ఘనతలు కూడా ధోనీ ఖాతాలో చేరనున్నాయి. అందులో ఒకటి వికెట్‌ కీపర్‌గా.. మరొకటి మ్యాచ్ ఫినిషర్‌గా అతను సాధించిన విజయాలకి నిదర్శనంగా క్రికెట్ చరిత్రలో నిలవనున్నాయి. డిసెంబరు 23, 2004లో వన్డే కెరీర్‌ని ఆరంభించిన ధోనీ ఇప్పటి వరకు 299 మ్యాచ్‌ల్లో 10 శతకాలు, 65 అర్ధశతకాలు సాధించాడు. ఈ సుదీర్ఘ కెరీర్‌లో మ్యాచ్ ఫినిషర్‌గా మంచి గుర్తింపు పొందిన ధోనీ.. 72 సార్లు నాటౌట్‌గా క్రీజులో నిలిచాడు. వన్డే చరిత్రలో ఇప్పటి వరకు షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా), చమిందా వాస్ (శ్రీలంక) మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజాగా గురువారం జరిగే నాలుగో వన్డేలో ధోనీ నాటౌట్‌గా నిలిస్తే.. 73తో అగ్రస్థానానికి చేరుకుంటాడు. మరోవైపు వికెట్‌ కీపర్‌గానూ ధోనీ ఇప్పటి వరకు 99 స్టంపింగ్‌లతో శ్రీలంక మాజీ వికెట్ కీపర్‌ కుమార సంగక్కర‌ని సమం చేశాడు. కొలంబో వన్డేలో ఒక స్టంపౌట్ చేయగలిగితే.. అక్కడా ధోనీ‌నే నెం.1.. కెరీర్‌లో 300వ వన్డే ఆడుతూ ధోనీ ఈ రికార్డులను అందుకోగలిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది భారత్ అభిమానికి..!
2sports
"బాహుబలి" కి బాబులా ఉండాల.. అదీ టార్గెట్ Highlights దేశంలో 1000 కోట్లు పైగా వసూలు సాధించి బెంచ్ మార్క్ సినిమాగా నిలిచిన బాహుబలి బాహుబలికి ముందు రూ.745 కోట్లతో టాప్ పొజిషన్ లో నిలిచిన పీకే బాహుబలి కలెక్షన్స్ మించి వసూలు చేసేలా థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ను తీర్చిదిద్దుతున్న టీమ్ 'ధూమ్‌ 3' దర్శకుడు విక్టర్ ఆచార్య తలపెట్టిన 'థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌' చిత్రం జూన్ ఫస్ట్ నుంచి షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. కానీ బాహుబలి దెబ్బకు దాన్ని ఆలస్యంగా లాంఛ్‌ చేయబోతున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్‌ ఓకే అయిపోయిన ఈ చిత్రానికి మరోసారి స్క్రిప్ట్‌ పై పనిచేస్తున్నారు. బాహుబలి చిత్రం సాధించిన కలెక్షన్లు చూసి ఈ చిత్రం స్థాయి ఇంకా ఎక్కువ ఉండేలా తెరకెక్కించాలని ప్లాన్ వేస్తున్నారు. అందుకు అనుగుణంగా పకడ్బందీ పాత్రలు, కథ, కథనాలు సిద్ధం చేసుకుని, హాలీవుడ్‌కి తీసిపోని విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నారు. బాహుబలి వెయ్యి కోట్లకి పైగా గ్రాస్‌ వసూలు చేసిన నేపథ్యంలో యష్‌రాజ్‌ సంస్థ ఈ రివిజన్‌కి ఆదేశించిందని ప్రముఖ వార్తా సంస్థ బాలీవుడ్ హంగామా ప్రచురించింది.   అయిదు వందల కోట్ల బడ్జెట్‌ అయినప్పటికీ కాంప్రమైజ్‌ కారాదని, భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో దీనిని రూపొందించాలని డిసైడ్‌ అయింది. ఈ చిత్రంలో వార్‌ ఎపిసోడ్స్‌ చాలానే వుంటాయని, 'పైరేట్స్‌ ఆఫ్‌ కరీబియన్‌' తరహాలో ఈ చిత్రాన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చాలని భావిస్తోంది. బాహుబలి చిత్రంతో ఓవర్సీస్‌ మార్కెట్‌ డెప్త్‌ తెలియడంతో ఇంతవరకు ఇండియన్‌ సినిమా క్యాప్చర్‌ చేయని మార్కెట్‌పై ఈ చిత్రం దృష్టి పెడుతోంది.   మొత్తానికి బాహుబలి వల్ల బాలీవుడ్‌ కార్యకలాపాల్లో స్పష్టమైన మార్పులొచ్చాయి. అయితే అంతిమ ఫలితం బాహుబలిలా వుంటుందా లేక ఎవరినో చూసి ఎవరో వాత పెట్టుకున్న చందంగా తయారవుతుందా అనేది చూడాలి. Last Updated 25, Mar 2018, 11:53 PM IST
0business
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV Pension Fund శుభవార్త.. ఇకపై వారికి కూడా ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరే ఛాన్స్..! పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్‌డీఏ ఎన్‌పీఎస్ స్కీమ్ ప్రయోజనాలను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే స్కీమ్‌ నిబంధనలను తాజాగా సవరించింది. Samayam Telugu | Updated: Oct 30, 2019, 03:31PM IST Pension Fund శుభవార్త.. ఇకపై వారికి కూడా ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరే ఛాన్స్..! హైలైట్స్ పెన్షన్ ఫండ్ తీపికబురు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వారికి కూడా స్కీమ్‌లో చేరే అవకాశం రూల్స్ నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం పథకంలో చేరి డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) తాజాగా అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది. అయితే ఇది అందరికీ కాదు. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో చేరేందుకు అవకాశం కల్పించింది. దీంతో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్‌ఐ) మాదిరిగానే ఇప్పుడు ఓసీఐలు కూడా ఎన్‌పీఎస్‌లో చేరొచ్చు. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కూడా పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్వహణలోని నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో చేరొచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఇప్పుడు ఓసీఐలు పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టం ప్రకారం ఎన్‌పీఎస్ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే యాన్యుటీ/ డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఫెమా నిబంధనలకు లోబడి వారి దేశానికి తీసుకెళ్లొచ్చు కూడా. Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండిదీ ఇదే దారి! ఎన్‌పీఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేసే మొత్తానికి సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకు అదనపు ట్యాక్స్ డిడక్షన్ పొందొచ్చు. ఇది సెక్షన్ 80సీసీడీ (1) కింద పొందే రూ.1,50,00 డిడక్షన్‌కు అదనం. ఎన్‌పీఎస్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవడం/మెచ్యూరిటీ సమయం/పథకం నుంచి వైదొలగడం వంటి సందర్భాల్లో పనన్ను మినహాయింపు పరిమితిని 2019 బడ్జెట్‌లో 40 శాతం నుంచి 60 శాతానికి పెంచారు. ఇక మిగిలిన 40 శాతం మొత్తంపై ఎలాగో పన్ను లేదు. ఈ మొత్తంతో కచ్చితంగా యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. Also Read: ఓరినాయనో.. బంగారం, వెండిని ఎగబడి కొనేస్తున్న జనాలు..! ఎన్‌పీఎస్ స్కీమ్‌ను తొలిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. అటుపైన దేశంలోని పౌరులందరికీ ఈ పథకంలో చేరే అవకాశం లభించింది.2015 అక్టోబర్ నుంచి ఎన్ఆర్ఐలకు కూడా సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వారికి కూడా ఎన్‌పీఎస్ అందుబాటులోకి వచ్చింది.
1entertainment
International Services ఈక్విటీ, కమోడిటీ, కరెన్సీలకు అంతర్జాతీయకరణ అహ్మదాబాద్‌, జనవరి 10: దేశంలోని గుజరాత్‌లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ ఆర్థికసేవల కేంద్రం గుజరాత్‌లోని గిఫ్ట్‌సిటీలో ప్రారంభం కాబోతోంది. 48 బిలియన్‌ డాలర్ల మేర బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ముఖ్యంగా సింగపూర్‌, దుబా§్‌ు, హాంకాంగ్‌నగరాల నుంచే ఈ లావాదేవీలు అధికంగా ఉంటాయి. 16 అంతస్తుల భవనాన్ని ఆర్థిక సేవల నగ రంలో మొత్తం అగ్రగామిగా నిర్మించారు. జనవరి 16వ తేదీనుంచి ఈక్విటీ సూచి ఫ్యూచర్స్‌ను ప్రారంభిస్తోంది. వీటికితోడు బంగా రం, వెండి, రాగి, ముడిచమురు, కరెన్సీట్రేడింగ్‌లు కూడా వెను వెంటనే ప్రారంభం అవుతాయని బాంబేస్టాక్‌ ఎక్ఛేంజి సిఇఒ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ వ్లెడించారు. మొత్తం 96 బ్రోకరేజి సంస్థలు ఈజోన్‌లో రిజిష్టరు అయ్యాయి. సింగపూర్‌ ఈక్విటీ ఫ్యూచర్స్‌కు సంబంధించి, దుబాయి కరెన్సీ డెరివేటివ్స్‌లలో ఎదురవుతున్న నష్టాలనుంచి అధిగమించేందుకు ఈ ఎక్ఛేంజి పనిచేస్తుందని, అలాగే మరికొన్ని వ్యూహాత్మక ట్రేడింగ్‌ హాంకాంగ్‌పరంగా కూడా ఈ ఎక్ఛేంజి పర్యవేక్షిస్తుందని చౌహాన్‌ వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోడీ మానసపుత్రికగా ఈ ఎక్ఛేంజిను ఆయన అభివర్ణిం చారు. గుజరాత్‌ అంతర్జాతీయ ఆర్థిక టెక్‌సిటీ గిఫ్ట్‌సిటీగా ఉన్న ఈ నగరంలో మొత్తం 48 బిలియన్‌ డాలర్ల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని అంచనా. భారతీయ కంపెనీలు, వ్యక్తులు, సంస్థ లు 2015లోనే 48 బిలియన్‌ డాలర్ల లావాదేవీలు నిర్వహిస్తే 2025 నాటికి 120 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. సాలీనా ఏడుశాతం వృద్ధిచెందుతున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థకు ఈ గిఫ్ట్‌సిటీ ఎంతో మద్దతునిస్తుందని, ఐదువేల మందికి ఉపాధి కల్పిస్తుందని, దీర్ఘకాలంలో ఐదులక్షలమందికిపైగా ఉపాధి కలుగుతుందని అంచనాలు వేస్తున్నారు. మొత్తం 73 మిలియన్‌ డాలర్లు అంటే 500 కోట్ల రూపాయలు ఈ ఎక్ఛేంజిలో పెట్టుబడులు పెడుతోంది. భారతీయ కంపెనీలు లక్షకోట్ల డాలర్ల వరకూ రానున్నపదేళ్లలో ఈ గిఫ్ట్‌సిటీనుంచి నిధులుసేకరించుకునే అవకాశం ఉందని అంచనా. సెజ్‌లకు వర్తించే పన్ను రాయితీలు గిఫ్ట్‌సిటీకి వర్తిస్తాయి. విదేశీకరెన్సీ రుణాలు భారతీయ కంపెనీ లకు మరింతగా అందుతాయి. విదేశీ వ్యక్తులు, విదేశీ కంపెనీలు చైనానుంచి మరింతగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. చైనా లో ఇదేతరహా ఆర్థికసేవల జోన్‌క్వియాహై పేరుతో షెన్‌జెన్‌ లో నడుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రారంభించేముందు పైలట్‌ప్రాతిపది కన పరీక్షలుంటాయి. ఈప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తు న్నట్లు వాణిజ్యబ్యాంకులు వ్యూహాత్మక, నిర్మాణాత్మక స్కీంలు అమలుచేసుకోవచ్చు. బోర్డు డైరెక్టర్ల అనుమతులు అవసరం అవు తాయి. రిజర్వుబ్యాంకు నిబంధనలు ఇందుకు సంబంధించి నవం బరు పదవ తేదీనే విడుదలచేసింది. ఒకేస్టాక్‌ ఫ్యూచర్స్‌ను పది భారతీయ కంపెనీలపరిధిలో ట్రేడింగ్‌ నిర్వహిస్తుందని బిఎస్‌ఇ వెల్లడించింది. గిఫ్ట్‌సిటీ సిఇఒ అజ§్‌ుపాండే మాట్లాడుతూ మూడు, నాలుగు అంతర్జాతీయ బ్యాంకులు తమతమ సొంత సంస్థలనుంచి ఈ జోన్‌లో ప్రారంభించేందుకు అనుమతులకోసం దరఖాస్తులు చేసాయని, వీటికితోడు ఏడు దేశీయ బ్యాంకులు, రెండు బీమా కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించా యన్నారు. ఎన్‌ఎస్‌ఇ కూడా ఒక ఎక్ఛేంజి శాఖనుప్రారంభించే యోచనలో ఉందన్నారు. అంతర్జాతీయ స్టాక్‌ఎక్ఛేంజిల సహకారం తో ఎన్‌ఎస్‌ఇ విభాగం పనిచేస్తుందని ఏడు బ్యాంకులు ఇప్పటికే వందకోట్ల డాలర్ల ఆర్థిక లావాదేవీలు నిర్వహించాయని సిఇఒ వెల్లడించారు. దుబాయి, సింగపూర్‌లలో ఇప్పటికే భారీ మొత్తం లో బిజినెస్‌ జరుగుతోందని ఈ గిప్ట్‌సిటీ ఆధ్వర్యంలో లావాదేవీ లను మరింతగా పటిష్టం చేసేందుకు కృషి జరుగుతోందన్నారు.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ‘ఒక మనసు’లో నీహారిక గెటప్ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి హీరోయిన్ నీహారిక. TNN | Updated: Jan 13, 2016, 09:04AM IST ‘ఒక మనసు’లో నీహారిక గెటప్ ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి హీరోయిన్ నీహారిక. ఆమె హీరోయిన్ గా వస్తోంది అని తెలియగానే... చాలా వార్తలు వినిపించాయి. నీహారిక తెరంగేట్రం చేయడం మెగా బ్రదర్స్ కు ఇష్టం లేదని, కుటుంబం నుంచి ఆడవాళ్లెవరూ సినిమాల్లోకి రాకుండా ఉంటేనే బాగుణ్ను అన్న ఫీలింగ్ తోనే మెగా ఫ్యామిలీ ఉందని టాక్స్ వినిపించాయి. అయితే నీహారిక పట్టుబట్టి వాళ్ల నాన్నని ఒప్పించి సినిమాల్లోకి వచ్చింది. రామరాజు దర్శకత్వంలో నాగ శౌర్య పక్కన ‘ఒక మనసు’ సినిమాలో నటిస్తోంది. అయితే ఆ సినిమాలో నీహారిక ఎలా కనిపించబోతోందో అనే మెగా ఫ్యామిలీలోనే కాదు, అభిమానుల్లో కూడా ఉంది. అందుకే నీహారిక ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసింది. అందులో మనం నీహారికను ఇంతకు ముందెన్నటూ చూడని విధంగా డీ గ్లామర్ గా ఉంది. కాటన్ చీర, నున్నగా దువ్వి వేసిన జడ చాలా సింపుల్ గా ఉంది నీహారిక. ఇంతమరకు అభిమానులెవరూ ఆమెను ఇలా చూసి ఉండరేమో. అలాగే చీరకట్టు ఫోటో తో పాటూ, తన లేటెస్ట్ ఫోటో స్టిల్స్ కూడా కొన్ని పోస్టు చేసింది. అందులో పూర్తి అధునాతనంగా ఉంది నీహారిక. రెండు విధాలుగానూ నీహారిక అందంగానే కనిపిస్తోంది.
0business
చిన్న పట్టణాలకూ విమాన సేవలు - ఐదేండ్లలో 100 కొత్త విమానాశ్రయాలు న్యూఢిల్లీ: ఆసియాలో అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతున్న భారత్‌లో ఆర్థికవృద్ధికి గాను విమాన సేవల వ్యాప్తిని పెంచాలని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో భాగంగా రానున్న ఐదేండ్ల కాలంలో దేశంలోని చిన్నచిన్న పట్టణాలు, పెద్ద గ్రామాలను అనుసంధానం చేస్తూ దాదాపు 1000 కొత్త మార్గాల్లో విమాన సేవలను అందుబాటులోకి తేవాలని సర్కారు నిర్ణయించింది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా దేశంలో అదనంగా మరో 100 కొత్త విమానాశ్రయాలను అమలులోకి తేవాలని కూడా ప్రభత్వుం యోచిస్తున్నట్టుగా సమాచారం. దేశంలో మౌలిక వనరుల అభివృద్ధికిగాను సమావేశమైన ఉన్నత శ్రేణి అధికారుల బృందం గతవారం ఈ దిశగా సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ చర్చల్లో భాగంగా విమానాలను అద్దెకు తీసుకునే విషయమై చర్యలు చేపట్టే దిశగా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. 2025 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి తీసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు ఇందుకు గాను విమాన రంగాన్ని ప్రధానంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. దేశంలో పెట్టుబడులను పెంచి ఇన్వెష్ట్‌మెంట్‌ హబ్‌గా మార్చాలని భావిస్తున్న సర్కారు ఈ దిశగా ఇప్పటికే కార్పొరేట్‌ పన్నును భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగానే పొరుగున ఉన్న చైనా మాదిరిగానే మన దేశంలో కూడా విమాన సర్వీసుల విస్తృతిని పెంచాలని సర్కారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగానే దేశంలో శిక్షణ పొందిన కమర్షియల్‌ పైలట్ల సంఖ్యను కూడా 1,200లకు పెంచాలని నిర్ణయించినట్టుగా సమాచారం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 2.0: అక్షయ్ రూపురేఖలను మార్చేశారిలా.. 2.0 సినిమా కోసం అక్షయ్ కుమార్ వేసుకున్న మేకప్ కోసం పడిన కష్టాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. Samayam Telugu | Updated: Nov 16, 2018, 11:55PM IST 2.ఓ సినిమాలో ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్న అక్షయ్ కుమార్‌ భయానకంగా కనిపించేందుకు ఎంతో కష్టపడ్డారు. తన కెరీర్‌లో తొలిసారిగా ఆయన ఇలాంటి మేకప్ వేసుకున్నారు. ఇటీవల జరిగిన సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో అక్షయ్ మాట్లాడుతూ.. ఆ మేకప్ వేయడానికి 3 గంటలు పట్టేదని, తీయడానికి సుమారు గంటన్నర సమయం పట్టేదని తెలిపారు. సుమారు రూ.550 కోట్లతో నిర్మించిన ఈ సినిమాలో రజనీకాంత్ శాస్త్రవేత్తగా, రోబోగా ద్విపాత్రభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు అమీ జాక్సన్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ నెల 29న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్‌‌ను మేకప్‌తో పూర్తిగా భయనంగా మార్చేసిన వీడియోను చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ వీడియోను అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి. My look in #2Point0 is nothing short of a technological wonder! Watch to know how it was brought to life.… https://t.co/KoFg8l2rgC — Akshay Kumar (@akshaykumar) 1542364191000
0business
jio ఆఫర్‌ పొడిగిస్తున్న జియోసిమ్‌! ముంబై, జనవరి 20: ఆరునెలలపాటు ఉచిత సిమ్‌ ఆఫర్‌తో ఇతర టెలికాం కంపెనీలకు చమటలు పట్టిం చిన ఆర్‌జియో మరో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెడుతోందని సమాచారం. మరో ఆరునెలలు పొడిగిం చడం ట్రా§్‌ు నిబంధనలు ఉల్లంఘన వివాదాలు లేకుండా సరికొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు జియో యోచిస్తున్నట్లు తెలిసింది. ముఖేష్‌ అంబానీ ప్రవేశపెట్టిన రిలయన్స్‌జియో వెల్‌కమ్‌ ఆఫర్‌పేరిట ఉచిత సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హ్యాపీ న్యూఇయర్‌ఆఫర్‌ పేరిట వచ్చే మార్చి 31వ తేదీవరకూ పొడిగించింది. ఇటీవలే 7.2 కోట్ల కనెక్షన్ల మైలురాయిని చేరుకున్న ఆ సంస్థ తమ ఖాతాదారులను మరింత పెంచుకునేదిశగా ప్రయత్నా లు ముమ్మరంచేసింది. ఇందుకోసం స్వల్పరుసుంతోనే డేటా అందించడంతోపాటు ఉచిత కాల్స్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించిందని సమాచారం. కాల్స్‌కు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని గతంలోనే కంపెనీ పేర్కొన్నది. తాజాగా అమలుచేసే ఈ ఆఫర్‌ను కేవలం రూ.100కే అందించాలని జియో భావిస్తోంది ఈ ఆఫర్‌ను జూన్‌30వరకూ కొనసాగించాలని కసరత్తులు చేస్తోంది. ఆఫర్‌ ముగిసేలోగా కాల్‌డ్రాప్‌ సమస్యను పరిష్కరించుకు నేందుకు జియో విశేషంగా కృషిచేస్తోంది. ఇప్పటికే జియో ధాటికి ఇతర కీలక సంస్థలన్నీ కుదేలయ్యా యి. డేటా ఛార్జీలను సైతం భారీగా తగ్గించాయి.కొన్ని ప్రత్యేక ప్యాక్‌లతో ఉచిత కాల్స్‌ సదుపాయాన్ని సైతం ఆయా కంపెనీలు అందిస్తున్నాయి. తాజాగా మరో కొత్త ప్లాన్‌ జియో అమలుచేస్తే ఇక మార్కె ట్‌లో ఇతర సంస్థలకు కంటికి కనుకు ఉండదన్న సంగతి ప్రత్యేకించి విశ్లేషించాల్సిన అవసరం లేదు.
1entertainment
Hyd Internet 112 Views Gold gold ఢిల్లీ: వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం కాస్త తగ్గాయి. రూ.100 తగ్గడంతో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.30,525కి చేరింది. మరోవైపు వెండి ధర కూడా రూ.75 తగ్గడంతో కిలో వెండి ధర రూ.40,650కి చేరింది.స్థానిక తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో బంగారం ధర తగ్గినట్లు మార్కెటు వర్గాలు తెలిపాయి.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV విజయానికి చేరువలో టీమిండియా సఫారీలతో జరుగుతున్న నాల్గో టెస్టులో కోహ్లీ సేన తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. TNN | Updated: Dec 7, 2015, 02:05PM IST సఫారీలతో జరుగుతున్న నాల్గో టెస్టులో కోహ్లీ సేన విజయానికి చేరువైంది. చివరి రోజు ఆటలో సఫారీలు 131 పరుగులకే ఐదు వికెట్ల కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 481 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు తొలి నుంచి డ్రా కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ భారత్ స్పిన్ దాటికి తట్టుకోలేక వరుసగా క్యూ కడుతున్నారు. సఫారీల తరఫున డివిలియర్స్ (42) మాత్రమే ఒంటరీ పోరాటం చేస్తున్నాడు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా..టీమిండియా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్ విషయానికి వస్తే అశ్విన్ మూడు వికెట్లు తీయగా..జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకున్నట్లవుతుంది. ఇదే జరిగితే కోహ్లీ సేన చరిత్ర సష్టించినట్లే ..ఎందుకంటే గతంలో సఫారీలపై భారత్ ఎప్పడు ఇంతటి భారీ ఆధిక్యతను ప్రదర్శించలేదు. మరో వైపు ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ 4వ ర్యాంకు నుంచి రెండో స్థానానికి ఎగబాకుతుంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV స్టంపింగ్ మిస్ చేసిన డీకాక్.. కారణం తెలిస్తే నవ్వుతారు సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా సిరీస్‌లో వివాదాలే కాదు... ఫన్నీ సీన్లు క్రియేట్ అవుతున్నాయి. సపారీ కీపర్ డీకాక్‌కు సంబంధించిన ఓ వీడియాపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. Samayam Telugu | Updated: Apr 1, 2018, 01:28PM IST స్టంపింగ్ మిస్ చేసిన డీకాక్.. కారణం తెలిస్తే నవ్వుతారు సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా సిరీస్‌లో వివాదాలే కాదు... ఫన్నీ సీన్లు క్రియేట్ అవుతున్నాయి. సపారీ కీపర్ డీకాక్‌కు సంబంధించిన ఓ వీడియాపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. చివరికి బాల్ ట్యాంపరింగ్‌తో కూడా లింక్ పెడుతూ జోకులు వేస్తున్నారు నెటిజన్లు. చివరి టెస్ట్ రెండో రోజు ఆసీస్ బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ క్రీజులో ఉండగా... సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. మార్ష్ బాల్ ఆడేందుకు ముందుకు వచ్చాడు... అయితే కాని మిస్సయ్యాడు. వికెట్ల వెనకున్న డీకాక్ కూడా బాల్‌ను పట్టుకొని స్టంపింగ్ చేయలేకపోయాడు. డీకాక్ స్టంపింగ్ మిస్ చేయడంతో మార్ష్‌కు లైఫ్ వచ్చింది. అంత స్లోగా వస్తున్న బాల్‌ను ఎందుకు పట్టుకోలేకపోయాడోనని మిగిలిన ఆటగాళ్లు షాకయ్యారు. బాల్ వదిలేశాక డీకాక్ తన భుజాన్ని దులుపుకున్నాడు. సీన్ కట్ చేస్తే... కొద్దిసేపటి తర్వాత కాని అసలు విషయం తెలియలేదు. పాపం అతడి భుజంపై ఓ తేనటీగ వాలి కుట్టిందని. అందుకే బాల్‌ను వదిలేశాడని. ఇప్పుడీ వీడియోపై జోకులు పేలుతున్నాయి. ఐసీసీ వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కొంతమంది సెటైర్లు వేశారు. మరికొందరైతే ఆ ఈగ డీకాక్‌ను ఏప్రిల్ ఫూల్ చేసిందని పంచ్ వేశారు. తేనటీగపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని కూడా జోక్ చేశారు. X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
భారత్‌లో పోర్షే కొత్త మోడల్‌ మకాన్‌   న్యూఢిల్లీ,నవంబరు 15:జర్మనీ లగ్జరీకార్ల తయారీ సంస్థ పోర్షే కొత్తగా భారత్‌కు తక్కువధరతో కూడిన ఎస్‌యువి మకాన్‌ను విడుదల చేసింది. ముంబై ఎక్స్‌షోరూంధరగా రూ.76.84 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. మకాన్‌ ఆర్‌4గా చెపుతున్న ఈ కంపాక్ట్‌ ఎస్‌యువి ఏడుస్పీడ్‌ ఫిడికె డ్యూయల్‌ క్లచ్‌ట్రాన్స్‌మిషన్‌తోను, పోర్షే కమ్యూనికేషన్‌ మేనేజ్‌ మెంట్‌ తాజా వెర్షన్‌తో వస్తోంది. ఇంటీరియర్‌, ఎక్స్టీ రియర్లతో అనేక అధునాతన ఫీచర్లను పెంచింది. మకాన్‌రేంజిలో మరింతగా స్పోర్ట్స్‌కార్‌ లైన్‌అప్‌ కని పిస్తోంది. పోర్షే ఇం డియాడైరెక్టర్‌ పవన్‌ షెట్టి మాట్లాడుతూ ఆకర్షణీయమైన ధర ల్తో భారత్‌మార్కెట్‌ లో మరింత ముం దుకు పోతామని ఆయన అన్నారు. నాలుగు సిలిం డర్‌ టర్బోఛార్జిడ్‌ ఇంజన్‌ ఎంట్రీలెవల్‌ మకాన్‌ పని తీరుకు దర్పణం పడుతున్నది. ఈఏడాది అంతకు ముందే కంపెనీ తనతాజావెర్షన్‌ 911మోడల్‌ను భార త్‌లో విడుదల చేసింది. వీటిధరలు ఢిల్లీఎక్స్‌షోరూం ధరలుగా 1.42 కోట్ల నుంచి 2.66 కోట్ల వరకూ ఉన్నాయి. పోర్షేలగ్జరీ కార్ల పరంగా ఎస్‌యువిలు ఎక్కువ ఉత్పత్తిచేస్తోంది. కేమాన్‌, కేయిన్నె, మకాన్‌, బాక్స్‌టర్‌, 911, పానమెరా వంటి కార్లు భారత్‌లో కోటి రూపాయల నుంచి రూ.3కోట్లవరకూ ఉన్నాయి.
1entertainment
Hyderabad, First Published 13, Apr 2019, 12:49 PM IST Highlights ప్రస్తుతం రామ్  చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్  చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చరణ్ తదుపరి సినిమా ఏ దర్శకుడితో వుండనుందనేది ఆసక్తికరంగా మారింది. చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడిగా వంశీ పైడిపల్లి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. రీసెంట్ గా చరణ్ ను కలిసి వంశీ పైడిపల్లి ఒక లైన్ చెప్పాడట. లైన్ చాలా బాగుందనీ .. పూర్తి కథను సిద్ధం చేసి వినిపించమని చరణ్ చెప్పినట్టుగా వార్తలు గుప్పు మన్నాయి.  అయితే ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...వంశీ పైడిపల్లి చెప్పిన లైన్ విన్నా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. సురేంద్రరెడ్డి, కొరటాల శివ, క్రిష్ ల కథలు కూడా విన్నానని వీటిలో ఏది ముందుకు తీసుకెళ్లాలనే విషయమై ఇంకా ఓ క్లారీటీకి తాను రాలేదని చెప్పినట్లు సమాచారం. అయితే లైన్ బాగుందని, స్క్రిప్టు డెవలప్ చేయమని చెప్పారట.  దాంతో వంశీ పైడపల్లి ఇలాంటి సమాధానం ఎక్సెపెక్ట్ చేయకపోవటంతో షాక్ అయ్యారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఎవడు అనే సినిమా వచ్చి సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. దాంతో వెంటనే ఓకే చేసేస్తాడని అనుకున్న వంశీకు నిరాశే ఎదురైంది. అయితే స్క్రిప్టు పూర్తిగా డెవలప్ చేయమన్నారు కాబట్టి చేస్తారనే ఆశ కూడా ఉందట.  ఇక భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న  ఆర్ .ఆర్ ఆర్ సినిమాను, 2020 జూలై 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఆ తరువాతనే చరణ్ తన తదుపరి సినిమాను మొదలుపెట్టనున్నాడు.  'మహర్షి' మే 9వ తేదీన విడుదలకానుంది. Last Updated 13, Apr 2019, 12:49 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మురళీ విజయ్ ఒకే ఓవర్‌లో 4,4,6,2,6,4..! శుక్రవారం ఫీల్డింగ్ చేస్తూ యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో.. తొలి టెస్టులో ఆడేందుకు మురళీ విజయ్‌కి లైన్ క్లియరైంది. కానీ.. అతని పేలవ ఫామ్‌ నేపథ్యంతో.. అవకాశం ఇవ్వాలా..? వద్దా..? అనే మీమాంసలో టీమిండియా ఉండేది. Samayam Telugu | Updated: Dec 1, 2018, 03:56PM IST ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకి ముందు భారత్ ఓపెనర్ మురళీ విజయ్ జూలు విదిల్చాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ టీమ్‌తో సిడ్నీ వేదికగా ఈరోజు ముగిసిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో మెరుపు శతకం బాదిన మురళీ విజయ్ (129: 132 బంతుల్లో 16x4, 5x6).. జట్టులో పునరాగమనానికి మార్గం సుగుమం చేసుకున్నాడు. శుక్రవారం ఫీల్డింగ్ చేస్తూ యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో.. తొలి టెస్టులో ఆడేందుకు మురళీ విజయ్‌కి లైన్ క్లియరైంది. కానీ.. అతని పేలవ ఫామ్‌ నేపథ్యంతో.. అవకాశం ఇవ్వాలా..? వద్దా..? అనే మీమాంసలో టీమిండియా ఉండేది. అయితే.. ఈరోజు మెరుపు శతకంతో ఫామ్‌ని చాటుకున్న విజయ్ జట్టు బెంగని తీర్చేశాడు..! డ్రాగా ముగిసిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో స్పిన్నర్ జేక్ కార్డర్ వేసిన ఓ ఓవర్‌లో మురళీ విజయ్ విశ్వరూపం చూపాడు. అప్పటికి వ్యక్తిగత స్కోరు 74 వద్ద ఉన్న మురళీ విజయ్.. ఆ ఓవర్‌లో వరుసగా 4, 4, 6, 2, 6, 4 రూపంలో 26 పరుగులు బాదేసి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.
2sports
Hyderabad, First Published 1, Sep 2018, 12:17 PM IST Highlights ఒకప్పుడు దక్షిణాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని దాదాపు అగ్ర హీరోలందరితో జోడీ కట్టిన నటి శ్రియా ఇప్పటికీ నటిగా కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమె పలు సినిమాల్లో నటిస్తోంది. ఒకప్పుడు దక్షిణాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని దాదాపు అగ్ర హీరోలందరితో జోడీ కట్టిన నటి శ్రియా ఇప్పటికీ నటిగా కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమె పలు సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఆమె నటించిన 'నరగాసూరన్' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో శ్రియ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిందని సమాచారం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మీడియా ముందుకొచ్చిన ఈ బ్యూటీ కొన్ని విషయాలపై చర్చించింది. స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి, జయప్రద వంటి నటీమణులులానే మీరు కూడా రాజకీయాల్లోకి వెళ్తారా..? అనే ప్రశ్నకు సమాధానంగా శ్రియ ''నేను రాజకీయాలకు అస్సలు పనికి రాను. రాజకీయాల్లోకి రావాలంటే చాలా తెలిసుండాలి. నాకు వాటిపై కనీసం అవగాహన కూడా లేదు. నాకు రాజకీయ అర్హత కూడా లేదు'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక శివాజీ సినిమాలో రజినీకాంత్ తో కలిసి నటించడం తన భాగ్యమని రజినీకాంత్ వ్యక్తిత్వం గురించి గొప్పగా మాట్లాడింది.  ఇది కూడా చదవండి..
0business
ఓ బేబీ సక్సెస్ మీట్ లో సమంత, రానా దగ్గుబాటి (ఫొటోస్) First Published 7, Jul 2019, 5:09 PM IST సమంత నటించిన ఓ బేబీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఓ బేబీ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయపథంలో దూసుకుపోతోంది. ఆదివారం రోజు ఓ బేబీ చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు ఆరడుగుల ఆజానుబాహుడు రానా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ చిత్రానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.  ఓ బేబీ సక్సెస్ మీట్ లో సమంత ఓ బేబీ సక్సెస్ మీట్ లో సమంత ఓ బేబీ సక్సెస్ మీట్ లో సమంత ఓ బేబీ సక్సెస్ మీట్ లో సమంత ఓ బేబీ సక్సెస్ మీట్ లో సమంత ఓ బేబీ సక్సెస్ మీట్ లో సమంత ఓ బేబీ సక్సెస్ మీట్ లో సమంత ఓ బేబీ సక్సెస్ మీట్ లో సమంత ఓ బేబీ సక్సెస్ మీట్ లో సమంత ఓ బేబీ సక్సెస్ మీట్ లో సమంత ఓ బేబీ సక్సెస్ మీట్ లో సమంత Recent Stories
0business
BSE111 ఇన్వెస్టర్లకు రుచించని ట్రంప్‌ పన్ను సంస్కరణలు ముంబై: మార్కెట్లలో ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ డెలివరీలముగింపు, ఇన్వె స్టర్ల నిరాసక్తతకుతోడు అమెరికా పన్నుల సంస్కరణల్లో డొనాల్డ్‌ట్రంప్‌ విధానంపై ఇన్వెస్టర్ల పెదవి విరుపులతో మార్కెట్లు మందగమ నంతోనే ముగిసాయి. అలాగే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు సమీక్షా సమావేశంపై కూడా ఇన్వె స్టర్లు ఆసక్తితో ఉన్నారు. బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌, నిఫ్టీలు కూడా ముందురోజు నుంచి తిరోగమించా యి. 104 పాయింట్లు తగ్గి 30,030 పాయింట్లకు చేరగా నిఫ్టీ 50సూచి 9342 పాయింట్లవద్ద ముగి సి పదిపాయిట్లు క్షీణించింది. రెండుసూచీలు కూడా గత రికార్డుస్థాయి ముగింపులనుంచి దిగివచ్చాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌సూచి 0.07శాతం పెరిగితే స్మాల్‌క్యాప్‌సూచి 0.02శాతం దిగజారింది. కాంట్రాక్టు డెలివరీల ముగింపుకారణంగా మార్కెట్లు క్రమానుగతంగా ట్రేడింగ్‌ ఝరిగిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ ప్రతినిధి వినోద్‌నాయర్‌ అన్నారు. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకుల సమీక్షలపై కూడా ఎక్కువ దృష్టి పడిందని అందువల్లనే మందగమనంతో ముగిసి నట్లు ఆయనవ వెల్లడించారు. ఇక స్టాక్ప్‌రంగా టాటామోటార్స్‌, ఇన్ఫోసిస్‌, సిప్లా, విప్రో బిఎస్‌ఇ లో ఎక్కువ లాభపడ్డాయి. లూపిన్‌, ఐటిసి, టాటా స్టీల్‌, యాక్సిస్‌బ్యాంకులు నష్టపోయాయి. కోటక్‌ మహీంద్ర బ్యాంకు 1.5శాతం పెరిగింది. మారుతి సుజుకి 0.7శాతం క్షీణించి 15.8శాతం నికరలాభా లు పెరిగి 1709 కోట్ల లాభాలు వచ్చినా షేర్లు మందగమనంతోనే ముగిసాయి. ఇక ఆదాని ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 13శాతంపెరిగి ఇంట్రాడేలో భారీగా ధరలు పలికాయి. చివ రికి ఐదుశాతం దిగువన ముగిసింది. యాక్సిస్‌ బ్యాంకు 1.7శాతం దిగజారింది. నికరలాభాల్లో 43శాతం దిగజారడమే ఇందుకు కారణం. ప్రపంచ మార్కెట్లు రికార్డుస్థాయిలో ర్యాలీ తీసినా దేశీయంగా ప్రభావం చూపించలేదు. అమెరికా పన్ను కుదింపు ప్రణాళికలు ఇన్వెస్టర్లకు ఉపశమనం కలిగిస్తాయని అంచనావేసారు. అయితే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు సమావేశంపై ఇన్వెస్టర్లు ఎక్కువ గురిపెట్టారు. యూరోప్‌ ప్రధాన ఎక్ఛేంజిలు 0.7శాతం దిగువన ముగిసాయి. మొదటి విడత ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలు యూరోప్‌ ఆదాయవనరులు, ఆర్థికగణాంకాలకు ఊతం ఇచ్చాయని అంచనా. ఆసియా మార్కెట్లపరంగా కొంత వెను కంజలోనే ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ తన ఆర్థిక అధ్యయనం ప్రకారం తన సమీక్ష వివరాలపై ఎక్కువ దృష్టిపడింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతషేర్లు మొత్తంగా నిలకడగా ముగిసాయి.
1entertainment
Hyderabad, First Published 2, Feb 2019, 2:06 PM IST Highlights  సల్మాన్ సూపర్ హిట్ చిత్రం ‘ఏక్ థా టైగర్’అప్పట్లో రికార్డ్ లు క్రియేట్ చేసింది.  సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఇండియా సీక్రెట్ ఏజెంట్ టైగర్ పాత్రలో కనిపించగా, కత్రినా కైఫ్ పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ ఏజెంట్ పాత్రలో కనిపించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి కభీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కథనే కొద్దిపాటి మార్పులతో గోపిచంద్ తో చేస్తున్నట్లు సమాచారం.  సల్మాన్ సూపర్ హిట్ చిత్రం ‘ఏక్ థా టైగర్’అప్పట్లో రికార్డ్ లు క్రియేట్ చేసింది.  సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఇండియా సీక్రెట్ ఏజెంట్ టైగర్ పాత్రలో కనిపించగా, కత్రినా కైఫ్ పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ ఏజెంట్ పాత్రలో కనిపించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి కభీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కథనే కొద్దిపాటి మార్పులతో గోపిచంద్ తో చేస్తున్నట్లు సమాచారం.  వరుసగా ప్లాఫ్ లతో సతమటువుతున్న గోపిచంద్ రెగ్యులర్ సినిమాలు కాకుండా వెరైటీ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. మారుతున్న తెలుగు సినిమాని పట్టుకోపోతే తను పూర్తి స్దాయిలోవెనకపడతానని గూఢచారి తరహా ఈ  స్పై థ్రిల్లర్ కు సై అన్నట్లు సమాచారం.  తమిళ దర్శకుడు తిరు సుబ్రహ్మణ్యం ఈ కథను వినిపించగా బాగా నచ్చేసి షూటింగ్ మొదలెట్టేసారు. ఇప్పటివరకు తానూ చేయని కొత్త జోనర్ కావడం, పాత్ర చాలా కొత్తగా అనిపించడంతో ఒప్పుకున్నాడట. యాక్షన్ ఎంటర్టైనర్ గా అనిపించినప్పటికీ కొత్త కోణంలో కథ ముందుకు వెళుతుందని అంటున్నారు. జనవరి 18 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభమైంది. 2019, మే నెలలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.  విశాల్ చంద్ర‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. వెట్రి ఫ‌ల‌నిస్వామి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో గోపీచంద్ స‌ర‌స‌న రాశిఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. స్పై థ్రిల్ల‌ర్ గా రూపొందే ఈ సినిమాలో గోపిచంద్ కొత్త లుక్ లో క‌నిపించ‌నున్నాడ‌ట‌.   Last Updated 2, Feb 2019, 2:06 PM IST
0business