news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
GST
జిఎస్టి మండలికి పన్ను పెంపు అధికారమా?
న్యూఢిల్లీ,: వస్తుసేవల చట్టం అమలయితే భవిష్యత్తులో పార్లమెంటు ఆమోదం అవసరం లేకుండానే జిఎస్టి మండలి అవసరమైతే ఎంపికచేసిన ఉత్పత్తులపై 40శాతం వరకూ పన్నువిధించే అధికారాలు సంక్రమిస్తున్నాయి. అయితే ఈ విధానాన్ని పన్నురంగ నిపుణులు తిరస్కరిస్తున్నారు. భవిష్యత్తులోమరింత ఉదాసీనత పనికరాదని, అందరికీ అందుబాటులో ఒకేవిధమైన పన్నువిధానం మేలని సూచించారు. ఆర్ధికమంత్రి అరుణ్జైట్లీ అధ్యక్షతన సమావేశం అయిన జిఎస్టి మండలి పీక్రేట్ను 20శాతంగా నిర్ణయించింది. సిజిఎస్టి, ఎస్జిఎస్టిలకు కూడా ఇదే అమలవుతుందని వెల్లడించింది.ప్రస్తుత ముసాయిదాలో ఉన్న 14శాతంనుంచి 20శాతం వరకూ ఉంది.
అయితే ఈ పరిమితిని గరిష్టంగా ఉన్న 28శాతంనుంచి 40శాతంవరకూ పెంచుకునే అవకాశం జిఎస్టి మండలికి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పన్నుశ్లాబ్లను మార్చడం మంచిది కాదని, నాలుగు శ్లాబ్ల జిఎస్టి నిర్మాణక్రమం ఐదుకు మార్చకూడదదని చెపుతున్నారు. 12, 18,28శాతంగా మాత్రమే కొనసాగాలని సూచిం చారు. ప్రభుత్వం జులై ఒకటవ తేదీనుంచి జిఎస్ టిని అమలుచేయాలని నిర్ణయించింది. జిఎస్టి మోడల్ చట్టాలు గత ఏడాది నవంబరులోనే పబ్లిక్ డొమైన్కు ఉంచారు. గరిష్టంగా జిఎస్టి పన్నురేటు సిజిఎస్టికి 14శాతం, ఎస్జిఎస్టికి 14శాతంగా మాత్రమే కొనసాగించాలని సూచించాయి. ప్రస్తుతం ఉన్న 14శాతాన్ని 20శాతానికి మించకూడదు అన్న వివరణ పొందుపరిచేందుకు మండలికి దఖలుపడుతున్నాయి. శని, ఆదివారాల్లో మండలి సమావేశం అయి సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి చట్టాలను ఆమోదించాల్సి ఉంది. ఈసమావేశాల్లోనే ఈ సవరణను కూడా చర్చకు తెస్తుందని అంచనా. అయితే జిఎస్టి అమలు తర్వాత పన్నురేట్లు పెరిగితే పరిశ్రమ రంగం మొత్తం ఆందోళనకు గురవుతుందని, పరోక్షపన్నుల నిపుణులు పిడబ్య్లుసి ప్రతినిధిప్రతీక్ జైన్ అన్నారు.
ఈనిర్ణయాన్ని మండలి పునరాలో చన చేయాలని సూచించారు. సిజిఎస్టి బిల్లును రెండో బడ్జెట్ సమావేశంలో కేంద్రంప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈనెల 9వ తేదీనుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతాయి. విలాసవంతమైన ఉత్ప త్తులపైన, మత్తుపానీ యాలపైనా పన్ను పెంచే అవకాశం ఉంది. విలాసవంతమైన కార్లు, మత్తుపానీయాలు, పొగాకు ఉత్పత్తులు వంటి వాటిపై గరిష్టస్థాయి పనున ఉంటుంది. మొదటి ఐదేళ్లలో జిఎస్టి అమలు ద్వారా రాస్ట్రాలకు ఒనగూరే నష్టం భర్తీకి ఈ రాబడులు ఉపయో గిస్తుంది.
| 1entertainment
|
ROHI1
ఇండియా బ్లూ సారథిగా రోహిత్శర్మ
న్యూఢిల్లీ: గాయం కారణంగా అంతర్జాతీయ జట్టుకు దూరమైన క్రికెటర్ రోహిత్ శర్మ దేవ్ధర్్ ట్రోపికి ఎంపికయ్యాడు. తాజాగా నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో ఆయన పాస్ కావడంతో సెలక్టర్లు రోహిత్ను ఎంపిక చేశారు. ఇటీవల ముగిసిన విజ§్ు హజారే ట్రోఫీలో రోహిత్ ముంబయి తరపున బరిలోకి దిగాడు.దేవ్ధర్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా బ్లూ, ఇండియా రెడ్ జట్ల బృందాన్ని బిసిసిఐ తాజాగా ప్రకటించింది. ఇండియా బ్లూకు రోహిత్ శర్మ,ఇండియా రెడ్కు పార్థివ్ పటేల్ సారథ్య బాధ్యతలు చేపట్టారు. మార్చి 26 నుంచి 29 వరకు విశాఖలో దేవ్ ధర్ ట్రోఫి జరుగనుంది. ఈ టోర్నీలో విజ§్ు హజారే ట్రోఫీ విజేత తమిళ నాడు జట్టు కూడా పాల్గొంటుంది.2016 అక్టోబరులో న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో రోహిత్ గాయపడిన సంగతి తెలిసిందే.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బాలయ్య.. రెమ్యూనరేషన్ ఎంత?
వరస పెట్టి సినిమాలను ఓకే చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ.
TNN | Updated:
Dec 8, 2017, 01:15PM IST
వరస పెట్టి సినిమాలను ఓకే చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ‌. ప్రస్తుతం బాలయ్య ‘జై సింహా’తో బిజీగానే ఉన్నాడు. సంక్రాంతి బరిలో నిలవబోతోంది ఈ సినిమా. ఇంతలోనే మరో రెండు కొత్త సినిమాలకు ఓకే చెప్పాడట బాలయ్య. అందులో ఒకటి సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా కాగా, మరోటి బోయపాటి దర్శకత్వంలో రూపొందే సినిమా. దశాబ్దాల విరామం తర్వాత ఎస్వీకేతో బాలయ్య పని చేయబోతున్నాడు. ఇక బోయపాటి, బాలయ్యలది హిట్ కాంబో అని వేరే చెప్పనక్కర్లేదు.
ఈ రెండూ గాక ఎన్టీఆర్ బయోపిక్ ను కూడా చేపట్టే ఆసక్తితో ఉన్నాడు బాలకృష్ణ‌. ఆ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ఆరంభం అవుతుందని మొదట వార్తలు వచ్చినా.. ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. బోయపాటి, ఎస్వీకేలతో సినిమాలు పూర్తి చేసిన తర్వాతే తండ్రి బయోపిక్ ను పట్టాలెక్కిస్తాడట బాలయ్య.
| 0business
|
ANDERSIN
ఢిల్లీని గెలిపించిన అండర్సన్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) -10 సీజన్లో భాగంగా మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్కు చెందిన ఆటగాడు యువరాజ్ దూసుకుపోయాడు. సన్ రైజర్స్ హైదరా బాద్ 186 పరుగులు టార్గెట్ను ఢిల్లీకి నిర్ధేశించింది.ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్కు దిగి 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.దీంతో సన్ రైజర్స్పై ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయంసాధించింది. యువరాజ్ 41 బంతులు ఆడి 11 బౌండరీలు,1 సిక్సర్తో సొగసైన ఇన్నింగ్స్ ఆడి అదుర్స్ అని పించినా ప్రయోజం లేకుండా పోయింది. మొదట నెమ్మదిగా ఆడిన యువరాజ్ చివరి ఓవర్లలో రెచ్చి పోయాడు.
ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు.ఒక లైఫ్తో బతికిపోయిన యువరాజ్ దాన్ని చక్కగి విని యోగం చేసుకున్నాడు.క్రిస్ మోరిస్ బౌలింగ్లో యువరాజ్ ఇచ్చిన క్యాచ్ను సంజూ శాంసన్ వదిలే యడంతో ఢిల్లీ భారీ మూల్యమే చెల్లించుకుంది. ప్రధానంగా ఆ క్యాచ్ వదిలేసిన తరువాత యువరాజ్ తన దైన షాట్లతో అలరించాడు.టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్కు శుభారంభం లభించింది.డేవిడ్ వార్నర్ 21 బంతులు ఆడి 4 బౌండరీలు,1 సిక్సర్తో 30 పరుగులు,శిఖర్ ధావన్ 17 బంతులు ఆడి 4 బౌండరీ లు,1 సిక్సర్తో 28 పరుగులు చేసి ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు.ఈ జోడీ 53 పరుగులను జత చేసిన తరు వాత వార్నర్ తొలి వికెట్గా పెవిలియన్కు చేరాడు.ఆ సమయంలో ధావన్తో కలిసి కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ నడిపించాడు.అయితే జట్టు స్కోరు 75 పరుగులు వద్ద ఉండగా ధావన్ ఔటయ్యాడు.
ఆ తరువాత స్వల్ప వ్యవధి లో విలియమ్సన్ 24 పరుగులు చేసి పెవిలియన్కు చేరడంతో సన్ రైజర్స్ వేగం తగ్గింది.పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసి సన్ రైజర్స్ 13 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది.ఆ సమయంలో యువరాజ్,హెన్రిక్స్లు నెమ్మదిగా ఇన్నింగ్స్ను నిర్మించారు.ముందు ఎటువంటి భారీ షాట్లకు పోకుండా క్రీజులో కుద రుకునే యత్నం చేశారు.ఈ క్రమంలోనే యువరాజ్ ఇచ్చిన క్యాచ్ను ఢిల్లీ ఫీల్డర్లు జార విడిచారు.అప్పటికే యువరాజ్ స్కోరు 30 పరుగులు లోపే.ఆ తరువాత యువరాజ్ మరింత వేగంగా ఆడి సన్ రైజర్స్ స్కోరు బోర్డును పరు గులు పెట్టించాడు.అతనికి హెన్రిక్స్ 25 పరుగులతో చక్కటి సహకారాన్ని అందివ్వడం తో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
నిలదొక్కుకున్న ఢిల్లీ టాపార్డర్: సన్ రైజర్స్ హైదరాబాద్ తరువాత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది.ఢిల్లీ టాపార్డర్ బాగా నిలదొక్కుకుంది. ఓపెనర్ శాంసన్ 19 బంతులు ఆడి 2 బౌం డరీలు,1 సిక్సర్తో 24 పరుగులు చేసి మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ధావన్కు క్యాచ్ ఇవ్వడంతో ఔటయ్యాడు.మరో ఓపెనర్ నయర్ 20 బంతులు ఆడి 5 బౌండరీలు,2 సిక్సర్లతో 39 పరుగులు చేసి కౌల్ బౌలింగ్లో కుమార్కు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్కు చేరాడు.ఇక పంత్ 20 పరుగులు ఆడి 4 బౌండరీలు,1 సిక్సర్తో 34 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో వెనుదిరగగా,అయ్యర్ 25 బంతులు ఆడి 1 బౌండరీ,2 సిక్సర్లతో 33 పరుగులు చేసి కుమార్ బౌలింగ్లో సిరాజ్కు క్యాచ్ ఇవ్వడంతో ఔటయ్యాడు.అండర్ సన్ 24 బంతులు ఆడి 2 బౌండరీ,3 సిక్సర్లతో 41 పరుగులు మోరిస్ 7 బంతులు ఆడి 1 బౌండరీ,1 సిక్సర్తో 15 పరుగులు చేశాడు.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
హీరో కెరీర్లో ఖరీదైన ఇంట్రడక్షన్ సాంగ్
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది.
| Updated:
Nov 15, 2015, 10:30PM IST
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా సినిమాని ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్. ప్రస్తుతం హైదరాబాద్లో బాలకృష్ణ ఇంట్రడక్షన్ సాంగ్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. గమ్ గమ్ గణేషా పల్లవితో సాగే ఈ పాట కోసం కోటి రూపాయల వ్యయంతో షూట్ చేస్తున్నట్లు సమాచారం. భారీ వినాయకుడి సెట్లో బాలకృష్ణతో పాటు 500మంది డ్యాన్సర్లపై చిత్రీకరిస్తున్న ఈ పాటకి ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించినట్లు తెలిసింది. బాలకృష్ట సినిమాల్లో ఇదే అంత్యంత ఖరీదైన ఇంట్రడక్షన్ సాంగ్గా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. డిక్టేటర్ చిత్రానికి ఈ పాట ప్రధానాకర్షణగా నిలువనుందని సమాచారం. బాలకృష్ణ పాత్ర రెండు డిఫరెంట్ షేడ్స్లో శక్తివంతగా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అంజలి , అక్ష, సోనాల్చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ రెండో వారంలోగా చిత్రీకరణను పూర్తిచేసి అదే నెల 20న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆడియో వేడుకను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
| 0business
|
Bindra, kanchanamala
బెర్లిన్లో కాంచనమాల భిక్షాటన పరిస్థితి
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన పారాఅథ్లెట్ కాంచనమాల పాండే బెర్లిన్లో భిక్షాటనతో ఉండాల్సిన పరిస్తితి దాపురించింది.. జర్మన్ రాజధానిలో ఈనెల 3 నుంచి 9 వరకూ జరిగిన పారా స్విమ్మింగ్ ఛాంపియన్షఇప్ పోటీల్లో కాంచనమాల పాలొంది. భారత్ నుంచి కాంచనమాలతోపాటు మరొక అయిదురుగు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.. పూర్తిగా అంధురాలైన కాంచనమాల ఎస్ 11 కేటగిరీలో పోటీలో పాల్గొంటున్నది.. ప్రభుత్వం ఆమెకు మంజూరు చేసిన డబ్బు అందకపోవటంతో ఆమె భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. దీనిపై భారత్ షూటర్ అభివన్ బింద్రా తీవ్రంగా స్పందించారు.. ప్రధాని మోడీ , క్రీడాశాఖ మంత్రి విజయగోయెల్ ఈ అంశంలో కలుగజేసుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు.
| 2sports
|
Degital Transactions
డిజిటల్ లావాదేవీలకు భద్రత కరవే
న్యూఢిల్లీ, డిసెంబరు 14: డిజిటల్ లావాదేవీలవైపు చైతన్యం కావాలని ప్రభుత్వంఓపక్క ఆఫర్లు, లక్కీడ్రాలతో ప్రజల్లో అవ గాహన పెంచేందుకు పెద్ద ఎత్తున కృషిచేస్తుంటే భారత్లో మొబైల్ చెల్లింపుల వ్యవస్థలు ఏమాత్రం భద్రతాపూర్వకంగా లేవని ప్రముఖ చిప్సెట్ తయారీ సంస్థ క్వాల్కామ్ ప్రకటిం చింది. మొబైల్ వ్యాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్లు విని యోగం భారత్లో ఏమాత్రం శ్రేయస్కరం కాదని వాదిస్తోంది.
హార్డ్వేర్స్తాయిలో సెక్యూరిటీని వినియోగించకపోవడం వల్లనే ఆన్లైన్ లావాదేవీల్లో సెక్యూరిటీ తగ్గుతోందని అనుమనిం చింది. బ్యాంకింగ్ లేదా మనీవ్యాలెట్ యాప్స్ ప్రపంచ వ్యాప్తం గా హార్డ్వేర్ సెక్యూరిటీని వినియోగించడంలేదని, ఇవి మొత్తం ఆండ్రాయిడ్ విధానంలో కొనసాగుతున్నట్లు వివరించింది. విని యోగదారులు పాస్వర్డ్లను సులువుగాతస్కరించేందుకు వీలుం దని వివరించింది. కస్టమర్లు వేలిముద్రలను వినియోగించాల్సి ఉంటుందని, ఎక్కువశాతం డిజిటల్ వ్యాలెట్లు, మొబైల్ బ్యాం కింగ్ యాప్స్లో ఈ తరహా లేనేలేవని వివరించింది. క్వాల్ కామ్ సీనియర్ డైరెక్టర్ ఎస్వై చౌదురి మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ డిజిటల్చెల్లింపుల అప్లికేషన్ వ్యవస్థలన్నింటిలోను హార్డ్వేర్ స్థాయి సెక్యూరిటీ వినియోగంముఖ్యమని వివరిం చారు. వాస్తవ యంత్రసామగ్రి తయారీ దారులకు మాత్రమే తాము పనిచేస్తున్నందున హార్డ్వేర్ సెక్యూరిటీ లేనేలేదని చౌదరి వివరించారు.
మార్కెట్ పరిశోదన సంస్థ స్ట్రాట జీ అనలిటిక్స్ అంచనాలప్రకారం క్వాల్కామ్ మొబైల్ చిప్సెట్ మార్కెట్లో 37శాతం వాటాతో ఉంది. ప్రతి ఒక్కరివద్ద ఉన్న స్మార్ట్ఫోన్, ఫీచర్ఫోన్ సెక్యూరిటీతో సహా నోట్లరద్దుకు అనుకూలం ఎలా అవుతుందని తెలుస్తుందని, డిజిటల్ వ్యవస్థలో కీలకం హార్డ్వేర్ సెక్యూరిటీయేనని చౌదరి వివరించారు. ఈ చెల్లింపుల వ్యవస్థలో కంపెనీలు రక్షణపూరిత చెల్లింపు వ్యవస్థను కల్పిం చాల్సిన బాధ్యత ఉందని ఆయనఅన్నారు. 2017 నుంచి క్వాల్కామ్ తమ చిప్సెట్లలో కొత్త ఫీచర్లను తెస్తున్నట్లు తెలిపారు. పేమెంట్ గేట్వేతోపాటు ఫోన్ ఐడి, ఫోన్ ఉత్పత్తిదారు సంతకం, ఆండ్రాయిడ్ వెర్షన్, నిర్వహణ వ్యవస్థ రూట్కిట్, ప్రస్తుతం ఉన్న ప్రాంతం, సమయం వంటివి కొంత వరకూ తస్కరణకు వీలు కల్పించవని వీటన్నింటినీ కల్పించి కొత్త చిప్సెట్లు తెస్తున్నట్లు వివరించారు.
ఈ కొత్త చిప్సెట్లతో ఉన్న పరికరాలను 2017లోనే ఎగుమతులుచేస్తామని 2017 చివరికల్లా ఈ చిప్సెట్ ఉన్న ఫోన్లు అందుబాటులోనికివస్తాయని చౌదరి అన్నారు. ఇందుకోసం తమ కంపెనీ అవస్త్తో భాగస్వామ్యం తీసుకుందని, వైరస్, లేదా మాల్వేర్తో నిండి ఉన్నట్లయితే ఫోన్లద్వారానే వినియోగదారులకు హెచ్చరిక లు పంపిస్తుందని అన్నారు. భద్రతా పూర్వకచర్యల్లో భారత్లోనిఆధార్ ధృవీకర ణ ఎంతోఆమోఘంగా పని చేస్తుందనిఅన్నారు. భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆధార్ ప్రక్రియప్రపంచంలోని ఎన్నో దేశాలు అమలుచేయలేదని, ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని ప్రశంసించారు.
ఇదిలా ఉండగానగదు రహిత ఆర్థిక వ్యవస్థలో 2017లోభారత్లో మొబైల్లావాదేవీల మోసా లు 65శాతం పెరుగుతాయని సర్వేలు చెపుతున్నా యి. పెద్దనోట్ల రద్దుతో మొబైల్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు,ఇ-వ్యాలెట్లు ఎక్కువగా చెల్లింపులకు కీలకమయ్యా యని అసోచామ్, ఎర్నెస్ట్యంగ్ సంస్థల సంయుక్త సర్వేలో వెల్లడించారు. వ్యూహాత్మక జాతీయ సైబర్ నేరాల నియంత్రణ వ్యవస్థను అమలుచేయకపోతే మరింతగా మోసాలు పెరుగుతా యన్నారు. ఆర్థికలావాదేవీలపరంగా మొబైల్మోసాలు 40-45 శాతంగా నమోదవుతున్నాయి. మొబైల్ ఫోన్లసాయంతో చేస్తు న్న ఈ లావాదేవీలు ఇకపై 60-65శాతం పెరుగుతాయని అం చనా.
ఇప్పటికే క్రెడిట్, డెబిట్కార్డు మోసాలు ఎక్కువగా ఉన్నా యి.
గతమూడేళ్లలోనే ఆరురెట్లు పెరిగినట్లు ఈసంస్థల సర్వేలో తేలింది. 46శాతం ఫిర్యాదులు ఆన్లైన్ బ్యాంకింగ్ ఆధారిత ఫిర్యాదులు, క్రెడిట్, డెబిట్కార్డు ఫిర్యాదులే ఎక్కువ ఉన్నాయి. అలాగే ఫేస్బుక్ ఆధారిత ఫిర్యాదులు ఎక్కువ ఉన్నాయి. 39 శాతం నమోదయినట్లు అంచనా. ఎక్కువశాతం చిత్రాలను మార్ఫిం గ్ చేయడం, సైబర్ సమాచారం స్తంభింపచేయడం, వంటివి ఉన్నాయి. మొబైల్ద్వారా మోసాలు 21శాతం, ఇమెయిల్ ఐడిలు హ్యాకింగ్ల ద్వారా 18శాతం మోసాలు జరుగుతున్నాయి. ఇక ఎస్ఎంఎస్లు, ఇతర కాల్స్ ద్వారా 12శాతం మోసాలు జరుగుతు న్నాయి. డేటాసెక్యూరిటీ కార్యాచరణమరింతగా పెరగాల్సిన అవస రాన్ని భారత ఐటి మంత్రిత్వశాఖ గుర్తెరగాల్సి ఉంది. ఆర్థికపరం గాను, మేధో సంపత్తిపరంగా కస్టమర్ల కీలక సమాచారానికి భద్ర త, గోప్యత కల్పించాల్సినబాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పాల్సిందే.
| 1entertainment
|
భరత్ అనే నేను మూవీ రివ్యూ... మహేష్ అదర గొట్టేశాడు
Highlights
సెల్యూట్ టు భరత్ అనే నేను
మహేష్ బాబు చాలా కాలం నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీమంతుడు వంటి ఇండస్ర్టీ హిట్ తర్వాత కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా భరత్ అనే నేను. 'భరత్ అనే నేను’ చిత్రం
ద్వారా బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు మన ప్రిన్స్ మహేష్ బాబు. ‘త్వరలోనే మీ అందరినీ మాట మీద నిలబడే మగాళ్లను చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం’ చేస్తూ మరోసారి సొసైటీకి
మెసేజ్ ఇస్తున్నారు యంగ్ అండ్ స్టైలిష్ ముఖ్యమంత్రి మహేష్. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జోడీగా తెరకెక్కిన
‘భరత్ అనే నేను’ ఈ రోజు థియేటర్లలో సందడి మొదలైంది. మరీ భరత్ అనే నేను సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
చిన్నతనంలోనే లండన్కు వెళ్ళి అక్కడే చదువు పూర్తి చేస్తాడు భరత్ . భరత్ తండ్రి రాఘవ(శరత్ కుమార్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సడన్గా రాఘవ మరణించడంతో లండన్ నుండి ఇండియాకు భరత్ వచ్చేస్తాడు. రాఘవ ప్రాణమిత్రుడు వరదరాజులు(ప్రకాష్ రాజ్), భరత్కు రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేకపోయినా.. పార్టీ రెండుగా చీలిపోకుండా ఉండడానికి అతడిని ముఖ్యమంత్రిని చేస్తారు. అలా ముఖ్యమంత్రి అయిన భరత్ తన భాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? తన సొంత పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయనే విషయాలను ఎలా జీర్ణించుకోగలిగాడు..? రాజకీయాలంటే ఏమీ తెలియని ఒక యువకుడు ముఖ్యమంత్రిగా తన బాధ్యతను ఎలా నిర్వర్తించాడు..? వసుమతితో ఈ యంగ్ సీఎం ప్రేమ ఏమవుతుంది..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
రాజకీయాలంటే ఏంటో కూడా తెలియని ఒక యువకుడు ఎనిమిది నెలల్లోనే ఎన్నో సేవలు చేస్తే.. రాజకీయంగా ఎంతో పండిపోయి ఉన్న మన నేతలు ప్రజలకు ఇంకెంత మంచి చేయొచ్చనే ఆలోచనను రేకెత్తించాడు. ట్రాఫిక్ ఇష్యూ.. అసలు ముఖ్యమంత్రి కాన్వాయ్ రోడ్ మీదకు వస్తే ట్రాఫిక్ అంతా ఎందుకు బ్లాక్ చేయాలనే సీన్ను చూపించడం నేటి పరిస్థితులకు అద్దం పడుతోంది.
ఈ మధ్య కాలంలో మీడియా కూడా కొన్ని విషయాలను మరింత సాగదీసి కావాలని టీఆర్పీ రేటింగులు పెంచుకోవడం కోసం బలవంతంగా అడ్డమైన వార్తలతో ప్రజలపై రుద్దుతున్నారు. అలాంటివారిని టార్గెట్ చేస్తూ కొరటాల బలమైన సన్నివేశాలనే రాసారు. మహేష్ బాబు లాంటి హీరో ఇమేజ్ను ఎలివేట్ చేస్తూ మరోపక్క ఎంతో స్టైలిష్గా చూపించడంలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. యంగ్ అండ్ స్టైలిష్ ముఖ్యమంత్రిగా తెరపై మహేష్ బాబు చక్కగా నటించాడు. యాక్షన్, ఎమోషన్, లవ్ ఇలా ప్రతి సీన్లో బాగా నటించాడు. ఫ్యామిలీలో ఉండే ఎమోషన్ ఎక్కడో.. ఈ సినిమాలో మిస్ అయిందనిపిస్తుంది. హీరోయిన్ కియారా అద్వానీ తెరపై పాటలకు రెండు మూడు సీన్లకే పరిమితమైంది.
ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ వంటి నటులు తమ నటనతో పాత్రలకు న్యాయం చేశారు. అనవసరమైనవి ఏవీ సినిమాలో కనిపించవు. ప్రతిదీ కథలో భాగంగానే ఉంటుంది. 'భరత్ అనే నేను' టైటిల్ సాంగ్, సినిమాకు ప్రాణం పోసింది. తెరపై ఆ పాట ఎన్నిసార్లు వస్తున్నా.. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఉంది. 'వచ్చాడయ్యో సామీ' పాటలో మహేష్ పంచెకట్టుతో చేసే డాన్స్ ఫ్యాన్స్ కు ఐఫీస్ట్. తిరు సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. సినిమా నిడివి మూడు గంటలకు దగ్గరగా ఉన్నా.. ఆడియన్స్ కు ఎక్కడా బోర్ అనిపించదు. కమర్షియల్ ఈ సినిమా ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి.
ప్లస్ పాయింట్స్ : ఏదైనా సినిమా చూసామంటే ముందుగా ఏ సీన్ హైలైట్గా నిలిచిందో.. మాట్లాడుకుంటాం. ఈ సినిమాలో అటువంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ముందుగా మహేష్ బాబు ప్రమాణ స్వీకారం చేసే సీన్.. '' అని ఎప్పుడైతే అంటాడో.. దానికి తగ్గట్లు వెనక వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేసింది. అంతఃకర్ణ శుద్ధితో అనే పదాన్ని చదవడానికి తడబడతాడు భరత్. అదే హైలైట్గా చేసి నెక్స్ట్ డే పేపర్లో అంతః కరణ శుద్ధిని సరిగ్గా ఉచ్చరించలేకపోయాడు. కనీసం అంతఃకర్ణ శుద్ధితో పనైనా.. చేస్తాడా..? అంటూ వార్తను ప్రచురిస్తారు. దానికి సమాధానం వచ్చే ఎపిసోడ్ బాగుంది.
హీరోయిన్ వసుమతి(కియారా అద్వానీ)తో భరత్ ప్రేమాయణం సింపుల్గా ఉన్నా.. వినోదాత్మకంగా అనిపిస్తుంది. భరత్ చేసే మంచి పనులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు వరదరాజులు. అతడికి ఎదురుతిరిగి బాధ్యతను విస్మరించిన కొందరు నాయకులను దారిలో పెట్టే సన్నివేశాలతో ఇంటర్వల్ ఎపిసోడ్ హైలైట్గా నిలిచింది. ఇక సెకండ్ హాఫ్లో ఎప్పుడెప్పుడు భరత్ను కుర్చీలోనుండి దింపేద్దామా..? అని ఎదురుచూసే వారికి అతడి ప్రేమ ఒక సాకుగా కనిపిస్తుంది. తను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని తప్పుబడుతూ మీడియా రాసిన వార్తలను నిలదీస్తూ.. మీడియాను, కొందరు ప్రజలను టార్గెట్ చేస్తూ భరత్ ఇచ్చే స్పీచ్ మరో హైలైట్. తన తండ్రిది సాధారణమైన మరణం కాదని తెలుసుకున్న భరత్ దాన్ని ఛేదించే క్రమంలో అతడిని చంపాలని చూస్తారు. ఆ సమయంలో ప్రజలంతా భరత్కు అండగా నిలవడం మరో ప్లస్ పాయింట్. ఇలా సినిమాలో మహేష్ ఫ్యాన్స్ని సంతోషపరిచే సన్నివేశాలు బోలెడున్నాయి.
ఓవరాల్ ఈ సినిమా అందరికి నచ్చేలా తీసిన కొరటాల నిడివి కొద్దిక ఎక్కువనిపించినా. మహేష్ మొత్తం సినిమాని తన భుజాన వేసుకొని నడిపించాడు. ఇది వన్ మ్యాన్ షో ఫ్యాన్స్ అన్ని విధాల నచ్చే సినిమా. ఈ సినిమాకి ఏషియానెట్ ఇచ్చే రేటింగ్ 3.
ఓవరాల్ రేటింగ్ : 3/5
| 0business
|
sumalatha 228 Views Redmi 7A , XIAOMI
Redmi 7A phone
హైదరాబాద్: అత్యాధునికి ఫీచర్లతో మొబైల్స్ను విడుదల చేస్తున్న షామీ. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. రెడ్మి 7ఏ పేరుతో ఈరోజు భారత విపణిలోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.5,799గా నిర్ణయించారు(జులై నెల మాత్రమే). జులై 11 నుంచి ఇది ఫ్లిప్కార్ట్, ఎంఐ.కామ్లలో అందుబాటులోకి రానుంది. అయితే షామీ భారత్లో ప్రవేశించి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఫోన్పై రూ.200 రాయితీ లభిస్తోంది. ఆ తర్వాత ఇవి వరుసగా రూ.5,999, రూ.6,199లకు లభించనున్నాయి.
రెడ్మి 7ఏ ప్రత్యేకతలు
* 5.45 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే
* స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్
* 2జీబీ ర్యామ్+16జీబీ, 2జీబీ ర్యామ్+32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* ఎస్డీ కార్డు సాయంతో 256జీబీ వరకూ మెమొరీని పెంచుకునే వెసులుబాటు
* 12 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
* 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆస్ట్రేలియా టీ20 జట్టు కోచ్గా పాంటింగ్
ఆస్ట్రేలియా టీ20 జట్టుకి అసిస్టెంట్ కోచ్గా ఆ దేశ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ నియమితులయ్యాడు. ఫిబ్రవరి మొదటి వారంలో
TNN | Updated:
Jan 9, 2018, 12:19PM IST
ఆస్ట్రేలియా టీ20 జట్టుకి అసిస్టెంట్ కోచ్‌గా ఆ దేశ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ నియమితులయ్యాడు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్‌ జరగనుంది. ఈ టోర్నీకి జట్టును సిద్ధం చేసేందుకు తాజాగా ఈ నియామకం చేపట్టినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం ప్రకటించింది. గత ఏడాది శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌‌లో రికీ పాంటింగ్ పర్యవేక్షణలోని ఆసీస్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ మాజీ కెప్టెన్‌కి ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. జట్టు ప్రధాన కోచ్‌‌గా డారెన్ లెహ్మాన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
‘శ్రీలంకతో టీ20 సిరీస్‌ కోసం గత ఏడాది జట్టుతో కలిసి పనిచేయడం చాలా సంతృప్తినిచ్చింది. ప్రధాన కోచ్ లెహ్మాన్‌తో కలిసి తాజాగా పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో కామెంటేటర్‌గా ఉంటూ టీ20 మ్యాచ్‌ల్ని దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నాను. ఈ ఫార్మాట్‌పై నాకు మంచి అవగాహన ఉంది. తప్పకుండా ముక్కోణపు సిరీస్‌లో ఆసీస్ మెరుగైన ప్రదర్శన చేస్తుంది’ అని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. 2005లో న్యూజిలాండ్‌పై ఆసీస్ ఆడిన తొలి టీ20 మ్యాచ్‌కి కెప్టెన్‌గా రికీ పాంటింగే ఉన్నాడు. గత వారంలో ఐపీఎల్‌లోని ఢిల్లీ డేర్‌‌డెవిల్స్ జట్టుకి హెడ్‌ కోచ్‌గా రికీ పాంటింగ్‌ని ఆ ఫ్రాంఛైజీ నియమించిన విషయం తెలిసిందే.
| 2sports
|
Dec 25,2017
వొడాఫోన్ నుంచి సరికొత్త ఆఫర్!
న్యూఢిల్లీ: దేశీయ రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది. వొడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.198తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్తో పాటు రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ కాలపరిమితి 28రోజులు మాత్రమే. మరోవైపు కొత్త వినియోగదారులు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలంటే తొలిసారి రూ.299తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్లోని లాభాలను పొందవచ్చని వొడాఫోన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్లో భాగంగా వినియోగదారులు రోమింగ్లో కూడా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్తో పాటు రోజుకు 100 ఉచిత మెస్సెజ్లు పొందే అవకాశం ఉందని తెలిపింది. వొడాఫోన్ అన్ని 4జీ సర్కిళ్లల్లోనూ ఈ ఆఫర్ వర్తిస్తుందని వొడాఫోన్ కన్జ్యూమర్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్ అనీశ్ కోస్లా తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
హోమ్ Business News భారీగా పెరిగిన బంగారం ధర
భారీగా పెరిగిన బంగారం ధర
August 26, 2019, 3:54 PM IST
Share on:
బంగారం ధర గత కొద్ది రోజులుగా పెరుగుతూ అందరిని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా నేడు బంగారం ధర ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. తులం బంగారం నేడు మార్కెట్ లో రూ.40,260 గా ఉంది. కిలో వెండి 44,870 గా ఉంది. అమెరికా, చైనా మధ్య ఉన్న వాణిజ్య పన్నుల భారం, ఆర్దిక మాంద్యం ప్రభావంతో బంగారం ధర పెరిగినట్టుగా తెలుస్తోంది. బంగారం కొనాలంటే మధ్యతరగతి ప్రజలు జంకిపోతున్నారు. బంగారానికి భారీ డిమాండ్ ఉండడంతో ఇన్వెస్టర్లు అంతా బంగారం పై పెట్టుబడి పెట్టడానికి సిద్దమైపోతున్నారు. దీపావళి నాటికి ఈ ధర మరింత పెరగనుందని సమాచారం.
సంబంధిత వార్తలు
| 1entertainment
|
సావిత్రి గా శ్రీముఖి... లుక్ తో కిక్కిచ్చింది
Highlights
సావిత్రి గా శ్రీముఖి... లుక్ తో కిక్కిచ్చింది
టీవీ యాంకర్లలో మేటిగా పేరు తెచ్చుకున్న అతికొద్దిమందిలో శ్రీముఖి ఒకరు. ఆమెలోని స్పాంటేనియటీ, బోల్డ్నెస్ ఆమెను అక్కడ నిలబెట్టింది. ముఖ్యంగా కో-యాంకర్ రవితో కలిసి చేస్తున్న ‘పటాస్’ టెలివిజన్ షో.. శ్రీముఖిలోని టాలెంట్ లెవల్స్ని బాగా ఎక్స్పోజ్ చేస్తోంది. యూత్, స్టూడెంట్ ఏజ్గ్రూప్లో శ్రీముఖికంటూ ఒక ఖచ్చితమైన ఫాలోయింగ్ వుంది. ఈ మాత్రం కరిష్మా సొంతం కావడానికి ఆమె మెయింటేన్ చేసే డ్రెస్కోడ్ కూడా ముఖ్య కారణంగా చెబుతారు. ఒంటి నిండా గుడ్డలేసుకోకపోవడమే ఆమెకంత క్రేజ్ తెచ్చిపెట్టిందంటే తప్పు లేదు కూడా. ఇదిలా ఉంటే.. మిస్ శ్రీముఖి.. సడన్గా శారీలో మెరిసింది. సంప్రదాయబద్ధమైన ప్రౌఢ వయసు మహిళలా కనిపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ‘గుండమ్మ కథలో సావిత్రి’ అంటూ టాగ్ తగిలించి ఈ ఫొటోల్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంది. పటాస్ ప్రోగ్రాం కోసం చేసే సినిమా స్పూఫ్లో భాగంగానే ఈ గెటప్ వేసిందట శ్రీముఖి. ఏదేమైనా.. ఆ శ్రీముఖేనా ఈ శ్రీముఖి అంటూ కళ్ళు నులుముకుని మళ్లీమళ్లీ చూస్తున్నారు నెటిజన్లు.
Last Updated 26, Apr 2018, 2:45 PM IST
| 0business
|
హోమ్ క్రీడలు ఆగస్ట్ మూడవ వారంలో టీంఇండియా కోచ్ ఎంపిక
ఆగస్ట్ మూడవ వారంలో టీంఇండియా కోచ్ ఎంపిక
August 06, 2019, 10:18 AM IST
Share on:
టీమిండియా కోచ్ ఎంపికలో ఇప్పటికే కమిటీ సభ్యులలో నెలకొన్న పరస్పర విరుద్ధ ప్రకటనలతో అభిమానులలో కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. ఎవరిని కోచ్ గా ఎంపిక చేస్తారు...తిరిగి కోచ్ గా రవిశాస్త్రిని నియమిస్తారా లేక, కొత్త కోచ్ ను తీసుకువస్తారా అన్న సందేహాలను అతి త్వరలోనే స్పష్టత రానున్నట్లు కనపడుతుంది.
ఇక టీమిండియా కోచ్ ఎంపిక చేసేందుకు నియమించబడిన కమిటీలో కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి నేతృత్వంలో CAC… ఆగస్ట్ మూడవ వారంలో కోచ్ ను ఎంపిక చేసే అవకాశమునట్లు తెలుస్తుంది. ఇప్పటికే క్రికెట్ పాలక కమిటీ అధినేత వినోద్ రాయ్, సభ్యుల డిక్లరేషన్ పత్రాలు పరిశీలించామని, అంతా సవ్యంగానే ఉందని తెలియచేసారు. ఇప్పటి వరకు దాదాపుగా రెండు వేల అప్లికేషన్స్ టీమిండియా కోచ్ పదవి కోసం రాగా అందులో సెహ్వాగ్, టామ్ మూడి లాంటి దిగ్గజాలు కూడా ఉన్నారు.
సంబంధిత వార్తలు
| 2sports
|
Sep 10,2016
కొరియా భయానికి కుంగిన మార్కెట్లు
ముంబయి: ప్రతికూల వార్తల నేపథ్యంలో మార్కెట్లు వారాంతంలో నష్టాల్లో ముగిశాయి. ఉత్తర కొరియా మరోమారు అణు వార్హెడ్స్ను పరీక్షించిందన్న వార్తలకు తోడు.. ఐరోపా కేంద్ర బ్యాంకు (ఈసీబీ) భవిష్యత్తు ఆర్థిక పాలసీపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో నడిచాయి. దీనికి తోడు దేశీయంగా సూక్ష్మ గణాంకాలపై అనుమానాలు మార్కెట్లను ప్రభావితం చేసింది. దీంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఫలితంగా మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 248.03 పాయింట్లు నష్టపోయి 28,797.25 పాయింట్లకు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 85.8 పాయింట్లు కుంగి 8,866.70 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ సూచీ 0.99 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.47 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్ఈలో రంగాల వారిగా లోహ సూచీ 1.77 శాతం, ఎఫ్ఎంసీజీ 1.76 శాతం, ఆటో 1.48 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.2 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. కాగా ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 0.92 శాతం, ఐటీ 0.41 శాతం, రియాల్టీ 0.34 శాతం, టెక్ 0.1 శాతం చొప్పున రాణించాయి. సెన్సెక్స్లో ఓఎన్జీసీ 3.31 శాతం, గెయిల్ 1.54 శాతం, విప్రో 1.49 శాతం, టీసీఎస్ 1.35 శాతం, రిలయన్స్ 1.11 శాతం చొప్పున రాణించి అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో నిలిచాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంకు 2.54 శాతం, ఐటీసీ 2.49 శాతం, హెచ్యుఎల్ 2.24 శాతం, టాటా స్టీల్ 2.08 శాతం, హీరో మోటో కార్ప్ 2 శాతం చొప్పున కుంగి అధిక నష్టాలు చవి చూసిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు 17 మాసాల గరిష్ట స్థాయికి చేరడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు కూడా మొగ్గు చూపారు. ఈ పరిణామాలన్నీ మార్కెట్లలో ప్రతికూలతలను పెంచాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 2, Apr 2019, 11:16 AM IST
Highlights
ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇక నుంచి ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ సమయంలో అధిక మొత్తంలో పెన్షన్ పొందవచ్చు
ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇక నుంచి ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ సమయంలో అధిక మొత్తంలో పెన్షన్ పొందవచ్చు. దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ..ఈపీఎఫ్వో చేసిన అప్పీల్ను తిరస్కరిచింది. దీంతో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు అధిక పెన్షన్ అందనుంది.
ఇంతకీ మ్యాటరేంటంటే... పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారి ఆఖరి పూర్తి వేతనం ప్రాతిపదికన పెన్షన్ అందించాలని కేరళ హైకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. దీంతో ఈపీఎఫ్వో దీనికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తలుపుతట్టింది. ప్రస్తుతం ఈపీఎఫ్వో రూ.15,000 ప్రాతిపదికన పెన్షన్ చెల్లిస్తున్న విషయం తెలిసిందే.
సుప్రీం కోర్టులో ఈపీఎఫ్వో అప్పీల్ తిరస్కరణ నేపథ్యంలో ఉద్యోగుల పెన్షన్ కొన్ని వందల శాతం పెరగనుంది. అదేసమయంలో ప్రావిడెంట్ ఫండ్ వాటా తగ్గొచ్చు. అదనపు కంట్రిబ్యూషన్ అనేది పీఎఫ్కు కాకుండా ఈపీఎస్కు వెళ్తుంది. పెన్షన్ అధిక మొత్తంలో వస్తుండటంతో దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
Last Updated 2, Apr 2019, 11:16 AM IST
| 1entertainment
|
Hyderabad, First Published 11, Apr 2019, 10:39 AM IST
Highlights
రెండు తెలుగు రాష్ట్రాలలో తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలో తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణాలలో ఓటు వేయడానికి పోలింగ్బూత్ లకు క్యూ కడుతున్నారు ప్రజలు. సెలబ్రిటీలు సైతం తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.
ఇప్పటికే అల్లు అర్జున్, చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున వంటి వారు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మెగాహీరో సాయి ధరం తేజ్ కూడా ఓటేసి ప్రజలను తమ మావయ్య పార్టీ జనసేనకి ఓటు వేయాలంటూ పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
'కమాన్ గ్లాస్ మేట్స్' వెళ్లి ఓటేయండి.. అంటూ వేలిపై సిరా చుక్క ఉన్న ఫోటోని షేర్ చేశారు. మరో హీరో సుదీర్ బాబు ఓటేసిన అనంతరం ట్విట్టర్ లో పోస్ట్ పెడుతూ.. ''దయచేసి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రజాస్వామ్య దేశం కోసం ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా నా డ్యూటీ పూర్తి చేశా.. మీరు వెళ్లి ఓటేయండి'' అంటూ రాసుకొచ్చాడు.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 11, 2019
Done my duty. Don't waste the most important day in a democracy. Go and vote now. #APelections2019 #VoteForChange #TelanganaElections pic.twitter.com/lhqNQ733nm
— Sudheer Babu (@isudheerbabu) April 11, 2019
Last Updated 11, Apr 2019, 10:53 AM IST
| 0business
|
నన్ను పిలుస్తారని అసలు అనుకోలేదు.. దేవిశ్రీప్రసాద్ కామెంట్స్! (వీడియో)
7, Aug 2019, 4:52 PM IST
కింగ్నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వయాకామ్ 18 స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిరణ్(జెమిని కిరణ్) నిర్మాతలు. ఆగస్ట్ 9న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా డైరీస్ ఈవెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్లో జరిగింది. సినిమా ఆగస్టు 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
| 0business
|
FOOTBALL
భారత్ ఫుట్బాల్లో కొత్తశకం
దోహా: ప్రతిష్టాత్మక ఏఎఫ్సి కప్ గెలిచిన తొలి భారత క్లబ్గా నిలువాలన్న బెంగళూరు ఎఫ్సి కల చెదిరిపోయినా దేశ పుట్బాల్ రంగంలో ఇది సరికొత్త శకానికి నాంది పలికిందని ఆ జట్టు కోచ్ అల్బర్ట్ రోకా పేర్కొన్నాడు.కతార్ స్పోర్ట్ క్లబ్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇరాక్కు చెందిన ఎయిర్పోర్స్్ క్లబ్ చేతిలో బెంగళూరు 0-1తో పరాజయం చెందింది.కాగా ఏఎఫ్సి కప్ ఫైనల్ చేరిన తొలి భారత క్లబ్ రికార్డు సృష్టించింది.అవును,మ్యాచ్లో కొన్ని అవకాశాలు చేజార్చుకున్నాం,ప్రత్యర్థి జట్టు బాగా ఆడింది,అయితే మా కుర్రాళ్లు వారి సామర్థ్యం మేరకు ఆడారు.అయితే ఇది భారత పుట్బాల్ యుగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని రోకా పేర్కొన్నాడు.గతంలో తాము అలాంటి కఠిన జట్లలో ఆడలేదని,అయినప్పటికి చిన్ని చిన్న విషయాలపైనే దృష్టి కేంద్రీకరిస్తామని అల్బర్ట్ వివరించాడు.
| 2sports
|
First Published 4, Jul 2019, 11:15 AM IST
ఉత్తరాది ముద్దుగుమ్మ కాజల్ తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది.
ఉత్తరాది ముద్దుగుమ్మ కాజల్ తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది.
ఇటీవల ఆమె నటించిన 'సీత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రస్తుతం అమ్మడు చేతిలో సరైన అవకాశాలు లేకపోవడంతో ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
తాజాగా మరికొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తోంది కాజల్.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు చీరలో చందమామ మెరిసిపోతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల కాజల్ కి హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో తెరకెక్కనున్నట్లు సమాచారం.
Recent Stories
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఐపీఎల్ వేలంలో హార్దిక్.. ముంబైకి గుడ్ బై?
ముంబై ఇండియన్స్లో కీలక ఆటగాడైన హార్దిక్ పాండ్య వచ్చే సీజన్లో ఆ జట్టుకు దూరం కానున్నాడా..?
TNN | Updated:
Oct 29, 2017, 12:50PM IST
ఐపీఎల్‌లో అద్భుత ఆటతీరుతో ముంబై ఇండియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్య భారీ మొత్తంపై కన్నేశాడు. వచ్చే సీజన్ కోసం నిర్వహించే వేలంలో తాను అందుబాటులో ఉంటానని హార్దిక్ బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. ప్రస్తుత భారత జట్టులో ఆల్‌రౌండర్‌ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న హార్దిక్ వేలంలో పాల్గొంటే.. ఫ్రాంచైజీలు అతణ్ని దక్కించుకునేందుకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసే అవకాశం ఉంది.
రెండు సీజన్ల క్రితం హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ జట్టు రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. తర్వాత కొద్ది కాలానికే హర్దిక భారత క్రికెట్లో అడుగు పెట్టాడు. దీంతో తర్వాతి సీజన్లో ముంబై జట్టు అతడికి చెల్లించే మొత్తాన్ని రూ. 20 లక్షలకు పెంచింది. కాగా హార్దిక్ అన్న క్రునాల్ పాండ్యను ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు తన జట్టు తరఫున ఆడటానికి ఇష్టపడకపోతే.. వేలంలో పాల్గొనే వీలుందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన తర్వాత వరుసగా నాలుగో టోర్నీలోనూ పీవీ సింధు నిరాశపరిచింది. ఇటీవల వరుసగా మూడు టోర్నీల్లోనూ కనీసం రెండో రౌండ్ని కూడా దాటలేకపోయిన సింధు.. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్స్లో వెనుదిరిగింది.
Samayam Telugu | Updated:
Oct 26, 2019, 11:56AM IST
PV Sindhu
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన పీవీ సింధు
క్వార్టర్ ఫైనల్స్లో తైజు యింగ్ చేతిలో పరాజయం
75 నిమిషాల పాటు సుదీర్ఘంగా జరిగిన మ్యాచ్
క్వార్టర్స్లోనే మరో షట్లర్ సైనా నెహ్వాల్ కూడా ఔట్
పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. మహిళల సింగిల్స్లో భాగంగా తాజాగా చైనీస్ తైపీ.. తైజు యింగ్తో క్వార్టర్ ఫైనల్స్లో తలపడిన పీవీ సింధు 16-21, 26-24, 17-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. సుదీర్ఘ ర్యాలీలతో 75 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో అసాధారణంగా పోరాడిన సింధుకి ఆఖర్లో నిరాశ తప్పలేదు.
వరల్డ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన తర్వాత వరుసగా మూడు టోర్నీల్లోనూ కనీసం రెండో రౌండ్ని కూడా దాటలేకపోయిన పీవీ సింధు.. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్స్కి చేరి గాడిన పడినట్లు కనిపించింది. కానీ.. తైజు చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి ఇంటిబాట పట్టింది.
| 2sports
|
Visit Site
Recommended byColombia
రానున్న రోజుల్లో మేం వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్లతోపాటు రెండు యాషెస్ సిరీస్లు ఆడాల్సింది. తలుచుకుంటేనే కాస్త జంకుగా ఉందని లాంగర్ మీడియాతో చెప్పుకొచ్చాడు. కాస్త ముందుకెళ్తే.. టెస్ట్ సిరీస్ కోసం 2021లో భారత పర్యటన ప్రధానం కానుంది. దీనికి మూడు నాలుగేళ్ల సమయం ఉంది. భారత్ను వారి సొంత గడ్డ మీద ఓడిస్తే.. మమ్మల్ని మేం అత్యుత్తమ జట్టుగా పరిగణిస్తామని లాంగర్ తెలిపాడు.
గిల్క్రిస్ట్ నాయకత్వంలోని ఆసీస్ జట్టు భారత్ను వారి సొంత గడ్డ మీదే 2-1 తేడాతో ఓడించింది. 2004 నాటి ఆ విజయమే నా కెరీర్లో మౌంట్ ఎవరెస్ట్ లాంటిది. ఇండియాలో టెస్ట్ సిరీస్ నెగ్గితే ఆస్ట్రేలియా ఖ్యాతి తిరిగి ఇనుమడిస్తుందని లాంగర్ అభిప్రాయపడ్డాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
హోమ్ క్రీడలు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్గా లాన్స్ క్లూసెనర్
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్గా లాన్స్ క్లూసెనర్
August 23, 2019, 4:37 PM IST
Share on:
దక్షిణాఫ్రికా జట్టు అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్గా ఆ దేశ మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ నియమితులయ్యారు. సెప్టెంబర్ నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియాతో ఆడబోయే మూడు టీ20ల సిరిస్కు లాన్స్ క్లూసెనర్ అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్గా వ్యవహారిస్తారు.ఇదే పర్యటనలో బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ విన్సెంట్ బర్న్స్ను క్రికెట్ దక్షిణాఫ్రికా ఎంపిక చేసింది. ఇక, ఫీల్డింగ్ కోచ్గా జస్టిన్ ఒంటాంగ్కే తిరిగి బాధ్యతలు అప్పజెప్పింది. ఈ విషయమై క్రికెట్ దక్షిణాఫ్రికా తాత్కాలిక డైరెక్టర్ కొర్రీ వెన్ జైల్ మాట్లాడుతూ "సరికొత్త టీమ్ను నిర్మించే క్రమంలో టీమ్ డైరెక్టర్ కొత్తగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లను నియమించాం" అని అన్నారు."దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ను అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్గా నియమించాం. అతడు కేవలం టీ20 సిరిస్కు మాత్రమే అందుబాటులో ఉంటాడు. మూడు ఫార్మాట్లకు కాదు" అని ఆయన తెలిపారు.
తన తరంలో లాన్స్ క్లూసెనర్ అత్యుత్తమ ఆల్ రౌండర్. టెస్టుల్లో 80 వికెట్లు తీయడంతో పాటు 1906 పరుగులు చేశాడు. వన్డేల్లో 192 వికెట్లతో పాటు 3576 పరుగులు చేశాడు. జింబాబ్వే జాతీయ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా ఎంపికకాక ముందు లాన్స్ క్లూసెనర్ హాలివుడ్బెట్స్ డాల్ఫిన్స్ జట్టుకు 2012 నుంచి 2016 వరకు కోచ్గా వ్వవహారించారు.యూరో టీ20 స్లామ్ టోర్నీలో గ్లాస్కో జెయింట్స్ జట్టుకు ఈ ఏడాది జులైలో హెడ్ కోచ్గా నియమితులయ్యారు. ఇక, బౌలింగ్ కోచ్గా ఎంపికైన విన్సెంట్ బర్న్స్ 2003 నుంచి 2011 వరకు బౌలింగ్ అసిస్టెంట్ కోచ్గా పనిచేసిన అనుభవం ఉంది. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు ఇండియా-ఏతో నాలుగు రోజులు వార్మప్ మ్యాచ్ ఆడనుంది. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబరు 23 వరకు 3 టీ20లు, 3 టెస్టుల్లో తలపడనుంది.ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది.
సంబంధిత వార్తలు
| 2sports
|
sumalatha 173 Views india , offer , vietjet
Vietjet Airline
న్యూఢిల్లీ: వియత్నాంకు చెందిన ‘వియత్జెట్ ఎయిర్’ సంస్థ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. వియత్జెట్ సంస్థ.. డిసెంబర్ నుంచి భారత్లోనూ విమానాలను నడుపుతామని వెల్లడించింది. ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా ‘గోల్డెన్ డే’ పేరిట రూ.9 ప్రారంభ ధరతో టికెట్లు అందిస్తున్నట్లు వియత్జెట్ ప్రకటించింది. డిసెంబరు 6 నుంచి వియత్నాంలోని హోచి మిన్ఢిల్లీ, డిసెంబరు 7నుంచి హనోయ్ఢిల్లీ రూట్లో విమానాలను నడుపుతామని తెలిపింది. ఈ ఆఫర్ ఆగస్టు 2022 వరకు అందుబాటులో ఉంటుందని.. అయితే టికెట్కు అదనపు సుంకాలు ఉంటాయని పేర్కొంది. హోచి మిన్ఢిల్లీ రూట్లో వారానికి నాలుగు రోజు(సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం)లు విమానాలను నడపుతామని, ఇక హనోయ్ఢిల్లీ రూట్లో వారానికి మూడు రోజులు విమానాలను నడుపుతామని ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో వియత్జెట్ ఎయిర్ సంస్థఉగబికినీ ఎయిర్లైన్స్గగా చాలా ఫేమస్ అయ్యింది. ఎయిర్ హోస్టెస్ బికినీ ధరించి ప్రయాణికులకు ఆహ్వానం పలకడం వియత్నాంలో పెద్ద దుమారాన్నే రేపింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
డెడ్పూల్2: డెడ్లీ ట్రైలర్ వచ్చేసింది!
58 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం 783 మిలియన్ డాలర్లను వసూళ్లు చేయడం గమనార్హం.
Samayam Telugu | Updated:
Mar 22, 2018, 09:40PM IST
సూపర్ హీరోస్ సినిమాలు ఇష్టపడేవారి కోసం ‘డెడ్పూల్2’ వచ్చేశాడు. 2016లో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న ‘డెడ్పూల్’ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ‘డేడ్పూల్2’.. మరిన్ని యాక్షన్ సన్నివేశాలతో వచ్చేస్తోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ ఈ సినిమా ట్రైలర్ను యూట్యూబ్లో విడుదల చేసింది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేపేలా ఉన్నాయి.
ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్ (20th Century Fox) నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మే 18, 2018లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు డేవిడ్ లిటిచ్ దర్శకత్వం వహించారు. రేయాన్ రేనాల్డ్ కథానాయకుడు. 58 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం 783 మిలియన్ డాలర్లను వసూళ్లు చేయడం గమనార్హం. మరి, దాని కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం ఆ రికార్డును అధిగమిస్తుందో లేదో చూడాలి.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Petrol prices:పెట్రో,డీజిల్ ధరల రేట్ ఇంకా పైకే వెళ్లనుందా?
వచ్చే రోజుల్లో లీటరుకు 3.5 నుంచి 4 రూపాయలు పెంచే అవకాశం ఉన్నట్లు కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఒక నివేదికలో పేర్కొంది. అదే జరిగితే సామాన్యుడికి ఇంధన మంటలతో పాటు, వస్తువుల ధరల సెగ సైతం తాకక తప్పదు.
Samayam Telugu | Updated:
May 17, 2018, 05:57PM IST
పెట్రోలు, డీజిల్ ధరలను సామాన్యుడిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అంతకంతకు కొత్త గరిష్టాలకు వెళుతున్నాయి. సెప్టెంబర్ 2013లో ఇండియాలో పెట్రోలు ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయి రూ. 76.06కు చేరగా, ఇప్పుడా స్థాయికి ఒక్క శాతం మాత్రమే తక్కువగా ఉంది. ఈ ఉదయం ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలను 22 నుంచి 24 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్ణయం తీసుకోగా, ఢిల్లీలో రూ. 75.32, కోల్ కతాలో రూ. 78.01, ముంబైలో రూ. 83.16, చెన్నైలో రూ. 78.16కు ధరలు పెరిగాయి.
ఇదే సమయంలో ఢిల్లీలో రూ. 66.79కి, కోల్ కతాలో రూ. 69.33కు, ముంబైలో రూ. 71.12, చెన్నైలో రూ. 70.49కి డీజిల్ ధరలు చేరాయి. ఇక ఈ ధరలు మరొక్క శాతం పెరిగితే, అంటే ఇంకో 70 నుంచి 80 పైసలు పెరిగితే, ఆల్ టైమ్ రికార్డు ధరలకు 'పెట్రో' ఉత్పత్తులు చేరుతాయి. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు 2014 నాటి స్థాయిలోనే ఉన్నప్పటికీ, ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల కారణంగా ధరలు రికార్డు స్థాయికి చేరాయన్న సంగతి తెలిసిందే.
| 1entertainment
|
భారత్లో నాలుగు టెస్టులు ఆడబోతున్నాం: స్మిత్
కోహ్లీ ఏకాగ్రత చెదిరితే లాభం సిరీస్ గెలిస్తే గొప్ప, తొలి టెస్టు 23న ఆరంభం మెల్బోర్న్: టీమిండియా సొంత గడ్డపై నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.కాగా ఫిబ్రవరిలో ఆరంభమయ్యే ఈ సిరీస్లో కోహ్లీ సేనను అడ్డుకోవడం ఆసీస్కు సవాలే.అందుకే సిరీస్కు ఇప్పటి నుంచి ఆసీస్ మానసికంగా సన్నద్ధమవుతుంది.ఆ సిరీస్ సందర్భంగా భారత్ కెప్టెన్ కోహ్లీ కొంత కొపంగా ఉండాలని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కోరుకుంటున్నాడు. కోహ్లీ కోపంగా ఉంటే ఆటపై అతడి ఏకాగ్రత చెదురుతుం దని, అది తమకు లాభం చేకూరుస్తుందని స్మిత్ ఉద్దేశ్యం.అతడు ప్రపంచ స్థాయి ఆటగాడు.
గత 18 నెలలుగా భారత్ జట్టును బాగా నడిపిస్తు న్నాడు.కాగా ఈ సమయంలో భారత్ చాలామ్యాచ్లను గెలిచింది.ఆ సమయంలో సొంతగడ్డపై భారత్ చాలా క్రికెట్ ఆడిందికూడా అని స్మిత్ పేర్కొన్నాడు. కాగా మైదానంలో కోహ్లీ చాలాభావోద్వేగంతో ఉంటాడు. అతడికి కొంత కోపంవచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తాం. అపుడు అతడిఏకాగ్రత చెదురు తుంది.అతడికి చికాకు తెప్పిస్తే భారత్ కొంత బలహీనంగా మారే అవకాశం ఉంది అని వివరించాడు.మేం ఫిబ్రవరిలో భారత్ వెళ్తున్నాం.అది చాలా కఠిన పర్యటన అనడంలో ఎలాంటి సందేహం లేదు అని స్మిత్ పేర్కొ న్నాడు. నాలుగుటెస్టులు ఆడబోతున్నాం. ఇది మా జట్టుకు గొప్ప అవకాశం. కాగా భారత్లో సిరీస్గెలుచుకుంటే చాలాగొప్పగా ఉంటుంది అని వివరిం చాడు. తొలి టెస్టు ఫిబ్రవరి 23న ఆరంభం అవుతుంది.
| 2sports
|
Hasi
కోహ్లీ నాణ్యమైన బ్యాటింగ్ చేశాడు
ఇండోర్: టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీపై న్యూజిలాండ్ క్రికెట్ కోచ్ మైక్ హస్సెన్ ప్రశంసల వర్షం కురిపించాడు.కాగా తాము కోహ్లీని తొందరగా పెవిలియన్కు పంపుదామని ఎన్ని ప్రణాళికలు రచించినా అవి సఫలం కాలేదని హస్సెన్ పేర్కొన్నాడు.ఈ మ్యాచ్లో కోహ్లీది ఖచ్చితంగా అత్యంత నాణ్యమైన బ్యాటింగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.కోహ్లీ మమ్మల్ని సుతి మెత్తగా చావబాదాడు. ఎంత మంచి డెలివరీచేసినా మాకు సగం ఛాన్స్ కూడా ఇవ్వలేదు.కనీసం ఒక్క తప్పుకూడా చేయకుండా కోహ్లీ ఆడటం నిజంగా అసాధారణం. కోహ్లీ కోసం చాలా ప్రణాళికలు రచించాం.అయినప్పటికి చేతులెత్తేశాం,అతని డబుల్ సెంచరీలో 120 సింగిల్స్ ఉండటమే మమ్మల్ని ఎంత సాఫ్ట్గా ఊచకోత కోశాడో అర్థమవుతుంది.ఇది నిజంగా మాకు కఠినమైన రోజు కానీ సంతృప్తిగానే ఉన్నాం,ప్రత్యేకంగా ఇంత హీట్లో మా బౌలర్లు 30 ఓవర్ల పాటు 135 కిలో మీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వరకు బౌలింగ్ చేశారు.ఇది ఒక హైక్వాలిటీ టెస్టు క్రికెట్.ఏది ఏమైనా మ్యాచ్పై సానుకూలంగా ఉన్నాం.మా జట్టులోని సభ్యులు వారి పనిని సమర్థవంతంగా నిర్వర్తించారు అని హెస్సన్ పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ కోహ్లీ 20 బౌండరీల సాయంతో 211 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
| 2sports
|
అప్పటి ముచ్చట్లు
పవన్ ‘ఐ లవ్ యూ’ చెబితే..
ప్రేమ ఓ అలౌకిక భావన. గాలి పీల్చడం ఎంత సహజమో, ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడడం కూడా అంతే సహజం. అందులోనూ ‘తొలిప్రేమ’ సమ్థింగ్ స్పెషల్. ప్రతి ఒక్కరికీ తొలి ప్రేమ అనుభవాలుంటాయి. ఓ అమ్మాయో, అబ్బాయో నచ్చడం, మూగగా ఆరాధించడం, ఆ మాట చెప్పలేక సతమతమవ్వడం.. ఇవన్నీ ఆ తరవాత కాలంలో తలచుకుంటే భలే బాగుంటాయి. పవన్ కల్యాణ్కీ అలాంటి అనుభవం ఉంది. పవన్ కల్యాణ్... కల్యాణ్గా ఉన్నప్పుడు అంటే సినిమా హీరో కాకముందు మాట ఇది. ఆయన మద్రాసులో కంప్యూటర్ క్లాసులకు వెళ్తున్న రోజులు. తనతో పాటు ఓ అందమైన అమ్మాయి కంప్యూటర్ క్లాసులకు వచ్చేదట. పవన్తో చాలా క్లోజ్గా మాట్లాడేదట. బ్యాచ్ ముగుస్తున్న కొద్దీ... వాళ్లిద్దరి మధ్య చనువు పెరగడం మొదలైంది. కల్యాణ్ స్నేహితులు మాత్రం ‘ఇది ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు.. ప్రేమ కూడా.. నీ మనసులో మాట చెప్పేయ్’ అంటూ ప్రోత్సహించారు. పవన్కి మాత్రం మనసులో అలాంటి భావాలేం లేవు. కానీ స్నేహితులు అంతగా చెబుతుంటే.. ‘ఇది ప్రేమేనేమో’ అనుకుని.. ‘ఐ లవ్ యూ’ చెప్పడానికి రెడీ అయిపోయాడు. అందుకు ముహూర్తం కూడా చూసుకున్నాడు. ఇష్టపడుతున్న అమ్మాయి దగ్గరకు వెళ్తున్నప్పుడు ఏదో ఓ ప్రత్యేకత ఉండాలి కదా? అందుకే ఇంట్లో ఎవరూ వాడకుండా పక్కన పడేసిన డొక్కుకారుని బయటకు తీసి, శుభ్రం చేశాడట. అప్పటికి ఆ అమ్మాయికి ఉద్యోగం కూడా వచ్చేసింది. ఆఫీసు వరకూ ఆ డొక్కు కారులోనే వెళ్లి.. ‘నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా’ అని ఆ అమ్మాయిని ఎక్కించుకుని కొంత దూరం వచ్చాక.. మధ్యలో కారు ఓ చోట ఆపి.. తన మనసులోని మాట ఇబ్బంది పడుతూనే చెప్పేశాడట. అదంతా ఓపిగ్గా విన్న అమ్మాయి.. ‘అసలు ప్రేమంటే ఏమిటనుకున్నావ్? ఈ వయసులో ప్రేమేంటి’ అంటూ క్లాసు పీకిందట. ‘ఆ సమయంలో ఆ అమ్మాయి మా క్లాస్ టీచర్లా కనిపించింది. అన్ని క్లాసులు పీకింది..’ అంటూ ఓసారి తన తొలిప్రేమ సంగతుల్ని గుర్తు చేసుకున్నారు పవన్.
Tags :
| 0business
|
Sachin
సచిన్కు మాత్రమే దక్కిన చోటు
మెల్బోర్న్: మాజీ పాకిస్తాన్ క్రికెటర్ యూనిస్ఖాన్ తన ఆల్టైం బెస్ట్ టెస్ట్ ఎలవెన్ జట్టును ప్రకటించాడు. ఈజట్టులో భారత్ నుంచి సచిన్ ఒక్కడికే చోటు కల్పించారు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక నుంచి ఇద్దరు ఆటగాళ్లను ఎంచుకున్న యూనిస్ వెస్టిండీస్ నుంచి ముగ్గుర్ని దక్షిణాఫ్రికా, భారత్,న్యూజిలాండ్ నుంచి ఒక్కొకరిని మాత్రమే ఎంపిక చేసుకున్నాడు. సచిన్తో పాటు పాక్కు చెందిన హనీఫ్ మహ్మద్ ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. జాక్వస్ కలిస్, బ్రియన్ లాలకు మూడు, నాలుగు స్థానాలను కేటాయించారు. జట్టు సారథి పగ్గాలను తన దేశానికి చెందిన హనీఫ్ మహ్మద్కు అప్పగించారు. జట్టు వివరాలు: మహమ్మద్ (పాకిస్తాన్), సచిన్ టెండూల్కర్(భారత్), జాక్వస్ కలిస్ (దక్షిణాఫ్రికా), బ్రియాన్ లారా(వెస్టిండీస్), వివియన్ రిచర్డ్స్(వెస్టిండీస్), గార్పీల్డ్ సోబెర్స్(వెస్టిండీస్), ఆడమ్ గిల్క్రిస్ట్ (ఆస్ట్రేలియా), ఇమ్రాన్ ఖాన్(పాకిస్థాన్), రిచర్డ్ హ్యాడ్లీ(న్యూజిలాండ్, ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక), గ్లెన్ మెక్గ్రాత్ (ఆస్ట్రేలియా)
| 2sports
|
Hyd Internet 70 Views stock market
Stock Market
ముంబయి: వారాంతంలో దేశీయ మార్కెట్లు ఊగిసలాడాయి.కాగా ఆరంభంలో ఆశాజనకంగా ముందుకు సాగినా చివరి గంటల్లో విక్రయాలు వెల్లువెత్తడంతో చితికిల పడ్డాయి.దీంతో సెన్సెక్స్ ఒకే ఒక్క పాయింటు లాభం సాధించగా నిఫ్టీ స్వల్పంగా లాభపడింది.అంతర్జాతీయ,జాతీయ భౌగోళిక అనిశ్చితుల కారణంగా గత కొన్ని రోజులుగా భారీ నష్టాలను చూసిన స్టాక్మార్కెట్లు గురువారం కొంత కోలుకున్న సంగతి తెలిసిందే.ఒకానొక దశలో 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సూచీ చివరి గంటల్లో విక్రయాల ఒత్తిడికి గురైంది.మదుపర్లు లాభాల స్వీకరనకు మొగ్గు చూపడంతో ఆరంభ లాభాలను కోల్పోయింది.చివరకు కేవలం 1.24
పాయింట్ల లాభంతో 31,283.72 వద్ద స్థిరపడింది.అటు నిఫ్టీ కూడా స్వల్పంగా 19.65 పాయింట్లు లాభపడి 9.988.60 వద్ద ముగిసింది.డాలర్తో రూపాయి విలువ మారకం 65.28 వద్ద కొనసాగుతుంది.ఎస్ఎస్ఈలో గెలిల్,ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ పెట్రోలియం, అరబిందో ఫార్మా,భారత్ పెట్రోలియం షేర్లు లాభపడగా,హిందుస్థాన్ లివర్,యూనీలివర్,విప్రో,డాక్టర్ రెడ్డీస్,టిసిఎస్, ఐటిసి లిమిటెడ్ షేర్లు నష్టపోయాయి.
| 1entertainment
|
ఉడాన్కు 44 ఎయిర్పోర్టులు అనుకూలం
ఫిక్కీ కెపిఎంజి నివేదిక
అమరావతి(ఎపి), జనవరి 16: దేశంలో మొత్తం 44 విమానాశ్రయాల్లో ఉడాన్ పథకం కింద కార్యకలా పాలు కొనసాగించేందుకు అనువైనవిగా ఉన్నట్లు ఫిక్కి కెపిఎంజి నివేదిక ఉటంకించింది. ప్రాంతీయ కనెక్టివిటీస్కీంను పెంపొందించేందుకు మొత్తం 414 విమానాశ్రయాల్లో 44 విమానాశ్రయాలు రీజినల్ కనెక్టివిటీకి అనువైనవిగా ఉన్నట్లు నివేదిక వివరిం చింది. అంటేకాకుండా దేశంలో 370 కేంద్రాలు ఈ కనెక్టివిటీకింద ఉడాన్కు ప్రవేశపెట్టవచ్చని అంచనా వేసింది. మెట్రోనగరాలు, రాష్ట్రరాజధానులు, ప్రధా న వాణిజ్య, పారిశ్రామిక పర్యాటక కేంద్రాలుగా ఉన్నవాటిని ఎంపికచేసినట్లు ఫిక్కీ కెపిఎంజి నివేదిక ఉటంకించింది. ఉత్తరప్రదేశ్లో నాలుగు అత్యధికఅనువైన ప్రాంతీయ కనెక్టివిటీ విమానా శ్రయాలున్నాయి. మూడు విమానాశ్రయాలు మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, అస్సాంరాష్ట్రాల్లో ఉంటే రెండు విమానాశ్ర యాల చొప్పున అరుణాచల్ప్రదేశ్, మేఘాల య, బీహార్, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్, గుజ రాత్, ఛత్తీస్గఢ్, ఒక్కొక్కటి చొప్పున ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, జమ్ముకాశ్మీర్, పుదుచ్చేరి, లక్షద్వీప్, డామన్ డయ్యు, హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరా ఖండ్రాష్ట్రాల్లోను ఉన్నట్లు సర్వే నివేదిక వివరిం చింది.
కేంద్ర పౌరవిమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్నారాయణ్ చౌబీ మాట్లాడుతూ ఇప్పటివరకూ ఈ స్కీంలో 22 రాష్ట్రాలు వచ్చిచేరాయని, తక్షణమే 30 ఎయిర్ఫోర్టులనుంచి ఆర్సిఎస్ కార్యకలాపాలు సాగించేందుకు యోచిస్తున్నట్లు ఆయన వివరిం చారు. రీజినల్ కనెక్టివిటీ స్కీం లేదా ఉడాన్ (ఉడేదేశ్కా ఆమ్నాగరిక్) కేంద్ర పౌరవిమానయాన విధానంలో భాగంగా ప్రకటించారు. గత ఏడాది అక్టోబరులో ఈస్కీం విడుదలయింది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా మౌలికవనరులు, ప్రోత్సా హకాలు, సబ్సిడీలు వంటివి అందించేందుకు విమా నయాన మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అంతర్జా తీయ పౌరవిమానయానసంస్థ రీజినల్ డైరెక్టర్ అరుణ్మిశ్రా మాట్లాడుతూ ఆర్సిఎస్ మంచి విధానంగా అభివర్ణించారు. అయితే ఈ విధానంలో చిన్న విమానాలు ఎంతో అవసరం అవుతాయని అన్నారు. ఈ స్కీం కింద ఎంపికచేసిన విమానా శ్రయాల్లో పెద్ద పొడవాటి రన్వేలు లేవు. చిన్న ఎయిర్క్రాఫ్ట్లను ప్రవేశపెట్టి చిన్నరన్వేలపైనే టేకాఫ్లు, ల్యాండింగ్లకు కృషిచేయాల్సి ఉం టుందన్నారు.
అయితే ఇటువంటి విమానాలు ప్రస్తు తం అందుబాటులోలేవు. చిన్న విమానాలకు ప్రత్యే క క్రూ అవసరం అవుతుంది. ప్రభుత్వం నుంచి ప్రత్యేకప్రోత్సాహం అవసరం అవుతుంది. పైలెట్లు, ఇంజనీర్లను సిద్ధంచేసుకోవాల్సి ఉంటుందని మిశ్రా వివరించారు. ప్రతి ఏటా భారత్లో 200 నుంచి 300 మంది పైలట్లు తర్ఫీదు అవుతున్నారు. చైనాలో అయితే రెండువేలమందికిపైగా శిక్షణ ఇస్తోంది. శిక్షణ కార్యక్రమాల కోసం 265 విమా నాలు చైనాలో ఉన్నాయని ఐసిఎఒ అధికారి ఒకరు వెల్లడించారు. ఒక విమానం దేశానికి వస్తే 600 ఉద్యోగాలను సృష్టిస్తుందని, అయితే ఇవేమీ రెగ్యులర్ ఉద్యోగాలు కాకపోయినా రూ.5 నుంచి రూ.10వేలు నెలసరి వేతనం లభిస్తుందని అంచనా.
అటువంటి వేతనా లు ఇపుడు రూ.50 నుంచి రూ.60వేలు పొందాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్సు అథా రిటీ దేశంలోని 55 విమానాశ్రయాలను ఇందుకు సిద్ధంచేసింది. వయబులిటీ గ్యాప్ పండింగ్ విధానం ఈ స్కీంలో మూడు నుంచి ఐదేళ్లకు పొడిగించాలిస ఉంటుంది. లేదా ఆర్థికంగా పటిష్టం అయ్యేంతవరకూ ఈ విధా నం కొనసాగించాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేసారు. ఇతర ఎయిర్లైన్స్ సిబ్బందిని, పైలట్లను, ఇంజినీర్లను నిర్వహణ సిబ్బందిని ఆర్సి ఎస్ ఆపరేటర్లు వినియోగించుకునేందుకు ప్రభు త్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా విదేశీ రిజిస్టరు విమానాలను కూడా ఉడాన్ కార్యకలాపా లకు వినియోగించేందుకుప్రభుత్వం ఆమోదిస్తోంది.
| 1entertainment
|
ఉల్లి ఉసురు తీస్తున్న బీజేపీ
- అంతకంతకూ పడిపోతున్న ధరలు.. ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులు
- మహారాష్ట్రలో ఇప్పటికే 18 మంది రైతుల ఆత్మహత్య
- పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ముంబయి: బీజేపీ సర్కారు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో ఉల్లి పంటను నమ్ముకుని సాగు చేస్తున్న మహారాష్ట్ర రైతులు పెట్టుబడులు సైతం రాక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభమైన ఇరవై ఐదు రోజుల వ్యవధిలోనే అక్కడ 18 మంది ఉల్లి పంట సాగు చేసిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డరంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మార్కెట్కు తీసుకొచ్చిన క్వింటాళ్ల కొద్ది ఉల్లి పంటను అమ్మితే వేయి రూపాయలు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతేడాది నవంబర్లో నాసిక్కు చెందిన ఓ రైతు.. క్వింటాల్ ఉల్లి పంట అమ్మి తనకు వచ్చిన రూ. 700 లను ప్రధానమంత్రి కార్యాలయానికి మనీ ఆర్డర్ చేసినా ప్రధాని మోడీ, రాష్ట్రంలోని బీజేపీ సర్కారు ఈ విషయంపై దృష్టి సారించకపోవడం గమనార్హం.
దేశంలో ఉల్లి పంటను ప్రధానంగా పండించే రాష్ట్రాలలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నది. కరువు ప్రాంతమైన నాసిక్ జిల్లా పరిధిలో ఉండే నాలుగు జిల్లాలలో రైతులు ఈ పంటను అధికంగా సాగుచేస్తారు. తీవ్ర నష్టాలకోర్చి రైతులు ఉల్లిని సాగు చేసి దానిని విపణికి తీసుకొస్తే వారికి పెట్టుబడి ఖర్చులు రాకపోగా.. కూలీల ఖర్చు కూడా గిట్టుబాటు కావడం లేదని వారు వాపోతున్నారు. దీంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతవారం నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకా కందేర్ గ్రామానికి చెందిన రైతు ధ్యనేశ్వర్ (35).. తాను పండించిన పంటకు పెట్టుబడి కూడా రాలేదని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ధ్యనేశ్వర్ మాదిరిగానే గడిచిన ఇరవై ఐదు రోజులలో అక్కడ 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీస ధరలు కూడా రాకపోవడంతో రైతులు తమ పంటలను పశువులకు మేతగా వేస్తున్నారు. అహ్మద్నగర్ జిల్లా రహురి గ్రామానికి చెందిన ఉల్లి రైతు సురేశ్ కరాలే తాను సాగు చేసిన ఉల్లి పంటను గొర్లకు మేతగా వేశాడు. రూ. 60వేల పెట్టుబడితో పంట పండిస్తే దానిని అమ్మితే రూ. 10 వేలు కూడా వచ్చేలా లేవని సురేశ్ అన్నాడు. గతేడాది నవంబర్, డిసెంబర్లలో నాసిక్కు చెందిన ఇద్దరు రైతులు.. ఉల్లి పంట అమ్మగా వచ్చిన కొద్ది మొత్తాన్ని మోడీకి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు పంపారు. అయినా కూడా కేంద్ర, రాష్ట్రాలలో అధికారరలో ఉన్న బీజేపీ సర్కారు స్పందించలేదు.
ప్రభుత్వం ఆదుకోవాల్సిందే..!
ఈ సమస్యను అరికట్టాలన్నా రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా ఉల్లి రైతులను కేంద్ర, రాష్ట్ర సర్కారులు ఆదుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఉల్లికి ఒకరేటును నిర్ణయించి దానికి తగిన విధంగా రైతుల దగ్గర పంటను కొనుగోలు చేయాలని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్) డైరెక్టర్ నానాసాహెబ్ పాటిల్ అన్నారు. ఆయన చెప్పినదాని ప్రకారం.. ఒకవేళ కిలో ఉల్లికి రూ. 8 గా నిర్ణయిస్తే, మార్కెట్లో రైతుకు రూ. 4 వస్తే మిగతా నాలుగు రూపాయలను ప్రభుత్వమే రైతులకు చెల్లించాలని తెలిపారు. ఇలాంటి విధానాల ద్వారానే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని స్పష్టం చేశారు. ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) మహారాష్ట్ర జనరల్ సెక్రెటరీ డాక్టర్ అజిత్ నవలే మాట్లాడుతూ.. సర్కారు చెబుతున్నట్టుగా దిగుబడులు పెరగడంతో ఈ సమస్య రాలేదని అన్నారు. ప్రభుత్వ విధానాలే ధరల పతనానికి కారణమని తెలిపారు. అధిక దిగుబడి, ధరల పతనం వంటివి ఎన్నో ఏండ్లుగా ఉన్నాయని.. కానీ, దీనిపై సరైన విధానాన్ని రూపొందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు.
పడిపోతున్న ధరలు.. ఎగుమతులపై కేంద్రం నిర్లక్ష్యం
దేశంలో ఉల్లి ధరలు దారుణంగా పడిపోతున్నాయి. రైతులు క్వింటాల్ ఉల్లి అమ్మితే కనీసం రూ. 100 కూడా రాని పరిస్థితి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో ఉన్నది. గతేడాది దేశవ్యాప్తంగా 220 లక్షల టన్నుల ఉల్లి దిగుబడి వచ్చింది. ఇది దేశ అవసరాల (170 లక్షల టన్నులు)కు మించి 50 లక్షల టన్నులు అధికం. అధిక ఉత్పత్తి రావడంతో ఉల్లి ధరలు ఒక్కసారిగా దారుణంగా పడిపోయాయి. గడిచిన 18 నెలలలో ఉల్లి ధరలు పడిపోయినంతగా దేశంలో మరే వస్తువు ధరలు పతనమవలేదు. 2017 జూలైలో క్వింటాల్కు రూ. 2,500 ఉన్న ఉల్లి ధర.. ఈ ఏడాది జనవరి నాటికి పలు మార్కెట్లలో రూ. 150కి పడిపోయింది. ఇదిలాఉంటే ఉల్లి ఎగుమతుల మీద కూడా మోడీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. అధిక ఉత్పత్తికి తగ్గట్టు ఎగుమతులను పెంచడం లేదు. 2016-17లో 34 లక్షల టన్నుల ఉల్లిని ఎగుమతి చేసిన కేంద్రం.. తర్వాతి ఏడాది దానిని 16.7 లక్షల టన్నులకు తగ్గించింది. ఇక 2018లో ఇది మరింత దిగువకు పడిపోయింది. కేవలం 12 లక్షల టన్నుల ఉల్లిని మాత్రమే కేంద్రం ఎగుమతి చేసింది. కాగా, ఈ ఎగుమతులపై పదిశాతం సబ్సిడి ఇవ్వాలని ఎగుమతిదారులు డిమాండ్ చేస్తున్నా సర్కారు మాత్రం 5 శాతం ఇచ్చి చేతులు దులుపుకుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పారాలింపిక్స్ పతక విజేతలకూ బిగ్ ఫ్రైజ్ మనీ
పారాలింపిక్స్లో పతక విజేతలకు ఒలింపిక్స్ పతక విజేతలతో సమానంగా నగదు బహుమతి అందిస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అజయ్ మాకెన్ తెలిపారు.
TNN | Updated:
Sep 7, 2016, 02:47AM IST
పారాలింపిక్స్లో పతక విజేతలకు ఒలింపిక్స్ పతక విజేతలతో సమానంగా నగదు బహుమతి అందిస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అజయ్ మాకెన్ తెలిపారు. పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ విన్నర్ కు రూ.75 లక్షలు, సిల్వర్ మెడల్ విన్నర్ కు రూ.50 లక్షలు, బ్రౌంజ్ విన్నర్ కు రూ.30 లక్షలు అందిస్తామన్నారు. రియో డి జనీరోలో నేటి నుంచి ఈ నెల 18 వరకు పారాలింపిక్స్ జరగనున్నాయి. ఈసారి భారత్ నుంచి అత్యధికంగా 17 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. పారాలింపిక్స్లో భారత్ కు తొలి స్వ ర్ణ పతకాన్ని అందించిన దేవేంద్ర జాజారియా (జావెలిన్ త్రో, ఏథెన్స్ 2004) ఈ బృందంలో ఉన్నాడు.
| 2sports
|
internet vaartha 181 Views
ముంబై : ఐటి సేవలరంగంలో మేజర్ కంపెనీగా ఉన్న విప్రో నికరలాభాల్లో రెండుశాతం పెరిగినట్లు ప్రకటించింది. మూడో త్రైమాసికంలో 2243 కోట్లు లాభాలు ఆర్జించింది. రాబడులపరంగా 7.23శాతం వృద్ధి సాధించి 12,860 కోట్లకు చేరింది. ఐటిసేవల్లో మూడో అతిపెద్ద కంపెనీగా ఉన్న విప్రో ముందు త్రైమాసికంతో పోలిస్తే 0.3శాతం పెరిగి 1.84 బిలియన్ డాలర్లకు పెంచుకోగలిగింది. విక్రయాలనుంచి ఖర్చులు తగ్గించగా వచ్చిన నిర్వహణ మార్జిన్లు కూడా 20.2 శాతంగా ఉన్నాయి. చెన్నై వరదల కారణంగా కార్యకలాపాలకు కొంత విఘాతం కలిగింది. కంపెనీ 2203 కోట్ల నికరలాభం, 11,992 కోట్ల రాబడులు సాధించింది. ఐటి సేవలపరంగా రాబడులు స్వల్పంగానే ఉన్నాయని అంచనా. 1.87 బిలియన్ డాలర్లనుంచి 1.91బిలియన్ డాలర్లుగా నాలుగో త్రైమాసికంలో నమోదు చేస్తాయని కంపెనీ సిఎఫ్ఒ కురియన్ వెల్లడించారు. ఈత్రైమాసికంలో 39 మంది కస్టమర్లు ఉన్నారు. రెండు సంస్థలను విలీనం చేసుకుంది. సెల్లెంట్ ఎజి యూరోపియన్ ఐటి కన్సల్టింగ్ సేవల సంస్థతో పాటు వీడియోస్గ్రూప్ బ్యాక్ ఆఫీస్సేవల సంస్థనుకూడా కొనుగోలుచేసింది. ఇన్ఫోసిస్తోపాటుగా రాబడుల్లో కొనసాగినా ఇతర భారత కంపెనీలు టిసిఎస్, కాగ్నిజెంట్ వంటి వాటితో పోలిస్తే రాబడు ల్లో వెనుకంజతోనేఉంది. కంపెనీ చీఫ్ఎగ్జిక్యూటివ్గా అబిద్ఆలీ నీముచ్వాలానునియమించింది. ఆయన ఏప్రిల్లో భాధ్యతలు స్వీకరిస్తారు. కంపెనీ షేర్లు 542 వద్ద నిలిచాయి. 0.27 శాతంగా ఉన్నాయి.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
దేశవాళీ క్రికెట్లో మయాంక్ పరుగుల వరద..!
దేశవాళీ క్రికెట్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. సౌరాష్ట్రతో మంగళవారం జరుగుతున్న విజయ్
TNN | Updated:
Feb 27, 2018, 12:00PM IST
దేశవాళీ క్రికెట్లో మయాంక్ పరుగుల వరద..!
దేశవాళీ క్రికెట్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. సౌరాష్ట్రతో మంగళవారం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ (90: 79 బంతుల్లో 11x4, 3x6) అర్ధశతకం బాది ఓ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. కర్ణాటకకి చెందిన ఈ యువ ఓపెనర్ 2017-18 సీజన్‌లో అసాధారణ ఫామ్‌ని కొనసాగిస్తూ ఇప్పటికే 2,000 పరుగులు పూర్తి చేశాడు.
Visit Site
Recommended byColombia
దేశవాళీ క్రికెట్‌లో ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఇప్పటి వరకు శ్రేయాస్ అయ్యర్ 1,947 పరుగులతో ఉన్నాడు. అతను 2015-16 సీజన్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. తాజాగా ఆ రికార్డ్‌ని మయాంక్ అగర్వాల్ కనుమరుగు చేసి అగ్రస్థానానికి ఎగబాకాడు. మూడో స్థానంలో వసీం జాఫర్ ఉన్నాడు. అతను 2008-2009 సీజన్‌లో 1,907 పరుగులు చేశాడు.
ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో చోటు సంపాదించగా.. ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్‌‌కి ప్రకటించిన జట్టులో మయాంక్ అగర్వాల్‌కి చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ.. సెలక్టర్లు ఈ యువ ఓపెనర్‌కి మొండిచేయి చూపారు. శ్రీలంక వేదికగా మార్చి 6 నుంచి జరగనున్న ఈ టోర్నీకి కోహ్లి, ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్, బుమ్రా, చాహల్‌కి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. యువ క్రికెటర్లకి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Hyderabad, First Published 18, Apr 2019, 4:10 PM IST
Highlights
వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు.
వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా... ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 10న గ్రాండ్ గా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో పాటు ఆడియోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది, ఈ నేపథ్యంతోనే మే 10న నాగకన్య ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న నాగకన్య లుక్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా మొదటి పోస్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ లుక్ ని, రెండో పోస్టర్ గా లక్ష్మిరాయ్ లుక్ ని విడుదల చేశాం.
విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో క్రేజ్ బాగా పెరిగింది. జై క్యారెక్టర్ మరో హైలైట్ గా నిలుస్తుంది. డైరెక్టర్ సురేష్ స్టోరీ, స్క్రీన్ ప్లే క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.
వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ పాత్రలు వూహించని విధంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కు మంచి పేరొచ్చేలా ఉంటుంది. వేసవి కానుకగా మే 10న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నాం. వేసవిలో పిల్లలతో పాటు పెద్దలు కూడా నాగకన్య చిత్రాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. అని అన్నారు.
Last Updated 18, Apr 2019, 4:10 PM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఇవాళే ఐష్ బర్త్డే.. ఆమె వయసెంతో తెలుసా ?
నవంబర్ 1వ తేదీ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ పుట్టినరోజు. అంటే ఇవాళే ఆమె బర్త్డే అన్నమాట.
TNN | Updated:
Nov 1, 2015, 04:48PM IST
నవంబర్ 1వ తేదీ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ పుట్టినరోజు. అంటే ఇవాళే ఆమె బర్త్డే అన్నమాట. అవును, నేటితో ఐష్ కి 42 ఏళ్లు వచ్చేశాయి. 1973లో కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ఐష్ 1994లో మిస్ వరల్డ్ కిరీటం అందుకోవడంతో ఈ బ్యూటీ వరల్డ్లోకి అడుగుపెట్టింది. 1997లో మణిరత్నం తెరకెక్కించిన ఇరువర్( ఇద్దరు ) సినిమాతో ఈ సినీ ప్రపంచానికి పరిచయమైన ఐష్ అదే ఏడాది బాబీ డియోల్ సరసన చేసిన ఔర్ ప్యార్ హోగయా అనే సినిమాతో బాలీవుడ్లో కాలుపెట్టింది. కానీ అది ఆమెకంత గుర్తింపుని తెచ్చిపెట్టలేదు. 1998లో శంకర్ డైరెక్షన్లో ప్రశాంత్ డ్యూయల్ రోల్లో వచ్చిన జీన్స్ సినిమా ఐష్ కెరీర్ని అనుకోని మలుపు తిప్పింది. ఆ తర్వాత వచ్చిన హమ్ దిల్ దే చుకే సనమ్ , తాల్, మొహబ్బతె, హమ్ కిసీసే కమ్ నహీ, దేవ్దాస్ వంటి చిత్రాలు వరుసగా ఆమెకి ఫేమ్ని కట్టబెట్టాయి. 2004లో చేసిన బ్రైడ్ అండ్ ప్రెజ్యుడైస్, 2009లో చేసిన ది పింక్ పాంథర్ వంటి సినిమాలతో ఆమె హాలీవుడ్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. 2005లో బంటీ ఔర్ బబ్లీ సినిమాలో బిగ్ బీ అమితాబ్, జూనియర్ బచ్చన్ అభిషేక్లతో కలిసి స్టెప్పేసిన ఐటంసాంగ్ ''కజ్రారే కజ్రారే'' ఇప్పటికీ పాపులరే. దేవ్దాస్, ఉమ్రావ్ జాన్, జోధా అక్బర్ వంటి చిత్రాలు ఆమె నటనా ప్రతిభకి అద్దంపట్టిన సినిమాలు. 2007 ఏప్రిల్ 20న అభిషేక్ బచ్చన్ని పెళ్లి చేసుకున్న ఐష్ ఆ తర్వాత జోధా అక్బర్, గుజారీష్, రోబో సినిమాలు చేశారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన జజ్బా మూవీ కూడా ఇటీవలే రిలీజైంది. ఇవే కాకుండా ప్రస్తుతం ఆమె చేస్తున్న ఇంకొన్ని సినిమాలు కూడా ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ స్టేజ్లో వున్నాయి. అందులో భాగంగానే షూటింగ్ కోసం విదేశాల్లో వున్న ఐష్.. తన కుటుంబంతో బర్త్డే జరుపుకునేందుకు మొన్నే ముంబైకి చేరుకుంది. భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యలతో కలిసి తన 42వ బర్త్డే జరుపుకుంటున్న ఐశ్వర్యా రాయ్ బచ్చన్కి మనం కూడా హ్యాపీ బర్త్డే విషెస్ చెబుదాం. హ్యాపీ బర్త్డే ఐష్.
| 0business
|
Visit Site
Recommended byColombia
అయితే సన్నివేశాలు రియలిస్టిక్గా ఉండాలని షూటింగ్ జరుగుతోందని పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వలేదట. బస్టాప్కు దగ్గర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో కెమెరా పెట్టి రహస్యంగా చిత్రీకరించాలని సినిమా టీం నిర్ణయించుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా సాయి పల్లవికి సాధారణ ప్రయాణికురాలిగా కనిపించేలా తయారు చేసి బస్టాప్లో కూర్చోమన్నారు. సాయి పల్లవి కూడా ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా బస్టాప్లో కూర్చున్నారు. ఆమె పక్కన జనాలు కూడా ఉన్నారు. కానీ వారిలో ఏ ఒక్కరూ సాయి పల్లవిని గుర్తుపట్టకపోవడం గమనార్హం. ఆ తర్వాత సాయి పల్లవి బస్సు ఎక్కుతుండగా ఓ వ్యక్తి ఆమెను చూసి గుర్తుపట్టాడు. దాంతో ఆమె ఎవరో అక్కడున్నవారందరికీ తెలిసిపోయింది. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
Also Read: చిరంజీవికి అరవింద్ స్వామి డబ్బింగ్.. యాప్ట్ వాయిస్!
అంతేకాదు చిత్రీకరణ సమయంలో కొన్ని సీన్లు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. విరాట పర్వం సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. రాణా దగ్గుబాటి ఇందులో కథానాయకుడిగా నటిస్తు్న్నారు. 1992లో ముగిసిన ఎమర్జెనీ పీరియడ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రజా స్వామ్యం, మార్క్సిజం, మానవ హక్కుల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. సాయి పల్లవి సినిమాలు దాదాపుగా తెలుగు ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరుపుకొన్నాయి. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘ఫిదా’ షూటింగ్ కూడా నిజామాబాద్లోని బాన్సువాడ ప్రాంతంలో జరిగింది.
| 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రజనీకాంత్ ఆఖరి చిత్రం అదేనా?
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
TNN | Updated:
May 26, 2017, 09:05PM IST
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నిన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం. రజినీకాంత్ 164వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ' కాలా ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఆఖరి సినిమా అనే ప్రచారం జరుగుతోంది.
అందుకే ప్రత్యేకంగా ఈ సినిమాను నిర్మించే అవకాశం తన అల్లుడు ధనుష్‌కి అప్పగించినట్లు అంటున్నారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమనే విషయం తెలుస్తోంది. ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వకపోయినా.. దానికి కావల్సిన అన్ని పనులు ఆయన తెర వెనుక ఉండి జరిపిస్తున్నారని సమాచారం.
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మలింగ @300.. కెప్టెన్ కోహ్లి ఔట్..!
శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ లసిత్ మలింగ తన కెరీర్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. భారత్తో గురువారం కొలంబో వేదికగా జరుగుతున్న
TNN | Updated:
Aug 31, 2017, 04:53PM IST
శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ లసిత్ మలింగ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. భారత్‌తో గురువారం కొలంబో వేదికగా జరుగుతున్న నాలుగో వన్డే‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ తీసిన మలింగ కెరీర్‌లో 300వ వన్డే వికెట్‌‌ని ఖాతాలో వేసుకున్నాడు. 2004, జులై 17న వన్డే క్రికెట్‌‌లోకి అరంగేట్రం చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ అనతికాలంలోనే జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. తాజాగా అతను 203వ వన్డే ఆడుతున్నాడు.
యార్కర్‌ రూపంలో విసిరిన బంతిని విరాట్ కోహ్లి (131: 96 బంతుల్లో 17x4, 2x6) కవర్స్ దిశగా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే.. ఫీల్డర్ మునవీర దిల్షాన్ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విషయాన్ని కోహ్లి గుర్తించలేకపోయినట్లు తెలుస్తోంది. అప్పటికే ఆ ప్రదేశంలో రెండు.. మూడు బౌండరీలు బాదిన కోహ్లి.. మరో బౌండరీ కోసం ప్రయత్నిస్తూ అతని చేతికి చిక్కిపోయాడు. దిల్షాన్ క్యాచ్ అందుకునేందుకు నిల్చొన్న చోట నుంచి ఎక్కడికీ కదలాల్సిన అవసరం లేకపోయింది. దీనిబట్టి మలింగ వ్యూహం ప్రకారమే.. కోహ్లిని బుట్టలో వేసినట్లు తెలుస్తోంది. అప్పటికి భారత్ స్కోరు 29.3 ఓవర్లలో 225/2.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మోడీకి తనదైన స్టైల్లో విషెస్ చెప్పిన అమితాబ్
ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వచన కవిత్వం...
TNN & Agencies | Updated:
Sep 17, 2016, 02:19PM IST
ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వచన కవిత్వం రూపంలో ఓ లేఖ రాశారు. 2009లో తాను నటించిన పా సినిమాకి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరేందుకు అప్పడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న మోడీని తొలిసారి కలిసిన సందర్భం నుంచి ఆ తర్వాత అతడిని కలిసిన ప్రతీ సందర్భాన్ని ఈ లేఖలో సవివరంగా ప్రస్తావించారాయన. గుజరాత్ సీఎంగా వున్నప్పుడు ఎంత సాధారణంగా వున్నారో ఇప్పుడు ప్రధాని అయ్యాకా కూడా అంతే సాధారణంగా వున్నారని మోడీని కొనియాడిన అమితాబ్.. అందుకే మోడీ ప్రధాని అవ్వడంలో తనకేమాత్రం ఆశ్చర్యం అనిపించలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పా సినిమాకి వినోదం పన్ను మినహాయింపు కోసం కలిసిన కొద్ది రోజుల్లోనే తాను గుజరాత్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా నియమితులవ్వడం మొదలుకుని స్వచ్ఛభారత్, భేటీ బచావో భేటీ పడావో, సామాన్యులు, రైతులకి ఆర్థిక స్వావలంబన, టీబీ, హెపటైటిస్ బీ వినియోగం వంటి వంటివాటిని మోడీ ప్రవేశపెట్టడం, తాను వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలని కూడా అమితాబ్ అందులో ప్రస్తావించారు. మోడీకి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. రాబోయే కాలంలో మీకు మరింత మంచి కలగాలని, ఆ శివుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని శివున్ని ప్రార్థిస్తున్నట్టుగా తెలిపారు అమితాబ్.
| 0business
|
కళ్యాణ్ రామ్ తో ఎన్టీఆర్ కు చెడిందా..?
Highlights
ఇతర వేడుకల కోసం ఎన్టీఆర్ తన సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు తన అన్నయ్య కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నాడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.
నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్, ఎన్టీఅర్ లను ఒకే స్టేజ్ మీద చూడడం అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయం. ఆ ఫ్రేమ్ కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. కానీ ఈ మధ్య కాలంలో ఈ అన్నదమ్ములు ఒక చోట కనిపించింది లేదు. కళ్యాణ్ రామ్ నటించిన 'ఎమ్మెల్యే' సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. 'తమ్ముడు కొత్త సినిమా కోసం తన లుక్ ను మార్చుకున్నాడు. అందుకే ఈ ఈవెంట్ కు రాలేకపోయాడంటూ..'కళ్యాణ్ రామ్ 'ఎమ్మెల్యే' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో చెప్పాడు. కానీ ఆ తరువాత ఎన్టీఆర్ పబ్లిక్ ఈవెంట్స్ లో బాగానే కనిపించాడు. రీసెంట్ గా 'మహానటి' సినిమాకు సంబంధించిన ఓ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ చిత్ర నిర్మాత స్వప్నాదత్.. ఎన్టీఆర్ కు మంచి స్నేహితురాలు. ఆ కారణంగానే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు ఎన్టీఆర్.
అయితే లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ నటించిన 'నా నువ్వే' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఅర్ వస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు. ఇతర వేడుకల కోసం ఎన్టీఆర్ తన సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు తన అన్నయ్య కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నాడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎన్టీఆర్ కావాలనే కళ్యాణ్ రామ్ ను అవైడ్ చేస్తున్నాడనేది కొందరి వాదన. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం 'నా నువ్వే' ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ గురించి కొన్ని మంచి విషయాలను ప్రస్తావించాడు.
దీన్ని బట్టి కళ్యాణ్ తన తమ్ముడితో ఎలాంటి విబేధాలు కోరుకోవడం లేదని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ మనసులోఏముందో..! 'జై లవకుశ' సినిమా విడుదలైన తరువాత వీరి మధ్య కొన్ని మాట పట్టింపులు వచ్చాయని అంటున్నారు. కనీసం అభిమానుల కోసమైనా ఈ ఇద్దరు అన్నదమ్ములు తిరిగి తమ బంధాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుందాం!
Last Updated 7, May 2018, 12:53 PM IST
| 0business
|
reliance jio extends prime membership scheme up to 31 march 2019
జియో ప్రైమ్.. మరో ఏడాది కొనసాగింపు...!
జియో వినియోగదారులకు శుభవార్త. మార్చి 31తో గడువు ముగియనుండగా... మరో ఏడాది పాటు ఉచితంగా సేవలను కొనసాగించాలని నిర్ణయించింది.
TNN | Updated:
Mar 31, 2018, 08:48PM IST
జియో వినియోగదారులకు శుభవార్త. మార్చి 31తో జియో ప్రైమ్ గడువు ముగియనుండగా... మరో ఏడాది పాటు ఉచితంగా సేవలను కొనసాగించాలని జియో నిర్ణయించింది. ప్రస్తుత జియో ప్రైమ్ వినియోగదారులందరికీ.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇప్పుడున్న ఆఫర్లన్నీ కొనసాగనున్నాయి. రేపటి నుంచి (ఏప్రిల్ 1) కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకునేవారు మాత్రం రూ.99 చెల్లించి జియో మెంబర్షిప్ తీసుకోవచ్చు.
ఇప్పటికే జియో వాడుతున్నవారు మై జియో యాప్లోకి వెళ్లి.. 12 నెలలపాటు ఉచితంగా అందించనున్న 'కాంప్లిమెంటరీ మెంబర్షిప్' పట్ల ఆసక్తి చూపితే చాలు.. రానున్న ఏడాదిపాటు జియో ప్రైమ్ ద్వారా ఇప్పుడు పొందుతున్న సదుపాయాలను ఉచితంగా పొందొచ్చు. కొత్తగా చేరుతున్నవారు రూ.99 చెల్లిస్తే ఏడాదిపాటు ప్రైమ్ సేవల్ని పొందడం వీలవుతుంది.
| 1entertainment
|
Suresh 96 Views
ఆస్పత్రిలో చేరిన ఫాస్ట్ బౌలర్ స్టార్క్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆసు పత్రిలో చేరాడు. కాగా సిడ్నీలో ప్రాక్టీస్ చేస్తుండగా కాలుకు గాయం కావడంతో స్టార్క్ ఆస్పత్రిలో చేరినట్లు సహచర ఆట గాళ్లు వెల్లడించారు. ప్రాక్టీస్ సెషన్లో ట్రైనింగ్ డ్రిల్లో పాల్గొన్న స్టార్క్ ఎడమ కాలికి గాయం కావడంతో వైద్య సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స నిర్వ హిం చారు. గాయం తీవ్రంగా ఉండటంతో వెంటనే అం బులెన్స్లో స్థానిక ఆస్పత్రికి తరలించారు.ఇటీవల శ్రీలంక- ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో, వన్డే, టి20లో స్టార్క్ మెరుగైన ప్రదర్శన కనబరి చాడు. త్వరలోనే ఆస్ట్రేలియా జట్టు దక్షి ణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. కాగా దక్షిణాఫ్రికా వెళ్లే ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ స్టార్క్ను ఎంపిక చేయలేదు. ఎందుకంటే దక్షిణా ఫ్రికా పర్యటన కాగానే ఆస్ట్రేలియా భారత్ పర్యటనకు రానుంది. ఆజట్టులో స్థానం కల్పిం చేం దుకు స్టార్క్కు ఇప్పుడువిశ్రాంతి ఇచ్చింది ఆస్ట్రేలియా బోర్డు.
| 2sports
|
విజయవాడ నుంచి కాశీకి - రూ.2500 మాత్రమే...
వాసు| Last Updated: మంగళవారం, 29 జనవరి 2019 (13:54 IST)
విజయవాడ నగరానికి మరొక ప్రత్యేకత లభించబోతోంది. విజయవాడలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం నుంచి నేరుగా కాశీకి వెళ్లే ప్రత్యేక విమానం ఒకటి అందుబాటులోకి రానుండడంతోపాటు అందులోనూ టిక్కెట్ కేవలం రూ.2500 మాత్రమే కావడంతో సదరు విమాన సేవల ప్రారంభం కోసం చాలా మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్న ఈ సర్వీసు కోసం 180 మంది ప్రయాణికులు పట్టే భారీ విమానాన్ని సిద్ధం చేస్తున్నారు.
కాగా ఈ సర్వీసు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ మీదుగా కాశీకి చేరుకుంటుంది. ఇప్పటివరకు కాశీకి వెళ్లేవారు ఢిల్లీకి చేరుకొని అక్కడి నుండి మరొక విమానంలో వెళ్తూండేవారు, అలాకాకుండా రైలు లేదా రోడ్డు మార్గాలలో వెళ్లాలనుకునేవారు దాదాపు 30 గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి ఉండేది.
అయితే నేరుగా వెళ్లగలిగే ఈ విమాన సేవల ద్వారా విజయవాడ నుంచి కాశీకి కేవలం మూడు నాలుగు గంటల్లోనే వెళ్లగలగడం, రైలులో వెళ్లడానికి 30 గంటలకు పైగా పట్టడమనే ఇబ్బందిని అధిగమించడంపాటు అందులోని సెకండ్ ఏసీ ప్రయాణ టిక్కెట్ ధరకే విమానయానం కల్పించడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
| 1entertainment
|
Jun 06,2017
నష్టాల్లోంచి.. రికార్డు లాభాలు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు పరుగును కొనసాగిస్తున్నాయి. సోమ వారం ఉదయం తొలుత నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు వివిధ పరిణామాల మధ్య తుదకు రికార్డు లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను మార్చకపోవచ్చన్న అంచనాలు తొలుత మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. కాగా కన్సూమర్ డ్యూరెబుల్స్, రియాల్టీ ఇతర రంగాల సూచీల మద్దతుతో లాభాల్లోకి నడిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 36.20 పాయింట్లు పెరిగి 31,309.49 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రా ట్రేడింగ్లో సెన్సెక్స్ ఆల్టైం గరిష్ట స్థాయి 31,355 పాయింట్లను తాకింది. ఇంతక్రితం జూన్ 2న 31,332 వద్ద ట్రేడింగ్ అయ్యింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 21.60 పాయింట్లు పెరిగి 9,675.10 వద్ద ముగిసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ind vs Aus: కెప్టెన్గా కోహ్లి @9000.. నెం.1 రికార్డ్
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ ఐదు మంది కెప్టెన్స్ మాత్రమే 9వేల పరుగుల మైలురాయిని అందుకోగా.. తాజాగా ఆరో కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
Samayam Telugu | Updated:
Mar 5, 2019, 04:07PM IST
Ind vs Aus: కెప్టెన్గా కోహ్లి @9000.. నెం.1 రికార్డ్
హైలైట్స్
2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లి
బ్యాట్స్మెన్గా ఇప్పటికే వన్డేల్లో 10 వేల పరుగులు, టెస్టుల్లో 6,600 పరుగులు
కెప్టెన్గా 9వేల పరుగుల మార్క్ని ఈరోజు అందుకున్న కోహ్లి
క్రికెట్ ప్రపంచంలో ఇంత వేగంగా ఎవరూ ఈ మైలురాయిని అందుకోలేదు
ఆస్ట్రేలియాతో నాగ్పూర్ వేదికగా ఈరోజు జరుగుతున్న రెండో వన్డేలో అర్ధశతకం సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్ సృష్టించాడు. 2014-15లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో మహేంద్రసింగ్ ధోనీ నుంచి జట్టు పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ.. కెప్టెన్గా ఈరోజు అన్ని ఫార్మాట్లలో కలిపి 9,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కేవలం 159 ఇన్నింగ్స్ల్లోనే విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకోగా.. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ ఏ జట్టు కెప్టెన్ ఇంత వేగంగా కనీసం 7 పరుగుల మార్క్ని కూడా చేరుకోలేకపోయారు.
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా గతంలో 164 ఇన్నింగ్స్ల్లో 7వేల పరుగుల కెప్టెన్సీ రికార్డ్.. కోహ్లీ తర్వాత అత్యుత్తమంగా ఉంది. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ ఐదు మంది కెప్టెన్స్ మాత్రమే 9వేల పరుగుల మైలురాయిని అందుకోగా.. తాజాగా ఆరో కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటికే బ్యాట్స్మెన్గా వన్డే కెరీర్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ.. టెస్టుల్లోనూ 6,600 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Hyderabad, First Published 14, Nov 2018, 9:01 PM IST
Highlights
డ్యాన్స్ మాస్టర్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ దర్శకుడి గాను మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హారర్ కామెడీ అండ్ ఎమోషన్ ని కలిపి ముని సిరీస్ లతో మంచి విజయాలను అందుకున్నాడు.
డ్యాన్స్ మాస్టర్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ దర్శకుడి గాను మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హారర్ కామెడీ అండ్ ఎమోషన్ ని కలిపి ముని సిరీస్ లతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక నెక్స్ట్ నాలుగవ చిత్రమైన కాంచన 3తో రాబోతున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఒక పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. కాంచన 2: గంగ సినిమా లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. 2015లో వచ్చిన ఆ సినిమా మంచి లాభాలను అందించింది. దీంతో ఈ సారి కాంచనా 3 సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు.
కళానిధి మారన్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అసలైతే ఈ ఏడాది డిసెంబర్ లోనే సినిమాను రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడం వల్ల విడుదలను వచ్చే ఏడాది సమ్మర్ కి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఓవియా - వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Last Updated 14, Nov 2018, 9:01 PM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Stock Market Today: బలపడ్డ రూపాయి.. కోలుకున్న మార్కెట్లు
బ్యాంకులు, ఎగుమతిదారుల నుంచి డాలర్ అమ్మకాలు పెరగడంతో దేేశీయ కరెన్సీ రూపాయి విలువ బలపడింది.
Samayam Telugu | Updated:
Sep 21, 2018, 10:54AM IST
శుక్రవారం నాటి మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 150 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ ప్రారంభమైంది. నిఫ్టీ కూడా మళ్లీ 11,300 మార్క్ను దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు, రూపాయి విలువ బలపడటంతో సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఉదయం 10.30 గంటల సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్లు ఎగబాకి 37,403 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 11,3416 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ట్రేడింగ్లో ఐటీ స్టాక్స్ మినహా మిగతా అన్ని రంగాల షేర్లు లాభాల పంట పండిస్తున్నాయి. బ్యాంక్లు, ఆటో, మెటల్స్, ఫార్మా, ఎనర్జీ స్టాక్స్ ఎక్కువగా లాభాలను ఆర్జిస్తున్నాయి. మొత్తంగా నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ కూడా ఒక శాతం మేర పెరిగింది. అయితే యస్ బ్యాంక్ షేరు మాత్రం ప్రారంభంలోనే 24 శాతం మేర నష్టపోయింది. ఆ బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ పదవి కాలాన్ని తగ్గించడంతో, యస్ బ్యాంక్ నష్టాలు పాలవుతోంది. జెట్ ఎయిర్వేస్ కూడా 6 శాతం తగ్గింది.
ఎన్ఎస్ఈలో యాక్సిక్ బ్యాంక్, ఐసీఐసీఐ, టాటా స్టీల్, హెచ్పీసీఎల్, భారతీ ఇన్ఫ్రాటెల్, తదితర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. యస్ బ్యాంక్, వొఢాఫోన్ ఐడియా, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, తదితర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
బలపడ్డ రూపాయి..
బ్యాంకులు, ఎగుమతిదారుల నుంచి డాలర్ అమ్మకాలు పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ బలపడింది. శుక్రవారం నాటి ట్రేడింగ్ ఆరంభంలో 53 పైసలు కోలుకుని 71.84 వద్ద రెండు వారాల గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం 43 పైసల లాభంతో రూపాయి విలువ 71.94గా కొనసాగుతోంది.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆల్రౌండర్కి కొత్త భాష్యం చెప్పిన కోహ్లి..!
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. జట్టులోని ఆల్రౌండర్ పాత్రపై కొత్త భాష్యం చెప్పాడు. ఆస్ట్రేలియాతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో
TNN | Updated:
Sep 16, 2017, 05:43PM IST
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి .. జట్టులోని ఆల్‌రౌండర్ పాత్రపై కొత్త భాష్యం చెప్పాడు. ఆస్ట్రేలియాతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం మీడియాతో కోహ్లి మాట్లాడాడు. జట్టులో ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉండటం గత కొంతకాలంగా కలిసొస్తోందని.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కూడా వారి పాత్ర కీలకంగా మారనున్నట్లు వెల్లడించాడు. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లు సైతం.. ఇలా కనీసం ఇద్దరు ఆల్‌రౌండర్లకి తుదిజట్టులో చోటిస్తున్నాయని గుర్తు చేశాడు.
వన్డే తుది జట్టులో ముగ్గురు బౌలర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్ల‌కి గత కొంతకాలంగా స్థానం కల్పిస్తున్నారు.. 2019 ప్రపంచకప్‌‌ని దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నారా..? అని కోహ్లిని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. ‘చాలా జట్లు ఇవే పోకడని అవలంబిస్తున్నాయి. ఇద్దరు ఆల్‌రౌండర్లకి తుది జట్టులో చోలిస్తే.. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగం బలపడుతుంది. ప్రస్తుతం జట్టులో హార్దిక్ పాండ్య , అక్షర్ పటేల్ ఇదే జాబితాలో ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్న రవీంద్ర జడేజా కూడా ఈ కోవలోకే చెందుతాడు. ఆల్‌రౌండర్ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్‌కే పరిమితమవకూడదు.. ఫీల్డింగ్‌‌లోనూ చురుగ్గా ఉండాలి. అప్పుడే అతడ్ని ఆల్‌ రౌండర్‌ అనగలం. శ్రీలంకతో ముగిసిన సిరీస్‌లో వీరే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆదివారం నుంచి జరిగే వన్డే సిరీస్‌లో కూడా ఆ జోరు కొనసాగిస్తారని ఆశిస్తున్నా’ అని కోహ్లి వివరించాడు.
| 2sports
|
Virat Kohli: ఆసీస్ గడ్డపై కోహ్లిని ఊరిస్తోన్న సచిన్ రికార్డ్!
Samayam Telugu| Nov 29, 2018, 04.15 PM IST
ఆస్ట్రేలియా గడ్డ మీద త్వరలో ప్రారంభం కానున్న 4 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. వార్నర్, స్మిత్ గైర్హాజరీ ఆసీస్ జట్టు బలహీనంగా ఉంది. దీంతో కంగారుల గడ్డపై సిరీస్ విజయానికి ఇదే సరైన తరుణమని భారత్ భావిస్తోంది. కాగా ఈ సిరీస్లో కెప్టెన్ విరాట్ కోహ్లిని అరుదైన రికార్డ్ ఊరిస్తోంది. రానున్న టెస్టు సిరీస్లో మరో సెంచరీ సాధిస్తే.. ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ రికార్డును కోహ్లి సమం చేస్తాడు.
ఆస్ట్రేలియాలో 20 మ్యాచ్లు ఆడిన సచిన్ ఆరు సెంచరీలు సాధించగా.. కోహ్లి 11 మ్యాచ్ల్లో ఐదు శతకాలు బాదాడు. మాజీ ఓపెనర్ సునీల్ గావస్కర్ కూడా 11 మ్యాచ్ల్లో ఐదు శతకాలు చేశాడు.
ఈ ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, విండీస్లపై కోహ్లి శతకాలు సాధించాడు. 2018లో 10 మ్యాచ్లు ఆడిన విరాట్ 59.05 సగటుతో 1063 పరుగులు చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భారీగా పరుగులు రాబట్టి కోహ్లి మంచి ఫామ్లో ఉన్నాడు. అదే ఊపును ఆసీస్ టూర్లోనూ కొనసాగిస్తే.. సచిన్ రికార్డును అధిగమించడం పెద్ద కష్టమేం కాదు.
కోహ్లి టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తి చేయడానికి కేవలం 669 పరుగుల దూరంలో ఉన్నాడు. ఫాస్టెస్ట్ 7 వేల పరుగుల జాబితాలో ఇంగ్లాండ్కు చెందిన వాలీ హమ్మద్ తొలి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో సెహ్వాగ్, సచిన్ ఉన్నారు. హమ్మద్ 131 ఇన్నింగ్స్ల్లో ఏడు వేల పరుగులు చేయగా.. కోహ్లి ఇప్పటి వరకూ 124 ఇన్నింగ్స్ ఆడాడు. మరో 8 ఇన్నింగ్స్ల్లో 669 పరుగులు చేస్తే.. విరాట్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవనున్నాడు.
| 2sports
|
Visit Site
Recommended byColombia
అసలేం జరిగిందంటే..? లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 39/2తో నిలిచిన దశలో ఏబీ డివిలియర్స్ అనూహ్యంగా రనౌటయ్యాడు. స్పిన్నర్ నాథన్ లియోన్ బౌలింగ్‌లో ఓపెనర్ మార్‌క్రమ్ బంతిని స్క్వైర్‌లెగ్ దిశగా నెట్టి పరుగు కోసం తొలుత నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని ఏబీ డివిలియర్స్‌ని పిలిచాడు. దీనికి స్పందించి ఏబీ క్రీజు వదిలి సగం దూరం రాగా.. అప్పటికే వార్నర్ బంతిని సమీపిస్తుండటంతో.. కంగారు పడిన మార్‌క్రమ్.. ఏబీని వెనక్కి వెళ్లిపోవాలంటూ హెచ్చరించాడు. కానీ.. ఏబీ వేగంగా వెనక్కి వెళ్లేలోపు.. మెరుపు వేగంతో స్పందించిన వార్నర్.. బంతిని బౌలర్ నాథన్‌కి ఇవ్వడంతో.. డివిలియర్స్ (0) రనౌట్‌‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ రనౌట్‌లో కీలకపాత్ర పోషించిన వార్నర్.. డకౌటై నిరాశగా ఏబీ పెవిలియన్‌కి వెళ్తుండగా.. హద్దులు మీరి సంబరాలు చేసుకున్నాడు. దీనిపై కామెంటేటర్లు సైతం పెదవి విరిచారు.
భారీ ఛేదనలో తన కారణంగా ఏబీ ఔటవడంతో కలత చెందిన మార్‌క్రమ్.. అనంతరం పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. అతను 218 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 143 పరుగులు చేయడంతో.. దక్షిణాఫ్రికా ఒకానొక దశలో 283/5తో మెరుగైన స్థితిలో నిలిచింది. మార్‌క్రమ్-డికాక్ జోడి ఆరో వికెట్‌కి అభేద్యంగా 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో మిచెల్ మార్ష్‌.. శతకంతో ఊపుమీదున్న మార్‌క్రమ్‌ని పెవిలియన్‌కు పంపగా.. టీ బ్రేక్‌లో డ్రెస్సింగ్‌ రూముకి వస్తున్న డికాక్‌ని ఉద్దేశించి వార్నర్ నోరుజారాడు. గతంలోనూ వార్నర్ స్లెడ్జింగ్ చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియాతో మొట్టికాయలు వేయించుకున్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Jun 21,2018
షావొమీ 1000వ సర్వీసింగ్ సెంటర్
విక్రయాలతో పాటు అమ్మకపు అనంతరం కూడా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే దిశగా తాము కృషి చేస్తున్నామని షావోమీ సంస్థ ఉపాధ్యక్షుడు, షావోమీ ఇండియా ఎండీ మనుజైన్ తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సంస్థ 1000వ సర్వీసింగ్ సెంటర్ను ప్రారంభించారు. మొత్తం 600 నగరాల్లో సంస్థ 1000 సర్వీసింగ్ కేంద్రాలను కలిగి ఉందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. అందరికీ అందుబాటులోఉండే ధరల్లో షావోమి నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటులో ఉండడం వల్లే ప్రజలు తమ బ్రాండ్లను ఆదరిస్తున్నారని తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 28, Aug 2018, 11:34 AM IST
Highlights
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అమితాబ్ లుక్ ఎలా వుండబోతుందనే ఫోటోలు లీక్ అయ్యాయి.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అమితాబ్ లుక్ ఎలా వుండబోతుందనే ఫోటోలు లీక్ అయ్యాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో అమితాబ్ కనిపించనున్నాడని టాక్. అయితే ఈ సినిమాకు అమితాబ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
నిజానికి అమితాబ్ ఈ సినిమాలో తన స్నేహితుడు చిరంజీవి రిక్వెస్ట్ చేయడంతో నటించాడు. రెమ్యునరేషన్ తీసుకోనని ముందే చెప్పేశాడట. చిరు మీద గౌరవంతో సినిమా చేస్తున్నానని తనకు ఎలాంటి రెమ్యునరేషన్ వద్దని చెప్పడంతో మెగాస్టార్ చిరంజీవి.. అమితాబ్ కోసం ఓ విలువైన బహుమతి తీసుకొని ఆయనకు కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంత ఆ కానుక విలువెంతో తెలుసా..? అక్షరాలా రూ.3 కోట్ల రూపాయలు.
అమితాబ్ పారితోషికం నిరాకరించడంతో చిరంజీవి మూడు కోట్ల విలువైన బంగారాన్ని అమితాబ్ కి అందించారట. 1980 ల నుండి అమితాబ్, చిరుల మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. అయితే మొదటిసారి వారిద్దరూ కలిసి స్క్రీన్ ను పంచుకోవడం విశేషం. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Last Updated 9, Sep 2018, 11:38 AM IST
| 0business
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ
| 1entertainment
|
తెలంగాణ గాలిలో దూసుకెళ్తోంది..
- హైదరాబాద్ వైపు ప్రముఖ విమాన సంస్థల చూపు
- రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల అభివృద్ధి
- వరంగల్ ఎయిర్పోర్ట్ పైనా ప్రధాన దృష్టి
- ఎలిమినేడులో మరో ఏయిరోస్పేస్ పార్క్
- వైమానిక రంగానికి పెద్ద పీట
- 'వింగ్స్ఇండియా' సదస్సులో మంత్రి కేటీఆర్
- ఘనంగా విమానాల పండుగ ప్రారంభం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలంగాణ అభివృద్ధికి గాను రాష్ట్రంలో ఉన్న ఆరు విమానాశ్రయాలను పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చి.. గరిష్టంగా వినియోగించుకోనేలా చర్యలు చేపట్టనున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడు బేగంపేట్, వరంగల్, హకీంపేట్, నాదర్గూల్, రామగుండం, దుండిగల్లలో ఇప్పటికే విమానాశ్రయాలు ఉన్నాయని వివరించారు. వీటిని ప్రాంతీయ అనుసంధానత కార్యక్రమం కింద పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్టుగా మంత్రి వివరించారు. వరంగల్లో ఇటీవల ఏర్పాటు చేసిన అతిపెద్ద టెక్స్టైల్ పార్క్కు దన్నుగా ఉండేలా ఆ నగరంలోని విమానాశ్రయాన్ని ప్రాంతీయ అనుసంధానత పథకంలో భాగంగా తొలత పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్టు వివరించారు. ఇందుకు గాను ఆయన కేంద్రం తగిన సహకారాన్ని అందించాలని వింగ్స్ ఇండియా వేదిక మీదుగా కోరారు.
ఘనంగా ప్రారంభమైన వింగ్స్ ఇండియా..
దేశంలో ప్రతి రెండేండ్లకోసారి జరిగే పౌర విమానయాన సదస్సు 'వింగ్స్ ఇండియా-2018'ను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏరో స్పేస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని అన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకెళ్తోందని చెప్పారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ దేశంలోనే నెంబర్వన్గా నిలుస్తూ వస్తోందన్న మంత్రి కేటీఆర్ ఈ రంగంలోని వివిధ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన అన్ని వసతులు రాష్ట్రంలో ఉన్నాయని వివరించారు.
విశ్వవిద్యాలయ కేంద్రం ఏర్పాటు చేయాలి..
హైదరాబాద్ కేంద్రంగా పలు విమానయాన సంస్థలు, వైమానిక రంగానికి చెందిన కంపెనీలు తమ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ నైపుణ్యత పెంపు కోసం ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్లో ఏర్పాటు చేసిన 'జాతీయ విమానయాన విశ్వవిద్యాలయ' అనుబంధ కేంద్రాన్ని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ పౌర విమానయాన శాఖ కార్యదర్శిని చౌబేను కోరారు. తెలంగాణలో ఇప్పటికే మూడు ఏయిరోస్పేస్ పార్క్లు పని చేస్తుండగా ఇటీవలే ఎలిమినేడు వద్ద నాలుగో పార్క్ ఏర్పాటు పన్నులకు తాము శ్రీకారం చుట్టినట్టుగా ఆయన వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న మూడు ఎయిరోస్పేస్ పార్క్లో రెండు పూర్తిస్థాయి ప్రత్యేక ఆర్థిక మండళ్లుగా పని చేస్తున్నాయని అన్నారు.
రాజకీయాల్లో ఏప్పుడేం జరుగుతుందో చెప్పలేం..
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని, అన్నింటికీ సిద్ధంగా ఉంటూ ముందుకు సాగాల్సి వస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఉదయం లేవగానే పత్రికల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా వార్త చూసి తాను ఆశ్చర్యపోయానని అన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. దేశంలో 70 ఏళ్లలో 72 విమానాశ్రయాల అభివృద్ధి జరిగితే.. అశోక్ గజపతి రాజు సారథ్యంలోని బృందం విశేషంగా కృషి చేసి గడిచిన మూడేళ్లలో 56 పైగా విమానాశ్రయాలను అభివృద్ధి చేసే చర్యలు చేపట్టారని ప్రశంసించారు. భారత వైమానిక రంగం ఇలాగే వృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
sandhya 298 Views mortagage finance firm , rana kapoor , sell stake , YES BANK co-founder
rana kapoor, YES BANK co-founder
ముంబయి: ఎస్బ్యాంకు ప్రమోటర్ రాణాకపూర్ కుటుంబం ఆరేళ్లక్రితం స్థాపించిన తనఖా ఫైనాన్స్ కంపెనీ వాటాను విక్రయించాలనినిర్ణయించింది. రుణవితరణ మార్కెట్ రోజురోజుకూ వృద్ధి తగ్గుతుండటంతో ఇలాంటి షాడో ఫైనాన్స్సంస్థలకు కష్టకాలం ఎదురవుతున్నందున వాటాను విక్రయించేందుకు నిర్ణయించింది. ఎస్బ్యాంకు కుటుంబం కొనసాగిస్తున్న ఈ తనఖాసంస్థ రాణాకపూర్ ముగ్గురు కుమార్తెలు పర్యవేక్షిస్తున్నారు. బ్యాంకు సహవ్యవస్థాపకుడు నోమురా హోల్డింగ్స్ ఇంక్తో సంప్రదింపులు జరుపుతూ అర్హత కలిగిన బిడ్డర్లకోసం ప్రయత్నిస్తున్నారు. ఐఎల్ఎప్ఎస్ కంపెనీ ఇటీవలి భారీ ఎత్తున బకాయి పడటంతోభారత్లోనే నగదు కొరత పెరిగింది.
రుణపరపతి మార్కెట్లో నగదు కొరత పెరిగింది. ప్రైవేటు ఈక్విటీసంస్థలు బ్లాక్స్టోన్ ఎల్పి వంటిసంస్థలు కొన్ని ఆస్తులు కొనుగోలుచేసాయి. అనేక మంది వ్యవస్థాపకులు అనిల్ అంబాని వంటి వారు మీడియా మొగల్ సుభాష్చంద్ర వంటి వారు సైతం నగదు సమస్య అధిగమించేందుకు కొంతమేర ఆస్తులను విక్రయిస్తున్నారు. ఎక్కువగా ఎన్బిఎఫ్సిల్లాంటి షాడో బ్యాంకులు నగదు కొరతను ఎదుర్కొంటుండటంతో ఇన్వెస్టర్లు వారి వారి రుణాలను తగ్గించుకుని రోలోవర్ రిస్క్లు, రుణాల్లోని బకాయిలను రికవరీకి ఇపుడు సమాయత్తం అవుతున్నారు. ప్రస్తుత మార్కెట్పరిస్థితులకు అనుగుణంగా కపూర్కుటుంబం మెజార్టీ వాటాను ఈ సంస్థలో విక్రయించేందుకు నిర్ణయించింది. ఎఆర్టి హౌసింగ్కు సంబంధించయి కొన్ని సందేహాలను సైతం లేవనెత్తారు.
ఎఆర్టి హౌసింగ్ వ్యవస్థపకులు నిధులసమీకరణకోసం కొంత మైనార్టీ వాటాను విక్రయిస్తున్నారు. కంపెనీ సిఇఒ అరవింద్ హాలి ధృవీకరించారు. 35శాఖలతో న్న ఈ తనఖా సంస్థ ఈక్విటీ నిదులను సంస్థాగత ఇన్వెస్టర్లనుంచే సమీకరించే యత్నంచేస్తోంది. డిహెచ్ఎఫ్ఎల్ కు మాతృసంస్థగా నిలిచిన వాద్వాన్ గ్లోబల్ కేపిటల్ సంస్థ తన వాటాను ఆధార్హౌసింగ్ ఫైనాన్స్లో వాటాను బ్లాక్స్టోన్కు విక్రయించింది. ఇపుడు భారత్ స్టాక్గురు రాకేష్ ఝన్ఝన్వాలా కుటుంబం సైతం ఆర్ధికరంగ కంపెనీల్లో పెట్టుబడులకు ఆసక్తిచూపిస్తోంది.
రాణాకపూర్ ఎస్బ్యాంకును భారత్లోనే నాలుగో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా నిలిపారు. 15ఏళ్లపాటు నిరంతరాయంగా నడిచిన ఈ బ్యాంకు కొంతమేర వివాదాల్లో నడించింది. రానిబాకీలు పెరిగిపోయాయి. వాటాదారుగా కూడా బ్యాంకులో ఈ ప్రమోటరు తగ్గించుకోవాల్సి వచ్చింది. బ్యాంకులో డైరెక్టర్ లేదా మేనేజ్మెంట్ప్రతినిధిగా కూడా లేరు. ఫైనాన్స్ కంపెనీ ముగ్గురుకుమార్తెల ఆధ్వర్యంలో నడుస్తోంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
నెట్స్లో కష్టపడుతున్న చెన్నై చిన్నోళ్లు
ఐపీఎల్ సందడి మొదలయ్యిది. టీమ్స్ అన్నీ క్రికెట్ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. నెట్ ప్రాక్టీస్తో ప్లేయర్లంతా బిజీ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ అందరి కంటే ముందే ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
Samayam Telugu | Updated:
Mar 25, 2018, 05:36PM IST
నెట్స్లో కష్టపడుతున్న చెన్నై చిన్నోళ్లు
ఐపీఎల్ సందడి మొదలయ్యిది. టీమ్స్ అన్నీ క్రికెట్ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. నెట్ ప్రాక్టీస్తో ప్లేయర్లంతా బిజీ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ అందరి కంటే ముందే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కెప్టెన్ ధోనీ సహా టీమ్ అంతా ఉదయం, సాయంత్రం నెట్స్లో బిజీగా గడిపేస్తున్నారు. అటు ప్రాక్టీస్తో పాటూ యాడ్ షూటింగ్స్లో బిజీగా ఉన్నారు.
Visit Site
Recommended byColombia
ఎంత బిజీగా ఉన్న ధోనీ మాత్రం తన ఫ్యాన్స్ను కలుసుకుంటున్నాడు. మహీ గ్రౌండ్కు వచ్చిన ఓ చిన్నారితో సరదగా గడిపాడు. ఓ ఆట కూడా ఆడాడు. తన చేతిని బాలుడి ముందు పెట్టాడు... చిన్నారి దాన్ని తాకాలని ప్రయత్నిస్తుండగా తప్పించుకోవడానికి ధోనీ పక్కకు తీసేవాడు. ఒకటి రెండు సార్లు బాలుడు చేయి తనకు తాకగానే... అబ్బా చాలా గట్టిగా కొట్టావే అంటూ ధోనీ ఫేస్ ఫీలింగ్స్ ఇచ్చాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
You hit, I miss. Cutest hi-fi you'll ever see! https://t.co/KyUDHKIgU1
— Chennai Super Kings (@ChennaiIPL) 1521909274000
ఇక డీజే బ్రావో అయితే... అప్పుడే డ్యాన్సులు మొదలు పెట్టాడు. విజిల్ పొడు అంటూ స్టెప్పులేస్తున్నాడు.
Move it like #Champion @DJBravo47! #RunDWorld #WhistlePodu https://t.co/R2rCEEa4Ec
— Chennai Super Kings (@ChennaiIPL) 1521969739000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Sonalika
న్యూఢిల్లీ: సోనాలికా ట్రాక్టర్లు 51హెచ్పి విబాగంలో భారత్లో నంబర్వన్ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ
మార్కెట్లకు సైతం ఏటికేడాది వృద్ధిని నమోదుచేస్తోంది. ట్రాక్టర్ ఉత్పత్తిదారులసంఘం విడుదలచేసిన నివేదికలతో
సోనాలిక ఐటిఎల్ 33శాతం మొత్తం విక్రయాల్లో వాటాగా సాధించింది. మహీంద్ర, జాన్డీర్, న్యూహాలెండ్లతో
పోలిస్తే మరింతగా దూసుకుపోతున్నది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ్ మిట్టల్ మాట్లాడుతూ భారత్, అంతర్జాతీయ
మార్కెట్లలోనూ రైతులకు అత్యంత విశ్వసనీయమైన ట్రాక్టర్గా సోనాలిక నిలిచింది. ఆరోగ్యకరమైన రుతుపవనాలు,
వ్యవసాయ రుణమాఫీలు వంటివి భారీ యంత్రపరికరాలకు డిమాండ్ పెంచాయని అన్నారు. భారత్తోపాటు మొత్తం
80 దేశాల్లో సోనాలిక ట్రాక్టర్లు విక్రయిస్తున్నారు. వీటిలో 25 యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి. 20హెచ్పి
నుంచి 120 హెచ్పివరకూ ట్రాక్టర్లను భారత్లోనే ఉత్పత్తిచేసి ఎగుమతులు చేస్తోంది. పంజాబ్లోని హోసియార్పూర్లో
అతిపెద్ద ఉత్పత్తి ప్లాంట్ ఉందని భారత్, అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్ను భర్తీచేస్తుందని రమణ్మిట్టల్ వెల్లడించారు.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీ హెల్మెట్పై త్రివర్ణ పతాకం ఎందుకుండదు?
కోహ్లి హెల్మెట్పై త్రివర్ణ పతాకం ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్పై ఉండదు. ఇలా ఉండకపోవడానికి కారణం తెలిస్తే.. ధోనీపై అభిమానం రెట్టింపు అవుతుంది.
TNN | Updated:
Mar 7, 2018, 06:33PM IST
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించారా? అతడి హెల్మెట్‌పై త్రివర్ణ పతాకం ఉండటం చూశారా..? ఇటీవలి కాలంలో అలా చూడలేదు కదూ. సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ఆటగాళ్ల హెల్మెట్‌పై జాతీయ జెండా ఉంటుంది. ధోనీ కంటే వెనుక వచ్చిన కోహ్లి హెల్మెట్‌పై కూడా త్రివర్ణ పతాకం సగర్వంగా తలెత్తుకు కనిపిస్తుంది. మరి ధోనీ హెల్మెట్‌పై మాత్రం ఉండదు. ఎందుకో తెలుసా?
పద్నాలుగేళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ధోనీ హెల్మెట్‌పై త్రివర్ణ పతాకం లేకపోవడానికి ఓ కారణం ఉంది. చట్టం ప్రకారం జాతీయ జెండా ఉన్న వస్తువు ఏదైనా కింద ఉంచడం కుదరదు. అలా చేస్తే మన జెండాన్ని అవమానించినట్లే.
ధోనీ మైదానంలో బరిలో దిగినప్పుడు ఒక్కోసారి హెల్మెట్‌ను కింద ఉంచుతాడు. నిబంధనల ప్రకారం అలా ఉంచొద్దు. కాబట్టే.. తన హెల్మెట్‌పై జాతీయ జెండాను ఉంచుకోలేదు. 2011 వరకూ హెల్మెట్‌పై త్రివర్ణ పతాకాన్ని ఉంచిన ధోని, ఆర్మీ లెఫ్టినెంట్‌ హోదా పొందిన నాటి నుంచి దాన్ని పక్కనబెట్టాడు. ఇతర క్రికెటర్లు తమ హెల్మెట్‌పై త్రివర్ణ పతాకాన్ని ఉంచుకోవడం ద్వారా దేశభక్తి చాటుకుంటే.. ధోనీ మాత్రం జాతీయ జెండాను హెల్మెట్‌పై ఉంచుకోకుండానే.. తన దేశభక్తిని చాటుకున్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ...
బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ అభిమానులకు ఒక విధంగా ఇది షాకింగ్ న్యూసేనని చెప్పవచ్చు.
న వంపుసొంపులను ఏమీ దాచుకోకుండా ఎంతో ఉదారంగా అందాలను ఆరబోస్తు కవ్వించే ఈ హాటెస్ట్ యాక్ట్రెస్ త్వరలో తల్లికాబోతోంది. అవును అది నిజమే.. తల్లి కాబోతోంది అన్నామని.. ఆమె ఇప్పటికే గర్భవతి అనే నిర్ణయానికి వచ్చేయకండి. ప్రస్తుతానికి ఆమె గర్భవతి ఏం కాదు. అతి త్వరలో రానున్న రోజుల్లో తల్లి కావాలని ఆమె భావిస్తోంది. తల్లి కావడానికి ఎందుకింత తొందరని అడిగితే.. ఆ నిర్ణయం తన అత్తగారిదని చెప్పింది. తన అత్తగారు, మనవడినో మనవరాలినో కనిస్తే ఆ బిడ్డతో సమయం గడిపేయడానికి ఉవ్విళ్లూరుతున్నారంది. ఇదే విషయమై తన భర్త డానియల్ వెబెర్ తాను చాలా కాలంగా ఆలోచిస్తున్నామని, తల్లి తండ్రులు కావాలని తమ ఇద్దరికీ ఉందని చెప్పింది.
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పంచ్ పడాల్సిందే.. నేడు లంకతో తొలి వన్డే
టెస్టు సిరీస్లో శ్రీలంకను వైట్వాష్ చేసిన భారత్.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్కు సిద్ధమైంది.
TNN | Updated:
Aug 20, 2017, 11:25AM IST
టెస్టు సిరీస్‌లో శ్రీలంకను వైట్‌వాష్ చేసిన భారత్.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. భారత్, శ్రీలంక మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఆదివారం దంబుల్లాలో జరగబోతోంది. ఈ సిరీస్ ద్వారా 2019 ప్రపంచ కప్‌లో భారత జట్టును తయారు చేసుకునే పనులు బీసీసీఐ మొదలుపెట్టింది. అయితే టెస్టు సిరీస్ ఓటమితో ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆతిథ్య శ్రీలంక వన్డేల్లోనైనా కోహ్లీ సేనకు గట్టి పోటీనివ్వాలని పట్టుదలగా ఉంది. దీనికి అనుగుణంగానే జట్టును తయారుచేశారు. టెస్టులతో పోలిస్తే వన్డేలకు శ్రీలంక జట్టు మెరుగ్గా కనిపిస్తోంది.
2019 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా 20 నెలలకు పైగా సమయముంది. ఐతే ఇప్పట్నుంచే ఆ మెగా టోర్నీకి టీమ్ ఇండియా సన్నాహాలు మొదలుపెట్టేసింది. ఈ సిరీస్ నుంచే ఆటగాళ్ల ప్రదర్శనపై దృష్టిసారించనుంది. మరోవైపు శ్రీలంక కూడా అదే దృష్టితో ఈ సిరీస్‌ను కీలకంగా భావిస్తోంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌లో శ్రీలంక ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ సిరీస్‌లో రెండు వన్డేలు గెలిస్తే ఆ స్థానాన్ని పదిలం చేసుకుని, ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. లేదంటే కష్టాల్లో పడినట్టే.
| 2sports
|
Visit Site
Recommended byColombia
బౌలర్ల జాబితాలో లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ 23 స్థానాలు ఎగబాకి 28 స్థానానికి చేరుకున్నాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 16 స్థానాలు ఎగబాకి 56వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 10 స్థానాలను మెరుగుపర్చుకొని 45వ స్థానానికి చేరుకున్నాడు. అతడి కెరీర్లో ఇదే అత్యుతమ ర్యాంకింగ్ కావడం విశేషం.
మొహాలీ వేదికగా జరిగిన రెండో వన్డేలో 12 సిక్సర్లు, 13 ఫోర్లు బాదిన రోహిత్ 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలి వంద పరుగుల్ని 115 బంతుల్లో చేసిన రోహిత్.. 36 బంతుల్లోనే మరో వంద పరుగులు జోడించాడు. దీంతో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. మూడేళ్ల కిందట ఈడెన్ గార్డెన్స్‌లో 264 పరుగులు చేసిన రోహిత్.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Jan 10,2018
ఐపీవోకు న్యూజెన్ సాఫ్ట్వేర్
ముంబయి: న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ జనవరి 16న పబ్లిక్ ఇన్షియల్ ఆఫర్(ఐపీవో)కు వస్తున్నట్టు ప్రకటించింది. ఈక్విటీ శ్రేణీ ధర రూ.240-245గా నిర్ణయించామని ఆ కంపెనీ సీఎండీ దివాకర్ నిజమ్, సీఎఫ్వో అరుణ్ కుమార్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ వీరేందర్ జిత్ పేర్కొన్నారు. 18న ముగియనున్న ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.450 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Nov 20,2017
ఎన్ఫీల్డ్ నుంచి కొత్త మోటర్ సైకిళ్లు
పనాజి: రాయల్ ఎన్ఫీల్డ్ రెండు సరికొత్త మోటర్ సైకిళ్లను ఆదివారం భారత మార్కెట్లోకి ఆవిష్కరిం చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన వార్షిక రైడర్ మ్యానియా కార్యక్రమంలో ఎన్ఫీల్డ్కు చెందిన ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 వాహనాలను ఐషర్ మోటార్స్ సీఈవో సిద్ధార్థ్లాల్ దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ రెండు వాహనాలూ 650 సీసీ సామర్థ్యపు ఎయిర్ కూల్డ్, అయిల్ కూలర్ ఇంజిన్తో పాటు వివిధ ప్రత్యేకతలతో కంపెనీ రూపొందించింది. ఫ్యూయెల్ ఇంజెక్టర్ మోటార్తో కూడిన ఈ ఇంజిన్ 47పీఎస్ పవర్, 7,100 ఆర్పీఎంతో మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉండనుందని లాల్ వెల్లడించారు. ఇంటర్సెప్టర్ వాహనాన్ని తమ సంస్థ ఆరు గేర్లతో కూడిన ప్రత్యేక గేర్ బాక్స్తో రూపొందించిందని తెలిపారు. ట్రాఫిక్లో కూడా సులభమైన రైడింగ్ను అందించేందుకు గాను సంస్థ స్లిప్ అసిస్ట్ క్లచ్ను అందిస్తోందని తెలిపారు. ఈ వాహనాన్ని 18 అంగుళాల పిరెళ్లీ టైర్లతో పాటు యాంటీ బ్రేకింగ్ స్టిస్టమ్, రెండు షాక్ అబ్జార్వర్స్తో మరింత మెరుగ్గా తయారు చేశారు. కాంటినెంటల్ జీటీ 650 వాహనం ఈ శ్రేణిలో ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న కాంటినెంటల్ 535 మాదిరి లక్షణాలతో మార్కెట్లోకి ఆవిష్కరించినట్టు సంస్థ తెలిపింది. ఇంజిన్ సామర్థ్యాన్ని మాత్రం పెంచి కొత్త లుక్తో దీనిని అందిస్తున్నట్టుగా లాల్ వెల్లడించారు. ఈ కొత్త మోటర్ సైకిళ్ల ధర రూ.3.00 లక్షలనుంచి రూ.3.5 లక్షల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నుంచి కొత్త వాహనాలు దేశ వ్యాప్తంగా అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Fouth one day : india Vs Aus
నాల్గో వన్డే: భారీ స్కోర్ దిశగా ఆసీస్
కాన్ బెర్రా: భారత్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆసీస్ బ్యాట్స్ మెన్లు తమ జోరును కొనసాగిస్తున్నారు.
TNN | Updated:
Jan 20, 2016, 11:20AM IST
కాన్ బెర్రా: భారత్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆసీస్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం 25 ఓటర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ వికెట్లేమీ కోల్పోకుండా 157 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్న ర్ 88, అరోన్ ఫించ్ 62 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఐదు వన్డేల సిరీస్ లో 0-3 తేడాతో సిరీస్ కోల్పోయిన ధోనీసేన ఈ మ్యాచ్ లో నెగ్గి పరువుదగ్గించుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఆసీస్ తనకు అందివచ్చిన ఈ అవకాశాన్ని ఏ మాత్రం జారవిడుచుకోకుండా భారత్ కు క్లీన్ స్వీప్ చేయాలని కసితో ఆడుతోంది. దీంతో మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
చివర్లో మదుపర్ల జోరు... లాభాల్లో మార్కెట్లు
. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 289 పాయింట్లు జంప్చేసి 35,536కు చేరగా.. నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 10,806 వద్ద నిలిచింది.
Samayam Telugu | Updated:
May 11, 2018, 04:10PM IST
బీఎస్ఈ సెన్సెక్స్
కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు చివర్లో జోరందుకున్నాయి. మిడ్ సెషన్ నుంచీ కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు చెప్పుకోదగ్గ లాభాలు ఆర్జించాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలతో తొలి నుంచీ మార్కెట్లు పటిష్టంగానే కదిలాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 289 పాయింట్లు జంప్చేసి 35,536కు చేరగా.. నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 10,806 వద్ద నిలిచింది.
లాభాల్లో మార్కెట్లు
| 1entertainment
|
Dec 06,2017
యూకే సంస్థతో హలో కర్రీ జట్టు
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ఇండియన్ ఫాస్ట్ఫుడ్ గొలుసుకట్టు సంస్థ హలో కర్రీ, బ్రిటన్కు చెందిన ఫుడ్ అడ్వైజర్తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదు ర్చుకుంది. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఈవో రాజు భూపతి, ఫుడ్ అడ్వైజర్ సీఈవో కెయిర్న్ లీస్తో కలిసి మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఆహార పరిశ్రమను ఆధునీకత వైపు తీసుకెళ్లనున్నామన్నారు. ఈ రెండు సంస్థలు తమ ఉమ్మడి పెట్టుబడి ద్వారా కార్యకలాపాలను విస్తరించనున్నాయన్నారు. ఫుడ్ అడ్వైజర్ అనేది వినియోగదారులు ఉపయోగించుకునే యాప్ అన్నారు. ఈ యాప్ ద్వారా ప్రజలకు ఇష్టమైన, సరిపోయే అహారాన్ని అందించనున్నామన్నారు. హలో కర్రీ కస్టమర్ల యొక్క ఫుడ్ అలెర్జీకి అనుగుణంగా వారికి తగినంత వైవిధ్యం కలిగిన ఆహారాన్ని అందించేందుకై ఫుడ్ అడ్వైజర్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
IND vs BAN 1st Test: తప్పు చేసినా.. అభిమానిని కాపాడిన విరాట్ కోహ్లీ
ఇండోర్ స్టేడియంలోని ఫెన్స్ని సాహసోపేతంగా దాటిన అభిమాని నేరుగా మైదానంలో డ్రింక్స్ తాగుతున్న విరాట్ కోహ్లీ వద్దకి వెళ్లి పాదాలపై పడిపోయాడు. అతను వెళ్లిన తీరుకి ఇషాంత్ శర్మ అయితే కంగారుపడి పక్కకి వెళ్లిపోయాడు.
Samayam Telugu | Updated:
Nov 17, 2019, 02:22PM IST
Virat Kohli (L) looks on as security personnel take away a pitch invader
హైలైట్స్
ఇండోర్ టెస్టులో విరాట్ కోహ్లి పాదం తాకేందుకు ఫ్యాన్ సాహసం
మ్యాచ్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో గ్రౌండ్లోకి వెళ్లిన అభిమాని
అభిమానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సెక్యూరిటీకి కోహ్లీ సూచన
మ్యాచ్లో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారత్ గెలుపు
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానుల మనసులు గెలిచాడు. బంగ్లాదేశ్తో ఇండోర్ వేదికగా తాజాగా ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో కోహ్లీ పాదం తాకేందుకు భద్రతా వలయాన్ని దాటుకుని ఓ అభిమాని గ్రౌండ్లోకి వచ్చాడు. దీంతో.. అతడ్ని వెంటాడుతూ వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అతడికి నాలుగు దెబ్బలు తగిలించేలా కనిపించారు. కానీ.. వారిని వారించిన విరాట్ కోహ్లీ.. అభిమానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచిస్తూ.. మైదానం వెలుపలికి పంపాడు.
Virat Kohli fan taking fandom to an another level... #INDvBAN https://t.co/XyiT45jEXJ
— Vinesh Prabhu (@vlp1994) 1573925517000
భారత్లో ఇలా అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లడం ఈమధ్య పరిపాటిగా మారిపోయింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్లోనూ అభిమానులు గ్రౌండ్లోకి వెళ్లారు. ఓపెనర్ రోహిత్ శర్మ అయితే అభిమాని తన పాదాలపై పడుతుండటంతో తప్పించుకునే క్రమంలో కింద కూడా పడిపోయాడు. భద్రత వలయాన్ని దాటుకుని అభిమానులు తరచూ ఇలా మైదానంలోకి వెళ్తుండటంతో అంతర్జాతీయ క్రికెటర్ల భద్రతపై అనుమానాలు నెలకొంటున్నాయి.
Fan moment for 24 yrs old, Pooja Sharma. I don't know her myself but the Authorities at Holkar stadium, Indore were… https://t.co/OYirj48MHz
— Akanksha Patodi (@akanksha_patodi) 1573935493000
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో అభిమానులు ఇలా మైదానంలోకి వెళ్లడం ఇటీవల దాదాపు తగ్గిపోయింది. అక్కడ స్టేడియంలోని సెక్యూరిటీ సిబ్బంది బౌండరీ లైన్ వెలుపల అభిమానుల గ్యాలరీను చూస్తూ కుర్చీల్లో కూర్చుంటారు. దీంతో.. ఎవరైనా ఫెన్స్ దాటాలని ప్రయత్నిస్తే..? వెంటనే వారు అడ్డుకుంటారు. కానీ.. భారత్లో మాత్రం సెక్యూరిటీ సిబ్బంది రివర్స్ కూర్చుని మ్యాచ్ని వీక్షిస్తుంటారు. అభిమానులు తరచూ మైదానంలోకి వచ్చి మ్యాచ్కి ఆటంకం కలిగించడానికి సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఇటీవల దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
Read More: ఇదేం బౌలింగ్ యాక్షన్ గురూ..? (వైరల్ వీడియో)
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కాజల్ ఆ సినిమాలో రెచ్చిపోయిందా?
కాజల్... మొన్నటి వరకు తెలుగు సినిమాని ఏలిన రాణి.
TNN | Updated:
Feb 3, 2016, 09:45AM IST
<br />
కాజల్... మొన్నటి వరకు తెలుగు సినిమాని ఏలిన రాణి. ఇప్పుడు మాత్రం ఆమెపై అంతగా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ కి రావడం కూడా తగ్గించేసిన కాజల్ ముంబయిలో మకాం వేసింది. బాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె ప్రస్తుతం రణ్ దీప్ హుడాతో కలిసి ‘దో లఫ్జోంకి కహానీ’ లో నటిస్తోంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాజల్ ఇంతవరకు ఏ సినిమాలో చేయనివిధంగా ఈ సినిమాలో అందాలను ఆరబోసిందట. అంతేకాదు బెడ్ రూమ్ సీన్లలో కూడా చాలా బోల్డ్ గా నటించిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఎక్స్ పోజింగ్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదని వినికిడి. ఆ సినిమా విడుదలైతే కాజల్ లో మరోకోణాన్ని చూడొచ్చట. తెలుగు, తమిళంలో అవకాశాలు తగ్గడం, బాలీవుడ్ లో మడి కట్టుకుని కూర్చుంటే వీలుకాదనే భావనతోనే కాజల్ ఇలా అందాల ఆరబోత మొదలు పెట్టిందని ఫిల్మ్ నగర్ టాక్. కాగా మొన్నటికి మొన్న ఫిల్మ్ ఫేర్ అవార్డులకు కూడా డీప్ నెక్ గౌనులో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది కాజల్. చూద్దాం... ఈ అందాల ఆరబోత కాజల్ కి ఏ మాత్రం కలిసొస్తుందో...!
| 0business
|
Sep 17,2016
రాధాకృష్ణా నుంచి మార్కెట్లోకి ప్లాటినమ్ ఎతియోస్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రాధాకృష్టా టయోటా సంస్థ ప్లాటినమ్ ఎతియోస్ వాహనాన్ని హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. పలు షోరూమ్లలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల ద్వారా ఈ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చినట్లుగా సంస్థ ప్రకటించింది. సనత్నగర్లోని రాధాకృష్ణా టయో టాలో సంస్థ సీవోవో రామ్కుమార్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చుసా ఫెసిలిటీస్ విభాగం అధ్యక్షుడు ప్రవీణ్ ఉపాధ్యాయ కొత్త వాహనాన్ని ఆవిష్క రించారు. ఏబీఎస్, ఈబీడీలతో ఈ వాహనం అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Visit Site
Recommended byColombia
భారత సెలక్టర్లు ఇటీవల 17 మందితో కూడిన జట్టుని దక్షిణాఫ్రికా పర్యటన కోసం ప్రకటించారు. అయితే.. ఈ జట్టులోనే మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉండటంతో తుది జట్టు ఎంపిక ఎలా..? అనే దానిపై టీమిండియా మేనేజ్‌మెంట్ చర్చిస్తోంది. శ్రీలంక పర్యటన ముందు వరకు కొంతకాలం టెస్టు జట్టులో రెగ్యులర్ ఓపెనర్లుగా మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఉన్నారు. కానీ.. ఈ పర్యటనకి భారత్‌ వెళ్లే కొద్ది రోజుల ముందు విజయ్ గాయపడటంతో.. అతని స్థానంలో శిఖర్ ధావన్‌ని పంపించారు. అక్కడ భారీ శతకం బాదిన ధావన్.. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
గాయం నుంచి కోలుకున్న మురళీ విజయ్‌కి గత నవంబరు‌లో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో అవకాశం కల్పించగా.. అతనూ శతకంతో సత్తాచాటాడు. దీంతో శిఖర్ ధావన్, మురళీ విజయ్ ఓపెనర్లుగా దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇన్నింగ్స్‌ని ఆరంభించే అవకాశం ఉందని ఒక వాదన వినిపిస్తోంది. అయితే.. వన్డే, టీ20లతో పోలిస్తే.. టెస్టుల్లో కేఎల్ రాహుల్ మెరుగ్గా ఆడతాడంటూ గతంలో కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థి పేసర్ల లయని ఆదిలోనే దెబ్బతీయడంలో కూడా రాహుల్ ముందుంటాడు. దీంతో ఎవరికి ఓపెనర్లుగా అవకాశం దక్కుతుందో అనే ఆసక్తి ప్రస్తుతం సర్వత్రా నెలకొంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
- రుతుపవనాలూ కీలకమే
నవతెలంగాణ - వాణిజ్య విభాగం
జూన్ 20తో ప్రారంభమయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రధానంగా విదేశీ పరిణామాలు ప్రభావం చూపనున్నాయి. యూరోపియన్ యూనియన్లో బ్రిటన్ నిష్క్రమణపై ఈ నెల 23న అక్కడి ప్రభుత్వం రెఫరెండం నిర్వహించనుంది. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లకు అత్యంత కీలకం కానుంది. ఇదే సమయంలో దలాల్ స్ట్రీట్పైనా ప్రభావం చూపనుంది. దీనికి తోడు దేశంలో రుతుపవనాల స్థితి, ఎఫ్ఐఐలు, ముడి చమురు ధరలు, రూపాయి మారకం విలువలను మదుపర్లు కీలకంగా తీసుకోనున్నారు. జూన్ 2016కు సంబంధించిన పారిశ్రామికోత్పత్తిపై నిక్కీ అంచనాలు విడుదల చేయనుంది. ఈ పరిణామం మదుపర్లలో విశ్వాసాన్ని ప్రభావితం చేయనుంది. జీఎస్టీి అమలుపై చర్చలు, అమెరికాలో గృహాల అమ్మకాలు, ఉపాధి రేటు తదితర అంశాలు మార్కెట్ల సరళీకి కీలకం కానున్నాయి.
67కు కుంగిన రూపాయి
జూన్17తో ముగిసిన వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు యథాతథంగా నమోదయ్యాయి. బీఎస్ఇ సెన్సెక్స్ స్వల్పంగా 9.84 పాయింట్లు కోల్పోయి 26,626 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ యథాతథంగా 8,170 వద్ద నమోదయ్యింది. నిఫ్టీ-50లో భారతీ ఇన్ఫ్రాటెల్ అత్యధికంగా 9.83 శాతం విలువ కోల్పోయింది. ఐసీిఐసీిఐ బ్యాంకు, ఒఎన్జీసీ, టాటా పవర్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్ సూచీలు వరుసగా 5.46 శాతం, 3.46 శాతం, 3.41 శాతం, 2.89 శాతం, 2.75 శాతం చొప్పున గత వారంలో అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్లో ఉన్నాయి. మరోవైపు గెయిల్, ఎస్బీఐ, హిందాల్కో, బ్యాంకు ఆఫ్ బరోడా, ఐటీసీ సూచీలు 4.89 శాతం, 3.37 శాతం, 2.86 శాతం, 2.67 శాతం, 2.37 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. బీఎస్ఇలో రంగాల వారిగా టెలికం, బ్యాంకింగ్, వైద్య, ఆటో సూచీలు 1.83 శాతం, 0.90 శాతం, 0.44 శాతం, 0.39 శాతం చొప్పున విలువ కోల్పోయాయి.
క్రితం వారంలో మొత్తంగా విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.295.95 కోట్ల నికర ఈక్విటీలు కొనుగోళ్లు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 0.56 శాతం కోల్పోయి 67.17కు పడిపోయింది. జూన్10 నాటికి రూపాయి విలువ 66.70 వద్ద నమోదయ్యింది. ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వు, బ్యాంకు ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడంతో మార్కెట్లకు కొంత ఉపశమనం లభించింది. కాగా యూరోపియన్ యూనియన్లో బ్రిటన్ కొనసాగుతుందా లేదా అన్న అంశంలో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదుడులకు గురి అయ్యాయి.
పబ్లిక్ ఇష్యూకి 33 ఎస్ఎంఈలు..
దేశంలో 33 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పబ్లిక్ ఇష్యూల జారీకి సిద్ధంగా ఉన్నాయి. వ్యాపార విస్తరణ, మూలధన అవసరాల కోసం ఈ నిధులను ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ ప్రణాళికల్లో ఉన్నాయి. ఎస్ఎంఈ వేదికపై లిస్టింగ్ అయ్యే కంపెనీల ఇష్యూ అనంతర పెయిడప్ క్యాపిటల్ మూడు కోట్ల రూపాయలుండాలి. ఈ కంపెనీలు బీఎస్ఈలోని ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో లిస్టింగ్ కానున్నాయి.
వీటిలో 15 ఎస్ఎంఈలకు ఇష్యూల జారీకి ఇప్పటికే అనుమతి లభించగా 18 సంస్థల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఇష్యూల జారీ కోసం సిద్ధంగా ఉన్న కంపెనీల్లో ట్రెన్ ఎంటర్టైన్మెంట్, మోనార్క్ అపారెల్స్, షేర్వే సెక్యూరిటీస్, ఆక్టావేర్ టెక్నాలజీస్, వర్త్ ఇన్ఫ్రా ఇండిస్టీస్, ఎజీఐ హాస్పిటాలిటీస్, యష్ కెమెక్స్, అడ్వాన్స్ సింటెక్స్ వంటి సంస్థలున్నాయి. 2012 మార్చిలో ఎస్ఎంఈ ఇండెక్స్ను బీఎస్ఈ ప్రారంభించింది. అప్పటి నుంచి 139 కంపెనీలు అందులో లిస్టింగ్ కాగా వాటి మార్కెట్ విలువ 10,126.35 కోట్ల రూపాయలుంది. వాటిలో 18 కంపెనీలు ప్రధాన ఇండెక్స్లకు ప్రమోట్ కాగా ప్రస్తుతం 121 కంపెనీలు ఈ ప్లాట్ఫామ్పై ఉన్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
మూకీ స్లో మోషన్ సినిమా
ఇంత వరకు మనం మూకీ సినిమాలు చూశాం. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రాకేష్ రెడ్డి మూకీతో పాటు స్లోమోషన్లో...
| Updated:
Jun 22, 2016, 08:48PM IST
మూకీ స్లో మోషన్ సినిమా
ఇంత వరకు మనం మూకీ సినిమాలు చూశాం. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రాకేష్ రెడ్డి మూకీతో పాటు స్లోమోషన్లో 'కాలాయా తస్మై నమః' చిత్రానికి దర్శకత్వం వహించారు. పూర్తి సినిమాను స్లోమోషన్లో చేయడం ఇప్పటి వరకు, ఏ భాషలో ఎవరూ చేయని ప్రయత్నమే కాదు.. వరల్డ్ రికార్డుగానూ భావించవచ్చంటున్నాయి యూనిట్ వర్గాలు. ఆర్.కె. గురు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శ్రీనివాస్.బి, విజయ్ కార్తీక్, వినయ్ కృష్ణ, శ్రీనివాస్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్ నాయుడు, రేఖ బోజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జులైలో సినిమాను గ్రాండ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ... " నేను గతంలో లవ్ ఇన్ వైజాగ్, డర్టీ పిక్చర్, అనే షార్ట్ ఫిలింస్ డైరెక్ట్ చేశాను. వీటికి దర్శకుడుగా నాకు మంచి పేరు వచ్చింది. ఆ ఉత్సాహంతో, అనుభవంతో తొలిసారిగా `కాలాయా తస్మై నమః` చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇక ఈ చిత్ర కథ విషయానికొస్తే...ఇది 1980లో గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ. మనం ఏం కావాలి? అనేది కాలమే నిర్ణయిస్తుందన్న అంశంతో సినిమా ఆద్యంతం ఉంటుంది ( టైమ్ ఈజ్ డెస్టినీ). అందుకే `కాలాయా తస్మై నమః` అనే టైటిల్ నిర్ణయించాము. టైటిల్ కొత్తగా ఉందంటున్నారు. నా నిజ జీవితంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కూడా ఈ చిత్రంలో పొందుపరచడం జరిగింది. మా సినిమాకు ఓ స్పెషాలిటీ ఉంది. అదేమిటంటే... ఈ సినిమా కోసం మొదటిసారిగా అందరూ షార్ట్ ఫిలింస్కి వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ వర్క్ చేశారు. ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే.. ఇదొక కొత్త కాన్సెప్ట్... ఆడియన్స్కి కనెక్టయిందంటే మాత్రం ప్రేమిస్తే, ప్రస్థానం, బిచ్చగాడు చిత్రాల్లాగా సంచలనం సృష్టించడం ఖాయం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు జరుగుతున్నాయి. జులైలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని' అని అన్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
యుఎస్ ఓపెన్లో జుకోవిచ్కు వాకోవర్
వెసెలీ వైదొలగడంతో నేరుగా మూడవ రౌండ్లోకి
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో టాప్ సీడ్ నొవాక్ జుకోవిచ్ మూడవ రౌండ్లోకి ప్రవేశించాడు.పురుషుల సింగిల్స్లో భాగంగా రెండవ రౌండ్లో జుకోవిచ్ తలపడాల్సిన జిరీ వెసెలీ (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా చివరి నిముషంలో టోర్నీ వైదొలిగాడు.దీంతో జుకోవిచ్ నాకోవర్ ద్వారా మూడవ రౌండ్లోకి చేరాడు. జుకోవిచ్ తన తదుపరి పోరులో అర్జెంటీనా చెందిన ఆటగాడు గైడోషెల్లాతో కానీ,రష్యా ఆటగాడు మిఖాలీ యెజ్నీతో కానీ తలపడతాడు.గత ఏప్రిల్లో జరిగిన మాంటి కార్లో క్లేకోర్టు టోర్నమెంట్లో జుకోవిచకు జిరీ వెసెలీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది మియామి,ఇండియన్ వెల్స్ గెలిచి మంచి ఊపు మీద ఉన్న జుకోవిచ్ను మాంటి కార్లో టోర్నీలో వెసిలీ ఓడించి సంచలన సృష్టించాడు.దీంతో యుఎస్ ఓపెన్ రెండవ రౌండ్లో జుకోవిచ్కు వెసలీ తీవ్ర ప్రతిఘటన తప్పదని అంచనా వేశారు.అయితే గాయం కారణంగా వెసిలీ పోరునుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిం చడంతో జుకోవిచ్ తన రాకెట్కు ఎటువంటి పనిచెప్పకుండానే మూడవ రౌండ్కు చేరాడు.
| 2sports
|
Apr 24,2015
రూ.200 తగ్గిన పసిడి
న్యూఢిల్లీ : అంతర్జాతీయ పరిణామాలకు తోడు ఆభరణాల విక్రయాల డిమాండ్లో స్తబ్దత వల్ల గురువారం బంగారం ధరల్లో 200 తగ్గుదల చోటు చేసుకుంది. గురువారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.200 క్షీణించి వరుసగా రూ.27,000, రూ.26,850 వద్ద ముగిసింది. కిలో వెండిపై రూ.350 తగ్గి రూ.36,250 వద్ద నమోదయ్యింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఇదేం ట్రోలింగ్.. సోషల్ మీడియాపై దిల్ రాజు అసహనం
భారతీయ సాంప్రదాయాల్లో వివాహం గొప్పతనాన్ని చాటిచెబుతూ దిల్ రాజు నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా సక్సెస్ మీట్ సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది.
Samayam Telugu | Updated:
Aug 13, 2018, 09:01PM IST
భారతీయ సాంప్రదాయాల్లో వివాహం గొప్పతనాన్ని చాటిచెబుతూ దిల్ రాజు నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా సక్సెస్ మీట్ సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో నితిన్తో పాటు హీరోయిన్ రాశీఖన్నా , నందితా శ్వేత, దర్శకుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు.
ఈ సినిమాపై కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంటే.. సోషల్ మీడియాలో మాత్రం నెగటివ్ టాక్ రావడంపై దిల్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. తన 15 ఏళ్లలో తాను 30 చిత్రాలు నిర్మించానని, కానీ.. ఏ సినిమాకు తానింత గందరగోళానికి గురికాలేదని తెలిపారు. ‘లవర్’ సినిమా వర్కవుట్ కాలేదని మూడో రోజే తెలిసిపోయింది. కానీ, ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చూసినవారంతా తమని మెచ్చుకుంటుంటే.. సోషల్ మీడియాలో మాత్రం నెగటివ్గా మాట్లాడటం బాధాకరమని తెలిపారు.
Visit Site
Recommended byColombia
‘‘ప్రస్తుతం ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము ఈ సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకోడానికి శుభలేఖల రూపంలో ప్రేక్షుకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. ‘చాలా బాగుంది, బాగుంది, ఫర్వాలేదు, బాగాలేదు’ ఆప్షన్లు ఇస్తే 90 శాతం మంది ‘చాలాబాగుంది’ మీద టిక్ చేశారు. రాష్ట్రంలో 60 నుంచి 70 థియేటర్ల నుంచి ఈ అభిప్రాయాలు తీసుకున్నాం. ఈ సినిమాకు మంచి రెవెన్యూ కూడా వచ్చింది. ఏపీల్లో వర్షాలు కురుస్తున్నా సరే మంచి కలెక్షన్లు వచ్చాయి’’ అని దిల్ రాజు తెలిపారు.
‘‘ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన ఒకలా, యూత్ కామెంట్స్ ఒకలా ఉన్నాయి. సోషల్ మీడియాలో రివ్యూలు చూసి.. తొలిసారి కన్ఫ్యూజ్ అయ్యా’’ అని తెలిపారు. దర్శకుడు సతీష్ మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న ఈ చిత్రానికి నెగటివ్ టాక్ ప్రచారం చేయడం చాలా బాధేస్తోంది. ఈ సినిమా చూసినవారు అభినందిస్తుంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మీకు ఈ సినిమా నచ్చితే మరో పది మందికి చెప్పి మంచి సినిమాను ఆధరించేందుకు సహకరించండి’’ అని తెలిపారు.
| 0business
|
89వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం.. ఉత్తమ చిత్రంగా మూన్ లైట్
Highlights
డాల్బీ థియేటర్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానం
పాల్గొన్న ప్రియాంక చోప్రా, దీపికా పడుకునె
ఉత్తమ చిత్రంగా ఎంపికైన మూన్ లైట్
ప్రతిష్టాత్మక 89వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక డాల్బీ థియేటర్లో జరిగింది. ప్రియాంక చోప్రా, దీపిక పడుకునేలు భారత్ నుంచి ఈ వేడుకకు హాజరైన వారిలో ఉన్నారు.
2017 ఆస్కార్ విజేతలు...
ఉత్తమ చిత్రం: మూన్ లైట్
ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్(మాంచెస్టర్ బై ద సీ)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్(లా లా లాండ్)
ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా లాండ్)
ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ(మూన్లైట్)
ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్(ఫెన్సెస్)
ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైల్: సూసైడ్ స్క్వాడ్ చిత్రం
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ చిత్రం: ఫెంటాస్టిక్ బీస్ట్స్
ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే.. మేడ్ ఇన్ అమెరికా
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అరైవల్
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ చిత్రం: హాక్సారిడ్జ్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: హాక్సారిడ్జ్
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సెల్స్ మ్యాన్(ఇరాన్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: జూటోపియా
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: పైపర్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ చిత్రం: లా లా ల్యాండ్
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ద జంగిల్ బుక్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్: ద వైట్ హెల్మెట్స్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: సింగ్
బెస్ట్ సినిమాటోగ్రఫి: లా లా ల్యాండ్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్: లా లా లాండ్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్( లా లా లాండ్)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: మాంచెస్టర్ బై ద సీ
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: మూన్ లైట్
Last Updated 25, Mar 2018, 11:59 PM IST
| 0business
|
sumalatha 145 Views Automobile , Mahindra's
MandM
ముంబయి: వచ్చే సంవత్సరం రెండో త్రైమాసికంలోగా మహింద్రా అండ్ మహీంద్రా భారత్ స్టేజ్-6 నిబంధనలకు అనుగుణంగా వాహనాల మోడల్స్ను మార్కెట్లోకి ప్రవేశపెడతామని సంస్థ ఎండీ పవన్ గోయంకా తెలిపారు. అయితే కొత్త నిబంధలు డీజిల్ వాహనాలను మరింత ప్రియం చేయనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 2020 ఏప్రిల్ 1 నాటికి పెట్రోల్, డీజిల్ రకాల వాహనాలు సిద్ధమైపోతాయని తెలిపారు. నాలుగు మీటర్లకు మించి పొడవు ఉన్న వాహనాలపై 50శాతం వరకు జీఎస్టీ పెరగవచ్చని.. ఈ పెంపు రూ.లక్షల వరకు ఉంటుందని గోయంకా తెలిపారు. చిన్న డీజిల్ వాహనాలపై రూ.80,000 వేల వరకు పెరుగుదల ఉంటుందని పేర్కొన్నారు. ఇక పెట్రోల్ మోడల్స్పై రూ20 వేల నుంచి రూ.25 వేల వరకు పెరుగుదల ఉండవచ్చన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/
| 1entertainment
|
Suresh 149 Views 3rd test
మూడవ టెస్టు డ్రా
రాంచీ: ఆస్ట్రేలియా,భారత్ మధ్య జరిగిన మూడవ టెస్టు డ్రాగా ముగిసింది. ఒక దశలో భారత జట్టును విజయం ఊరించినా చివరకు డ్రాతోనే ముగించాల్సి వచ్చింది. చివరి రోజు ఆటలో ఆస్ట్రేలియా స్ఫూర్తిదాయకమైన ఆటను ప్రదర్శించి భారత్ విజయాన్ని అడ్డుకుంది.ప్రధానంగా హ్యాండ్స్ స్కాంబ్ 194 బంతులు ఆడి 6 బౌండరీలతో 68 పరుగులు చేయగా, షాన్ మార్ష్ 197 బంతులు ఆడి 7 బౌండరీలతో 53 పరుగులతో బాధ్యతా యుతంగా ఆడి మ్యాచ్ను డ్రా చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. వీరిద్దరు 124 పరుగుల అయిదవ వికెట్ భాగస్వామ్యాన్ని సాధించడం ఇక్కడ విశేషం.
అంతకు ముందు 2 వికెట్లకు 23 పరుగల ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం చివరి రోజు రెండవ ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆసీస్ 63 పరుగుల వద్ద నాలుగవ వికెట్ను కోల్పోయి కష్టాల్లో పడింది.ఆసీస్ స్కోరు 59 పరుగుల వద్ద రెన్ షా 15ను ఇషాంత్ శర్మ పెవిలియన్కు పంపాడు.దీంతో ఆసీస్ మూడవ వికెట్ను నష్టపోయింది.ఆ తరువాత స్వల్ప వ్యవధిలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 21 ఔటయ్యాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 30ఓవర్ తొలి బంతికి స్మిత్ బౌల్డ్ అయ్యాడు. జడేజా సంధించిన బంతి వచ్చి స్మిత్ వికెట్ను ఎగరేసుకుపోయింది.ఈ సమయంలో షాన్ మార్ష్-హ్యాండ్ స్కాంబ్ జోడీ మరమ్మత్తులు చేపట్టింది. సుమారు రెండు సెషన్లు హ్యాండ్ స్కాంబ్-షాన్ మార్ష్్లు భారత బౌలింగ్కు అడ్డంగా నిలబడ్డారు.ఒకవైపు స్పిన్ బౌలింగ్ వారిని ఇబ్బంది పెడుతున్నా మొక్కువోని దీక్షతో పోరాటం సాగించారు.ఈ క్రమంలోనే మొదట హ్యాండ్ స్కాంబ్ హాఫ్ సెంచరీ సాధించగా,ఆ తరువాత షాన్ మార్ష్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
అయితే మ్యాచ్ ఇంకా పది ఓవర్లలో ముగుస్తుందనగా షాన్ మార్ష్ అయిదవ వికెట్గా ఔటయ్యాడు.ఆ తరువాత స్వల్ప వ్యవధిలో మ్యాక్స్వెల్ 2ను అశ్విన్ ఔట్ చేశాడు.అప్పటికే ఫలితం పై ఆశలు వదులుకున్న భారత్ కేవలం కట్టుదిట్టంగా మాత్రమే బౌలింగ్ చేసింది.చివరి రోజు ఆట ముగిసే సమయానికి హ్యాండ్ స్కాంబ్కు జతగా వేడ్ 9 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా అయింది.టీమిండియా బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మ,అశ్విన్లకు ఒక్కొక్కరికి ఒక వికెట్ దక్కింది.ప్రస్తుతం ఇరు జట్లు ఒక్కో టెస్టు గెలిచి సిరీస్ 1-1తో సమంగా నిలిచాయి.సిరీస్లో ఆఖరి టెస్టు 25న ధర్మశాలలో ఆరంభం కానుంది.
| 2sports
|
సత్యం రామలింగ రాజుకు సుప్రీంకోర్టు నోటీసు జారీ
PNR|
కంపెనీ అకౌంట్స్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డ సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ బి రామలిగరాజు బెయిల్ పిటిషన్లో మరోసారి చుక్కెదురైంది. గత ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజుకు బెయిల్ను మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ పిటిషన్పై సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.
సిబిఐ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు రామలింగరాజుకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో తన బెయిల్ పిటిషన్ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని రామలింగరాజును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జనవరి 2009లో రామలింగరాజు 14,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడటంతో ఏప్రిల్ 2009లో టెక్ మహీంద్రా ఈ సంస్థను టేకోవర్ చేసి "మహీంద్రా సత్యం"గా పేరు మార్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. సత్యం కంప్యూటర్స్ మార్చి 30, 2010తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 124.6 కోట్లు (27.8 మిలియన్ డాలర్లు) నికర నష్టాన్ని ప్రకటించింది. ఈ సమయంలో కంపెనీ నికర అమ్మకాలు రూ. 5,481 కోట్లకు పెరిగాయి.
సంబంధిత వార్తలు
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
జియో ఉచిత సేవలు 2017 మార్చి వరకూ!
ఎంట్రీతోనే టెలీకా రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ఉచిత ఆఫర్లను వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించనున్నట్లు సమాచారం.
TNN | Updated:
Nov 27, 2016, 09:30AM IST
ఎంట్రీతోనే టెలీకా రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో .. ఉచిత ఆఫర్లను వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 5న అధికారికంగా సేవలను ప్రారంభించిన సందర్భంగా జియో వెలకమ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా జియో కస్టమర్లు ఈ ఏడాది చివరి వరకూ అపరిమితంగా 4జీ ఇంటర్నెట్‌, వాయిస్ కాల్స్‌ సేవలను ఉచితంగా అందుకునే వీలుంది. అయితే ఈ గడువును వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించాలని జియో భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన డిసెంబర్ 28న రానున్నట్లు మీడియా వర్గాల్లో ప్రచారం అవుతోంది. ఉచిత ఆఫర్ ముగిసిన తర్వాత కూడా 1 జీబీ డేటాను కేవలం రూ.50 అందిస్తామని ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆశించిన స్థాయిలో కస్టమర్ల సంఖ్య పెరగకపోవడంతోనే జియో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తమ కస్టమర్ల కోసం ఏడు ప్లాన్లను అందుబాటులోకి తేనున్నట్లు సెప్టెంబర్లోనే జియో ప్రకటించింది. అన్ని ప్లాన్స్‌లోనూ ఫ్రీ వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ మెసేజ్‌లు. బ్లాక్ డేస్ ఉండవని, దేశవ్యాప్తంగా రోమింగ్ ఛార్జీలు వసూలు చేయమని జియో తెలిపింది. రూ.149 ప్లాన్‌లో 0.3 జీబీ, రూ.4999 ప్లాన్‌లో 75 జీబీ డేటా అందిస్తామని చెప్పింది. స్టూడెంట్స్ కోసం అదనంగా 25 శాతం డేటా అందించనున్నట్లు ప్రకటించింది.
| 1entertainment
|
ప్రియాంకాచోప్రా ఒక్క ట్వీట్ రేటు ఆరులక్షలు
Highlights
తెలివిగా వ్యవహరిస్తే డబ్బు వరదలా పారుతుంది అంటున్న ప్రియాంకాచోప్రా
ఆరు లక్షలు ఇస్తేనే ట్వీట్టర్ లో ట్వీట్ చేస్తాను అంటున్న ముద్దుగుమ్మ
ప్రియాంక ఒక్క ట్వీట్ చేయాలంటే అక్షరాలా ఆరులక్షలు ఆమెకు సమర్పించుకోవాల్సిందేట ఆ సమాచారం కచ్చితంగా నాలుగు కోట్లు అంతకు పైగా చూస్తారు కనుక తమకు కచ్చితంగా లాభం ఉంటుందని కొందరు భావిస్తున్నారట! దాంతో ప్రియాంక అడిగిన ఆరు లక్షలు ఆనందంగా సమర్పించుకుంటున్నారట!
| 0business
|
Hyderabad, First Published 29, Apr 2019, 12:03 PM IST
Highlights
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ ప్రధాన అడిటర్ సంస్థ ‘డెల్లాయిట్’పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ శాఖ ఐదేళ్ల నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్అండ్ఎఫ్ఎస్) కేసులో మోసాలు, విధులను సక్రమంగా నిర్వర్తించలేదన్న ఆరోపణలపై గ్లోబల్ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్పై కేంద్ర ప్రభుత్వం ఐదేండ్ల నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు డెలాయిట్పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకునే వీలుందని తెలుస్తున్నది.
దేశీయ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల రంగాన్ని ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభం కుదిపేసిన సంగతి తెలిసిందే. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇటు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కనిపించిన సంగతీ విదితమే.
ఈ క్రమంలోనే ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఆడిటర్గా ఉన్న డెలాయిట్పై కంపెనీల చట్టంలోని సెక్షన్ 140 (5) కింద నిషేధం విధించే అంశాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు వార్తాసంస్థ ఐఏఎన్ఎస్ కథనాన్ని బట్టి తెలుస్తోంది. మోసపూరిత కార్యకలాపాలతో ప్రమేయం ఉన్న ఆడిటర్లపై చర్యలు తీసుకునేందుకు ఈ సెక్షన్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు అవకాశమిస్తుంది.
పక్కాగా కేంద్రం డెలాయిట్పై చర్యలు తీసుకుంటే నిషేధం ఎదుర్కొన్న రెండో అతిపెద్ద సంస్థగా నిలుస్తుంది. గతేడాది జనవరిలో సత్యం కుంభకోణం కేసులో ప్రైస్ వాటర్హౌజ్ కూపర్స్ (పీడబ్ల్యూసీ)పై స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
రెండేళ్లపాటు స్టాక్ మార్కెట్లోని సంస్థలకు, బ్రోకరేజీలకు ఆడిటింగ్ సేవల్ని అందించరాదని పీడబ్ల్యూసీని సెబీ ఆదేశించింది. మోసాలతో అక్రమంగా ఆర్జించిన రూ.13 కోట్లకుపైగా సొమ్మును చెల్లించాలని కూడా పీడబ్ల్యూసీకి స్పష్టం చేసింది.
సత్తాలేని కార్పొరేట్ సంస్థలకు పైపై మెరుగులు అద్ది, వాటిపై అంచనాలను పెంచడంలో ఆడిటర్ల పాత్రే కీలకం. ఆడిటింగ్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటంతో కార్పొరేట్ కుంభకోణాలకు అంతే లేకుండా పోతున్నది. గతంలో సత్యం కంప్యూటర్స్ ఉదంతం తెలిసిందే. సంస్థ ఆర్థిక ఫలితాలను ఎక్కువ జూపి.. అంచనాల్ని అమాంతం పెంచేశారు. చివరకు నష్టపోయింది అమాయక మదుపరులు, ఉద్యోగులే.
ఐఎల్అండ్ఎఫ్ఎస్ రుణ సంక్షోభంలోనూ ఆడిటర్లపై అనేకానేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సదరు సంస్థ ఆడిటర్ డెలాయిట్ పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, దర్యాప్తు జరుగుతున్నదని, అధికారులకు అన్నివిధాలా సహకరిస్తున్నామని, నియమ, నిబంధనలను పాటించే ఆడిటింగ్ చేశామని డెలాయిట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఆత్మరక్షణలో పడిన డెలాయిట్.. ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలను తాము మాత్రమే ఆడిటింగ్ చేయలేదని, చాలాచాలా చిన్న సంస్థలు కూడా చేశాయని తెలిపింది. గతేడాది మే నెలలోనే ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ చెల్లింపుల వైఫల్యం మొదలైందని డెలాయిట్ తెలిపింది.
ఐఎల్ఎన్ఎస్ గ్రూప్ లోని ప్రధానమైన ఐటీఎన్ఎల్, ఐఎఫ్ఐఎన్ సంస్థల ఆడిటింగ్ను ఎర్నెస్ట్ అండ్ యంగ్, కేపీఎంజీ సంస్థలు చేశాయని గుర్తుచేసింది. ఇదే క్రమంలో ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్లోని 347 అనుబంధ సంస్థల ఆడిటింగ్తో తమకు సంబంధం లేదని ప్రకటించింది.
ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలు చాలావరకు విదేశాల్లో ఉన్నాయని పేర్కొన్నది. నైట్ ఫ్రాంక్ లేదా ఎన్ఎం రాయ్జీ వంటి ప్రముఖ సంస్థల మూల్యంకనం కూడా ఉందన్నది.
Last Updated 29, Apr 2019, 12:03 PM IST
| 1entertainment
|
ORB.COM
ఐటిహబ్లో ఆర్బ్కామ్ కస్టమర్కేర్ సెంటర్
హైదరాబాద్: ఇంటర్నెట్ఆఫ్థింగ్స్ కార్యకలాపాల్లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉన్న ఆర్బ్కామ్ సంస్థ తాజాగా భారతీయ కార్యకలాపాలపై దృష్టిపెంచింది. సాఫ్ట్వేర్ అప్లికేషన్ వృద్ధికి మరింత కృషిచేస్తోంది. మెషిన్టు మెషిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిష్కారాలను అందించడంలో ఇప్పటికే దిగ్గజమైన ఆర్బ్కామ్ తాజాగా హైదరాబాద్లో తన మొదటిశ్రేణి ఆర్బ్కామ్ కేంద్రాన్ని హైదరాబాద్కు తరలించింది.కస్టమర్కేర్ సెంటర్గా ఉన్న ఈకేంద్రాన్ని ఐటిశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో ఆర్బ్కామ్ ఎగ్జిక్యూటివ్ వైస్ప్రెసిడెంట్ క్రెయిగ్ మలోన్, ఇతర ఉన్నతస్థాయిప్రతినిధులు పాల్గొన్నారు. కంపెనీకి సంబంధించిన అతిపెద్ద సాఫ్ట్వేర్ డెవలెప్మెంట్కేంద్రంగా ఆర్బ్కామ్ పనిచేస్తుందని కంపెనీ నిపు ణులు వెల్లడించారు. అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల బృందంలో భాగం కావడంతోపాటు ఐఒటి ఉత్పత్తులు, సేవలు పరిష్కాఆలను అందించడంపై దృష్టికేంద్రీకరిస్తామన్నారు. కొత్తఆధునిక సదుపాయాలతో కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారం భించామని, అంతర్జాతీయ పారిశ్రామిక ఐఒటి మార్కెట్లో ఆర్బ్కామ్ వ్యాపార విస్తరణ, వృద్ధికి దోహదం చేస్తుందన్నారు.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నాలుగో వన్డేకి భారత్ జట్టులో మార్పులు..?
శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ని భారత్ జట్టు ఇప్పటికే 3-0తో చేజిక్కించుకున్న నేపథ్యంలో మిగిలిన రెండు
TNN | Updated:
Aug 28, 2017, 08:19PM IST
శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ జట్టు ఇప్పటికే 3-0తో చేజిక్కించుకున్న నేపథ్యంలో మిగిలిన రెండు వన్డేలకి జట్టులో మార్పులు ఉండొచ్చని కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. వన్డే సిరీస్‌ కోసం సెలక్టర్లు 15 మందితో జట్టుని ఎంపిక చేయగా.. మూడు వన్డేలకి ఒకే తుది జట్టును కోహ్లి కొనసాగించాడు. మూడు వన్డేల్లోనూ తక్కువ స్కోరే ఛేదించాల్సి రావడంతో భారత్ టాప్ ఆర్డర్‌కి రెండో వన్డే మినహా పరీక్ష ఎదురుకాలేదు. గురువారం జరగనున్న నాలుగో వన్డేలో రహానె, మనీశ్ పాండే , శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లో కనీసం ఇద్దరికి చోటు దక్కే అవకాశం ఉంది.
‘మిగిలిన రెండు వన్డేల్లో రిజర్వ్ బెంచ్‌లోని ఆటగాళ్లకి ఛాన్స్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పటికే భారత్ జట్టు సిరీస్ గెలిచేసింది. లంక పిచ్‌‌లు బ్యాట్స్‌మెన్‌కి సవాల్ విసురుతున్నాయి. తక్కువ లక్ష్యాలను ఛేదించాల్సి వచ్చినా.. ఒక్కోసారి ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. రెండో వన్డేనే దానికి ఉదాహరణ. కాబట్టి మరీ ఎక్కువ ప్రయోగాలకు వెళ్లకుండా సాధ్యమైనంతగా సమతూకంగా తుదిజట్టుని ఎంచుకుంటాం. యువ క్రికెటర్లు అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడక తప్పదు’ అని కోహ్లి వివరించాడు. మూడు వన్డేల్లోనూ బ్యాట్‌తో విఫలమైన కేదార్ జాదవ్‌పై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అతని స్థానంలో
మనీశ్ పాండేకి ఛాన్స్ దొరకొచ్చు.
| 2sports
|
internet vaartha 313 Views
తక్కువధరలకే అమ్ముకుంటున్న పాలరైతులు
ముంబై : పశుగ్రాసం ధరల్లో పెరుగుదల, నిర్వహణ వ్యయాలు పెరగడంతో డెయిరీ రైతులు సమస్యలతో సతమతం అవుతున్నారు. బ్రాండెడ్ మిల్క్ కంపెనీలు తమ మార్జిన్లు చూసుకుంటు న్నాయే కానీ పాలసేకరణ ధరలు పెంచకపోవడం వల్ల కూడా రైతులను కష్టాలపాలుచేస్తోంది. మహా రాష్ట్రలో పాలసేకరణధర లీటరుకు 18-19 రూపాయలుగా ఉన్నాయి. కొన్ని నెలల క్రితం లీటరు 24-25గాఉండేవి. పాలపొడిపై ఎక్కువ ప్రాధాన్యం చూపించడం వల్ల పాలసేకరణ ధరలు కూడా తగ్గించారు. ఏరోజుకారోజు పాలను ఎక్కడో చోట ఎంతో కొంత ధరకు అమ్మేయాల్సిన పరిస్థితి. నిల్వ ఉండే ఉత్పత్తులు కాకపోవడంతో ఇప్పటికీ ఒక్క రోజుకు మించి ఉండటం కష్టం అవుతుంది. అందు వల్లనే సమీపంలోని మరో డైయిరీ వద్దకు వెళ్లి అయినా రైతులు అమ్ముకుంటారు. పాలనుంచి తీసే ఉత్పత్తుల్లో ఎక్కువగా పాలపొడి ఉంది. సాధారణ లక్ష్యం 78వేల టన్నులనుంచి డెయిరీలు పాలపొడి లక్ష నుంచి లక్షా 50వేల టన్నులకు ఉత్పత్తిచేస్తు న్నాయి. ఎగుమతి మార్కెట్లలో డిమాండ్ తగ్గడం వల్ల కూడా పాలపొడినిల్వలు డైయిరీలలో పేరుకుం టున్నాయి. దేశీయ మార్కెట్లలో కూడా ఈ ధరలు తగ్గి 32శాతం తగ్గి, కిలో ఒక్కింటికి 140 నుంచి 150 రూపాయలుగాఉంది. పాలు, పాల ఉత్పత్తుల ఎగుమతులు ప్రస్తుతం స్తంభించినట్లే చెప్పాలి. అంతర్జాతీయ ధరల్లో క్షీణత, ఎగుమతి మార్కెట్ కంటే దేశీయ మార్కెట్లే మేలన్న భావనలో డైయిరీ లు ఉండటంవల్లనే ఎగుమతులు పూర్తిగా స్తంభించాయని ర్యాబో బ్యాంక్ అగ్రి ఆహార బిజినెస్ విశ్లేష కులు శివ ముద్గిల్ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో పాల సేకరణ ధరలు కూడా పడి పోయాయి. టన్నుకు 4వేల డాలర్లనుంచి 17600 డాలర్లకు దిగజారాయి. గడచిన 18 నెలల్లో చైనా, న్యూజిలాండ్ దేశాలనుంచి తక్కువ డిమాండ్వల్ల మరింత పడిపోయాయి. ఇక భారీఎత్తున డెయిరీ లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్న వారు తమ ధరల ను తగ్గించి విలువలు జోడించిన ఉత్పత్తులుగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. వెన్న, జున్ను, మజ్జిగ వంటి వాటిపై ఎక్కువ ఆఫర్లు ప్రకటించి నిల్వలను కరిగిస్తున్నాయి. గుజరాత్ డైయిరీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ ఆర్ఎస్ శోధి మాట్లాడుతూ రిటైల్ ధరలు తగ్గించడం తమకు చాలా తక్కువఅని ఇప్ప టికే తాము గుజరాత్లో రైతులకు ఎక్కువధరలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇతరప్రైవేటు రంగ డెయిరీ లు, ఇతర రాష్ట్రాల డైయిరీలకంటే కూడా గుజరాత్ డెయిరీ ఎక్కువ ధరలు ఇస్తున్నట్లు తెలిపారు. గుజ రాత్ రైతులు లీటరు ఆవుపాలకు 28-31 రూపా యలు గేదెపాలకు 38-41రూపాయలు పొందుతు న్నారు. అదే మహారాష్ట్రలో అయితే లీటరుకు 18-20రూపాయలు చొప్పున ఆవుపాలు, 30-36 రనూపాయలు గేదెపాలకు ధరలు పొందుతున్నారు. పాలు పాల ఉత్పత్తులధరలు తగ్గే అవకాశాలు తక్కువని, పసుగ్రాసం ధరలు తగ్గితే కొంతమేర రైతులకు ఊరట కలుగుతుందని శోధి వెల్లడిం చారు. పశుగ్రాసం ధరలు గత ఏడాదినుంచి చూస్తే ప్రతి పంటసీజన్లో 20-30శాతంపెరిగాయి. రుతు పవనాల క్షీణత కారణంగా పశుగ్రాసం కొరతను అధిగమించేందుకుకేంద్రం కూడా ఇతర అనుబంధ రంగాల కార్యకలాపాలపై దృష్టిపెట్టాలని, స్థిరమైన వ్యవసాయేతర ఆదాయం వచ్చేందుకు కృషిచేయా లని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రప్రభుత్వాలు కూడా ఇందుకు అనుగుణంగా పశుసంవర్ధకశాఖను పటిష్టంచేసి రైతులకు పాలు పాల ఉత్పత్తులతోపాటు మాంసం, చేపలు గుడ్లు అమ్మకాల ద్వారా కూడా స్థిరమైన ఆదాయం వచ్చేటట్లు కృషిచేయాల్సిన అవ సరం ఎంతో ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయి పరిస్థితులు అలుముకోనప్పటికీ ధరల విషయంలో పలు ప్రైవేటు కంపెనీలు రావడంతో రైతులకు కొంత ఉపశమనంగా ఉంది. భారీ కంపెనీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రవేశించి ఒకరకంగా చెప్పాలంటే మార్కెట్ను శాసిస్తున్నాయనే చెప్పాలి. అందువల్లనేప్రభుత్వపరంగా పాలసేకరణ పరంగా గిట్టుబాటు కాకపోయినా ప్రైవేటు డైయిరీలు కొంత ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
| 1entertainment
|
మహేశ్బాబుకు మరో షాక్
ఏఎంబీ థియేటర్కు నోటీసులు
హైదరాబాద్: సూపర్స్టార్ మహేశ్బాబుకు మరోసారి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన ఏఎంబీ సినిమాస్ థియేటర్లో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త అమల్లోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలు ఏఎంబీ మాల్ అతిక్రమించిందని వార్తలు వెలువడుతున్నాయి. రూ.100 ఆ పైన టికెట్కు గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. జనవరి 1 నుంచి 18 శాతానికి, రూ.100 లోపు టికెట్పై 18 శాతాన్ని కాస్తా 12కు తగ్గించింది.
అయితే ఏఎంబీ మాల్ తగ్గించిన ధరలు అమలు చేయకుండా అక్రమంగా ప్రేక్షకుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాంతో థియేటర్పై కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితమే బ్రాండ్ల నుంచి వస్తున్న పారితోషికాలపై పన్ను ఎగ్గొట్టారంటూ మహేశ్కు నోటీసులు అందాయి. ఆయన బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేశారు. తాజాగా వస్తున్న ఆరోపణలపై మహేశ్ స్పందించాల్సి ఉంది.
Tags :
| 0business
|
Visit Site
Recommended byColombia
ఈ సందర్భంగా.... డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ "రంగం చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోగా నటించిన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. దాంతో తెలుగులో సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నాను. త్వరలోనే తెలుగు టైటిల్ను అనౌన్స్ చేస్తాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళంలో అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. `రంగం` చిత్రాన్ని తమిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా తమిళంలో నిర్మిస్తుండటం విశేషం" అని అన్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
bigg boss telugu 3 controversy: ou students protest at akkineni nagarjuna house
Bigg Boss 3 రచ్చ: నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్తత.. షో వాయిదా పడేనా?
కింగ్ నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి. పోలీసులు, ఓయూ విద్యార్ధులు మధ్య తోపులాట అరెస్ట్లతో రణరంగంగా మారింది. నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడంతో ఈ షోను నిలిపివేయాలంటూ నాగార్జున ఇంటిని ముట్టిడించారు ఓయూ విద్యార్ధులు.
Samayam Telugu | Updated:
Jul 20, 2019, 03:21PM IST
నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రేపటి నుండి స్టార్ మాలో ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ నాగార్జున ఇంటిని ముట్టడించారు ఓయూ విద్యార్థులు. శనివారం నాడు ఉదయం ర్యాలీగా వచ్చిన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న ఇంటిని ముట్టడించారు. అయితే నాగార్జున ఇంటికి ఇప్పటికే పూర్తి భద్రతను ఏర్పాటు చేయడంతో.. పోలీసులకు, విద్యార్ధులకు మధ్య తోపులాట జరిగింది. నాగార్జున ఇంటి లోపలికి చొచ్చుకుని వెళ్లేందుకు విద్యార్ధులు ప్రయత్నించడంతో.. వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు.
కాగా.. బిగ్ బాస్లో తమకు ఆఫర్ ఇస్తామని చెప్పి మోసం చేశారని.. ఆడిషన్స్కి వెళ్లిన తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని.. సెక్స్ లేకుండా బిగ్ బాస్ హౌస్లో 100 రోజులు ఉంటారా? కమిట్మెంట్ ఇస్తారా అని తమతో అనుచితంగా వ్యవహరించారంటూ యాంకర్ శ్వేతా రెడ్డి, సినీ నటి గాయత్రి గుప్తా.. గత కొన్నిరోజులగా నిరసన తెలియజేస్తున్నారు.
| 0business
|
SHIP1
పాతనౌకల ఉక్కుపై 2.5% సుంకం రద్దుకు కేంద్రం నో!
న్యూఢిల్లీ,: కేంద్ర ప్రభుత్వం పాడైయిన షిప్పింగ్ యూనిట్ల దిగుమతులకు సంబంధించి సుంకం ఎత్తి వేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. సుంకం తొలగించడం వల్ల దేశీయంగా ఇనుము ఉక్కు ఉత్పత్తిదారులకు భారం పడుతుందని కేంద్రం భావిస్తోంది. గుజరాత్ప్రభుత్వం చేసిన ప్రతిపాదన షిప్ రీసైక్లింగ్కు దారితీస్తుందని, 2.5శాతం బేసిక్ కస్టమ్స్సుంకం రద్దుకు చేసిన ప్రతిపాదన వీలుపడదని కేంద్రం వెల్లడించింది. దీనివల్ల ఇనుము ఉక్కు ఉత్పత్తిదారులకు నష్టం వస్తుందని, దేశీయ మార్కెట్లలో డిమాండ్ పడిపోతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలప్రకారం 2.5 బేసిక్ కస్టమ్స్సుంకాన్ని ఖాయిలాపడిన నౌకలకు ఇతర నిర్మా ణాలకు వర్తిస్తుంది. ఈ సుంకాన్ని రద్దుచేస్తే భారత్లోని షిప్బ్రేకింగ్ పరిశ్రమ చైనా, పాకిస్థాన్తో పోటీపడుతుందని, ఈ దేశాల్లో ఎలాంటి దిగుమతి సుంకాన్ని విధించడంలేదని వెల్లడించారు.
ఈ నౌకాతుక్కును కరిగించి ఇనుము స్టీల్ ఉత్ప త్తులకు వినియోగించడం వల్ల దేశీయ అసలు ఉత్పత్తులు దెబ్బ తింటాయని కేంద్రం భావిస్తోంది. షిప్ రీసైక్లింగ్పరంగా భారత్ కు అంతర్జాతీయంగా 35శాతం వాటాతో ఉంది. టన్నుల గుణి జాల్లో పాత షిప్లను దిగుమతిచేసుకుని స్క్రాప్కిందకు మారు స్తుంది. భారత్లో గుజరాత్ ఈ విభాగంలో మార్కెట్ లీడర్గా ఉంది. 90శాతం నౌకల రీసైక్లింగ్ అలాంగ్ సోసియా షిప్ రీసైక్లింగ్ యార్డులోనే కొనసాగుతున్నట్లు తేలింది. గుజరాత్ మారిటైమ్ బోర్డు 1982లో ఈ యార్డును వృద్ధిచేసింది. ప్రత్య క్షంగాను, పరోక్షంగాను 1.5 లక్షలమందికి ఉపాధిని కల్పిస్తున్నది. ఏడువేల నౌకలను రీసైకిల్ చేయడం ద్వారా సుమారు 54 మిలియన్ల ఉక్కును సేకరిస్తుందని గుజరాత్ప్రభుత్వం ప్రకటించింది. షిప్ రీసైక్లింగ్ విభాగం దేశీయంగా ఉన్న ఉక్కు డిమాండ్లో రెండుశాతం పరిష్కరిస్తుందని, సహజవనరులను పొదుపుచేయడం ద్వారా విదేశీ కరెన్సీ అవసరాలను కూడా పరిష్కరిస్తుందని అంచనా.అంతేకాకుండా ముడి ఇనుము ఉక్కు దిగుమతులను కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుందని అంచనా. కేంద్రం ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఉక్కు మంత్రిత్వశాఖ నుంచి పదేపదే వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోనికి తీసుకుని ఇనుము ఉక్కు ప్లేట్లు, హాట్రోల్డ్ కాయిల్స్, కోల్రోల్డ్ కాయిల్స్పై సుంకాన్ని ఐదు శాతంనుంచి 12.5 శాతానికి పెంచింది. 2016లోనే గుజరాత్ప్రభుత్వం షిప్ రీసైక్లింగ్ విధానాన్ని ప్రకటిం చింది.
ఈ రంగంలో పెట్టుబడులకు మరింత ఊతం ఇచ్చేందుకువీలుగా పర్యావరణ సహిత పారిశ్రామికకార్యకలాపాలకు అలాంగ్ సోసియాను కేంద్రంగా చేసింది. 2011-15మధ్యకాలంలో 50శాతం షిప్లను చెత్తరూపంలోకి మార్చి ఇనుము, ఉక్కునువేరుచేసింది. రూపాయిమారకం విలువలు తగ్గడం, అమెరికా డాలర్తో రూపాయి మరింత అనిశ్చితి పరిస్థితులు ఎదురు కావడంతో షిప్ బ్రేకింగ్ యజమానులు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. వివిధ దేశాల నుంచి పాత నౌకలను దిగుమతి చేసు కుని వాటిని ఇక్కడియార్డుల్లో విడిభాగాలను వేరుచేస్తారు. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి గట్టిపోటీ ఎదురుకావడం, దేశీయంగా పాత ఇనుము ఉక్కుల ధరలు నత్తనడకన పెరగడం వంటివాటితో లాభదాయకతపై దృష్టిపెట్టిన యాజమాన్యాలు ఇటీవల కొంతమేర కార్యకలాపాలు తగ్గించా యి. అందువల్లనే ఈ సుంకం తగ్గిస్తే ఈరంగం మరింత వృద్ధిచెందగలదన్న గుజరాత్ ప్రభుత్వవిజ్ఞప్తి దేశీయ ఉక్కుపరిశ్రమను దెబ్బతీస్తుందన్న వాదనతో కేంద్రం తిరస్కరించింది.
| 1entertainment
|
Vaani Pushpa 107 Views advanced pay , INCOME TAX
incometax
న్యూఢిల్లీ: పన్నుల రంగంలో ఈ ఏడాది రెవెన్యూ వసూళ్లపరంగా భారీ లక్ష్యాలు విధించిన నేపథ్యంలో అడ్వాన్సు పన్ను వసూళ్లు కూడా కొంత మందగమనంతోనే ఉన్నాయి. దీన్నిబటిచూస్తే దేశంలో ఆర్ధిక మందగమనం మొత్తంగా చూస్తే పన్నులరాబడి కార్పొరేట్, వ్యక్తిగత పన్నుల రాబడులూరు శాతం మాత్రమే ఉంది. ఏప్రిల్నుంచి సెప్టెంబరు మధ్యస్తం వరకూ ఈ వృద్ధి తక్కువగానే ఉంది. అదే గత ఏడాది ఇదేకాలంలో 18శాతం నమోదయింది. ప్రత్యక్షపన్నులవసూళ్లు ఈ ఏడాది ఇప్పటివరకూ కేవలం ఐదుశాతం మాత్రమే ఉంది. కనీసం 27శాతంగా ఉంటే తప్ప రాబడుల్లో లక్ష్యాలను చేరుకోలేమని స్పష్టం అవుతున్నది. పూర్తిస్థాయి లక్ష్యం 13.35 లక్షలకోట్లలో ఇప్పటివరకూ 5.5లక్షలకోట్లు మాత్రమే స్థూల రాబడి ఉంది. రెండో విడత అడ్వాన్సు పన్ను వసూళ్లు 2.2 లక్షలకోట్లుగా మాత్రమే ఉంది. అడ్వాన్స్ పన్ను రాబడుల్లోకార్పొరేషన్పన్ను 6.5శాతం పెరిగింది. వ్యక్తిగత ఆదాయపన్నులో 3.5శాతం పెరిగింది. రాబడుల పరిస్థితినిచూస్తే ఆర్ధికవ్యవస్థ నమ్మెదిగా మాత్రమే కొనసాగుతోంది. కీలక పరిశ్రమలపై ప్రభావం ఎక్కువ ఉంది. ఇదేపరిస్థితి కొనసాగితే పన్నుల లక్ష్యం ఎంతమాత్రం సాధించలేమని అధికారులు చెపుతున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/
| 1entertainment
|
ASWIN
ఇంగ్లండ్పై విజయం వీరి వల్లే
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా బోణీ చేసింది.కాగా విశాఖ వేదికగా ముగిసిన రెండవ టెస్టులో 246 పరుగులతో ఇంగ్లండ్పై భారీ విజయం సాధించింది.ఈ విజయంతో అయిదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో భారత్ ముందంజలో ఉంది.కాగా రాజ్కోట్లో జరిగిన తొలి టెస్టును టీమిండియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే.అయితే విశాఖ వేదికగా జరిగిన రెండవ టెస్టులో భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు.ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీసి భారత్కు విజయాన్ని అందించారు.కాగా ముఖ్యంగా రెండవ టెస్టులో టీమిండియా సమిష్టి ప్రదర్శన కనబరిచింది. చివరి రోజు 2 వికెట్లకు 87 పరుగులు ఓవర్నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన ఇంగ్లండ్కు చెందిన జో రూట్ 25 పరుగులు, బెయిర్స్టో 34 పరుగులతో నాటౌట్ మాత్రమే కొద్ది సేపు పోరాడారు. ప్రత్యర్థి జట్టులో మొత్తం ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితమైన సంగతి తెలిసిందే. కాగా భారత్ నిర్దేశించిన 405 పరుగులు టార్గెట్ చేధనలో మ్యాచ్కు చివరి రోజు ఆట కొనసా గించిన ఇంగ్లండ్ 97.3 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లలో అశ్విన్,జయంత్ యాదవ్లు ఒక్కొక్కరు మూడు వికెట్లు తీసుకున్నారు.కాగా జెడేజా, షమీ ఒక్కొక్కరు రెండు వికెట్లు తీసుకున్నారు.
వీరి వల్లే విజయం కెప్టెన్ కోహ్లీకి ఇది 50వ టెస్టు.కాగా ఈ టెస్టులో కోహ్లీ తన కెరీర్లో 14వ సెంచరీని నమోదు చేశాడు.రెండవ టెస్టులో కోహ్లీ మొత్తంగా 248 పరుగులు చేశాడు.తొలి ఇన్నింగ్స్లో 167 పరుగులు,రెండవ ఇన్నింగ్స్లో 81 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.విశాఖ టెస్టులో కోహ్లీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ సాధించాడు.కాగా తన సత్తా వల్ల మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
జట్టులో నంబర్ వన్గా బౌలర్గా కొనసాగుతున్న అశ్విన్ రెండవ టెస్టులో అరుదైన రికార్డు నమోదు చేశాడు.కాగా రాజ్కోట్ టెస్టులో కొంత ఒత్తిడి ఎదుర్కొన అశ్విన్ రెండవ టెస్టులో మాత్రం చెలరేగిపోయాడు.రెండవ టెస్టులో మొత్తం 8 వికెట్లు తీసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ 5 వికెట్లు తీసుకోవడంతో టెస్టు దిగ్గజాల సరసన చేరాడు.ఒకే ఇన్నింగ్స్లో 22 సార్లు 5 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన టెస్టు దిగ్గజాలు వకార్ యూనిస్(పాకిస్థాన్) ,మాల్కోమ్ మార్షల్,ఆంబ్రోస్,కోర్ట్నీ వాల్స్ వీరు వెస్టిండీస్కు చెందిన వారు.వీరిసన అశ్విన్ చేరినట్లైంది.ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో పుజారా మంచి ఫామ్లో ఉన్నాడు.కాగా రెండవ టెస్టులో 119 పరుగులు సాధించిన పుజారా తన కెరీర్లో పదవ టెస్టు సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు.రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ,పుజారా ఇద్దరు మూడవ వికెట్కు 200 పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
విశాఖ టెస్టులో పుజారా సాధించిన సెంచరీ ఇంగ్లండ్పై అయిదవ సెంచరీ కావడం విశేషం.కాగా హర్యానాకు చెందిన ఈ ఆఫ్ స్పిన్నర్ అరంగేట్రం టెస్టులోనే మంచి ప్రదర్శన కనబరిచాడు.కాగా 26 సంవత్సరాల జయంత్ యాదవ్ విశాఖ టెస్టులో 4 వికెట్లు తీసుకున్నాడు.ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్లో 35 పరుగులు,రెండవ ఇన్నింగ్స్లో 27 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కాగా భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో జయంత్ యాదవ్కు స్థానం కల్పించారు.విశాఖ స్టేడియంలోనే జయంత్ తన తొలి వన్డే మ్యాచ్ని ఆడటం విశేషం.కాగా తన తొలి టెస్టులోనే మంచి ప్రదర్శన కనబర్చడంతో కెప్టెన్ కోహ్లీతో పాటు కామెంటేటర్ల ప్రశంసలు కూడా అందుకున్నాడు.జడేజా అత్యధిక వికెట్లు తీసుకోకపోయినా ఇంగ్లండ్పై బారత్ 264 పరుగుల విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.కాగా రెండవ టెస్టులో 63 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసుకున్నాడు.
| 2sports
|
Suresh 129 Views anul kumble , Committee about Boundaries Rule
Committee about Boundaries Rule
దుబా§్ు: వన్డే ప్రపంచకప్లో భాగంగా ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ను విశ్వవిజేతగా ప్రకటించడంతో ఐసిసిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ ఓవర్లో పరుగులు కూడా సమం అయిన పక్షంలో బౌండరీల లెక్కింపుతో గెలుపును నిర్ణయించడం సరికాదని పలువురు క్రికెట్ విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై ఎట్టకేలకు ఐసిసి దిగివచ్చింది. ఈ రూల్ ఎంతవరకు సమంజసం అనే దానిపై సమీక్ష సమావేశం నిర్వహించనుంది. దీనిలో భాగంగా బౌండరీలు లెక్కించే నిబంధనపై సమీక్షించేందుకు భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఐసిసి నిర్వహించే తదుపరి సమావేశంలో ఈ నిబంధనపై చర్చించనున్నారు. సమావేశం వచ్చే ఏడాది త్రైమాసికంలో జరుగుతుందని ఐసిసి జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డెస్ తెలిపారు. మ్యాచ్ టైగా ముగిస్తే సూపర్ ఓవర్తో విజేతను నిర్ణయించే పద్ధతిని 2009 నుంచి పాటిస్తున్నారు. సూపర్ ఓవర్లో కూడా పరుగులు సమం అయితే బౌండరీల లెక్కతో గెలుపును ప్రకటిస్తారు. ప్రపంచకప్ ఫైనల్లోనూ అదే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న టీ20లీగుల్లోనూ దాదాపుగా ఇదే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే తరహాలో సూపర్ ఓవర్ నిబంధనలు ఉండాలి. దీనిపై ప్రత్యామ్నాయాలు ఉంటే అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ పరిశీలిస్తుందని జియోఫ్ పేర్కొన్నారు. మరి బౌండరీ రూల్ మారుతుందో…లేదో చూడాలి.
| 2sports
|
hevllets
వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లోకి ‘హావెల్స్
హైదరాబాద్,: విద్యుత్ ఉత్పత్తులతో దేశంలోనే అగ్రగామిగా ఉన్న హావెల్స్ సంస్థ తాజాగా వ్యక్తిగత సంరక్షణ విభాగంలోకి ప్రవేశించింది. విద్యుత్ షేవర్లు, గెడ్డం ట్రిమ్మర్లు, గ్రూమింగ్ కిట్లు వంటి వాటిని ఉత్పత్తిచేస్తోంది. ముక్కు, చెవులవద్ద ట్రిమ్మర్లు, శిరోజాలు పటిష్టంచేసుకునే డ్రయర్లు, బికిని ట్రిమ్మర్లు వంటి వాటిని కూడా ప్రవేశపెట్టింది. వీటిధరలు రూ.1000 నుంచి రూ.7200 వరకూ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ సిఎండి అనిల్రా§్ుగుప్తా మాట్లాడుతూ విద్యుత్రంగంలో మార్కెట్ లీడర్గా వ్యవహరించిన తాముకొత్త మార్కెట్లోకూడా గణనీయమైన వాటాను సాధిస్తా మన్నారు. భారత్లో 25ఏళ్లలోపుఉన్న జనాభా 50శాతానికిపైగాఉందని, 35ఏళ్లలోపు వారు 65 శాతం మంది ఉన్నట్లు ఆయన అన్నారు. 2020 నాటికి భారతీయుల సగటు వయసు 29గా ఉం టుందని, చైనాలో అయితే 37, జపాన్లో అయి తే 48ఏళ్లుగా ఉంటుందని అన్నారు. ఎక్కువగా యువతను దృష్టిలోఉంచుకునే వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్కు వచ్చామన్నారు. ప్రస్తుతం ఈమార్కెట్ రూ.1500 కోట్లుగా ఉందని, వార్షిక పద్ధతిలో 25-30శాతం వృద్ధి చెందుతున్నట్లు అనిల్రా§్ుగుప్తా వెల్లడించారు. ప్రాథమికంగా అన్ని ప్రధాననగరాల్లో 400 అధీకృత షోరూంలు హావెల్స్ గెలాక్సీస్లో ఏర్పాటు చేసామని, మార్చినాటికి అన్ని ప్రధాననగరాలకు అందుబాటులోకి తెస్తా మన్నారు. ఆన్లైన్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్పై కూడా అందుబాటులో ఉంటాయని గుప్తా వెల్లడించారు. భారత్లో వ్యక్తిగత సంరక్షణఉత్పత్తుల విభాగం భారీవృద్ధితో నడుస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ గోయల్ వెల్లడించారు. విస్తృత శ్రేణి నాణ్యతాపరమైన ఉత్పత్తుల కారణంగా హావెల్స్ మరింత ముందుకు పోతుందన్న దీమా వ్యక్తంచేసారు. హావెల్స్ కొత్త విభాగంవచ్చే మూడేళ్లలో 25శాతం మార్కెట్ వాటా సాధిస్తుందని అన్నారు. తొలతిసారిగా బేబి హెయిర్ క్లిప్పర్ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బేబీకేర్ ఉత్పత్తుల్లోకి కూడా వచ్చే ఏడాది ప్రవేశిస్తామని ఆయన ప్రకటించారు.
| 1entertainment
|
RBI
ఫెడ్రిజర్వు వడ్డీరేట్లు పెంచినా భారత్పై భరోసా
ముంబయి, జూలై29: ఫెడ్రిజర్వు బాండ్ల కొనుగోల్లు నిలిపివేస్తుందన్న వార్తలతో 2013లో మార్కెట్లను కుదిపివేసిన కాలంలో భారత్ కూడా భారీగా నష్టపోయిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఆసమయంలోనే వడ్డీ రేట్లను పెంచి దిగజారుతున్న మార్కెట్లను పరిరక్షించింది. అదేతరహా లో చరిత్ర పునరావృతం అవుతున్నదని అంచనా. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లనుపెంచుతోంది. అలాగే వచ్చేవారంలో భారత్ కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందని ఆసియాలోనే మొదటిదేశంగా నిలుస్తుందని అంచనా. అమెరికా రాష్ట్రాలపరంగాచూస్తే పాలసీ రేట్ ప్రీమియంతో ఉన్నప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం భారత్వైపే చూస్తున్నారు.కరెన్సీ రేట్లపరంగా రూపాయి ర్యాలీతీస్తోంది. దేశంలో జారీ అవుతున్న బాండ్లకు మంచి గిరాకీ లభిస్తోంది.
ఆసియాలో మంచి రిటర్నులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలికంగా చూస్తేఆర్ధిక వ్యవస్థలో ద్రవ్యో ల్బణం గడచిన ఐదేళ్లకాలంలో అత్యంత కనిష్టస్థాయికి చేరింది. ఆర్థికవృద్ధి క్రమేపీ పెరుగుతున్నదని, కరెంటుఖాతాలోటు కూడా అను కున్నస్థాయికి చేరుతున్నదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. జిఎస్టి అమలుతో దేశంలోనే అతిపెద్ద ఆర్థికరంగ సంస్కరణలకు తావిచ్చినట్లయింది. లండన్ కేంద్రంగా ఉన్న ఓషన్ గయల్ అసెట్ మేనేజ్మెంట్ సంస్త నివేదికప్రకారంచూస్తే భారత్లోని నిర్మాణాత్మక సంస్కరణలు పటిష్టంగా ఉన్నాయని విశ్లేషించారు.
భారత్ ఇతర వర్ధమాన మార్కెట్లు వచ్చే 12నెలల్లో మరింత వృద్ధిని సాధిస్తాయని అంచనా. విదేశీ పెట్టుబడులతో కూడా భారత్ కొంత మూలధన నియంత్రణ చేపట్టింది. డెట్రంగంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ కోటాను ఎప్పుడో అధిగమించారు. 21 బిలియన్ డాలర్లు డెట్రంగంలో పెట్టు బడులుపెట్టారు. జనవరి, జూన్ కాలంలో గరిష్టంగా వచ్చాయి. గత ఏడాది ఆరుబిలియన్ డాలర్లవరకూ అమ్మకాలు సాగితే ఈ ఏడాది కార్పొరేట్ బాండ్ కోటా వృద్ధితో ఉంది. షేర్లలో 8.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.
గతరెండేళ్లలో పెట్టిన 6.3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక స్థాయిలో చూస్తే భారత్ రూపాయి ఆసియా కరెన్సీల్లో మరింత ఎక్కువగా ఉంది. మలేసియా రింగిట్తో పోలిస్తే రెట్టింపు మారకం విలువలతో ఉంది. ఆగస్టు 2వ తేదీ ఆర్బిఐ సమావేశంలో వడ్డీరేట్ల కోత ఉండవచ్చని ఆష్మర్ కేపిటల్ ఆర్ధికవేత్త జాన్ డెన్ అంచనావేసారు. 25బేసిస్ పాయింట్లు తగ్గించి ఆరు శాతా నికి తెస్తుందన్న అంచనాతోఉంది. ఆసియాలోనేమొట్టమొదటి బ్యాంకు గా ఆర్బిఐ తన మొదటి రేట్ కట్ను అక్టోబరులో ప్రకటించింది. న్యూజిలాండ్కు చెందిన రిజర్వుబ్యాంకు గత ఏడాది డిసెంబరులో వడ్డీరేట్లను కుదించింది.
దీర్ఘకాలిక సులువైన విధానాలతో నేక ఇతర కేంద్ర బ్యాంకులు కూడా ఇదేపంథాలో వెళుతున్నాయి. 2008 ఆర్థిక మాంద్యం దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాతికదికన వడ్డీరేట్ల పెంపు, లేదా తగ్గింపును సిఫారసు చేస్తున్నాయి. అమెరికా వడ్డీరేట్లు పెంచి తే యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు తన బాండ్ల కొనుగోళ్లను సడలి స్తుందని ఒక అంచనా. 2013లోనే భారత్ అచేతన ఐదుదేశాల్లో ఒకటిగా నిలిచింది. 75 బేసిస్ పాయింట్ల వడ్డీరేట్లను పెంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణను కట్టడిచేసింది.
ఇదేబాటలో ఇండోనేసి యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు కూడా రక్షణాత్మక వ్యూహాలు అనుస రించి ఆనాడు కట్టడిచేసుకోగలిగాయి. రిటైల్ద్రవ్యోల్బణం భారత్లో 1.54శాతానికి చేరింది. పదేళ్ల బాండ్ల వడ్డీరేటు 4.9శాతంగా నిలిచింది. ఆసియాలోనే గరిష్టంగా ఉంది. భారత్ రూపాయి కూడా డాలరుతో పోలిస్తే 5.6శాతం పెరిగింది. కరెంటుఖాతా లోటు కూడా జిడిపిలో 0.6శాతానికి దిగివచ్చింది. 2013లో 4.8శాతం గా ఉన్న లోటు భారీగా తగ్గింది. విదేశీ కరెన్సీ రిజర్వులు కూడా 389.1బిలియన్ డాలర్లకు జులైలో నమోదయ్యాయి.
ఆర్ధికవృద్ధి కూడా 7.3శాతంగా ఉంటుందని రాయిటర్స్ వార్తాసంస్థ అంచనాలు వేసింది. ఇందుకోసమేఆర్బిఐ, అమెరికా వడ్డీరేట్లపెంపు తగ్గింపు ఆధా రంగా మరింత వృద్ధి నమోదవుతుందని అంతర్జాతీయ ఆర్థికవేత్తలు వేస్తున్నఅంచనాలు సమీపభవిష్యత్తు స్థితగతులను తేటతెల్లంచేస్తాయి.
| 1entertainment
|
Vaani Pushpa 95 Views Hima Das , wolrd champinshiop
Himadas
న్యూఢల్లీ: హిమదాస్కు పరిచయవాక్యాలు అవసరం లేదు. నెలవ్యవధిలోనే ఐదు అంతర్జాతీయ స్వర్ణాలు సాధించి, అందరి ప్రశంసలు పొందుతున్నది. ఈ సమయంలో ప్రపంచ అథెటిక్స్ ఛాంపియన్షిప్లో హిమదాస్ చోటు సంపాదించింది. ఆమెతోపాటు ప్రపంచ ఛాంపియన్షిప్లో పాల్గొనే 25 మంది క్రీడాకారుల జాబితాను భారత అథ్లెటిక్స్ సమాఖ్య ప్రకటించింది. 400 మీటర్ల రేసు విభాగంలో హిమదాస్ అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈనెల 27 నుంచి అక్టోబరు 6 వరకు దోహాలో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరగనుంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/sports/
| 2sports
|
Hyderabad, First Published 21, Aug 2019, 7:23 PM IST
Highlights
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత షట్లర్ ప్రణయ్ అదరగొట్టాడు. 11వ సీడ్ చైనా షట్లన్ లిన్ డాన్ తో అద్భుతంగా పోరాడి విజయాన్ని అందుకున్నాడు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత షట్లర్ ప్రణయ్ అద్భుత విజయాన్ని సాధించాడు. చైనాకు చెందిన సీనియర్ షట్లర్, ఒలింపిక్ విజేత లిన్ డాన్ పై అతడు సంచలన విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో భాగంగా డాన్ తో తలపడ్డ ప్రణయ్ 21-11, 13-21,21-7 పాయింట్ల తేడాతో గెలుపొందాడు.
ఇప్పటివరకు వీరద్దరు తలపడ్డ మ్యాచుల్లో ప్రణయ్ విజయాలే ఎక్కువగా వుండటం విశేషం. ఈ మ్యాచ్ తో కలిపి వీరిద్దరు ఐదుసార్లు తలపడగా ప్రణయ్ అత్యధికంగా మూడుసార్లు విజేతగా నిలిచాడు. ఇలా 11వ సీడ్ డాన్ పై అన్ సీడెడ్ ప్రణయ్ అద్భుత విజయాలను అందుకుంటూ ప్రతిసారీ పైచేయి సాధిస్తూ భారత బ్యాడ్మింటన్ ప్రియులను అలరిస్తున్నాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే 62 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మొదటి సెట్లో 21-11తో అదరగొట్టిన ప్రణయ్ రెండోరౌండ్లో వెసుకబడ్డాడు. అనూహ్యంగా డాన్ పుంజుకుని ప్రణయ్ పై పైచేయి సాధించాడు. ఇలా ఆ రౌండ్ లో 13-21 తేడాతో ప్రణయ్ వెనుకబడ్డాడు. దీంతో నిర్ణయాత్మక చివరి రౌండ్లో మళ్లీ సత్తాచాటిన ప్రణయ్ ఏకంగా 21-7 తేడాతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించాడు. ఇలా ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ లిన్ డాన్ ను మట్టికరిపించి ప్రణయ్ ప్రీ క్వార్టర్స్ కు అర్హత సాధించాడు.
ఈ సందర్భంగా ప్రణయ్ మీడియాతో మాట్లాడుతూ... బలమైన ప్రత్యర్థి లిన్ డాన్ ఓడించడానికి పక్కా వ్యూహాలతో బరిలోకి దిగినట్లు తెలిపాడు. అవన్నీ సరైన సమయంలో అమలుచేయడంతో ఈ విజయం సాధ్యమయ్యింది. తనదైన రోజున ఎంతటి గొప్ప ఆటగాన్నయినా ఓడించే సత్తా వుందని ప్రణయ్ పేర్కొన్నాడు.
| 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.