news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
ఎన్టీఆర్: బిగ్ బాస్ లో నాని చెప్పేవి కాకమ్మ కథలు..
Highlights
నాని కూడా తనదైన స్టైల్ లో మెప్పిస్తున్నాడు. ప్రతివారం నాని చెప్పే కాకమ్మ కథలు బాగుంటున్నాయి. అవి ఆడియన్స్ కు మంచి మసాలా
రియాలిటీ షోలలో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది బిగ్ బాస్. తెలుగులో ఈ షో సీజన్ 2కి మొదట్లో నెగెటివ్ కామెంట్స్ వినిపించినా ఇప్పుడు మాత్రం పుంజుకుంది. హోస్ట్ గా నాని తన బాధ్యతలు నిజాయితీగా నిర్వర్తిస్తున్నాడు. మొదట్లో ఎన్టీఆర్ యాంకరింగ్ తో నానిని పోల్చి తక్కువ చేసిన వాళ్లు కూడా ఇప్పుడు నానిని మెచ్చుకుంటున్నారు. మిగతా వారి అభిప్రాయలు సంగతి పక్కన పెడితే మరి నాని పెర్ఫార్మన్స్ మీద ఎన్టీఆర్ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో కలిగింది.
రీసెంట్ గా ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించాడు. వ్యాఖ్యాతగా నానిని కొనియాడారు. ''నాని మంచి నటుడు.. బిగ్ బాస్ షో లో అతడు చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నాడు.బిగ్ బాస్ అనేది ఒక సక్సెస్ ఫుల్ ఫ్లాట్ ఫామ్. నిజానికి ఇందులో ఎవరు చేసినా బాగానే చేస్తారు. నాని కూడా తనదైన స్టైల్ లో మెప్పిస్తున్నాడు. ప్రతివారం నాని చెప్పే కాకమ్మ కథలు బాగుంటున్నాయి. అవి ఆడియన్స్ కు మంచి మసాలా'' అని వెల్లడించారు.
అలానే ఎన్టీఆర్ సినిమాలో మీరు నటిస్తున్నారా..? అనే ప్రశ్నకు సమాధానంగా ఇంతకముందే ఈ ప్రశ్నకు జవాబిచ్చానని.. మళ్లీ మళ్లీ అడిగినా తన ఆన్సర్ మాత్రం ఒక్కటేనని అన్నారు.
Last Updated 14, Jul 2018, 4:30 PM IST
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కోహ్లి గాయాన్ని వెక్కిరించిన ఆసీస్ క్రికెటర్
విరాట్పై గుర్రగా ఉన్న ఆసీస్.. అవకాశం చిక్కినప్పుడల్లా భారత్ని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. రాంచీలో మూడో రోజు
TNN | Updated:
Mar 19, 2017, 12:53AM IST
రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలిరోజే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి గాయపడిన విషయం తెలిసిందే. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో కోహ్లి భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో రెండో రోజు మైదానంలో అడుగుపెట్టని కోహ్లి.. మూడో రోజైన శనివారం బ్యాటింగ్‌కి వచ్చి 6 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. కోహ్లి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా.. కమిన్స్ బౌలింగ్‌లో పుజారా మిడ్ వికెట్‌ దిశగా షాట్ ఆడాడు. అయితే ఆసీస్ ఫీల్డర్ మాక్స్‌వెల్ పరుగెత్తుకెళ్లి బంతిని బౌండరీ దాటకుండా ఆపేసి.. వేగాన్ని నియంత్రించుకోలేక బౌండరీ లైన్ అవల పడిపోయాడు. సరిగ్గా ఇలానే కోహ్లి కూడా తొలిరోజు బౌండరీ లైన్ వద్ద పడిపోయి ఉండటంతో దాన్ని గుర్తుచేస్తూ మాక్స్‌వెల్ కూడా తన భుజానికి గాయమైనట్లు కాసేపు నటించాడు. క్రీజులో నిల్చొని ఈ సన్నివేశాన్ని చూసిన కోహ్లి కాసేపు నొచ్చుకున్నాడు.
బెంగళూరులో ఇటీవల ముగిసిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ‘డీఆర్ఎస్‌’ సాయం కోసం పెవిలియన్ వైపు చూడటంతో కోహ్లి అతనిపై మీడియా సమావేశంలో మండిపడ్డాడు. దీంతో విరాట్‌పై గుర్రగా ఉన్న ఆసీస్.. అవకాశం చిక్కినప్పుడల్లా భారత్‌ని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. రాంచీలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. క్రీజులో పుజారా (130), సాహా (18) ఉన్నారు. భారత్ ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 451 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
టాటా సన్స్ కొత్త ఛైర్మన్గా రామదొరై?
సైరస్ మిస్త్రీ స్థానంలో టాటా సన్స్ చైర్మన్గా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ ఎస్ రామదొరైను నియమిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
TNN | Updated:
Nov 1, 2016, 07:37PM IST
టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ స్థానంలో ఎస్ రామదొరైను నియమిస్తారనే పుకార్లు ఊపందుకున్నాయి. దీనికి అనుగుణంగానే నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రామదొరై తన పదవికి రాజీనామా చేశారు. అయితే రామదొరై‌కు టాటా సన్స్ చైర్మన్‌ పదవిని కట్టబెడతారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో దొరై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. ఆనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సెప్టెంబరులో రామదొరై లేఖలో పేర్కొన్నారు. దొరై రాజీనామాను ప్రధాన మంత్రి కార్యాలయం అమోదించింది. ఆయన స్థానంలో ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ నందన్‌ను తాత్కాలిక చైర్మన్‌గా నియమించారు.
ఎన్‌ఎస్డీసీ బోర్డు రేపు ఉదయం సమావేశమై తదుపరి చైర్మన్ ఎంపికపై చర్చించునుందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. 2011 ఫిబ్రవరిలో నేషనల్ కౌన్సిల్ ఆన్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో ప్రధాన మంత్రి సలహాదారునిగా రామదొరైను నియమించారు. 2013 జూన్‌లో ఎన్ఎస్డీసీలో కౌన్సిల్‌ను విలీనం చేసి ఆయనకు చైర్మన్‌ బాధ్యతలు అప్పగించారు. టాటా సంస్థలో రామదొరై సుమారు 42 ఏళ్లు పాటు పనిచేశారు. 1996లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటికి 155 మిలియన్ డాలర్లుగా ఉన్న టాటా గ్రూప్ ఆదాయాన్ని మరింత వృద్ధి చేశారు. 2009 అక్టోబరులో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకునే నాటికి టీసీ‌ఎస్‌ను 6 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వైస్-చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2014 మార్చి 31 నాటికి టీఎస్‌ఎస్ ఆదాయం 13.4 బిలియన్ డాలర్ల సంపదను కూడగట్టుకుంది. రామదొరై గతంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎయిర్ ఏషియా చైర్మన్‌గా కూడా వ్యవహరించారు.
vice-chairman S Ramadorai has resigned as the Chairman of National Skill Development Agency (NSDA) in the rank of a Cabinet Minister and also the as the chief of National Skill Development Corporation (NSDC). According to sources Ramadorai had put his papers citing health issues late September to the Prime Minister's office, which was subsequently accepted. This comes at a time when rumor mill is heating up on Ramadorai potentially replacing Cyrus Mistry as Tata Sons Chairman.
| 1entertainment
|
Suresh 91 Views Team India
కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు భారత్, శ్రీలంక మధ్య జరిగే టీ20 మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా ఏర్పడింది. కొలంబో నగరంలో వారంరోజులుగా భారీగా వర్షం కురుస్తోంది. దీని ప్రభావం సాయంత్రం జరగబోయే టీ20 మ్యాచ్పై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రాక్టిస్ సెషన్ కోసం ఇరు జట్ల క్రికెటర్లు స్టేడియానికి వెళ్లారు. భారీ వర్షం పడడంతో మైదానంలోకి వర్షపు నీళ్లు చేరడంతో సిబ్బంది పరదాలతో క్రికెట్ పిచ్ను కప్పేశారు. వర్షం తగ్గుముఖం పడితే మ్యాచ్ మొదలు కానుంది
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వన్డేల్లో కోహ్లి నెం.1.. బుమ్రా నెం.4
శ్రీలంకతో ఆదివారం ముగిసిన ఐదు వన్డేల సిరీస్లో రెండు శతకాలు బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి
TNN | Updated:
Sep 5, 2017, 12:17PM IST
శ్రీలంకతో ఆదివారం ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో రెండు శతకాలు బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వన్డేల్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఐసీసీ సోమవారం ప్రకటించిన వన్డేల ర్యాంకింగ్స్ జాబితాలో 887 పాయింట్లతో కోహ్లి నెం.1 స్థానాన్ని సుస్థిరం చేసుకుని సచిన్ అరుదైన రికార్డుని సమం చేశాడు. 1998లో సచిన్‌ అత్యధికంగా 887 రేటింగ్‌ పాయింట్లు సాధించాడు. అతని తర్వాత మరో భారత బ్యాట్స్‌మెన్ ఇన్ని పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. ఇప్పటికే టీ20ల్లో కూడా కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్‌లో మొత్తం 15 వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 27 స్థానాలు ఎగబాకి కెరీర్‌‌లోనే బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. అతను 687 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితా‌లో భారత క్రికెటర్లు ఎవరూ టాప్-5లో చోటు దక్కించుకోలేకపోయారు.
బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లి తర్వాత.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (861), దక్షిణాఫ్రికా హిట్టర్ ఏబీ డివిలియర్స్ (847), ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (799), పాకిస్థాన్ ఓపెనర్ బాబర్ అజామ్ (786) టాప్-5లో నిలిచారు. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ హేజిల్ వుడ్ (732) అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ తాహిర్ (718), ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (701), జస్‌ప్రీత్ బుమ్రా (687), దక్షిణాఫ్రికా యువ బౌలర్ రబాడ (685) వరుసగా టాప్-5లో ఉన్నారు. జట్టు పరంగా తీసుకుంటే.. భారత్ 117 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. శ్రీలంక 86 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. సెప్టెంబరు చివరి వరకు టాప్-8లో ఉన్న జట్లే 2019 ప్రపంచకప్‌కి నేరుగా అర్హత సాధించనున్నాయి.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Sensex Closing Headlines: మార్కెట్ మెరుపులు.. సూచీల కొత్త రికార్డ్
ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఓఎన్జీసీ, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటొకార్ప్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Samayam Telugu | Updated:
Apr 16, 2019, 04:00PM IST
హైలైట్స్
ఇంట్రాడేలో జీవిత కాల గరిష్టాలకు సూచీలు
తర్వాత మళ్లీ కొంత వెనక్కి
చివరకు సెన్సెక్స్ 370 పాయింట్లు అప్
97 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
ఫైనాన్షియల్, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు
ఇండియన్ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ లాభాలతో దూసుకెళ్లింది. సరికొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేసింది. నిఫ్టీ తొలిసారిగా 11,800 మార్క్ను అధిగమించింది. సెన్సెక్స్ కూడా జీవిత కాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది.
అయితే నిఫ్టీ, సెన్సెక్స్ ఇండెక్స్లు జీవిత కాల గరిష్ట స్థాయిల్లో నిలదొక్కుకోలేకపోయాయి. చివరకు సెన్సెక్స్ 370 పాయింట్లు లాభపడింది. 39,276 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 11,787 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ వంటి షేర్లు ర్యాలీ చేయడంతో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు జీవిత కాల గరిష్టాన్ని తాకాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 39,364 పాయింట్ల ఆల్టైమ్ గరిష్టానికి, నిఫ్టీ 11,811 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని చేరాయి.
కంపెనీల క్యూ4 ఎర్నింగ్స్ అదిరిపోవడం, ఈ ఏడాదిలో వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదవుతుందని ఐఎండీ ప్రకటన, దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతోపాటు సాంకేతిక అంశాలు మద్దతుతో ఇంట్రాడేలో కొనుగోళ్ల జోరు కొనసాగింది. అయితే చివర్లో కొంత అమ్మకాల కారణంగా లాభాలు తగ్గాయి.
నిఫ్టీ 50లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఓఎన్జీసీ, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటొకార్ప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి.
అదేసమయంలో విప్రో, సిప్లా, గెయిల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, జీ ఎంటర్టైన్మెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండియాబుల్స్ హౌసింగ్, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టపోయాయి. విప్రో 2 శాతానికి పైగా పడిపోయింది.
సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఐటీ మినహా మిగతా ఇండెక్స్లన్నీ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.4 శాతం పెరుగుదలతో 30,530 పాయింట్ల వద్ద ముగిసింది. ఫైనాన్షియల్, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు ర్యాలీ చేశాయి.
| 1entertainment
|
ఒక వైపే చూడొద్దు: తన ఆనందంపై ప్రీతి జింటా వివరణ
Highlights
ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమిపై తాను సంతోషం వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, ప్రీతి జింటా వివరణ ఇచ్చారు.
ముంబై: ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమిపై తాను సంతోషం వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, ప్రీతి జింటా వివరణ ఇచ్చారు. పూణేలో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ ఢిల్లీ చేతిలో ఓటమి వార్తను విని సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె మాట్లాడినట్లు చెప్పే వీడియో సోషల్ మీడియాలో సందడి చేసింది.
ముంబై ఇండియన్స్ ఓడిపోతే పంజాబ్ కు ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం వస్తుందని, చెన్నై సూపర్ కింగ్స్ తమ పంజాబ్ జట్టును ఓడించడంపై రాజస్థాన్ రాయల్స్ సంతోషపడే ఉంటుందని, ఎందుకంటే తమ ఓటమి వల్ల రాజస్థాన్ రాయల్స్ కు ప్లై ఆఫ్ బెర్త్ దక్కిందని ఆమె వివరించారు.
ఒకవైపే చూడవద్దని, చివరి వరకు నీ విజయం కోసమే చూడకూడదని, అవతలి జట్టు ఓటమిని కూడా చూడాల్సి ఉంటుందని అన్నారు. ఈ సీజన్ లో తమ జట్టు సరిగా ఆడకపోవడం పట్ల అభిమానులకు, మద్దతుదారులకు ఆమె విచారం వ్యక్తం చేశారు.
ముంబై ఇండియన్స్ ఓటమి తర్వాత చెన్నైపై విజయం సాధిస్తే పంజాబ్ కు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉండేది. అయితే, చెన్నై చేతిలో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో ప్లే ఆఫ్ కు దూరమైంది.
Last Updated 22, May 2018, 8:13 AM IST
| 2sports
|
రజినీకాంత్ భార్యపై కోర్టు ఫైర్!
Highlights
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్' సినిమాను దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్' సినిమాను దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. రజినీకాంత్ కూతురు సౌందర్యా రజినీకాంత్ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం నిర్మాణ సంస్థ 'మీడియా వన్' యాడ్ బ్యూరో నుండి రూ.10 కోట్లను రుణంగా తీసుకుంది.
దీనికి హామీగా మీడియా వన్ డైరెక్టర్ లతా రజినీకాంత్ సంతకం చేశారు. సినిమా విడుదలైన తరువాత వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పిన మీడియా వన్ సంస్థ కొంత మొత్తం మాత్రమే
చెల్లించారని మిగిలిన బకాయిల కోసం ప్రయత్నిస్తున్నా.. వారు స్పందించకపోవడంతో యాడ్ బ్యూరో వారు 2016లో సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. డబ్బు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా.. సినిమా తమిళ హక్కులను ఈరోస్ ఇంటర్నేషనల్ కు రెట్టింపు ధరకు అమ్ముకున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు.
దీంతో కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.6.20 కోట్లను యాడ్ బ్యూరోకి చెల్లించాలని ఆదేశించింది. కానీ ఇప్పటివరకు రజినీకాంత్ కుటుంబం ఈ మొత్తాన్ని చెల్లించలేదు. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు మండిపడింది. బకాయిలు ఎందుకు చెల్లించలేదు.. ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
| 0business
|
ANIL AMBANI
ఆర్ఇన్ఫ్రా ఇన్విట్ఫండ్ ఐపిఒ
న్యూఢిల్లీ, మే 7: అనిల్ అంబానీ గ్రూప్ కీలక కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రా ఇన్విట్ఫండ్ ఐపిఒకోసం మార్కె ట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తుచేసింది. ఈ ఐపిఒ సైజ్ను రూ.3వేల కోట్ల నుంచి 2500 కోట్లకు తగ్గించింది. ఐపిఒ రూ.2500 కోట్లకు మించకుండా యూనిట్లు కేటాయిస్తుంది. అయితే అవసరమైతే 25శాతం మేర అదనపు కొనుగోళ్లకు కూడా అవకాశం ఉంటుంది. ఇన్విట్ నిబంధనలను అనుసరించి అవసరమైతే పరిమితులు పెంచుతామని తన ముసా యిదా దరఖాస్తుల్లో వివరించింది. గడచిన డిసెంబరు లో ఆర్ఇన్ఫ్రా సంస్థ ముసాయిదా పత్రాలను సెబీకి అందించింది. రూ.3వేల కోట్లు ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కింద ఐపిఒ జారీచేస్తామని వివరించింది. ఇన్విట్ స్కీంలు ఎక్కువగా డెట్తరహా పథకాలుగా ఉంటాయి. మార్కెట్లలో ట్రేడింగ్ చేసుకోవచ్చు. అలాగే ప్రాయో జిత సంస్థలు వ్యక్తులకు పెట్టుబడి వాహికలుగా పని చేస్తాయి. వీటిని జాబితా చేయడంవల్ల ప్రమోటర్లు ఆస్తులను కుదువపెట్టి నిధులు సమీకరించుకునే అవ కాశంఉంటుంది. ఆర్ఇన్ఫ్రా ఇన్విట్ఫండ్ నిర్వహిస్తోంది. రిలయన్స్ నిప్పన్లైఫ్ ఎఎంసి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా వ్యవహరిస్తోంది. యాక్సిస్ కేపిటల్, డిఎస్పి మెరిల్ లించ్, యుబిఎస్ సెక్యూరిటీస్, ఎస్బిఐ కేపిటల్ మార్కెట్స్, ఎస్ సెక్యూరిటీస్ వంటివి ఉన్నాయి. ఐఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టు ఇప్పటికే జారీచేసిన ఐపిఒతో రూ.5వేల కోట్లు సమీకరించాలని నిర్ణయిం చిన సంగతి తెలిసిందే. అంచనాలకు మించి ఐఆర్బి ఇన్విట్ ఐపిఒకు దరఖాస్తులు అంటే బిడ్లు అందాయి.
| 1entertainment
|
DHONI
స్లో వికెట్పై మ్యాచ్ ఫినిషర్ జాబ్ సులభం కాదు: ధోనీ
రాంచీ: మ్యాచ్ ఫినిషర్ జాబ్ అనేది అంత సులభ మైనది కాదని టీమిండియా వన్డే,టి20 కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు.కాగా రాంచీలో జరిగిన నాలుగవవన్డేలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 19 పరుగులు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ధోనీ మీడియాతో మాట్లాడుతూ క్రికెట్లో మ్యాచ్ ఫినిషర్గా బాధ్యతలు తీసుకోవడం అత్యంత కఠినమైన పనుల్లో ఒకటిగా ధోనీ పేర్కొ న్నాడు. నాలుగు వన్డేల్లో వికెట్పై బ్యాటింగ్ ఆర్డర్ కిందకు వెళుతున్న కొద్ది బ్యాటింగ్ చేయడం కష్టమని ధోనీ వివరిం చాడు. కాగా ముఖ్యంగా రాంచీ లాంటి స్లో వికెట్పై టార్గెట్ను చేధించేటపుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయని పేర్కొన్నాడు. ఓపెనర్ అజింక్యా రహానే 57 పరుగులతో జట్టును విజయం వైపు నడిపించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు.ఇక రెండవ వికెట్ వచ్చిన కోహ్లీ, రహానే 45 పరుగులతో 79 పరుగులు భాగస్వామ్యాని ఏర్పాటు చేశారు.కాగా మిడిల్ ఆర్డర్లో భారత్ ఆటగాళ్లకు అనుభవం తక్కువ అయిన నేపథ్యంలో భారత్ ఓటమి పాలైందా? అన్న ప్రశ్నకుగాను రాంచీ లాంటి వికెట్పై అనుభవం తక్కువగా ఉన్న మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లకు టార్గెట్ను చేధించడం కష్టతరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా అయిదు,ఆరు స్థానాల్లో ఆడుతున్న కుర్రాళ్లు కొత్తవాళ్లని వెల్లడించాడు. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వారి సహజసిద్దమైన ఆటకు ఎపుడూ నిబంధనలు విధించకూడదు, నెమ్మెదిగా ఎలా ఆడాలో వాళ్లే నేర్చుకుంటారు.భారీ షాట్లు ఆడవద్దని వారికి చెప్పకూడదు.వారి పరిధిలో బంతి పడగానే షాట్లు ఆడుతున్నారు. ఒకవేళ వారు తప్పులు చేస్తే అనుభవ పూర్వకంగా నేర్చుకుంటారని ధోనీ వివరించాడు.కాగా 15 నుంచి 20 మ్యాచ్లు ఆడిన తరవాత వారికి ఆటపై ఒక అవగాహన వస్తుందని,ఆ తరువాత వారికి ఏది మంచిదని అనిపిస్తే అదే చేస్తారని ధోనీ పేర్కొన్నాడు.ఈ మేరకు ఆ ఆటగాళ్ల ప్రదర్శనకు మరికొంత సమయం ఇవ్వాల్సిన అవరసం ఉందని ధోనీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్లో టార్గెట్ పెద్దగా లేకపోయినప్పటికి సరైన భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతోనే పరాజంయ చెందామని, స్లో వికెట్ పై స్ట్రైక్ రొటేట్ చేయడం కష్టంగా మారిందదన్నాడు. ఈ మ్యాచ్లో తొలి 10 ఓవర్లలో ఎక్కువ పరుగు లిచ్చేశామని పేర్కొన్నాడు.ఈ వికెట్పై 230 పరుగుల టార్గెట్ అయితే బాగుం డేదని, 260 పరుగులైనా వికెట్లు చేతిలో ఉంటే టార్గెట్ను సులభంగా చేధించే వాళ్లమని,అయితే స్ట్రయిక్ రొటేట్ చేసే క్రమంలో వికెట్లను కోల్పోయామని పేర్కొన్నాడు. మధ్యాహ్నంతో పోలిస్తే పిచ్ సాయంత్రానికి బాగా నెమ్మదించిందని ధోనీ వివరించాడు.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
T20 World Cup: శ్రీలంక, బంగ్లాదేశ్కి డైరెక్ట్ ఎంట్రీ లేదు..!
2020, అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ ఎనిమిది జట్ల మధ్య క్వాలిఫయర్స్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో శ్రీలంక, బంగ్లాదేశ్తో పాటు మరో ఆరు టీమ్స్ కూడా పోటీపడనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
Samayam Telugu | Updated:
Jan 1, 2019, 04:47PM IST
T20 World Cup: శ్రీలంక, బంగ్లాదేశ్కి డైరెక్ట్ ఎంట్రీ లేదు..!
ఆస్ట్రేలియా వేదికగా 2020లో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్కి శ్రీలంక , బంగ్లాదేశ్ టీమ్లు నేరుగా అర్హత సాధించలేకపోయాయి. ఈ మెగా టోర్నీలో పోటీపడే జట్లని మంగళవారం ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. డిసెంబరు 31, 2018 నాటికి టీ20 ర్యాంకింగ్స్ టాప్-8లో ఉన్న టీమ్స్ నేరుగా అర్హత సాధించినట్లు వెల్లడించింది.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ని ఓసారి పరిశీలిస్తే.. పాకిస్థాన్ 138 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా భారత్ (126), ఇంగ్లాండ్ (118), ఆస్ట్రేలియా (117), దక్షిణాఫ్రికా (114), న్యూజిలాండ్ (112), వెస్టిండీస్ (101), అఫ్గానిస్థాన్ (92) టాప్-8లో నిలిచాయి. ఇక 9వ స్థానంలో శ్రీలంక 87 పాయింట్లతో ఉండగా.. 77 పాయింట్లతో బంగ్లాదేశ్ 10వ ర్యాంక్లో కొనసాగుతోంది. దీంతో.. ఈ రెండు జట్లూ క్వాలిఫయర్స్లో గెలిచి టోర్నీలోకి ప్రవేశించాల్సిందేనని ఐసీసీ ప్రకటించింది.
2020, అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ ఎనిమిది జట్ల మధ్య క్వాలిఫయర్స్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో శ్రీలంక, బంగ్లాదేశ్తో పాటు మరో ఆరు టీమ్స్ కూడా పోటీపడనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ప్రొ కబడ్డీకి భల్లాలదేవుడి ప్రచారం
ప్రొ కబడ్డీకి తమ బ్రాండ్ అంబాసిడర్ గా రానాను ఎంపిక చేసినట్టు స్టార్ గ్రూప్ ప్రకటించింది.
TNN | Updated:
Jan 23, 2016, 09:59AM IST
ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లు జనవరి 30 నుంచి ప్రారంభమవ్వబోతున్నాయి. ఈ సందర్భంగా ప్రొ కబడ్డీకి తమ బ్రాండ్ అంబాసిడర్ గా రానాను ఎంపిక చేసినట్టు స్టార్ గ్రూప్ ప్రకటించింది. ఇకపై ఆట ప్రచార కార్యక్రమాల్లో భల్లాలదేవుడు కనిపిస్తాడు. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చకున్న రానాను తమ ప్రచారం కర్తగా పెట్టుకోవడం ఆనందంగా ఉందని స్టార్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. వారు మీడియాతో మాట్లాడారు. తొలి సీజన్ తో పోలిస్తే రెండో సీజన్ లో తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీ చూసే వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు. కాగా రానా మాట్లాడుతూ కబడ్డీని ఎక్కువగా సినిమాల్లోనే చూశామని, ఈ క్రీడకు పెద్దస్థాయిలో గుర్తింపు వస్తుందని ఊహించలేదని అన్నారు. ఇందులో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
| 2sports
|
M S Dhoni
పద్మభూషణ్కు ధోనీ పేరు సిఫారసు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరును దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ప్రతిష్టాత్మక పద్మభూషణ్కు సిఫారసు చేసినట్లు బిసిసిఐ ప్రకటించింది. భారత క్రికెట్కు అందించిన సేవలను గాను 2017 సంవత్సరానికి గాను పద్మభూషణ్ పురస్కారానికి సిఫారసు చేసినట్లు బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా గుర్తింపు పొందిన ధోని పేరును బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా నామినేట్ చేశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధోని కెప్టెన్సీలో టీమిండియా అద్భుత విజయాలను అందుకుంది. అతని కెప్టెన్సీలోనే భారత్ రెండు ప్రపంచ కప్నలు గెలుచుకుందన్నారు. మన దేశ గొప్ప క్రికెటర్లలో ధోని ఒకడని…వన్డేల్లో దాదాపు 10వేల పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్లో 90టెస్టు మ్యాచ్లాడాడు. పద్మభూషణ్ కోసం అతని పేరు సిఫారసు చేయడం సరైన నిర్ణయమేనని ఆయన తెలిపారు. ధోని నేతృత్వంలోని టీమిండియా 2011లో వన్డే, 2007లో టీ20 ప్రపంచకప్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ధోని ఇప్పటికే అర్జున, రాజీవ్ ఖేల్రత్న, పద్మశ్రీ అవార్డులను అందుకున్నాడు.
బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా మాట్లాడుతూ మహేంద్రసింగ్ ధోని పేరును పద్మభూషణ్ అవార్డుకు బిసిసిఐ సిఫారసు చేసింది. బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత క్రికెట్లో గొప్ప ఆటగాళ్లలో ధోని ఒకడు. అతడి పేరును దేశ ప్రతిష్టాత్మక పురస్కారానికి ప్రతిపాదించడం సముచితమని బోర్డు భావించింది అని అన్నాడు. ధోనికి పద్మభూషణ్ అవార్డు లభిస్తే క్రికెట్లో ఈఘనత సాధించిన 11వ క్రికెటర్గా గుర్తింపు పొందుతాడు. అంతకుముందు సచిన్, కపిల్,సునీల్ గవాస్కర్,రాహుల్ ద్రావిడ్; చందు బోర్డే, డిబి డియోధర్, సికె నాయుడు, లాలా అమరనాథ్, రాజా బలీందర్సింగ్, విజయ ఆనంద్లు పద్మభూషణ్ అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు. ధోని రికార్డులు ఇలా…. 36 ఏళ్ల ధోని ఇప్పటివరకు 90 టెస్టుల్లో 4,876 పరుగులు సాధించగా…ఇందులో 6శతకాలున్నాయి. 302 వన్డేల్లో 9,737 పరుగులు చేయగా…ఇందులో 10 శతకాలు ఉన్నాయి. 78 టీ20ల్లో 1212 పరుగులు పనమోదు చేశాడు. భారత జట్టుకు బిసిసిఐ అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడు. ధోని నాయకత్వంలోని టీమిండియా ఐసిసి మూడు టోర్నీలను గెలుచుకుంది. ఇటీవల శ్రీలకంతో జరిగిన వన్డే సిరీస్లో 100 స్టంపౌట్ల రికార్డును నెలకొల్పాడు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ధోని 100 అర్థశతకాలు సాధించాడు. టెస్టుల్లో 66 అర్థశతకాలు, వన్డేల్లో 33, టీ20ల్లో ఒక అర్థశతకంతో ధోని ఈ ఘనత అందుకున్నాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్ని దేశానికి అందించి విజయవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందాడు. నాలుగేళ్ల క్రితం టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎంస్ ధోని 199 మ్యాచ్లకు సారథ్యం వహిస్తే విజయాల శాతం 59.57శాతంగా ఉంది.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘రాజా ది గ్రేట్’లో రాశీ ఖన్నా ఐటమ్ సాంగ్
రాశీ ఖన్నా ఇప్పటి వరకు చాలానే సినిమాలే చేసినా అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదనే చెప్పాలి.
TNN | Updated:
Sep 14, 2017, 03:22PM IST
రాశీ ఖన్నా ఇప్పటి వరకు చాలానే సినిమాలే చేసినా అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు ‘జై లవ కుశ’ లాంటి భారీ చిత్రంలో నటించడంతో రాశీ పేరు మారుమోగుతోంది. ప్రస్తుతం రాశీ చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయి. ఓవైపు ‘జై లవ కుశ’లో ఎన్టీఆర్ సరన నటిస్తూనే మరోవైపు రవితేజతో ‘టచ్ చేసి చూడు’, మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఒక సినిమా చేస్తోంది. అలాగే తమిళం, మలయాళంలో ఒక్కో సినిమాతో బిజీగా ఉంది. ఇప్పుడు తాజాగా మరో అవకాశం కొట్టేసింది.
మాస్ మహారాజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెరైటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ‘రాజా ది గ్రేట్’ సినిమాలో రాశీ ఖన్నా స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈ విషయాన్ని రాశీ స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఫేస్‌బుల్‌లో ఓ పోస్టు పెట్టింది. ‘నా లవ్‌లీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కోసం రవితేజ, మెహ్రీన్ పిర్జాడా జంటగా నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’లో ఓ పాటలో స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తున్నా’ అని రాశీ పోస్టు చేసింది.
| 0business
|
Suresh 334 Views Srilanka Won the Match
Srilanka Won the Match
Galae: న్యూజిలాండ్ తో గాలె వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 249 పరుగులకు ఆలౌట్ కాగా శ్రీలంక 267 పరుగులు సాధించింది. 18 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ 285 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 268 పరుగుల విజయ లక్షంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన లంక… కెప్టెన్ కరుణ రత్నే 122 పరుగులతో రాణించడంతో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రెండు టెస్టుల సిరీస్ లో శ్రీలంక 1-0 ఆదిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 22 నుంచి రెండో టెస్టు జరగనుంది. న్యూజిలాండ్ ఈ టెస్టు మ్యాచ్ ఓడిపోవడంతో నెంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకునే అవకాశం లేదు. ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య కేవలం 2 పాయింట్ల అంతరం మాత్రమే ఉంది. న్యూజిలాండ్ ఈ మ్యాచ్ ఓడిపోవడం టీమిండియాకు లాభించేదే.. టీమిండియా కు ముప్పు తప్పిందని పలువురు అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.
| 2sports
|
ఎల్ఐసీ చేతుల్లోకి ఐడీబీఐ బ్యాంక్!
- నిర్ణయాత్మక వాటా కొనుగోలుకు ఆసక్తి
- ఐఆర్డీఏ అనుమతుల కోసం నిరీక్షణ
ముంబయి: భార తీయ బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రత్యక్షంగా బ్యాంకింగ్ విభాగంలోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇబ్బందుల్లో ఉన్న ఐడీబీఐ బ్యాంకులో నిర్ణయాత్మక వాటా కొనుగోలుకు గాను బీమా సంస్థ ఆసక్తి చూపుతూ.. ప్రభుత్వ అనుమతుల్ని కోరింది. ఇదే జరిగితే ఎల్ఐసీ ప్రత్యక్షంగా బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టినట్లవుతుంది. ఎల్ఐసీ ప్రతిపాదనలో భాగంగా రూ.10,500 కోట్ల మేర నిధులను వెచ్చించి ఐడీబీఐలో బీమా సంస్థ మరో 43 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు గాను ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్లో బీమా సంస్థకు 8 శాతం వాటా ఉంది. తాజాగా 43 శాతం వాటా కొనుగోలును కూడా పరిగణనలోకి తీసుకుంటే బ్యాంక్లో ఎల్ఐసీ వాటా 51 శాతానికి చేరనుంది. ఐడీబీఐలో ప్రభుత్వం వాటా కూడా ఇటీవలే 85శాతానికి చేరుకుంది. గతంలో 80 శాతం వాటా ఉండగా మరో 5.96శాతం వాటా బ్యాంక్ ప్రిఫరెన్షియల్ షేర్లను ప్రభుత్వానికి విక్రయించింది. దీం తో సర్కారుకు ఐడీబీఐ బ్యాంక్లో వాటా పెరిగింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఎల్ఐసీ బోర్డు సమావేశంలో పెట్టి ఆమోదించనున్నారు. కాగా ఈ విషయమై బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఐ సానుకూలతను సర్కారు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 29న జరిగే ఐఆర్డీఏ బోర్డు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకును అవకాశాలు కనిపిస్తున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Suresh 89 Views Team India
Team India
మూడో వన్డే మ్యాచ్లో భారత విజయ లక్ష్యం 218 పరుగులు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
శ్రీలంక బ్యాటింగ్: డిక్వెల్లా (13), మెండీస్ (1); థిర్మన్ (80), మాథ్యూస్ (11), కపుదెరె (14), సిరివర్ధన (29), ధనన్జయ (2), చమీరా (6), ఫెర్నాండో (5) పరుగులతో, లసిత్ మలింగా ఒక్క పరుగుతో నాటౌట్గా నిలిచారు.
భారత్ బౌలింగ్: బుమ్రా-5, పాండ్యా-1, అక్షర్ పటేల్-1, జాదవ్-1 వికెట్లు తీశారు.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
యాపిల్ వాచ్లు వాడొద్దు.. పాక్ క్రికెటర్లకు ఐసీసీ ఆదేశం!
మైదానంలో ఉన్నప్పుడు చేతికి యాపిల్ స్మార్ట్ వాచ్లు పెట్టుకోవడానికి వీల్లేదని పాకిస్థాన్ క్రికెటర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆదేశించింది.
Samayam Telugu | Updated:
May 25, 2018, 06:26PM IST
యాపిల్ వాచ్లు వాడొద్దు.. పాక్ క్రికెటర్లకు ఐసీసీ ఆదేశం!
మైదానంలో ఉన్నప్పుడు చేతికి యాపిల్ స్మార్ట్ వాచ్లు పెట్టుకోవడానికి వీల్లేదని పాకిస్థాన్ క్రికెటర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆదేశించింది. పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం లార్డ్స్ మైదానంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే తొలిరోజు పాకిస్థాన్ ఆటగాళ్లు కొందరు చేతికి యాపిల్ వాచ్లు పెట్టుకున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అసద్ షఫిక్, బాబర్ అజామ్ చేతికున్న యాపిల్ వాచ్ను చూస్తున్నట్లు కనిపించారు. ఇది కాస్త చర్చనీయాంశమై ఐసీసీ అవినీతి నిరోధకశాఖ దృష్టికి వెళ్లింది. దీంతో మైదానంలో యాపిల్ వాచ్లు వాడటానికి వీళ్లేదని ఐసీసీ అవినీతి నిరోధకశాఖకు చెందిన ఒక అధికారి పాక్ జట్టుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రెండో రోజు ఆటలో పాక్ క్రికెటర్లు యాపిల్ వాచ్లను పెట్టుకోలేదు.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లకు చెందిన వ్యక్తిగత గ్యాడ్జెట్లను మైదానంలోకి అనుమతించరు. క్రికెటర్లు బస్సు దిగుతున్నప్పుడే వారి వద్ద నుంచి సెల్ఫోన్లు ఇతర కమ్యూనికేషన్ గ్యాడ్జెట్లను తీసేసుకుంటారు. అయితే ఈ యాపిల్ వాచ్లు కూడా కమ్యూనికేషన్ గ్యాడ్జెట్ల కిందికే వస్తాయని ఐసీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. యాపిల్ వాచ్లను ఫోన్, వైఫై డివైజ్లకు కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చని, మెసేజ్లు రిసీవ్ చేసుకోవచ్చని చెప్పారు. కాబట్టి దీన్ని కూడా కమ్యూనికేషన్ గ్యాడ్జెట్గా పరిగణించి మైదానంలో వాడకూడదని ఆదేశించినట్లు వెల్లడించారు. వాస్తవానికి స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కున్న మహమ్మద్ అమీర్ ప్రస్తుతం ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు.
2010లో ఇదే లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అమీర్తో పాటు కెప్టెన్ సల్మాన్ భట్, బౌలర్ మహమ్మద్ ఆసిఫ్ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు తేలింది. వీరి ముగ్గురిపై ఐసీసీ ఐదేళ్ల నిషేధాన్ని కూడా విధించింది. నిషేధం అనంతరం అమీర్ పాక్ జాతీయ జట్టులో స్థానం సంపాదించగలిగాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో పాకిస్థాన్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేస్తోంది. మహమ్మద్ అబ్బాస్, హసన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 184 పరుగులకే ఆలౌటయింది. ఈ బౌలర్లు ఇద్దరూ చెరో నాలుగు వికెట్లు తీశారు. ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అత్యధికంగా 70 పరుగులు చేశాడు. మరోవైపు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో బాగానే ఆడుతోంది. ప్రస్తుతం 53 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
శతమానంభవతి చిత్రం టీమ్ ను అభినందించిన సీఎం కేసీఆర్
Highlights
శతమానంభవతి చిత్రం టీమ్ ను అభినందించిన సీఎం కేసీఆర్
సంక్రాంతికి రిలీజై గ్రాండ్ సక్సెస్ సాధించిన శతమానంభవతి
చక్కని కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించిన సతీష్ వేగేశ్న
శర్వానంద్ హీరోగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.24 చిత్రం 'శతమానంభవతి' రిలీజై సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ మూడు తరాలకు సంబంధించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి14న విడుదలయి ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. సాధారణంగా పెద్దలు ఆశీర్వదించేటప్పుడు చెప్పే 'శతమానం భవతి' అనే టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. దీన్ని యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా తెరకెక్కించి హిట్ అందుకున్నారు నిర్మాత దిల్ రాజు అండ్ టీమ్. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శతమానంభవతి టీమ్ ను అభినందించారు.
దిల్ రాజు మాట్లాడుతూ... డైరెక్టర్ సతీష్ వేగ్నేశ చెప్పిన పాయింట్ను అందరికీ నచ్చేలా స్క్రిప్ట్ తయారు చేయడానికి టైం పట్టింది. మంచి సినిమాను తీయాలని డైరెక్టర్ సతీష్ వేగ్నేశ చాలా కష్టపడ్డాడు. హీరో శర్వానంద్ హీరో కావాలనుకున్నప్పుడు డైరెక్టర్ తేజకు తనని నేనే పరిచయం చేశాను. పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు శర్వానంద్ మా బ్యానర్లో సినిమా చేయాలని రాసి పెట్టి ఉండటం వల్లే ఈ శతమానంభవతిలో తను హీరోగా చేశాడు. ఈ సినిమా హిట్ కావడం చాలా హ్యాపీగా ఉంది అన్నారు.
ఈ చిత్రంలో నటీనటులు :
శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్ , ప్రకాష్ రాజ్ , జయసుధ , ఇంద్రజ , శివాజీ రాజా , ప్రవీణ్ , సిజ్జు , శ్రీ రాం , మధురిమ , నీల్యా , ప్రమోదిని, మహేష్ , భద్రం ,హిమజ , ప్రభు తదితరులు
సాంకేతిక నిపుణులు :
ఛాయాగ్రహణం – సమీర్ రెడ్డి
సంగీతం - మిక్కీ జె. మేయర్
సాహిత్యం - శ్రీ సీతారామశాస్త్రి , రామజోగయ్య శాస్త్రి
కూర్పు - మధు
కళా దర్శకుడు – రమణ వంక
కథ - కథనం –మాటలు-దర్శకత్వం - వేగేశ్న సతీష్
Last Updated 25, Mar 2018, 11:58 PM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నాగబాబులా నేను రియాక్ట్ అవ్వను: చిరంజీవి
తను హర్ట్ అయ్యాడు.. రియాక్ట్ అయ్యాడు. మేము కూడా బాధ పడతాం కానీ రియాక్ట్ అవ్వం. కానీ తను స్పాంటేనియస్గా స్టేజ్ మీద మాట్లాడేశాడు. నేనైతే అసలు రియాక్ట్ అవ్వను..
TNN | Updated:
Jan 9, 2017, 04:24PM IST
మెగాస్టార్ చిరంజీవి పరిచయం అక్కర్లేని పేరు. 149 సినిమాలు పూర్తిచేసి 150వ మెట్టు ఎక్కబోతున్న ఘనత ఆయనకు సొంతం. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరవాత మేకప్ వేసుకున్న చిరంజీవి సంక్రాంతి కానుకగా 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి జనవరి 11న వస్తున్నారు. ఈ సంధర్భంగా అంజనీ పుత్రుడితో జరిపిన కొన్ని ముచ్చట్లు..
'కత్తి' ఎన్నుకోవడానికి కారణం ఏంటి? రీమేక్ సినిమా సేఫ్ జోన్ అనుకున్నారా?
నేను రీఎంట్రీ ఇచ్చే సినిమా కోసం సంవత్సరం కాలంగా కథలు వింటూనే ఉన్నాను. అన్నీ కమర్షియల్ సినిమాలు. అరవై, డెబ్బై శాతం నచ్చేవి. కానీ ఎందుకో తృప్తి అనుపించేది కాదు. మరో పక్క సమయం అయిపోతుంది. అప్పుడు నేను కత్తి సినిమా చూశాను. ఎలా చూసినా కథ సంతృప్తికరంగా అనిపించింది. ఠాగూర్, స్టాలిన్ లాంటి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా చేయాలనుకున్నాను. కత్తి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంది. అందుకే ఈ కథ నాకు యాప్ట్ అనిపించింది. రీమేక్ సేఫ్ జోన్ అని కాదు.. కథ నచ్చి సినిమా చేశాను. అయినా రీమేక్‌లు చేయడంలో ఎలాంటి తప్పు లేదు.
మళ్లీ సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది?
రాజకీయంగా వచ్చిన స్తబ్ధత కారణంగా కాస్త సమయం దొరికింది. అమితాబ్, రజినీకాంత్ వంటి వారు నేను మళ్లీ సినిమాల్లోకి రావాలని పలు కార్యక్రమాల్లో అన్నారు. నా అభిమానులు కూడా కోరుకునేది అదే. అలాంటప్పుడు నేను ఎందుకు చేయకూడదు అనుకున్నాను. షూటింగ్‌లో లైట్స్, కెమెరా ఇలా చూస్తూ ఉంటే 'ఇది కదా.. మన ఎరెనా' అనిపించింది.
ఈ పదేళ్లలో ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. మీకు ఎలా అనిపిస్తుంది?
ఈ పదేళ్లలో సినిమా అర్థం మారిపోయింది. మొత్తం డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది. ఫిల్మ్, క్లాప్ అనే సౌండ్స్ వినిపించడం లేదు. స్క్రీన్ మీద ప్రతిదీ ఎన్హాన్సింగ్‌గా కనిపిస్తుంది. తప్పులు చేసినా అలానే కనిపిస్తాయి. మార్పు రావడంలో తప్పేమీ లేదు.
చాలా విరామం తరువాత వస్తున్నాననే టెన్షన్ మీలో ఏమైనా ఉందా?
వంద సినిమాలు చేసినా.. నూట యాభై సినిమాలు చేసినా.. పోటీ ఉన్నప్పుడు చిన్న స్ట్రెస్ అనేది కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ సబ్జెక్ట్ మీద చాలా నమ్మకం ఉంది. ఔట్ పుట్ చూసుకున్న తరువాత నమ్మకం మరింత పెరిగింది.
కథలో ఏమైనా మార్పులు చేశారా?
ఒరిజినల్ కథలో ఒకటి రెండు ఎపిసోడ్స్‌ను నాకు తగిన విధంగా మార్పులు చేశారు. తమిళంలో రాజకీయాలను టచ్ చేశారు. తెలుగులో వచ్చేసరికి రాజకీయం ఉండదు. కార్పోరేట్ సంస్థలు రైతులను ఎలా మోసం చేస్తున్నాయని చూపించాం. తమిళంలో కామెడీ ట్రాక్ ఉండదు. తెలుగులో క్రియేట్ చేశాం. కమర్షియల్‌గా కొన్ని జత చేశాం. ట్రీట్మెంట్ ఫాస్ట్ బేస్‌లో ఉంటుంది.
యంగ్ లుక్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
నా ట్రైనర్, డైటీషియన్ రెండూ చరణే. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి.. ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి.. ఇలా ప్రతి విషయంలో తనే కేర్ తీసుకున్నాడు. నిర్మాత కదా.. తన హీరోను తనే రెడీ చేశాడు. నా వరకు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటాను. దానికి ఆహారపు అలవాట్లు, వ్యాయామం సహకరించాయి.
ప్రస్తుతం ఫస్ట్ డే కలెక్షన్స్, వన్ వీక్ కలెక్షన్స్ ఇలా వచ్చేశాయి.. ఆ ఒత్తిడి ఏదైనా మీ మీద ఉందా?
నిజం చెప్పాలంటే నాకు అసలు ప్రొడక్షన్ వైపు కానీ డిస్ట్రిబ్యూషన్ వైపు గాని అవగాహన లేదు. నాకు సినిమా వరకు మాత్రమే హద్దులు తెలుసు. కమర్షియల్ పద్దులు తెలియవు. ఆ పద్దులు చరణ్‌కు తెలుసు. అందుకే నిర్మాత అయ్యాడు. నిర్మాతకు ఉండాల్సిన క్లారిటీ తనకు ఉంది.
నాగబాబు ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో అలా మాట్లాడటం కరెక్ట్ అంటారా?
తను హర్ట్ అయ్యాడు.. రియాక్ట్ అయ్యాడు. మేము కూడా బాధ పడతాం కానీ రియాక్ట్ అవ్వం. కానీ తను స్పాంటేనియస్‌గా స్టేజ్ మీద మాట్లాడేశాడు. నేనైతే అసలు రియాక్ట్ అవ్వను.. ఎందుకంటే మనం రియాక్ట్ అయితే వారు చేసిన కామెంట్స్‌కు అటెన్షన్ పెరిగిపోతుంది. రియాక్ట్ కాకపోతే మరుగున పడుతుంది. ఒకరిని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. నాకు ఇండస్ట్రీలో ఎవరితో గొడవలు లేవు. నా కుటుంబానికి కూడా అంతే.
భవిష్యత్తు ప్రణాళిక ఏమైనా ఉందా?
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా లైన్‌లో ఉంచాను. అలానే సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమా అనుకుంటున్నాం. బోయపాటి సినిమా 152‌గా ప్లాన్ చేశాను. ఈలోగా గీతాఆర్ట్స్‌లో ఓ సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతానికైతే సినిమాల మీద ఫోకస్ పెట్టాను. రెండు సినిమాల వరకు కచ్చితంగా చేస్తాను.
| 0business
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ
| 2sports
|
Hyderabad, First Published 18, Apr 2019, 1:39 PM IST
Highlights
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగానే కేసీఆర్ బయోపిక్ ను తీసేలా ఉన్నాడు. అందుకు సంబందించిన ఎనౌన్స్మెంట్ తో ఇటీవల రచ్చ చేసిన వర్మ ఫైనల్ గా టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగానే కేసీఆర్ బయోపిక్ ను తీసేలా ఉన్నాడు. అందుకు సంబందించిన ఎనౌన్స్మెంట్ తో ఇటీవల రచ్చ చేసిన వర్మ ఫైనల్ గా టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. కేసీఆర్ టైగర్ అని సెట్ చేసిన టైటిల్ కు మంచి క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
ధ అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ తో పాటు చిన్న లైన్ తో స్ట్రాంగ్ గా ఎట్రాక్ట్ చేశాడు. 'ఆడు తెలంగాణ తెస్తానంటే.. అందరూ నవ్విండ్రు' అని కేసీఆర్ డైలాగ్ నే పెట్టడంతో ఈ న్యూస్ అందరిని ఆకట్టుకుంటోంది. వర్మకు టైటిల్స్ వదలడం కొత్తేమి కాదు. గతంలో కూడా చాలా మంది ప్రముఖుల బయోపిక్స్ తీస్తాను అని అప్పటికప్పుడు పోస్టర్ లతో హంగామా చేసేవారు.
అయితే కేసీఆర్ బయోపిక్ లో మాత్రం వర్మ మొండి పట్టు పట్టాడని తెలుస్తోంది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి జీవితాన్ని తెరపైకి తెరకెక్కించే ముందు దర్శకుడు ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళతాడో చూడాలి.
Last Updated 18, Apr 2019, 1:40 PM IST
| 0business
|
అనసూయకు మెగా ఆఫర్ ఇచ్చిన రామ్ చరణ్
Highlights
మరో మెగీ హీరోతో రొమాన్స్ చేయనున్న అనసూయ
ఇప్పటికే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్
తాజాగా రామ్ చరణ్ రంగస్థలం 1985లో అనసూయ
బుల్లితెరపై తన సత్తా చాటి వెండి తెరపైనా తానేంటో నిరూపించుకుంది అనసూయ. ఇప్పుడు ఈ బుల్లి తెర లేడీ స్టార్ అనసూయకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలో నటించే అవకాశం దక్కింది. చెర్రీ నటిస్తున్న రంగస్థలం 1985లో అనసూయ నటిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ స్వయంగా అనసూయే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అందులో రంగస్థలం షూటింగ్కి వస్తున్న నటీనటులకు స్వాగతం అంటూ రాసింది.
దీన్ని బట్టి రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985లో అనసూయ కూడా నటిస్తోందని అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసరాల్లో జరుగనున్నట్లు సమాచారం. కాగా అనసూయ ‘సోగ్గాడే చిన్నినాయనా’.., ‘క్షణం’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
Last Updated 25, Mar 2018, 11:52 PM IST
| 0business
|
Hyderabad, First Published 1, Jul 2019, 8:21 PM IST
Highlights
జులై 2న అరుదైన దృశ్యం చోటు చేసుకోబోతోంది. ముగ్గురు మహిళా సెలెబ్రిటీలు ఒకే వేదికపై కనిపించనున్నారు.
జులై 2న అరుదైన దృశ్యం చోటు చేసుకోబోతోంది. ముగ్గురు మహిళా సెలెబ్రిటీలు ఒకే వేదికపై కనిపించనున్నారు. వివరాల్లోకి వెళితే.. విలక్షణ నటనతో సాహసోపేతమైన పాత్రల్లో నటిస్తున్న ఐశ్వర్య రాజేష్ నుంచి మరో క్రేజీ మూవీ వస్తోంది. ఐశ్వర్య రాజేష్ నటించిన 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ సందర్భంగా జులై 2న హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్, హీరోయిన్ రాశి ఖన్నా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
మిథాలీ రాజ్ తొలి సరి సినిమా ఈవెంట్ కు రానుండడంతో ఆసక్తి నెలకొంది. కౌశల్య కృష్ణమూర్తి చిత్రం క్రికెట్ నేపథ్యంలో సాగుతుంది. ఓ పల్లెటూరి అమ్మాయి చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలనే లక్ష్యంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేదే ఈ చిత్ర కథ. దీనితో మిథాలీ రాజ్ ని అతిథిగా ఆహ్వానించారు. ఐశ్వర్య రాజేష్ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటించారు. బీమినేని శ్రీనివాస రావు ఈ చిత్రానికి దర్శకుడు.
| 0business
|
Mar 14,2018
ఐవోసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా బెస్ట్!
న్యూఢిల్లీ: 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా సంస్థలు మేటి పనితీరు కనబరిచి అత్యధిక లాభాలను ఆర్జించిన ప్రభుత్వ రంగ సంస్థలుగా (పీఎస్యూ) నిలిచినట్టు సర్కారు ఒక సర్వేలో తేలింది. మంగళవారం పార్లమెంట్కు ప్రభుత్వం సమర్పించిన 'పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వే' ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్, ఎయిరిండియా, ఎంటీఎన్ఎల్లు అత్యధికంగా నష్టాలను నమోదు చేసిన పీఎస్యూలుగా నిలిచినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న దాదాపు 257 సంస్థల పని తీరును విశ్లేషించి సర్కారు ఈ సర్వే నివేదికను రూపొందించింది. అత్యధికంగా నష్టాలను నమోదు చేసిన సంస్థల్లో వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్, ఎస్టీసీఎల్, ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్, బ్రహ్మపుత్ర క్రాకర్స్, పాలిమర్ సంస్థలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ రంగంలోని 82 సంస్థలు నమోదు చేసిన నష్టాల్లో దాదాపు 83.82 శాతం నష్టాలు పై పది సంస్థల్లోనే నమోదు అయినట్టుగా సర్కారు తెలిపింది.
బీఎస్ఎన్ఎల్, ఎయిరిండియా, ఎంటీఎన్ఎల్ సంస్థల నష్టం మొత్తం సర్కారు సంస్థల నష్టాల్లో 55.66 శాతంగా నమోదయ్యాయి. ప్రభుత్వం సంస్థలు మొత్తంగా సాధించిన లాభాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అయిల్ అండ్ నేచురల్ గ్యాస్, కోల్ ఇండియా సంస్థల లాభాలు వరుసగా 19.69%, 18.45%, 14.94 శాతంగా ఉన్నట్టుగా సర్వే వెల్లడించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నడుస్తున్న మొత్తం 257 సంస్థలు 2016-17 సంవత్సరానికి గాను రూ.1,27,602 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయని ఇది అంతకు ముందు ఏడాది సదరు సంస్థల లాభం రూ.1,14,239 కోట్లుతో పోలిస్తే దాదాపు 11.7 శాతం అధికమని వివరించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
స్మార్ట్ఫోన్ కొనడానికి ఇదే మంచి తరుణం
దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో కరెన్సీ నోట్లపై నడిచే వ్యాపారం కూడా మందగించింది.
TNN | Updated:
Nov 14, 2016, 12:48PM IST
దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో కరెన్సీ నోట్లపై నడిచే వ్యాపారం కూడా మందగించింది. ముఖ్యంగా గత వారం రోజులుగా మొబైల్ ఫోన్ల అమ్మకాలు బాగా పడిపోయాయి. దీంతో రిటైలర్లు రకరకాల ఆఫర్లతో ఆకట్టుకుంటున్నారు. వినియోగదారులకు జీరో డౌన్ పేమెంట్‌తో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నారు.
ఏమీ చెల్లించకుండానే ఫోన్‌ను సొంతం చేసుకుని సొమ్మును వాయిదా పద్ధతి (ఈఎంఐ)లో 12 నెలల పాటు చెల్లించే వెసులుబాటును మొబైల్ స్టోర్లు అందిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో పాపులర్ అయిన సంగీత మొబైల్స్ ఇప్పటికే ఈ ఆఫర్‌ను అందిస్తోంది. సాధారణంగా మార్కెట్‌లో ఉన్న మొబైల్ ఫోన్ స్టోర్లన్నీ క్రెడిట్/డెబిట్ కార్డు లేదా క్యాష్ రూపంలో లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. అయితే వీటిలో 30 నుంచి 40 శాతం లావాదేవీలు క్యాష్ రూపంలోనే జరుగుతున్నాయి.
| 1entertainment
|
internet vaartha 220 Views
హైదరాబాద్ : తెలంగాణ లీడ్బ్యాంకు స్టేట్ బ్యాంక్ఆఫ్ హైదరాబాద్ సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కమ్యూనిటీ బ్యాంకింగ్ కార్యకలాపాలను విస్తృతం చేసింది. ఇందులోభాగంగానే బ్యాంకు ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు పంపిణీచేసింది. నిజామాబాద్గ్రామం లోని గుండారం గ్రామంలోబ్యాంకు ఈ కార్యక్రమాలు నిర్వహించింది. అంతేకాకుండా పోతంగల్, కోట్గిర్, తాడ్బిలోలి గ్రామాల్లో కూడా బ్యాంకు ఎండి శంతను ముఖర్జీ చేతులమీదుగా పలు కమ్యూనిటీ బ్యాంకింగ్ కార్యకలాపాలు చేపట్టింది. మొత్తంగాచూస్తే తరగతి గదుల్లో బెంచిలు, విద్యార్ధినులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు జిఎం మనికందన్, డిజిఎం బిఆర్ఎస్ భండారి తదితరులు పాల్గొన్నారు.
| 1entertainment
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
రామ్ ‘రెడ్’ మూవీ ఓపెనింగ్.. పూరి, ఛార్మి హంగామా
రామ్ కొత్త సినిమా ‘రెడ్’ ప్రారంభమైంది. తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నవంబర్ 16 నుంచి సెట్స్పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Samayam Telugu | Updated:
Oct 30, 2019, 02:23PM IST
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్’. తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేయనున్నారు. దీపావళి సందర్భంగా సోమవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. నిన్న టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈరోజు (అక్టోబర్ 30న) సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.
Also Read: అల్లు అర్జున్, సుకుమార్ సినిమా ప్రారంభం
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చిన రామ్.. తనతో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి క్లాసికల్ మూవీస్ తీసిన తిరుమల కిషోర్ను నమ్ముకున్నారు. అయితే, పోస్టర్లు చూస్తుంటే ఇది మంచి మాస్ మూవీలా అనిపిస్తోంది. అందుకే, ఈ సినిమా ఓపెనింగ్కు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కు అతిథిగా తీసుకొచ్చారు రామ్. ముహూర్తపు సన్నివేశానికి ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ తొలి క్లాప్ కొట్టారు. ఈ సమయంలో ఛార్మి అరుపులు, కేకలతో హంగామా చేశారు. ఆ తరవాత పూరి, ఛార్మిలను రామ్ ఆప్యాయంగా హత్తుకున్నారు.
ఇదిలా ఉంటే, ‘రెడ్’ సినిమా నవంబర్ 16 నుంచి సెట్స్పైకి వెళ్లనుంది. నాన్ స్టాప్గా షూటింగ్ జరిపి ఏప్రిల్ తొలివారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ చెప్పారు. తమ బ్యానర్లో ఇదొక విభిన్నమైన చిత్రం అవుతుందని తెలిపారు. ఇది తమిళ చిత్రం ‘తదమ్’కు రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై రవికిషోర్ స్పందిస్తూ.. పూర్తి రీమేక్ కాదని, స్టోరీ లైన్ను తీసుకొని చాలా మార్పులు చేశామని అన్నారు. సినిమా టైటిల్ మాదిరిగానే కథ, కథనం కూడా చాలా కొత్తగా ఉంటాయని దర్శకుడు తిరుమల కిషోర్ వెల్లడించారు. ఇదొక కమర్షియల్ థ్రిల్లర్ అని చెప్పారు.
హీరో రామ్ రెడ్ మూవీ ఓపెనింగ్
X
| 0business
|
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ
First Published 20, Jan 2018, 3:24 PM IST
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ
Recent Stories
| 0business
|
Suresh 215 Views
హైటెక్స్లో 3రోజులపాటు ప్రాపర్టీ షో
హైదరాబాద్: బహుళజాతి సంస్థలు, ఐటి రంగ విదేశీ కంపెనీలు హైదరాబాద్ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో నగరంలో ఇటీవల రియాల్టీ రంగం వృద్ధిని సాధిస్తోంది.. నిర్మాణ రంగం కార్యకలాపాలు మెరుగుపడ్డాయని క్రెడాయా హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్.రామిరెడ్డి తెలిపారు. 2012 నుంచి కొనసాగిస్తున్న అతిపెద్ద స్థిరాస్తి ప్రదర్శనను ఈనెల 13, 14, 15 తేదీల్లో హైటెక్స్లో నిర్వహిస్తున్నటు తెలిపారు. మొత్తం 115 మందికిపైగా డెవలపర్లు, తమ ప్రాజెక్టులతో ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటారని తెలిపారు.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కోహ్లి లాంటి ఆటగాడ్ని ఏబీ చూడలేదట..!
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లాంటి క్రికెటర్ని తానెక్కడా చూడలేదని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్
TNN | Updated:
Aug 30, 2017, 02:27PM IST
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లాంటి క్రికెటర్‌ని తానెక్కడా చూడలేదని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ఆటలో ఎవరినీ అనుసరించకుండా తనకంటూ ప్రత్యేక శైలి‌ని కోహ్లి సృష్టించుకున్నాడ‌ని.. అతను ఈ తరానికి బెస్ట్ క్రికెటర్ అంటూ డివిలియర్స్ ప్రశసించాడు. గత వారంలో దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి అనూహ్యంగా తప్పుకున్న డివిలియర్స్ తాజాగా మీడియాతో సుదీర్ఘంగా మాట్టాడాడు.
‘వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న క్షణం నుంచీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ నిర్ణయంతో నేను మళ్లీ రీఫ్రెష్ అయిన భావన కలుగుతోంది. నా జీవితం క్రికెట్‌తో మమేకమైపోయింది. అందుకే.. కెరీర్ చివరాంకంలో ఆటని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో కెప్టెన్సీని వదులుకున్నా. నా కెరీర్ ఇంకో రెండు లేదా.. గరిష్టంగా మరో ఏడేళ్లు ఉండొచ్చేమో నాకు తెలీదు. ఇక వచ్చే ఏడాది భారత్ జట్టు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ కోసం వస్తోంది. రెండేళ్ల క్రితం మేము భారత్ గడ్డపై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. కానీ.. ఈ సిరీస్‌లో మాత్రం వారికి గట్టిపోటీనిస్తాం. కెప్టెన్ విరాట్ కోహ్లి తనకంటూ ప్రత్యేక శైలి సృష్టించుకున్నాడు. నా గురించి కోహ్లి ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. కానీ.. అతనే ఈ తరానికి అత్యుత్తమ ఆటగాడు. ఇద్దరం చాలా సరదాగా, ఆటపై అంకితభావంతో గౌరవంగా ఉంటాం’ అని డివిలియర్స్ వివరించాడు.
| 2sports
|
బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్కు హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ను దేశ అత్యున్నత న్యాయస్థానం కఠినంగా హెచ్చరించింది.కాగా అసత్య ప్రమాణం చేసినట్లు రుజువైతే జైలుకు తప్పదని,ముందుగానే క్షమాపణలు చెప్పాలని తీవ్రంగా వ్యాఖ్యానించింది.జస్టిస్ లోథా కమిటీ వర్సెస్ బిసిసిఐ కేసు సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చింది.వాదనల తరువాత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ విచారణను జనవరి 3కు వాయిదావ వేశారు.ఆ మరునాడు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం ముగుస్తుండటం గమనార్హం.కాగా లోథా కమిటీ సంస్కరణల అమలును అడ్డుకునేందుకు తాత్సారం చేసేందుకు అనురాగ్ ఠాకూర్ సుప్రీంకోర్టులో అసత్య ప్రమాణం చేశారని అమికన్ క్యూరీ గోపాల్ సుబ్రమణ్యం వాదించారు.
సంస్కరణల అమలు,సుప్రీం కోర్టు ఉత్తర్వులు క్రికెట్ బోర్టులో జోక్యం కిందకు వస్తుందా? బిసిసిఐ సభ్యత్వాన్ని ఐసిసి రద్దు చేస్తుందా? తెలుసుకుని ప్రమాణ పత్రందాఖలు చేయాలని సుప్రీంకోర్టు అక్టోబరులో ఆదేశించినపుడు అనురాగ్ అబద్దాలు చెప్పారని సుబ్రమణ్యం పేర్కొన్నారు.కాగా జోక్యం, రద్దు గురించి ఇంతకు ముందు ఐసిసి సంప్రదించాఆర అని కూడా సుప్రీం ప్రశ్నించింది. కాగా తాను ఐసిసిని లేఖ ఇవ్వాలని అడగలేదని,సంస్కరణల అమలు ప్రభుత్వ జోక్యం కిందకు వస్తుందా? రాదా అన్నది స్పష్టత ఇవ్వాలని ఐసిసి చైర్మన్ మనోహర్ను కోరినట్లు అనురాగ్ అఫిడవిట్లో పేర్కొన్నాడు.
కాగా ఈ నేపథ్యంలో అనురాగ్ తనను ఈ అంశంపై ప్రశ్నించలేదని,మనోహర్ వివరించాడని అమిన్క్యూరీ గోపాల్ సుబ్రమణ్యం సుప్రీంకోర్టుకు తెలిపారు.ఇది సంస్కరణల అమలును అడ్డుకోవడమే అన్నారు.
ఈ వాదనతో ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ అసత్య ప్రమాణం దాఖలు చేసినట్లు రుజువైతే శిక్ష తప్పదని,జైలుకుతప్ప ఈ దేశంలో ఎక్కడికి వెళ్లలేరని కఠినంగా హెచ్చరించింది.కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పిళ్లై బోర్డు పరిశీలకుడిగా అత్యున్నత పరిపాలన కమిటిని ఏర్పాటు చేయాలన్న అమికన్ క్యూరి గోపాల్ సుబ్రమణ్యం సూచనను బిసిసిఐ తోసి పుచ్చింది.కాగా భారత క్రికెట్ను నిర్వహించగల,నియంత్రించ గల సమర్థులని భావించిన వారి పేర్లను వారంలోగా తెలియజేయాలని సుబ్రమణ్యం బిసిసిఐ తెలిపారు.బోర్డు పరిశీలకుడి అంశం లోథా కమిటీ గతంలోనే సుప్రీంకు విన్నివించిన సంగతి తెలిసిందే.
| 2sports
|
- తారాజువ్వలా ఎగిసిన ప్రధాన సూచీలు
- సత్తాచాటిన బ్యాంకింగ్ రంగపు షేర్లు..
- మెరిసిన లోహ, ఫార్మా, విత్త రంగ స్టాక్స్
- దన్నుగా నిలిచిన రూపాయి మారక బలం..
- బీఎస్ఈ సెన్సెక్స్లో 718 పాయింట్ల ర్యాలీ
- 10,250 ఎగువకు ఎన్ఎస్ఈ నిఫ్టీ పరుగు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రివ్వున ఎగిశాయి. దేశీయ, అంతర్జాతీయ అనకూలతల నేపథ్యంలో దేశీయ సూచీలు ఇటీవలి రికార్డు స్థాయిలో లాభాలను నమోదు చేశాయి. కొనుగోళ్ల మద్దతుతో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు పరుగులు పెట్టాయి. సోమవారం ఈ రంగం స్టాక్ దాదాపుగా 8 శాతం వరకు పెరిగాయి. బ్యాంకింగ్ సూచీలతో పాటు లోహ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, విత్త, ఐటీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. ఇంతక్రితం వరుసగా రెండు సెషన్లలో నష్టపోయిన సెన్సెక్స్ ఇంట్రా ట్రేడింగ్లో 800 పాయింట్లు పైగా లాభపడటంతో మార్కెట్ వర్గాలకు కాస్త ఉపశమనం లభించింది. తుదకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 718 పాయింట్లు (2.15 శాతం) రాణించి 34.067.40 పాయింట్లకు చేరింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 220.85 పాయింట్లు (2.2 శాతం) పెరిగి 10,250.85 పాయింట్ల వద్ద ముగిసింది.
'రంగ'రంగ వైభవంగా..
రంగాల వారిగా బీఎస్ఈలో వైద్య సూచీ 4.21 శాతం, రియాల్టీ 3.77 శాతం, కాపిటల్ గూడ్స్ 3.66 శాతం, పీఎస్యూ 3.57 శాతం, బ్యాంకింగ్ 3.20 శాతం చొప్పున అత్యధికంగా లాభపడి మార్కెట్లకు ప్రధాన మద్దతును అందించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంకు నిపుణుల అంచనాలు మించి మెరుగైన ఆర్ధిక ఫలితాలను ప్రకటించడంతో ఆ బ్యాంకు స్టాక్ ఏకంగా 11 శాతం లాభపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల దిద్దుబాటు చర్య (పీసీఏ)ల్లో పలు మార్పులు చేయనున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటన చేయడంతో ఆ రంగం సూచీలకు డిమాండ్ లభించింది. గతేడాదిలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజులు నిఫ్టీలో పీఎస్యూ బ్యాంకింగ్ స్టాక్ 8 శాతం పెరిగింది. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా 12.4 శాతం, కెనరా బ్యాంకు 12.3 శాతం చొప్పున రాణించడం విశేషం. ఈ పరిణామాల మధ్య మార్కెట్లు పెరగడంతో సెన్సెక్స్ మార్కెట్ విలువ రూ.3,08,855 కోట్లు పెరిగింది. నిఫ్టీలో మదుపరి సంపద రూ.1 లక్ష కోట్లు ఎగిసింది. ఒక్క ఐసిఐసిఐ బ్యాంకు మదుపరి విలువ రూ.20,000 పెరిగింది.
పరుగుకు ప్రధాన కారణాలివే..
ొసోమవారం నాటి స్టాక్ మార్కెట్ల జోష్లో బ్యాంకింగ్ రంగ షేర్లు ప్రధాన పాత్ర పోషించాయి. వచ్చే నెల ప్రభుత్వ రంగ బ్యాంకులలో రూ.40,000 కోట్ల మేర మూలధన సాయాన్ని అందించనున్నట్టుగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి సంకతాలు వెలువడడం మార్కెట్లలో నూతనోత్తేజాన్ని నింపాయి. దీనికి తోడు మార్కెట్లలో ప్రభుత్వ సెక్యూరిటీలను కూడా కొనుగోలు చేయనున్నట్టుగా ఆర్బీఐ చేసిన ప్రకటన కూడా మదుపరులను ఆనందపరిచింది. దీనికి తోడు ఐసీఐసీఐ బ్యాంక్ అంచనాలను మించి లాభాలను ప్రకటించడాన్ని మార్కెట్లు సానుకూలంగా తీసుకున్నాయి.
ొ2018 సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో పలు కంపెనీలు మెరుగైన ఆర్ధిక ఫలితాలు ప్రకటించడానికి తోడు మరిన్ని సంస్థల ఫలితాలపై సానుకూల అంచనాలు వెలువడడం కూడా మార్కెట్లకు కలిసి వచ్చాయి.
ొప్రపంచ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర 0.6 శాతం మేర తగ్గి 77.16 డాలర్లకు దిగిరావడం మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి.
ొద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 18 పైసలు పటిష్టమై 73.29కు చేరడం కొనుగోళ్లకు మద్దతునిచ్చింది. తుదకు 03 పైసలు మాత్రమే పెరిగి 73.44 వద్ద ముగిసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Sep 16,2016
మళ్లీ యాంగ్కే ప్రపంచ బ్యాంకు సారథ్యం
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు పగ్గాలు మళ్లీ జిమ్ యాంగ్ కిమ్కే దక్కనున్నాయి. బ్యాంకు అధ్యక్ష పదవికి జిమ్ యాంగ్ నామినేషన్ తప్ప ఇంకెవ్వరి నుంచి నామినేషన్లు రాలేదని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ వెల్లడించింది. దీంతో జిమ్ యాంగ్ కిమ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కొరియన్-అమెరికనైన 56ఏళ్ల జిమ్ యాంగ్ 2012లో తొలిసారి ప్రపంచ బ్యాంకు చీఫ్గా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2017 జూన్ 30న ముగియనుంది. తాజాగా ఆయనకు ఎవ్వరూ పోటీగా నిలవకపోవడంతో రానున్న అయిదేండ్ల పాటు ప్రపంచ బ్యాంకు సారథ్య బాధ్యతలు ఆయనకే దర్కనున్నాయి. అక్టోబరు 7-9వ తేదీ వరకు జరగనున్న ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో అధ్యక్ష ఎన్నికల తంతు పూర్తికానుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 11, Apr 2019, 1:18 PM IST
Highlights
ఎక్కడైనా, ఏ రంగమైనా సాఫ్ట్వేర్, మేనేజ్ మెంట్ నిపుణులకు గిరాకీ నెలకొంది. టాలెంట్ను ఆకర్షిస్తున్న మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్ ఉన్నదని లింక్డ్ఇన్ పేర్కొంది.
హైదరాబాద్: ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్, చండీగఢ్, వడోదరా, జైపూర్ వంటి టాప్ 10 నగరాలు వృత్తి నిపుణులకు గమ్యస్థానాలుగా మారుతున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు అన్ని రంగాల్లోనూ మంచి డిమాండ్ ఉందని లింక్డ్ ఇన్ కంట్రీ మేనేజర్ (ఇండియా) మహేష్ నారాయణన్ తెలిపారు.
దేశీయంగా ఉన్న అతిపెద్ద, శరవేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమలు, అధిక డిమాండ్ కల నైపుణ్యాలు, ఉద్యోగాలకు ముఖ్యమైన గమ్యస్థానాలతో రూపొందించిన నివేదికను ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ విడుదల చేసింది. 2018 ద్వితీయార్ధానికి (జూలై - డిసెంబర్) ఇండియా వర్క్ఫోర్స్ పేరుతో ఈ నివేదిక రూపొందించారు.
ద్వితీయార్ధంలో వృత్తి నిపుణుల ధోరణులు- అగ్రస్థాయి ఉద్యోగాలు సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫైనాన్స్, కార్పొరేట్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ వంటివి ప్లాట్ఫామ్పై అతిపెద్ద పరిశ్రమలుగా ఉన్నాయి. ఈ పరిశ్రమలు ఎక్కువ మందిని నియమించుకున్నాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్ 5 పరిశ్రమల్లో ఫైనాన్స్, వెల్నెస్ అండ్ ఫిట్నెస్, రియల్ ఎస్టేట్, లీగల్, ఎంటర్టైన్మెంట్ స్థానం సంపాదించుకున్నాయి.
ముంబై, హైదరాబాద్ సహా ఐదు నగరాల్లో హెల్త్కేర్ టాప్ 5 పరిశ్రమల్లో ఒకటిగా ఉంది. అతిపెద్ద పరిశ్రమలు, వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమల నియామకాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అగ్రస్థానంలో ఉన్నారు. 2018 ప్రథమార్ధం, ద్వితీయార్ధంలోనే ఇదే ట్రెండ్ ఉంది.వెల్నెస్ అండ్ ఫిట్నెస్ పరిశ్రమలోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అధిక డిమాండ్ ఉంది.
బిజినెస్ మేనేజ్మెంట్కు సంబంధించిన బిజినెస్ ఎనలిస్ట్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ల నియామకాలు కూడా ద్వితీయార్ధంలో అధికంగా ఉన్నాయి. డేటా సంబంధించిత ఉద్యోగాల వాటా పెరుగుతోంది. లీగల్, హెల్త్కేర్ పరిశ్రమల్లో డేటా విశ్లేషకులకు ప్రాధాన్యం పెరుగుతోంది.
అన్ని రంగాల్లోనూ మేనేజ్మెంట్, టెక్నికల్ నైపుణ్యాలకు సమానమైన డిమాండ్ ఉంది. సాఫ్ట్వేర్ అండ్ ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో ఎస్క్యూఎల్, జావా, ప్రొగ్రామింగ్ లాగ్వేజ్ సీ వంటివి టాప్ టెక్ స్కిల్స్గా ఉన్నాయి.
మాన్యుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఎనర్జీ అండ్ మైనింగ్, డిజైన్ ఇండస్ర్టీల్లో ఆటోక్యాడ్కు అత్యధిక డిమాండ్ ఉంది. మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ తర్వాత కస్టమర్ సర్వీస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి సాఫ్ట్ నైపుణ్యాలకు విభిన్న రంగాల్లో మంచి గిరాకీ నెలకొంది.
ఫైనాన్స్, కార్పొరేట్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ పరిశ్రమల్లో మేనేజ్మెంట్ అధిక డిమాండ్ ఏర్పడింది. ముంబై, న్యూఢిల్లీ నగరాలు మేనేజ్మెంట్ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నాయి. బెంగళూరు మాత్రం టెక్నికల్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలపై దృష్టిసారిస్తోంది.
ఎస్క్యూఎల్, సీ, జావా, సీ++, హెచ్టీఎంఎల్ ఎగుమతిలో భారత్ ప్రముఖ ఎగుమతిదారుగా ఉంది. భారత్లోని వృత్తి నిపుణులు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటే ముందుగా అమెరికాను ఎంచుకుంటున్నారు. భారత్ నుంచి వలసవెళ్లే ముగ్గురిలో ఒకరు అమెరికాకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అమెరికా తర్వాతి నాలుగు స్థానాల్లో యూఏఈ, కెనడా, యూకే, ఆస్ర్టేలియా ఉన్నాయి.
దేశంలోని దాదాపు సగం మంది వృత్తి నిపుణులు ఐదు నగరాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటి 1. ఎన్సీఆర్ (ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా) 2. బెంగళూరు 3.హైదరాబాద్ 4.ముంబై 5. చెన్నై ఉన్నాయి. వీటి తర్వాత ఎక్కువ టాలెంట్ను ఆకర్షిస్తున్న నగరాల్లో కోల్కతా, అహ్మదాబాద్, చండీగఢ్ ఉన్నాయి.
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Mahesh Babu Birthday: గ్రాండ్ వెల్కమ్ ‘మహర్షి’.. హ్యాపీ బర్త్ డే!!
మహేష్ష్.. ఆ పేరులోనే మత్తు ఉంది.. స్టైల్ ఉంది.. వైబ్రేషన్స్ ఉన్నాయ్.. అందుకే అమ్మాయిలకు కలల రాకుమారుడు అయ్యాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనంపై సూపర్ స్టార్ అయ్యారు.
Sekhar Kusuma , TNN | Updated:
Aug 9, 2018, 09:55AM IST
మహేష్ష్.. ఆ పేరులోనే మత్తు ఉంది.. స్టైల్ ఉంది.. వైబ్రేషన్స్ ఉన్నాయ్.. అందుకే అమ్మాయిలకు కలల రాకుమారుడు అయ్యాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనంపై సూపర్ స్టార్ అయ్యారు. ఘట్టమనేని నటవారసుడిగా టాలీవుడ్లో ‘రాజకుమారుడి’గా ఎంట్రీ ఇచ్చి ‘యువరాజు’గా వెలుగొంది.. ‘మురారి’తోమెప్పించి.. అమ్మాయిల మనసుదోచే ‘టక్కరిదొంగ’గా మారాడు ఆ ‘ఒక్కడు’.అంతటితో తన ‘దూకుడు’ ఆపకుండా ‘పోకిరి’తో తన ‘ఖలేజా’చూపిస్తూ బాక్సాఫీస్ని షేక్ చేసే ‘సైనికుడి’గా మారాడు. ‘అతిథి’లా అప్పుడప్పుడూ కాకుండా .. పక్కా ‘బిజినెస్మేన్’ వన్ అండ్ ఓన్లీ ‘నేనొక్కడినే’నంటూ ‘స్పైడర్’మేన్లా దూసుకుపోతూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లా విరజిల్లుతున్న‘అతడు’ టాలీవుడ్ ఆరడుగుల ‘శ్రీమంతుడు’ మహేష్ బాబు . ఆగష్టు 9న ఈ రికార్డుల రారాజు పుట్టినరోజుని‘బ్రహ్మోత్సవం’లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా ‘భరత్ అనే నేను’.. రాబోయే ‘మహర్షి’ చిత్రంతో హిట్ ఇస్తానంటూ హామీ ఇస్తున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.
Embarking on my new journey as RISHI. #MAHARSHI https://t.co/xiAylLc2ND
— Mahesh Babu (@urstrulyMahesh) 1533753371000
అందం, అభినయం, ప్రయోగాత్మక కథలు, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావం, వివాదాలకు ఆమడ దూరంలో ఉండే మిస్టర్ పర్ఫెక్ట్, చెరగని చిరునవ్వు, ఆకట్టుకునే అభినయానికి వరించిన అవార్డులు.. ఇదీ మహేష్ గురించి సింపుల్గా చెప్పాలంటే..
నటశేఖర కృష్ణ,ఇందిరదేవి దంపతులకు 1975 ఆగస్ట్9న చెన్నైలో జన్మించిన మహేష్ బాబుకి నేటితో 43 ఏళ్లు. ఇక 2005 ఫిబ్రవరి 10న ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ను ముంబాయిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు గౌతమ్ కాగా, కూతురి పేరు సితార.
| 0business
|
మహానటి విషయంలో తారక్ మాట నిజమైంది
Highlights
మహానటి విషయంలో తారక్ మాట నిజమైంది
‘మహానటి’గా కీర్తి సురేష్ నటించిన తీరు వర్ణించలేనిది.. ఆమె నటన గురించి మాట్లాడాలంటే మాటలు రావడం లేదు. బహుశా సావిత్రి గారే ఆమెతో అలా నటించచేశారేమో’ అంటూ ట్విట్టర్లో మహానటి చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కీర్తి సురేష్ లీడ్ రోల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’ ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. ఈ సందర్భంగా సాధారణ ప్రేక్షకులే కాకుండా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ‘జయహో మహానటి’అంటూ ఈ చిత్రంపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.
ఇక ‘మహానటి’ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి ఆడియో లాంచ్ చేసిన ఎన్టీఆర్ యూనిట్కి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో తన స్పీచ్తో అదరగొట్టేశారు. ‘ఆ ‘మహానటి’ హుందా గురించి, గొప్పదనం గురించి మాట్లాడే అర్హత.. ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలెత్తినా రాదు. ట్రూ లేడీ సూపర్ స్టార్ మహానటి సావిత్రి. ఆవిడ ఔన్నత్యాన్ని పొగిడే అర్హత లేని వారం మేము. కొంత మంది జీవితాలను తెలుసుకోవడం మనకు అవసరం.. కొంత మంది సాధించిన విజయాల్ని ఆదర్శంగా పొందటం అవసరం.
ఒక్కసారి ఈ చిత్రం చూసిన తరువాత ఎందుకు మనం మగాళ్లగా పుట్టాం అని అనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఒక ఆడదాని బలం ఏంటో దట్ ఈజ్ ట్రూ సూపర్ స్టార్ సావిత్రి. ఆడవాళ్లు తలచుకుంటే ఏం సాధించగలరన్నది ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది.. ఈ సినిమా చూసైనా ఆడవాళ్లపై గౌరవిస్తారని భావిస్తా.. సావిత్రిగారు ఎలా పోయారు అని కాదు... ఎలా బతికారు అని కళ్లకు కట్టి చూపించే చిత్రం 'మహానటి'.’ అంటూ ఎన్టీఆర్ ‘మహానటి’ ఆడియో వేడుకలో మాట్లాడిందే సినిమా విడుదల తరువాత అక్షర సత్యాలుగా నిలిచాయి.
| 0business
|
- 5.61 కోట్ల మేర షేర్లు తిరిగి కొనుగోలు
- షేరు ఒక్కింటికి రూ.2,506.50 చెల్లింపు
- మొత్తం బైబ్యాక్ విలువ రూ.16,000 కోట్లకు పైమాటే .
- డివిడెండ్ పాలసీ దిశగా బోర్డు భారీ నిర్ణయం
- దేశంలోనే 'అతిపెద్ద బై బ్యాక్'
ముంబయి: దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ 'టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్' (టీసీఎస్) సోమవారం రూ.16,000 కోట్ల విలువైన భారీ బైబ్యాక్ ఆఫర్ ప్రకటించింది. షేరు ఒక్కింటికి రూ.2,850 చొప్పున దాదాపు 5.61 కోట్ల (2.85 శాతం) ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేసేందుకు బోర్డు సమ్మతి తెలిపినట్టుగా కంపెనీ ఎక్స్ఛేంజీకి వెల్లడించిన సమాచారంలో తెలిపింది. టీసీఎస్ ప్రకటించిన బైబ్యాక్ ఆఫర్ విజయవంతం అయితే దేశంలోనే ఇది అతిపెద్ద బైబ్యాక్ ఆఫర్గా నిలిచిపోనుంది. ఇప్పటి వరకు ఈ ఘనత రిలయన్స్ పేరిట ఉంది. రిలయన్స్ సంస్థ 2012లో దాదాపు రూ.10,400 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ జరిపింది. టీసీఎస్ బోర్డు నిర్ణయంతో టీసీఎస్ కౌంటర్లో ర్యాలీ నమోదు అయింది. ఈ స్టాక్ ఒక్కసారిగా 4.08 శాతం పెరిగి రూ.2,506.50 వద్ద ముగిసింది. గత అయిదు నెలల్లో ఇదే గరిష్ట క్లోజింగ్ కావడం విశేషం. అతిపెద్ద సాఫ్ట్వేర్ మార్కెట్ అయిన అమెరికాలో రక్షణాత్మక ధోరణి వ్యాపారం సన్నగిల్లే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో టీసీఎస్ ఈ భారీ షేర్ల బైబ్యాక్కు రావడం విశేషం. టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్.చంద్రశేఖరన్ నేతృత్వంలో జరగనున్న ఆఖరి బోర్డు సమావేశంలో టీసీఎస్ ఈ భారీ నిర్ణయం తీసుకోవడం విశేషం. టాటా సన్స్ సంస్థలో 73.3 శాతం ఆదాయాన్ని అందించే టీసీఎస్ భారీ నిర్ణయం తీసుకోవడం పట్ల కార్పొరేట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. గత వారం చంద్రశేఖరన్ మాట్లాడుతూ డివిడెండ్ పాలసీపై స్పష్టతనివ్వాలని వాటాదారులు కోరుతున్నట్టుగా తెలిపారు. టీసీఎస్ వద్ద దాదాపు రూ.43,169 కోట్ల విలువపై నగదు నిల్వ ఉంది. ఇది కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు 10 శాతానికి సమానం. బైబ్యాక్ నిర్ణయం ద్వారా ఇందులో అధిక భాగం వాటాదారులకు అందించాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. షేర్ల బైబ్యాక్ వల్ల వాటా ఒక్కింటికి లభించిన ఆదాయం పెరుగుతుంది. అవసరం కంటే ఎక్కువగా ఉన్న నగదు వాటాదారులకు తిరిగి అందిచేందుకు ఇది తోడ్పడనుంది. మందగమన పరిస్థితులు నెలకొన్న తరుణంలో షేర్ ప్రైస్కు ఊతం ఇచ్చేందుకు కూడా ఇది దోహదం చేయనుంది. ప్రతిపాదిత బైబ్యాక్ను స్టాక్ ఎక్స్ఛేంజీలోని మార్పిడి విధానం ద్వారా టెండర్ ఆఫర్ మార్గంలో దామాషా ప్రాతిపాదికన చేపట్టనున్నట్టు కంపెనీ వివరించింది. బైబ్యాక్ నిబంధనలను అనుసరించి ఈ బైబ్యాక్నకు సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ త్వరలోనే ప్రకటించనుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
nlg 2
న్యూజిలాండ్తో వార్మప్ మ్యాచ్ నేడు
లండన్ : ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకంలో భాగంగా టీమిండియా నేడు న్యూజిలాండ్తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్కు దూరమైన భారత్ స్టార్బౌలర్ అశ్విన్ ఈ మ్యాచ్లో బరిలో దిగనున్నాడు. అలాగే ఫిట్నెస్ సమస్యలు అధిగమించి జట్టులో చేరిన మహ్మద్ షమీ మునుపటి ఫామ్ను అందుకుంటాడో లేదో ఈ మ్యాచ్లో స్పష్టంకానుంది. ఆరువారాల పాటు ఐపీఎల్లో అదరగొట్టిన మనవాళ్లకు 50ఓవర్ల వార్మప్ మ్యాచ్లు ఎంతగానో సహాయపడనున్నాయి. ఈ ఏడాది జనవరిలో టీమిండియా ఇంగ్లండ్తో చివరిసారి వన్డే ఆడింది. మళ్లీ ఐదునెలల తర్వాత ఈ ఫార్మాట్లోకి తొలిసారి ఆడినట్లవుతోంది. వరుసగా 13 టెస్టులాడిన తర్వాత అశ్విన్కు విశ్రాంతి అవసరమని భావించిన బిసిసిఐ అతడ్ని ఐపీఎల్కు దూరంగావుంచింది. చాలా రోజుల విశ్రాంతి దొరకడంతో అశ్విన్ తమ జట్టుకు ట్రంప్ కార్డు కాగలడని బోర్డు భావిస్తోంది. తాను కొత్త ట్రిక్కులతో కొత్త ఉత్సాహంతో బంతులేయడానికి సిద్ధంగా వున్నానని ఇటీవలే అశ్విన్ ప్రకటించాడు.
బంతిని రెండువైపులా స్వింగ్ చేయగల మహ్మద్ షమీ, తన వేగాన్ని ఏమాత్రం తగ్గించుకునేది లేదని చెబుతున్నాడు. పేస్బలర్కు వేగమే అవసరమని, తనజోడీ భువనేశ్వర్తో కలిసి కొత్త బంతిని పంచుకో వడం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. రోహిత్శర్మ, శిఖర్ ధావన్లు చాలా కాలం తర్వాత జట్టుకు కలిసి ఆడుతుండటంతో వారి జోడీపై ఒత్తిడి నెలకొంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ధావన్ అదరగొట్టే ఇన్నింగ్స్లు ఆడటం సానుకూలాంశం. యువరాజ్కు జ్వరం : ఇదిలావుంటే నెట్ ప్రాక్టీస్లో యువరాజ్ కనిపించకపోవడం కాస్త ఆందోళన కలిగించేలా వుంది. అతడికి జ్వరం సోకిందని అనధికార సమాచారం. 15 మంది ఆటగాళ్లు ప్రాక్టీస్కు రావాల్సి వున్నా యువరాజ్ మినహా అందరూ మైదానానికి వచ్చారు. రెండు గంటల పాటు ఫుట్బాల్ ఆడిన వారంతా తర్వాత మరిన్ని ఫిట్నెస్ కసరత్తులు చేసారు. సుధీర్ధ ప్రయాణం తర్వాత భారత్ జట్టు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లండన్ చేరుకుంది. వాతా వరణ పరిస్థితులకు కొద్దిగా అలవాటు పడాల్సి వుందని వైద్యులు చెప్పారని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మహిళల క్రికెట్ జట్టు కోచ్ కోసం నేడు ఇంటర్వ్యూలు
మహిళల జట్టుకు కోచ్గా కొన్ని నెలల పాటు ఉండి మిథాలీరాజ్తో గొడవ కారణంగా ఆ పదవి నుంచి దిగిపోయిన రమేష్ పవార్ కూడా పూర్తిస్థాయి కోచ్ పదవికి పోటీ పడుతున్నాడు.
Samayam Telugu | Updated:
Dec 20, 2018, 08:33AM IST
మహిళల క్రికెట్ జట్టు కోచ్ కోసం నేడు ఇంటర్వ్యూలు
హైలైట్స్
కోచ్ బరిలో దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిరెస్టన్ ఉన్నారు.
మిథాలీరాజ్తో గొడవ కారణంగా వైదొలగిన రమేష్ పొవార్ సైతం ఇంటర్వ్యూకు హాజరుకానన్నాడు.
కపిల్దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రామస్వామిలతో కూడి కమిటీ ఇంటర్వ్యూలు చేయనుంది.
భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ నియామకం కోసం బీసీసీఐ నేటి(గురువారం) నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించబోతోంది. భారత పురుషుల జట్టు కోచ్గా ప్రపంచ కప్ను అందించిన గ్యారీ కిరెస్టన్ ఈ రేసులో నిలవడం విశేషం. ఆయన కోచ్గా ఉన్న సమయంలోనే టీమిండియా టెస్టుల్లో తొలిసారి నంబర్వన్ ర్యాంక్ సొంతం చేసుకుంది.
| 2sports
|
పవన్ పార్టీలో హైపర్ ఆది తన పంచ్ పవర్ చూపిస్తాడా?
Highlights
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆయనపై విమర్శలు చేస్తున్నాడని కత్తి మహేష్ పై గతంలో విరుచుకుపడ్డాడు ఆది. కత్తి మహేష్ ను ఉద్దేశిస్తూ జబర్దస్త్ లో ఓ స్కిట్ కూడా చేశాడు. అయితే ఇప్పుడు పవన్ ఛాన్స్ ఇస్తే జనసేన తరఫున ప్రచారం చేయడానికి సిద్ధం అంటున్నాడు ఆది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ తరఫున ఆంధ్రాలో ప్రజా పోరాట యాత్ర చేస్తున్నాడు. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుని ప్రశ్నిస్తూ సంచలనాలకు దారి తీస్తున్నాడు. అయితే మరోపక్క పవన్ పర్మిషన్ ఇస్తే ఆయన పార్టీలో చేరి రాజకీయ సేవ చేయాలని చాలా మంది ఆర్టిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఆయనకు సపోర్టర్స్ లిస్టు రోజురోజుకి పెరిగిపోతుంది.
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆయనపై విమర్శలు చేస్తున్నాడని కత్తి మహేష్ పై గతంలో విరుచుకుపడ్డాడు ఆది. కత్తి మహేష్ ను ఉద్దేశిస్తూ జబర్దస్త్ లో ఓ స్కిట్ కూడా చేశాడు. ఈ విషయంపై పెద్ద వివాదమే జరిగింది. అయితే ఇప్పుడు పవన్ ఛాన్స్ ఇస్తే జనసేన తరఫున ప్రచారం చేయడానికి సిద్ధం అంటున్నాడు ఆది. ఆ విషయాన్ని పవన్ ను కూడా కలిసి చెప్పాడట.
పార్టీలో చేరేప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించుకొని అప్పుడు చేరాలని సూచించాడట పవన్. దానికి సిద్ధమైతే నిజాయితీగా పార్టీలో జాయిన్ అవ్వమని ఆహ్వానించాడని అంటున్నారు. ఒకవేళ ఆది గనుక జనసేనలో జాయిన్ అయితే ఆ పార్టీ ప్రత్యర్ధులపై తనదైన పంచ్ డైలాగ్స్ తో విరుచుకుపడడం ఖాయమని అంటున్నారు. ఇప్పటినుంది పార్టీ కోసం కొన్ని కొటేషన్లు కూడా సిద్ధం చేస్తున్నాడట. మరి జబర్దస్త్ షోలో వేసిన పంచ్ ల అనుభవం రాజకీయాల్లో ఎంతవరకు పని చేస్తుందో చూడాలి!
| 0business
|
Hyderabad, First Published 28, Sep 2018, 6:33 PM IST
Highlights
త్రివిక్రమ్ నుంచి ఒక మల్టీస్టారర్ సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అరవింద సమేత రిలీజ్ హడావుడిలో ఉన్న మాటల మాంత్రికుడు నెక్స్ట్ ప్రాజెక్టును వెంకీతో చేస్తాడని అజ్ఞాతవాసి రిలీజ్ టైమ్ లోనే చెప్పేశారు. త్రివిక్రమ్ కోసం మరోవైపు బన్నీ కూడా వెయిట్ చేస్తున్నాడు
టాలీవుడ్ లో గత కొంత కాలంగా వరుసగా మల్టీస్టారర్ కథలు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగ్ నాని చేసిన దేవదాస్ ఆడియెన్స్ ముందు పరవాలేదనిపించింది. అయితే శ్రీరామ్ ఆదిత్య లాంటి యువ దర్శకుడు కాకుండా బడా దర్శకులు చేస్తే బావుంటుందని ఆడియెన్స్ ఆశపడుతున్నారు. రాజమౌళి చేస్తున్న మల్టీస్టారర్ రావడానికి చాలా సమయం పడుతుంది.
అయితే త్రివిక్రమ్ నుంచి ఒక మల్టీస్టారర్ సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అరవింద సమేత రిలీజ్ హడావుడిలో ఉన్న మాటల మాంత్రికుడు నెక్స్ట్ ప్రాజెక్టును వెంకీతో చేస్తాడని అజ్ఞాతవాసి రిలీజ్ టైమ్ లోనే చెప్పేశారు. త్రివిక్రమ్ కోసం మరోవైపు బన్నీ కూడా వెయిట్ చేస్తున్నాడు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. వెంకటేష్ అల్లు అర్జున్ లు ఇద్దరు కలిసి నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇద్దరితో వేరేగా సినిమా చేస్తాడని ఇన్ని రోజులు ఒక న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు ఒకే కథలో నటించబోతున్నట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడే చెప్పలేము గాని త్రివిక్రమ్ చేతిలో మాత్రం ఒక స్ట్రాంగ్ మల్టీస్టారర్ కథ అన్నట్లు సమాచారం.
Last Updated 28, Sep 2018, 6:33 PM IST
| 0business
|
Nov 01,2019
మాస్క్లతోనే ప్రాక్టీస్
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ క్రికెటర్లకు వాయు కాలుష్య సెగ తప్పలేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండటంతో గత కొన్ని రోజులుగా మబ్బులతో కూడిన వాతావరణం నెలకొంది. భారత్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. దీనిలో భాగంగా భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ క్రికెటర్లు పొల్యూషన్ మాస్క్లు ధరించి ప్రాక్టీస్ చేశారు. ఢిల్లీలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో వేదికను చివరి దశలో మార్చాలని చూసినా అది సాధ్యపడలేదు. దాంతో ఢిల్లీలోనే తొలి టీ20 జరగనుంది. టీ20 సిరీస్లో పాల్గొనే బంగ్లాదేశ్ జట్టు బుధవారం రాజధాని న్యూఢిల్లీకి చేరుకుంది. నవంబర్ 3, 7, 10 తేదీల్లో భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత రెండు టెస్టుల సిరీస్లో ఇరుజట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
భారత్తో కష్టమే కానీ.. బంగ్లానే గెలుస్తుంది
కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో శుక్రవారం రాత్రి శ్రీలంకని ఓడించి ఫైనల్కి చేరిన బంగ్లాదేశ్..
TNN | Updated:
Mar 17, 2018, 08:24PM IST
భారత్తో కష్టమే కానీ.. బంగ్లానే గెలుస్తుంది
కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో శుక్రవారం రాత్రి శ్రీలంకని ఓడించి ఫైనల్‌కి చేరిన బంగ్లాదేశ్.. ఆదివారం భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఈ టోర్నీ లీగ్ దశలో భారత్‌తో తలపడిన రెండు సార్లూ పరాజయం చవిచూసిన బంగ్లాదేశ్ బదులు తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. శుక్రవారం రాత్రి మ్యాచ్ ముగిసే సమయంలో శ్రీలంక ఆటగాళ్లతో గొడవ, విజయానంతరం నాగిని స్టైల్ సంబరాలతో ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచంలో బంగ్లాదేశ్ హాట్ టాఫిక్‌గా మారింది. ఈ ఆత్మవిశ్వాసంతోనే భారత్‌ని తాము ఓడించగలమని బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ శనివారం మీడియా సమావేశంలో ధీమా వ్యక్తం చేశాడు.
‘భారత్ జట్టు బలంగా ఉంది. కానీ.. బంగ్లాదేశ్ వరుస స్ఫూర్తివంతమైన విజయాలో మంచి ఊపు మీదుంది. కాబట్టి.. ఫైనల్లో కూడా ఆ జోరుని బంగ్లా కొనసాగిస్తుందనే నమ్మకం నాకుంది’ అని షకిబ్ అల్ హసన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. శ్రీలంక ఆటగాళ్లతో గొడవ గురించి మాట్లాడుతూ ‘ టీ20 మ్యాచ్ అంటే ఆ మాత్రం భావోద్వేగం, ఉత్కంఠ సహజం. లక్కీగా మేము మ్యాచ్ గెలిచాం. చివరి ఐదు ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఇదొకటి’ అని వివరించాడు. ఆదివారం రాత్రి 7 గంటలకి కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
MUGURUJA
సింగిల్స్ టైటిల్ విజేత ముగురుజ
లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్లో ఐదు సార్లు వింబుల్డన్ టైటిల్ గెలిచిన అమెరికా స్టార్ వీనస్ విలియమ్స్ను స్పెయిన్ భామ ముగురుజ మట్టికరిపించి టైటిల్ను ఎగురేసుకపోయింది. 14వర్యాంకర్ గార్బిన్ ముగురుజా 5సార్లు వింబుల్డన్ విజేతైన 10వ ర్యాంకర్ వీనస్పై 7-5, 6-0తో సునాయాస విజయం సాధించి తొలి వింబుల్డన్ టైటిల్ను సాధించి రికార్డుల కెక్కింది.
ముగురుజా 2016లో ఫ్రెంచ్ ఓపెన్ను టైటిల్ను సాధించింది. తర్వాత ఆమెకు ఇది రెండో గ్రాండ్స్లామ్ టైటిల్ కాగా, తొలి వింబుల్డన్ టైటిల్ కావడం విశేషం. 1990 తర్వాత వింబుల్డన్లో ఫైనల్కు చేరిన తొలి స్పెయిన్ అమ్మాయిగా ముగురుజా ఇప్పటికే ఘనత సాధించిన ముగురుజ ఈవిజయంతో రికార్డుల కెక్కింది. ఈవిజయంతో ముగురుజా డబ్ల్యుడిఏ ర్యాంకింగ్స్లో టాప్ -10లో చోటు దక్కడం ఖాయమైంది. వింబుల్డన్లో వీనస్కు వయసు పెరగడంతో ఆమెను ఎవరూ గట్టిపోటీదారుగా పరిగణించలేదు. కానీ అంచనాలకు మించి వీనస్ తనకు వయసుకు అడ్డంకి కాదని తనలో చావ తగ్గలేదని నిరూపించి ఫైనల్కు చేరింది. కానీ చివరకు ముగురుజా చేతిలో ఫైనల్లో ఓటమి పాలైంది.
| 2sports
|
వానలపై అంత గుబులొద్దు..
- అంచనాలు అన్నివేళలా నిజం కాలేదు
- ప్రతి ఎల్నినోలు ప్రమాదకరంగా మారలేదు
- చరిత్ర ఇదే విషయాన్ని చెబుతోంది: విశ్లేషకులు
- మదుపరులు అతిగా భయపడుతున్నారు
- మార్కెట్ ప్రవేశానికి ఇదే మంచి తరుణం
- ఐటీ, ఫార్మా షేర్లు మేలు: మార్కెట్ నిపుణులు
(నవతెలంగాణ- వాణిజ్య విభాగం)
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ ఏడాది సాధారణం కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందంటూ వెలువరించిన ముందస్తు నివేదిక ప్రభావం ఇప్పటి నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తోంది. మంగళవారం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేట్లను తగ్గించినప్పటికీ స్టాక్ మార్కెట్లు మాత్రం పతన బాటను వీడలేదు. సెన్సెక్స్ దాదాపు 661 పాయింట్ల మేర కుంగింది. దీనికి కారణం తక్కువ వర్షపాతం కారణంగా ద్రవ్యోల్భణం రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందంటూ ఆర్బీఐ ఆర్బీఐ రక్షణాత్మక విధానాన్ని వ్యవహరించడమే. దీనికి తోడు తక్కువ వర్షపాతం నమోదు కారణంగా ఎదురయ్యే పరిస్థితులను తట్టుకొనేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉండాలంటూ కేంద్ర బ్యాంకు సూచించడమూ మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా బుధవారం కూడా మార్కెట్లు కోలుకోలేక పోయాయి. సెన్సెక్స్ దాదాపు 351 పాయింట్ల మేర పతనమైంది.
చరిత్ర ఏం చెబుతోందంటే..
ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలన విస్తృతి ఉత్తర పశ్చిమ భారతంలోని హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్లలో తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపిది. సాధారణ వర్షపాతం కూడా దీర్ఘకాలిక సగటులో 85 శాతం మేరకే ఉండే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. అయితే గత చరిత్రను ఒకసారి పరిశీలించి చూస్తే ఐఎండీ ముందస్తు అంచనాలు అన్ని వేళల సరైనవని తేలలేదు. 2009లో సాధరణ వర్షపాతం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఆ తరవాత తమ అంచనాలను కొంత సవరిస్తూ సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించింది. కానీ ఏడాది చివరకు వచ్చే నాటికి అంచనాలకు భిన్నంగా ఆ ఏడాది భారత్ గత 30 సంవత్సరాలలో ఎన్నడూ లేని కరవును ఎందుర్కొంది. గత మూడు సంవత్సరాలుగా ఐఎండీ వేసిన ముందస్తు అంచనాల్లో కూడా దాదాపు 600 నుంచి 700 బేసిస్ పాయింట్ల మేర హుచ్చుతగ్గులు నమోదు అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అన్ని ఎల్నినోలు ప్రమాదం కాదు..
1950 నుంచి ఇప్పటి వరకు 19 ఎల్నినోలకు భారత్ ప్రభావితమైంది. అయితే ఇందులో 11 సంవత్సరాలలో మాత్రమే భారత్లో సాధారణం కంటే తక్కువ లేదా తక్కువ వర్షపాతం (కరవు లాంటి పరిస్థితి) నెలకొన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 7 సార్లు సాధారణ వర్షపాతం నెలకొందని, ఒక ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసాయని విశ్లేషకులు చెబుతున్నారు. అతిపెద్ద ఎల్నినోగా చెప్పబడే 1997 సంవత్సరంలో కూడా భారత్లో సాధరణ వర్షపాతం నమోదు అయిన సంగతిని మరవొద్దన్నది విశ్లేషకుల మాట.
సగటు కాదు వానల విస్తృతి ముఖ్యం..
సంవత్సరంలో సగటున ఎంత వర్షపాతం నమోదు అయిందన్నది ముఖ్యం కాదని వర్షాల విస్తృతి దేశవ్యాప్తంగా ఎలా ఉందన్నదానిపై వ్యవసాయోత్పత్తి, దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. జులై-ఆగస్టు నెలల్లోనే గరిష్ఠంగా వర్షాలు పడుతుంటాయని, ఈ రెండు నెలల్లో కురిసే వర్షాలే చాలా కీలకమన్నది వారి మాట. గత ఏడాది వర్షపాతంలో కోత సగటుకన్నా కేవలం 12 శాతం మేరను ఉంది. అయితే 20% భూభాగంలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు.
ముందస్తు భయాలు వద్దు..
ఇప్పటి నుంచి తక్కువ వర్షపాతం దాని వల్ల ఆర్థిక వ్యవస్థ కుంగుతున్న ఆందోళన పడడం సరికాదని విశ్లేషకులు చెబుతున్నారు. అంచనాలు అన్ని వేళల కరెక్ట్ అన్ని తేలవన్నది వారి మాట. జులై చివరి నాటికి పరిస్థితి అర్థమవుతుందని వారు చెబుతున్నారు. అయితే కొంత అప్రమత్తంగా ఉండడం తప్పుకాదని.. అలా అని ఇప్పటి నుంచి రక్షణాత్మకంగా వ్యవహరించడమూ సరికాదని వారు మార్కెట్లకు సూచిస్తున్నాయి. వర్షాలపై ఆధారపడని రంగాలైన ఫార్మా, ఐటీ వంటి స్టాక్లపై దృష్టి సారించవచ్చని వారు చెబుతున్నారు.
తక్కువ వర్షపాతం, కరవు అంచనాల నేపథ్యంలో చాలా స్టాక్లు సాధారణం కంటే తక్కువ స్థాయికి కుంగాయని ఈ స్థాయిల వద్ద భయం వదిలి వాటిని కొనుగోలు చేసుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Highlights
వైజయంతీ-తారక్.. ‘మహానటుడు’!
సీనియర్ ఎన్టీయార్- వైజయంతీ మూవీస్.. నాటి తెలుగు ఇండస్ట్రీలో ఒక తిరుగులేని కాంబినేషన్. ఎన్టీయార్ హీరోయిజాన్ని వైజయంతీ ఎలివేట్ చేస్తే.. వైజయంతీ బేనర్ ప్రతిష్టని ఎన్టీయార్ సినిమాలు పెంచేశాయి. ఎదురులేని మనిషి, యుగపురుషుడు లాంటి సినిమాలు చరిత్రలో నిలబడిపోయినవే! కట్ చేస్తే.. జూనియర్ ఎన్టీయార్తో సైతం అదే ‘రిలేషన్’ కంటిన్యూ చేయాలని వైజయంతి అధినేత అశ్వనిదత్ భావించారు. ‘స్టూడెంట్ నంబర్-1’ మూవీతో తారక్- దత్తు కాంబో బాగా గట్టిపడింది. కానీ.. ఇదే వరుసలో వచ్చిన కంత్రి, శక్తి మూవీస్ నిరాశపర్చేశాయి. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని.. వైజయంతి మూవీస్లో సెకండ్ జెనరేషన్ ముందుకొచ్చింది. అశ్వనిదత్ కూతుర్లు మొదలుపెట్టిన కొత్త బేనర్ ‘మహానటి’ మూవీతో సక్సెస్ఫుల్ జర్నీ మొదలుపెట్టేసింది.
మహానటి’ ప్రమోషన్లో తారక్ వాటా కూడా చాలా పెద్దది! ‘మహానటి’ ఊపును కంటిన్యూ చేయాలని భావిస్తున్న దత్ క్యాంప్.. ఇక్కడ కూడా తారక్నే నమ్ముకున్నట్లుంది. తమ బంధం మరింత దృఢపడ్డం కోసం.. మరిన్ని కొత్త ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నట్లు అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. తారక్తో కలిసి వైజయంతీ మూవీస్ చేయబోయే మూవీపై కసరత్తు షురూ అయ్యిందట! ఈ విషయాన్ని అశ్వనీదత్ స్వయంగా చెప్పేశారు. ప్రస్తుతం.. త్రివిక్రమ్, రాజమౌళి ప్రాజెక్టుల్లో చేస్తున్న తారక్.. వైజయంతీ మూవీస్ కోసం మరో ‘సెన్సేషనల్’ డైరెక్టర్ని లైన్లో పెట్టినట్లు.. దత్తు, తారక్ ఇద్దరూ కలిసి విడతల వారీగా ‘స్టోరీ డిస్కషన్స్’లో కూర్చుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. సో.. తారక్#30 భారీతనం ఎంతన్న అంచనాల్లో ఇప్పట్నుంచే మునిపోయింది ఆయన అభిమాన గణం!
Last Updated 16, May 2018, 10:30 AM IST
| 0business
|
kamal haasan's elder brother chandrahasan passed away
కమల్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూత
ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూశారు.
TNN | Updated:
Mar 19, 2017, 11:56AM IST
ప్రముఖ నటుడు కమల్‌హాసన్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూశారు. లండన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి చంద్రహాసన్ మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు. చంద్రహాసన్ కమల్‌కి పెద్దన్నయ్య. వృత్తి రీత్యా లాయర్ అయిన చంద్రహాసన్ తెలుగు, తమిళ భాషల్లో సుమారు 22 చిత్రాల్లో నటించారు. తమ్ముడు కమల్‌హాసన్‌తో కలసి ‘రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్’ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. దీని పర్యవేక్షణ బాధ్యతలు ఆయనే చూసుకుంటున్నారు. ఈ బ్యానర్‌లో ఇప్పటికే ‘విశ్వరూనం’, ‘చీకటి రాజ్యం’, ‘ఉత్తమ విలన్’ సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ‘శభాష్ నాయుడు’ నిర్మాణ దశలో ఉంది.
కాగా, చంద్రహాసన్ భార్య గీతామణి(73) కూడా గత జనవరిలో కన్నుమూశారు. చంద్రహాసన్‌కు కొడుకు, కూతురు ఉన్నారు. వీరిద్దరూ లండన్‌లో స్థిరపడ్డారు. కూతరు అను హాసన్ కూడా తమిళంలో నటించారు. టీవీ షోల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. భార్య మృతిచెందిన తరవాత చంద్రహాసన్ కూతురు వద్దే లండన్‌లో ఉంటున్నారు. శుక్రవారం తీవ్ర గుండెపోటు రావడంతో కూతురు నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. అయితే చంద్రహాసన్ మృతిని కమల్‌హాసన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డైమండ్ బాబు ధ్రువీకరించారు. చంద్రహాసన్ మృతిపై తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. కమల్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
వర్మ కౌంటర్.. ధర్నా చేయడానికి నాకు ఇల్లేలేదు!
రామ్గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించబోతున్నాని ప్రకటించినప్పటి నుంచి టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తుండగా, తాజాగా సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ కూడా స్పందించిన విషయం తెలిసిందే.
TNN | Updated:
Oct 13, 2017, 07:27PM IST
రామ్‌గోపాల్ వర్మ ' లక్ష్మీస్ ఎన్టీఆర్ ' పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించబోతున్నాని ప్రకటించినప్పటి నుంచి టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తుండగా, తాజాగా సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయడం మానుకోవాలని, లేదంటే ఆయన ఇంటిముందు ధర్నాకు దిగుతానని వర్మకు ఆమె వార్నింగ్ ఇచ్చారు. దీనిపై వర్మ వెంటనే విరుచుకుపడుతూ కౌంటర్ ఇచ్చాడు. వాణి గారు, నా ఇంటి ముందు ధర్నా చేయడానికి నాకసలు ఇల్లే లేదు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటా....అప్పుడు మీరు కూడా నన్ను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే సున్నితమైన మీ పాద పద్మాలు కమిలిపోవూ..?' అంటూ వాణీ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తానంటూ ఆర్జీవీ ప్రకటించినప్పటి నుంచీ వివాదం తారాస్థాయికి చేరుకుంది. వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిత, తాజాగా టీడీపీ వైపు చూస్తున్న సినీనటి వాణీ విశ్వనాథ్ కూడా రంగంలోకి దిగారు. వర్మపై విరుచుకుపడ్డారు. దీంతో వర్మ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఘాటుగానే స్పందించారు. ఈ వివాదం ఇంకెంతకాలం కొనసాగుతుందో వేచి చూడాల్సిందే. దీన్ని కేవలం ప్రచారం కోసమే ఈ చిత్రాన్ని ప్రారంభించినట్లు కొందరు పేర్కొంటున్నారు. గతంలోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌ తీయడానికి కూడా వర్మ ప్రయత్నించాడు. దీనిపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో వెనక్కుతగ్గారు.
| 0business
|
Jan 02,2019
ఏడాది తొలిరోజే జిగేలుమన్న పసిడి ధర
న్యూఢిల్లీ : కొత్త ఏడాది తొలి రోజు బంగారం ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో పాటు దేశీయంగా అభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సోమవారం బంగారం, వెండి ధరలు మరింత ప్రియమయ్యాయి. దేశీయంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరిగి వరుసగా రూ.32,470, రూ.32,320గా పలికింది. కిలో వెండిపై రూ.150 భారమై రూ.39,250గా నమోదయ్యింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
Visit Site
Recommended byColombia
ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,600 వద్దనే నిలకడగా ఉంది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా ఉంది. దీంతో ధర రూ.37,400 వద్దనే కొనసాగుతోంది.
Also Read: భారీగా పడిపోయిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర!
బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. కేజీ వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. రూ.670 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,770కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.
Also Read: ఎస్బీఐ అకౌంట్ ఉందా? మీకోసం అదిరిపోయే దీపావళి ఆఫర్లు.. రూ.15,000 క్యాష్బ్యాక్!
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ఔన్స్కు 0.02 శాతం క్షీణతతో 1,504.35 డాలర్లకు దిగొచ్చింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్కు 0.22 శాతం పెరుగుదలతో 17.84 డాలర్లకు చేరింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.
Also Read: రూ.10,000కు రూ.10 వేలు.. రూ.50,000కు రూ.50 వేలు.. ఇక్కడ మీ డబ్బు రెట్టింపు!
బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
| 1entertainment
|
ఎన్టీఆర్ స్థానంలో అల్లు అర్జున్.. ఆ మ్యాజిక్ చేయగలడా?
Highlights
ఎన్టీఆర్ స్థానంలో అల్లు అర్జున్.
బిజీ షెడ్యూల్ లో తారక్
నాని ,బన్నీ వైపే మొగ్గుచూపుతన్న మా టీవి యాజమాన్యం
దక్షిణాదిలో బిగ్బాస్ రియాలిటీ షో లేటుగా స్టార్ట్ అయినా గానీ దానికి వచ్చిన స్పందన అనూహ్యం. తొలి సీజన్కు వచ్చిన రెస్పాన్స్తో రెండో సీజన్కు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. తొలి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా దుమ్ము దులిపేశారు. సీజన్ 2కి ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించడంపై సందేహలు నెలకొన్నాయి. తెలుగులో బిగ్బాస్కు హోస్ట్గా వ్యవహరించినందుకు జూనియర్ ఎన్టీఆర్కు భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం. ప్రతీ ఎపిసోడ్కు యంగ్టైగర్కు రూ.35 లక్షల చొప్పున చెల్లించినట్టు వార్తలు వచ్చాయి. అయితే కొత్త ప్రాజెక్టుల కారణంగా బిగ్బాస్ రియాలిటీషోకు ఎన్టీఆర్ దూరమవుతున్నట్టు సమాచారం.
జై లవకుశ సక్సెస్ తర్వాత తదుపరి చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఎన్టీఆర్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత వెంటనే అంటే అక్టోబర్ నెల నుంచి దర్శకుడు రాజమౌళి రూపొందించే మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రాజెక్టుల ఒత్తిడి కారణంగా బిగ్బాస్ రియాలిటీ షో చేయడానికి ఎన్టీఆర్ సుముఖంగా లేనందున ప్రస్తుతం నిర్వాహకులు అల్లు అర్జున్తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ అంశంపై అటు ఎన్టీఆర్ సైడ్ నుంచి గానీ, ఇటు అల్లు అర్జున్ ఎలాంటి స్పందన గానీ, ప్రకటన గానీ రాకపోవడంతో ఈ వార్తలో వాస్తవం ఎంత అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతున్నది.
బిగ్బాస్ తెలుగు రియాలిటీ షో విషయంలో ఎన్టీఆర్ తన ప్రతిభతో కొత్త ప్రమాణాలు సెట్ చేశాడన్నది వాస్తవం. ఒకవేళ నిజంగా ఎన్టీఆర్ చేయకపోతే టెలివిజన్ ప్రేక్షకులకు కొంత నిరాశే. అయితే అల్లు అర్జున్ హోస్ట్గా ఎలా వ్యవహరిస్తాడో చూడాలి. ఎన్టీఆర్ లోటును తన యాక్టివ్నెస్తో పూడ్చడం సాధ్యమవుతుందా లేదా అనే ఆలోచనలలో యాజమాన్యం ఉన్నట్టు సమాచారం.
మరో వైపు నాని పేరు కూడా ఎక్కవగా వినిపిస్తోంది.
Last Updated 25, Mar 2018, 11:38 PM IST
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రెండో టీ20లో తెలివిగా వ్యవహరిస్తాం..!
భారత్తో బుధవారం రాత్రి జరగనున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా జట్టు కొంచెం తెలివిగా వ్యవహరిస్తే మంచిదని ఆ జట్టు ఫాస్ట్
TNN | Updated:
Feb 20, 2018, 08:05PM IST
భారత్‌తో బుధవారం రాత్రి జరగనున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా జట్టు కొంచెం తెలివిగా వ్యవహరిస్తే మంచిదని ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జూనియర్ డాలా సూచించాడు. గత ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ సఫారీ బౌలర్.. తొలి మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ, సురేశ్ రైనా వికెట్లని పడగొట్టి అందర్నీ ఆకర్షించాడు. కానీ.. మ్యాచ్ మధ్యలో ధావన్ దూకుడు పెంచడంతో లయ తప్పిన డాలా.. చివర్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తనతో పాటు జట్టులోని మిగతా బౌలర్లు కూడా లయ తప్పడంతోనే టీమిండియా భారీ స్కోరు చేసి మ్యాచ్‌పై పట్టు సాధించగలిగిందని ఈ కుర్ర బౌలర్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
‘ఏదైన వ్యూహం సరిగ్గా అమలు చేయలేకపోతే.. అది చెత్తగా కనిపిస్తుంది. నిజాయతీగా చెప్పాలంటే తొలి టీ20లో దక్షిణాఫ్రికా బౌలర్ల వద్ద సరైన గేమ్ ప్లాన్ లేదు. ఈ కారణంగానే.. ధావన్ జోరు పెంచగానే లయ తప్పాం. ఆ సమయంలో రెండో గేమ్ ప్లాన్ మా వద్ద ఉండింటే బాగుండేది. ప్రత్యర్థి ఒక వ్యూహాన్ని చిత్తు చేసినప్పుడు.. జట్టు ఇంకొంచెం లౌక్యంగా వ్యవహరించాలి. రెండో టీ20లోనూ ఓ వ్యూహంతో బరిలోకి దిగుతున్నాం..అయితే.. ఈ సారి తెలివిగా వ్యవహరిస్తాం’ అని జూనియర్ డాలా ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు శిఖర్ ధావన్ (72: 39 బంతుల్లో 10x2, 2x6) జోరుతో 203 పరుగులు చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా 175 పరుగులకే పరిమితమైంది.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఈ‘కిలికిలి’ అర్థమేమిటో?
`బాహుబల`ఫేమ్ ప్రభాకర్ `రైట్ రైట్`లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
TNN | Updated:
Apr 5, 2016, 06:12PM IST
సుమంత్ అశ్విన్ హీరోగా మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం `రైట్ రైట్`. వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పిస్తున్నారు. `బాహుబలి` ఫేమ్ ప్రభాకర్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా జవేరి కథానాయిక. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత జె.వంశీకృష్ణ మాట్లాడుతూ ``మా సినిమా తొలి షెడ్యూల్ను అరకు, ఒడిశాలో 25 రోజులు చిత్రీకరించాం. రెండో షెడ్యూల్ను జనవరి 20 నుంచి 30 వరకు వికారాబాద్లో చేశాం. వికారాబాద్లోని బస్ డిపో, బస్టాండు, ఫారెస్ట్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించాం. మూడో షెడ్యూల్ను ఇటీవల కేరళలో చిత్రీకరించాం. క్లైమాక్స్, పాట, ఛేజ్ సన్నివేశాలను తెరకెక్కించడంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. ఐదు పాటలున్నాయి. శ్రీమణి రాశారు. జె.బి. మంచి ట్యూన్లు ఇచ్చారు. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం. సినిమాను మే నెలాఖరునగానీ, జూన్ ప్రథమార్ధంలోగానీ విడుదల చేస్తాం`` అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ``సుమంత్ అశ్విన్ కెరీర్లో మంచి సినిమా అవుతుంది. `లవర్స్`, `కేరింత` సినిమాల సక్సెస్లో ఉన్న ఆయనకు ఈ సినిమా గుర్తుండిపోతుంది. నాజర్ చాలా అద్భుతమైన పాత్రను పోషించారు. తొలి సగం వినోదాత్మకంగా సాగుతుంది. మలి సగంలో మిస్టరీ ఉంటుంది. మొత్తానికి ఉత్కంఠభరితంగా సాగే చిత్రమవుతుంది. `బాహుబలి` ప్రభాకర్ ఇందులో డ్రైవర్గా, సుమంత్ అశ్విన్ కండక్టర్గా కనిపిస్తారు. మలయాళంలో ఘన విజయాన్ని మూటగట్టుకున్న `ఆర్డినరీ` సినిమా స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నాం. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేశాం. ఎస్.కోట నుంచి గవిటికి వెళ్లే ఓ ఆర్టీసీ బస్సు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. కామెడీ, లవ్, మిస్టరీ అంశాలున్న చిత్రమిది`` అని తెలిపారు. నాజర్, ధనరాజ్, `షకలక` శంకర్, తాగుబోతు రమేశ్, జీవా, రాజా రవీంద్ర, భరత్రెడ్డి, వినోద్, పావని, కరుణ, జయవాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాటలు: శ్రీమణి, కెమెరా: శేఖర్ వి.జోసఫ్, మాటలు: `డార్లింగ్` స్వామి, ఆర్ట్ : కె.ఎమ్.రాజీవ్, కో ప్రొడ్యూసర్: జె.శ్రీనివాసరాజు, నిర్మాత: జె.వంశీకృష్ణ, దర్శకత్వం: మను, సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు.
| 0business
|
ఐదేళ్లలో తెలంగాణలో వందకుపైగా ‘మోంగినిస్ స్టోర్లు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 23 రాష్ట్రా ల్లోను తన ఉనికిని విస్తరించిన మోంగినిస్ బేకరీ సంస్థ తాజాగా తెలంగాణ మార్కెట్కు ప్రవేశించిం ది. మొత్తం 200కుపైగా విభిన్న బేకరీ ఉత్పత్తులతో పటిష్టమైన మార్కెట్ వాటాతో ఉన్న కంపెనీ తెలం గాణలో వచ్చే ఐదేళ్లలో వందకుపైగా ఫ్రాంచైజీ విధా నంలో స్టోర్లు ఏర్పాటుచేస్తామని ప్రకించింది. నగ రంలోని బొల్లారంలో కొత్తస్టోర్ను ఎంపి మల్లారెడ్డి ప్రారంభించారు. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కుమ్హెయిల్ కొరాఖి వాలా, ఎగ్జిక్టూయివ్ డైరెక్టర్లు క్వాసీ ఖొరాకివాలా, ఆలియాస్గర్ ఖక్షరాకివాలా, సిఒఒ అశోక్నాయర్, జాతీయ ఫ్రాంచైజీమేనేజర్ అయ్యప్పన్స్వామి తదితరులు ఈ ప్రారంభోత్స వంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే జి.సాయన్న, వార్డు మెంబరు లోక్నాధ్, గ్రేటర్ టిఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నా రు.
ఈ సందర్భంగా జెఎండి మాట్లాడుతూ తాము ఏర్పాటుచేసే ఒక్కొక్క ఫ్యాక్టరీకి రూ.25 కోట్ల పెట్టు బడులు అవసరం అవుతాయని, కంపెనీ టర్నోవర్ ప్రస్తుతం రూ.700 కోట్లకు చేరిందన్నారుర. ఈజిప్ట్ లో కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వివరిం చారు. 40శాతం ఉత్పత్తులు దీర్ఘకాం మన్నుతాయ న్నారు. సంఘటిత రంగంలో బేకరీ రంగం బిజినెస్ టర్నోవర్ ఐదువేల కోట్లుగా ఉందని, మొత్తం 100 కేక్షాప్ల ఏర్పాటులోహైదరాబాద్, వరంగల్, కరీం నగర్లలో ఎక్కువ ఉంటాయన్నారు. 10-15 ఫ్రాం చైజీ వివరాలు ఇప్పటికే అందాయన్నారు. దేశంలో మొత్తం 16ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయని దీర్ఘకాలం మన్నే ఉత్పత్తులను 1.5లక్షల ఔట్లెట్లలో అందిస్తోం దని, 1500కుపైగాపంపిణీదారులు మొత్తం 23రాష్ట్రా ల్లో పనిచేస్తున్నట్లు ఖొరాకివాలా వివరించారు. దేశ వ్యాప్తంగా ప్రతిరోజుతమ ఔట్లెట్లకు 1.4లక్షల మంది కస్టమర్లు వస్తారని ఇదే తమ నాణ్యతాప్రమాణాలకు నిదర్శనమని ఖొరాకివాలా కుటుంబం ప్రకటించింది.
| 1entertainment
|
Hyderabad, First Published 10, Sep 2019, 2:31 PM IST
Highlights
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తిరిగి సినిమాల్లో నటించే ఉద్దేశం లేనప్పటికీ.. కొన్ని ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో చాలా బిజీగా గడుపుతున్నాడు. జనసేన బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2018 సంక్రాంతికి విడుదలైన అజ్ఞాతవాసి తర్వాత పవన్ మరో చిత్రం చేయలేదు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత కూడా సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమరాయుడు, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో నటించాడు. ఆ సమయంలోనే పవన్ కొందరు నిర్మాతలకు కమిట్మెంట్ ఇచ్చినట్లు వినికిడి. పవన్ కళ్యాణ్ కు అచొచ్చిన నిర్మాత ఏఎం రత్నం. తెలుగు, తమిళ రెండు భాషల్లో రత్నం స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
పవన్, రత్నం కాంబోలో ఖుషి, బంగారం లాంటి చిత్రాలు వచ్చాయి. రత్నంకు శంకర్ లాంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేసిన అనుభవం కూడా ఉంది. కాటమరాయుడు చిత్రం తర్వాత ఏఎం రత్నం కోసం ఓ చిత్రం చేస్తానని పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ పవన్ పూర్తిగా రాజకీయాలతో బిజీ కావడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.
రత్నం, మైత్రి మూవీ మేకర్స్ లాంటి వారి వద్ద పవన్ అడ్వాన్సులు తీసుకున్నట్లు కూడా టాక్. ఇటీవల ఎన్నికలు ముగియడంతో ఏఎం రత్నం మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాడట. ప్రముఖ దర్శకుడు క్రిష్ వద్ద పవన్ కు సరిపడే ఓ కథ ఉన్నట్లు తెలుస్తోంది. నేపథ్యంలో ఉండే ఆ కథని పవన్ కు ఎలాగైనా వినిపించాలని రత్నం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పవన్ మాత్రం ప్రస్తుతం సినిమాలు చేసే మూడ్ లో లేరు.
అదే విధంగా పవన్ ఒకే అంటే సినిమా చేయడానికి మైత్రి సంస్థ కూడా సిద్ధంగా ఉంది.
Last Updated 10, Sep 2019, 5:17 PM IST
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కోహ్లి అక్కడ ఫీల్డర్లని ఉంచు: ధోని
మిడ్ వికెట్, స్కైర్ లెగ్ దిశగా 2-3 ఫీల్డర్లని ఉంచాలంటూ సూచనలు చేయడం మైక్లో రికార్డయ్యింది. అంతేకాకుండా.. కేదార్ జాదవ్ బౌలింగ్ చేస్తుంటే.
TNN | Updated:
Oct 26, 2017, 01:55PM IST
‘జట్టుకి ఒక్కసారి కెప్టెన్ అయితే.. అతను ఎప్పటికీ కెప్టెనే’ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి చెప్పిన మాట ఇది. నిజమే.. వన్డే, టీ20 పగ్గాలు వదులుకున్నా.. ధోనీ మాత్రం ఇప్పటికీ కెప్టెన్‌‌లానే మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేస్తూ.. బౌలర్లకి సూచనలు చేస్తుంటాడు. బుధవారం పుణె వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్‌ని ఔట్ చేసేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లికి, బౌలర్లకి ధోనీ సూచనలిస్తున్న మాటలు కొన్ని స్టంప్‌ మైక్‌లో రికార్డు అయ్యాయి.
గత ఆదివారం జరిగిన వాంఖడే వన్డేలో స్వీప్, రివర్స్ స్వీప్‌లతో శతకం సాధించి కివీస్‌ని గెలిపించిన టామ్ లాథమ్‌ని పుణె వన్డేలో ఔట్ చేసేందుకు ధోనీ వ్యూహం రచించాడు. ఇందులో భాగంగా విరాట్ కోహ్లిని.. మిడ్ వికెట్, స్కైర్ లెగ్ దిశగా 2-3 ఫీల్డర్లని ఉంచాలంటూ సూచనలు చేయడం మైక్‌లో రికార్డయ్యింది. అంతేకాకుండా.. కేదార్ జాదవ్ బౌలింగ్ చేస్తుంటే.. టామ్‌ లాథమ్‌కి ఎలాంటి బంతులు వేయాలో కూడా హిందీలో అతనికి చెప్పడం వీడియోలో కనిపించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లకి అర్థం కాకుండా ధోనీ హిందీలో సూచనలు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడో వన్డే ఆదివారం కాన్పూర్‌లో జరగనుంది.
| 2sports
|
Sep 05,2015
సిప్లా చేతికి రెండు యుఎస్ కంపెనీలు
ముంబయి : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ సిప్లా అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న రెండు ఫార్మాస్యూటికల్ కంపెనీలను కొనుగోలు చేసింది. ఇన్వాజెన్ ఫార్మాస్యూటికల్స్ ఐఎన్సి, ఎక్సెలన్ ఫార్మాస్యూటికల్స్ ఐఎన్సిలను సుమారు రూ.3,630 కోట్ల (550 మిలియన్ డాలర్లు)తో స్వాధీనం చేసుకుంది. డిసెంబర్ 2014 నాటికి ఈ సంస్థల ఉమ్మడి రెవెన్యూ 200 మిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో అమెరికా ఫార్మాస్యూటికల్ మార్కెట్లో తమ విస్తరణకు మరింత దోహదం చేస్తుందని సిప్లా మేనేజింగ్ డైరెక్టర్ సుభను సక్సేనా అన్నారు. ఈ ఎత్తుగడతో సిప్లా వాటా మరింత పెరుగుతుందన్నారు. ముంబయి కేంద్రంగా పని చేస్తోన్న సిప్లా వర్థమాన దేశాల కంటే తన పోటీదార్ల మార్కెట్లపై దృష్టి కేంద్రీకరించడం గమనార్హం. యుఎస్లో రెండు కంపెనీల కొనుగోళ్లతో అక్కడి తయారీ ప్లాంట్లోకి ప్రవేశించినట్లయ్యింది. ఈ కంపెనీలు 32 ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. మరో 30 ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి సిద్దంగా ఉన్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 23, Oct 2018, 10:10 AM IST
Highlights
ప్రముఖ నటుడు అర్జున్ తనను లైంగికంగా వేధించాడని సినిమా షూటింగ్ సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించారని నటి శ్రుతి హరిహరన్ సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ విషయాన్ని అర్జున్ ఖండించారు. ఆయన ఈ విషయంపై స్పందించకపోతే... నిజంగానే ప్రజలు తను తప్పుచేశానని అనుకుంటారని ఆయన క్లారిటీ ఇచ్చాడు.
ప్రముఖ నటుడు అర్జున్ తనను లైంగికంగా వేధించాడని సినిమా షూటింగ్ సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించారని నటి శ్రుతి హరిహరన్ సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ విషయాన్ని అర్జున్ ఖండించారు.
ఆయన ఈ విషయంపై స్పందించకపోతే... నిజంగానే ప్రజలు తను తప్పుచేశానని అనుకుంటారని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా దర్శకుడు కూడా అర్జున్ సెట్ లో అలా ప్రవర్తించలేదని అన్నారు. దీనిపై అర్జున్ కూతురు ఐశ్వర్య సైతం ఫైర్ అయింది.
శ్రుతి కేవలం పబ్లిసిటీ కోసం ఈ విధమైన ఆరోపణలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ విషయంపై మరోసారి శ్రుతి మీడియాతో మాట్లాడారు.. ''ఇలాంటి విషయాలను ఫిర్యాదు చేయడానికి చిత్రపరిశ్రమలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలనేది నా అభిప్రాయం.
నేను నా వేధింపుల గురించి పోస్ట్ చేసినప్పటి నుండి అర్జున్ అభిమానుల నుండి ఆగ్రకుండా ఫోన్లు వస్తున్నాయి. ఇలాంటివి ఎదుర్కోవడానికి సిద్ధమైన తరువాతే నా వేధింపులను బయటపెట్టా.. సూపర్ స్టార్స్ గా రాణించేవారు సెట్స్ లో అవకాశం దొరికినప్పుడు లైంగికంగా వేధిస్తుంటారు'' అని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
భారీ నష్టాలను నమోదు చేసిన స్టేట్ బ్యాంక్
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మరింత ఎక్కువ నష్టాలను చవిచూసింది
Samayam Telugu | Updated:
May 22, 2018, 04:27PM IST
భారీ నష్టాలను నమోదు చేసిన స్టేట్ బ్యాంక్
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మరింత ఎక్కువ నష్టాలను చవిచూసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.7718 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అధికంగా నిరర్ధక ఆస్తులు ఉండటమే ఇందుకు కారణం. అంతకు ముందు సంవత్సరం అదే త్రైమాసికంలో ఈ బ్యాంకు రూ.2814.82 కోట్ల నికర లాభం సాధించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మరింత సొమ్మును మొండి బకాయిలపై కేటాయింపులు జరపాల్సి ఉన్న తరుణంలో ఈ విధమైన ఫలితాలు బ్యాంకింగ్ రంగాన్ని నిరాశపరుస్తున్నాయి.
స్టేట్ బ్యాంక్
నికర వడ్డీ ఆదాయం 10.5శాతం పెరిగి 18,070.72 కోట్ల నుంచి రూ. 19,974 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం 21 శాతం వృద్ధితో రూ. 10,327.50 కోట్ల నుంచి రూ.12,494.78 కోట్లకు పెరిగింది. కేటాయింపులు గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 139.32 శాతం, గత త్రైమాసికంతో పోలిస్తే 48.8 శాతం పెరిగాయి. స్థూల నిరర్ధక ఆస్తులు గతేడాదితో పోలిస్తే 99% పెరిగి రూ.1.12 లక్షల కోట్ల నుంచి రూ.2.23 లక్షల కోట్లకు చేరాయి. ఎస్బీఐ మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 10.91 శాతానికి పెరిగాయి. డిసెంబరు త్రైమాసికంలో ఇవి 10.35% , గతేడాది మార్చి త్రైమాసికంలో 6.90శాతంగా ఉన్నాయి. నికర నిరర్ధక ఆస్తులు 5.73%గా నమోదయ్యాయి. డిసెంబరు త్రైమాసికంలో 5.61శాతం,గతేడాది 3.71శాతంగా ఉన్నాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
Visit Site
Recommended byColombia
Also Read: ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. ‘అకౌంట్ స్టేటస్’ను ఆన్లైన్లో చెక్ చేసుకోవద్దు.. లేదంటే..
Stock Market Highlights..
✺ నిఫ్టీ 50లో భారతీ ఇన్ఫ్రాటెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్ 3 శాతానికి పైగా పెరిగింది.
Also Read: బంగారం ధర కొండెక్కింది.. రూ.500కు పైగా జంప్.. వెండిదీ ఇదే దారి!
✺ అదేసమయంలో జీ ఎంటర్టైన్మెంట్, ఐఓసీ, మారుతీ సుజుకీ, హీరో మోటొకార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి. జీ ఎంటర్టైన్మెంట్ దాదాపు 5 శాతం పడిపోయింది.
✺ నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 3 శాతం పెరిగింది. అదేసమయంలో నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1 శాతానికి పైగా, నిఫ్టీ మీడియా 3 శాతానికి పైగా పడిపోయింది.
Also Read: ఎస్బీఐ బంపరాఫర్.. 35 శాతం తగ్గింపు + 10 శాతం క్యాష్బ్యాక్.. 6 రోజులే గడువు!
✺ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 1.05 శాతం పెరుగుదలతో 62.34 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 0.89 శాతం పెరుగుదలతో 56.70 డాలర్లకు ఎగసింది.
✺ అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి స్వల్ప లాభాల్లో ట్రేడవుతోంది. 7 పైసలు పెరుగుదలతో 70.74 వద్ద కదలాడుతోంది.
| 1entertainment
|
puri next movie with his son
పూరీ.. నెక్ట్స్ ఆ హీరోతోనే..!
‘పైసా వసూల్’ తర్వాత తన తదుపరి సినిమా ఎవరితోనో ప్రకటించాడు దర్శకుడు పూరీ జగన్నాథ్.
TNN | Updated:
Sep 5, 2017, 07:55AM IST
‘పైసా వసూల్’ తర్వాత తన తదుపరి సినిమా ఎవరితోనో ప్రకటించాడు దర్శకుడు పూరీ జగన్నాథ్ . ఈ సారి పూరీ బయటి హీరోతో కాదు, తన ఇంట్లోని హీరోతోనే సినిమాను రూపొందిస్తున్నాడట. పూరీ స్వయంగా ఇచ్చిన సమాచారం మేరకు ఆయన తదుపరి సినిమాలో హీరో ఆయన తనయుడే. ఆకాష్ హీరో గా ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తానని పూరీ ప్రకటించాడు. ఇందుకు సంబంధించి పని పూర్తి చేస్తున్నాను అని.. త్వరలోనే కథను తనయుడికి వినిపిస్తానని పూరీ వివరించాడు.
హీరోగా నటించేది కొడుకు అయినా, తమ్ముడు అయినా.. సబ్జెక్ట్ అయితే వాళ్లకు వివరించాలి కదా.. అని పూరీ చమత్కరించాడు. బాలనటుడిగా తనయుడిని సినిమాకు ఇంట్రడ్యూస్ చేశాడు పూరీ. ఆ తర్వాత ఆకాష్ ప్రధాన పాత్రలో కొన్ని సినిమాలు రూపొందాయి. ‘ధోనీ’వంటి సినిమాలు వచ్చాయి. ఆ మధ్య ‘ఆంధ్రాపోరీ’ అనే సినిమాతో పూరీ తనయుడు ఫుల్ లెంగ్త్ హీరోగా మారాడు. అయితే ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో తనయుడిని హీరోగా పెట్టి పూరీ జగన్నాథ్ ఒక సినిమాను రూపొందించనున్నాడని తెలుస్తోంది. ఇది ప్రేమకథ అట. పూరీ మార్కు ప్రేమకథలు ఎలా ఉంటాయో వేరే వివరించనక్కర్లేదు. మరి తనయుడిని హీరోగా నిలబెట్టడానికి పూరీ సినిమాను ఎలా తీస్తాడో చూడాల్సి ఉంది.
| 0business
|
Hyderabad, First Published 12, Sep 2019, 8:06 PM IST
Highlights
టైటానిక్, అవతార్ లాంటి చిత్రాలతో జేమ్స్ కామెరూన్ ప్రపంచ ప్రఖ్యాతి గడించారు. ప్రపంచ అగ్ర దర్శకులలో ఆయన ఒకరు. ప్రస్తుతం కామెరూన్ అవతార్ 2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ ఏడాది విడుదలైన మార్వెల్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపించింది. అప్పటివరకు వసూళ్ల పరంగా అగ్రస్థానంలో ఉన్న అవతార్ రికార్డుల్ని సైతం అవెంజర్స్ ఎండ్ గేమ్ బద్దలు కొట్టింది.
అవెంజర్స్ గురించి జేమ్స్ కామెరూన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ,ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను భారీ స్థాయిలో అవతార్ 2, 3 చిత్రాలని తెరకెక్కిస్తున్నా. ఎంతో కాష్టపడి చిత్రీకరిస్తున్న ఈ చిత్రాల విషయంలో నాకు భయం కలిగింది.
భవిష్యత్తులో ప్రజలకు తాన్ సినిమాలు చేరువవుతాయా అనే అనుమానం కలిగింది. భవిష్యత్తులో ప్రజలు థియేటర్స్ కి వచ్చి సినిమా చూసే పరిస్థితి ఉండదని భయపడేవాడిని. నా భయాన్ని అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం తొలగించింది. అందుకు నిదర్శనం ఆ చిత్రం సాధించిన విజయమే.
అవెంజర్స్ చిత్రం తనకు అవతార్ 2, 3లపై నమ్మకాన్ని పెంచిందని కామెరూన్ అన్నారు.
Last Updated 12, Sep 2019, 8:06 PM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వివేక్ కుటుంబానికి తమిళ సీఎం పరామర్శ!
కుమారుడిని పోగొట్టుకున్న ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ వివేక్ ను ఆయన కుటుంబాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓదార్చారు
TNN | Updated:
Oct 30, 2015, 04:58PM IST
కుమారుడిని పోగొట్టుకున్న ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ వివేక్ ను ఆయన కుటుంబాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓదార్చారు. పదమూడేళ్ల తనయుడిని కోల్పోవడమంటే ఆయన కుటుంబానికి పెద్ద లోటని జయలలిత పేర్కొన్నారు. కోల్పోయిన కుమారుడి లోటును భరించడానికి భగవంతుడు వారికి శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. వివేక్ తనయుడు ప్రసన్నకుమార్ బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతూ చెన్నైలో 40 రోజుల పాటు చికిత్సపొంది గురువారం నాడు కన్నుమూసిన సంగతి తెలిసిందే.
తండ్రి వివేక్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ తో ప్రసన్నకుమార్ (పాతచిత్రం)
| 0business
|
internet vaartha 232 Views
సంస్థ ఎండి ఎకె మనోచా
న్యూఢిల్లీ : భారతీయ రైల్వే క్యాటరింగ్ టైరిజం కార్పొరేషన్(ఐఆర్సిటిసి) ఈ టికెటింగ్ విభాగం ఈ ఏడాది 27 వేల కోట్లకుపైబడిన టికెట్లను విక్రయించాలని నిర్ణయించింది. ఈ టికెట్ల జారీ ద్వారా రాబడులు పెంచుకోవాలని నిర్ణయించింది. అంతకుముందు సంవత్సరం 22,500కోట్లు నుంచి 20 శాతం పెరగాలని నిర్ణయించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 200 మిలియన్ల టికెట్లు జారీ చేసామని ఈఆర్థిక సంవత్సరంలో టికెట్లు 20-25 మిలియన్ల వరకూ ఉంటాయని ఎండి ఎకె మనోచా వెల్లడించారు. విదేశీ టూరిస్టులకు అంతర్గత క్రెడిట్ కార్డ్ల సాయంతో టికెట్ బుకింగ్ వ్యవస్థను కూడా ప్రారంభించిన ఐఆర్సిటి మొత్తం ఆదాయం 34 శాతంపెరిగి 1490 కోట్లకు చేరిందని అంతకు ముందు సంవత్సరంలో 1100 కోట్లు మాత్రమే వచ్చినట్లు ప్రకటించారు. నికరలాభం కూడా 20శాతం పెరిగి 108 కోట్ల నుంచి 130 కోట్లకు చేరిందని మనోచా వివరించారు. భారతీయ రైల్వేస్ జారీచేస్తున్న సేవా పన్ను లవాటా కూడా 50శాతం వరకూ ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం టికెట్కు 40 రూపాయలు ఛార్జి వసూలుచేస్తోంది. ఎసి తరగతికి 60 రూపాయలుగా ఉంది. మొత్తం 10 మిలియన్ వినియోగదారుల డేటా తస్కరించే ప్రమాదంఉందన్న ఆందోళన వ్యక్తంచేస్తున్న అంశం పై మనోచా మాట్లాడుతూ పూర్తి రహస్యంగాను, భద్రతతోను ఉన్నాయని ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు. ఐఆర్సిటిసి వెబ్సైట్ హాకింగ్ అవుతుందన్న భయం లేదని, 23 విని యోగదారులకు సంబంధించిన 20శాతం డేటా ఐఆర్సిటిసి డేటాతో సరిపోల్చామన్నారు పేర్లు, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీ, నివాస చిరునామా, రాష్ట్రం వంటి వాటిలో ఐగుదురి పేర్లు సరిపోతున్నట్లు తేలిందన్నారు. రోజువారిగా చూస్తే ఐఆర్సిటిసి వెబ్సైట్కు 38సార్లు హ్యాకింగ్ దాడులు జరుగుతున్నాయన్నారు. కొత్త మొబైల్ అప్లికేషన్ను కూడా విడుదల చేస్తున్నా మని కస్టమర్లు ఎయిర్లైన్ టికెట్లు ఐఆర్సిటిపి ప్లాట్ఫామ్పై బుక్చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే ఫుడ్ వెండింగ్ మెషిన్లను పైలట్ ప్రాజెక్టులుగా ఎని మిది స్టేషన్లలో అమలుచేస్తున్నామని వివరించారు.
| 1entertainment
|
ఫొటోస్: విజయనిర్మల పార్థివదేహానికి కృష్ణ - మహేష్ నివాళి
First Published 27, Jun 2019, 1:53 PM IST
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మరణించడంతో కృష్ణ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
విజయనిర్మల పార్థివదేహానికి మహేష్ బాబు నివాళి
హాస్పిటల్ నుండి ఆమె భౌతికకాయాన్ని నానక్ రామ్ గూడలోని ఇంటికి తీసుకొచ్చారు.
ఇంటికి చేరిన విజయనిర్మల పార్థివదేహాన్ని చూసిన కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపించారు.
Recent Stories
| 0business
|
ఛైర్మన్, అనిల్ అగర్వాల్
రూ.లక్షకోట్ల మార్కెట్ విలువలతో వేదాంత
న్యూఢిల్లీ, జూలై 17: భారత్, దక్షిణాఫ్రికా కార్యకలాపాలతో వేదాంత గ్రూప్కంపెనీలు ప్రపంచంలోనే ఆరోఅతిపెద్ద సహజవనరుల కంపెనీగా మారిందని ఛైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు కంపెనీ వార్షిక సర్వసభ్యసమావేశంలో ఆయన తన ప్రగతిని వివరించారు. వేదాంత కుటుంబంలోని కెయిర్న్వాటాదారులకు కూడా కంపెనీ ఎంతో విలువలు చేకూర్చిందన్నారు. ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయల విలువైన మార్కెట్ విలువలతో ఉన్నట్లు వెల్ల డించారు. దేశ ప్రీమియం ఇండెక్స్ నిఫ్టీ50లో కూడా ఉంది.
పన్నులరూపంలో కూడా భారత్ఖజానాకు రూ.40వేల కోట్లు చెల్లించింది. కంపెనీ అతిపెద్ద యాజమాన్యాల్లో ఒకటిగా ఉంటూ తొమ్మిది రాష్ట్రాలఖజానాలకు పన్నులరూపంలో చెల్లింపులుచేస్తు న్నట్లు వివరించింది. ఈ ఏడాది వేలం వేసిన 300 ఖనిజవనరుల బ్లాక్లతో మరింత ఆర్థికవృద్ధి పెరుగుతుందని కంపెనీ ఛైర్మన్ వెల్లడించారు. వీటిలో ఒకటైన చమురు, సహజవాయువు రంగం ఒకటని వీటిని వెలికితీత అనేది ఇప్పటికీ తగినంత ప్రోత్సాహం లేది అన్నారు. ఖనిజాల విషయంలోనూ అదేజరుగుతోందన్నారు. భారత్ జిడిపిలో 25శాతం దాకా తయారీని అధికంచేసేందుకు మేకిన్ ఇండియాలక్ష్యంగా పనిచేస్తున్నట్లు అగర్వాల్ వెల్లడించారు. జింక్, అల్యూమినియం, రాగి ఖనిజాలపరంగా మార్కెట్లీడర్లుగా ఉన్నట్లు ఆయన వివరించారు. రూ.21,437కోట్లతో కంపెనీ నిర్వహణ మార్జిన్ గతేడాదితోపోలిస్తే 41శాతం అధికంగా ఉంది.
గడచిన 15నెలల్లో మన స్థూలరుణాలను రూ.10వేలకోట్లకుపైగా తగ్గించుకున్నట్లు వివరించారు. భారత్లోని యావత్పారిశ్రామిక రంగంలో అంతర్జాతీయ వనరులరంగంలో అత్యంత పటిష్టమైన ఆస్తి అప్పులపట్టీల్లో ఒకటిగా వేదాంత ఉందన్నారు. రికార్డుస్థాయి లో గతఏడాది రూ.7100కోట్ల డివిడెండ్లను రపకటించామన్నారు. ఒక్కొక్కషేరుకు రూ.19.50చొప్పున అదనంగా అనుబంధ సంస్థ హిందూస్థాన్ జింక్ కూడా రికార్డుస్థాయిలో 27,157కోట్ల డివి డెండ్లను ప్రకటించిందన్నారు. దక్షిణాఫ్రికాలో కంపెనీ 2.50లక్షల టన్నుల గామ్స్బెర్గ్ప్రాజెక్టు వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తామ న్నారు. కంపెనీ 1.5 మిలియన్ టన్నుల జింక్, లెడ్సామర్ధ్యం పెంచేదిశగా పనిచేస్తున్నదన్నారు.
హిందూస్థాన్ జింక్ తన సమగ్ర ఉత్పత్తిని 1.2 మిలియన్ టన్నులకు పెంచుకుంటుందని, వెండి ఉత్పత్తిని 700టన్నులకు పెంచుకునే కృషిచేస్తోందన్నారు. రోజుకు 1.90లక్షల బ్యారెళ్ల చొప్పున చమురు ఉత్పత్తి అవుతోందని, భార త్ చమురు ఉత్పత్తిలో 50శాతం వాటాకు చేరుకుంటామన్నారు. అల్యూమినియం పరంగా 1.4మిలియన్ టన్నులుగా ఉందని, గత ఏడాది ఉత్పత్తిరేటతో పోలిస్తే 40శాతం అధికంగా ఉందన్నా రు. అల్యూమినియంపరంగా 2.3మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంకు వస్తున్నట్లు వివరించారు. స్టెరిలైట్ కాపర్ రికార్డు స్థాయిలో గత ఏడాది 4లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తిని సాధించి నట్లు వివరించారు. విద్యుత్రంగపరంగా కూడా తొమ్మిదివేల మెగావాట్లతో నడుస్తోందని, 2017 మేలో వెల్లడించిన ఆర్థిక ఫలితాలపరంగా ఈ ఏడాది మూలధన వ్యయంలో వృద్ధి మరింత పెరుగుదలకు దోహదంచేస్తుందన్నారు. రాగిపరంగా ఉత్పత్తిలో పెరుగుదల 2017 ఆర్థికసంవత్సరం ఉత్పత్తితో పోలిస్తే 65శాతం వృద్ధిని నమోదుచేసింది. వి-కలెక్ట్పేరిట 12వేల మంది వృత్తి నిపుణులు ప్రముఖనిపుణుల మార్గనిర్దేశనం పొందుతారన్నారు.
| 1entertainment
|
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ
First Published 22, May 2017, 6:13 PM IST
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ
Recent Stories
| 0business
|
సౌత్ స్టార్స్.. వాళ్ల క్రేజీ ఫాలోవర్స్!
First Published 2, Oct 2019, 11:47 AM IST
సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత మన సెలబ్రిటీలు అభిమానులకు టచ్ లో ఉండడం ఈజీ అవుతోంది.
సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత మన సెలబ్రిటీలు అభిమానులకు టచ్ లో ఉండడం ఈజీ అవుతోంది. ఫేస్ బుక్ లేని కాలంలో హీరోలకి సంబంధించిన అప్డేట్స్ తెలియాలంటే ప్రెస్ మీట్స్, టీవీల్లో చూసి తెలుసుకునేవాళ్లం. కానీ ఫేస్ బుక్ వచ్చిన తరువాత మన తారలు సినిమా విషయాలతో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అలా ఫేస్ బుక్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న మన సౌత్ స్టార్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!
అల్లు అర్జున్ - 12 మిలియన్ ఫాలోవర్లు
ప్రభాస్ - 10 మిలియన్ ఫాలోవర్లు
మహేష్ బాబు - 5.3 మిలియన్ ఫాలోవర్లు
రామ్ చరణ్ - 5 మిలియన్ ఫాలోవర్స్
విజయ్ - 6.2 మిలియన్ ఫాలోవర్స్
రానా దగ్గుబాటి - 3.2 మిలియన్ ఫాలోవర్స్
నాని - 4.7 మిలియన్ ఫాలోవర్స్
కమల్ హాసన్ - 3.5 మిలియన్ ఫాలోవర్స్
సూర్య శివకుమార్ - 2.8 మిలియన్ ఫాలోవర్స్
జూనియర్ ఎన్టీఆర్ - 3.1 ఫాలోవర్స్
దుల్కర్ సల్మాన్ - 5.1 మిలియన్ ఫాలోవర్స్
నివిన్ పాల్ - 4.5 మిలియన్ ఫాలోవర్స్
మోహన్ లాల్ - 4.9 మిలియన్ ఫాలోవర్స్
నాగార్జున - 2.2 మిలియన్ ఫాలోవర్స్
మమ్ముట్టి - 3.8 మిలియన్ ఫాలోవర్స్
విజయ్ సేతుపతి - 3.3 మిలియన్ ఫాలోవర్స్
పృథ్వీరాజ్ సుకుమారన్ - 3.2 మిలియన్ ఫాలోవర్స్
కార్తి - 2.3 మిలియన్ ఫాలోవర్స్
శివ కార్తికేయన్ - 2.2 మిలియన్ ఫాలోవర్స్
అఖిల్ అక్కినేని - 1.5 మిలియన్
యష్ - 8 లక్షల 58 వేల ఫాలోవర్లు
Recent Stories
| 0business
|
మ్యూచువల్ఫండ్స్ టర్నోవర్ రూ.17.89లక్షలకోట్లు
న్యూఢిల్లీ: భారత్ మూచువల్ఫండ్ రంగం ఆల్టైమ్ రికార్డుస్థాయికి సంపద పెరిగింది. ఫిబ్ర వరి నెల చివరినాటికి మొత్తం 17.89 లక్షలకోట్ల రూపాయలు నిర్వహణ ఆస్తులున్నట్లు తేలింది. ఈక్విటీ, నగదు,మార్కెట్ విభాగాల్లో భారీ మొత్తాలు కుమ్మరించిన ఫండ్ సంస్తలున్నాయి. మొత్తం 43 మంది క్రియాసీలక కంపెనీలు భారత్ లో పనిచేస్తున్నాయి. అసోసియేసన్ ఆఫ్ మూచు వల్ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) అంచనాల ప్రకారం చూస్తే జనవరి చివరినాటికి నిర్వహణ ఆస్తులు 17.37 లక్షలకోట్లుగా ఉన్నాయి. అదికాస్తా ఫిబ్రవరి చివరినాటికి 17.89 లక్షలకోట్లకు దాటింది. రాబడులు, ఈక్విటీ కేటగిరీల్లో ఫండ్స్ పెట్టుబడులు మరింతగా రావడమే ఈ పెరుగు దలకు కారణమని పరిశ్రమరంగ నిపుణులు పేర్కొం టున్నారు. క్రమానుగతమైన పెట్టుబడులప్రణాళి కలు(సిప్) కూడా కొంత వృద్ధికి దోహదంచేసాయని కంపెనీలు భావిస్తున్నాయి. దీర్ఘకాలిక ంగాచ ఊస్తే ఈక్విటీ, బ్యాలెన్స్ ఫండ్స్లలో ఎక్కువ వృద్ధి ఉంటుందన్న సంకేతాలున్నాయి. దీర్ఘకాలిక పొదు పు వాహికల్లోనే భారత్ మూచువల్ఫండ్స్ను వినియోగిస్తున్నట్లు బజాజ్ క్యాపిటల్ జాతీయ అధినతి ఆంజనేయ గౌతమ్ వెల్లడించారు. ఈక్విటీ ఫండ్స్ కూడా మంచి రిటర్నులే ఇస్తున్నాయి. ఇన్వెస్టర్లు స్థిరాస్తికేటగిరీల ఎంపికద్వారా పెట్టు బడులను క్రమబద్ధంచేసుకుంటున్నారని అందు వల్లనే రిటర్నులు పెరుగుతుననట్లు తేలిందని బజాజ్ క్యాపిటల్ అధిపతి వివరించారు. ఫండ్స్ నిర్వహణ ఆస్తులు 2014 మేనెలలోనే 10లక్షల కోట్లను దాటటాయి.
ఈ ఏడాది 20 లక్షలకోట్లకు చేరతాయని ఒక అంచనాకూడా ఉంది. 2017 చివరినాటికి ఈ లక్ష్యంసాధిస్తాయని క్వాంటమ్ మూచువల్ఫండ్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ జిమ్మి పటేల్ వెల్లడించారు. మొత్తం ఫండ్స్లోనికి పెట్టుబడులు గతనెలలో 30,273 కోట్లుగా ఉన్నాయి. వీటిలో ఇన్కమ్ ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టు బడులు మొత్తం 10,864 కోట్లుగా ఉన్నాయి. నగదు రూపంలో ఉన్న ఫండ్స్మనీమార్కెట్ కేటగిరీలో ట్రెజరీబిల్స్, సర్టిఫికేట్ఆఫ్ డిపాజిట్, వాణిజ్యపత్రాలు, స్వల్పకాలిక పెట్టుబడులు వంటివి 8227కోట్లు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో 6462 కోట్లుగా ఉన్నాయి. ఇక గిల్ట్, గోల్డ్ ఇటిఎఫ్లలో ఫండ్ పెట్టుబడులు రూ.772 కోట్లు, రూ.46 కోట్లుగాఉన్నట్లు అం చనా. ఎక్కువసంఖ్యలో ఇన్వె స్టర్ల నుంచి నిధులు సేకరించి వాటిని ఒకేమొత్తం గాచేర్చి అవసరమైన పెట్టుబడులకు వినియోగి స్తారు.స్టాక్మార్కెట్లు, బాండ్లు,మనీమార్కెట్ స్కీంలు వంటి వాటిలో పెట్టుబడులు పెడతారు. ఇన్వెస్టర్ల తరపున అధీ కృత ప్రతినిధులుగా ఫండ్సంస్థల మేనేజర్లు వ్యవహరిస్తారు.
| 1entertainment
|
Feb 28,2019
బంగారం ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: బంగారం ధర బుధవారం మరింతగా పెరిగాయి. రూపాయి పతనం సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. రూపాయి పతనం కూడా పసిడి పరుగుకు దోహదపడింది. బుధవారం రూపాయి 42 పైసలు క్షీణించి 71.49కి పతనమైంది. దీంతో ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరుగుదలతో రూ.34,650కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరుగుదలతో రూ.34,480కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,600 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధర ఔన్స్కు 0.22 శాతం తగ్గుదలతో 15.94 డాలర్ల వద్ద క్లోజయ్యింది. బంగారం ధర బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి. కేజీ వెండి ధర రూ.70 పెరుగుదలతో రూ.41,475కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, వెండి నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు దోహదపడింది. హైదరాబాద్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,530కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,930కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.43,600కు చేరింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
internet vaartha 153 Views
న్యూఢిల్లీ : శ్రీలంక బౌలర్ లసిత్ మలింగా బౌలింగ్ గురించి అందరికి తెలిసిందే.అతనిది చాలా విలక్షణమైన బౌలింగ్. సరికొత్త విధమైన బాడీ లాంగ్వేజ్తో బౌలింగ్ చేసి బ్యాట్స్మెన్ను తికమకపెట్టడం మలింగా స్టైల్.నిన్నటి వరకు ఐపిఎల్లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన మలింగాను ఈసారి అతని అభిమానులు చాలా మిస్సయ్యారనే చెప్పాలి.ఇప్పుడు మిచెల్ మెక్క్లెనగన్,టీమ్ సౌథీ అతడు లేని లోటును పూడుస్తూ ముంబై ఇండియన్స్ తరపున నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. కాగా ఈ నేపథ్యంలో ముంబై ఆటగాడు కృనాల్ పాండ్యా తాజాగా మలింగను గుర్తుకు తెచ్చాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ చాలా విలక్షణమైన బాడీ లాంగ్వెజ్తో బౌలింగ్ చేశాడు.కాగా అచ్చం మలింగను తలపిస్తూ వేసిన బంతి వైడ్ కావ డమే కాకుండా ఏకంగా కీపర్ ప్రయత్నించినా అందకుండా బౌండరీకి వెళ్లింది. దీంతో రోహిత్ సేన ఈ బౌలింగ్ అర్థం కాక కొంత వరకు తిక మకపడింది.
| 2sports
|
Suresh 198 Views
రష్యన్ షూటర్లకు గ్రీన్సిగ్నల్
మాస్కో: రియో ఒలింపిక్స్లో పోటీచేసేందుకు రష్యన్ షూటర్లలకు క్లియరెన్స్ లభించింది. ఈమేరకు అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ సమాఖ్య మంగళవారం 18 మందితో కూడి రష్యన్ బృందానికి రియోలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. షూటర్ల వివరాలతో సంతృప్తిచెందటంతో ఈమేరకు సమాఖ్య నిర్ణయం తీసుకుంది.
| 2sports
|
https://static.langimg.com/thumb/msid-49598299,width-52,imgsize-,resizemode-4/49598299.jpgనిహారిక వీడియో.. చైతూ ప్రోమ
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక తన క్రియేటివిటీని కేవలం ఆన్స్క్రీన్ అప్పీయరెన్స్తో సరిపెట్టకుండా అప్పుడే ఆన్లైన్ సంపాదనపై కన్నేసినట్లు తెలుస్తోంది. టీవీ షోలతో హోస్టుగా బిజీగా వుంటూనే తాజాగా హీరోయిన్ అయ్యేందుకు సిద్ధమైన నిహారిక ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందాలని భావిస్తున్నట్లు టాక్. హీరోయిన్గా మొదటి సినిమా సెట్స్పైకి వెళ్లకముందే నిర్మాతగా మారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరిట ఓ ప్రొడక్షన్ హౌజ్ స్థాపించింది నిహారిక. ఈ ప్రొడక్షన్ హౌజ్పై కొన్ని వెబ్ సిరీస్లని నిర్మించే విధంగా ప్లాన్ చేసుకుంటోందట ఆమె. అందులో భాగంగానే తాజాగా ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ ట్రైలర్ని రిలీజ్ చేసిందామె. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఛానెల్ పేరిట యూట్యూబ్లో ఈ వెబ్ సిరీస్లని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముద్దపప్పు ఆవకాయ్ యూట్యూబ్లోని అన్ని వీడియోల్లా షార్ట్ ఫిలిం కాదని సమాచారం.
నిహారిక
| 0business
|
internet vaartha 229 Views
ముంబై : రిలయన్స్ఇన్ఫ్రా అనుబంధసంస్థ రిలయన్స్ డిఫెన్స్ పారిశ్రామికప్రోత్సాహక మండలి నుంచి 12 పారిశ్రామిక ఉత్పత్తులలైసెన్సులు సాధించింది. కేవలం రక్షణరంగానికి సంబంధించిన యంత్రసామగ్రి తయారీకి మాత్రమే ఈ అనుమతులు ఉన్నట్లు ప్రకటించింది. డిఐపిపి తమ రిలయన్స్ డిఫెన్స్కువ్యూహాత్మక బిజినెస్ యూనిట్లు ఏర్పా టుకు అనుమతులిచ్చిందని రక్షణరంగ అవసరాలకు అనుగుణంగా వీటిని ఉత్పత్తిచేయడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతులు చేసే అవ కాశం ఉందని కంపెనీ ప్రకటించింది. ఏరోస్పేస్ రంగంలో కంపెనీ ఇప్పటికే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ లు, హెలికాప్టర్లు తయారీకి అనుమతి నిచ్చింది. సైనికదళాల అవసరాలప్రకారం చూస్తే అన్నిరకాల వాతావరణ పరిస్థితులు, అన్ని ప్రాంతాల్లోని భూఉపరితల పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే యుద్ధ ట్యాంకులు క్షిపణి వ్యవస్థలను ఉత్పత్తిచేస్తుందని అంచనా. నావికాదళం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర సామగ్రిని ఉత్పత్తిచేసేం దుకు రిలయన్స్డిఫెన్స్కు అనుమతులు లభించాయి. దీనితో జాయింట్ వెంచర్ లేదా రిలయన్స్ సొం తంగా ఇతరసంస్థల సాంకేతిక పరిజ్ఞానం ఒప్పందంతో దేశంలోనే వీటిని ఉత్పత్తిచేసే అవకాశం ఉంది.
| 1entertainment
|
Pulses Stock
పప్పుదినుసుల కొరతపై బ్రిక్స్దేశాల సహకారం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: భారత్లో పప్పుదినుసుల కొరతను అధిగమించేందుకు బ్రిక్స్దేశాల నుంచి సహకారం కోరుతోంది. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్ ను తట్టుకునేందుకు బ్రిక్స్ ఐదుదేశాల సహకారంతో తట్టుకునే అవ కాశంఉందని భారత్ భావిస్తోంది. బ్రిక్స్దేశాలకు ఓరకంగా బిజినెస్ అవకాశాలను కూడా కల్పించినట్లవుతుందని అంచనావేస్తోంది. కాంట్రాక్టు వ్యవసాయం, మిగులుభూమిని లీజుకు తీసుకోవడం, సాం ప్రదాయ పద్ధతుల్లో ఉత్పత్తికి సాగుకు అవస రమైన కార్యాచరణ అమలుచేయడం వంటి వాటిని అమలుచేస్తోంది. బ్రిక్స్దేశాలపరంగా పప్పుదినుసుల కొరతను అధిగమించేందుకు మంచి అవకాశాలున్నాయన్నారు. వ్యవసాయ వాణిజ్యంలో మరింత అవకాశం ఉంటుందని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్సింగ్ వెల్లడించారు. పప్పుదినుసులతో పరస్పర వాణిజ్యం పెరిగి మరింత బిజినెస్ అవకాశాలను పెంచుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటురంగాల పెట్టుబడులను పెంచేందుకు మరింతగా ప్రోత్సాహం అందించనున్నట్లు ప్రకటించారు. పప్పుదినుసులపరంగా భారత్ లో డిమాండ్ సరఫరాల మధ్య వ్యత్యాసం భారీగా ఉంది. రిటైల్ధరలపరంగా మరింతగా ఎక్కువ పెరుగుతున్నాయి. దేశీయ సరఫరాను పెంచేందుకు అవసరమైన కార్యాచరణ అమలు చేస్తున్నా ధరలు దిగిరావాల్సిన అవసరం మరింతగా ఉంది. ప్రభుత్వరంగంలోని ఎంఎంటిసి నుంచి పప్పుదినుసులను మొజాంబిక్ నుంచి దిగుమతి చేసుకుం టున్నట్లు భారత్ ప్రకటించింది. పప్పు దినుసుల దేశీయంగా కొనుగోలుధరలను కనీస మద్దతుధరను కూడా పెంచింది. అంతేకాకుండా మరో 20 లక్షల బఫర్స్టాక్ను నిల్వచేసేందుకు దిగుమతులను మరింతగా పెంచు తోంది. దేశంలో పప్పుదినుసుల దిగుబడులు 2016-17లో 20 మిలియన్ టన్నులుగా ఉంటే డిమాండ్ 23-24 మిలియన్ టన్నుల వరకూ ఉంది. ఈ వ్యత్యాసం కేవలం దిగుమతులద్వారా మాత్రమే భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.
| 1entertainment
|
Visit Site
Recommended byColombia
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.40,100కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ ఎగయడం ధరల పెరుగుదలకు దోహదపడింది.
పెళ్లి సీజన్ కారణంగా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ ఎగయడం వల్ల బంగారం ధరలు పెరిగాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అయితే ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ధరల పెరుగుదల పరిమితంగానే ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్కు 0.38శాతం క్షీణతతో 1,281 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.32,800కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,650కు పెరిగింది. గత రెండు సెషన్లలో బంగారం ధర రూ.190 మేర ఎగసింది.
ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.25,200గా నమోదైంది. వెండి ధర రూ.40,100 కి చేరగా.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.277 పెరుగుదలతో రూ.39,333కి పెరిగింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.77,000 ఉండగా.. అమ్మకం ధర రూ.78,000గా ఉంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
నా కెప్టెన్సీలో ధోనీ 2003 ప్రపంచ కప్ ఆడి ఉంటే?
భారత్ 2003 ప్రపంచకప్ ఫైనల్ ఆడే సమయంలో ధోనీ రైల్వేలో టికెట్ కలెక్టర్గా పని చేస్తున్నాడు. ఈ విషయాన్ని నమ్మకలేకపోతున్నా - ఆత్మకథలో గంగూలీ.
TNN | Updated:
Mar 1, 2018, 11:02AM IST
సౌరభ్ గంగూలీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు 2003 ప్రపంచ కప్ ఫైనల్ చేరిన సంగతి అభిమానులందరికీ గుర్తే. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఆటతీరు కనబర్చిన టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ప్రతి జట్టుపై ఆధిపత్యం చెలాయించిన భారత్ ఆసీస్‌తో జరిగిన ఫైనల్లో తడబడింది. చరిత్ర సృష్టించే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. అలాంటి టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ లాంటి ఆటగాడు ఉండి ఉంటే..?
Visit Site
Recommended byColombia
ఈ మాటలు అన్నది ఎవరో కాదు. అప్పటి జట్టుకు నాయకత్వం వహించిన సౌరభ్ గంగూలీనే. ధోనీని వెలుగులోకి తెచ్చింది గంగూలీ అనే సంగతి తెలిసిందే. 2004లో అతడు భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాడు. ఒక్క ఏడాది ముందుగా.. మహీ జట్టులోకి వచ్చి ఉంటే.. 2003 ప్రపంచ కప్ ఆడి ఉంటే జట్టు ప్రదర్శనలో తేడా కచ్చితంగా కనిపించేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
టీమిండియా ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతున్న సమయానికి ధోనీ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ విషయాన్ని నమ్మకలేకపోతున్నా అని తన ఆటోబయోగ్రఫీ ‘వన్ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్‌‌’లో రాసుకొచ్చాడు.
ఏదేమైనా మహీ విషయంలో నా అంచనా నిజమైంది. తొలి రోజు నుంచే అతడి ఆటతీరు నన్ను ఆకట్టుకుంది. ధోనీ ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదిగాడని దాదా సంతోషం వ్యక్తం చేశాడు. అతడు ఈ రోజేంటో అందరికీ తెలిసిందే. జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడని ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు.
గంగూలీపై ఎంతో గౌరవం కనబరిచే ధోనీ.. అతడి రిటైర్మెంట్ మ్యాచ్‌లో దాదాకు ఆఖరిసారిగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాడు. నాయకత్వ బాధ్యతలను ముందుగా కాదనప్పటికీ.. తర్వాత మాత్రం నో చెప్పలేకపోయానని బెంగాల్ నవాబ్ చెప్పాడు. కానీ మూడు ఓవర్లు కెప్టెన్సీ చేసే సరికి ఏకాగ్రత చూపడం కష్టమైంది. దీంతో మహీకే ఆ బాధ్యతలు అప్పగించాను. ధోనీ.. ఇది నీ పని అని చెప్పాక.. ఇద్దరం నవ్వుకున్నామని గంగూలీ తన ఆత్మకథలో రాసుకొచ్చాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
sandhya 207 Views 14402 crores , BSNL , FY2019 , loss
BSNL
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బిఎస్ఎన్ఎల్ నష్టాలు ఈ ఆర్ధికసంవత్సరంలో 14,202 కోట్లుగా ఉంటాయని అంచనా వేస్తోంది. ప్రభుత్వరంగంలో ఉన్న ఈ సంస్థ రాబాలపరంగా చూస్తే 19,308 కోట్లుగా ఉంటాయనిఅంచనావేసింది. టిలికాం రంగ మంత్రి రవిశంకర్ప్రసాద్ లోక్సభలో వెల్లడించారు.మొబైల్ మార్కెట్లో గట్టిపోటీ ఎదురవుతుండటం, 4జిసేవలపైనే అందరి దృష్టి ఏర్పడటం,డేటా ఆధారితంగానే టెలికాం మార్కెట్ నడుస్తుండటంతో కంపెనీ నష్టాలుపెరిగాయని అంచనావేసింది. రాబడులపరంగా చూస్తే రిలయన్స్జియో వచ్చినతర్వాత 2016 నుంచి రాబడులు తగ్గుతూ వస్తున్నాయి.
మొబైల్ రంగంలో గట్టిపోటీ ఉండటంవల్లనే తక్కువధరలకు విక్రయించాల్సి వస్తోంది. బిఎస్ఎన్ఎల్ వేతనాల ఖర్చు 75శాతం ఉంది. మొత్తం ఖర్చుల్లో 75శాతం వేతనాలే ఉనానయి. 14,488 కోట్లు వరకూ ఈ బిల్లు పెరిగింది 2015-16లో 4859 కోట్లుగాను, 2016-17లో 4793 కోట్లుగాను, 2017-18లో 7993కోట్లుగాను ఉంది. కంపెనీ రాబడులు పరంగాచూస్తే 2018-19లో 19,308 కోట్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరంలో 25,071 కోట్లకంటే భారీగా తగ్గింది. 2016-17లొ 31,533 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. సేవలద్వారానే తక్కువ రాబడులుసాధిస్తోంది. దీనితో ఆర్ధికవనరులపరంగా తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నది.
సిబ్బంది మొత్తం 1.76 లక్షలమంది పనిచేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ కీలక ప్రాధాన్యేతర ఆస్తులనుకుదువపెట్టడం, లేదా నగదీకరించడం వంటి విధానాలతో కొంతపరిపుష్టినిచేకూర్చుకుంటున్నది. బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ కార్యాలయం ఇందుకు సంబంధించి నగదీకరణకు దీపక్కు మొదటి విడతగా కొంత భూమిని గుర్తించి నివేదిక ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉనన భూములను కుదువపెట్టడం, లేదా నగదీకరించడం వంటివాటితో వీటి విలువలు ప్రాథమికంగానే 20 వేల కోట్లవరకూ ఉంటాయని అంచనా.
తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/
| 1entertainment
|
గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 5.8 శాతం పెరిగాయి
GST
న్యూఢిల్లీ: జీఎస్టీ (వస్తుసేవల పన్ను) వసూళ్లు జూలైలో మరింత పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 5.8 శాతం పెరిగాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా జూన్ నెల కంటే కూడా వసూళ్లు పెరిగాయి. జూన్లో వసూళ్లు 99,939 కోట్ల రూపాయలు వసూలు కాగా, జూలైలో అదనంగా 61 కోట్ల రూపాయలతో మొత్తంగా 1.02 లక్షల కోట్ల రూపాయలకు వసూళ్లు పెరిగాయి. కాగా గత సంవత్సరం 96,483 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. 2018 జూలైతో పోల్చుకుంటే గడిచిన నెల వసూళ్లు 5.8 శాతం పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఛీ ఛీ ఇంత దిగజారతారా .. మంచు లక్ష్మి ఆవేదన
తెలుగు సినిమా వాళ్ల గురించి హద్దులు మీరి మాట్లాడుతున్నారని, సినీ నటీమణుల గురించి నోరు జారరని చెబుతూ తెలుగు చిత్ర పరిశ్రమ కన్నెర్ర చేసింది. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆ ఎడిటర్పై పలువురు సినీ పెద్దలు మండిపడ్డారు.
TNN | Updated:
Mar 25, 2018, 12:49PM IST
ఈ విషయాన్ని అంత సులువుగా వదలం: మంచు లక్ష్మి
సినీ పరిశ్రమలో మహిళల గురించి టీవీ చానెల్ ఎడిటర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం మరింత వివాదమయ్యేలా కనిపిస్తోంది. మొదట ప్రత్యేక హోదా విషయం గురించి సినిమా వాళ్లు స్పందించరా.. బానిసలుగానే బతుకుతారా అంటూ ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇష్టం వచ్చినట్లు మాట్టాడారు. తర్వాత అటు వైపు నుంచి వచ్చిన స్పందన చూసి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ విషయమై పోసానితో ఒక టీవీ చానెల్ చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఆ సమయంలో ఓ చానెల్ ఎడిటర్ తెలుగు సినిమా వాళ్ల గురించి నోరు జారరనే దాని దగ్గర అసలు వివాదం ప్రారంభమైంది. తెలుగు సినిమా వాళ్ల గురించి హద్దులు మీరి మాట్లాడుతున్నారని, సినీ నటీమణుల గురించి నోరు జారరని చెబుతూ తెలుగు చిత్ర పరిశ్రమ కన్నెర్ర చేసింది. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆ ఎడిటర్పై పలువురు సినీ పెద్దలు మండిపడ్డారు.
మరింత ముదురుతున్న చానెల్ ఎడిటర్ వ్యాఖ్యల వివాదం
ఇప్పుడు ఇదే విషయంపై తాజాగా మంచు లక్ష్మి స్పందించారు. ''మహిళలందరినీ ఒకేలా చూస్తూ ఆ విధమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదు. విషయం ఏమైనప్పటికీ ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదు. నటీమణులందరినీ టార్గెట్ చేస్తూ దిగజారుడు వ్యాఖ్యలు చేయడాన్ని సినీ పరిశ్రమ స్వాగతించదు. దీన్ని నేను ఖండిస్తున్నా. అంతేకాకుండా దీన్ని అంత సులువుగా వదిలేయం. సినీ పరిశ్రమలో మహిళలపై నీచమైన కామెంట్లు చేయడం ద్వారా పబ్లిసిటీ తెచ్చుకునే ప్రయత్నం వద్దు'' అని మంచు లక్ష్మి తన ట్వీట్లో పేర్కొన్నారు.
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆఖరి బంతి మ్యాజిక్.. కివీస్పై ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ
ఆఖరి బంతికి ఫోర్ కొడితే టై, సిక్స్ కొడితే విన్. క్రీజ్లో కెప్టెన్ విలియమ్సన్. కానీ అద్భుత బంతితో ఇంగ్లాండ్కు విజయాన్ని అందించిన క్రిస్ వోక్స్.
TNN | Updated:
Mar 3, 2018, 05:30PM IST
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. కెప్టెన్ విలియ్సమన్ ఆఖరి వరకూ పోరాడినప్పటికీ.. కివీస్ విజయం ముందు బోల్తాపడింది. ఇన్నింగ్స్ చివరి బంతికి న్యూజిలాండ్‌కు ఐదు పరుగులు అవసరమైన దశలో.. వికెట్లకు దూరంగా క్రిస్ వోక్స్ విసిరిన యార్కర్‌ను ఆడటంలో విలియమ్సన్ విఫలమయ్యాడు. సెంచరీతో అజేయంగా నిలిచినప్పటికీ.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటయ్యింది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్ మీద లక్ష్య చేధనకు దిగిన కివీస్ 12 పరుగులకే ఓపెనర్ గప్టిల్ వికెట్‌ను కోల్పోయింది. కానీ మున్రో (49), విలియ్సమన్ (112 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించారు.
మున్రో అవుటయ్యాక మిడిలార్డర్ నిరాశపర్చడంతో.. న్యూజిలాండ్ జట్టు 103 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో విలియమ్సన్ అజేయ సెంచరీతో పోరాడాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. చివర్లో శాంట్నర్ (41) సాయంతో జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ 45.2 ఓవర్లలో విజయానికి 35 పరుగుల దూరంలో శాంట్నర్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు.
కివీస్ విజయానికి ఆఖరి ఓవర్లో 15 రన్స్ అవసరమయ్యాయి. వోక్స్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి విలియమ్సన్ రెండు పరుగులు రాబట్టాడు. మూడో బంతికి సిక్స్ బాది విజయంపై ఆశలు రేపాడు. నాలుగో బంతికి రెండు పరుగులు చేసిన అతడు.. ఐదో బంతికి పరుగులు చేయలేకపోయాడు. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో.. వోక్స్ వికెట్‌కు దూరంగా విసిరిన యార్కర్‌ను ఆడటంలో విలియమ్సన్ విఫలమయ్యాడు. దీంతో నాలుగు పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ సంబరాల్లో మునిగిపోగా.. ఓటమి బాధలో విలియమ్సన్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
| 2sports
|
TECH
భారత వ్యాపారవేత్తలకు సరళీకృత వీసా
న్యూఢిల్లీ, నవంబరు 7: యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించాలన్న నిర్ణయం తర్వాత బ్రిటన్ కు భారత్ అత్యంత కీలకమైన వాణిజ్యభాగస్వామి గా ఆదేశం భావిస్తోంది. బ్రిటన్ ప్రధాని రెండు రోజుల భారత్ ప్యటనలో భారతీయ వాణిజ్య వేత్త లు, వ్యాపారవేత్తలకు సురళీకృత వీసాలు జారీచేస్తా మని ప్రధాని థెరిసామే హామీ ఇచ్చారు. బ్రిటిష్ ఎయిర్పోర్టులే కాకుండా యూరోపియన్ యూనియ న్ దేశాల్లో కూడా సులువగా రాకపోకలు సాగించేం దుకు అనువైన సరళీకృత వీసాలను బ్రిటన్ మొట్ట మొదటిసారి భారతీయ పారిశ్రామికవేత్తలకు అంది స్తున్నట్లు ప్రకటించారు. గతంలో కూడాభారత్ తమ దేశస్తులకు సరళీకృత వీసా అవసరమని సంప్రదిం పులు జరిపింది. ప్రధాని నరేంద్రమోడీ కూడా సోమ వారం బ్రిటన్ ప్రధాని థెరిసామేను తమ దేశ విద్యా ర్థులు, పరిశోధకులకు స్వేఛ్ఛాయుత రాకపోకలకు అనుమతించాలని కోరారు. ఇండియా యుకె టెక్ సదస్సులో పాల్గొన్న బ్రిటన్ప్రధాని మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఏదేశానికైనా సరే బ్రిటన్లో ప్రవేశించేందుకు సులభతరమైన వీసా అందిస్తామని వీటిని రిజిష్టర్డ్ట్రావెలర్ స్కీంగా ఆమె పేర్కొన్నారు.
బ్రిటన్కు తరచూ పర్యటనలు చేసే భారతీయుల కు ఈవీసా లుజారీ వ ల్ల రెండు దేశాల ఆర్థికవృద్ధికి మరింత మద్దతు నిచ్చినట్లవుతుందని, అంతేకాకుండా బ్రిటన్ ప్రవేశ విధానం మరింత సరళీకృతంచేస్తామని ఆమె పేర్కొ న్నారు. సిఐఐఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు లో ప్రధానిమోడీ పాల్గొన్నారు. బ్రిటన్లో వాణిజ్య సంబం ధాలు మరింతగా పెంపొందించేందుకు వీలుగా యూరోపియన్ కూటమి, యూ రోపియన్ ఎకనమి క్ ఏరియా ప్రాంతం లో పాస్పోర్టు ని యంత్రణ, బ్రిటిష్ ఎయిర్పోర్టు లన్నింటి ద్వారా సులభంగాను స్వేఛ్ఛగా రాకపోకలు సాగించేందుకు సరళీకృత విధానాలు అమలుచేస్తామని వివరించారు. వాణిజ్య విస్తరణకు బ్రిటన్ముందుగా సంసిద్ధంగా ఉందన్నారు. పటిష్టమైన వాణిజ్యం, పెట్టు బడులపరంగా రెండుదేశాల సంబంధాలు మరింత ధృడపడాలని ఆమె ఆకాంక్షించారు. భారత్లోబ్రిటన్ వీసాసేవలు అత్యంత సత్వరమే అందుతున్నాయని, దరఖాస్తుచేసినతర్వాత మౌఖికంగా హాజరయ్యేరోజున నే వీసా అందుతున్న దేశం భారత్అని ఆమె పేర్కొన్నా రు. భారత్లో యుకె వీసా సేవలకోసం మరిన్నికేంద్రా లు ఒక్కభారత్లోనే ఉన్నాయన్నారు.
భారత్ నుంచి అనేకమంది నిపుణులు తమ ప్రతిభ, నైపుణ్యం, ఆలో చనలు, వ్యాపారాలను బ్రిటన్కు తీసుకువస్తున్నందున వారికి బ్రిటన్సర్వదా ప్రాధాన్యతనిస్తుందని రెండుదేశా ల ఆర్థికవ్యవస్థలకు మేలు జరుగుతుందని థెరిస్సామే అభిప్రాయపడ్డారు. ఇరుదేశాలమధ్య వాణిజ్య, పెట్టుబ డుల అంతరాలను తొలగించుకునేందుకు భారత్తో కలిసి పనిచేస్తుందన్నారు. సరళతరమైన వ్యాపారనిర్వ హణకోసం భారత్తో కలిసి పనిచేస్తామని అంతరాలు తొలగిస్తామని ఆమె పేర్కొన్నారు. భారత్లో బ్రిటన్ వ్యాపారాలు నడిచేందుకు ప్రధానిమోడీతో కలిసి ఉమ్మ డిగా కృషిచేస్తామన్నారు. ఉదాహరణగా మేధోహక్కుల సంపత్తి పరిరక్షణనుఆమెవివరించారు. సేవలరంగపరం గా భారత్ మార్కెట్లో మరింత విస్తరిస్తామని దీని వల్ల రెండుదేశాల ఉభయతారకంగా ఉంటుందన్నారు.
| 1entertainment
|
KOHLI
దూసుకురానున్న కోహ్లీ
న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా ఐపిఎల్ -10 సీజన్లో ప్రారంభ మ్యాచ్లకు దూరమైన రాయల్ చాలెంజర్స్బెంగళూరు కెప్టెన్ కోహ్లీ తదుపరి మ్యాచ్కి అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తుంది.శనివారం బెంగళూరు జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్పై విజయం సాధించి ఐపిఎల్ -10లో బోణి కొట్టింది.మ్యాచ్ అనంతరం బెంగళూరు తాత్కాలిక సారథి షేన్ వాట్సన్ మాట్లాడుతూ తదుపరి మ్యాచ్లో కోహ్లీ,డెవిలియన్స్ అందుబాటులో ఉంటారని సంకేతాలు ఇచ్చాడు.భారత్,ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్లో కోహ్లీ గాయపడిన సంగతి తెలిసిందే.దీంతో ఐపిఎల్ -10 సీజన్ లో బెంగళూరు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లకు కోహ్లీ దూరమైయ్యాడు.తాను 120 శాతం ఫిట్నెస్ సాధిస్తేనే మైదానంలో అడుగుపెడతా అని గతంలో కోహ్లీ వెల్లడించాడు.ఏప్రిల్ రెండవ వారం నుంచి కోహ్లీ ఐపిఎల్కు అందుబాటులో ఉంటాడని బిసిసిఐ వర్గాలు ప్రకటించాయి.ఈ నేపథ్యంలో తాజాగా వాట్సన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కోహ్లీ, డివిలియర్స్ మైదానంలో అడుగు పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని వాట్సన్ పేర్కొన్నాడు. ఒకవేళ కోహ్లీ తదుపరి మ్యాచ్లో ఆడితే బెంగళూరు అభిమానులు తమ అభిమాన క్రీడాకారుడిని చేసేందుకు కొంత సమయం వేచి చూడాలి.ఎందుకంటే బెంగళూరు తన తదుపరి మ్యాచ్ పంజాబ్తో ఆడనుంది.ఈ మ్యాచ్ ఇండోర్ వేదికగా ఏప్రిల్ 10న జరుగనుంది.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పాక్ జట్టులో ఫిటెనెస్ పరీక్ష.. ఓ భూటకం
ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఓ భూటకపు ఫిటెనెస్ టెస్టు ద్వారా తనని జట్టు నుంచి తప్పించారని పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్
TNN | Updated:
Aug 19, 2017, 07:45PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఓ భూటకపు ఫిటెనెస్ టెస్టు ద్వారా తనని జట్టు నుంచి తప్పించారని పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఆరోపించాడు. ఇటీవల ఆ జట్టు కోచ్ మిక్కీ ఆర్థర్‌ని దూషించి పాక్ క్రికెట్ బోర్డు నుంచి అక్మల్ షోకాజ్ నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణ తప్పడం, స్థాయికి తగిన ఫిటెనెస్ లేదనే కారణంతో గత కొంతకాలంగా సెలక్టర్లు ఉమర్‌ని జట్టులోకి ఎంపిక చేయకుండా దూరంగా ఉంచుతున్నారు. అతని కాంట్రాక్ట్‌ని కూడా ఈ ఏడాది బోర్డు రెన్యువల్ చేయలేదు.
ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించిన ఫిటెనెస్ పరీక్షల్లో పాసయిన ఉమర్.. బ్యాటింగ్‌లో శిక్షణ కోసం లాహోర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లగా.. అక్కడ కోచ్ మిక్కీ ఆర్థర్‌తో అతనికి గొడవైంది. దీంతో.. కోచ్‌ని దూషిస్తూ.. బోర్డు అనుమతి లేకుండా ఉమర్ మీడియాతో మాట్లాడి షోకాజ్ నోటీసులు అందుకున్నాడు. ‘ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌లో జరిగింది ఓ భూటకపు ఫిటెనెస్ టెస్ట్. నన్ను జట్టు నుంచి తప్పించేందుకే ఆ టెస్టు నిర్వహించారు’ అని ఉమర్ సోషల్ మీడియాలో వెల్లడించాడు.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆ ట్విట్టర్ అకౌంట్లని తొలగించండి: సచిన్
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ తన పిల్లల పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లని వెంటనే తొలగించాల్సిందిగా ట్విట్టర్ని
TNN | Updated:
Oct 17, 2017, 12:41PM IST
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ తన పిల్లల పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లని వెంటనే తొలగించాల్సిందిగా ట్విట్టర్ని కోరారు. అర్జున్ తెందుల్కర్, సారా తెందుల్కర్ పేరుతో వందకి పైగా ఫేక్ ట్విట్టర్ అకౌంట్స్ ప్రస్తుతం ఉన్నాయి. కానీ.. తన పిల్లలు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్స్ని క్రియేట్ చేయలేదని.. కాబట్టి వాటిని తొలగించాల్సిందిగా సచిన్ తాజాగా ట్వీట్ చేశాడు.
2014, ఫిబ్రవరి 1న ఇదే విషయమై సచిన్ తెందుల్కర్ తన ఫేస్బుక్ పేజీలో ‘నా పిల్లలు అర్జున్, సారాకి ఎలాంటి ట్విట్టర్ అకౌంట్స్ లేవు. ప్రస్తుతం ఉన్న వాటిని నమ్మొద్దు’ అంటూ రాసుకొచ్చాడు. కానీ.. ఈ మూడేళ్లకాలంలో మరిన్ని ఫేక్ అకౌంట్స్ వారి పేరుతో క్రియేట్ అవ్వడంతో సచిన్ అసహనం వ్యక్తం చేస్తూ తాజాగా ట్వీట్ చేశాడు. ‘మళ్లీ చెప్తున్నా.. అర్జున్, సారాలు ట్విట్టర్ వాడటం లేదు. వారి పేరుతో ఉండే అకౌంట్స్ని తొలగించాల్సిందిగా ట్విట్టర్ యాజమాన్యాన్ని కోరుతున్నా’ అని సచిన్ ట్వీట్ చేశాడు.
I reiterate the fact that my children Arjun & Sara are not on twitter. We request @Twitter to remove all such accounts at the earliest (1/2) pic.twitter.com/lbcdU546aS
— sachin tendulkar (@sachin_rt) October 16, 2017
Impersonation wreaks havoc, creates misunderstanding & traumatises us. I appeal to the platforms to take corrective measures immediately 2/2
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
#Me Too: నాతో గడపాలన్నాడు, మీద చేయి వేసి..: సింగర్ వర్షా
ఇన్నాళ్లూ మగ అహంకారం వాళ్ల గొంతునొక్కేసినా ‘మీటూ’ ఉద్యమ స్పూర్తితో ఒక్కో గొంతూ స్వరం పెంచుతోంది. పరిశ్రమకు చెందిన ఒక్కో రసికరాజు గుట్టుని బయటకు లాగుతుంది.
Samayam Telugu | Updated:
Oct 16, 2018, 03:58PM IST
#Me Too: నాతో గడపాలన్నాడు, మీద చేయి వేసి..: సింగర్ వర్షా
‘మీటూ’ చీకటికోణాలు ఒక్కొక్కటిగా బాలీవుడ్ని కమ్మేస్తున్నాయి. చిత్ర సీమలో చిరుదివ్వై విరజిమ్మాలనుకున్న ఎంతో మంది హీరోయిన్స్, సింగర్స్, మహిళా ఆర్టిస్టులు కామపు కోరలకు బాధితులవుతున్నారు. ఇన్నాళ్లూ మగ అహంకారం వాళ్ల గొంతునొక్కేసినా ‘మీటూ’ ఉద్యమ స్పూర్తితో ఒక్కో గొంతూ స్వరం పెంచుతోంది. పరిశ్రమకు చెందిన ఒక్కో రసికరాజు గుట్టుని బయటకు లాగుతుంది.
కృతిక, సిమ్రన్, చిన్మయి, సునితా సారథి, ఆశాశైనీ, నిషితా జైన్, తను శ్రీ దత్తా ఇలా ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బాహాటంగా వెళ్లడించి ఉద్యమానికి ఊపునిచ్చారు. తాజాగా ఈ ఉద్యమ స్పూర్తితో మరో సింగర్ వర్షాసింగ్ దనోహ గాయకుడు కైలాష్ ఖేర్ తనతో గడపాలని కోరాడంతో తనకు ఎదురైన లైంగిక వేధింపుల్ని వీడియో రూపంలో బయటపెట్టింది.
ఇప్పటికే సింగర్ సోనా మహాపాత్ర ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా... తాజాగా వర్షా సింగ్ ధనూవ అనే గాయని కైలాష్ ఖేర్ కామ కోరికల చిట్టాను బయటపెట్టింది. ‘కైలాష్ ఖేర్ నాకు ఫోన్ చేశాడు.. మొదట్లో కలవాలన్నాడు. ఆ తర్వాత నీతో గడపాలని ఉందని అన్నాడు. అతని ఉద్దేశం నాకు అర్ధమైంది’ అని అన్నారు. ఈ సందర్భంగా అతనికి భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మ శ్రీ అవార్డ్లను వెనక్కితీసుకోవాలని కోరారు వర్షా సింగ్.
తెలుగులో కైలాష్ ఖేర్.. పండగలా దిగివచ్చావూ (మిర్చి), వచ్చాడయ్యో సారి ( భరత్ అనే నేను), ఏడ పోయినాడో ( అరవింద సమేత) మొదలైన సాంగ్స్తో పాపులర్ అయ్యారు. ఇక హిందీలో టాప్ సింగర్గా తెలుగుతో పాటు, గుజరాతీ, నేపాలీ, తమిళ్, మలయళం, కన్నడ, బెంగాళీ, ఒడియా, ఉర్దూ భాషల్లో అనేక పాటలు పాడారు కైలాష్ ఖేర్.
ఇక ఈయనతో పాటు మరో గాయకుడు తోషి సబ్రి సైతం తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మరో బాంబ్ పేల్చింది వర్షా. వృత్తిపరంగా సింగర్ సబ్రితో పనిచేయాల్సి వచ్చిందని.. ఓ రోజు సాంగ్ రికార్డింగ్ కోసం కారులో వెళ్తుంటే మీద చేయివేసి అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. అంతేకాకుండా తనను మద్యం తాగాలని బలవంతం చేశాడని తీషి సబ్రిపై సంచలన ఆరోపణలు చేసింది వర్షా సింగ్.
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
టి 20: టీమిండియా టార్గెట్ : 246
తొలి టి20లో టీమిండియాపై నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ 245 పరుగుల భారీ స్కోర్ చేసింది
TNN | Updated:
Aug 27, 2016, 09:50PM IST
ప్లోరిడా: రిజినల్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్న టి.20 మ్యాచ్ లో విండీ బ్యాట్స్ మెన్లు భారత బౌరల్లను ఉతికి ఆరేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాట్స్ మెన్లలో ఇవిన్ లెవీస్ సెంచరీతో రాణించగా చార్లెస్ 79 పరుగులతో చక్కటి సహకారాన్ని అందించాడు.. దీంతో విండీస్ కు భారీ స్కోర్ సాధ్యపడింది... టెస్టు సిరీస్ ఓడిన కసితో ఆడిన కరేబియన్ ఆటగాళ్లు తొలి నుంచి చివరి వరకు భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చారు. ఫలితంగా 200 పైచిలుకు స్కోర్ సాధ్యపడింది. అయితే బలమైన బ్యాటింగ్ లైనఫ్ ను కలిగిన భారత బ్యాట్స్ న్లను తక్కవ చేసి చూడలేం.. కోహ్లీ విజృంభణ తోపాటు భారత బ్యాట్స్ మెన్లలందరూ సమిష్ఠిగా రాణిస్తే ఈ స్కోర్ ను చేధించడం అసాధ్యమేమి కాదు. ఇదిలా ఉండగా టీమిండియా విక్టరీపై అభిమానుల కొండత ఆశతో ఉన్నారు.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రానా ఆ దున్నతో ఇలా ఫైట్ చేశాడా!
‘బాహుబలి’.. భారత సినీ చరిత్రలో ఓ సెన్సేషన్. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
TNN | Updated:
Apr 10, 2017, 04:11PM IST
‘బాహుబలి’.. భారత సినీ చరిత్రలో ఓ సెన్సేషన్. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2015లో వచ్చిన ఈ సినిమా అద్భుత ఛాయాగ్రహణం, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్‌ని మెచ్చుకోనివారుండరు. అయితే ఈ సినిమాలో బాహుబలి పాత్రకు ఎంత ప్రధాన్యత ఉందో ప్రతికథానాయకుడి పాత్ర భళ్లాలదేవకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భళ్లాలదేవగా దగ్గబాటి రానా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో రానాకు, పొగరుబోతు దున్నపోతుకు మధ్య ఫైట్ సీన్ అదుర్స్.
అయితే ఇదంతా వీఎఫ్‌ఎక్స్ మాయని మనందరికీ తెలుసు. కానీ ఆ సన్నివేశాన్ని ఎలా చిత్రీకరించారో చూస్తే మీరు ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అసలు దున్నపోతు లేకుండా ఉన్నట్టు ఊహించుకుని దాంతో అరివీర భయంకరంగా పోరాడుతున్నట్లు నటించడమంటే ఆషామాషీ కాదు. కానీ రానా ఈ సీన్లో చెలరేగిపోయాడు. గాల్లో పైకెగిరి దున్నపోతు పుర్రె పగలగొట్టి మట్టికరిపించాడు. ఈ సీన్‌ని ఎలా చిత్రీకరించారో బాహుబలి టీం ఓ వీడియో ద్వారా చూపించింది. ఫేస్‌బుక్‌లో గతేడాది జనవరిలో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 33 లక్షల మంది వీక్షించారు. 48,249 మంది షేర్ చేశారు. మరి మీరూ ఓ లుక్కేయండి..
| 0business
|
Apr 12,2017
30 లక్షల మార్క్కు ప్యాసింజర్ వాహన అమ్మకాలు
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం 2016-17లో దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా తొలిసారి 30 లక్షల మైలురాయిని దాటింది. దీంతో ఈ విభాగంలో 9.23శాతం వృద్ధి నమోదైంది. 2017 మార్చితో ముగిసిన త్రైమాసికానికి ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు 30,46,727 యూనిట్లుగా నమోదు కాగా.. ఇంతక్రితం ఏడాది ఈ అమ్మకాలు 27,89,208 యూనిట్లుగా ఉన్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చర్స్ (సియామ్) వెల్లడించింది. దీనికితోడు ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన వాటిలో ప్యాసింజర్ వాహనాలతో పాటు యుటిలిటీ వాహనాలు, మోటార్సైకిల్, స్కూటర్స్ ఉన్నట్టు సియామ్ డిప్యూటీ డైరెక్టర్ సుగాటో సేన్ పేర్కొన్నారు. గతేడాది యుటిలిటీ వాహన విక్రయాలు 5,86,576 యూనిట్లకుగానూ ఈ సారి 29.91శాతం వృద్ధితో 7,61,997 యూనిట్లకు ఎగిసింది. దేశీయంగా కార్ల అమ్మకాలు 3.85 శాతం పెరిగి 21,02,966 యూనిట్లకు చేరాయి. మోటార్ సైకిల్ అమ్మకాలు 3.68 శాతం పెరిగి 1,10,94,543 యూనిట్లకు చేరాయి. హీరో ఒక్కటే 56,93,681 యూనిట్లను విక్రయించింది. స్కూటర్ల విక్రయాలు 11.39 శాతం పెరిగి 56,04,601 యూనిట్లకు చేరాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
అతిపెద్ద గ్యాస్ పైప్లైన్ యోచనలో ఐఓసీ
- 1987 కి.మీ. నిడివి మేర నిర్మాణం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్' (ఐఓసీ) దేశంలోనే అతిపెద్ద గ్యాస్ పైపులైన్ నిర్మించాలని యోచిస్తోంది. ప్రస్తుతం గెయిల్ నిర్వహణలో ఉన్న 1,415 కి.మీ. పొడవైన జామ్నగర్-లోని గొట్టపు మార్గమే ఇప్పటి వరకు దేశంలో అతిపెద్ద గ్యాస్ పైపులైన్గా చలామణి అవుతూ వస్తోంది. ఈ మార్గం గుండా గెయిల్ ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల ఎల్పీజీని సరఫరా చేస్తూ వస్తోంది. దీనికి తోడు గెయిల్ అధ్వర్యంలోని 623 కి.మీ. వైజాగ్- సికింద్రాబాద్ పైపులైన్, 274 కి.మీ. పానిపట్-జలంధర్ పైపులైన్లు నిర్వహణలో ఉన్నాయి. అయితే వంటగ్యాస్కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో గుజరాత్ తీరం నుంచి తూర్పు ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్ వరకు దాదాపు 1,987 కి.మీ. నిడివితో ఎల్పీజీ గ్యాస్ పైప్లైన్ను నిర్మించాలని ఐఓసీ యోచిస్తోంది. గుజరాత్లోని ఖాండ్లా తీరంలో ఎల్పీజీ గ్యాస్ను దిగుమతి చేసుకొని దానిని ఈ పైపులైన్ ద్వారా అహ్మదాబాద్, ఉజ్జయిని, భూపాల్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, లక్నో నగరాల మీదుగా గోరఖ్పూర్ వరకు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఏడాదికి 3.75 మిలియన్ టన్నుల ఎల్పీజీని ఈ మార్గం ద్వారా సరఫరా చేయనున్నారు. ఖాండ్లా పోర్టుతో పాటుగా గుజరాత్లోని ఐఓసీ కోయలీ రిఫైనరీ ఉత్పత్తి నుంచి కూడా ఎల్పీజీని సరఫరా నిమిత్తం సంస్థ తీసుకోనుంది. ఇకపోతే దేశంలోని మొత్తం 18 కోట్ల ఎల్పీజీ వినియోగదారుల్లో సగం మంది ఐఓసీ ఖాతాలోనే ఉండడంతో డిమాండ్ను తట్టుకొనే ప్రక్రియలో భాగంగా ఈ పైప్లైన్ ప్రాజెక్టు దిశగా సంస్థ యోచిస్తోంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Huelva, First Published 12, Sep 2019, 11:40 AM IST
Highlights
తమిళ్ బిగ్బాస్-3 అత్యంత ఎమోషనల్గా సాగుతోంది. తాజాగా బిగ్బాస్ హౌజ్లోకి కుటుంబసభ్యులను అనుమతించారు. దీంతో తమ ఆత్మీయులను చూసి కంటెస్టెంట్స్ భావోద్వేగానికి లోనయ్యారు.
తమిళ బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. తాజాగా హౌస్ లోకి కుటుంబ సభ్యులను అనుమతించారు. దీంతో తమవారిని చూసిన హౌస్ మేట్స్ ఎమోషనల్ అయ్యారు. కొంతమంది ఆనందంతో ఏడ్చేశారు. అయితే నటి, యాంకర్ లోస్లియాకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది.
చాలా కాలం తరువాత కూతురిని చూసిన లోస్లియా తండ్రి ఎమోషనల్ అవ్వలేదు సరికదా.. తన కూతురిపై కోప్పడ్డాడు. దానికి కారణం బిగ్ బాస్ హౌస్ లో లోస్లియా తన తోటి కంటెస్టంట్ కెవిన్ తో క్లోజ్ గా ఉంటోంది. వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో లోస్లియా తండ్రి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను నిన్ను ఇలానే పెంచానా..? అంటూ కూతురితో గొడవ పడ్డాడు. తన తండ్రి కోప్పడుతూ తిట్టడంతో లోస్లియా కన్నీళ్లు పెట్టుకుంది.మరో కంటెస్టంట్ చేరన్.. లోస్లియా తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత లోస్లియా తండ్రిని హత్తుకొని ఏడ్చింది. బిగ్బాస్ హౌస్లో లోస్లియా తండ్రి వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
టీవీ చానెల్లో కూతురిని దూషించడం పద్ధతి కాదంటూ నెటిజన్లు లోస్లియా తండ్రిపై మండిపడుతున్నారు. ప్రేక్షకుల హృదయాలను గెలుస్తూ ఇన్నాళ్లు బిగ్బాస్ పోటీలో ఉండగలిగినందుకు లోస్లియాను చూసి ఆమె తండ్రి గర్వపడాలి కానీ, ఇలా తిట్టడం ఏంటంటూ నిలదీస్తున్నారు. లోస్లియా-కెవిన్ ల మధ్య లవ్ ఎఫైర్ సాగుతున్నట్లు హైలైట్ చేస్తోన్న హోస్ట్ కమల్ హాసన్, బిగ్ బాస్ లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
| 0business
|
Jan 22,2019
నెలాఖరుకు మారుతీ కొత్త కారు
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్బ్యాక్ మోడల్ కారు బాలెనో ఆర్ఎస్ను కొత్త హంగులతో ముస్తాబు చేస్తోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త అప్డేట్స్తో మారుతీ బాలెనో ఆర్ఎస్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను ఆకర్షణీయంగా కంపెనీ తీసుకొస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నెల చివరకు మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ కారు ధర రూ.8.53 లక్షల (ఎక్స్షోరూం, ఢిల్లీ) దరిదాపుల్లో ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. 1.0 లీటర్ పెట్రోలు బూస్టర్ జెట్ టర్బో ఇంజిన్తో మరింత శక్తివంతంగా ఈ కారును కంపెనీ రూపొందించింది. ముందు బంపర్లో మార్పులతో పాటు పాత హెచ్ఐడీ ల్యాంప్స్కు బదులుగా కొత్త ఎల్ఈడీ హెడ్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ను మారుతీ ఈ కారులో అమర్చింది. అలాగే వెనుక వైపు డిస్క్ బ్రేక్లను, బ్లాక్ అండ్ సిల్వర్ డ్యుయల్ టోన్ కొత్త అల్లోరు వీల్స్ను కొత్తగా జోడించింది. డార్క్ గ్రే కలర్లో ఇంటీరియర్ డిజైన్ను ఇచ్చింది. దీంతోపాటు స్మార్ట్ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టంను స్మార్ట్ఫోన్ నావిమాప్స్ నావిగేషన్ ఆప్తో అప్డేట్ చేసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
VISHA15
అంచనాలను అధిగమించిన ఇన్ఫోసిస్
బెంగళూరు, అక్టోబరు 14: సాప్ట్వేర్ సేవల్లో దేశంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ రెండోత్రైమాసికం ఫలితాలు మార్కెట్ అంచనాలకు మించగలిగాయి. ముందురోజు విడుదలైన టిసి ఎస్ ఫలితాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు నిపుణుల అంచనా. రెండోత్రైమాసికం ఫలితాలు నికరలాభం 6.1శాతం పెరిగింది. కంపెనీ నికరలాభం అంతకుముందు ఏడాది సెప్టెంబరు త్రైమా సికంలో వచ్చిన రూ.3398 కోట్ల నికరలాభంతో పోలిస్తే పెరిగింది 3606 కోట్లు ఆర్జించినట్లు ప్రకటించింది. అయితే మార్కెట్నిపుణులు నికరలాభం 3526 కోట్లుగా ఉంటుందని అంచనా వేసారు. నికరలాభం జూన్త్రైమాసికంలో 3436 కోట్లుగా ఉంది. 4.94శాతంగా నమోదయింది. ఇన్ఫోసిస్ బోర్డు తాత్కాలిక డివిడెంట్ 11రూపాయలు చొప్పున ప్రకటిం చింది. కంపెనీ రాబడులు 17,310 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదేకాలంలో 16,782 కోట్లుతో పోలిస్తే 3.14శాతం పెరిగింది. గత ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో రాబడులు 15,635 కోట్లుగా ఉన్నాయి. 10.71శాతం వృద్ధిని సాధిం చింది. ఇన్ఫోసిస్ తన రాబడుల వృద్ధి లక్ష్యాన్ని రెండోసారి కుదించింది. మూడునెలల్లో రెండోసారి రాబడి అంచనాలను కుదించింది. వ్యాపార రంగంలో నెలకొన్నఅనిశ్చితి ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకొచ్చింది. దీనితో మార్కెట్లో కంపె నీ షేర్లు ఐదుశాతం కంటే దిగువన ముగిసాయి. 2017 మార్చి నాటికి కంపెకనీ స్థిరమైన రాబడుల వృద్ధితో ఉంటుందని అంచ నా వేసింది. 8నుంచి 9శాతం రాబడుల్లో పెరుగుదల నమో దవుతుందని అంచనా. జూలైలో కంపెనీరాబడులు 10.5నుంచి 12శాతంగా ఉంటాయని అంచనా వేసారు. తదనంతరం 13.5 శాతం తగ్గుతాయని మరోసారి అంచనావేసింది. భారత్లో 150 బిలియన్ డాలర్లకుపైబడి ఉన్న సాప్ట్వేర్ సేవలరంగం ఎక్కువగా ఉత్తర అమెరికా, యూరోప్ దేశాల రాబడులపైనే ఆధారపడి నడుస్తుంది. రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బ్రిటన్ బ్రెగ్జిట్ అనంతరం ప్రభావం వంటివి కంపెనీకి ఉన్న పాశ్చాత్యదేశాల క్లయింటపై భారం మోపుతాయన్న అంచనా లున్నాయి. ఆగస్టులోనే ఇన్ఫోసిస్ బిజినెస్ కొంతమేర మందగ మనం నెలకొంటుందని హెచ్చరించింది. జూన్లోనే బ్రిటన్ బ్రెగ్జిట్ వోట్కు వెనువెంటనే ఈ వ్యాఖ్యలు కూడా చేసింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్సిక్కా మాట్లాడుతూ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కంపెనీ అర్ధసంవత్సర ఫలితాలకు అద్దం పడతాయని, రానున్న కాలం లో కూడా బిజినెస్ తీ రుతెన్నులు కొం త అనిశ్చిత ఆవహి స్తుందని అన్నారు. 5.3శాతం దిగజారి తర్వాత కంపెనీ షేర్లు బిఎస్ఇలో 1027.20 చొప్పున బిఎస్ఇలో ట్రేడింగ్ జరిగాయి. కంపెనీకి కొత్తగా 78మంది క్లయింట్లు ఉన్నట్లు వెల్లడించింది. దీనితో మొత్తం క్రి యాశీల కంగా కంపెనీకి ఉన్న క్లయింట్లు 1136 మంది ఉన్నట్లు ఇన్ఫోసిస్ వివరించింది. రాబడులు తగ్గుతాయని ముందుగానే ప్రకటించిన ఇన్ఫోసిస్ 52వారాల కనిష్టస్థాయికి షేర్లుచేరాయి. ఒకదశలో రూ.996 వద్దట్రేడింగ్ జరిగింది. ఇక డాలర్ రాబడుల పరంగాచూస్తే రెండో త్రైమాసికంలో 2,587 మిలియన్ డాలర్లుగా ఉంది. మార్కెట్ అంచనాలు 2563 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డాలర్ రాబడుల్లో సైతం మార్కెట్ అంచనాలను అధిగమించింది. ఆపరేటింగ్ మార్జిన్ చూస్తే 80 బేసిస్ పాయింట్లు లాభపడింది. అంతకుముం దు త్రైమాసికంతో పోలిస్తే 24.9 శాతంగాఉంది. 2020 నాటికి రాబ డులు 20 బిలియన్ డాలర్లతో కంపెనీ ఆర్థికపరిపుష్టి మరింత బలపడు తుందని అంచనావేసారు. రెండోత్రైమా సిక ఫలితాలపట్ల సిఇఒ విశాల్సిక్కా పూర్తి సంతృప్తిని వ్యక్తంచేశారు. కీలకంగా ఉన్న ఐటి సేవల బిజినెస్ మంచి ప్రగతిని సాధించిందని ఆర్బిఎస్తో కాంట్రాక్టు రద్దయినందున రాబడుల్లో కొంత కోత పడిందని అన్నారు. ప్రతి ఐదురూపాయల ముఖ విలువ ఉన్న షేరుకు రూ.11 చొప్పున తాత్కాలిక డివి డెండ్ను ప్రకటించింది. డివిడెండ్ చెల్లింపులకు అక్టోబరు 24వ తేదీ నిర్ణయించినట్లు న్రపకటించింది. ఈనెల 26వ తేదీనాటికి డివిడెండ్ చెల్లింపులు పూర్తి అవుతాయన్నారు.
| 1entertainment
|
Suresh 242 Views
షమీకి స్థానం కష్టమే:
మీర్పూర్: నేటి నుంచి జరిగే టి 20ప్రపంచ కప్ లో పేసర్ మహ్మద్ షమీకి జట్టులో చోటు దక్కటం కష్టమేనని భారత కెప్టెన్ ధోనీ వ్యాఖ్యానించారు. గాయంతో జట్టునుంచి వైఐదొలగిన షమీ ఫిట్నెస్ నిరూపించుకున్నా.. తిరిగి జట్టులోకి తీసుకోవటం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం రాణిస్తున్న జస్ప్రీత్ బుమ్రా, అశీష్ నెహ్రాల్లో ఎవరిస్థానంలోఊ అతన్ని జట్టులోకి తీసుకోలేమని అన్నారు. సమతుల్యం ఉన్న జట్టులో మార్పులు , చేర్పులు అవసరం లేదన్నారు.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రికార్డ్: రేస్లో దూసుకొచ్చిన మెగా మేనల్లుడు
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’ ట్రైలర్ యూట్యూబ్లో మాంచి రన్నింగ్ స్పీడ్తో దూసుకుపోతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమైన ఫీట్ను ఈ యంగ్ మెగా హీరో అందుకుని రేస్లోకి దూసుకొచ్చారు.
TNN | Updated:
Feb 13, 2017, 09:07PM IST
సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ‘విన్నర్’ ట్రైలర్ యూట్యూబ్‌లో మాంచి రన్నింగ్ స్పీడ్‌‌తో దూసుకుపోతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమైన ఫీట్‌ను ఈ యంగ్ మెగా హీరో అందుకుని రేస్‌లోకి దూసుకొచ్చారు. ఆదివారం ఉదయం ‘విన్నర్’ ట్రైలర్ రిలీజ్ కాగా... సోమవారానికి 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడంతో మెగాఫ్యామిలీ టాప్ హీరోలు చిరు పవన్ రాంచరణ్ బన్నీ సరసన చేరాడు. ఈ ట్రైలర్‌ను టాప్ డైరెక్టర్ వివి వినాయక్ రిలీజ్ చేశారు.
అయితే ఈ ట్రైలర్ రెస్పాన్స్ అదిరిపోవడానికి రిలీజ్‌కి ముందే ఈ సినిమా పాటలను మహేష్ బాబు, సమంత లాంటి స్టార్స్‌తో ఒక్కొక్కటిగా సాంగ్స్ రిలీజ్ చేయించడమే కాకుండా.. అనసూయ ఐటమ్ సాంగ్ సుయ.. సుయ... యూట్యూబ్‌లో దుమ్ముదులిపేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది.
| 0business
|
internet vaartha 114 Views
ముంబై : ప్రైవేటురంగంలోనిఇండస్ ఇండ్ బ్యాంకు నికరలాభాలు తొలిత్రైమాసికంలో 26 శాతం పెరిగి 661.38 కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు ప్రకటించింది. నికరవడ్డీ ఆదాయం 38శాతం పెరి గిందని, వడ్డీయేతర ఆదాయం కూడా 28శాతం పెరిగింది. నికరవడ్డీ మార్జిన్ 3.97శాతంగా ఉంది. కేటాయింపుల కవరేజిరేషియో 59శాతంగా ఉంది. స్థిరాస్తులపైరిటర్నులు 1.94 శాతంగా ఉంది. కేపిటల్ అడ క్వసీ రేషియో 15.26శాతం గా ఉన్నట్లు బ్యాంకు ప్రకటించింది. నికరలాభం 525.404 కోట్ల నుంచి 661.38కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 922.72 కోట్ల నుంచి 1233.79 కోట్లకు పెరిగింది. 34శాతం వృద్ధి ఉన్నట్లు ప్రక టించింది. వడ్డీ ఆదాయం 1356.42కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదేకాలంలో 980.66 కోట్లుగా ఉంది. నికరవడ్డీ మార్జిన్ కూడా 3.68శాతంనుంచి 3.97శాతానికి పెరిగింది. నికర నిరర్ధక ఆస్తులు మొత్తం అడ్వాన్సుల్లో 0.38శాతంగా ఉంది. ఇక కరెంటుసేవింగ్స్ ఖాతా నిష్పత్తి 34.43శాతంగా ఉంది. గత ఏడాది 34.68 శాతంగా ఉంది. మొత్తం అడ్వాన్సులు 93,678 కోట్లు జారీ చేసినట్లు ప్రకటించింది. 30శాతం వృద్ధి నమోదుచేసా మని బ్యాంకు ప్రకటించింది. డిపాజిట్లు 1,01,768 కోట్లుగా ఉన్నాయి.31శాతంవృద్ధిని సాధించింది. బ్యాంకు మొత్తం వ్యాపారం 1,95,446 కోట్లుగాఉంది. మొత్తంశాఖలు 1004గా ఉన్నాయి.1885 ఎటిఎంలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. గుజరాత్లోని గిఫ్ట్సిటీలో కూడా బ్యాంకు తన అంతర్జాతీయ ఆర్థికసేవల కేంద్రాన్ని ప్రారంభించిం దని ఎండిసిఇఒ రోమేష్ సోబ్తి వెల్లడించారు.
| 1entertainment
|
హోమ్ క్రీడలు అఫ్రిదీ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన గౌతం గంభీర్
అఫ్రిదీ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన గౌతం గంభీర్
August 06, 2019, 3:48 PM IST
Share on:
జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విమర్శలకు బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఘాటుగా స్పందించాడు. మానవ హక్కుల గురించి అఫ్రిది మాట్లాడటం చాలా సంతోషకరమని అన్నారు. అయితే మానవ హక్కుల ఉల్లంఘన పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మాత్రమే జరుగుతోందనే విషయాన్ని చెప్పడం ఆయన మర్చిపోయారని ఎద్దేవా చేశారు. అఫ్రిది కంగారు పడాల్సిన అవసరం లేదని, అన్ని విషయాలను తాము చూసుకుంటామని అన్నారు.
సంబంధిత వార్తలు
| 2sports
|
Sep 18,2017
ఇన్ఫోసిస్కు మరో ఎదురు దెబ్బ!
బెంగళూరు : దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ మధ్య కాలంలోనే ఆ కంపెనీ సీఈవో విశాల్ సిక్కా రాజీనామా మర్చిపోకముందే తాజాగా మరో సీనియర్ అధికారి వైదొలిగారు. ఇన్ఫోసిస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజరు రాజగోపాలన్ రాజీనామా చేసినట్టు సోమవారం ప్రకటించారు. 2014 ఆగస్టు నుంచి ఇన్ఫీలో పని చేస్తున్నట్టు తెలిపారు. సిక్కా రాజీనామా అనంతరం రాజగోపాలన్ కూడా కంపెనీ నుంచి వైదొలుగుతారని అంచనాలు వెలువడ్డాయి. కంపెనీ అభివృద్ధిలో రాజగోపాలన్ గత కొంత కాలంగా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.