news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
శివం దుబెకు పిలుపు
Fri 25 Oct 03:06:50.753822 2019
ముంబయి ఆల్రౌండర్ శివం దుబెకు భారత జట్టు పిలుపు అందింది. దేశవాళీ, ఐపీఎల్లో భయమెరుగుని క్రికెట్ ఆడుతున్న శివం దుబె సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టిని ఆకర్షించాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు భారత జట్టుకు ఎంపికయ్యాడు. 2015లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేసిన కేరళ యువ సంచలనం సంజూ శాంసన్కు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు.
| 2sports
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ
| 1entertainment
|
England 4th test
ఇంగ్లండ్ భారీ స్కోరు
ముంబై: టీమిండియాతో జరుగుతున్న నాలుగవ టెస్టులో ఇంగ్లండ్ తొలిరోజు గురువారం ఆటముగిసే సమయానికి 5 వికెట్లకు 288 పరుగులు చేసింది.దీంతో ఓపెనర్లు కుక్ 46 పరుగులు,జెన్నింగ్ 112 పరుగలతో సెంచరీ చేసి మెరుగైన ఆరంభం ఇచ్చారు.దీంతో సిరీస్లో తొలిసారి ఇంగ్లండ్ జట్టు కుదురుకున్నట్లు కనిపించింది.అయితే జడేజా సంధించిన బంతికి కుక్ పెవిలియన్కు చేరాడు.అనంతరం జో రూట్ 21 పరుగుల వద్ద అశ్విన్ మాయాజాలానికి బొల్తా కొట్టాడు.కాగా తరువాత వచ్చిన మెయిన్ అలీ 50 పరుగులతో జెన్నింగ్స్తో కలిసి కుదురుకున్నాడు.హాఫ్ సెంచరీ సాధించి ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేశాడు. తరువాత స్వీప్ షాట్కు యత్నించి కరుణ్ నాయర్ చేతికి చిక్కాడు.అనంతరం సెంచరీ సాధించిన జెన్నింగ్ కు గుడ్ లెంగ్త్ బంతిని సంధించిన అశ్విన్ ఫలితం రాబట్టాడు.పుజారా చక్కని క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ జట్టు నాలుగవ వికెట్ కోల్పోయింది.
అనంతరం బెయిర్ స్టో 2 పరుగుల వద్ద ఊరించే బంతని సంబంధించిన అశ్విన్ ఉచ్చులో పడి పెవిలి యన్కు చేరాడు.దీంతో క్రీజులో బెన్ స్టోక్స్25 పరుగులు,జోస్ బట్లర్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.దీంతో తొలిరోజు ఆటముగిసే సమయా నికి ఇంగ్లండ్ జట్టు 94 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది.టీమిండియా బౌలర్లులో అశ్విన్ నాలుగు వికెట్లు తీసుకోగా, జడేజాకు ఒక వికెట్ లభించింది.దీంతో 30 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ నాలుగు వికెట్లు తీయడం విశేషం. అశ్విన్ మాయాజాలం నాలుగవ టెస్టు తొలిరోజు పేస్కు అనుకూ లిస్తుందన్న పిచ్పై అశ్విన్ తన వైవిధ్యమైన బంతులతో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు.కాగా 99 పరుగుల వద్ద కెప్టెన్ కుక్ సిన్నర్ జడేజా బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. మరో 37 పరుగులకే ప్రమాదకరమైన బ్యాట్స్ మెన్ జోరూట్ 21 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్లో పుజారాకు చిక్కాడు.లంచ్ విరామం తరువాత 230 పరుగుల వద్ద కానీ భారత్కు వికెట్ దక్కలేదు.కాగా మూడవ సెషన్లో బౌలింగ్ ప్రారంభించిన వెంటనే అశ్విన్ ఒక్క బంతి తేడా తోనే సెంచరీ,హాఫ్ సెంచరీ సాధించిన జెన్నింగ్స్,మెయిన్ అలీ వికెట్లను తీసి భారత బృందంలో ఆనందం నింపాడు.చివరలో 249 పరుగుల వద్ద జానీ బెయిర్స్టో 14 పరుగుల వద్ద వికెట్ తీసి కోహ్లీ సేనకు మ్యాచ్పై పట్టుబిగించే అవకాశం ఇచ్చాడు.
కుక్ అరుదైన ఘనత ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టక్ కుక్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.కాగా భారత్పై టెస్టుల్లో రెండు వేల పరుగులకు పైగా సాధించిన విదేశీ క్రికెటర్ల జాబితాలో కుక్ స్థానం సంపాదించు కున్నాడు. ఇప్పటి వరకు అయిదుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే భారత్పై రెండు వేల, అంతకు పైగా పరుగులు సాధించారు.కుక్ ఆరవ స్థానంలో నిలిచాడు.అయితే టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగా డిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 2555 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. కాగా ఈమ్యాచ్లో కుక్ 46 పరుగులతో కొద్దిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సెంచరీతో సత్తా చాటిన జెన్నింగ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగుతున్న నాలుగవ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.కాగా ఓపెనర్కుక్ 46 పరుగులు,జెన్నింగ్ 112 పరుగులు చేసి మెరుగైన ఆరంభాన్నిచ్చారు. ఇంగ్లండ్ ఒపెనింగ్ వికెట్ కీపర్ జెన్నింగ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. కాగా ఈ స్టేడియంలో టెస్టు అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు.అంతకు ముందు 2006లో ఇంగ్లండ్ ఆటగాడు ఒవై షా ఇక్కడ చేసిన 88 పరుగులు ఇప్పటి వరకు అరంగేట్రపు అత్యధిక పరుగుల వ్యక్తిగత స్కోరు.
కాగా తాజాగా దాన్ని జెన్నింగ్స్ అధిగమించాడు.మరోవైపు భారత్తో 2006 నుంచి చూస్తే అరంగేట్రం లోనే 50కి పైగా పరుగులు సాధించిన అయిదవ ఇంగ్లండ్ ఆటగాడిగా జెన్నింగ్ నిలిచాడు. టీమిండియాలో అందరూ సెంచరీ వీరులే ఇంగ్లండ్తో జరుగుతన్న నాలుగవ టెస్టులో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లంతా సెంచరీ వీరులే.కాగా బ్యాట్స్మెన్,బౌలర్లు, వికెట్ కీపర్ అందరూ సెంచరీలు చేసిన వారే.తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ కెరీయర్లో ఒక సెంచరీ అయినా చేశారు.కాగా ఈ మ్యాచ్లో మురళీ విజ§్ు,కెఎల్ రాహుల్, పుజారా, కోహ్లీ,కెకె నాయర్, అశ్విన్, పార్ధీవ్, జడేజా,జయంత్,భువనేశ్వర్ కుమార్,ఉమేష్ యాదవ్లు ఆడుతున్నారు. జింబాబ్వేతో 1992-93 ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కూడా ఇదే విధంగా తుది జట్టులో అందరూ సెంచరీ వీరులే ఉన్నారు.కాగా ఇలాంటి ఘనటనలు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తొమ్మిదిసార్లు జరిగాయి.
| 2sports
|
sandhya 266 Views BAN vs AFG , World Cup 2019
BAN vs AFG
సౌతాంప్టన్: ప్రపంచకప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ మొదలు కానుంది. ఇందులో భాగంగా ఆఫ్గాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్ నుంచి నిష్క్రమించిన ఆఫ్గాన్ జట్టు ఈ మ్యాచ్లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తుంది. మరోవైపు బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్తో జోరు మీదున్న బంగ్లా సెమీస్ బెర్తు కోసం ప్రయత్నిస్తుంది. సౌతాంప్టన్లో వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telengana/
| 2sports
|
రెండేళ్లలో రూ.600 కోట్ల పైగా పెట్టుబడులు
- 20 ఏళ్లలో 5వేల పైగా నివాసాలు అందించాం
- శాంతాశ్రీరామ్ ఛైర్మన్ వెల్లడి
నవతెలంగాణ- బ్యూరో
ప్రముఖ నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్ఛన్స్ గత 20 ఏళ్లలో 5000 పైగా నివాసాలను అందించిందని ప్రకటించింది. ఆ సంస్థ ఈ రంగంలోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచిన సందర్బంగా గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతా శ్రీరామ్ గ్రూపు ఛైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ 80 లక్షల చదరపు అడుగుల్లో 80 నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించామన్నారు. ఒక్క 2014లోనే 500 నివాసాలు అందించామన్నారు. మరో రెండేళ్లలో 8 కొత్త ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కానుందని, దీంతో 1500 మంది కుటుంబాలకు వీటిని అందించనున్నామన్నారు. రానున్న రెండేళ్లలో రూ.600 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టనున్నామని పేర్కొన్నారు. వచ్చే 12 మాసాల్లో మరో రెండు నివాస ప్రాజెక్టులు ప్రారంభించనున్నామన్నారు. తమ నిర్మాణంలో ఉన్న మల్టీప్లేక్స్, షాపింగ్ మాల్స్ రెండు మరో రెండేళ్లలో నిర్వహణలోకి రానున్నాయని పేర్కొన్నారు. పదేళ్ల క్రితం హైదరాబాద్లో రూ.420కి ఒక్క చదరపు అడుగులో నిర్మాణం చేశామని, ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.10,000 వరకు విలువ చేసే నిర్మాణాలు చేస్తున్నామన్నారు. ఒక్కో ప్లాట్ రూ.30 లక్షల నుంచి కోటి రూపాయాల విలువ చేసే వాటిని విక్రయిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో భూముల విలువ, నిర్మాణ విలువ ఎక్కువగా ఉందని, కొద్దిగా ధరలు తగ్గగానే ఎపిలోనూ నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తామని అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ లింగయ్య, సిఒఒ వి రాము పాల్గొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
internet vaartha 197 Views
న్యూఢిల్లీ : పార్టిసిపేటరీనోట్స్ (పినోట్స్) పెట్టుబడులు ఫిబ్రవరి నెలాఖరు నాటికి భారత్ మార్కెట్లకు 18 నెలల కనిష్టస్థాయిలో వచ్చాయని. కేవలం 2.18 లక్షల కోట్లు మాత్రమే అందినట్లు ఇన్వెస్టర్ల అంచనా. పినోట్స్ ఎక్కువగా సిరసింపదలు, కుబేరులుగా ఉన్నవారు హెడ్జ్ఫండ్స్ ఇతర విదేశీ సంస్థలు ఇన్వెస్టర్లను భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ద్వారా ఈ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి స్తారు. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా అవు తుంది. అదేసమయంలో నల్లధనాన్ని వైట్గా మార్చుకునేందుకు సైతం ఈమార్గం ఉపకరి స్తోందన్న అభియోగాలున్నాయి. సెబి గణాం కాలను చూస్తే పినోట్స్ పెట్టుబడులు భారత్ మార్కెట్లలో అంటే ఈక్విటీ డెట్ డెరివేటివ్స్ మూడుమార్కెట్లలో కూడా అక్టోబరు నుంచి తగ్గుతున్నాయి. మొత్తంగా 2,17,740 కోట్లకు తగ్గింది. అంతకుముందునెలలో 2,31,317 కోట్లనుంచి తగ్గుముఖం పట్టాయి. ఇక పినోట్స్ పెట్టుబడులు భారత్ మార్కెట్లలో 2.58 లక్షలు గా ఉన్నాయి. అక్టోబరునుంచి చూస్తే 2.58 లక్షలు, నవంబరులో 2.54 లక్షలు, డిసెంబరులో 2.35 లక్షలు, జనవరిలో 2,31 లక్షల కోట్లుగా ఉన్నాయి సెప్టెంబరులో చూస్తే 2.54 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అందాయి. మొత్తం పి.నోట్ పెట్టుబడుల్లో ఈక్విటామార్కెట్లకు 1.32 లక్షలకోట్లు ఫిబ్రవరి చివరినాటికి అందాయి. మిగిలిన మొత్తం డెట్, డెరివేటివ్స్ మార్కెట్లలో పెట్టుబడులు వచ్చాయి. జనవరి గణాంకాలను పరిశీలిస్తే 2014 ఆగస్టు కనిష్టస్థాయిని నమోదుచేసినట్లు నిపుణుల అంచనా. ఆనెలలో చూస్తే పెట్టుబడులు కేవలం 2.11లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక విదేశీ సంస్థాగత పెట్టు బడులు పినోట్స్ నుంచి వచ్చినవాటిలో 10.7శాతం పెరిగాయి. జనవరిలో 10.5నుంచి ఫిబ్రవరిలో 10.7 శాతం పెరిగినట్లు తేలింది. ఇదిలా ఉంటే బెంచ్మార్క్ సెన్సెక్స్ ఇదే సమయంలో 7.5శాతం క్షీణించింది.
| 1entertainment
|
internet vaartha 189 Views
హైదరాబాద్ : కార్పొరేట్ సామాజిక బాధ్యతల నిర్వహణలో భాగంగా అల్పాదాయ వర్గాల కుటుంబాల్లోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలుచేస్తోంది. అగ్రగామి రియాల్టీ సంస్థగా ఉన్న కెరహేజా కార్పొరేషన్ హైదరాబాద్లో మైండ్స్పేస్ బిజి నెస్పార్క్ అందించిన సంగతి తెలిసిందే. టీచ్ఫర్ ఇండియాతో కలిసిమైండ్స్పేస్ భాగస్వామిగా కొనసాగు తూ తనకార్పొరేట్ సామాజిక బాధ్యతల ప్రాజెక్టు టీచింగ్ట్రీని చేపట్టినట్లు వివరించింది. సంస్థ సిఎస్ఆర్ హెడ్ విశ్వాస్ ధుమాల్ మాట్లాడుతూ 9200 మందికిపైగా విద్యాబుద్ధులు నేర్పేందుకు అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. టీచ్ఫర్ ఇండియాసిటీ డైరెక్టర్కార్తీక్ రాపాల మాట్లాడుతూ రహేజా కార్పొరేషన్ వంటి భారీసంస్థలు అల్పాదాయ వర్గాల కుటుంబాల్లోని చిన్నపిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషిచేయడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఇప్పటివరకూ 9200 మంది చిన్నారులకు విద్యా బుద్ధులు అలవరిచామని, ఈ సంఖ్యను మరింత పెంచుతామని పేర్కొన్నారు. భవిష్యత్తులో రహేజా వంటి సంస్థలు మరింతగా సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటాయన్న ధీమా వ్యక్తం చేసారు.
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
హెచ్-1 బీ వీసా మరింత గగనం!
అమెరికాలో ఉద్యోగాలు- స్థానికులకు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన హమీ నెరవేర్చే ప్రయత్నంలో హెచ్-1బీ వీసాల జారీ విధానంలో సమూలంగా మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు.
TNN | Updated:
Dec 25, 2017, 12:44PM IST
అమెరికాలో ఉద్యోగాలు- స్థానికులకు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన హమీ నెరవేర్చే ప్రయత్నంలో హెచ్-1బీ వీసాల జారీ విధానంలో సమూలంగా మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ దిశగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చర్యలను వేగవంతం చేసింది. హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారుల ఎంపిక ప్రక్రియలో నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ అమెరికా అంతర్గత భద్రతా విభాగం ప్రతిపాదించిందని అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్‌ సంస్థ ఫ్రాగోమెన్‌ పేర్కొంది. హెచ్‌-1బీ వీసా నిబంధనలపై 2011లో చేసిన ప్రతిపాదనలను తాజాగా పునరుద్ధరించనుందని ఫ్రాగోమెన్ తెలిపింది. తాజా నిబంధనల ప్రకారం ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా హెచ్‌-1బీ క్యాప్‌ లాటరీ కోసం రిజిస్టర్‌ చేసుకోవాలి.
క్యాప్‌ నెంబర్లు కేటాయించిన తర్వాతే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నెంబర్ల కేటాయింపులో ప్రాధాన్యత పద్ధతిని పాటించాలని అంతర్గత భద్రత విభాగం ప్రతిపాదినలు చేసింది. అంటే అధిక మొత్తంలో వేతనాలు పొందిన వారు, నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు ఈ క్యాప్‌ నెంబర్లలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. క్యాప్ లాటరీ విధానంలో ఫిబ్రవరి 2018 వరకు మార్పులు ఉండవని ఫ్రాగోమెన్ భాగస్వామి స్కాట్ ఫిట్జర్లాడ్ తెలిపారు. దీన్ని బహుశా ఏప్రిల్ నుంచి ప్రారంభించే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికిప్పుడే ఈ నిబంధనలను అమలు చేస్తే సంస్థలు తీవ్రంగా నష్టపోతాయని పేర్కొన్నారు. ఇప్పటికే హెచ్-1 బీ వీసాల జారీపై అమెరికా పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఇటీవలే హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయకుండా నిబంధనలు తీసుకొచ్చింది. తాజా ప్రతిపాదనలతో వీసాకు దరఖాస్తుచేసే అభ్యర్థులు మరింత నిరాశ చెందుతున్నారు. అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగం చేయాలంటే హెచ్‌-1బీ వీసా తప్పనిసరి. ఎక్కువగా భారతీయులు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే అమెరికా పౌరులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఈ వీసా జారీ విధానాన్ని కఠినతరం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలోని తమ కార్యకలాపాలను నిర్వహణ కోసం హెచ్-1 బి, నాన్-ఇమ్మిగ్రేషన్ వీసాలతో ఉద్యోగులను పంపుతాయి.
| 1entertainment
|
తాజావార్తలు
అభిమాని కుటుంబానికి రజనీ భారీ ఆర్థిక సాయం
టీనగర్, న్యూస్టుడే: రహదారి ప్రమాదంలో మరణించిన అభిమాని కుటుంబానికి నటుడు రజినీకాంత్ రూ.50 లక్షల ఆర్థిక సాయం అంఅందజేశారు. ‘రజినీ మక్కల్ మండ్రం’ ధర్మపురి జిల్లా కార్యదర్శి మహేంద్రన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని కుటుంబానికి సంతాపం తెలిపిన రజినీకాంత్ వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఇదివరలోనే ప్రకటించారు. ఆ మేరకు సోమవారం మహేంద్రన్ కుటుంబానికి నటుడు రజనీకాంత్ను ఆయన నివాసంలో కలిశారు. వారికి సంతాపం తెలపడంతో పాటు రజినీ మక్కల్ మండ్రం తరఫున రూ.40 లక్షలు, తన వంతు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా తాకెట్టు పెట్టిన వారి ఇంటిని కూడా విడిపించారు. మహేంద్రన్ పిల్లల చదువు ఖర్చులను కూడా తానే భరించనున్నట్లు ప్రకటించారు.
Tags :
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన సాహా, చరిత్ర సృష్టించిన భారత పేసర్లు
అత్యధిక క్యాచ్లతో సాహా ధోనీ రికార్డును బ్రేక్ చేయగా.. భారత పేసర్లు తొలి టెస్టులో చరిత్ర సృష్టించారు.
TNN | Updated:
Jan 8, 2018, 04:19PM IST
కేప్‌టౌన్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అరుదైన రికార్డ్‌ను నెలకొల్పాడు. టీమిండియా తరఫున ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు అందుకున్న సాహా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు క్యాచ్‌లు పట్టాడు. దీంతో పది వికెట్లను కూల్చడంలో భాగస్వామ్యం పొందిన తొలి భారత కీపర్‌గా నిలిచాడు. 2014-15 సీజన్లో మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ధోనీ వికెట్ కీపర్‌గా 9 మంది బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చాడు.
సఫారీ గడ్డ మీద తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా 130 పరుగులకే కుప్పకూలింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట రద్దు కాగా.. 65-2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికాను భారత పేసర్లు వణికించారు. మూడో రోజు ఆటలో డివిలియర్స్ (35), కేశవ్ మహారాజ్ (15) మినహా మరే బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
| 2sports
|
దేవిశ్రీ ప్రసాద్..శివనాగులు పాటను ఎందుకు రీప్లేస్ చేసినట్లు..?
Highlights
దేవిశ్రీ ప్రసాద్..శివనాగులు పాటను ఎందుకు రీప్లేస్ చేసినట్లు..?
దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీత దర్శకుడు. అందులో సందేహం లేదు. కానీ అతను మంచి గాయకుడా అంటే మాత్రం సందేహాలు వ్యక్తమవుతాయి. అతడి వాయిస్ అంత స్వీట్గా ఏమీ ఉండదు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ పాడిన ‘నాన్నకు ప్రేమతో’ సాంగ్ లాంటివి మినహాయిస్తే దేవి పాటలు ఏమంత ఆకట్టుకోవు. కానీ అతను మాత్రం అప్పుడప్పుడూ గొంతు సవరించుకుంటూనే ఉంటాడు. పాటలు పాడేస్తుంటాడు. తాజాగా ‘రంగస్థలం’లోనే దేవి పాడిన ఎంత సక్కగున్నావే పాట విషయంలోనూ మిశ్రమ స్పందన వచ్చింది. ఈ పాట ట్యూన్.. సాహిత్యం చాలా బాగున్నా.. దేవిశ్రీ వాయిస్ దానికి సూటవ్వలేదన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. ఏదైనా స్వీట్ వాయిస్ తోడై ఉంటే ఈ పాట రేంజే వేరేగా ఉండేదన్నారు.
ఆ పాట సంగతలా వదిలేస్తే.. ‘రంగస్థలం’ సినిమా చూసిన వాళ్లకు మరో పాటలోనూ దేవిశ్రీ వాయిస్ వినిపించడం ఆశ్చర్యం కలిగించింది. ఈ చిత్ర ఆడియోలో ‘ఆ పక్కనుంటావా’ అంటూ సాగే పాటను శివనాగులు అనే సింగర్ పాడిన సంగతి తెలిసింది. అతడి వాయిస్ కొంచెం భిన్నంగా.. బాగానే అనిపించింది. కానీ సినిమాలో చూస్తే అతడి వాయిస్ వినిపించలేదు. దేవిశ్రీ గొంతుతో ఉన్న వెర్షన్ తో పాటను రీప్లేస్ చేసేశారు. ఆడియోలో విన్న గొంతుకు.. సినిమాలో ఉన్నదానికి తేడా ఉండటంతో జనాలకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. చివరికి అక్కడ వినిపించింది దేవిశ్రీ వాయిస్ అని అర్థమైంది. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. మరి శివనాగులు పాటను ఎందుకు తీసేసినట్లు.. దేవిశ్రీ పాటను ఎందుకు రీప్లేస్ చేసినట్లు? దేవి అసలెందుకిలా చేశాడు?
Last Updated 31, Mar 2018, 3:36 PM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఎన్బీఏతో టైమ్స్ స్టూడియో జట్టు.. మరింత చేరువగా బాస్కెట్బాల్ ఆట
అమెరికాలో బాస్కెట్బాల్ క్రీడ అంటే పడి చచ్చిపోతారు. అక్కడ బాస్కెట్బాల్ ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ మన దేశంలో దీనికి పెద్దగా ఆదరణ లేదు.
Samayam Telugu | Updated:
May 30, 2018, 03:41PM IST
అమెరికాలో బాస్కెట్బాల్ క్రీడ అంటే పడి చచ్చిపోతారు. అక్కడ బాస్కెట్బాల్ ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ మన దేశంలో దీనికి పెద్దగా ఆదరణ లేదు. క్రికెట్ను మతంగా భావించే మన దేశంలో వేరే క్రీడలకు అంత గుర్తింపు లేదనే చెప్పాలి. సైనా నెహ్వాల్, పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్ లాంటి వాళ్ల పుణ్యమా అని ఇప్పుడుప్పుడే బ్యాడ్మింటన్కు ఆదరణ పెరుగుతోంది. అయితే భారతీయులకు బాస్కెట్బాల్ ఆటను చేరువచేయడానికి ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ గ్రూప్ ముందుకొచ్చింది. ఆటకు సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు అందించడానికి టైమ్స్ గ్రూప్నకు చెందిన డిజిటల్ వీడియో కంటెంట్ కంపెనీ టైమ్స్ స్టూడియో.. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్(ఎన్బీఏ)తో ఒప్పందం చేసుకుంది.
భారత్లో నెలకు 45 మిలియన్ల యూనిక్ విజిటర్లున్న ఇండియా టైమ్స్ లైఫ్స్టైల్ నెట్వర్క్ ప్లాట్ఫాంల ద్వారా బాస్కెట్బాల్ వీడియోలు, ఇతర కంటెంట్ను అందించనున్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా.. ఆన్-కోర్ట్ స్టోరీలైన్స్, ఆటగాళ్ల ప్రొఫైల్స్, ఎన్బీఏ చరిత్ర తదితర అంశాలకు సంబంధించిన చిన్న చిన్న వీడియోలను టైమ్స్ స్టూడియో అందించనుంది. బాస్కెట్బాల్ విశిష్టతను భారతీయులకు తెలియజేయానికి ఈ కంటెంట్ను స్థానిక భాషల్లో కూడా అందించనున్నారు. టైమ్స్ గ్రూప్నకు చెందిన MensXP.com, Indiatimes.com వెబ్సైట్లలో ఎన్బీఏ కోసం ప్రత్యేకంగా సెక్షన్లను ఏర్పాటుచేస్తున్నారు. టైమ్స్ ఎడిటోరియల్ టీమ్.. ఎన్బీఏకు సంబంధించి విస్తృతమైన కవరేజ్ను ఇవ్వనుంది.
| 2sports
|
Tata, Mistry
టాటా-మిస్త్రీ పరిణామాలపై ఆర్థికశాఖ నిఘా!
న్యూఢిల్లీ, నవంబరు 7: టాటాసన్స్బోర్డు రూంలో లేవనెత్తిన ఇటీవలి పరిణామా లు ఇన్వెస్టర్ల సొమ్ముకు విఘాతం కలుగకుండా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ తన పరిధి లోని ఏజెన్సీలు, సంస్థలకు సూచించింది. టాటా గ్రూప్లో నెలకొన్న యాజమాన్య ఉద్వాసన పరిణా మాలు, తదనంతరం తాత్కాలిక ఛైర్మన్గా రతన్ టాటారావడం మిస్త్రీ తాను అన్ని నిర్ణయాలు బోర్డు ఆమోదంతోనే తీసుకున్నట్లు వివరించడం వంటివి వివాదాస్పదంగా మారాయి. టాటాగ్రూప్ కంపెనీ ల్లో పెట్టుబడులు పెట్టినఎల్ఐసి, బ్యాంకులు వంటి సంస్థలను ఆర్థికశాఖ ముందు ఇన్వెస్టర్ల పెట్టుబడు లకు భద్రతచేకూర్చాలని సచించారు. ముందుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొంత టాటాప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎఫ్ఐఐలు టాటామోటార్స్లో పదిశాతం పెట్టుబడు లు పెట్టారు. టాటాసన్స్లో నెలకొంటున్న పరిణా మాలు ఆందోళనకరంగా ఉన్నాయని వారంటున్నా రు. టాటామోటార్స్కు ఈ ఎఫ్ఐఐల గ్రూప్ లేఖను కూడా రాసింది. అమెరికా కేంద్రంగాఉన్న ఈ ఇన్వె స్టర్లు సావరిన్ వెల్త్ఫండ్స్లో క్రియాశీలకంగా ఉన్న ఒక సంస్థ ఆధ్వర్యంలో ఈలేఖరాసినట్లు తేలింది. అలాగే ఎయిర్ఏసియాకు సంబంధించి వాణిజ్య పరంగా ఉన్న పలు లోపాలను ఎయిర్ఏసియా సీని యర్ ఎగ్జిక్యూటివ్లు పలుపర్యాయాలు ఫిర్యాదులు చేసారు. ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు లేవని ఒక ఆంగ్లదినపత్రిక ఉటంకించింది. ఎయిర్ఏసియా ఇండియా ప్రస్తుతం మలేసియా మాతృసంస్థ ఎయిర్ఏసియా బెర్హాద్ ఆధ్వర్యంలో నడుస్తున్నది. విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల నిబంధనలకు విరుద్ధంగా భారత్ వెంచర్ మలేసియా కంపెనీపై అధికఛార్జిలు విధించింది. మిస్త్రీ ఈ అంశాన్ని టాటాసన్స్బోర్డుకు పదేపదే తెచ్చారు. దీనిపై విచారణ జరగాలనికూడా కోరారు. ఇక టాటాగ్రూప్ హోల్డింగ్కంపెనీ టాటా సన్స్కు రెట్టింపుస్థాయికంటే ఎక్కువ డివిడెండ్ను మిస్త్రీ ప్రతిపాదించారు.
2020 నాటికి టాటాసన్స్ వాటాదారులకు సుమారు800 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. 2016లో 323 కోట్లు చెల్లిస్తుంటే ఈ మొత్తం రెట్టింపుకంటే పెరిగింది. టాటాట్రస్టులకు ప్రస్తుతం టాటాసన్స్లో మెజార్టీ వాటాలున్నాయి. దీనివల్ల కంపెనీ భవిష్యత్తు నగదు నిల్వలపై ప్రభా వం చూపిస్తుందని, గ్రూప్ యూనిట్లకు కూడా కష్టం అవుతుందన్న భావన వ్యక్తం అయింది. ఇక సైరస్మిస్త్రీ హయాంలోగ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో సభ్యునిగా ఉన్న నిర్మాల్యకుమార్ మిస్త్రీతోపాటే ఉద్వాసనకు గురయ్యారు. తనకు ఈ సమాచారం ఎలా తెలిసింది. తర్వాత ఏంజరుగనున్నది అన్న అంశాలపై కుమార్ తన బ్లాగ్లో వ్యాఖ్యలుచేయడం కంపెనీ పరిస్థితులను మరింత తేటతెల్లంచేసినట్ల యింది. ఇక మిస్త్రీ శిబిరం ఇతర స్వతంత్రడైరెక్టర్ల నుంచి కూడ ఆమద్దతును ఆసిస్తోంది. ఇండియన్ హోటల్స్కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు ఇప్పటికే మద్ద తు ప్రకటించారు. అయితే టాటా గ్రూప్ప్రస్తుత యాజమాన్యం కూడా స్వతంత్ర డైరెక్టర్ల వైఖరిని ప్రశ్నిస్తోంది.వారువాస్తవంగా స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారా లేక షాపోర్జీపల్లోంజి గ్రూప్ నుంచి లబ్ధిపొందుతున్నారా అని ప్రశ్నిస్తోం ది.
ఈ నెల 18వ తేదీ టాటా ఇన్వెస్టర్ సదస్సు జరుగనున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే త్రైమాసికానికి వాయిదావేసారు. ఇండియన్ హోట ల్స్ డైరెక్టర్ల వ్యవహారంతో టాటాసన్స్ మిగిలిన గ్రూప్ స్వతంత్ర డైరెక్టర్లను చేజార్చుకోకూడదని విస్తృత కసరత్తులు జరుపుతోంది. సాధారణ సర్వ సభ్యసమావేశాల్లో వాటాదారుల నుంచి ఓటింగ్ను తీసుకోవాలని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఈ విధానంఅనుసరించి మిస్త్రీని వివిధ కంపెనీల బోర్డు ల నుంచి ఉద్వాసన చెప్పేందుకు ఈవిధానం అమ లుచేయాలని చూస్తోందని సమాచారం. ఇక మిస్త్రీ కూడా టాటాసన్స్సలహాలు కొన్నింటిని పక్కనపెట్టా రని అంచనా. టిసిఎస్లో ఐదుశాతం వాటాలను విక్రయించాలన్న నిర్ణయాన్ని పెడచెవిన పెట్టారని, నగదునిల్వలు పెంచుకునేందుకు సరైన సమ యంలో చేసిన సలహాలనుమిస్త్రీ పాటించకపోవడం కూడా టాటాసన్స్కు కోపంరప్పించింది. ఇక టాటా, మిస్త్రీల అంతర్గత పోరులో ప్రభుత్వరంగ బ్యాంకిం గ్ దిగ్గజం అందోళన చెందుతోంది. భారతీయస్టేట్ బ్యాంకుపరంగా టాటాసన్స్ను ఈ వివాదాని సహే తుకమైనపద్ద్ధతిలో పరిష్కరించుకోవాలని లేనిపక్షం లో ఇతర నిర్వహణ కంపెనీల లావాదేవీలపై తీవ్ర ప్రభావంచూపుతుందనిహెచ్చరించింది. రతన్టాటా ఛైర్మన్గా ఉన్నకాలంలో ఎస్బిఐటాటాగ్రూప్కు పటి ష్టమైన మద్దతునిచ్చింది. వివిధ ఆర్థిక పథకాలు, గ్యారంటీలద్వారా విదేశాల్లో టాటాసన్స్ భారీ కొను గోళ్లకు మద్దతునిచ్చింది. జాగ్వార్ ల్యాండ్రోవర్, కోరస్ వంటివి ఈకోవకు చెందినవే. మొత్తం మీద టాటాసన్స్, సౌరస్మిస్త్రీలమధ్య జరుగుతున్న అంత ర్గతయుద్ధంతో టాటాకంపెనీల విలువలు స్టాక్ మార్కె ట్లలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని చెప్పవచ్చు.
| 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
- విజయ్హజారే ట్రోఫీ కర్నాటక సొంతం
- ఫైనల్లో తమిళనాడుపై ఘన విజయం
- అభిమన్యు మిథున్కు హ్యాట్రిక్ వికెట్లు
- కర్నాటకకు ఇది నాల్గో టైటిల్
నవతెలంగాణ-బెంగళూర్
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు రాష్ట్ర జట్టు తమిళనాడును చిత్తుగా ఓడించింది. విజెడి (వి జగదీశన్) పద్దతిలో తమిళనాడుపై 60 పరుగుల తేడాతో సాధికారిక విజయం సాధించింది. 2013-14 సీజన్లో తొలిసారి విజరు హజారే ట్రోఫీ అందుకున్న కర్నాటక అక్కడ్నుంచి జైత్రయాత్ర కొనసాగిస్తోంది. కర్నాటకకు ఇది నాల్గో విజరు హజారే విజయం కావటం విశేషం. 2014-15లో టైటిల్ నిలుపుకున్న కర్నాటక, తిరిగి 2017-18లో దేశవాళీ కింగ్గా నిలిచింది. తాజాగా సొంత గడ్డపై జరిగిన ఫైనల్లో తమిళనాడును మట్టికరిపించి దేశవాళీ వన్డే చాంపియన్గా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 252 పరుగులు చేసింది. ఛేదనలో కర్నాటక 146/1తో ఉండగా వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. విజెడి పద్దతిలో కర్నాటక లక్ష్యం 87 పరుగులు. దీంతో 60 పరుగుల తేడాతో కర్నాటక అలవోక విజయం నమోదు చేసింది. విజరు హజారే ట్రోఫీని అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన తమిళనాడుకు కర్నాటక ఆరో టైటిల్ నిరాకరించింది. బర్త్ డే బారు అభిమన్యు మిథున్ (5/34) హ్యాట్రిక్ వికెట్ల ప్రదర్శనతో కర్నాటక విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రాహుల్, మయాంక్ మెరుపులు : ఛేదనలో కర్నాటక ఆరంభంలోనే ఓపెనర్ దేవదత్ పాడికల్ (11)ను కోల్పోయింది. రెండు ఫోర్లతో జోరుమీద కనిపించిన పాడికల్ను పవర్ ప్లే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 34 పరుగుల వద్ద కర్నాటక తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో జోడీ కట్టిన కెఎల్ రాహుల్ (52 నాటౌట్, 72 బంతుల్లో 5 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (69 నాటౌట్, 55 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) తమిళనాడు బౌలర్లపై పంజా విసిరారు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ రాహుల్ నెమ్మదిగా ఆడగా.. టెస్టు స్పెషలిస్ట్ వేగంగా పరుగులు సాధించటం విశేషం. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో మయాంక్ అగర్వాల్ 69 పరుగులు చేశాడు. మరో వైపు రాహుల్ ఐదు ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. రాహుల్, మయాంక్ రెండో వికెట్కు అజేయంగా 112 పరుగులు జోడించారు. కర్నాటకను ఛేదనలో తిరుగులేని స్థానంలో నిలిపారు. 23 ఓవర్లలో కర్నాటక 146/1తో సాగుతున్న సమయంలో వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో విజెడి పద్దతిలో విజేతను నిర్ణయించారు.
: కర్నాటక సీమర్ అభిమన్యు మిథున్ అదరగొట్టాడు. విజరు హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ వికెట్లు కూల్చిన తొలి కర్నాటక బౌలర్గా నిలిచాడు. 5/34తో విజృంభించిన మిథున్ లిస్ట్-ఏ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో తమిళనాడు ఓపెనర్ మురళీ విజరు (0)ను డకౌట్ చేసిన మిథున్.. తర్వాత ఆల్రౌండర్ విజరు శంకర్ (38)ను పెవిలియన్కు చేర్చాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా షారుక్ ఖాన్ (27), మహ్మద్ (10), మురుగన్ అశ్విన్ (0)లను అవుట్ చేసి విజరు హజారే ఫైనల్లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. అభిమన్యు మిథున్, వి కౌశిక్ (2/39) మెరుపులతో తమిళనాడు తొలుత 49.5 ఓవర్లలో 252 పరుగులకే కుప్పకూలింది. తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్ (85, 110 బంతుల్లో 9 ఫోర్లు), బి. అపరాజిత్ (66, 84 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. విజరు శంకర్ (38), మహ్మద్ (27) ఫర్వాలేదనిపించారు. టాప్ ఆర్డర్లో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (8), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (11) పూర్తిగా నిరాశపరిచారు.
స్కోరు వివరాలు :
తమిళనాడు ఇన్నింగ్స్ : అభినవ్ ముకుంద్ (సి) అగర్వాల్ (బి) జైన్ 85, మురళీ విజరు (సి) రాహుల్ (బి) మిథున్ 0, అశ్విన్ (సి) రాహుల్ (బి) కౌశిక్ 8, అపరాజిత్ రనౌట్ (పాండే/రాహుల్) 66, విజరు శంకర్ (సి) నాయర్ (బి) మిథున్ 38, దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) గౌతమ్ 11, షారుక్ ఖాన్ (సి) పాండే (బి) మిథున్ 27, వాషింగ్టన్ సుందర్ (సి) పాండే (బి) కౌశిక్ 2, మహ్మద్ (సి) పాడికల్ (బి) మిథున్ 0, మరుగున్ అశ్విన్ (సి) గౌతమ్ (బి) మిథున్ 0, ఎక్స్ట్రాలు : 05, మొత్తం : (49.5 ఓవర్లలో ఆలౌట్) 252.
వికెట్ల పతనం : 1-1, 2-24, 3-148, 4-178, 5-193, 6-224, 7-230, 8-252, 9-252, 10-252.
బౌలింగ్ : అభిమన్యు మిథున్ 9.5-0-34-5, వి కౌశిక్ 9-0-39-2, ప్రతీక్ జైన్ 9-0-55-1, కృష్ణప్ప గౌతమ్ 10-0-48-1, ప్రవీణ్ దూబె 6-0-47-0, కరుణ్ నాయర్ 6-0-27-0.
కర్నాటక ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ నాటౌట్ 52, దేవదత్ పాడికల్ (బి) వాషింగ్టన్ సుందర్ 11, మయాంక్ అగర్వాల్ నాటౌట్ 69, ఎక్స్ట్రాలు : 14, మొత్తం : (23 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి) 146.
వికెట్ల పతనం : 1-34.
బౌలింగ్ : వాషింగ్టన్ సుందర్ 6-0-51-1, ఆర్ అశ్విన్ 2-0-11-0, టి నటరాజన్ 3-0-17-0, విజయ్శంకర్ 2-0-8-0, మురుగన్ అశ్విన్ 6-0-34-0, మహ్మద్ 4-0-22-0.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
24 మెగాపిక్సెల్ కెమెరాతో.. 'వీవో' స్మార్ట్ఫోన్..!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ వీవో సంస్థ మరో కొత్త మోడల్ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. యాపిల్ 'ఐఫోన్-X' తరహాలో ఫుల్ ఎడ్జ్ డిస్ప్లేతో 'వీ9'ను తీసుకొచ్చారు.
TNN | Updated:
Mar 25, 2018, 11:22AM IST
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ వీవో సంస్థ మరో కొత్త మోడల్ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. యాపిల్ 'ఐఫోన్-X' తరహాలో ఫుల్ ఎడ్జ్ డిస్ప్లేతో 'వీ9'ను తీసుకొచ్చారు. ప్రస్తుతానికి 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వెర్షన్ను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ధర రూ.22,990. ఇక 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ అదనపు ప్రత్యేకత. ఏప్రిల్ 2 నుంచి అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. బంగారం, నలుపు, నీలం రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో ప్రీ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
' వీవో వీ9 ' ఫీచర్లు...
* 6.3 ఇంచ్ డిస్ప్లే, 1080 x 2280 స్క్రీన్ రిజిల్యూషన్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, క్వాల్కమ్ ఎంఎస్ఎం 8953- ప్రొ స్నాప్డ్రాగన్ 626 చిప్సెట్
| 1entertainment
|
రామ్ తప్పించుకోవాలని చూశాడు!
Highlights
ప్రస్తుతం దేశమంతటా.. 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' అనే ఛాలెంజ్ వైరల్ అవుతోంది
ప్రస్తుతం దేశమంతటా.. 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' అనే ఛాలెంజ్ వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తూ తము కసరత్తులు చేసిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఛాలెంజ్ ను స్వీకరించి హీరో రామ్ కు ఛాలెంజ్ విసిరారు.
దీంతో రామ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో ''తప్పించుకోవడానికి చాలా ట్రై చేశా.. హహ.. ఏదేమైనా.. త్వరలోనే వీడియో పోస్ట్ చేస్తానని'' అన్నారు. చెప్పినట్లుగా తను వర్కవుట్లు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులందరినీ ఈ ఛాలెంజ్ లో పాల్గొమని నామినేట్ చేశాడు.
| 0business
|
jr ntr's jai lava kusa theatrical trailer creates new record
‘జై లవకుశ’ ట్రైలర్: రి.. రి.. రికార్డ్స్ బద్దలు
అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ ‘జై లవకుశ’ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలన రికార్డ్స్ను క్రియేట్ చేస్తుంది.
TNN | Updated:
Sep 11, 2017, 10:15PM IST
అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ ‘జై లవకుశ’ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలన రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుంది. ‘ఏ తల్లికైనా ముగ్గురు మగ బిడ్డలు పుడితే రామలక్ష్మణభరతులు కావాలని కోరుకుంటుంది. కానీ ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ రామలక్ష్మణులు అయ్యారంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ‘జై లవకుశ’ ట్రైలర్ ఆదివారం సాయంత్రం రిలీజై టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా రికార్డ్స్‌ని ఖతం చేసింది.
‘ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను రెడీ అంటూ ‘రావణుడి’ ఉగ్రరూపం చూపించడంతో ఈ ట్రైలర్ టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే అత్యధిక డిజిటల్ వ్యూస్ రికార్డ్‌ను తిరగరాసింది. విడుదలైన తొలి 24 గంటల్లోనే 7.54 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఇక యూట్యూబ్‌లో 6 మిలియన్స్ వ్యూస్ సాధించి అజిత్ ‘వివేగం’ ట్రైలర్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది ‘జై లవకుశ’ ట్రైలర్.
| 0business
|
ఓం నమో వెంకటేశాయ వర్కింగ్ స్టిల్స్ గ్యాలరీ
First Published 6, Feb 2017, 1:45 PM IST
ఓం నమో వెంకటేశాయ వర్కింగ్ స్టిల్స్ గ్యాలరీ
ఓం నమో వెంకటేశాయ వర్కింగ్ స్టిల్స్ గ్యాలరీ
ఓం నమో వెంకటేశాయ వర్కింగ్ స్టిల్స్ గ్యాలరీ
ఓం నమో వెంకటేశాయ వర్కింగ్ స్టిల్స్ గ్యాలరీ
ఓం నమో వెంకటేశాయ వర్కింగ్ స్టిల్స్ గ్యాలరీ
ఓం నమో వెంకటేశాయ వర్కింగ్ స్టిల్స్ గ్యాలరీ
ఓం నమో వెంకటేశాయ వర్కింగ్ స్టిల్స్ గ్యాలరీ
ఓం నమో వెంకటేశాయ వర్కింగ్ స్టిల్స్ గ్యాలరీ
Recent Stories
| 0business
|
Kuldeep Yadav bowls with wet hands at nets ahead of 1st T20I vs New Zealand
బంతిపై పట్టు కోసం.. కుల్దీప్ తడివేళ్లతో..?
ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ని తన చైనామన్ బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టిన భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని.. తొలి వన్డేలోనే
TNN | Updated:
Oct 31, 2017, 07:17PM IST
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ని తన చైనామన్ బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టిన భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని.. తొలి వన్డేలోనే న్యూజిలాండ్ ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ముఖ్యంగా టామ్ లాథమ్, రాస్ టేలర్ స్వీప్, రివర్స్ స్వీప్‌లతో కుల్దీప్ బౌలింగ్‌ని ఆటాడుకున్నారు. దీంతో తర్వాత రెండు వన్డేల్లోనూ అతనికి భారత్ కనీసం తుది జట్టులో కూడా చోటివ్వలేదు. అయితే.. బుధవారం నుంచి టీ20 సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో మళ్లీ ఈ కుర్ర బౌలర్‌కి అవకాశం దక్కేలా కనిపిస్తోంది.
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మంగళవారం కుల్దీప్ యాదవ్ నెట్స్‌లో కఠినంగా ప్రాక్టీస్ చేశాడు. జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేసిన కుల్దీప్.. ప్రతి బంతిని విసిరే ముందు నీటిలో వేళ్లని ముంచి అనంతరం బౌలింగ్ చేశాడు. బంతిపై పట్టు సాధించేందుకే కోచ్ ఇలా సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆదివారం ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ని భారత్ 2-1తో చేజార్చుకున్న నేపథ్యంలో.. కనీసం టీ20లోనైనా.. గెలవాలని కివీస్ ఆశిస్తోంది. 10 ఏళ్ల టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ చేతిలో న్యూజిలాండ్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. దీంతో తొలి టీ20 విజయం కోసం టీమిండియా ఎదురుచూస్తోంది.
| 2sports
|
READ ALSO: IIFA Awards: సల్లూ భాయ్ స్టైలిష్ ఎంట్రీ.. వెంటపడిన కుక్క
ఇప్పుడు ఆయన మరో గెటప్లో కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఆయుష్మాన్ ప్రధాన పాత్రలో ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఆయుష్మాన్ గే పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం వీడియోను రూపొందించింది. 2017లో వచ్చిన ‘శుభ్ మంగళ్ సావధాన్’ సినిమాకు ఇది సీక్వెల్గా రాబోతోంది. సినిమాకు హితేశ్ కేవల్య దర్శకత్వం వహించనున్నారు. జితేంద్ర కుమార్, గజరాజ్ రావ్, నీనా గుప్తా కీలక పాత్రలు పోషించనున్నారు. జాతీయ అవార్డు అందుకున్న ఆయుష్మాన్ లాంటి హీరో గే పాత్రలో నటించడమనేది సాహసమనే చెప్పాలి. అయితే అభిమానులు ఆయన్ను ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్లో నటిస్తేనే ఆదరిస్తున్నారు.
READ ALSO: నాన్న నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు: బాలీవుడ్ హీరో
ఆయుష్మాన్ కెరీర్ ‘విక్కీ డోనర్’ సినిమాతో మొదలైంది. ఇందులో ఆయన వీర్యాన్ని అమ్ముకునే వ్యక్తి పాత్రలో నటించారు. సినిమా కెరీర్నే ఇలాంటి కాన్సెప్ట్తో మొదలుపెట్టిన ఆయుష్మాన్ను కమర్షియల్ సినిమాలో మాచో హీరోగా చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలీదు. దాంతో ఓ మాస్ హీరో చేయలేని కాన్సెప్ట్లనే తన సినిమాలుగా ఎంచుకుంటూ వస్తున్నారు ఆయుష్మాన్. అందుకే ఆయన సక్సెస్ఫుల్ హీరో అయ్యారు. ‘అంధాధున్’ సినిమాతో జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆయుష్మాన్ చేతిలో బాలా, గులాబో సితాబో సినిమాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆయుష్మాన్ సినిమాలు ఉత్తర్ ప్రదేశ్లోని వారణాశిలో షూటింగ్ జరుపుకొన్నవన్నీ మంచి విజయాలు అందుకున్నవే. ఇప్పుడు ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ సినిమా షూటింగ్ కూడా వారణాశిలో జరుగుతోంది. 2020 మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Honda Bikes: హోండా 150 సీసీ బైక్ అదిరింది కదూ..
సీబీఆర్150ఆర్ బైక్లో 149 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఆరు గేర్లు ఉంటాయి. బైక్ మాగ్జిమమ్ పవర్ 18.28 హెచ్పీ, మాగ్జిమమ్ టార్క్ 12.66 ఎన్ఎం. యమహా ఆర్15 వీ3 బైక్ రాకముందు వరకు భారత్లో 150సీసీ విభాగంలో ఇదే పవర్ఫుల్ బైక్.
Samayam Telugu | Updated:
Apr 14, 2019, 10:57AM IST
హైలైట్స్
హోండా సీబీఆర్150ఆర్ బైక్లో మోడిఫైడ్ వెర్షన్
ఆరెంజ్ రంగులో అదరగొడుతోన్న బైక్
బైక్ కన్సోల్ ఆరెంజ్ ఔట్లైన్తో ఉంటుంది
దీంతో చూసే వారికే కాదు.. నడిపే వారికి కూడా బైక్ అందంగానే కనిపిస్తోంది
హోండా బైక్స్ యూత్ను బాగా ఆకట్టుకుంటున్నాయి. కంపెనీ న్యూ లుక్తో, అదిరిపోయే డిజైన్తో లేటెస్ట్ ఫీచర్లతో సరికొత్త మోడళ్లను మార్కెట్లో ఆవిష్కరిస్తోంది. అయితే ఇక్కడ ఒక మోడిఫైడ్ హోండా టూవీలర్ బైక్ ప్రియులను తెగ ఆకర్షిస్తోంది.
ఈ మోడిఫైడ్ బైక్ పేరు హోండా సీబీఆర్150ఆర్ గ్లోస్ ఆరెంజ్ ఎడిషన్. స్టీల్త్ ర్యాప్స్ అనే సంస్థ ఈ బైక్ను రూపొందించింది. బాడీ ప్యానెల్స్ మీద ప్రీమియం పెయింట్ వేసింది. దీంతో బైక్ అదిరిపోయే లుక్తో కనిపిస్తుంది.
బైక్ కన్సోల్ ఆరెంజ్ ఔట్లైన్తో ఉంటుంది. దీంతో ఈ బైక్ చూసేవారికే కాకుండా రైడర్లకు కూడా అందంగానే కనిపిస్తుంది. ఫ్రంట్ ఫోర్క్స్ గోల్డెన్ షేడ్లో ఉంటాయి. హెడ్లైట్ ఇప్పుడు ప్రొజెక్టర్ లైట్స్ కలిగి ఉంది. మొత్తంగా మూడు లైట్స్ ఉంటాయి.
ఇకపోతే సీబీఆర్150ఆర్ బైక్లో 149 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఆరు గేర్లు ఉంటాయి. బైక్ మాగ్జిమమ్ పవర్ 18.28 హెచ్పీ, మాగ్జిమమ్ టార్క్ 12.66 ఎన్ఎం. యమహా ఆర్15 వీ3 బైక్ రాకముందు వరకు భారత్లో 150సీసీ విభాగంలో ఇదే పవర్ఫుల్ బైక్. సీబీఆర్ 150ఆర్ బైక్ ఎక్స్షోరూమ్ ధర రూ.1.24 లక్షలు. హోండా ఈ సీబీఆర్150ఆర్ విక్రయాలను ఎప్పుడో నిలిపివేసింది.
| 1entertainment
|
బ్రూనా న్యూడ్ పిక్... సోషల్ మీడియా లో హాల్ చల్
Highlights
బ్రూనా న్యూడ్ పిక్... సోషల్ మీడియా లో హాల్ చల్
బ్రూనా అబ్దుల్లా ఈ బ్రెజిలియన్ బ్యూటీ హాట్ హాట్ ఫొటోలతో తరచూ నెటిజన్ల మతి పోగొడుతూ ఉంటుంది. సినిమాల్లో అప్పుడప్పుడూ కనిపించే ఈ భామ లేటెస్ట్ గా ఓ ఫొటో షూట్ తో కరెంట్ షాకిచ్చింది.
గ్లామర్ కు హద్దులు లేవన్నట్టుగా టాప్ లెస్ గా బ్రూనా ఫోజులిచ్చింది. ఒంపుసొంపులు దాచుకోవడం ఎందుకున్నట్టుగా ఈ సెక్సిణి తన సోయగాలు మొత్తం చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. బాలీవుడ్ లో గ్రాండ్ మస్తీ సినిమాలో బికినీలో సెగలు పుట్టించింది. గతంలోనూ బికినీలతో ఫోజులిచ్చినా ఈసారి టాప్ లెస్ ఫోజుతో మాత్రం కుక పుట్టిస్తోంది.
| 0business
|
Highlights
తెలుగమ్మాయి బ్రేకప్ స్టోరీ
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, బ్రేకప్ అనేవి చాలా కామన్. తమకు నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుంటారు కూడా.. కానీ ఎక్కువగా ప్రేమ జంటలు విడిపోతూనే కనిపిస్తుంటారు. తాజాగా తెలుగమ్మాయి అంజలి కూడా తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిందని టాక్. కోలివుడ్ హీరో జైతో కొన్నాళ్లపాటు సహజీవనం చేసిన అంజలి ఇప్పుడు మాత్రం అతడితో కలిసి లేదని అంటున్నారు.
గతేడాది జై పుట్టినరోజు నాడు అతడు ఎక్కడో దూరంగా షూటింగ్ లో ఉంటే అక్కడకి వెళ్లి మరీ కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ చేసింది. చెన్నైలో వీరిద్దరూ కలిసి ఓ అపార్ట్ మెంట్ లో ఉండేవారు కానీ ఇప్పుడు ఏమైందో ఏమో అంజలి మాట మార్చేసి జై తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని చెబుతోంది. నిన్న అంజలి పుట్టినరోజు కావడంతో కోలివుడ్ కు చెందిన ప్రముఖులు అందరూ కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సోషల్ మీడియాలో ఆమెకు వరుస మెసేజ్ లో చేస్తూనే ఉన్నారు. జై మాత్రం పత్తా లేకుండా పోయాడు. ఫేస్ బుక్ లో గానీ, ట్విట్టర్ లో గానీ ఆమెకు విషెస్ చెప్పనేలేదు. త్వరలోనే వీరిద్దరూ కలిసి నటించిన 'బెలూన్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బహుసా వీరిద్దరూ కలిసి నటించే ఆఖరి సినిమా ఇదే కావొచ్చు అంటూ కోలివుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. వీరిద్దరూ కలిసే ఛాన్స్ లేదని అంటున్నారు.
Last Updated 18, Jun 2018, 11:51 AM IST
| 0business
|
Visit Site
Recommended byColombia
‘బీసీసీఐ నుంచి లెటర్ని మేము అందుకున్నాం. అందులో.. మహ్మద్ షమీ గత ఫిబ్రవరి 17, 18న దుబాయ్లోనే ఉన్నట్లు స్పష్టంగా ఉంది. ఇక ఈ కేసుకి సంబంధించిన మిగతా అంశాలపై విచారణ కొనసాగిస్తాం’ అని జాయింట్ సీపీ (నేర విభాగం) ప్రవీణ్ త్రిపాఠి మీడియాతో వెల్లడించారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ముగియగానే.. వన్డే, టీ20 జట్టులో తాను లేకపోవడంతో సుదీర్ఘ పర్యటన మధ్యలోనే మహ్మద్ షమీ భారత్కి వచ్చేశాడు. అయితే.. ఈ ప్రయాణం మధ్యలోనే అతను దుబాయ్కి వెళ్లినట్లు అతని భార్య ఆరోపించడంతో.. పోలీసులు వివరాల కోసం బీసీసీఐకి లేఖ రాశారు. ఈ పర్యటన ఖర్చు బీసీసీఐ భరించిందా..? లేదా మహ్మద్ షమీనే పెట్టుకున్నాడా..? అనే వివరాలను మాత్రం తెలియరాలేదు.
దుబాయ్లో షమీతో గడిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మహిళ అలిష్బా కూడా సోమవారం స్పందించిన విషయం తెలిసిందే. ‘మహ్మద్ షమీని నేను దుబాయ్లో కలిసిన మాట వాస్తవమే. అక్కడ నా సోదరి ఉంటుండటంతో.. నేను తరచూ దుబాయ్ వెళ్తుంటా. గత ఏడాది ఓ అభిమానిగా షమీతో పరిచయం ఏర్పడింది. అనంతరం చాట్ ద్వారా స్నేహితురాలినయ్యా. అలా పరిచయంలో భాగంగానే.. దుబాయ్లో అతను ఉన్నాడని తెలుసుకుని వెళ్లి.. కలిసి టిఫిన్ తిన్నాం. మా మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు’ అని అలిష్బా స్పష్టం చేసింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Pakistan off to brisk start
పాక్ ఓపెనర్ అర్ధశతకం.. ఫైనల్కి బాటలు
మ్యాచ్లో 212 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్ 18 ఓవర్లు ముగిసే
TNN | Updated:
Jun 14, 2017, 08:23PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి పాకిస్థాన్ బాటలు వేసుకుంది. ఇంగ్లాండ్‌తో కార్ఢిఫ్ వేదికగా జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 212 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్ 18 ఓవర్లు ముగిసే సమయానికే వికెట్ నష్టపోకుండా 105 పరుగులతో మెరుగైన స్థితిలో నిలిచింది. ఓపెనర్ జమామ్ (50: 49 బంతుల్లో 6x4, 1x6) అర్ధ శతకంతో రాణించాడు. అతనికి తోడుగా మరో ఓపెనర్ అజహర్ అలీ (42: 56 బంతుల్లో 3x4, 1x6) నిలకడగా ఆడుతుండటంతో పాక్ సాఫీగా గెలుపు దిశగా సాగిపోతోంది.
అంతకముందు పాకిస్థాన్‌ బౌలర్లు హసన్ అలీ (3/35), జునైద్ ఖాన్ (2/42), రుమాన్ రేస్ (2/44) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 211 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. పాక్ ఓపెనింగ్ జోడిని విడదీసేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ బౌలర్లను వరుసగా మారుస్తున్నా ఫలితం రాబట్టలేకపోతున్నాడు. పాక్ విజయానికి ఇంకా 32 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 10 వికెట్లు ఉండటంతో ఆ జట్టు విజయం నల్లేరుపై నడకే.
| 2sports
|
Suresh 135 Views
అమెరికాలో ఏర్పాట్లపై కుంబ్లే ఆశ్చర్యం
న్యూఢిల్లీ: క్రికెట్కు పెద్దగా ఆదరణలేని అమెరికాలో టీమిండియా తొలిసారి టి20 మ్యాచ్లు ఆడబో తుంది.వెస్టిండీస్ జట్టుతో కలిసి ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవర్డ్ రీజనల్ పార్క్ స్టేడియంకు టీమిం డియా చేరుకుంది.కాగా ఈ స్టేడియంను పరిశీలించిన చీఫ్ కోచ్ కుంబ్లే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.ఈ స్తాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని ఊహించలేదని,క్రికెట్కు పెద్దగా ఆదరణలేని దేశంలో నిర్వహించే చోట అరకోర సౌకర్యాలంటాయని ఊహించామని,ఐసిసి మెరుగైన ఏర్పాటు చేసిందని కుంబ్లే పేర్కొన్నారు.ఫ్లోరిడాలో గ్రౌండ్ బాగుంటుందని గతంలో విన్నానని,ఇప్పుడు చూడగా ఆశ్చర్యం కలుగుతుందన్నాడు.ఇక్కడి వికెట్ చూడటం ఇదే మొదటిసారి.అవుట్ ఫీల్డ్ కూడా చాలా బాగుందని కితాబునిచ్చారు.కాగా నేడు సాయంత్రం తొలి టి20 మ్యాచ్ను విండీస్,భారత్ జట్లు ఫోరిడాలో ఆడనున్నాయి. కాగా భారత్-వెస్టిండీస్ మధ్య ఈనెల 27,28 తేదీల్లో రెండు టి20 మ్యాచ్లు జరుగనున్నాయి.కాగా అమెరికా అతిథ్యమివ్వబోయే తొలి అంతర్జాతీయ సిరీస్లో ఆడేందుకు భారత పరమితి ఓవర్ల సారథి ధోనీ ఈమేరకు అమెరికా చేరుకున్నాడు.ధోనీతో పాటు బుమ్రా కూడా అమెరికా వెళ్లాడు.ఫ్లోరిడాలోని లాడర్ హిల్లో వరుసగా రెండు రోజుల్లో రెండు టి20లు జరుగ నున్నాయి.కాగా ఈ క్రికెట్ స్టేడియంలో 40 శాతం వరకే స్టాండ్స్ ఉంటాయి.మిగతా 80 శాతం ఖాళీగా ఉంటుంది. కోహ్లీ నేతృత్వంలో భారత సేన వెస్టిండీస్ఓ నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడింది.భారత్ 2-0 తేడాతో వెస్టిండీస్పై గెలిచిన సంగతి తెలిసిందే.కాగా తొలి అంతర్జాతీయ సిరీస్ విషయంలో ఉత్కంఠ నెలకొంది. భారత్,వెస్టిండీస్ల మధ్య జరగబోయే రెండు టి20ల సిరీస్ అక్కడ నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ సిరీస్.వరుసగా రెండు రోజుల్లో రెండు టి20లు జరగబోతున్నాయి. ఫ్లోరిడాలోని లాడర్ హిల్లో మ్యాచ్లు జరుగుతాయి.
| 2sports
|
live updates of bigg boss telugu season 3 grand finale
Bigg Boss 3 Telugu: రవికృష్ణ, శివజ్యోతి పెర్ఫార్మెన్స్తో మొదలైన గ్రాండ్ ఫినాలే
బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ప్రారంభమైంది. షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అంతా అదిరిపోయే ఎంట్రీలు ఇచ్చారు.
Samayam Telugu | Updated:
Nov 3, 2019, 06:16PM IST
బుల్లితెరపై 100 రోజులకు పైగా వినోదాన్ని పంచిన బిగ్ బాస్ మూడో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభమైంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు రవికృష్ణ, శివజ్యోతిల పెర్ఫార్మెన్స్తో షో మొదలైంది. ‘అల... వైకుంఠపురములో...’లోని రాములో రాములా సాంగ్కు వీరు పెర్ఫార్మ్ చేశారు. ఆ తరవాత రోహిణి, హేమ, హిమజ, శిల్పా చక్రవర్తి, వితికా, పునర్నవి, మహేష్ విట్ట, తమన్నా, జాఫర్.. వరుసగా ఒక్కొక్కరిగా, ఇద్దరు ముగ్గురుగా వేదికపైకి వచ్చి పెర్ఫార్మెన్స్ చేశారు. చివరిగా నాగార్జున అదరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఆయన సినిమాల్లోని పాటలను మిక్స్ చేసి స్టెప్పులతో ఇరగదీశారు.
ఇదిలా ఉంటే, కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 హంగామా జూలై 21 నుంచి ప్రారంభమైంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్లోకి అడుగుపెట్టారు. వీళ్లంతా టీవీ, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలే. గత సీజన్ మాదిరిగా ఈ సీజన్లో సాధారణ వ్యక్తులను తీసుకోలేదు. కాబట్టి ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారింది. 100 రోజులకు పైగా నడిచిన ఈ రియాలిటీ షోకి ఇది ఆఖరి రోజు. మొత్తం ఐదుగురు సభ్యులు.. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజాలలో విజేత ఎవరనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోనుంది.
| 0business
|
OLA
నిధుల కుమ్మరింతపై పరిమితి అవశ్యం
ముంబై, నవంబరు 7: క్యాబ్రవాణా సేవలరంగంలో ఇబ్బడిముబ్బడిగా నిధుల కుమ్మరింతపై ప్రభుత్వం దృష్టిసారించి క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఎంతై నా ఉందని క్యాబ్ ఆగ్రిగేటర్సంస్థ ఓలా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసింది. సంస్థలో జపాన్ సాఫ్ట్బ్యాంకు వంటి విదేశీ సంస్థలు రుణాలునిధులు వాటాలు కొను గోలుచేయడం వంటివి చేపట్టినా ఓలా మాత్రం ఈ నిధుల కుమ్మరింతపై ఫిర్యాదులుచేసింది. ఓలా చీఫ్ ఆపరేటింగ్ అధికారి ప్రణ§్ు జివ్రాజ్కా మాట్లాడు తూ ఇలాంటి నిధులు పెట్టుబడుల రాకపై ప్రభుత్వ పరంగా సహేతుకమయిన క్రమబద్ధీకరణ విధానం అవసరంఅవుతుందని ఆయనఅన్నారు. కంపెనీ ప్రధా న ప్రత్యర్ధి ఉబేర్ను ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా విదేశీ మూలధన నిధులను ధరలపరంగా వినియోగించేందుకు అనుమ తించకూడదని అభిప్రాయం వ్యక్తంచేశారు ఓలా ఇప్పటివరకూ 1.2 బిలియన్ డాలర్లు విదేశీ ఇన్వెస్టర్లు సాఫ్ట్బ్యాంకు, డిఎస్టి గ్లోబల్, యాక్సెకల్ పార్టనర్స్, సీక్వోయా కేపిటల్ వంటి సంస్థలనుంచి సాధించారు. ఓలా అంతకుముందు నిధుల సమీకరణ 500 మిలియన్ డాలర్లుగా సాఫ్ట్బ్యాంకు నుంచి సేకరించింది. దేశంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ కంపనీగా ఓలా నమో దయింది. ఈ విడత 600 మిలియన్లకుపైగా నిధులు సమీకరిస్తోంది. కంపెనీ విధివిధానాల ను అనుసరించి పుష్కలంగా మూలధనవనరు లున్నట్లుతెలిపారు. మార్కెట్ ప్రచారంపై తాను వ్యాఖ్యానించనని స్పష్టంచేశారు. ఆయన సొంత సంస్థ ఓలాకు పూర్తిగా విదేశీ నిధులు వస్తున్న అంశాన్ని ఉటంకిస్తే ఆయన సమాధానం దాటవేసారు. ఓలా సంస్థ పూర్తిగా విదేశీ ఇన్వెస్టర్ల నిధులతో నడుస్తోంది. అయితే ఈ నిధులను ధరలను తగ్గిం చేందుకు వినియోగించకూడదని ఆయన అభిప్రాయంగా చెప్పారు. ఈనిధులు కేవలం స్థిరత్వం, సుస్థిరఅభివృద్ధికి వినియోగించాలని ఆయన ఆకాంక్షించారు.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అన్నా.. టెన్షన్ పడొద్దు, మనకు వాళ్లున్నారు: ఎన్టీఆర్
నందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా జోడీగా ప్రముఖ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘నా నువ్వే’.
Samayam Telugu | Updated:
Jun 11, 2018, 09:25PM IST
నందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా జోడీగా ప్రముఖ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘నా నువ్వే’. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘నా నువ్వే’ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్లో ప్రి రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రి రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరై చిత్ర యూనిట్కి శుభాకాంక్షల్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాకు అన్నను చూస్తుంటే.. మూడు సంవత్సరా క్రితం నేను పడిన టెన్షన్ పడినట్టే కనిపిస్తున్నాడు. నాన్నకు ప్రేమతో చిత్రం సమయంలో కొత్త కాన్సెప్ట్, కొత్త గెటప్ జనానికి నచ్చుతుందా లేదా అనే టెన్షన్ ఉండేది. ఓ స్టీరియో టైప్ పాత్రలు చేసుకుంటూ పోతుంటే నటుడికి సంతృప్తి ఉండదు. అలానే ప్రేక్షకులకు, అభిమానులకు సంతృప్తి ఉండదు. కొత్త తరహా ప్రయోగాలు చేయాలి.
సినిమా హిట్ అయ్యిందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే.. హీరో బాగా చేశాడ్రా అని ప్రేక్షకులు భావిస్తే అసలైన సంతృప్తి అప్పుడే ఉంటుంది. నాన్నకు ప్రేమతో చిత్రం నాకు అలాంటి సంతృప్తినే మిగిల్చింది. నటుడిగా జర్నీ మొదలు పెట్టాక ఇలాంటి టెన్షన్ సర్వసాధారణం. అయితే మా అన్న ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన కష్టాన్ని గుర్తించే పెద్ద మనసు ప్రేక్షకులకు ఉంటుంది. అలా ప్రేక్షకుల మనసు దోచిన చిత్రాల్లో ఈ ‘నా నువ్వే’ ఉంటుందనేది నా ప్రగాఢ నమ్మకం.
మీరు పడిన కష్టం వృధా పోదు. ఆ దేవుడు తగ్గ ఫలితం ఇస్తాడు. దర్శకుడు జయేంద్ర మా అన్నని నమ్మి ఇంత మంచి సినిమా తీసినందుకు ధన్యవాదాలు. కళ్యాణ్ రామ్ కెరియర్లో ‘నా నువ్వే’ మైలురాయిగా నిలవాలని కోరుకుంటున్నా అంటూ జై ఎన్టీఆర్ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు ఎన్టీఆర్.
| 0business
|
యూఎస్ఏలో ఖైైదీ నెంబర్ 150 రికార్డు కలెక్షన్లు
Highlights
బాక్సాఫీస్ కొల్లగొడుతున్న మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 చిత్రం
యూఎస్ఏలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డు(బాహుబలి మినహా)
మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ కావడంతో యూఎస్ ఏలో యమ క్రేజ్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీనెంబర్ 150 ట్యాగ్ లైన్ బాస్ ఈజ్ బ్యాక్ ట్యాగ్ లైన్ కు తగ్గట్టే... బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. యూఎస్ఏలో చిరు నటించిన ఖైదీ నెంబర్ 150 మూవీ కేవలం బాహుబలి మినహా మరే సినిమా సాధించని కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించింది. టాప్ రెండో అత్యధిక గ్రాసర్ గా బాస్ 150 నిలిచింది. బుధవారం విడుదలైనా ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించడం మాత్రం మెగా స్టార్ చిరంజీవికే చెల్లిందని చెప్పాలి.
యూఎస్ ఏలో దాదాపు 140 స్క్రీన్స్ పై మూవీ ప్రదర్శించగా 1.251 మిలియన్స్ అమెరికన్ డాలర్లు కలెక్షన్స్ సాధించింది.
కాగా ఇప్పటివరకు కలెక్షన్స్ లో అగ్ర భాగాన నిలిచిన 10 సినిమాలు వరుసగా ఇలా ఉన్నాయి.
1. బాహుబలి: $1.36 మిలియన్
2. Khaidi No 150: $1.251 మిలియన్
3. సర్దార్ గబ్బర్ సింగ్: $616k
4. జనతా గ్యారేజ్: $584K
6. శ్రీమంతుడు: $536K
7. ఆగడు: $527K
9. సన్ ఆఫ్ సత్యమూర్తి: $347K
10. అత్తారింటికి దారేది: $345K
Last Updated 25, Mar 2018, 11:38 PM IST
| 0business
|
Visit Site
Recommended byColombia
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు అలాగే డియర్నెస్ అలవెన్స్ (డీఏ) కూడా లభిస్తుందని తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి డీఏ వస్తుందని పేర్కొన్నారు. అలాగే ఒక నెల జీతం దీపావళి బోనస్ కింద అందజేస్తామని తెలిపారు. నగరంలో మందగమనాన్ని ఎదుర్కొనేందుకు, పేదరికాన్ని అధిగమించేందుకు ఇది చాలా కీలకమైన నిర్ణయమని పేర్కొన్నారు.
Also Read: పోస్టాఫీస్ స్కీమ్ అదిరింది.. నెలకు రూ.5,000తో చేతికి ఏకంగా రూ.3.6 లక్షలు..!
ఆర్థికంగా వెనుకబడిన వారు నాణ్యమైన జీవితం గడిపేందుకు కనీస వేతన పెంపు నిర్ణయం అమలు దోహదపడుతుందని ఆయన తెలిపారు. చేతిలోకి ఎక్కువ డబ్బులు రావడం వల్ల వర్కర్లు కూడా ఎక్కువగానే ఖర్చు చేస్తారని, అప్పుడు మార్కెట్లో ఉత్పత్తి పెరుగుతుందని, దీంతో ఉద్యోగ కల్పన మ మెరుగు పడుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని వివరించారు.
Also Read: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం..
ఇకపోతో 2019 అక్టోబర్ 9న కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ 5 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జూలై 1 నుంచే ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
Also Read: ఆధార్ కార్డుతో పాన్ లింక్ చేసుకున్నారా? లేదంటే ఈ 5 ప్రయోజనాలు మిస్ అవుతారు!
మరోవైపు అక్టోబర్ 14న సుప్రీం కోర్టు.. ఢిల్లీ గవర్నమెంట్ నోటిఫై చేసిన కనీస వేతన నిర్ణయాన్ని సబబే అని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ కనీస వేతన పెంపును వ్యతిరేకిస్తూ 44 అసోసియేషన్లు సుప్రీం తలుపుతట్టాయి. అయితే సుప్రీం కోర్టు మాత్రం ఢిల్లీ నిర్ణయాన్ని సమర్థించింది. కాగా జాతీయ స్థాయి కనీస వేతనం రూ.4,628గా ఉండగా, ఢిల్లీలో మాత్రం ఇది రూ.14,842గా ఉండటం గమనార్హం.
| 1entertainment
|
New Delhi, First Published 1, May 2019, 12:03 PM IST
Highlights
సబ్సిడీ లేని వాణిజ్యపరమైన ఎల్పీజీ ధర మరింతగా పెరిగింది. 19 కిలోలో ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.22.5 పెంచారు. వాణిజ్యపరమైన ఎల్పీజీ సిలిండర్ ధర ఈ పెంపుతో రూ.730 అవుతుంది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహిళలకు షాక్ తగలింది. వంట గ్యాస్ ధర 6 రూపాయలు పెరిగింది. 14.2 కిలోల లిక్విఫైడ్ పెట్రోలియం (ఎల్పీజీ) గ్యాస్ సిలిండర్ ధరను రూ.6 పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి.
సబ్సిడీ లేని వాణిజ్యపరమైన ఎల్పీజీ ధర మరింతగా పెరిగింది. 19 కిలోలో ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.22.5 పెంచారు. వాణిజ్యపరమైన ఎల్పీజీ సిలిండర్ ధర ఈ పెంపుతో రూ.730 అవుతుంది.
ధరల పెంపు బుధవారం నుంచి, అంటే మే 1వ తేదీ నుంచే అమలులోకి వచ్చింది. సబ్సిడి మీద అందించే గృహ వినియోగ ఎల్పీజీ సిలిందర్ ధర ఢిల్లీలో 502 రూపాయలకు పెరిగింది.
పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 5 చొప్పున పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.13 కాగా, డీజీలి ధర రూ.66.71.
Last Updated 1, May 2019, 12:03 PM IST
| 1entertainment
|
అనుష్క, విరాట్ ఇప్పుడు పవర్ కపుల్.. ఈ జంట ఆస్తులెన్నో తెలుసా
Highlights
ఇటలీలో వివాహం చేసుకున్న విరాట్ , అనుష్క
నూతన దంపతులను పవర్ కపుల్ అంటున్న నెటిజన్లు
ఇద్దరి ఆస్తులు కలిపి కోట్లల్లో... ఏడాదిలో 140 శాతం పెరిగే అవకాశం.. వివరాలు
క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హిరోయిన్ అనుష్క శర్మ వివాహం ఇటలీలో అంగరంగవైభవంగా జరిగింది. వీళ్ల పెళ్లి వేడుక ఇపుడు ఇండియాలో హాట్ టాపిక్. ఈ సెలబ్రిటీ కపుల్ను ఇపుడు అంతా 'పవర్ కపుల్' అని పిలుస్తున్నారు. తాజాగా వీళ్ల ఆస్తులు లెక్కగట్టిన ఓ బ్రాండ్ ఎనలిస్ట్ వీళ్లిద్దరి ఆస్తులు కలిపి దాదాపు రూ. 600 కోట్లు ఉంటుందని లెక్కతేల్చారు.
"విరాట్ కోహ్లి-అనుష్క శర్మ వివాహం ఇండియన్ బ్రాండ్ మార్కెట్లో బిగ్గెస్ట్ మూమెంట్. ఇద్దరూ సమాన బలంతోపాటు అవకాశాలు కలిగి ఉన్నారు. ఈ జంట ఆస్తుల విలువ వచ్చే రెండేళ్లలో రూ. 1000 కోట్లకు చేరుతుందని ఈజీగా చెప్పగలను" అని ఎనలిస్ట్ శైలేంద్ర సింగ్ తెలిపారు.
ఇపుడు ఇద్దరూ భార్య భర్తలు అయ్యారు కాబట్టి స్టెబిలిటీ, ఫ్యామిలీ, ట్రూ అండ్ లాయల్టీ అనే కొత్త కేటగిరీలో... హౌస్ లోన్స్, కార్లు, ఇన్సూరెన్స్ లాంటి రంగాల్లో వీరికి మరిన్ని బ్రాండ్ ఎండోర్స్ మెంట్లు వచ్చే అవకాశం ఉందని శైలేంద్ర సింగ్ తెలిపారు.
ఫిన్ యాప్ అంచనా ప్రకారం... విరాట్ కోహ్లి రూ. 382 కోట్లు, అనుష్క శర్మ రూ. 220 కోట్ల విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్నారు. విరాట్ కోహ్లి మ్యాచ్ ఫీజు, ఐపీఎల్ సాలరీ, ఇతర ఆదాయం, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఈ భారీ మొత్తం సంపాదించారు. అనుష్క శర్మ సినిమాల రెమ్యూనరేషషన్, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ఇంత ఆస్తి కూడబెట్టిందట. గడిచిన మూడేళ్లలో అనుష్క ఆదాయం 80శాతం పెరిగింది. ఈ అంచనాల ప్రకారం వచ్చే మూడేళ్లలో ఆమె ఆస్తుల విలువ 30 శాతం, సంవత్సర ఆదాయం 18 శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
అనుష్క ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. బ్రాండ్ ఎండార్స్మెంట్లకు రూ. 4 కోట్లు చార్జ్ చేస్తున్నారు. ఆమె రియల్ ఎస్టేట్ రంగంలో ముంబైతో పాటు ఇండియా వ్యాప్తంగా రూ. 40 కోట్లు వ్యక్తిగతంగా ఇన్వెస్ట్ చేశారు. దీంతో పాటు రూ. 5 కోట్ల విలువ చేసే బిఎండబ్ల్యు, రేంజ్ రోవర్, మెర్సిడెజ్ బెంజ్ కార్లు కలిగి ఉన్నారు.
విరాట్ కోహ్లి సంవత్సరానికి రూ. 120 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. అతడి వరల్డ్ క్లాస్ రికార్డ్స్ వల్ల ప్రపంచంలో హయస్ట్ పెయిడ్ స్పోర్ట్స్ సెలబ్రిటీగా, స్పోర్ట్స్ ప్లేయర్గా వెలుగొందుతున్నాడు. అతడికి రూ. 9 కోట్ల విలువ చేసే ఆరు కార్లు మెర్సిడెజ్, ఆడి, బిఎండబ్ల్యు, వాగ్స్ వ్యాగన్ ఉన్నాయి.
ఇక ఫినాప్ రిపోర్ట్ అంచనాల ప్రకారం... విరాట్ ఆదాయం రాబోయే కాలంలో 140 శాతం పెరుగుతుందట. ఈ నేపథ్యంలో అతిడి ఆస్తులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇండస్ట్రీలో ‘పవర్ కపుల్'గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్, అనుష్క ఇప్పటికే 28 బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మున్ముందు ఇద్దరూ కలిసి బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించే అవకాశాలు ఉందని శైలేంద్ర సింగ్ తెలిపారు.
Last Updated 25, Mar 2018, 11:51 PM IST
| 0business
|
internet vaartha 244 Views
కోల్కతా : భారత్ స్టార్ క్రికెటర్లు ధోనీ,కోహ్లీ అంటే పడిచచ్చే అభిమానులు పాకిస్థాన్లో చాలా మంది ఉన్నారని ఆ దేశ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ పేర్కొన్నాడు. ఒకవేళ వారిద్దరూ పాకిస్థాన్కు వస్తే వాళ్లను చూసేందుకు అభిమానులు ఎక్కువగా వస్తారని, రోడ్లపై ట్రాపిక్ జామ్ అవుతుందన్నాడు. ఇరు దేశాల్లో క్రికెట్ చాలా పాపులర్ అని,ఆటగాళ్లపై ఎక్కువ ప్రేమానురాగాలు ఉంటాయన్నాడు.
పాక్లో కోహ్లీ,ధోనీకి సూపర్ స్టార్ స్టేటస్ ఉందన్నాడు. పాక్ ప్యాన్స్ క్రికెట్ దిగ్గజం సచిన్ చాలా సంవత్సరాలు ఆరాదించాడరని,తమపై ఆడేప్పుడు అతన్ని చూసి భయపడ్డారని వసీం వివరించాడు. ఇండియాలో కూడా అక్రమ్,ఇమ్రాన్,మియాందాద్లను ఆరాదించే వాళ్లున్నారని, ఇక పాక్లో కంటే భారత్లోనే తమకు ఎక్కువ ప్రేమ దక్కుతుందని వ్యాఖ్యానించి విమర్శల పాలైన ప్రస్తుత పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అప్రది ఇప్పుడు ఇతర విషయాల కంటే ఆటపైనే దృష్టి కేంద్రీకరించాలని అక్రమ్ సూచించాడు.ఆఫ్రిది వ్యాఖ్యలపై పాకిస్థాన్ మీడియా,పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.కాగా కోల్కతాలో జరుగనున్న టీమిండియా,పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఇరు దేశాల ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.తొలి మ్యాచ్లో ఓడిపోయిన భారత్,పాకిస్థాన్పై తప్పక గెలువాల్సి ఉంది.
| 2sports
|
Pharmacy
నియంత్రణ జాబితాలోకి మరికొన్ని ఔషధాలు
న్యూఢిల్లీ: జాతీయ ఔషధ ధరల నిర్ణాయక సంస్థ (ఎన్పిపిఎ) మరికొన్ని కీలక మందులను ధరల నియంత్రణ జాబితాలోనికి తెస్తున్నట్లుప్రకటించింది. జనవరి నెలలో 33 ఔషధాల ధరలను తగ్గించి నిత్యావసర మందుల జాబితాలో చేర్చింది. ఇప్పటికే ఎన్పిపిఎ 2016 ఏప్రిల్ నుంచి 620 ఔషధాల ధరలను నియంత్రణ జాబితాలో చేర్చింది. స్టెంట్లు మరింతగా అందుబాటులోనికి తెచ్చేందుకుగాను రెండోవిడత ఉత్పత్తిదారులు, దిగుమతిదారులతో ఈనెల ఏడవ తేదీ సమావేశం నిర్వహించి తమ వచ్చే ఆరేడునెలల కార్యాచరణను వారికి వివరించాలనినిర్ణయించింది. ధరల నియంత్రణ ఉత్పత్తులు 2-013 ప్రకారం ఎన్పిపిఎ అత్యసవర మందులకు ధరలను నియం త్రించింది. ఒక ప్రత్యేక చికిత్సావిభాగంలో వినియోగించే అన్ని రకాల మందుల ధరలను పరిగణ నలోనికి తీసుకుని సగటుధరల ఆధారంగా వీటి ధరలను నిర్ణయిస్తుంది. అయితే వీటి విక్రయాలు ఒకటిశాతంకంటే ఎక్కువ అయి ఉండాలి. ధరల నియంత్రణ జాబితాలోలేని మందులపరంగా ఉత్పత్తి దారులు సాలీనా పదిశాతానికి మించి ధరలు పెంచకూడదు. మొత్తం 2013 డిపిసిఒ ప్రకారంచస్తే 680 ఔషధ ఫార్ములేషన్స్ను నోటిఫై చేసింది. 2014 మే 15వ తేదీనుంచి ఈ ఉత్తర్వులు అమలులోనికి వచ్చాయి. అంతకుముందు 1995లో జారీచేసిన ఉత్తర్వులస్థానంలోనే వీటిని జారీచేసింది. 1997లో ఏర్పాటుచేసిన ఎన్పిపిఎ ధరల నియంత్రణ, నిర్ధారణచేస్తుంది. అలాగే డిపిసిఒ ఉత్తర్వులకు ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ కూడా ఉంటుంది. నియంత్రణ ఔషధాలు, నియంత్రణలో లేని మందులధరలను కూడా విధిగా ఎన్పిపిఎ పర్యవేక్షణ చేస్తుంది.
| 1entertainment
|
Visit Site
Recommended byColombia
భారత్తో సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జట్టుని ప్రకటించిన తర్వాత.. బంగ్లా క్రికెటర్లు స్ట్రైక్ చేశారు. జీతాల పెంపుతో పాటు 11 డిమాండ్లని బోర్డు ముందు ఉంచి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే..? భారత్ టూర్కి వెళ్తామని స్పష్టం చేశారు. ఈ స్టైక్ని షకీబ్ అల్ హసనే ముందుండి నడిపించాడు. అయితే.. ఈ స్ట్రైక్ జరుగుతున్న సమయంలోనే బంగ్లాదేశ్కి చెందిన లోకల్ టెలికాం సంస్థ గ్రామీణఫోన్ తమ బ్రాండ్ అంబాసిడర్గా షకీబ్తో ఒప్పందం చేసుకుంది. బీసీబీ నిబంధనల ప్రకారం.. బోర్డుతో సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ఆటగాడు ఏ టెలికాం సంస్థతోనూ ఒప్పందం చేసుకోకూడదు. దీంతో.. క్రమశిక్షణ తప్పిన షకీబ్కి బోర్డు అతనికి షోకాజ్ నోటీసులు పంపింది. రెండు రోజుల క్రితం ఆటగాళ్ల డిమాండ్లపై బీసీబీ సానుకూలంగా స్పందించడంతో స్ట్రైక్ ముగిసిన విషయం తెలిసిందే.
Read More: భారత్లో బంగ్లాదేశ్ టూర్.. మ్యాచ్ల షెడ్యూల్ ఇదే
‘టెలికాం సంస్థ ఒప్పందంపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. ఒప్పందం చేసుకున్న ఆటగాడితో పాటు కంపెనీ నుంచి కూడా నష్టపరిహారాన్ని కోరతాం. ఇప్పటికే టెలికాం సంస్థ గ్రామీణఫోన్కి లీగల్ నోటీసులు పంపాం. అలానే ఒప్పందం చేసుకున్న షకీబ్ నుంచి కూడా వివరణ కోరాం. బోర్డు నిబంధనల్ని షకీబ్ ఉల్లఘించినట్లు తేలితే అతనిపై చర్యలు తీసుకుంటాం’ అని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్లా హసన్ స్పష్టం చేశాడు.
| 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
టాప్ డైరెక్టర్ కోసం బండ్ల గణేష్ ట్రయల్స్
లీడింగ్ స్టార్స్, టాప్ డైరెక్టర్లతోనే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేసే బండ్ల గణేష్.. తాజాగా మరో టాప్ డైరెక్టర్తో చర్చలు జరుతున్నాడు.
TNN | Updated:
Sep 11, 2015, 11:10AM IST
పెద్దపెద్ద స్టార్ హీరోలు , హీరోయిన్స్, దర్శకులతోనే సినిమాలు తీయడానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చే నిర్మాత బండ్ల గణేష్ తాజాగా మరో టాప్ డైరెక్టర్తో సినిమాకి ట్రయల్స్ వేస్తున్నాడని తెలుస్తోంది. టాలీవుడ్ సర్కిల్స్ అప్డేట్ ప్రకారం.. శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివతో బండ్ల గణేష్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య సంప్రదింపులు కూడా అడ్వాన్స్ స్టేజ్లో వున్నాయనే టాక్ వినిపిస్తోంది. కానీ కొరటాల మాత్రం ఆల్రెడీ శ్రీమంతుడు మూవీని ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీస్ బ్యానర్కి మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కొరటాల ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడా అనేదే ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బండ్ల గణేష్తో ప్రాజెక్ట్ ఓకే అయితే, మిర్చి , శ్రీమంతుడు వంటి సీరియల్ హీట్స్తో హ్యాట్రిక్ రేసులో వున్న కొరటాల ప్రాజెక్టులో నటించబోయే ఛాన్స్ ఎవరికి దక్కుతుందోననే సస్పెన్స్ కూడా నెలకొని వుంది.
| 0business
|
Sep 23,2017
మైక్రోమ్యాక్స్ నుంచి 'సెల్ఫీ 3' స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ తాజాగా 'సెల్ఫీ 3' స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. యాండ్రాయిడ్ నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ ఫోన్లో 5 అంగుళాల తెర, ఫింగర్ ప్రింట్ సెన్సర్, క్వాల్కామ్ స్పాప్డ్రాగన్ 435 ప్రాసెసర్, 16 ఎంపీ ముందు కెమేరా, 13 ఎంపీ వెనుక కెమేరాతో లభించనుంది. అలాగే 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 3జీబీ ర్యామ్తో పాటు 32 జీబీ అంతర్గాత మెమొరీ అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. దేశంలోని అన్ని ప్రధాన రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉందని తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
BHARATHI AIRTEL
ముంబయి: ఆర్జియో పోటీని తట్టుకుని మార్కెట్లో గట్టిపోటీ ఇచ్చే లక్ష్యంతో భారతి ఎయిర్టెల్
మరో బ్రాడ్బ్యాండ్ ఆఫర్ను ముందుకు తెచ్చింది. 1000జిబి హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను పరిమిత కాలపు
ఆఫర్గా ఇస్తోంది. కొత్త స్కీంలో ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ బిగ్బైట్ ఆఫర్గా చెపుతోంది. కంపెనీ
500-1000జిబి బోనస్డేటాను అన్ని నెలావారీ అద్దెప్లాన్లకు వర్తింపచేస్తోంది. రూ.599 నుంచి
రూ.1999ప్లాన్లకు వర్తింపచేస్తోంది. ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లో ఈ అంశాలను
పొందుపరిచింది. 8ఎంబిపిఎస్ స్పీడ్నుంచి 1000ఎంబిపిఎస్వరకూ ఇవ్వాలని ప్లాన్
ఆధారంగా ఈ వేగం ఉటుందని వెల్లడించింది. 2018 మార్చి 31వ తేదీవరకూ
ఈప్లాన్ కొనసాగుతుంది. కేవలం ఆన్లైన్కొనుగోళ్లకే ఈ ప్లాన్ అందుబాదటులో
ఉంటుంది. ఎయిర్టెల్ డిఎస్ఎల్ సేవలచందాదారులు జూన్ తర్వాతనుంచి
ఈ ఆఫర్ అందుకోవచ్చు. బిగ్బైట్ప్లాన్లో వినియోగించని ప్లాన్ను వచ్చేనెలకు
అందిసుతంది. 1000జిబి బిగ్బైట్డేటా ముందు బేస్ప్లాన్ 50జిబి కి వర్తింపచేస్తారు.
ఆతర్వాత బేస్ప్లాన్ పూర్తయినవెంటనే బిగ్బైట్డేటా అమలుకువస్తుంది.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘మళ్లీ రావా’ టీజర్: హిట్ కొట్టేలా ఉన్నాడే!
అక్కినేని హీరో సుమంత్ లేటెస్ట్ మూవీ ‘మళ్లీ రావా’ సైలెంట్గా షూటింగ్ పూర్తిచేసి టీజర్తో ప్రేక్షకులముందుకు వచ్చేసింది.
TNN | Updated:
Aug 3, 2017, 05:17PM IST
అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ దాన్ని వినియోగించుకోవడంలో సత్ఫలితాలు పొందలేకపోతున్నాడు హీరో సుమంత్ . అతడు హీరోగా చేసిన సినిమాలు అంటే గుర్తొచ్చేవి 'గోదావరి', 'సత్యం' మాత్రమే.. వాటికి మించిన ఘన విజయాలు అతడి కెరీర్‌లో లేవు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పోటీ పెరిగిపోతున్న క్రమంలో హీరోగా తనను నిలబెట్టే సినిమా అని భావించి బాలీవుడ్‌లో వచ్చిన 'విక్కీ డోనార్' సినిమాను తెలుగులో 'నరుడా డోనరుడా' అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా కూడా సుమంత్‌కు నిరాశనే మిగిల్చింది.
దీంతో ఈసారి సైలెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'మళ్ళీ రావా' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎలాంటి హడావిడి లేకుండా కామ్‌గా సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసేశాడు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన చిన్న టీజర్‌ను మచ్చుకు రిలీజ్ చేశాడు.
| 0business
|
Hyderabad, First Published 9, Jul 2019, 2:37 PM IST
Highlights
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే జయాపజయాలని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం తేజు కెరీర్ స్టడీగా కొనసాగుతోంది.
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే జయాపజయాలని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం తేజు కెరీర్ స్టడీగా కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పోలికలతో ఉండడం తేజుకు అడ్వాంటేజ్. ఇదిలా ఉంటే కేవలం పోలికలు మాత్రమే కాదు సేవ కార్యక్రమాలు విషయంలో కూడా తేజు మావయ్యలని ఆదర్శంగా తీసుకుంటున్నాడు.
సాయిధరమ్ తేజ్ తాజాగా 100 మంది పిల్లలున్న ఓ స్కూల్ ని దత్తత తీసుకున్నాడు. థింక్ పీస్ అనే ఆర్గనైజేషన్ లో తేజు భాగస్వామి. వారితో కలసి మున్నిగూడలోని అక్షరాలయ అనే స్కూల్ కు సాయిధరమ్ తేజ్ రెండేళ్ల పాటు సేవలు అందించనున్నాడు. పిల్లలకు అవసరమైన పోషకాహారాలతో పాటు ఇతర అవసరాలని తేజు ఈ సంస్థతో కలసి తీర్చనున్నాడు.
ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అభిమానులు కూడా తోచిన విధంగా విరాళాలు అందించాలని సాయిధరమ్ తేజ్ కోరాడు. రెండేళ్ల పాటు ఈ స్కూల్ లో సేవ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ ఏడాది మరో 50 మంది పిల్లలని కూడా దత్తత తీసుకోబోతున్నట్లు తేజు ప్రకటించాడు.
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 'ప్రతిరోజు పండగే' చిత్రంలో నటిస్తున్నాడు. మారుతి ఈ చిత్రానికి దర్శకుడు. బన్నీవాసు, యూవీ క్రియేషన్స్ సంస్థ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుప్రీం తర్వాత రాశి ఖన్నా మరోమారు ఈ చిత్రంలో తేజు సరసన నటిస్తోంది.
Last Updated 9, Jul 2019, 2:39 PM IST
| 0business
|
Ashok Gajapatiraju
విమాన రంగంపై జిఎస్టి 12% లోపే ఉండాలి
న్యూఢిల్లీ,: దేశంలో పౌరవిమాన యాన రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు వీలుగా టికెట్లపై జిఎస్టి అమలయితే 12శాతం కంటే తక్కు పన్నురేటును మాత్రమే అమలుచేయాలని కోరుతూ ఆ శాఖమంత్రి అశోక్గజపతిరాజు ఆర్థికశాఖకు ప్రతిపాదన లు పంపించారు. అలాగే జిఎస్టిపరిధిలోకే యేవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ను తీసుకురావాలని కోరారు. అలా చేయకపోతే జిఎస్టి అమలువల్ల రేట్లు మరింతగాపెరుగుతాయని వెల్లడించారు. అయితే ఆర్ధ్థిక మంత్రి మాత్రం ఎటిఎఫ్ డిమాండ్ను అంగీకరించకపోవచ్చని, ఇప్పటికే పెట్రోలియం జిఎస్టిపరిధిలోలేదని అందు వల్ల ఎటిఎఫ్పై పన్ను విధించే సమస్య ఉత్పన్నం కాబోదని చెపుతున్నారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు ఎటిఎఫ్పై పన్నులు విధిస్తున్నాయి. ఎక్సైజ్డ్యూటీ, వ్యాట్లు వీటిలోకీలకం. సేవాపన్ను ఆరుశాతంగా ఉంది. ఎకానమి ఎయిర్ట్రావెల్కు ఆరు, తొమ్మిదిశాతం ప్రీమియం తరగతులకు వసూలుచేస్తున్నారు. ప్రస్తుతం జిఎస్టి విధానం అమలయితే వివిధ రాష్ట్రాలు, దేశాలమధ్య జరిగే ప్రయాణాలపై పునఃసమీక్ష చేయాల్సి ఉంటుంది. వివిధ రాష్ట్రాలు, దేశాలమధ్య జరిగే ప్రయాణాలను వేరువేరుగా పరిగణించాలా అన్నదే ప్రస్తుతం సమస్యగా ఉంది. జిఎస్టి అమలు ఎక్కడ విమానం ఎక్కుతారో ఆ కేంద్రంగా మాత్రమే అమలవుతుంది. ఈ విధానం ప్రస్తుత జిఎస్టి అమ లుకు భిన్నంగా ఉంది. అలాగే తిరుగుప్రయాణం కూడా ఒక ప్రత్యేక ప్రయాణంగా పరిగణిస్తారు. ఎక్కడ ఆగినా బయలుదేరే కేంద్రం మాత్రమే పరిగణనలోనికి వస్తుంది. భారత్ బయట తిరుగుప్రయాణం ప్రారంభం కేంద్రం ఉంటే సేవాపన్ను వర్తించ దని నిపుణులు చెపుతున్నారు. జిఎస్టి మండలి కూడా పరోక్ష పన్నులపరంగా 18శాతం పన్నురేటు అమలుచేయాలని సూచించింది. కొన్ని అత్యవసర సర్వీసులు మాత్రం ఆరునుంచి 12శాతం మధ్యలో ఉండాలని నిర్ణయించింది. అయితే పూర్తిస్థాయి నిర్మాణక్రమం ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇదే విధానం అమలయితే టికెట్ల ఖర్చుపెరుగుతుంది. జిఎస్టి బయట ఎటిఎఫ్ ఉంటున్నందున ఇన్పుట్క్రెడిట్ అనేదిఉండదు. ఎయిర్క్రాప్ట్లీజులు, విడిభాగాలు, యంత్రపరికరాలపై కూడా ధరలు పెరుగు తాయి. అలాగే నగదు అవసరాలు కూడా ఆయా సంస్థలకు పెరుగుతాయి. విమానయాన సంస్థలకు ఎప్పుడో తర్వాత ఇన్పుట్ ట్యాక్స్క్రెడిట్లు వచ్చినా ఇప్పటికిప్పుడు భరించాల్సి వస్తుందని ఆసియాపసిఫిక్ ఏవియేషన్ కేంద్రం (కాపా) తన 2017-18ఇండియా ఏవియేషన్ ముఖచిత్రంలో వివరించింది. మొత్తంమీద జిఎస్టిని 12శాతం కంటే తక్కువగా మాత్రమే అమలుచేయాలని కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు ఆర్థికమంత్రికి ప్రతిపాదించడం ఈ రంగంలో ఎకానమి తరగతి ప్రయాణాలను మరింత ప్రోత్సహించినట్లవుతుంది.
| 1entertainment
|
Rahul chowdary
హైదరాబాద్: ప్రొ కబడ్డీ బాయ్, తెలుగు టైటాన్స్ సారథి రాహుల్ చౌదరి మరో అరుదైన రికార్డు ఖాతాలో
వేసుకున్నారు. అన్ని సీజన్లలో కలిపి 609 రైడింగ్ పాయింట్లు చేసిన ఒకే ఒక ఆటగాడిగా నిలిచారు.
బెంగుళూరు బుల్స్తో జరిగిన మ్యాచ్లో 8 పాయింట్లు చేసి ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు 74
మ్యాచ్లు ఆడిన రాహుల్ మొత్తం 645 పాయింట్లు సాధించారు. అందులో 603 రైడింగ్, తక్కిన
42 ట్యాకిల్ పాయింట్లు. అన్ని సీజన్లలో కలిపి 1267 సార్లు కూతకెళ్లిన రాహుల్ 486 సార్లు
విజయవంతం అయ్యారు. 225 సార్లు ప్రత్యర్థులకు చిక్కారు. 556 సార్లు పాయింట్లు లేకుండా వచ్చారు.
| 2sports
|
Visit Site
Recommended byColombia
రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్లో సినిమా వస్తుందనే విషయం ఖరారైనా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తారక్, చరణ్ సైతం ఈ విషయాన్ని రాజమౌళే వెల్లడిస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘RRR’కు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమా డిసెంబర్లో సెట్స్పైకి వెళ్తుందని.. సినిమాలో చరణ్, ఎన్టీఆర్ అన్నదమ్ములని, బాక్సర్లని.. ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నారని.. ఇలా చాలా కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఇదే కోవలో మరో వార్త హల్చల్ చేస్తోంది.
ఈ సినిమా షూటింగ్ నవంబర్లో ప్రారంభమవుతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే సినిమా కోసం ఎన్టీఆర్ కసరత్తులు మొదలుపెట్టేశారట. ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా కొత్త లుక్లో ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించనున్నారని టాక్. ఫస్ట్ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉంటుందని, ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ మాత్రమే పాల్గొంటారని అంటున్నారు. దీని తరవాత జనవరిలో రెండో షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Hyderabad, First Published 8, Aug 2019, 10:00 AM IST
Highlights
నాగార్జున, ధనుష్ కాంబినేషన్ లో రావాల్సిన 'రుద్ర' సినిమా మధ్యలోనే ఆగిపోయిందని నాగ్ చెప్పుకొచ్చారు. తాజాగా నాగార్జున నటించిన 'మన్మథుడు 2' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు నాగ్. ఈ క్రమంలో ధనుష్ సినిమా ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా ఆగిపోవడం తనకు కూడా పెద్ద షాక్ అని చెప్పాడు నాగ్.
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున తమిళంలో ధనుష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ లో నటించడానికి సైన్ చేశారు. 'రుద్ర' అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. నిజానికి రజినీకాంత్ తో చేయాల్సిన పాత్ర అది. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో నాగార్జునని తీసుకున్నారు.
ఎస్ జే సూర్య, అరవింద్ స్వామీ, అడితిరావు హైదరి వంటి తారలు సినిమాలో ఉండడంతో ప్రాజెక్ట్ పై హైప్ పెరిగింది. రూ.70కోట్లతో సినిమాను రూపొందించడానికి ప్లాన్ చేసుకున్నారు. నాగార్జున సినిమా షూటింగ్ కి కూడా హాజరయ్యాడు. అయితే సడెన్ గా సినిమాకి బ్రేక్ పడింది.
ఎవరూ దాని గురించి స్పందించలేదు. నాగ్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. తాజాగా నాగార్జున నటించిన 'మన్మథుడు 2' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు నాగ్. ఈ క్రమంలో ధనుష్ సినిమా ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా ఆగిపోవడం తనకు కూడా పెద్ద షాక్ అని చెప్పాడు నాగ్. సినిమా కోసం దాదాపు 35 రోజులు షూటింగ్ చేశామని.. ఆ తరువాత ఏమైందో తెలియదని.. సినిమా రద్దయిందని.. అది పెద్ద షాక్ అంటూ చెప్పుకొచ్చాడు నాగ్.
ఇక హిందీలో తాను చేస్తోన్న మరో మల్టీస్టారర్ సినిమా 'బ్రహ్మాస్త్ర'లో తన పాత్ర సర్ప్రైజింగ్ గా ఉంటుందని.. సినిమాలో ప్రతీ పాత్ర అధ్బుతంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదని అన్నారు.
Last Updated 8, Aug 2019, 10:00 AM IST
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 27,916 వద్ద ముగిసింది. నిఫ్టీ 2 పాయింట్లు లాభంతో 8,615 వద్ద ముగిసింది...
TNN | Updated:
Oct 27, 2016, 04:13PM IST
గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 27,916 వద్ద ముగిసింది. నిఫ్టీ 2 పాయింట్లు లాభంతో 8,615 వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగం కొనుగోళ్లు కనిపించడంతో మార్కెట్ కొంత రికవరీ అయింది. హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ బాస్కెట్లో షేర్లు అమ్మకాలతోనే ట్రేడ్ అయ్యాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, ఏసియన్ పెయింట్స్, ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా పవర్, ఐడియా సెల్యూలార్, హీరో మోటార్ కార్ప్స్ షేర్లు నష్టపోయాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 66.86 వద్ద స్థిరపడింది.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Stock Market:35వేలకు దిగువన సెన్సెక్స్
ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ కీలక 35వేల దిగువకు దిగజారింది
Samayam Telugu | Updated:
May 29, 2018, 04:57PM IST
ఈ రోజు(మంగళవారం) మార్కెట్లు నష్టాలతో సరిపెట్టుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. ఒక వైపు ఇటలీ, మరోపక్క స్పెయిన్లో తలెత్తిన రాజకీయ అనిశ్చితి కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. డాలరుతో మారకంలో యూరో ఆరున్నర నెలల కనిష్టం 1.15ను తాకగా.. యూరోపియన్ స్టాక్ మార్కెట్లు 3-1 శాతం మధ్య పతనమయ్యాయి. దీంతో దేశీయంగానూ మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్ కీలక స్థాయి 35వేల నుంచి కిందకు దిగజారింది.ట్రేడింగ్ ముగిసేసరికి 216 పాయింట్లు క్షీణించి 34,949 వద్ద నిలిచింది.మరో సూచీ నిఫ్టీ 55.35(0.52%) పాయింట్లు కోల్పోయి 10,633 వద్ద ముగిసింది.
నష్టాల్లో మార్కెట్లు
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఎం అండ్ ఎం(2.26%), భారతీ ఎయిర్టెల్(1.08%), ఇన్ఫీ(0.72%), టీసీఎస్(0.54%), హీరో మోటోకార్ప్(0.45%) ఎక్కువగా లాభపడిన వాటిలో ఉండగా, మరో వైపు ఐసీఐసీఐ బ్యాంకు(2.87%), ఎస్బీఐఎన్(2.70%), ఇండస్ ఇండ్ బ్యాంక్(1.80%), యెస్ బ్యాంక్(1.78%), కొటక్ బ్యాంక్(1.63%), ఏసియన్ పెయింట్స్(1.49%) అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందున్నాయి.
| 1entertainment
|
internet vaartha 180 Views
ఫతేమైదాన్ : క్యారమ్స్లేని ఇల్లు అంటూ ఉండదని తెలంగాణ క్రీడా పాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఏ. దినకర్బాబు అన్నారు. నూతనంగా భారత క్యారమ్స్ సంఘం రూపొందించిన వెబ్సైట్ను ఆయన ఎల్బీస్టేడియంలోని ఫతేమైదాన్ క్లబ్లో సోమవారం నాడు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు బిజీగా ఉండే ప్రజలకు కార్యమ్ ఆట ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుందన్నారు. విద్యార్ధులు చదువుకు ఎంత ప్రధాన్యతను ఇస్తున్నారో అదే ప్రధాన్యతన ఇవ్వాలని దినకర్బాబు సూచించారు. ఎంతో అధారణ కలిగిన క్యారమ్స్కు మంచి రోజులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోనే సూపర్పవర్ ఉన్న ఏకైక క్రీడాంశం క్యారమ్స్అని అవివర్ణించారు. క్యామ్ క్రీడాంశానికి అభ్యున్నతికి వందశాతం సహకారం తెలంగాణ క్రీడాపాధికార సంస్థ నుంచి ఉంటుందని దినకర్బాబు హామి ఇచ్చారు. ప్రతి గ్రామంలో ఏదో ఒక ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు క్యారమ్స్ ఆట అడుతున్న విషయం మనందరికి తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో కూడా కారమ్స్క్రీడా కారులను ప్రొత్సహిచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గౌరవ అతిథిగా విచ్చేసిన భాతర క్యారమ్స్ చైర్మన్ పేరాల చంద్రశేఖర్రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో తెలంగాణ రాష్ట్రం నుంచి గొప్ప క్యారమ్ క్రీడాకారులను తయారు చేయడానికి అన్ని విధాలా ప్రతిపదనలు రూపొందించేందుకు భారత క్యారమ్ సంఘం ఏర్పాట్లు చేస్తుందని అయన అన్నారు. క్యారమ్స్ సంఘం రూపొందించిన వెబ్సైట్లో అయన పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కువ మంది అడేది క్యారమ్స్అని, చూసేది మాత్రం క్రికెట్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా క్యారమ్స్కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి అందరు కలిసికట్టుగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఇంటికి క్యారమ్ అడే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. భారతదేశంలో ఇషన్య రాష్ట్రాల్లో కూడా క్యారమ్స్ను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానని చంద్రశేఖర్రావు అన్నారు. ఇంక ఈ కార్యక్రమంలో భారత క్యారమ్స్సంఘం అధ్యక్షుడు సంపత్, కోశాధికారి మధన్రాజ్, హైదరాబాద్ క్యారమ్ సంఘం అధ్యక్షుడు బి.కె.హరినాధ్తో పాటు అంతర్జాతీయ క్యారమ్ క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
| 2sports
|
internet vaartha 110 Views
ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటుకు కసరత్తు షురూ
న్యూఢిల్లీ : సామాజిక వెబ్సైట్ల ఆధారంగా నిరంతరం మార్కెట్ కదలికలు, వృద్ధి అంశాలపై లావాదేవీలు నడుస్తున్నట్లు గమ నించిన మార్కెట్ల పర్యవేక్షణ సంస్థ సెబి కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ట్విట్టర్ హ్యాండిల్, ఫేస్బుక్ల సాయంతో నిరంతరం స్టాక్ లావాదేవీల కదలికలు తెలుస్తున్నాయి. ఇందుకోసం ఒక ప్రతిభావంతమైన స్వతంత్ర ఏజెన్సీని ఏర్పాటుచేస్తోంది. సామాజిక మీడియా ప్లాట్ఫామ్లపై సెబీ కూడా తన పరిధిని విస్తరించేవిధంగా ఈ సంస్థ కసరత్తులు చేస్తుంది. ఈ ఏజెన్సీ సోషల్మీడియా లావాదేవీల్లో జరిగే హోరుజోరుకు బ్రేకులు వేస్తుంది. రిజిస్టరు అయిన వెబ్సైట్లు, అసోసియేషన్లు సెబి రిజిష్టరు అయిన మూచువల్ఫండ్ సంస్థలు, రెయిన్ సంస్థలు, బ్లాగ్లు సలహాలు, ఇన్వెస్టర్ల సూచనలు, లింక్డ్ ఇన్ గ్రూప్లు, న్యూస్ఛాట్రూమ్స్, బ్లూంబర్గ్, రాయిటర్స్చాట్స్వంటి వాటి ని పరిశీలించి అవసరమైతే కట్టడిచేసేందుకు సూచనలిస్తుంది. అత్యంత కీలకమైన, సున్నితమైన సమాచారాన్ని ఈ ప్రత్యేక ఏజెన్సీ సెబీకి అందుబాటులో ఉంచుతుంది. టిప్లస్వన్ ఆధా రంగా కనీసం మరుసటిరోజుకైనా సెబీకి చేరేటట్లు సమాచా రం సేకరిస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు వెబ్సైట్ ఆధారిత న్యూస్ఫీడ్, ప్రింట్ మీడియా న్యూస్ఫీడ్లను కూడా సేకరించి సెబీకి అందచేస్తుంది. భార తీయ సెక్యూరిటీ మార్కెట్లను ఈ ప్రత్యేక ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది. వీటితోపాటు అదనంగా సెబి తరపున సామాజిక మీడియా కార్యలకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఈతరహా ఏజెన్సీగా కొనసాగేందుకు ముందు కు వచ్చే సంస్థలు కనీసం రూ.10 కోట్ల టర్నోవర్తో కఉండాలి. గడచిన మూడు ఆర్థికసంవత్సరాల్లో ఈ టర్నోవర్ నమోదయి ఉండాలి. అలాగే వెబ్క్రాలింగ్ సేవలు నిర్వహించే సామర్ధ్యం ఉండాలి. డేటా అన్వే షణ, విశ్లేషణరంగాల్లో 2012 నుంచి కొనసాగుతున్న సంస్థలై ఉండాలి. సెబి తరపున నియమించే ఏజెన్సీ ప్రమోటర్లు, డైరెక్టర్లు గతంలో ఎటువంటి నేరచరిత్ర ఉన్నవైవై ఉండకూడదు. అలాగే ఏ ప్రభుత్వసంస్థ, కోర్టులకు జరిమానాలు చెల్లించిన రికార్డు ఉండకూడదు. ప్రత్యేక నోటీసును జారీచేసి సెబి ఈ ప్రత్యేక ఏజెన్సీ నిర్వహణకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు కోరింది. వెబ్క్రాలింగ్, డేటా వెలికితీత, సమాచార యాజమాన్యం వంటివాటిలో పటిష్టంగా ఉన్న స్వతంత్ర ఏజెన్సీలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వచ్చేనెల పదవతేదీలోపు దరఖాస్తులు అందించాలి.
| 1entertainment
|
ఎన్టీఆర్ ఫిట్ నెస్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా.?
Highlights
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభమయ్యే సినిమా కోసం ఎన్టీఆర్ ఫుల్గా ప్రిపేర్ అవుతున్నాడు.
అందుకే ముందుగా ఫిక్స్ చేసిన డైట్ ప్లాన్ ప్రకారమే ఫుడ్ తీసుకుంటున్నాడట.
గతంలో ఎన్నడూ చూడని తారక్ ను మనం చూడ్డం ఖాయంగానే కనిపిస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభమయ్యే సినిమా కోసం ఎన్టీఆర్ ఫుల్గా ప్రిపేర్ అవుతున్నాడు. మొదటిసారిగా త్రివిక్రమ్తో జత కడుతున్న తారక్.. తను గతంలో ఎన్నడూ కనిపించనంత ఫిట్ గా ఈ మూవీలో అభిమానులకు సర్ప్రైజ్ చేయాలని ప్రిపేర్ అయిపోతున్నాడు.ఇప్పటికే వర్కవుట్స్ చేస్తున్న ఎన్టీఆర్.. ఈ నెల 23 నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. అప్పటివరకు మాత్రమే కాదు.. సినిమా పూర్తయ్యే వరకూ ఫిట్నెస్ కంటిన్యూ చేయాల్సి ఉంది. అందుకే ముందుగా ఫిక్స్ చేసిన డైట్ ప్లాన్ ప్రకారమే ఫుడ్ తీసుకుంటున్నాడట. కండలు కరిగించడమే కాదు.. వాటిని మెయింటెయిన్ చేయడం కోసం చాలానే కష్టపడాల్సి ఉంది. ఆల్కహాల్ కు కూడా పూర్తిగా దూరంగా ఉండడమే కాదు.. నెలకు ఒక్కసారి మాత్రమే కోరుకున్న పుడ్ తీసుకునేందుకు అనుమతి లభిస్తుండదట.ఎగ్ వైట్స్.. చికెన్.. ఫ్రెష్ ఫ్రూట్స్.. వెజిటబుల్స్.. ఇది బ్రేక్ ఫాస్ట్. అలాగే స్నాక్స్ రూపంలో ఆల్మండ్స్.. వాల్నట్స్ మాత్రమే తీసుకుంటున్నాడట. రోస్టెడ్ చికెన్.. ఫ్రైడ్ మటన్.. ఫిష్ ను లంచ్ - డిన్నర్ లుగా తీసుకోవాల్సి ఉంటుందట. ఈ ఫుడ్ కూడా క్రమంగా తగ్గిపోతుందట. లాయిడ్ స్టీవెన్ కు ఈ ట్రైనింగ్ కోసం ఏకంగా 6 లక్షల రూపాయలు చెల్లించనున్నారట. గతంలో ఎన్నడూ చూడని తారక్ ను మనం చూడ్డం ఖాయంగానే కనిపిస్తోంది.
Last Updated 26, Mar 2018, 12:00 AM IST
| 0business
|
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో న్యూ మూవీ ప్రారంభోత్సవం గ్యాలరీ
First Published 27, Nov 2017, 4:58 PM IST
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ ద
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ ద
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ ద
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ ద
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ ద
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ ద
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ ద
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ ద
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ ద
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ ద
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ ద
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ ద
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ ద
Recent Stories
| 0business
|
RBI
రూ.10వేల కోట్ల బాండ్ల విక్రయం
ముంబయి, జూలై 24:: భారతీయ రిజర్వుబ్యాంకు ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలకింద 10వేల కోట్ల బాండ్లను జారీచేసేందుకు నిర్ణయించింది. ఆగస్టు 10వ తేదీన ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఒఎంఒ) పరిధిలో మూడోసారి సావరిన్ బాండ్లను విక్రయించనున్నది. బ్యాంకుల్లో అదనంగా ఉన్న నగ దును వెలికితీసేందుకుగాను ఈ బాండ్లను జారీచేస్తోంది. ప్రస్తుతం నెలకొన్ని ఉన్న ద్రవ్యలభ్యత పరిస్థి తులను ఆధారంగా చేసుకుని రిజర్వుబ్యాంకు పది వేలకోట్లకుపైబడిన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్ర యిస్తుందని వెల్లడించింది. కేంద్ర బ్యాంకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ విధానాన్నే సెక్యూరిటీల విక్ర యానికి ఎంచుకుంటుంది. ఈనెలలోనే అంతకు ముందు ఒఎంఒ విక్రయాలకింద రెండుసార్లు పది వేల కోట్ల చొప్పున సెక్యూరిటీలను జారీచేసింది. తటస్థ ద్రవ్యలభ్యత విధానం అనుసరించేందుకు గాను రిజర్వుబ్యాంకు ఈవిధానం అను సరిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో అద నంగా ఉన్న మూడులక్షలకోట్లను సెక్యూ రిటీల జారీద్వారా రాబడుతున్నట్లు స్పష్టం అవుతున్నది. అలాగే మార్కెట్ల లో మరో 25శాతం ఆర్బిఐ వడ్డీరేట్ల కోత ఉంటుందని అంచనా. బెంచ్మార్కు బాండ్ల రాబడులు 6.45శాతంగానిలిచాయి. బ్యాంకురుణా ల వృద్ధి ఏడుశాతంగా ఉంది. గడచిన కొన్నేళ్లలో నమోదయిన రెండంకెల వృద్ధికంటే తక్కువగా ఉంది.
| 1entertainment
|
- మూడో సెషన్లోనూ లాభాలే
- 35 వేల మార్క్్ దాటేసిన సెన్సెక్స్
ముంబయి: కొత్త ట్రేడింగ్ వారాన్నీ దేశీయ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభించాయి. తొలి నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరల్లో కరెక్షన్ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ధగధగలాడాయి. సూచీలు ఏ దశలోనూ వెనుదిరిగి చూడలేదు. ఆసియా మార్కెట్ల బలమైన సంకేతాలతో సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభించిన కొద్దిసేపటికే సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా లాభంతో 35వేల మైలురాయిని దాటి పయనించింది. దేశీయ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో ఒక దశలో 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయ్యింది. చివరకు మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 191 పాయింట్ల మేర లాభపడి 35,000 మ్యాజిక్ ఫిగర్ అవతల.. 35,160 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ దాదాపు 47 పాయింట్ల లాభపడి 10,739 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉండటం మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చింది. దీంతో వరుసగా మూడో సెషన్లోనూ సూచీలు లాభాల జోరు కొనసాగించినట్టయింది. నిఫ్టీ మిడ్క్యాప్ 0.8 శాతం లాభపడింది. సోమవారం ట్రేడింగ్లో అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే నడిచాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, పీఎస్యూ, బ్యాంకింగ్, రియాల్టీ సూచీలు తమ జోరు కనబరిచాయి. నిఫ్టీ దిగ్గజాలలో యెస్ బ్యాంక్ 3.4 శాతం పెరగ్గా.. టీసీఎస్, హెచ్యూఎల్, కోటక్ బ్యాంక్, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, వేదాంతా, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ స్టాక్స్ 2.2-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. ఇదే సమయంలో యాక్సిస్ బ్యాంక్ 4 శాతం పతనం కాగా.. ఆర్ఐఎల్, యూపీఎల్, గెయిల్, ఇన్ఫ్రాటెల్, ఐసీఐసీఐ, ఐషర్, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐబీ హౌసింగ్ 3.3-0.7 శాతం మధ్య నష్టాల్లోకి జారాయి. సెన్సెక్స్ 35 వేల మార్క్ను దాటేసిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో పండుగ వాతావరణం కనిపించింది. ట్రేడర్లు స్వీట్స్ పంచుకొని సంబరం చేసుకున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
AIR ASIA
ఎయిర్ఏసియా భారీ డిస్కౌంట్ ఆఫర్లు
ముంబయి, జూన్ 5: మలేసియా బడ్జెట్ ఎయిర్లైన్స్ ఎయిర్ఏసియా మరోసారి డిస్కౌంట్ ఎయిర్ ఛార్జీల తో ముందుకువచ్చింది. దేశీయ రూట్లలో రూ.1099 ఛార్జీతోనే ప్రయాణీంచే సౌకర్యం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల్లో కూడా రూ.2999ల ధరలను ప్రకటించింది. బెంగళూరు, న్యూఢిల్లీ, హైద రాబాద్, కోచి, గోవా, శ్రీనగర్, రాంచి, కోల్కత్తా వంటి నగరాలకు ఈ డిస్కౌంట్ ఆఫర్లు అమలవు తాయి. ఈనెల 4వ తేదీనుంచి 11వ తేదీలోపు ఈ టికెట్లు బుక్చేసుకోవాలి. ప్రయాణాలకు జనవరి 15 2018 నుంచి2018 ఆగస్టు 28వ తేదీ వరకూ ప్రయాణించవచ్చు. ఎయిర్ఏసియా దేశంలోని 15 నగరాలకు ఎ320 విమానాలు పది సర్వీసులు నడుపుతోంది. ఈ బిగ్సేల్తో మొత్తం ఆసియాలో 120 స్టేషన్లకు చేరవ అవుతాయని, ఆస్ట్రేలియాకు సైతం చేరువ కాగలమని కంపెనీ ప్రకటించింది. కౌలాలం పూర్, బ్యాంకాక్, ఫుకెట్, క్రబీ మరికొన్ని కేంద్రాలకు ఎయిర్ఏసియా బెర్హాద్ విమానాల్లో వెళ్లే అవకాశం ఉంది.థా§్ు ఎయిర్ఏసియా, ఎయిర్ఏసియా ఎక్స్బెర్హాద్ అండ్ ఇండోనేసియా ఎయిర్ఏసియా ఎక్స్ వంటి వాటిలో రూ.2999వంటి తక్కువధరలు ప్రకటించింది. ఎయిర్ఏసియా ఎక్స్ ప్రీమియం ఫ్లాట్ బెడ్ బిజినెస్ క్లాస్ టికెట్లు రూ.11,999లకే అందిస్తోంది.సిడ్నీ, మెల్బోర్న్, కొరియా, బాలి వంటి గమ్య స్థానాలకు చేరుస్తోంది. వచ్చేఏడాదిప్రయాణ ప్రణాళికలకు ఈతక్కువ ఛార్జీలు ఎంతో మేలుచేస్తా యన్నారు. ఎయిర్ఏసియా పోర్టల్, మొబైల్యాప్లలో బుక్చేసుకోవచ్చని సిఇఒ అమర్ఆబ్రోల్ వెల్లడించారు.
========
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
నీ సైజు, రంగు తెలుసు.. సాక్ష్యాలూ ఉన్నాయ్: శ్రీరెడ్డి
ఏదో ఒక రోజు నన్ను కూడా శ్రీరెడ్డి టార్గెట్ చేస్తుందన్న విశాల్ మాటలను నిజం చేస్తున్న శ్రీరెడ్డి.
Samayam Telugu | Updated:
Oct 29, 2018, 03:53PM IST
నీ సైజు, రంగు తెలుసు.. సాక్ష్యాలూ ఉన్నాయ్: శ్రీరెడ్డి
శ్రీరెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలతో తమిళ సినీ పరిశ్రమను హీటెక్కిస్తోంది. ఈసారి ఏకంగా నడిగర్ సంఘం పెద్దలనే టార్గెట్ చేసుకుంది. ఆమె వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే హీరో విశాల్ పైనే ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నడిగర్ సంఘంలో ఉన్న పెద్ద సెలబ్రిటీ హీరోయిన్లు, సహాయ నటీమణులను సైతం లైంగికంగా వేధిస్తున్నాడని శ్రీరెడ్డి ఆరోపించింది.
తమిళనాట అడుగుపెట్టిన శ్రీరెడ్డి.. అక్కడ ఓ తమిళ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో, కొరియోగ్రాఫర్ లారెన్స్తో పాటు దర్శకుడు సుందర్.సిలపై శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె వ్యాఖ్యలు అక్కడ సంచలనం రేపడంతో నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడైన హీరో విశాల్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హీరో నానిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా విశాల్ స్పందించారు. ఏదో ఒకరోజు శ్రీరెడ్డి తనపై కూడా ఆరోపణలు చేస్తుందని అప్పట్లో వ్యాఖ్యానించారు. శ్రీరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే విశాల్ మాటలు నిజమవుతున్నట్లు తెలుస్తోంది.
‘‘నడిగర్ సంఘంలో ఉన్న పెద్ద సెలబ్రిటీ హీరోయిన్లనే కాదు, సైడ్ ఆర్టిస్టులను కూడా లైంగిక అవసరాల కోసం వేధిస్తున్నాడు. మీడియా ముందు అతను చాలా తెలివిగా మాట్లాడతాడు. గుర్తుంచుకో మిస్టర్ ఫేక్ ఫర్ఫెక్ట్.. నేను నిన్ను విడిచిపెట్టను. నీ సైజ్, కలర్ నాకు తెలుసు. నీ విషయాలన్నీ మీడియాకు, లాయర్లకు ప్రూవ్ చేస్తా. నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అది చేస్కో. బలవంతంగా పడుకోబెట్టుకున్న అమ్మాయిలకు నువ్వు డబ్బులు ఇచ్చావు. నిర్మాతల మండలి, నడిగర్ సంఘం, తమిళ సినీ పరిశ్రమలను ఏలుతున్నా అని నువ్వు అనుకుంటున్నావా? నిర్మాతల మండలి నుంచి నువ్వు ఎంత సంపాదిస్తున్నావనేది నాకు కొంతమంది చెప్పారు. త్వరగా పెళ్లి చేసుకో. నీ విషయాలు తెలిస్తే ఆమె నిన్ను పెళ్లి చేసుకోదు. నువ్వు నెంబర్ వన్ బ్లాక్ మెయిలర్. నీ కౌంట్ డౌన్ స్టార్టైంది. జై జయలలితమ్మ!!’’ అని శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది. దీంతో శ్రీరెడ్డి లీక్ చేసే ఆ ఆధారాలు ఏమిటనే ఆసక్తి తమిళ సినీ పరిశ్రమలో నెలకొంది. విశాల్ ఇటీవల ‘అభిమన్యుడు’ సినిమాతో తెలుగులో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ‘పందెం కోడి 2’ సినిమాతో ఆకట్టుకున్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Visit Site
Recommended byColombia
ఆస్ట్రేలియా విజయానికి చివరి 18 బంతుల్లో 21 పరుగులు అవసరంకాగా.. ఆ జట్టు చేతిలో రెండు వికెట్లే ఉన్నాయి. కానీ.. క్రీజులో అప్పటికే సెటిలైన స్టాయినిస్ ( (52: 65 బంతుల్లో 4x4, 1x6) ఉండటంతో.. భారత్ శిబిరంలో కంగారుల మొదలైంది. కానీ.. ఇన్నింగ్స్ 48వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసి ఒక్క పరుగు మాత్రమే ఇవ్వగా.. తర్వాత ఓవర్ వేసిన షమీ 9 పరుగులిచ్చాడు. దీంతో.. సమీకరణం 6 బంతుల్లో 11 పరుగులుగా మారింది. మరోవైపు షమీ, బుమ్రా ఓవర్ల కోటా ముగిసింది. ఈ దశలో పెద్దగా అనుభవంలేని ఆల్రౌండర్ విజయ్ శంకర్ చేతికి కెప్టెన్ కోహ్లీ బంతినివ్వగా.. ఒత్తిడిని జయించిన శంకర్ తొలి మూడు బంతుల్లోనే రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ఆస్ట్రేలియా చివరి రెండు వికెట్లూ పడగొట్టేశాడు. అయితే.. విజయ్ శంకర్ని ఆఖరి ఓవర్లో బౌలింగ్ చేయించాలని తనకి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సలహా ఇచ్చారని మ్యాచ్ అనంతరం కోహ్లీ వెల్లడించాడు.
Vijay shankar, who threw the last over to the 11 run in # viishankar, dropped the highest run-off stoiis in 52. In… https://t.co/cAB9KcY35M
— Thirunavukarasu (@thiruna18987352) 1551850212000
ఆస్ట్రేలియా విజయానికి చివరి 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో బౌలింగ్ వ్యూహంపై తాను ధోనీ, రోహిత్తో చర్చించిన తీరు గురించి కోహ్లీ మాట్లాడుతూ ‘ఇన్నింగ్స్ 46వ ఓవర్ని కేదార్ జాదవ్ లేదా విజయ్ శంకర్తో వేయించాలని నేను అనుకున్నా. ఇదే విషయమై మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మతో కూడా చర్చించాను. కానీ.. ధోనీ ఆఖరి ఓవర్ వరకూ విజయ్ శంకర్ని పక్కనపెట్టి బుమ్రా, షమీ బౌలింగ్ను కొనసాగించాలని చెప్పాడు. అప్పటికి ఆస్ట్రేలియా చేతిలో 4 వికెట్లే ఉండటంతో.. 49వ ఓవర్లోపు బుమ్రా, షమీ ఆ వికెట్లు పడగొడితే మ్యాచ్పై పట్టు సాధించొచ్చని సలహా ఇచ్చాడు. ఊహించినట్లే 46వ ఓవర్లో ఒక పరుగే ఇచ్చిన బుమ్రా రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్ను భారత్వైపు తిప్పాడు’ అని వెల్లడించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
చరణ్, బోయపాటి సినిమాలో తమిళ హీరోకూడా..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఒక తమిళ హీరో కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.
Samayam Telugu | Updated:
Apr 6, 2018, 04:56PM IST
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఒక తమిళ హీరో కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒక ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట ప్రశాంత్. వెనుకటికి ‘జీన్స్’, ‘జోడీ’ వంటి సినిమాలతో తెలుగులో హిట్స్ ను పొందిన ప్రశాంత్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను చరణ్ సినిమాతో పలకరించబోతున్నట్టుగా సమాచారం. ఇందులో చరణ్ కు మొత్తం నలుగురు సోదరులు ఉంటారని.. వారిలో ఒక పాత్రను ప్రశాంత్ తో చేయిస్తున్నారని సమాచారం.
అలాగే ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ నటిస్తున్నాడనే వార్తలు కూడా చాన్నాళ్లుగానే వస్తున్నాయి. ఈవీవీ తనయుడు ఈ విధంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించబోతున్నాడని తెలుస్తోంది.
| 0business
|
హాలీవుడ్ కు వెళ్లాక మరింత డోస్ పెంచి యూత్ కు పిచ్చెక్కిస్తున్న ప్రియాంక చోప్రా
First Published 16, Sep 2017, 5:13 PM IST
హాలీవుడ్ కు వెళ్లాక మరింత డోస్ పెంచి యూత్ కు పిచ్చెక్కిస్తున
హాలీవుడ్ కు వెళ్లాక మరింత డోస్ పెంచి యూత్ కు పిచ్చెక్కిస్తున
హాలీవుడ్ కు వెళ్లాక మరింత డోస్ పెంచి యూత్ కు పిచ్చెక్కిస్తున
హాలీవుడ్ కు వెళ్లాక మరింత డోస్ పెంచి యూత్ కు పిచ్చెక్కిస్తున
Recent Stories
| 0business
|
సాయి పల్లవి, నివేదా లాంటి వారు నాకు పోటీ కాదు-రకుల్ ఇంటర్వ్యూ
Highlights
సమకాలీన హీరోయిన్లతో నాకు పోటీ లేదు- రకుల్
జయజానకీనాయక పాత్ర లీనమైపోయి చేశా-రకుల్
బోయపాటి పాత్ర డిజైన్ చేస్తే తిరుగుండదు-రకుల్
వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ అగ్రతారగా మారింది రకుల్ ప్రీత్ సింగ్. వరుస విజయాలతో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ దూసుకెళ్తున్నది. రకుల్ నటించిన తాజా చిత్రం జయ జానకి నాయక. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో... హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులతో ముచ్చటించింది. ఆ వివరాలు..
హీరోయిన్లతో నాకేమీ పోటీ లేదు...
టాలీవుడ్ సినిమా ట్రెండ్ మారుతున్నదనే మాటను ఒప్పుకోను. హీరోయిన్ ఓరియెంట్ సినిమాలు వస్తున్నాయనే అంశాన్ని అంగీకరించను. ఎందుకంటే గతంలో శ్రీదేవి నటించిన క్షణక్షణం, జెనీలియా బొమ్మరిల్లు, త్రిష నటించిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కూడా హీరోయిన్ ఓరియెంట్ సినిమాలు రావడం మంచి పరిణామం. నిన్ను కోరి చిత్రంతో నివేదా, ఫిదా సినిమాతో సాయి పల్లవికి మంచి క్రేజ్ రావడం చాలా సంతోషం. టాలెంట్ ఉన్న హీరోయిన్లు వస్తే మంచి కథలు వస్తాయి. మంచి సినిమాలను దర్శకులు రూపొందించడానికి అవకాశం ఉంటుంది. వారిని చూసి భయపడుతున్నానని వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఎవరి అవకాశాలు వారికి ఉంటాయి. ఎవరి పాత్రలు వారికి వస్తాయి. నిన్ను కోరి సినిమా చూసిన తర్వాత నివేదా, నానీని కలిశాను. వారి సక్సెస్ నేను కూడా షేర్ చేసుకొన్నాను. నానీ నాకు మంచి స్నేహితుడు. నివేదా నటన నాకు నచ్చింది. ఆ సినిమా చూస్తున్న సేపు కన్నీళ్లు ఆగలేదు. క్లైమాక్స్ లో నేను ఏడుస్తుంటే నా సోదరుడు కర్చీఫ్ ఇచ్చాడు. ఇక ఫిదా చూడటానికి వీలు కాలేదు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని లండన్ నుంచి వచ్చాను. ఫిదా చిత్రాన్ని త్వరలోనే చూస్తాను.
బోయపాటితో చేయడం...
సరైనోడు సినిమా సందర్భంగా నేను బోయపాటి శ్రీనుతో వర్క్ చేశా. ఆయనతో వర్క్ చేయడంతోపాటు ఎంజాయ్ చేశాను. బోయపాటి సినిమాల్లో హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే జయ జానకి నాయక చిత్రానికి ఓకే చెప్పాను. ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగా ఉంటుంది. కొత్తగా కనిపిస్తాను. బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది.
బోయపాటి శ్రీను స్వయంగా ఓ యాక్టర్. చాలా వరకు సన్నివేశాలను షూట్ చేసేటప్పుడు ఆయన నటించి చూపిస్తాడు. ఫైట్ సీన్లు, యాక్షన్ సీన్లు, ఎమెషన్ సీన్లు షూట్ చేసేటప్పడు సెట్ను ఆ వాతావరణంలోకి మార్చేస్తాడు. బోయపాటి సినిమాలో ఏ ఒక్క పాత్రైనా బాగాలేదని ఎవరూ చెప్పరు. ప్రతీ పాత్రను బాగా డిజైన్ చేస్తారు. అనుకున్న మేరకు తెరమీద ఫర్ఫెక్ట్ గా చూపిస్తాడు.
బోయపాటి డిఫరెంట్గా రూపొందించిన చిత్రం జయ జానకి నాయక. బోయపాటి మార్కు అంశాలు కలిసి ఉన్న ఓ అందమైన ప్రేమకథా చిత్రమే ఈ సినిమా. సినిమా చూసిన తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి లవ్ స్టోరి ఉంటే బాగుండు అని ప్రేక్షకులు అనుకోనే విధంగా ఉంటుంది. గతంలో ప్రేమ కథల్లో స్వచ్ఛత ఉండేది. త్యాగాలు ఉండేవి. ఇప్పుడు అలాంటివి కనిపించవు. అలాంటి భావోద్వేగ అంశాలు ఉన్న కథకు బోయపాటి యాక్షన్, ఎమోషన్స్ను జోడించారు.
బెల్లంకొండ శ్రీనుకు క్రేజ్ పెరుగుతుంది...
బెల్లంకొండ శ్రీను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాకు ముందు ఆయన క్రేజ్ కంటే దాదాపు 80 శాతం క్రేజ్ పెరుగుతుంది. సీనియర్గా శ్రీనుకు నేను ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదు. నేనేమైనా యాక్టింగ్ స్కూల్ ఓపెన్ చేశానా.. నటన నేర్పించడానికి. అంతకు ముందే శ్రీను రెండు సినిమాలు చేశాడు. అతనికి మంచి అనుభవం కూడా ఉంది. చక్కగా ఫైట్స్, యాక్షన్లలో నటించాడు. శ్రీను ఏంటో త్వరలోనే తెరపైన మీరే చూస్తారు.
తెలుగు, హిందీ అనేది కాదు.. కథకే ప్రాధాన్యత..
తెలుగు సినీ పరిశ్రమ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ అంటే మరీ ఇష్టం. తమిళ, హిందీ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నానని అనడం తప్పు. ఎక్కడ మంచి సినిమా కథలు వస్తే వాటిని అంగీకరిస్తున్నాను. పవన్ కల్యాణ్తో సినిమా గురించి క్లారిటీ లేదు. ఇంకా ఒప్పుకోలేదు. చర్చల దశలోనే ఉంది. ప్రస్తుతం స్పైడర్, ఒక తమిళ, మరో హిందీ సినిమాలో నటిస్తున్నాను.
బ్రూస్లీ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వలన ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రంలో నటించలేకపోయాను. రిలీజ్ డేట్ దగ్గరపడిన సమయంలో అప్పుడు సాంగ్ షూట్ చేస్తున్నాను. అప్పుడు ధోని సినిమా అవకాశం వచ్చింది. మూడు రోజులు ఎలాగైనా కేటాయించాలని ప్రయత్నించాను. కానీ కుదర్లేదు. ఇప్పుడు బాలీవుడ్లో మరో అవకాశం వచ్చింది. ఐయారీ అనే చిత్రంలో సిద్దార్థ్ మల్హోత్రా చిత్రంలో నటిస్తున్నాను. ధోని సినిమా వదులుకొన్నానని బాధపడుతున్న సమయంలో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండేతో పనిచేసే అవకాశం మళ్లీ వచ్చింది. ఆయనతో కలిసి పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. సినీ పరిశ్రమలోకి రావాలని ప్రయత్నిస్తూ కలిసిన మొట్టమొదటి వ్యక్తి నీరజ్ పాండే. 2011లో నా తొలి ఆడిషన్ ఆయనే చేశారు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లను. ఆ సినిమా ప్రారంభం కాలేదు. ఆ తర్వాత ధోని వచ్చింది. కానీ కుదర్లేదు. ఇప్పుడు మళ్లీ ఐయారీ కుదిరింది.
విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర...
జయ జానకి నాయక చిత్రంలో నా పాత్ర పేరు జానకి. రెండు షేడ్స్ ఉన్న కారెక్టర్ నాది. క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. అల్లరిగా, ముద్దుగా కనిపిస్తుంది. కుటుంబం అంటే జానకికి చెప్పలేనంత ఇష్టం. అలాంటి అమ్మాయి జీవితంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంటుంది. దాంతో జానకి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. జానకి జీవితం ఎలా మారిపోయింది. ఆ సంఘటన ఏంటి? అనేదే జయ జానకి నాయక సినిమా కథ.
సరైనోడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే జయ జానకి నాయక చిత్రం ఆఫర్ వచ్చింది. బోయపాటితో పనిచేసినందున ఆయన స్టయిల్ నచ్చి నేను ఈ సినిమా ఒప్పుకొన్నాను. అప్పటికే రారండోయ్ వేడుక చూద్దాంలో చేస్తున్న భ్రమరాంబ క్యారెక్టర్కు భిన్నమైనదిగా అనిపించడం వల్ల జానకి పాత్ర నచ్చింది. అందుకే ఒప్పుకొన్నాను. రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో పోషించిన భ్రమరాంభ పాత్రకు, జానకికి ఎలాంటి పోలికలు ఉండవు. భ్రమరాంబ పాత్ర చాలా అల్లరిగా, అమాయకంగా ఉండే అమ్మాయి. అయితే జానకి పాత్ర మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
ఇప్పటి వరకు నేను పోషించనటువంటి క్యారెక్టర్ ఇది. చాలా ఎమోషనల్గా ఉంటుంది. షూటింగ్ జరిగిన సమయంలో నాపై పాత్ర ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా సన్నివేశాల్లో నేను డిప్రెషన్కు గురయ్యా. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిన గానీ ఓ రకమైన ఫీలింగ్లో ఉండేదానిని. అమ్మా, అన్నతో మాట్లాడటం ద్వారా పాత్ర నుంచి బయటకు వచ్చేదానిని. చాలా సన్నివేశాల్లో కంటతడి పెట్టాల్సి వచ్చింది. నాపై పాత్ర ప్రభావం ఎక్కువగా ఉండేది.. చాలా సీన్లలో కన్నీళ్లు రావడానికి గ్లిజరిన్ ఎక్కువగా ఉపయోగించాను. కన్నీళ్లు ఎక్కువగా కారడంతో కళ్లని ఉబ్బిపోయేవి. నా పరిస్థితి చూసి నాకే బాధగా అనిపించేది. ఓ రోజు బోయపాటితో అన్నాను.. షూటింగ్ అయ్యేపోయే వరకు కళ్లు ఉబ్బి చారలు ఏర్పడి తొందరగానే ముసలితనం కనిపిస్తుందేమోనని జోక్ చేశాను. బాధలో ఉన్నానని తెలిసి నాతో రెండు నిమిషాలు మాట్లాడు అని అమ్మకు కాల్ చేసి అడిగే వారు.
ఈ సినిమాలో నా హార్ట్ ను టచ్ చేసిన సీన్లు ఉన్నాయి. నేను చెప్పడం కంటే సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు అర్థమవుతుంది. కొన్ని సీన్లు చూస్తే రకుల్ అక్కడ కనిపించదు. కేవలం జానకి పాత్రనే కనిపిస్తుంది.
Last Updated 25, Mar 2018, 11:45 PM IST
| 0business
|
Visit Site
Recommended byColombia
‘తప్పడు వార్తలు రాసే వాళ్లు గుర్తుపెట్టుకోండి.. ఇది సెక్సువల్ హెరాస్మెంట్ కాదు. నన్ను అతను పోలీసులకు పట్టించాడు. తప్పుడు ప్రచారం చేసి.. ఆయన స్వార్ధం కోసం నాపై తప్పుడు కేసులు పెట్టించారు.
ఈ విషయంలో జనసేనను కాని, పవన్ కళ్యాణ్ను కాని ఏమైనా అంటే నేను ఊరుకోను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. ఎవరూ కళ్యాణ్ సార్ని ఇన్వాల్వ్ చేయొద్దు. బన్నీ వాసు కూడా నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ చేయలేదు. పోలీసులతో కొట్టించి నన్ను గీతా ఆర్ట్స్లో అడుగుపెట్టనీయకుండా రాయించుకున్నారు. అప్పుడే సూసైట్ చేసుకుందాం అనుకున్నా.
బన్నీవాసు సినిమాలు ఇస్తానని చెప్పి.. నాకు క్యారెక్టర్స్ ఇవ్వడం లేదు. బన్నీ వాసు, దర్శకుడు మారుతి ఫ్రెండ్స్. గతంలో మారుతితో కూడా ఇష్యూ జరిగింది నాకు. కాని నేను ఈరోజు బన్నీ వాసు గురించి బయటపెట్టా.. త్వరలో మారుతి గురించి బయటపెడతా.
బన్నీ వాసు అయితే నన్ను మానసికంగా వేధించారు తప్ప శారీరకంగా ఏమీ చేయలేదు. బన్నీ వాసుకి అల్లు అర్జున్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది.. నా తరపున నేను మాత్రమే పోరాడుతున్నా. ఏం చేయలేని పరిస్థితుల్లో ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరసన చేబట్టా.. నాకు ఎక్కువ రోజులు బతకాలని కూడా లేదు’ అంటూ ఎమోషనల్గా మాట్లాడింది సునీత బోయ.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
మీ కోసం చావడానికైనా.. చంపడానికైనా.. సిద్ధం!
Highlights
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూనే ఉన్నారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈమె ఒక ఫోటోను షేర్ చేసిన చిన్న కవితను కూడా రాశారు. పవన్ తో విడిపోయిన తరువాత పిల్లలతో కలిసి పూణెలో ఉంటున్నారు రేణూ. పిల్లలే ఆమెకు ప్రపంచం. వారి ఫోటోలను.. వారితో గడిపిన ఆనందాలను తరచూ షేర్ చేస్తుంటారు.
ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ అయింది. తన ఇద్దరి పిల్లలపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక కవితను రాశారు. తన చెల్లెలు ఆద్యపై తలవాల్చిన అకిరా ఫోటోను షేర్ చేస్తూ.. ''ఒక హార్ట్, ఒక సోల్.. మీకోసం నేను ప్రాణాలు ఇస్తాను, మీ కోసం ప్రాణాలు తీస్తాను. ఓ తల్లి తన పిల్లల కోసం రాసిన చిన్న కవిత.. ఇలాంటి క్యూట్ పిక్స్ చాలానే ఉన్నాయి, ఎప్పటికీ అందిస్తూనే ఉంటా' అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.
| 0business
|
Suresh 387 Views AIRTEL
ఎయిర్టెల్ మరో బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ,సెప్టెంబరు 17: భారతీ ఎయిర్ టెల్ తమ పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. ఎయిర్ టెల్ టివి యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులకు ఉచితంగా 60 జిబి డేటాను ఇవ్వనున్నట్లు పేర్కొంది. నెలకు 10 జిబి చొప్పున ఆరు నెలల పాటు ఈ ఆఫర్ విని యోగించుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే ఎయిర్టెల్ నెలకు 10 జిబి చొప్పున మూడు నెలల పాటు 30 జిబి డేటాను ఉచితంగా అందిస్తుంది.ఇప్పుడు దానిని 60 జిబికి పెంచింది.ఎయిర్టెల టివి యాప్ను డౌన్లోడ్ చేసుకున్న ఎయిర్టెల్ వినియోగదారులకు మాత్రమే ఈ ఉచిత డేటా లభిస్తుందని ఎయిర్టెల్ పేర్కొంది. ఎయిర్ టెల్ టివియాప్ ద్వారా వినియోగదారులు లైవ్ టీవితోపాటు హుక్, సోనీ లిష్, యూట్యూబ్, డైలీమోషన్ వీడియోలను వీక్షించవచ్చు
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
హాట్: టు పీస్తో ‘రోగ్’భామలు రచ్చ.. రచ్చ
పూరీ జగన్నాథ్ రోగ్ మూవీతో తనలోని టాలెంట్ను పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చేస్తున్నాడు. అందుకు కొత్త భామలు సైతం మీరు ఎలా చూపించాలో చెప్పండి పూరీ.. సార్, మేము చూపించేస్తాం.. నో మొహమాటమ్స్ అన్నట్టు రెచ్చిపోతున్నారు.
TNN | Updated:
Feb 20, 2017, 02:53PM IST
పూరీ జగన్నాథ్ రోగ్‌ మూవీతో తనలోని టాలెంట్‌ను పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చేస్తున్నాడు. అందుకు కొత్త భామలు సైతం మీరు ఎలా చూపించాలో చెప్పండి పూరీ.. సార్, మేము చూపించేస్తాం.. నో మొహమాటమ్స్ అన్నట్టు రెచ్చిపోతున్నారు.
'బద్రి' నుంచి 'ఇజమ్‌' వరకు తన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్‌, మేనరిజం డిఫరెంట్‌గా వుండేలా చూసుకుంటూ రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన సినిమాలను రూపొందించే డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇప్పుడు మరో డిఫరెంట్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
యంగ్‌ హీరో ఇషాన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా. సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ)తో ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి వచ్చిన ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి.
అనుష్క, అసిన్‌, హన్సిక, రక్షిత, దిశా పటాని, కంగనా రనౌత్‌, శియా గౌతమ్‌, నేహాశర్మ, సమీక్ష, అయేషా టకియా, అదాశర్మ వంటి గ్లామరస్‌ హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన పూరి జగన్నాథ్‌ 'రోగ్‌' చిత్రం ద్వారా డబుల్‌ ధమాకాగా ఇద్దరు హీరోయిన్లను ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇషాన్‌ సరసన మన్నారా చోప్రా, ఏంజెలా నటిస్తున్నారు. తన ప్రతి సినిమాలోనూ హీరోయిన్లను ఎంతో గ్లామర్‌గా చూపించే పూరి ఈ సినిమా కాస్త డోస్‌ పెంచి ఇద్దరు హీరోయిన్లతో కనువిందు చేయబోతున్నారు.
'రోగ్‌' అనే డిఫరెంట్‌ టైటిల్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించిన పూరి డిఫరెంట్‌ ప్రమోషన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచుతున్నారు. 'రోగ్‌' మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీగా అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ డిస్కషన్‌ పాయింట్‌గా మారింది.
హీరోని తలకిందులుగా వేలాడదీసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన పూరీ.. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేసి ఎక్స్‌పెక్టేషన్స్ పెంచాశాడు. తాజాగా రోగ్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలోని హీరోయిన్స్‌ మన్నారా చోప్రా, ఏంజెలా స్టిల్స్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చాలా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
| 0business
|
జపాన్ సూపర్ సిరీస్ టోర్నీలో
మెయిన్ డ్రాలో బరిలోకి శ్రీకాంత్
టోక్యో : బ్యాడ్మింటన్ స్టార్ క్రికెటర్ కిడాంబి శ్రీకాంత్ జపాన్ సూపర్ సీరిస్ టోర్నమెంట్లో ఎనిమిదవ సీడ్గా బరిలోకి దిగుతున్నాడు. కాగా బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్లు జరుగుతాయి.రియో ఒలింపిక్స్ తరువాత శ్రీకాంత్ ఆడుతున్న తొలి టోర్నీ ఇదే కాగా మెయిన్ డ్రా మొదటి రౌండ్లో అతను క్వాలిఫయర్తో తలపడుతున్నాడు. గాయంతో ఆటకు దూరమై ర్యాం కింగ్ను కోల్పోయిన పారుపల్లి కశ్యప్ క్వాలిఫయింగ్తో తలపడనున్నాడు. కాగా తొలిరౌండ్లో అతను డేవిస్ ఒబెర్నోస్టెర్ (ఆస్ట్రియా)తో పోటీపడతాడు. కాగా మహిళల క్వాలిఫయింగ్లో తన్వీలాడ్ జపాన్కు చెందిన కిసాటో హాషిని ఢీకొంటుంది.
పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాలో ప్రపంచ 18వ ర్యాంకర్ అజయ్ జయరామ్ సోని ద్వికుంకోరోతో (ఇండోనేషియా),సాయి ప్రణీత్ అంగుస్(హాంకాంగ్)తో ప్రణయ్, ఇస్కందర్ జుల్కర్ వెస్(మలేసియా)తో తలపడతారు, డబుల్స్, మహిళల సింగిల్స్ మెయిన్ డ్రాలో భారత క్రీడాకారులెవరూ ఆడటం లేదు.
| 2sports
|
No problems with Anil Kumble
పాక్తో మ్యాచ్కి ముందు కోహ్లి మనసులో మాట..!
గత కొన్ని రోజుల నుంచి చాలా రూమర్లు హల్చల్ చేశాయి. కనీసం మమ్మల్ని
TNN | Updated:
Jun 3, 2017, 08:38PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ పోరు ఆరంభానికి ముందే భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టులో నెలకొన్న వివాదాలకు తెరదించాడు. జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం పాకిస్థాన్‌తో మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లి శనివారం రాత్రి మీడియాతో మాట్లాడాడు. ‘గత కొన్ని రోజుల నుంచి చాలా రూమర్లు హల్‌చల్ చేశాయి. కనీసం మమ్మల్ని సంప్రదించకుండానే లెక్కలేనన్ని నిరాధార వార్తలు రాశారు. మీరు అనుకుంటున్నట్లు కుంబ్లేకి నాకు ఎలాంటి విభేదాలు లేవు’ అని కోహ్లి స్పష్టం చేశాడు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌‌ గురించి మాట్లాడుతూ ‘ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రత్యర్థి ఎవరైనా.. సరే నేను మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఆడను. అది కెప్టెన్‌గా ఉన్నా.. లేకపోయినా కూడా నా మైండ్ సెట్ మారదు. అన్ని దేశాల‌తో ఎలా ఆడతామో పాకిస్థాన్‌తో కూడా అలానే బరిలోకి దిగుతాం. ప్రతి మ్యాచ్‌‌లోనూ భారత్‌ గెలవాలనే పట్టుదలతో ఆడతాం. కాబట్టి పాక్‌తో మ్యాచ్‌లో అంతే’ అని కోహ్లి వివరించాడు. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు సార్లు భారత్, పాకిస్థాన్ ఢీకొనగా.. రెండింట్లో పాక్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
| 2sports
|
పనితీరులేనివాళ్లు వెళ్లిపోవచ్చు
బయటికి మార్గం చూపుతున్న ఫ్లిప్కార్ట్
బెంగళూరు : ఆన్లైన్వ్యాపార దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్ పోర్టల్ జబాంగ్ను 70 మిలియన్ డాలర్లకు కొనుగోలుచేసిన తర్వాత ప్రక్షాళనకు శ్రీకా రం చుట్టింది. లేఆఫ్లు, ఉద్యోగుల కుదింపులను ప్రారంభించింది. పనితీరు సక్రమంగా లేని ఉద్యో గులను వెళ్లిపోవాలని ఆదేశిస్తోంది. తమ లక్ష్యాలకు అనుగుణంగా పనితీరులేనివారు వెళ్లిపోవచ్చని, కంపెనీ బయట మరిన్ని అవకాశాలు చూసుకోవ చ్చని ఫ్లిప్కార్ట్ చెపుతోంది. కనీసం 700నుంచి వెయ్యిమందికి గుడ్బై చెపుతుందని అంచనా. ఈ విధానం సహజసిద్ధంగా తాము అమలుచేస్తున్న దేనని ఫ్లిప్కార్ట్ప్రకటించింది. ఇంటర్నెట్ సంస్థల్లో ఇదంతా నిరంతర ప్రక్రియగానే పేర్కొంది. కీలక ఇ-కామర్స్సంస్థలు భారత్లో గట్టిపోటీని ఎదు ర్కొంటున్నాయి. 2007లో ప్రారంభించిన ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ ఫ్యాషన్ పోర్టల్ జబాంగ్ను 70 మిలియన్ డాలర్ల పూర్తినగదుకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ యూనిట్ మింత్రా ద్వారా ఈ కొనుగోలు జరిపింది. కనీసం నెలవారీగాచూసినా 15 మిలియన్లకుపైబడిన వినియోగదారులున్నారు. గత ఏడాది మింత్రను ఫ్లిప్కార్ట్ 300 మిలియన్ డాలర్లకు కొనుగోలుచేసింది. స్నాప్డీల్, అమెజాన్ సంస్థలు ఫ్లిప్కార్ట్కు గట్టిపోటీ ఇస్తున్నాయి. మార్కెట్ వాటా పెంచుకునేందుకు 500 కోట్లు డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు కూడా ప్రకటించింది. జనవరిలోనే సచిన్బన్సాల్స్థానంలో సహ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్ వచ్చారు. బిన్సీ బన్సాల్ అప్పటివరకూ చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా పనిచేసారు. వీరిద్దరూ కూడా అమెజాన్ మాజీ ఉద్యోగులే కావడం విశేషం. సెల్ఫోన్ల నుంచి స్యూట్కేస్ల వరకూ అన్ని విభాగాలకు ఫ్లిప్కార్ట్ విస్తరించింది. మార్కెట్ విలువలు 15 బిలియన్ డాలర్ల నుంచి 11 బిలియన్ డాలర్లకు పడిపోయిం ది. చిన్నచిన్న పట్టణాల్లో పోటీసంస్థలు పెట్టుబడులు పెంచుతూ స్థానిక రిటైలర్ల నుంచే ఉత్పత్తులు సేకరించి మార్కెట్ వాటాను పెంచుకుం టున్నారు. గట్టిపోటీతోపాటు, భారీ ఎత్తున డిస్కౌంట్లు కూడా ఫ్లిప్కార్ట్ నష్టాలకు కారణం అవుతున్నాయి. స్నాప్డీల్, అమెజాన్ పరిస్థితి కూడా ఇదే. ఈరంగంలోని నిపుణుల అంచనాలను చూస్తే ఇ-కామర్స్కు నిధుల సమీకరణ కష్టం అవుతోంది.
| 1entertainment
|
May 06,2015
మైక్రోసాఫ్ట్ నుండి ఎడ్యు-క్లౌడ్
హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ విద్యార్థుల కోసం ఎడ్యు -క్లౌడ్ను ప్రవేశపెట్టింది. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారితమైన ఈ ఎడ్యు -క్లౌడ్ను మంగళవారం హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామానిక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజుల్లో విద్యార్థులంతా డిజిటల్ లోకంలో ప్రయాణిస్తున్నారని అన్నారు. అందుకే తాము వారిని సాంకేతిక రంగంలో కొత్త పుంతలు తొక్కించేందుకు ఈ ప్రయత్నం చేశామని అన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ సాయంతో ఎప్పుడైనా, ఎక్కడైనా సమాచారాన్ని తయారు లేదా నిర్వహించుకోవచ్చని తెలిపారు.
మైక్రోసాఫ్ట్ విద్యలో ఎన్నో సమూల మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. గత దశాబ్ధ కాలంగా విద్యకోసం 20 దేశాల్లో రూ.670 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో దేశంలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎడ్యు -క్లౌడ్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
భారతదేశ పాఠశాలలు, కళాశాల డిజిటల్ పరివర్తన ప్రయాణంలో తామూ భాగస్వాములం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి అజురే, ఆఫీస్365ను తమ మూడు క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ల నుండి ప్రారంభిస్తామని తెలిపారు. ఎడ్యు -క్లౌడ్ సాయంతో దేశంలో మొదటగా శ్రీచైతన్య స్కూల్స్ తమ 80 పాఠశాలల్లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఆధారిత డిజిటల్ క్లాస్రూమ్లను ప్రారంభించనుందని తెలిపారు.
శ్రీచైతన్య స్కూల్క్ అధినేత బిఎస్రావ్ మాట్లాడుతూ.. తమ విద్యార్థులు 21వ శతాబ్ధపు నైపుణ్యాలతో అత్యుత్తమంగా సిద్దం కావడానికి డిజిటల్ అనుభవాలు మరింతగా ఉపయోగపడతాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యలో చాలా మార్పులు వచ్చాయన్నారు. అయితే మన దేశంలో మొదటిసారిగా మైక్రోసాఫ్ట్ తమ స్కూల్స్తో భావిస్వామి కావడం తమకు గర్వకారణమని అన్నారు. తమ పాఠశాలల్లో 14వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉపయోగించనున్నట్లు తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆ సినిమా చూసి మూడుసార్లు ఏడ్చా
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పీలేకోసం హ్యాపీ బర్త్ డే పాట పాడారు
TNN | Updated:
Oct 14, 2015, 12:38PM IST
కోల్ కతా : ’’నాకు స్పర్ట్స్ గురించి పెద్దగా తెలియదు. నాకు తెలిసింది రెండే పేర్లు. ఒకటి కపిల్ దేవ్, రెండు సచిన్ టెండూల్కర్. ప్రముఖ బ్రెజీలియన్ ఫుట్ బాల్ ఆటగాడు పీలే గురించి బయోపిక్ తీస్తున్నామని ఆ సినిమాకు సంగీతం కావాలని నన్ను అడిగినప్పుడు ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు.సినిమా అంతా అయ్యాక మొత్తం చూసినప్పుడు విజయం కోసం ఆయన పడిన కష్టం చూసి మధ్యలో మూడు సార్లు ఏడ్చా‘‘ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ . కోల్ కతాలో పీలే 75వ జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ క్రికెటర్ సౌరభ్ గంగూలీ , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడాఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెహమాన్ పీలేకోసం హ్యాపీ బర్త్ డే పాట పాడారు. ఈ కార్యక్రమం గురించి రెహమాన్ ట్విట్టర్లో వ్యాఖ్యలు, ఫోటోలు పోస్టు చేశారు.
| 2sports
|
OYO
60టౌన్హౌస్ హోటల్స్కు ‘ఓయో
హైదరాబాద్, మే 11: దక్షిణ భారత్దేశంలో ఓయో ఈ ఏడాది చివరినాటికి 60 టౌన్హౌస్ హోటల్స్ను ప్రారంభించడంతోపాటు మరో ఏడునగరాలకు విస్తరిస్తుందని ఓయో సిఇఒ రితేష్ అగర్వాల్ వెల్లడించా రు. నగరంలో మొట్టమొదటిఓయో టౌన్హౌస్ను ప్రారంభించారు. 2015 ఫిబ్రవరిలో ప్రారంభించి నప్పటి నుంచి ఓయో హైదరాబాద్లో విస్తరించిందన్నారు. హైదరా బాద్ హబ్ప్రస్తుతంఎ నిమిదివేల రూమ్లు, 300 హోటల్స్తో బలమైన నెట్వర్క్గా విస్తరించిందన్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోసైతం ఉన్నాయి. సికింద్రాబాద్లోసైతం విశ్రాంత వ్యాపార ప్రయాణీకులు ఎక్కువ సందర్శిస్తుంటారని, హైదరాబాద్ హోటల్ మధురిన్, ఎక్స్క్లూజివ్ వంటివి తమ నెట్వర్క్లో ఉన్నట్లు వివరిం చారు. ఓయోప్రస్తుతం 70వేలకుపైగా గదులను భారత్, మలేసియా, నేపాల్లలోని 200నగరాల్లో నిర్వహిస్తోందని రితేష్ వెల్లడించారు. హైదరాబాద్ ఓయోటౌన్హౌస్ తమ పోర్టుఫోలియోలో ఐదోహోటల్ గా రితేష్ వెల్లడించారు. వీటిధరలు రూ.2500ల నుంచి ప్రారంభం వుతాయన్నారు. ఢిల్లీ దేశరాజధానికి బైట మొట్టమొదటి టౌన్హౌస్ ఆఫరింగ్గా ఉందన్నారు. 25శాతం హోటల్, 25శాతంఇల్లు, 25శాతం కేఫ్, 25శాతం వాణిజ్యస్టోర్ నమూనాలో టౌన్హౌస్ ఉంటుందన్నారు. ======
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
74 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
రుసగా ఐదు సెషన్ల నష్టాలను కాదని ఈ రోజు మార్కెట్లు మదుపరికి ఊరటనిచ్చాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 74 పాయింట్లు పెరిగి 32,997 వద్ద నిలవగా.. నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకుని 10,124 వద్ద స్థిరపడింది.
TNN | Updated:
Mar 20, 2018, 05:02PM IST
లాభపడ్డ ఐటీ రంగ షేర్లు
తొలుత నష్టాలతో మొదలైనప్పటికీ చివరికి దేశీయ స్టాక్ మార్కెట్లు ఓ మోస్తరు లాభాలతో ముగిశాయి. దీంతో రెండు రోజుల భారీ నష్టాలకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు సెషన్ల నష్టాలను కాదని ఈ రోజు మార్కెట్లు మదుపరికి ఊరటనిచ్చాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 74 పాయింట్లు పెరిగి 32,997 వద్ద నిలవగా.. నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకుని 10,124 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల పతనం, ఫెడ్ పాలసీ సమీక్ష, దేశీయంగా రాజకీయ అనిశ్చితి వంటి ప్రతికూల అంశాల కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. అయితే వెనువెంటనే పుంజుకుని రోజు మొత్తం పటిష్ట లాభాలతో కదిలాయి. సెన్సెక్స్ 33,102 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో టాటా స్టీల్(3.17%), సన్ ఫార్మా(2.20%), డాక్టర్ రెడ్డీస్(1.85%), విప్రో(1.54%), అదానీ పోర్ట్స్(1.47%), హెచ్డీఎఫ్సీ(1.38%) లాభపడ్డ వాటిలో ముందుండగా, మరో వైపు ఓఎన్జీసీ(1.13%), ఐసీఐసీఐ బ్యాంక్(1.10%), యెస్ బ్యాంక్(0.92%), రిలయన్స్(0.64%), హెచ్ డీఎఫ్సీ బ్యాంక్(0.56%), కొటక్ బ్యాంక్(0.55%) ఎక్కువగా నష్టపోయాయి.
| 1entertainment
|
Hyderabad, First Published 2, Jul 2019, 1:40 PM IST
Highlights
అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు అడాగ్ రిలయన్స్ రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ముంబై నగర పరిధిలో వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేలోని శాంటాక్రూజ్ భవన సముదాయాన్ని విక్రయించడం గానీ, లేదా లీజుకివ్వడం ద్వారా గానీ కొంత నగదు సమకూర్చుకుని అప్పులు తీర్చి.. వచ్చే ఏడాది చివరికల్లా రుణ రహిత సంస్థగా రిలయన్స్ అడాగ్ గ్రూపును నిలుపాలని అనిల్ అంబానీ పట్టుదలగా ఉన్నారని సమాచారం. కానీ ఆయన తాజా నిర్ణయంతో అడాగ్ గ్రూప్ సంస్థల షేర్లు పతనమయ్యాయి.
ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకున్న అడాగ్ - రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీ తీసుకున్న సంచలన నిర్ణయం మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది. అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు ముంబైలోని అతి విలాసవంతమైన భవన సముదాయం విక్రయించడం గానీ, అద్దెకివ్వడమో చేయాలని యోచిస్తున్నారట.
తద్వారా కొన్ని అప్పులు తీర్చాలని అనిల్ అంబానీ భావిస్తున్నారు. అందులో భాగంగా ముంబైలో ప్రస్తుతం అడాగ్ గ్రూపునకు ప్రధాన కార్యాలయంగా వినియోగిస్తున్న ఈ భవనాన్ని లీజు ప్రాతిపదికన అప్పగించడం లేదంటే మంచి బేరం వస్తే విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బీఎస్ఈకి సమచారం ఇచ్చింది.
దీర్ఘకాలిక లీజు కింద భవనాన్ని అప్పగించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని రుణ భారం తగ్గించుకునేందుకు వినియోగించుకోనుంది. 2020 నాటికి రుణ రహిత సంస్థగా మారేందుకు రిలయన్స్ ఇన్ఫ్రా లక్ష్యం నిర్దేశించుకుంది. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేలో 7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూప్నకు చెందిన శాంటాక్రూజ్ ప్రధాన కార్యాలయం ఉంది.
ఈ భవనం అమ్మకం లేదా లీజు కోసం గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థల గ్రూపు సంస్థ బ్లాక్స్టోన్ , యుఎస్ ఆధారిత ఫండ్తో చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదిక చెబుతున్నాయి. తద్వారా రిలయన్స్ ఇన్ ఫ్రా రూ. 1,500-2,000 కోట్ల నగదు సమకూర్చుకోనుందని ఒక ఆంగ్ల దినపత్రిక రాసిన కథనం పేర్కొంది.
మరోవైపు ఈ భవనం కూడా చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ లావాదేవీ పూర్తి చేయడం కోసం ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జెఎల్ఎల్ను కూడా నియమించుకుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న దక్షిణ ముంబైలోని తన బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయానికి తిరిగి వెళ్లాలని కూడా అనిల్ అంబానీ ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో అడాగ్ గ్రూపు షేర్లు భారీగా నష్టపోయాయి.
ఈ ఒప్పందం పూర్తయితే శాంతాక్రూజ్ నుంచి దక్షిణ ముంబైలోని బెల్లార్డ్ ఎస్టేట్కు ప్రస్తుత కార్యాలయాన్ని మారుస్తారు. ముంబై వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రిలయన్స్ గ్రూపు కార్యాలయాలకు ఉద్యోగులనూ తరలిస్తారు.
ఇదిలా ఉంటే అవసరమైతే ఆస్తులను విక్రయించైనా సరే రుణాలు తిరిగి చెల్లిస్తానని ఇటీవల అనిల్ అంబానీ ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే రిలయన్స్ గ్రూపు వేగంగా పావులు కదుపుతున్నట్లు పలువురు భావిస్తున్నారు.
రిలయన్స్ సెంటర్ కార్యాలయ భవనం 6.95 లక్షల చదరపు అడుగుల స్థలంలో పరివేష్టితమై ఉంది. ఇక్కడ ఒకేసారి 425 కార్లు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ముంబై వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేకు పక్కనే ఉండటంతోపాటు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 15 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంది.
అంటే దేశీయ విమానాశ్రయ టెర్మినల్కు 10 నిమిషాల్లో చేరుకోవచ్చు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్కు చేరుకోవాలంటే కేవలం 20 నిమిషాల ప్రయాణం మాత్రమే. త్వరలో రాబోతున్న శాంతాక్రజ్ మెట్రో స్టేషన్ పక్కనే రిలయన్స్ అడాగ్ గ్రూప్ కార్యాలయ భవనం ఉంది.
న్యూఢిల్లీ-ఆగ్రా టోల్ రహదారిని క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు విక్రయించనున్నట్లు ఇటీవల రిలయన్స్ ఇన్ఫ్రా ప్రకటించింది. వచ్చేనెల చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి, రూ.3,600 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది.
గత ఏడాది ముంబైలో ఉన్న ఇంధన వ్యాపారాన్ని రూ.18,800 కోట్లకు అదానీ ట్రాన్స్మిషన్కు విక్రయించింది. దీంతో రుణ భారాన్ని రూ.22వేల కోట్ల నుంచి తగ్గించుకుంది.
సరిగ్గా 11 ఏళ్ల క్రితం 2008లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6వ ధనవంతుడైన అనిల్ అంబానీ కూడా గత నెలలో కుబేరుల క్లబ్ నుంచి కిందికి జారుకున్నారు. 2018 మార్చి నాటికి రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం రూ.1.7 లక్షల కోట్లకు పైగా ఉంది.
11 ఏళ్లలో అనిల్ అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ రూ. 3,651 కోట్లకు (23 523 మిలియన్లు) కుప్పకూలింది. 2005లో రిలయన్స్ సామ్రాజ్యాన్ని అన్న ముకేశ్ అంబానీలో విభజించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత అనిల్ అంబానీకి ఈ కార్యాలయం లభించింది.
మరోవైపు, రిలయన్స్ గ్రూపునకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) కూడా దివాలా బాటలో ఉంది. దివాలా ప్రక్రియ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్కు (ఎన్సీఎల్టీ) చేరింది. ఇప్పటికే రూ.57,500 కోట్ల క్లెయిమ్లు వచ్చాయి. ఇందులో సొంత గ్రూపు సంస్థలు కూడా తమకు రూ.7,000 కోట్లు ఆర్కామ్ నుంచి రావాలని క్లెయిమ్ చేశాయి.
| 1entertainment
|
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
First Published 5, Mar 2018, 12:02 PM IST
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంబోత్సవ గ్యాలరీ
Recent Stories
| 0business
|
- తయారీ, ప్రాసెసింగ్, పంపిణీ,
దిగుమతులపై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం
న్యూఢిల్లీ: అనుమతి పొందిన తొమ్మిది మ్యాగీ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా ఉపసంహరించుకొని వాటిని వెంటనే మార్కెట్ల నుంచి వెనక్కి తెప్పించాలని 'భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికారిక సంస్థ' (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నెస్లే సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. మ్యాగీ ఉత్పత్తులలో మానవులకు హాని కలిగలించే ప్రమాదకరమై రసాయన ధాతువులు ఉన్నందునే వాటిని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మ్యాగీ న్యూడుల్స్ విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసి వాటిని వెనక్కి పిలిపించాలని నెస్లే సంస్థ స్వీయ నిషేధపు నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే 'ఎఫ్ఎస్ఎస్ఐ' నిషేధపు ఉత్తర్వులు జారీ అవ్వడం విశేషం. ఈ ఆదేశాలు వెలువడిన క్షణం నుంచి ఎలాంటి మ్యాగీ ఉత్పత్తుల తయారీని, ప్రాసెసింగ్ను, దిగుమతులను, పంపిణీ, అమ్మకాలను నిర్వహించవద్దంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల మ్యాగీ ఉత్పత్తుల విషయంలో వస్తున్న వార్తల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వినియోగదారుల నమ్మకం కొంత సడలిందని దీనిని నిలబెట్టుకొనేందుకు గాను తాము మ్యాగీ న్యూడుల్స్ ఉత్పత్తులను ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ సీఈవో పాల్ బుల్కే తెలిపారు. అయితే మ్యాగీ న్యూడుల్స్లో హాని కలిగించే సీసం గానీ మోనో సోడియం గ్లూటమిన్ (ఎంఎస్జీ) వంటి రసాయన ధాతువులు ఉన్నట్లు అంగీకరించమని ఆయన తెలిపారు. మ్యాగీ న్యూడుల్స్పై నెలకొన్న గందరగోళ పరిస్థితి నుంచి భారత వినియోగదారులకు స్పష్టత ఇచ్చేందుకే తాము మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
దేశ వ్యాప్తంగా మ్యాగీ న్యూడుల్స్ పరీక్షలకు ల్యాబ్లలో ఉన్న ప్రమాణాలలో తేడా కారణంగానే ప్రస్తుత గందరగోళ పరిస్థితి నెలకొని ఉంటుందని నెస్లే సంస్థ సీఈవో పాల్ బుల్కే అభిప్రాయపడ్డారు. లాభాల కోసం పెట్టుబడిదారులు ఎంతకైనా తెగిస్తారన్న విషయం మ్యాగీ ఉదంతంతో మరోమారు నిరూపితమైంది. చిన్నపిల్లల జీవితాలతో చలగాటమాడే చర్యలకు పాల్పడి కూడా నెస్లే కంపెనీ సీఈవో తమ ఉత్పత్తి మంచిదేనంటూ బుకాయిండంపై అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ల్యాబ్ రిపోర్టులు రాకమునుపే తెలంగాణ ప్రభుత్వం మ్యాగీపై నిషేధం విధించింది. ఫలితాలు వచ్చేందుకు ఇంకా రెండు రోజుల సమయం పట్టనున్నప్పటికీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యాఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా శఆంధ్రప్రదేశ్లో కూడా మ్యాగీ న్యూడుల్స్పై తాము నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Kotak
మెరిసిన కోటక్ మహీంద్ర బ్యాంకు
న్యూఢిల్లీ: ప్రైవేటురంగంలోని కోటక్ మహీంద్ర బ్యాంకు నికరలాభం 40.3శాతం పెరిగి 976.48 కోట్లకు చేరింది. బ్యాంకు నికరలాభం 69578 కోట్లుగా గత ఏడాది ఇదే త్రైమాసికంలో నిలి చింది. మొత్తం ఆదాయవనరులపరంగాచూస్తే 9.9శాతం పెరిగి 5434.65 కోట్ల రూపాయలకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో 4947.32 కోట్లుగా ఉంది. స్థిరాస్తి ప్రమాణాల రీత్యాచూస్తే స్థూల నిరర్ధక ఆస్తులు మొత్తం అడ్వాన్సుల్లో 2.59శాతంగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది 2.36శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా నికర నిరర్ధక ఆస్తులు లేదా రానిబాకీలు మొత్తం అడ్వాన్సుల్లో 1.26శాతంగా ఉన్నాయి. గత ఏడాది 1.06శాతం మాత్రమే ఉండగా స్వల్పంగా పెరిగాయి. దీనివల్లనే బ్యాంకు రానిబాకీల కేటాయింపులను పెంచింది. 2673.37కోట్లకు చేర్చింది. గతఏడాది రానిబాకీల కేటాయింపులు 200.41 కోట్లుగా ఉన్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను కోటక్ మహీంద్ర బ్యాంకు నికరలాభం 3411.50 కోట్లుగా ఉంది. గత ఏడాది 2089.78శాతంనుంచి గణనీ యంగా పెంచుకుంది. మొత్తం రాబడులు 18,996.42 కోట్ల నుంచి 21,176.09 కోట్లకు చేరాయి. బోర్డు డైరెక్టర్ల సమావేశంలో బ్యాంకు ప్రతి వాటాకు 0.60శాతంగా ప్రకటించింది. బ్యాంకు స్థిరాస్థి ప్రమా ణాలు 214.589.96కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది1,92,259.79కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు షేర్లు 1.26శాతం పెరిగి 911.70 రూపాయలుగా బిఎస్ఇలో ట్రేడింగ్ జరిగింది.
| 1entertainment
|
sacking of Mickey Arthur as Pakistan's coach
స్ఫూర్తి నింపలేకపోయావు.. పాక్ కోచ్ దిగిపో
అత్యంత ఆసక్తిని పెంచిన మ్యాచ్ ఏకపక్షంగా ముగిసేందుకు కోచ్ అర్థంలేని గేమ్ ప్లాన్లే కారణ...
TNN | Updated:
Jun 6, 2017, 09:08PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ కోచ్ మిక్కీ ఆర్థర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆ దేశ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ డిమాండ్ చేశాడు. ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 124 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. జట్టులో స్ఫూర్తి నింపడంలో కోచ్ విఫలమయ్యారని.. అతను బాగా పనిచేస్తుంటే పాక్ ఎందుకు వన్డే ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి పడిపోతుందని యూసఫ్ ప్రశ్నించాడు.
ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యంత ఆసక్తిని పెంచిన మ్యాచ్‌ ఏకపక్షంగా ముగిసేందుకు కోచ్ అర్థంలేని గేమ్ ప్లాన్‌లే కారణమని ఈ మాజీ క్రికెటర్ విమర్శించాడు. కోహ్లిపై మంచి రికార్డు ఉన్న జునైద్ ఖాన్‌ని పక్కకి తప్పించి.. కుడిచేతి వాటం బౌలర్‌కి అవకాశం ఇవ్వడం తెలివిలేని నిర్ణయమన్నాడు. ఏది ఏమైనా కీలక మ్యాచ్‌లో సరైన ప్రణాళికలతో పాక్ వెళ్లలేదని ఫలితంతో స్పష్టమైందని వివరించాడు.
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఆఖరి బంతికి సిక్స్.. దినేశ్ కార్తీక్ అరుదైన రికార్డ్
అద్భుతమైన ఆటతో చివరి బంతిని సిక్స్గా మలిచి భారత్ను గెలిపించిన కార్తీక్ వరల్డ్ రికార్డ్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
Samayam Telugu | Updated:
Mar 19, 2018, 12:20AM IST
నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓటమి అంచున నిలిచిన వేళ దినేశ్ కార్తీక్ అద్భుతం చేశాడు. రెండు ఓవర్లలో 34 పరుగులు అవసరమైన స్థితిలో క్రీజులో అడుగుపెట్టిన దినేశ్.. వస్తూనే సిక్సర్ల మోత మోగించాడు. 19వ ఓవర్లో వరుసగా 6,4,6,0,4,2 చొప్పున 20 పరుగులు పిండుకున్న కార్తీక్.. ఆఖరి ఓవర్ చివరి బంతికి విజయానికి ఐదు పరుగులు అవసరమైన దశలో సిక్స్ బాది ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. కార్తీక్ 8 బంతుల్లోనే 29 పరుగులు చేయడం అతడి విధ్వంసానికి అద్దం పడుతోంది.
Visit Site
Recommended byColombia
అద్భుతమైన ఆటతో చివరి బంతిని సిక్స్‌గా మలిచి భారత్‌ను గెలిపించిన కార్తీక్ వరల్డ్ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ట్రోఫీ ఫైనల్లో సిక్స్‌తో జట్టును గెలిపించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా అతడు రికార్డ్ నెలకొల్పాడు. ఓవరాల్‌గా 1986లో ఆస్ట్రేలియాసియా కప్ ఫైనల్లో జావెద్ మియాందాద్ సిక్స్‌ బాదగా.. ఇన్నాళ్లకు దినేశ్ కార్తీక్ ఆ ఫీట్ సాధించాడు.
అంతర్జాతీయ టీ20ల్లో చివరి బంతికి సిక్స్ బాది జట్టును గెలిపించిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా దినేశ్ కార్తీక్ రికార్డ్ నెలకొల్పాడు. 2010లో కపుగెదర భారత్‌పై, 2012లో ఇయాన్ మోర్గాన్ భారత్‌పై, బాబర్ 2013లో విండీస్‌పై, సిబండ 2014లో నెదర్లాండ్స్‌పై ఈ ఫీట్ నమోదు చేశారు. టీ20ల్లో చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన ఏకైక బ్యాట్స్‌‌మెన్ దినేశ్ కార్తీక్ కావడం విశేషం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
జూన్ 9న సుకుమార్ రైటింగ్స్ దర్శకుడు
Highlights
జూన్ 9న సుకుమార్ రైటింగ్స్ దర్శకుడు చిత్రం విడుదల
ఇటీవల బ్యాంకాక్లో చిత్రీకరరించిన పాటతో షూటింగ్ మొత్తం పూర్తి
ఈ నెల 22న ఓ ప్రముఖ స్టార్ హీరో చేతులమీదుగా టీజర్ విడుదల
కొత్తదనంతో కూడిన సృజనాత్మక కథాంశాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. మొదటి ప్రయత్నంగా కుమారి 21ఎఫ్ చిత్రంతో చక్కటి విజయాన్ని దక్కించుకున్నారు. స్వీయ నిర్మాణ సంస్థపై ద్వితీయ ప్రయత్నంగా సుకుమార్ నిర్మిస్తున్న చిత్రం దర్శకుడు.
అశోక్, ఇషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్క దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశలో వున్నాయి. జూన్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఓ సినీ దర్శకుడి ప్రేమకథ ఇది. ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా అందరిని అలరిస్తుంది. కథలోని మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. నవ్యమైన అంశాలు మేళవించిన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది అన్నారు.
ఇటీవల బ్యాంకాక్లో చిత్రీకరరించిన పాటతో షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ నెల 22న ఓ ప్రముఖ స్టార్ హీరో చేతులమీదుగా టీజర్ను విడుదల చేయబోతున్నాం. ఇదే నెలలో ఆడియోను విడుదల చేస్తున్నాం అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సుకుమార్తో పాటు బిఎన్సిఎస్పి విజయ్కుమార్, థామస్రెడ్డి అడూరి, రవిచంద్ర నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా.
Last Updated 25, Mar 2018, 11:46 PM IST
| 0business
|
Visit Site
Recommended byColombia
ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా గురువారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ.. పేస్కి అతిగా అనుకూలించిన పిచ్పై పాట్ కమిన్స్ (4/39), మిచెల్ స్టార్క్ (2/41) చెలరేగడంతో.. శ్రీలంక జట్టు వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఎంతలా అంటే.. ఆ జట్టు ఓపెనర్లు కరుణరత్నె (24), తిరుమానె (12)తో పాటు కెప్టెన్ దినేశ్ చండిమాల్ (5), కుశాల్ మెండిస్ (14), రోషన్ సిల్వ (9), ధనుంజయ (5) ఇలా టాప్-6 బ్యాట్స్మెన్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు. ఈ దశలో క్రీజులో నిలిచిన డిక్వెల్లా(64: 78 బంతుల్లో 6x4, 1x6) అసాధారణ ఆటతీరుతో ఆ జట్టు పరువు నిలిపాడు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 144 పరుగులు చేయగలిగింది.
Classic! With Sri Lanka in all sorts of trouble, Niroshan Dickwella pulled out this spectacular shot! #AUSvSL |… https://t.co/3rYWUiAlNA
— cricket.com.au (@cricketcomau) 1548317283000
ఆఫ్ స్టంప్కి దూరంగా 140కిమీ వేగంతో బౌన్సర్ రూపంలో మిచెల్ స్టార్క్ బంతిని విసరగా.. ముందే స్కూప్ షాట్కి సిద్ధమైన డిక్వెల్లా.. లాఘవంగా బంతిని హిట్ చేశాడు. దీంతో.. బ్యాట్ని తాకిన బంతి వికెట్ కీపర్ టిమ్పైన్ తలమీదుగా వెళ్లి బౌండరీ లైన్ అవల పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీలంకకి చెందిన మాజీ ఓపెనర్ దిల్షాన్ ఈ స్కూప్ షాట్ని వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. ఈ షాట్ని ‘దిల్ స్కూప్’గా పిలుస్తుంటారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కోహ్లిసేనని ఓడించడం మాకు కష్టమే..?
శ్రీలంకతో ఇటీవల ముగిసిన సిరీస్లో వరుస విజయాలు సాధించి జోరుమీదున్న భారత జట్టుని రాబోవు వన్డే సిరీస్లో ఓడించడం
TNN | Updated:
Sep 10, 2017, 06:00PM IST
శ్రీలంకతో ఇటీవల ముగిసిన సిరీస్‌లో వరుస విజయాలు సాధించి జోరుమీదున్న భారత జట్టుని రాబోవు వన్డే సిరీస్‌లో ఓడించడం తమకి కష్టమేనని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ వెల్లడించాడు. ఈ నెల 17 నుంచి టీమిండియాతో ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆస్ట్రేలియా ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ కోసం రెండు రోజుల క్రితం జట్టుతో కలిసి భారత్‌కు చేరుకున్న స్టీవ్‌స్మిత్ తాజాగా మీడియాతో మాట్లాడాడు.
‘ఈ పర్యటన మాకు చాలా కఠినమైంది. భారత్ జట్టు ప్రస్తుతం అత్యుత్తమ క్రికెట్ ఆడుతోంది. ఇటీవల శ్రీలంకతో ముగిసిన సిరీస్‌లో అద్భుత విజయాలు అందుకుని జోరుమీదుంది. కాబట్టి.. వారితో వన్డే సిరీస్‌ మా జట్టుకి ఒక ఛాలెంజ్. మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. టీమిండియాలో స్పిన్నర్లు అక్షర్, చాహల్, కుల్దీప్ యాదవ్‌ మెరుగ్గా రాణిస్తున్నారు. కాబట్టి వారి స్పిన్‌ని సిరీస్‌ మొత్తం కాచుకుని కోహ్లిసేనని ఓడించాలంటే మాకు కష్టమే’ అని స్టీవ్‌స్మిత్ వివరించాడు. శ్రీలంకతో ముగిసిన సుదీర్ఘ సిరీస్‌లో భారత్ 3-0తో టెస్టులను, 5-0తో వన్డేల్లోనూ క్లీన్‌స్వీప్ సాధించి.. చివర్లో ఏకైక టీ20లోనూ ఘన విజయాన్ని అందుకుని పర్యటన ముగించిన విషయం తెలిసిందే.
| 2sports
|
internet vaartha 175 Views
కోల్కత్తా : దేశవ్యాప్తంగా 300 మందికిపైగా ఉన్న జ్యుయెలరీ అసోసియేషన్లు ఈనెల పదవ తేదీ పాన్కార్డు నిబంధనలకు వ్యతిరేకంగా ఒకరోజుసమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు లక్షల రూపాయలకు పైబడిన ఏ లావాదేవీకైనా పాన్కార్డు నిబంధన విధించడం వల్ల కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయని చెపుతున్నారు. గత్యం తరం లేని పరిస్థితుల్లోనే ఈ నిబంధనను సవరించాలన్న డిమాండ్తో బుధవారం సమ్మెకు దిగుతున్నట్లు జిజెఎఫ్ ఛైర్మన్ శంకర్సేన్ వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల జ్యుయెలరీ అమ్మకాలపై ఈ నిబంధన తీవ్రస్థాయి ప్రభావం చూపించింద న్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 22.3 కోట్ల పాన్ కార్డులు జారీచేసింది. గ్రామీణ, పట్టణప్రాంతాల ప్రజలు ఈ నిబంధనపట్ల కొనుగోళ్లకు వెనుకంజ వేస్తున్నారు. జనవరి నుంచి అమ్మకాలు 30 శాతం తగ్గాయని శంకర్సేన్ విలేకరులకు తెలిపారు. ఆభరణాల వ్యాపారులకు అమ్మకాల పరంగా 50 శాతం గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచే ఉంటాయని, ఈ రంగంతో వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఆధారపడి బతుకుతున్నారని ప్రస్తుత నిబంధనల కారణంగా ఈ రంగంలోని వ్యాపారులకు తీవ్రభారం సమస్యలు ఎదురవుతాయని ఆయన అన్నారు. దేశంలోని అన్ని మేజర్ రిటైలర్లు పిసి చంద్రా,తనిష్క్క, సెన్కోగోల్డ్ ఇతర రాష్ట్రాల్లోని అందరు రిటైలర్లు కూడా ఈసమ్మెలో పాల్గొంటారని శంకర్సేన్ వెల్లడించారు.
| 1entertainment
|
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన పాయల్ రాజ్పుత్, కౌశల్ (ఫోటోలు)
First Published 5, Oct 2018, 10:36 AM IST
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన పాయల్ రాజ్పుత్, కౌశల్ (ఫోటోలు)
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
KLM ఫ్యాషన్ మాల్ ని ప్రారంభించిన కార్తికేయ, పాయల్ రాజపుత్
Recent Stories
| 0business
|
kareena kapoor khan looked stunning
పిల్లాడు పుట్టాకా.. హీరోయిన్ హాట్ రీ ఎంట్రీ!
యంగ్ హీరోయిన్లకు పోటీగా, యంగ్ హీరోలకు సరి జోడీగా నిలిచేలా ఉంది.
| Updated:
Sep 7, 2017, 12:01PM IST
వివాహం తర్వాత కూడా అంతకు ముందులాగే హాట్ హాట్ గా నటించింది కరీనా కపూర్ . సైఫ్ అలీఖాన్ తో సుదీర్ఘ ప్రేమబంధాన్ని పెళ్లిగా మార్చుకుంది కరీనా. అయితే పెళ్లి తన గ్లామర్ షోకు ఎలాంటి అడ్డంకి కాదని ఈ పటౌడీల కోడలు అప్పట్లోనే స్పష్టం చేసింది. ‘కి అండ్ కా’ వంటి సినిమాలో కరీనా ఎలా నటించిందో వేరే వివరించనక్కర్లేదు.
పెళ్లి కరీనా సినిమాలకు అడ్డంకి కాకపోయినా.. ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలతో కొంత గ్యాప్ వచ్చింది. కొన్ని నెలల కిందట కరీనా ప్రసవించింది. తైమూర్ కు జన్మనిచ్చింది. ఇప్పుడు కరీనా మళ్లీ సినిమాల మీద కన్నేసినట్టుగా ఉంది. అందుకే తాజా ఫొటో షూట్ తో వార్తల్లోకి వచ్చింది. నేనున్నానంటూ బాలీవుడ్ కు సంకేతాలు ఇచ్చింది ఈ హాట్ ఫొటో షూట్ తో.
ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ సెప్టెంబర్ సంచిక కోసం కరీనా ఈ పోజులిచ్చింది. ప్రస్తుతం కరీనా వయసు 36 సంవత్సరాలు. ఆ ఛాయలు ఏవీ అగుపించని గ్లామర్ తో బాలీవుడ్ యంగ్ హీరోయిన్లకు పోటీగా, యంగ్ హీరోలకు సరి జోడీగా నిలిచేలా ఉంది.
| 0business
|
ricky ponting could be new delhi daredevils coach
ఢిల్లీ డేర్డేవిల్స్ కోచ్గా రికీ పాంటింగ్..?
ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్ ఢిల్లీ డేర్ డేవిల్స్ కొత్త కోచ్గా బాధ్యతలు చేపట్టున్నట్లు సమాచారం.
TNN | Updated:
Nov 17, 2017, 12:32PM IST
ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్ ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో పంటర్ డేర్ డేవిల్స్ కోచ్‌గా బాధ్యతలను స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌ కోచ్‌గా జట్టును విజయపథంలో నడిపిన పాంటింగ్ అదే తరహాలో తమ జట్టుకు కూడా విజయాలు అందించాలని ఢిల్లీ యాజమాన్యం ఆశిస్తోంది. రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి ఐపీఎల్‌లో అడుగు పెడుతున్న రాజస్థాన్ రాయల్స్ కూడా పాంటింగ్‌ను కోచ్‌గా తీసుకునేందుకు ఆసక్తి చూపుతోంది.
ఢిల్లీ డేర్ డేవిల్స్ క్యాంప్ నుంచి బయటకు వచ్చిన టీఏ శేఖర్ ముంబై ఇండియన్స్‌తో చేరనున్నట్లు సమాచారం. ఆయన ఇటీవలే ఢిల్లీ జట్టు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. మాజీ ఆల్‌రౌండర్ రాబిన్ సింగ్, పరాస్‌ మాంబ్రేలు ముంబై జట్టును వీడుతున్నారు. రాబిన్ సింగ్ టీ10 లీగ్‌ కోసం పనిచేయడంతోపాటు.. దుబాయ్‌లో సొంతగా క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాడు. హాంగ్‌కాంగ్ సిక్సెస్‌తో ఈ మాజీ ఆల్‌రౌండర్ కలిసి పని చేసే అవకాశాలు ఉన్నాయి.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ కోచ్‌గా పరాస్ చేరాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన అడ్డు రావడంతో ఆయన ముంబై ఇండియన్స్‌కు దూరమయ్యారు. 2017లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ భారత్-ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన ఢిల్లీ జట్టుకు దూరమయ్యారు.
| 2sports
|
Hyderabad, First Published 15, May 2019, 12:29 PM IST
Highlights
ప్రముఖ ఈకామర్స్, డిజిటల్ వ్యాలెట్ పేటీఎంలో భారీ స్కాం జరిగింది. ఈ విషయాన్ని ఆ సంస్థ కు చెందిన అధికారులు ఆలస్యంగా గుర్తించారు. క్యాష్బ్యాక్ రూపంలో ఏకంగా రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు మోసం జరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
ప్రముఖ ఈకామర్స్, డిజిటల్ వ్యాలెట్ పేటీఎంలో భారీ స్కాం జరిగింది. ఈ విషయాన్ని ఆ సంస్థ కు చెందిన అధికారులు ఆలస్యంగా గుర్తించారు. క్యాష్బ్యాక్ రూపంలో ఏకంగా రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు మోసం జరిగినట్లు కంపెనీ వెల్లడించింది. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థతో కలిసి రూపొందించిన ఒక ప్రత్యేక టూల్తో ఈ మోసాన్ని గుర్తించినట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.
ఈ మోసం బైటపడిన నేపథ్యంలో వందల కొద్దీ విక్రేతలను తమ ప్లాట్ఫాం నుంచి తొలగించడంతో పాటు పలువురు ఉద్యోగులను తప్పించినట్లు వివరించారు. ‘దీపావళి తర్వాత కొంత మంది విక్రేతలకు పెద్ద ఎత్తున క్యాష్బ్యాక్ లభిస్తుండటాన్ని మా టీమ్ గుర్తించింది. దీన్ని మరింత లోతుగా పరిశీలించాలని మా ఆడిటర్లను కోరాం‘ అని విజయ్ శేఖర్ శర్మ చెప్పారు.
ఆడిటింగ్ సంస్థ నిర్వహించిన ఆడిట్లో కొందరు జూనియర్ స్థాయి ఉద్యోగులు, సంస్థలు కుమ్మక్కై ఈ క్యాష్బ్యాక్ కుంభకోణానికి తెరతీసినట్లు వెల్లడైందని ఆయన వివరించారు.క్యాష్బ్యాక్ ఆఫర్లతో వ్యాపారం లాభసాటిగా ఉండదన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఇలాంటివి ఇచ్చినా వ్యాపారం నిలదొక్కుకోగలదని శర్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరింత మంది యూజర్లు, వ్యాపారులకు చేరువయ్యేందుకు భారీగా వ్యయాలు చేస్తున్నందున లాభాల్లోకి మళ్లేందుకు మరికాస్త సమయం పడుతుందని చెప్పారు.
Last Updated 15, May 2019, 12:29 PM IST
| 1entertainment
|
Visit Site
Recommended byColombia
విరాట్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నప్పటికీ.. కీలక సమయాల్లో ధోనీ సలహాలను తీసుకుంటాడనే సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ సెట్ చేయడంలో, బౌలర్లను సమర్థవంతంగా వాడుకోవడంలో మహీ తర్వాతే ఎవరైనా. అలాంటి ధోనీ మంచి కెప్టెన్ ఎలా ఉండాలనే విషయమై స్పందించాడు.
మంచి కెప్టెన్ వ్యక్తిగతంగా ఆటగాళ్లను అర్థం చేసుకోవాలి. వారి బలాలను, బలహీనతలు తెలియకపోతే వారికి తగిన సలహా ఇవ్వలేమని ధోనీ చెప్పాడు. జట్టుతో కలిసి ఆడే విషయంలో, వ్యక్తిగతంగా ఇతర ఆటగాళ్లు మెరుగ్గా రాణించేలా సాయం చేయడం ముఖ్యమని మహీ అభిప్రాయపడ్డాడు.
కెప్టెన్గా కంటే సాధారణ ఆటగాడిగా ఉండటం ముఖ్యమన్న ధోనీ.. ఆటగాడిగా ఎదుర్కొన్న సమస్యలే కెప్టెన్గా ఇతర ఆటగాళ్లు ఎలా ఫీలవుతున్నారో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని తనదైన శైలిలో చెప్పాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దనే విషయాలను దిగ్గజ క్రికెటర్ల నుంచి నేర్చుకున్నానని ధోనీ చెప్పాడు. సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్, జహీర్, యువీ, భజ్జీ, కోహ్లిల నుంచి తానెంతో నేర్చుకున్నానని మహీ తెలిపాడు. కోహ్లి కెప్టెన్సీ గురించి ప్రశ్నించగా.. హీ ఈజ్ వెరీ గుడ్ అంటూ సింపుల్గా బదులిచ్చాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Aditya Chopra upset with Katrina Kaif?
కత్రినా కైఫ్పై ఆది గరంగరం
ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్ ఆదిత్యాచోప్రాకి ఇప్పుడు కత్రినా కైఫ్ పేరు వింటేనే ఒళ్లు మండిపోతోందట.
| Updated:
Dec 18, 2015, 04:16PM IST
ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్ ఆదిత్యాచోప్రాకి ఇప్పుడు కత్రినా కైఫ్ పేరు వింటేనే ఒళ్లు మండిపోతోందట. పరిశ్రమకి తాను పరిచయం చేసిన హీరోయిన్లకి, లేదా లైఫ్ ఇచ్చిన హీరోయిన్లకి మరోసారి అవకాశం ఇచ్చే దర్శకనిర్మాతల్లో ఆదిత్యాచోప్రా ఎప్పుడూ ముందే వుంటాడు. అలాగే కత్రినా కైఫ్కి కూడా గతేడాది అర్జున్ కపూర్ , రణ్వీర్ సింగ్ , ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో రిలీజైన ' గుండే ' సినిమాలో నటించాల్సిందిగా అవకాశం ఇచ్చాడట. అయితే కత్రినా మాత్రం ఈ అవకాశం తనకొద్దంటూ తిరస్కరించిందని.. అప్పటి నుంచి ఆదిత్యా చోప్రాకి ఆమె పేరు వింటేనే ఒళ్లు మండిపోతోందనే టాక్ వినిపిస్తోంది. తాను అడిగితే కాదని చెప్పి కత్రినా క్షమించరాని తప్పు చేసిందని భావిస్తున్న ఆది.. ఆమెపట్ల కాస్త సీరియస్గానే వున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆనోటోఈనోటా ఈ సంగతి తెలుసుకున్న కత్రినా.. తిరిగి ఆది మెప్పు పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ ఆది ఇప్పుడామెని క్షమించే మూడ్లో లేడట.
| 0business
|
May 14,2018
ఎఫ్డీఐలు తగ్గుముఖం..
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని విదేశీ ప్రత్యక్ష పెట్టుబ డుదారులు గ్రహించినట్టు ఉన్నారు. 2017 మార్చి తర్వాత ఎఫ్డీఐలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 4027 మిలియన్ డాలర్ల (1 మిలియన్ డాలరు రూ.6.73 కోట్లు) నుంచి మే 2017నాటికి 3,153 మిలియన్ డాలర్లకు ఎఫ్డీఐ లు తగ్గిపోయాయి. గత ఏడాది సెప్టెంబరులో 2,654 మిలియన్ డాలర్లకు, 2018 మార్చి నాటికి 1554 మిలియన్ డాలర్లకు ఎఫ్డీఐలు పడిపోయాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
Aug 12,2016
టెక్ కుబేరుల్లో ఇద్దరు భారతీయులు
న్యూయార్క్: ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన వంద మంది టెక్ కుబేరుల జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. విప్రో చెర్మన్ అజిమ్ ప్రేమ్జీ, హెచ్సీఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్లు ఫోర్భ్స్ జాబితాలో టాప్-20లో నిలిచారు. 16 బిలియన్ డాలర్ల ఆస్తితో జాబితాలో ప్రేమ్జీ 13వ ర్యాంకును దక్కించుకోగా..11.6 బిలియన్ డాలర్ల ఆస్తితో శివ్ నాడార్ 17వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. '100 రిచెస్ట్ టెక్నాలజీ బిలినీయర్ల ఇన్ ది వరల్డ్ 2016' జాబితాలను ఫోర్బ్స్ తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో 78 బిలియన్ డాలర్ల ఆస్తితో మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తొలి స్థానంలో నిలిచారు. ఇండో-అమెరికన్ టెక్నాలజీ సింఫోనీ టెక్నాలజీ గ్రూప్ సీఈఓ రొమేశ్ వాధ్వాని, ఐటీ కన్సల్టింగ్, ఔట్సోర్సింగ్ కంపెనీ సింటెల్ వ్యవస్థాపకులు భరత్ దేశారు, ఆయన భార్య నీర్జా సేతీలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. భారత మూడో అతిపెద్ద ఔట్సోర్సర్గా ఉన్న ప్రేమ్జీ కంపెనీ విప్రో, గత కొన్ని ఏండ్లుగా నమోదుచేస్తూ వస్తున్న వృద్ధితో ఆయన కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నట్టు ఫోర్భ్స్ వెల్లడించింది. నాడార్కు హెచ్సీఎల్ టాలెంట్ కేర్తో పాటు, గ్రాడ్యుయేట్లకు శిక్షణను ఇచ్చే స్కిల్స్ డెవలప్మెంట్ సంస్థ ఉందని పేర్కొంది.
ఆయన తాజా వెంచర్ 500 మిలియన్ డాలర్ల ఫండ్ను పలు స్టార్టప్ల్లో, అమెరికా హెల్త్ కేర్ టెక్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు ఫోర్బ్స్ తెలిపింది. గూగుల్ అల్ఫాబెట్ చైర్మన్ ఎరిక్ స్మిత్, ఉబర్ సీఈఓ ట్రావిస్ కలనిక్లు జాబితాలో టాప్ 20లో ఉన్నారు. సంపన్న టెక్ దిగ్గజాల జాబితాలో అత్యధికంగా దాదాపు సగం మంది అమెరికాకు చెందిన వారే కావడం విశేషం.తొలి పది మందిలో ఎనిమిది మంది అమెరికా వారే ఉన్నారు. తర్వాత స్థానాల్లో చైనాకు చెందిన వారు 19 మంది ఉన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Sunrisers Hyderabad bating1
5ఓవర్లకు సన్రైజర్స్ స్కోరు 49
ఢిల్లీ: ఢిల్లీ డేవర్ డెవిల్స్పై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ 5ఓవర్లలకు వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (26), శిఖర్ ధావన్ (23) ప్రత్యర్థులు వేసే బంతులకు ధీటుగా ఎందుర్కొని విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నారు.
| 2sports
|
internet vaartha 310 Views
కొచ్చిన్ : ప్రైవేటు రంగంలోని సౌత్ ఇండియన్ బ్యాంకు రెండో త్రైమాసికంలో రూ.110.52 కోట్ల నికరలాభం ఆర్జించినట్లు ప్రక టించింది. ప్రైవేటురంగంలోని ఈ బ్యాంకరు అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 93.38 కోట్లు నికరలాభం ఆర్జించింది. మొత్తం ఆదాయ వనరులపరంగాచూస్తే బ్యాంకు 1596.08 కోట్లు ఆర్జించింది. అంతకుముందు ఏడాది 1526.19 కోట్లనుంచి కొంతమేర వృద్ధిని సాధించినట్లు స్టాక్ ఎక్ఛేంజిలకు నివేదిక ఇచ్చింది. బ్యాంకు నిరర్ధక ఆస్తుల పరంగా చూస్తే 3.96 శాతంగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో 2.24 శాతంనుంచి గణనీయంగా పెరిగాయి. నికర నిరర్ధక ఆస్తులు కూడా 2.77శాతంగా ఉన్నాయి. గత ఏడాది 1.39శాతం నుంచి కొంత పెరిగాయి. ఇతరత్రా రానిబాకీల కేటాయింపులు, తక్షణ ఖర్చుల కేటాయింపులు కూడా బ్యాంకు గత ఏడాది కేటాయింపులు రూ.67.47 కోట్ల నుంచి రూ. 128.33 కోట్లకు పెంచింది. సౌత్ ఇండియన్ బ్యాంకుషేర్లు బిఎస్ఇలో 2.42శాతం దిగువన రూ.24.15 వంతున ట్రేడింగ్ జరుగుతున్నాయి.
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రోహిత్ సూపర్ బ్యాటింగ్.. పటిష్ట స్థితిలో భారత్
43 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన భారత్ను కోహ్లి, రోహిత్ ఆదుకున్నారు. అనంతరం సాహా కూడా రాణించడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది.
TNN | Updated:
Oct 2, 2016, 05:33PM IST
కోల్‌కతా టెస్టులో భారత పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో కలుపుకొని భారత్ ప్రస్తుతానికి 339 రన్స్ ఆధిక్యంలో ఉంది. వృద్ధిమాన్ సాహా 39 పరుగులతో, భువనేశ్వర్ కుమార్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు భారత బౌలర్లు 204 పరుగులకే కివీస్‌ను ఆలౌట్ చేశారు. దీంతో 112 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే కివీస్ బౌలర్లు షాకిచ్చారు. ముఖ్యంగా హెన్రీ ధాటికి భారత్ 43 పరుగులకే నాలుగు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లి, రోహిత్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ 45 పరుగులు చేసిన విరాట్‌ను బౌల్ట్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో భారత జట్టు వంద పరుగులైనా చేయక ముందే సగం వికెట్లను కోల్పోయింది.
కోహ్లి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. దీంతో 150 పరుగుల మార్కు కూడా కష్టమేనేమో అనిపించింది. ఈ స్థితిలో స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అద్భుతంగా పోరాడాడు. 132 బంతుల్లో 82 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగాడు. కానీ సాంట్నర్ బౌలింగ్‌లో రోంచికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి భారత్ 209 పరుగులు చేసింది. రోహిత్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా వేగంగా పరుగులు చేసే ఉద్దేశంతో వచ్చీ రాగానే సిక్సర్ బాదాడు. కానీ అదే ఓవర్లో పెవిలియన్ చేరాడు. మరో ఎండ్‌లో వృద్ధిమాన్ సాహా కూడా రోహిత్‌కు చక్కటి సహాకారం అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించిన అతడు మలి ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ, సాంట్నర్‌లకు చెరో మూడు వికెట్లు దక్కగా, బౌల్ట్‌ రెండు వికెట్లు తీశాడు.
| 2sports
|
internet vaartha 169 Views
ఫతేమైదాన్ : తెలంగాణ రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్షిప్లో ఫజల్ అహ్మద్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. గురువారం గచ్చిబౌలి షూటింగ్ స్టేడియంలో పురుషుల క్లె ఫిజియన్ ట్రాప్ ఈవెంట్లో ఫజల్ అహ్మద్ 75 పాయింట్లకు గాను 69 స్కోరు చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. వాసిఫ్ హాసన్ లతీఫ్ 75 పాయింట్లకు గాను 63 స్కోరు చేసి 2వ స్థానంలో నిలిచారు. అదే విధంగా ఎండీ విక్రమ్ 75 పాయింట్లకుగాను 57స్కోరు చేసి 3వ స్థానంలో నిలిచారు. షూట్గన్ ఈవెంట్లో ఎన్.రామ రాజు 75 పాయింట్లకు గాను 57 స్కోరు చేయగా డాక్టర్ రామసంజయ్ 75 పాయింట్లకు గాను 48 స్కోరు చేసి ప్రథమ రెండు స్థానాలను దక్కించుకున్నారు.
| 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
రుసగా మూడు రోజులు నష్టాల తర్వాత, గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 118 పాయింట్లు లాభపడి 28,123 వద్ద ముగిసింది. నిఫ్టీ 49 పాయింట్లు లాభపడి 8,673 వద్ద ముగిసింది...
TNN | Updated:
Aug 18, 2016, 04:07PM IST
వరుసగా మూడు రోజులు నష్టాల తర్వాత, గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 118 పాయింట్లు లాభపడి 28,123 వద్ద ముగిసింది. నిఫ్టీ 49 పాయింట్లు లాభపడి 8,673 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ రంగం షేర్లలో మంచి కొనుగోళ్లు కనిపించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 3.75 శాతం వృద్ధి సాధించాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఫెడరల్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. అలాగే ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, గ్రేసిమ్, ఎయిర్ టెల్, బీహెచ్ఈ ఎల్, ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి. కాగా, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ, టాటా, టెక్ మహీంద్రా, హిందాల్కో షేర్లు నష్టపోయాయి.యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 66.81 వద్ద స్థిరపడింది.
| 1entertainment
|
ప్రధానికి సుబ్రహ్మణ్యస్వామి లేఖ
Subrahmanya Swamy
న్యూఢిల్లీ: ఇండియా బుల్స్ గ్రూప్కంపెనీల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదా యపు పన్నుశాఖలు, తీవ్రస్థాయి ఆర్థికనేరాల దర్యాప్తు విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటుచేసి విచారణ జరిపిం చాలని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖరాసారు. తనకు లభిం చిన విశ్వసనీయ సమాచారం ప్రకారంచూస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అను బంధ కంపెనీల్లో లక్ష కోట్ల రూపాయల మేర అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు సమాచారం ఉన్నందున వెంటనే దర్యాప్తు చేయించాలన్నారు. అంతేకాకుండా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, బిఎస్ హూడాల ప్రమేయం కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నందున దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని కోరారు. కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే ఇబడియా బుల్స్ 2005 మధ్యస్తంలో వచ్చిందని, సమీర్గెహ్లోత్ నాయ కత్వంలో మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఆశీస్సులతో వచ్చిందని, అనేకమంది అవినీతి రాజ కీయ వేత్తల సొమ్ములు రియల్ఎస్టేట్లో కుమ్మరించేందుకు వేదిక అయిందని, ఇందుకోసం నేషనల్ హౌసింగ్ బ్యాంకును వినియోగించారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధిత సంస్థలు వందకుపైగా డొల్లరియాల్టీ సంస్థలను ఏర్పాటుచేసి నేషనల్ హౌసింగ్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నాయని, ఈ నిధులను అనేక రియాల్టీసంస్థలకు మళ్లించాయని, మహారాష్ట్ర, ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు, చెన్నైలలోని అనేక సంస్థలకు రూ.30 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకూ బదలాయించాయని ఆరోపించారు. ఈ రుణాలను కేటాయించిన తర్వాత స్నేహపూర్వక రియాల్టీ సంస్థలు, ఇండియా బుల్స్ నిధులను పెట్టుబడుల తరహాలో వాటికి పెట్టాయన్నారు. వీటిలో కొన్ని రుణాలు కేవలం రికార్డుల్లో సర్దుబాట్ల ఎంట్రీలేనన్నారు. కేవలం మనీలాండరింగ్, రౌండ్ ట్రిప్పింగ్ కోసమే ఈ విధానం అనుసరించారని, బ్లాక్ను వైట్ చేసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా మూల వనరుల నుంచి పన్ను మినహాయింపునుసైతం ఉల్లంఘిం చారని, ఆదాయపు పన్నుశాఖ 2016లో దాడు లు నిర్వహించిందని, ఆర్థిక మంత్రికి సమగ్ర నివేదికిచ్చిందని, అయితే అప్పటి నుంచి ముందుకువెళ్లలేదని పేర్కొన్నారు. ఇండియా బుల్స్ ఇలాంటి 100కుపైగా డొల్ల కంపెనీ లను ఏర్పాటుచేసిందని కేవలం నిధుల బదలా యింపు, మనీలాండరింగ్కు మాత్రమే వీటిని ఏర్పాటుచేసిం దని తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి వీటివెనుక మహా మహులను వెలికి తీయాలని సుబ్రహ్మణ్యస్వామి వెల్లడించా రు. ఈ కంపెనీలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఉన్న కొందరు అవినీతి అధికారుల కారణంగా ముంబయి, ఢిల్లీ కేంద్రంగా కంపెనీల రిజిస్ట్రారు కార్యాలయం సిబ్బంది ప్రమేయం కూడా ఉందని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల కుసైతం ఇవి దొరక్కుండా వారు దాచి పెట్టారన్నారు. ఆర్బిఐ అధికారులు కొందరికిసైతం ఈ ప్రమేయం ఉందని, అంతేకాకుండా ఇండియాబుల్స్ను రక్షిస్తూ వస్తున్నారన్నారు. అంతేకాకుండా ఎన్హెచ్బి నుంచి గడచిన 14 ఏళ్లుగా నిధులు తీసుకునేందుకు సహకరిస్తున్నారన్నారు. గతంలో 2జి స్కామ్లో కూడా డొల్ల కంపెనీలు రియాల్టీ సంస్థలు ప్రమేయం ఎక్కువ ఉందని, దావూద్ ఇబ్రహీంకు చెందిన వేలాదికోట్ల రూపా యలు భారతీయ రియాల్టీ రంగంలో చెలామణి అవుతున్నా యని ఆయన ఆరోపిం చారు. ఈ కంపెనీ ఇపుడు మునిగిపోయే దశలో ఉందని, తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపించాలని సుబ్రహ్మణ్య స్వామి ప్రధానమంత్రికి లేఖ రాసారు.
| 1entertainment
|
Recommended byColombia
గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే...
కాంతమ్మ.. భోజనం దగ్గర కూర్చున్నవాళ్లతో.. ‘మాతో సంబంధం కలకాలం ఉండాలనుకుంటే ఒక్క మెతుకు కూడా ఉండకుండా తినాలి’ అంటుంది. దాంతో అమ్ములు భరత్కి కావాలనే కంచెం నిండా అన్నం పెట్టి.. తినక తప్పని పరిస్థితి కలిపిస్తుంది. దాంతో భరత్ వదిలిపెట్టకుండా తిని చాలా ఇబ్బంది పడతాడు. తర్వాత ‘అంకిత్గాడ్ని చంపేయడం మాత్రం పక్కా’ అంటూ అమ్ములుతో చాటుగా మరోసారి ఛాలెంజ్ చేస్తాడు. అమ్ములు భరత్ లెక్కచేయకుండా వెళ్లిపోతుంది. ఇంట్లో అంతా దీపావళి పండుగ హడావుడిలో ఉంటారు. నందిని కూడా సీనయ్య ఫ్యామిలీతో బాగా కలిపిపోవడంతో పాటూ.. వసంత(అమ్ములు అక్క) చేసిన కట్నం గొడవతో.. లక్కీకి సగం ఆస్తి వాటా ఇస్తామని చెబుతుంది. దాంతో సరయూ, కళావతులు షాక్ అవుతారు.
355 ఎపిసోడ్లో హైలైట్స్..
దీపావళికి దీపాలు పెడతారు ఇళ్లంతా. అయితే ఒక దీపం ఆరిపోతుంటే.. ఇటు నుంచి అమ్ములు, అటు నుంచి అంకిత్ దాన్ని ఆరిపోకుండా ఆపుతారు. తర్వాత అంకిత్ అమ్ములు కళ్లలోకి చూస్తే.. ‘ఈ దీపం లానే మన ప్రేమని కూడా మనమే కాపాడుకోవాలి అమ్ములూ’ అంటాడు. అమ్ములు చిలిపిగా నవ్వుతూ మౌనంగా వెళ్లిపోతుంది. అయితే అదంతా చూసిన భరత్ కుళ్లుకుంటాడు. కోపంతో చూస్తూ ఉంటారు. ఇంతలో సీనయ్యా.. ‘దీపావళి పటాసులు మా అల్లుడే మొదలుపెట్టాలి..’ అంటూ భరత్ని పిలుస్తూ ఉంటారు. అయితే భరత్ కావలనే.. ‘అమ్ములు దగ్గరకు వెళ్లి.. సీనయ్య ఇచ్చిన పటాస్ను చూపిస్తూ ఇది బాంబ్.. దీన్ని నీ అంకిత్తో కాలిపిస్తాను’ అంటాడు.
Read Also: మీరు ‘మౌనరాగం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్లు ఇవిగో!
అమ్ములు టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఇంతలో అంకిత్ని పిలిచి కాల్చరా అంటూ భరత్ ఇచ్చేస్తాడు. దాంతో అంకిత్ దాన్ని కాలుస్తాడు. ఏం కాదు. అయితే అమ్ములు దగ్గరకు వెళ్లిన భరత్.. ‘బాగానే టెన్షన్ పడుతున్నావ్.. ఇలానే భయపడుతూ ఉండు’ అంటూ ఛాలెంజ్ మరోసారి గుర్తు చేస్తాడు. ఇంతలో సీనయ్య అమ్ముల్ని తీసుకుని వెళ్లి.. దగ్గరుండి మందులు కాల్పించి చాలా హ్యాపీగా ఉంటారు. అమ్ములు చాలా నవ్వుతూ ఆనందంగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే భరత్ మరోసారి అమ్ములు దగ్గరకు వచ్చి.. ‘చూడు.. అటు నీ అంకిత్ చేతిలో ఉన్న బాంబ్.. అది నిజంగానే పెద్ద బాంబ్.. ఈసారి వాడి చావు పక్కా’ అని చెప్పి.. ‘రేయ్ అంకిత్ దాన్ని త్వరగా కాల్చరా..’ అంటాడు. అమ్ములు టెన్షన్ పడుతున్న సమయంలో అంకిత్ దాన్ని వెలిగిస్తాడు.
వెంటనే అమ్ములు అంకిత్ని లాగడానికి ముందుకి వెళ్తుంటే.. ఎవరూ చూడకుండా భరత్తే అమ్ముల్ని పక్కు లాగేసి.. అంకిత్.. ఆ బాంబ్ దగ్గర నుంచి తోసేసి అంకిత్ని ఆ ప్రమాదం నుంచి తప్పిస్తాడు. ఆ ప్రయత్నంలో భరత్కి దెబ్బలు కూడా తగులుతాయి. అంతా చాలా కంగారు పడతారు. సీనయ్య అయితే కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. ‘ఎందుకు అలా చేశావ్? ఏం జరిగింది?’ అంటూ అంతా భరత్ని ఆరా తీయడంతో.. ‘అంకిత్కి ఆ బాంబ్ ప్రభావం తెలియక చాలా దగ్గరగా ఉన్నాడు. అందుకే వాడ్ని కాపాడాలని ఇలా చేశాను. అంకిత్కి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. వాడు నా ప్రాణ స్నేహితుడు’ అంటూ డైలాగ్స్ కొట్టేసరికి.. నందినితో సహా అంతా భరత్ మాటలు నమ్మేస్తారు. చివరికి అంకిత్ కూడా షాక్లో ఉండిపోతాడు. భరత్ని నమ్మినట్లుగానే ఉంటాడు.
నందిని అయితే భరత్ అంకిత్కి ఇచ్చే విలువకు కళ్లనీళ్లతో థ్యాంక్స్ కూడా చెబుతుంది. అమ్ములు మాత్రం చాలా మౌనంగా భరత్ చేసే మోసాన్ని చూస్తూనే ఉండిపోతుంది. నందిని వాళ్లు వెళ్లిపోయిన తర్వాత.. అమ్ములు దగ్గరకు వెళ్లిన భరత్.. ‘చూశావా? నేను చెడ్డవాడ్ని అని అందరికీ చెప్పాలనుకున్నావ్.. కానీ నేను అందరికీ గొప్పవాడిగా మారిపోయాను.. ఇప్పటికైనా నువ్వు ఓడిపోయానని ఒప్పుకో.. నేను అంతా ఆపేస్తాను’ అంటాడు. అమ్ములు చాలా కోపంగా చూస్తూ.. తల అడ్డంగా ఊపి వెళ్లిపోతుంది. సీనయ్య అయితే తన అల్లుడు భరత్.. అంకిత్కోసం చేసిన ప్రయత్నాన్ని తలుచుకుని తలుచుకుని ఎంత మంచి అల్లుడు దొరికాడో అని పొంగిపోతూ ఉంటాడు. అమ్ములు మాత్రం ఏ చెప్పలేని స్థితిలో అలానే ఉండిపోతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! మౌనరాగం కొనసాగుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Suresh 83 Views
పారాలింపిక్స్ పతకాల్లో స్టీల్ బాల్స్
రియో డి జెనీరో: పారాలింపిక్స్లో విజేతలు తాము గెలుచుకున్న పతకాలను వినడానికి వీలుగా సిద్దం చేశారు.కాగా అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ(ఐపిసి) ఇందుకోసం పతకాల్లో స్టీల్ బాల్స్ ను అమర్చారు. కాంస్య పతకంలో 16,రజతంలో 20,స్వర్ణ పతకంలో 28 స్టీల్ బాల్స్ను అమర్చినట్లు ఐపిసి కమిటీ పేర్కొంది.పతకం స్థాయి పెరిగే కొద్ది దాని నుంచి వచ్చే ధ్వని కూడా పెరుగుతుంది.దీంతోపాటు అన్ని పతకాలపై రియో 2016 పారాలింపిక్స్ గేమ్స్ అని బ్రెయిలీ లిపిలో రాసి ఉంటుంది. కాగా ఈ ఏర్పాట్ల కారణంగా దృష్టి లోపం ఉన్న అథ్లెట్లు తమ పతకాలను వూపి అవి చేసే ధ్వనిని విని పతకం గురించి తెలుసుకోవచ్చు.
| 2sports
|
Nov 24,2016
ప్రజల చెంతకే నగదు: ఎస్బీహెచ్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: వ్యవస్థలో పెద్దనోట్ల రద్దు ఏర్పడిన చిల్లర కష్టాలను తీర్చేందుకు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్' (ఎస్బీహెచ్) సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. నగదు అవసరం ఎక్కువగా ఉండే ఆసుపత్రులు, జనసామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు కాలనీల్లోనే ఇంటి వద్దే 'నగదు చెల్లింపు కేంద్రాలు' (పీవోఎస్) ద్వారా నేరుగా నగదు పంపిణీని చేపట్టింది. 'క్యాష్ ఎట్ పీఓఎస్'ల పేర ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ముందుగా హైదరాబాద్, సికింద్రాబాద్లో వీటిని ప్రారంభినున్నట్టు ఎస్బీహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ శాంతనూ ముఖర్జీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా బ్యాంకు అధికారులు వివిధ ప్రాంతల్లో పర్యటించి నగదు అవసరమైన వారికి వారి డెబిట్/క్రెడిట్ కార్డులను స్వైపింగ్ చేసి రూ.2000లను అందిస్తారని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఈ సేవలను రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరించన్నుట్టుగా తెలిపారు. ప్రస్తుత చిల్లర కష్టాలు తీరేంత వరకు ఆయా నగరాల్లో మొబైల్ క్యాష్ వ్యాన్లను ఏర్పాటు చేయనున్నట్టుగా ముఖర్జీ వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.